breaking news
Anantapur Latest News
-
కూటమి పాలనలో పీఆర్ వ్యవస్థ నిర్వీర్యం
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ అశాసీ్త్రయ నిర్ణయాలతో పంచాయతీ రాజ్ (పీఆర్) వ్యవస్థ నిర్వీర్యమైందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,150 కోట్లను కూటమి ప్రభుత్వం దారి మళ్లించడం సిగ్గు చేటన్నారు. వెంటనే ఈ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లోకి జమ చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు దక్కాల్సిన ఉపాధి నిధులను టీడీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. సర్పంచులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ వారి పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించకుండా చేసి ఆ డబ్బులనూ కూటమి ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. తక్షణం సర్పంచుల పిల్లలకు తల్లికి వందనం పథకం లబ్ధి చేకూర్చాలని కోరారు. బిల్లుల చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 సవరణల మేరకు సర్పంచులకు అధికారాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 1,320 మంది పంచాయతీ కార్యదర్శులకు తక్షణమే పోస్టింగ్ ఇచ్చి పెండింగ్లో ఉన్న 9 నెలల వేతనం విడుదల చేయాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలకు గౌరవ వేతనం తక్షణం చెల్లించాలన్నారు. డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వినోద్కుమార్కు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బసవ రాజు, బండి కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులు సీవీరంగారెడ్డి, సాదక్వలి, నియోజకవర్గ అధ్యక్షుడు మూలి లోకనాథరెడ్డి, విజయకుమార్, తిప్పేస్వామి, తిక్కస్వామి, భూతవి సుధాకర్, యోగష్రెడ్డి, చిన్నరంగారెడ్డి, జెడ్పీటీసీలు జె.చంద్రకుమార్, ఈశ్వరయ్య, వైస్ ఎంపీపీ ప్రసాద్గౌడ్, సర్పంచులు ఓబులేసు, చిన్నరంగారెడ్డి, ఎర్రిస్వామి, హనుమంతరెడ్డి, ఆంజనేయులు, నాయకులు కుమ్మెత చంద్రశేఖరరెడ్డి, రుద్రనంద యాదవ్, రవికుమార్, రమేష్, అంజియాదవ్, బండిపవన్, గోవిందరెడ్డి, ఎర్రిస్వామి, ఆదినారాయణ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా -
అనుమానాస్పద మృతి
కుందుర్పి: మండలంలోని ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె కుమార్(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం ఉదయం అదే గ్రామానికి చెందిన జోగప్పగారి హనుమంతు ఇంటి నిర్మాణ పనుల్లో కుమార్ పాల్గొన్నాడు. మధ్యాహ్నం ఉన్నఫళంగా కుప్పకూలాడు. గమనించిన హనుమంతు, తదితరులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక కుమార్ మృతి చెందాడు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుమార్ కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్ యాడికి: పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. యాడికిలోని అంకాలమ్మ వీధికి చెందిన వృద్ధుడు బోయ ఆదెప్ప మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదెప్పపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. 6 పోస్టులు...172 దరఖాస్తులు! అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఆరు సెక్టోరియల్ పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 172 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుకు సోమవారంతో గడువు ముగిసింది. ఏఎంఓ, అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ), అసిస్టెంట్ సీఎంఓ, ఏఎస్ఓ, అసిస్టెంట్ ఐఈడీ, అలెస్కో పోస్టుల భర్తీకి ఇటీవల నోటఫికేషన్ జారీ చేశారు. ఇందులో అత్యధికంగా అసిస్టెంట్ సీఎంఓ పోస్టుకు 48 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత అలెస్కో పోస్టుకు 45 మంది, ఏఎంఓకు 37 మంది, అసిస్టెంట్ ఏఎంఓ (కన్నడ)కు 14 మంది, అసిస్టెంట్ ఐఈడీకి 14 మంది, ఏఎస్ఓ పోస్టుకు 13 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి స్క్రూటినీ చేసి నిబంధనల మేరకు భర్తీ చేస్తామని ఏపీసీ టి.శైలజ స్పష్టం చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన జేసీ అనుచరులుసాక్షి టాస్క్ఫోర్స్: స్థానిక రూరల్ పరిధిలోని కడపరోడ్డు శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న 13 మందిని స్పెషల్పార్టీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి.. రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డికి అప్పగించారు. వీరంతా మునిసిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరులు కావడం గమనార్హం. వీరి నుంచి రూ.1,23,700 నగదు, 13 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో తాడిపత్రిలోని గన్నెవారిపల్లెకాలనీకి చెందిన జేసీ ప్రధాన అనుచరుడితో పాటు పలువురు టీడీపీ నాయకులు ఉన్నట్లు సమాచారం. అందరూ అధికార పార్టీ వారు కావడం, అది కూడా జేసీ అనుచరులు కావడంతో పట్టుబడిన వారి పేర్లను తెలిపేందుకు సీఐ నిరాకరించారు. కాగా.. టీడీపీ నేత ఇంట్లోనే కొద్దికాలంగా పోలీసుల కనుసన్నలోనే పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. అనంతపురం స్పెషల్పార్టీ పోలీసులు పెద్దఎత్తున నగదు స్వాధీనం చేసుకుని అప్పగించినా స్థానిక పోలీసులు మాత్రం కొద్దిపాటి మొత్తాన్నే చూపుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. -
● తీరని క‘న్నీటి’ వ్యథ
గుంతకలుల్లో నిరసన తెలుపుతున్న మహిళలు గుంతకల్లు: తాగునీటి కోసం స్థానిక బీటీ ఫక్కీరప్ప కాలనీ సోమవారం ఆందోళన చేపట్టారు. వారం రోజులుగా మున్సిపల్ కొళాయిలకు నీరు విడుదల కాకపోవడంతో కాలనీలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో సోమవారం సీపీఐ నాయకులతో కలిసి కాలనీ వాసులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కాలనీ లోనే జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వీరభద్రస్వామి, గోపీనాథ్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఫలితంగా కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో తాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మండిపడ్డారు. 6 రోజులుగా తాగునీరు అందకపోతే ప్రజల దాహార్తి తీరేదేలా అని ప్రశ్నించారు. కాలనీలో డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందన్నారు. అధికారులు ఇప్పటికై నా స్సందించి తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, మధు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
బదిలీల నరకయాతన
అనంతపురం: ఉమ్మడి జిల్లా సచివాలయ మహిళా పోలీసు సిబ్బంది బదిలీల ప్రక్రియ నరక యాతనను మిగిల్చింది. అనంతపురంలోని డీపీఓలో చేపట్టిన ఈ ప్రక్రియకు ఉదయం 8 గంటలకంతా హాజరు కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటలైనా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టలేదు. 12 గంటల తర్వాత తొలుత స్పౌజ్, పీహెచ్సీ, మెడికల్ సర్టిఫికెట్ ఉన్న వారికి కౌన్సెలింగ్ చేపట్టారు. మూడు గంటల వరకు జనరల్ కౌన్సెలింగ్ ప్రారంభించలేదు. తెల్లవారుజామున మూడు గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్న నేపథ్యంలో నిరీక్షణ తప్పలేదు. దీంతో చంటి పిల్లల తల్లులు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. అవివాహితులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులను లోపలకు అనుమతించకపోవడంతో వారు బయటే నిరీక్షించాల్సి వచ్చింది. మహిళల పట్ల పోలీసు శాఖ నిర్దయగా వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు ఆదోనిలో ఓ మహిళా కానిస్టేబుల్ చనిపోయిన విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు స్పందించి ఆగమేఘాలపై పిల్లల తల్లులకు పాలు, జ్యూస్ అందించారు. కౌన్సెలింగ్ కేంద్రంపైన సేద తీరేందుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కోటాలో అభ్యంతరాలు స్పౌజ్ కోటాలో బదిలీలకు సంబంధించి తమ భర్త ఎక్కడ ఉంటాడో ఆ పరిసరాల్లోనే స్థానాన్ని కోరుకోవాలి. అయితే తాడిపత్రి, హిందూపురం పరిసరాల్లో పనిచేస్తున్న కొందరు ఆ స్థానాలు కాకుండా ఇతర ప్రాంతాలను ఎంపిక చేసుకున్నారు. దీనిపై మిగిలిన వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారిని వెనక్కు పిలిపించి.. స్పౌజ్ పరిసర ప్రాంతాల్లో స్థానాన్ని కేటాయించారు. అర్ధరాత్రి ఆందోళన గణనీయమైన ర్యాంకు ఉన్న వారికి ముందస్తుగా అవకాశం కల్పించి.. వారు కోరుకున్న చోటుకు బదిలీ కల్పించాలి. అలాగే రేషనలైజేషన్లో పోస్టు కోల్పోయిన వారికి జనరల్ కేటగిరి కింద చివరన పిలవాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా కౌన్సెలింగ్ చేపట్టారు. దీంతో మహిళా కానిస్టేబుళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యపు సమాధానంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో అర్ధరాత్రి కౌన్సెలింగ్ను నిలిపివేశారు. అనంతరం అధికారులు నచ్చచెప్పి తిరిగి కౌన్సెలింగ్ను కొనసాగించారు. -
నేటి నుంచి తూమాటి దోణప్ప శత జయంతి ఉత్సవాలు
ఉరవకొండ: తెలుగు సాహితీ విజ్ఞాన గని, బహుభాషా పండితుడు ఆచార్య తూమాటి దోణప్ప శత జయంతి వేడుకలు నేటి నుంచి హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్నాయి. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన దోణప్ప 1926, జూలై 1న సంజప్ప, తిమ్మక్క దంపతులకు జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. హైదారాబాదులో ఆవిర్భవించిన తెలుగు విజ్ఞాన పీఠం డైరెక్టరుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సాహితీ సేవలకు గుర్తుగా తెలుగు సాహితీ జగత్తు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహకాలు చేసింది. -
అయ్యా.. సమస్యలు పరిష్కరించండి
అనంతపురం అర్బన్: ‘అయ్యా మా కష్టాలు వినండి... ఆదుకోండి’ అంటూ అధికారులకు ప్రజలు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్ లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ వి.వినోద్కుమార్తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, మల్లికార్జునుడు, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 640 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం సమస్యల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీల పరిష్కారంలో ఏస్థాయిలోనూ నిర్లక్ష్యానికి ఆస్కారం ఇవ్వకూడదని ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని చెప్పారు. వినతుల్లో కొన్ని... ● స్వాతంత్య్ర సమరయోధుడు, వడ్డెర్ల ఆరాధ్యుడు వడ్డె ఓబన్న విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని జిల్లా వడ్డెర్ల సంక్షేమ సంఘం కార్యదర్శి మంజుల నారాయణ విన్నవించాడు. నగర పరిధిలోని నడిమివంక ప్రాంతంలో గంగమ్మ గుడి పక్కన స్థలం కేటాయిస్తే విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని విజ్ఞప్తి చేశాడు. ● పీఎం విశ్వకర్మ పథకం కింద ఎంపికైనప్పటికీ రుణం మంజూరు కాలేదని బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన కొండన్న ఫిర్యాదు చేశాడు. శిక్షణ ఇచ్చారని, సర్టిఫికెట్తో పాటు రూ.4 వేలు వచ్చాయని చెప్పాడు. గుత్తి రోడ్డులోని యూనియన్ బ్యాంక్ అధికారులు రుణం మంజూరు చేయడం లేదని వాపోయాడు. ● వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీల బదిలీల్లో అక్రమాలు జరిగాయని అనంతపురం నవోదయ కాలనీకి చెందిన బి.శ్రీకాంత్ ఫిర్యాదు చేశాడు. స్పౌజ్ కేటగిరీకి చెందిన చాలా మంది తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారని, స్పెషల్ కేటగిరీ వారికి ప్రాధాన్యత కల్పించకుండా జనరల్గా పిలిచారని వివరించాడు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరాడు. అధికారులకు బాధితుల వినతి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 640 అర్జీలు ఈ వృద్ధురాలి పేరు బావమ్మ. శింగనమల మండలం ఉల్లికల్లు గ్రామం. పింఛను మంజూరు చేయాలంటూ కలెక్టర్ను కలిసి విన్నవించింది. భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడని చెప్పింది. జీవనం కష్టంగా మారిందని పింఛను మంజూరు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని వాపోయింది. -
తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ
అనంతపురం సెంట్రల్: తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. పోలీసులే దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తుంటే ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని దుయ్యబట్టారు. సోమవారం ఆయన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, విశ్వేశ్వర రెడ్డితో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జగదీష్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో ఎంత నష్టం జరిగిందో ప్రజలకు తెలియజేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలోని గ్రామ, వార్డుల్లో త్వరలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగానే ఆదివారం తాడిపత్రి నియోజకవర్గంలో కార్యకర్తలను సమాయత్తం చేయడానికి పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్తే బలవంతంగా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. జిల్లాలో ఎక్కడా లా అండ్ ఆర్డర్ సమస్య లేదని.. తాడిపత్రిలో మాత్రమే ఉందనడం సబబు కాదన్నారు. పెద్దారెడ్డి నియోజకవర్గంలో తిరిగేందుకు స్వయంగా ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చినా పోలీసులు అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. మాజీ ఎమ్మెల్యేను శాసించే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తాడిపత్రిలో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ నిర్వహించి తీరుతామని ‘అనంత’ స్పష్టం చేశారు. దరిద్రమైన రాజకీయాలు ఆపెయ్.. పేకాట, గంజాయి బ్యాచ్లను వెంటపెట్టుకొని తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరితే పరిశీలిస్తానని ఎస్పీ అనడం ఏంటని, ఎవరితో మాట్లాడి ఆయన నిర్ణయం తీసుకుంటారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్రెడ్డితో చర్చించేకి వీరికేమైనా బాసా అని నిలదీశారు. పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లిన వారి ఫొటోలు, వీడియోలు ఉన్నాయని, వారికి రపా..రపా ఉంటుందని జేసీ ప్రభాకర్రెడ్డి పబ్లిక్గా హెచ్చరిస్తుంటే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. సొంతింటికి తనను ఎందుకు పోనివ్వరో సమాధానం చెప్పాలన్నారు. ‘గతంలో మీరు చేశారు’ అనే మాటలకు కట్టుబడి ఉన్నానని, దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. భార్యను అసభ్యంగా మాట్లాడానని జేసీ అంటున్నారని, తాను అన్నట్లు ఆ అక్క నోటితో పలికించాలని.. నిరూపిస్తే తాడిపత్రికి వెళ్లనని స్పష్టం చేశారు. అడ్డుకునే హక్కు ఎవరిచ్చారు..? ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి తన నియోజకవర్గానికి వెళ్లకూడదని దేశంలో ఎక్కడైనా ఉందో చెప్పాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి నిలదీశారు. ఎస్పీని అనేకమార్లు కలిసినా, కోర్టు ఉత్తర్వులున్నా అనుమతివ్వకపోవడం సరి కాదన్నారు. ఎవరి వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే వారిని అరెస్ట్ చేయాలన్నారు. కుట్రలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని, ప్రజల వద్దే ఎండగడతామని హెచ్చరించారు. ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారనే విషయాన్ని పోలీసులు తెలుసుకోవాలని హితవు పలికారు. ఇది కొత్త తరహా పోలీసింగ్.. జిల్లాలో పోలీసు వ్యవస్థ నక్సలైట్లు, ఫ్యాక్షనిస్టులు, రౌడీషీటర్లను ఏరిపారేసిందని, కానీ నేడు జేసీ ప్రభాకర్రెడ్డి వద్దకు వెళ్లలేక కొత్త తరహా పోలీసింగ్ను చూపిస్తున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్కు కూడా దేశ చట్టాలు విస్తరించాయని, కానీ తాడిపత్రిలో మాత్రం జేసీ ప్రభాకర్రెడ్డితో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని విమర్శించారు. మీ నాయన చర్యలను సమర్థిస్తున్నావా? ‘యువకుడు, చదువుకున్న వ్యక్తి అని చెబుతూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన అస్మిత్రెడ్డీ.. మీ నాయన చర్యలను నువ్వైనా సమర్థిస్తున్నావా’ అని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా పోలీసులు వెన్నెముక లేన్నట్లుగా పనిచేస్తున్నారన్నారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం అయితే ఆ ప్రతులను ప్రజలకు పంచాలని సూచించారు. పట్టణంలో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ నిర్వహించి తీరుతాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
నేడు వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
● హాజరుకానున్న పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్రెడ్డి కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో మంగళవారం వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య తెలిపారు. ముదిగల్లు రోడ్డులోని శ్రీనివాస కల్యాణమండపంలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను నాయకులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, పార్లమెంట్ అబ్జర్వర్ నరేష్కుమార్ రెడ్డి హాజరవుతారన్నారు.మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ విభాగం కన్వీనర్ ఐ.సుధీర్, వివిధ మండలాల కన్వీనర్లు గోళ్ల సూర్యనారాయణ, పి.చంద్రశేఖర్రెడ్డి, బ్రహ్మసముద్రం ఎంపీపీ చంద్రశేఖర్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, కౌన్సిలర్లు లక్ష్మన్న, పరమేశ్వరప్ప, వివిధ విభాగాల అధ్యక్షులు దొడగట్ట మురళి, కురుబ పాతలింగ, రామిరెడ్డి, కిరీటి యాదవ్, మల్లికార్జునతో పాటు పలువురు పాల్గొన్నారు. -
అధికార అండ.. పంచాయతీలపై బండ!
● కంబదూరు మండలంలో విండ్పవర్ సంస్థల ఇష్టారాజ్యం ● కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సంస్థ ఆధ్వర్యంలో పనులు ● గ్రామసభలు నిర్వహించకుండా, తీర్మానాలు లేకుండా ముందుకు ● సామాజిక బాధ్యతనూ విస్మరించడంపై సర్వత్రా విమర్శలుకళ్యాణదుర్గం: అధికారం మాదే.. మేమేం చేసినా అడిగేవారెవరనే రీతిలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్సీ సంస్థ వ్యవహరిస్తోంది. పంచాయతీల అభివృద్ధికి ఆటంకం సృష్టిస్తోంది. వివరాలు.. కంబదూరు మండలంలో 12కు పైగా సంస్థలు గాలిమరలను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ముందుగా ఆయా గ్రామ పంచాయతీల్లో నెడ్క్యాప్, రెవెన్యూ, స్థానిక పంచాయతీ అధికారులతో కలిసి గ్రామాల్లో సభలు నిర్వహించాల్సి ఉంది. అయితే, కంబదూరు మండలంలో అనుమతులు పొందిన పంచాయతీల్లో ఇప్పటికీ ఒక్క గ్రామ సభ కూడా చేపట్టలేదు. పనులు ప్రారంభిస్తున్నట్లు కనీస సమాచారం కూడా సర్పంచులకు ఇవ్వలేదు. సామాజిక బాధ్యత మరచి.. కంబదూరు మండలంలో విండ్ పవర్ ఏర్పాటు పనులన్నీ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ‘ఎస్ఆర్సీ’ అండ చూసుకుని ఆయా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ కార్యక్రమం కింద సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆయా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. తాగునీటి కల్పన, పాఠశాలల అభివృద్ధి, పారిశుధ్యం, హెల్త్క్యాంప్ల నిర్వహణ తదితర సామాజిక కార్యక్రమాల విషయమే మరచిపోయారు. దీనికితోడు ఆయా గ్రామాల్లో మట్టిరోడ్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, ఇతర మిషన్లను హడావుడిగా సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో భారీ వాహనాలను నడుపుతూ రోడ్లను ఛిద్రం చేస్తున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన కంపెనీ పనులు చేస్తుండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంచాయతీ తీర్మానమే లేదు మా పంచాయతీలో అనుమతులు లేకుండానే ఎస్ఆర్సీ సంస్థ పనులు చేపడుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు తీర్మానం తప్పనిసరి. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని సర్పంచులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సామాజిక బాధ్యతగా పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. స్థానిక నేతల జేబుల్లోకి నిధులు వెళ్తున్నాయి. దీనిపై నెడ్క్యాప్, రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టాలి. – మంగమ్మ, సర్పంచు, రాళ్ల అనంతపురం -
మద్యం మత్తునే హత్యకు కారణం!
గతంలో వారి మధ్య ఎలాంటి పరిచయం లేదు. అయినా మద్యం వారి మధ్య మాటలు కలిపింది. అదే రోజే మద్యం మత్తు విచక్షణను కోల్పోయేలా చేసి ఒకరి హత్యకు కారణమైంది. నగరంలోని బళ్లారి బైపాస్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ సమీపంలో ఈ నెల 23న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. అనంతపురం: చిన్నపాటి వాదన కారణంగా ఘర్షణ పడి ఓ యువకుడిని హతమార్చిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం అర్బన్ డీఎస్పీ వి.శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం నాల్గో పట్టణ పీఎస్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఏం జరిగిందంటే.. ఈ నెల 24న ఉదయం అనంతపురంలోని బళ్లారి బైపాస్ సర్కిల్లో జాతీయ రహదారి బ్రిడ్జి కింద ఓ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పార్క్లో పడుకుని ఉన్న వ్యక్తి తలపై గుర్తు తెలియని వ్యక్తులు ఫుట్పాత్ బ్రిక్తో కొట్టి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. హతుడి వద్ద లభ్యమైన ఆధారాలను బట్టి గార్లదిన్నె మండలం, కోటంక గ్రామానికి చెందిన గూడూరు సిదానందగా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో బంధువులు వచ్చి నిర్ధారించారు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ ఎన్.జగదీష్ కేసు నమోదు చేసి, పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. నేర పరిశోధనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. తొలుత సిదానందను ఆయన భార్య తరఫు వారు హత్య చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం కాగా, ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టి అనుమానాల్లో వాస్తవం లేదని నిర్ధారించారు. నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో నేర పరిశోధనను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మద్యం షాపులో ఉన్న సీసీ పుటేజీల ఆధారంగా ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారి కోసం గాలింపు చేపట్టారు. హత్య జరిగిన అనంతరం ఇద్దరూ రైల్వే స్టేషన్కు చేరుకుని రైలు మార్గంలో తిరుపతికి చేరుకున్నట్లుగా పసిగట్టారు. అనంతరం పక్కా ఆధారాలతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో సిదానందను హత్య చేసినట్లుగా అంగీకరించారు. భార్యను దూషించాడనే... అనంతపురంలోని ఐదో రోడ్డు భవానీ గుడి వద్ద నివాసముంటున్న ఎరికల నాగయ్య కుమారుడు ఎరికల లక్ష్మన్న అలియాస్ అలీ/ చిన్న లింగన్న/ అంజి, కళ్యాణదుర్గం రోడ్డులోని విద్యారణ్య నగర్లో నాగులుకట్ట వద్ద నివాసముంటున్న తుమ్మశెట్టి వెంకటరెడ్డి ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ బొప్పాయి, దోసకాయ లోడింగ్ పనులు చేస్తూ, తాగుడుకు అలవాటు పడ్డారు. ఈ నెల 23న రాత్రి బళ్లారి బైపాస్ సర్కిల్ సమీపంలో మద్యం షాపు వద్ద తాగుతూ అప్పటికే అక్కడున్న సిదానందతో గొడవపడ్డారు. ఈ క్రమంలో ఎరికల లక్ష్మన్నను సిదానంద బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. లక్ష్మన్న భార్యనుద్ధేశించి అసభ్యకరంగా మాట్లాడాడు. దీంతో ఆవేశానికి లోనైన లక్ష్మన్న తన స్నేహితుడు వెంకటరెడ్డితో కలసి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్న పార్కులో సేద తీరుతున్న సిదానంద వద్దకు చేరుకుని నుదుటిపై ఫుట్బాత్ బ్రిక్తో దాడి చేశారు. సిదానంద అక్కడికక్కడే చనిపోవడంతో ఇద్దరూ రైల్వే స్టేషన్కు చేరుకుని రైలులో తిరుపతికి వెళ్లారు. నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ ఎన్.జగదీష్, ఎస్ఐలు కె.ప్రసాద్, పి.విజయభాస్కర్ నాయుడు, టెక్నికల్ టీంను ఎస్పీ పి.జగదీష్ అభినందించారు. సిదానంద హత్య కేసులో వీడిన మిస్టరీ చిన్నపాటి గొడవ కారణంగా హత్య నిందితుల అరెస్ట్ -
సిఫారసుకే పెద్దపీట
అనంతపురం సిటీ: ‘మనకు కావాల్సిన పిల్లలు వస్తున్నారు. జర చూసుకోండి. లెటర్ కూడా ఇచ్చి పంపుతున్నాం. వారు కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇవ్వండి. లేదంటే రోడ్డు పాయింట్కు వేయండి. ఏ ఒక్కటీ మిస్ కావడానికి వీల్లేదు. అడిగినవన్నీ చేయాల్సిందే’ అంటూ సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ సందర్భంగా వివిధ శాఖల అధికారులకు కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా ఫోన్ల మీద ఫోన్లు చేశారు. సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ రెండో రోజు ఆదివారం అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. ఓ వైపు కౌన్సెలింగ్ ప్రక్రియలో బిజీబిజీగా ఉన్నా.. మరోవైపు ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఫోన్ కాల్ను అధికారులు లిఫ్ట్ చేసి మాట్లాడుతూ హల్చల్ చేశారు. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారు ముందుగా రావాలని, లెటర్లు లేని వారిని పక్కన ఉండాల్సిందిగా సూచించారు. లెటర్లు స్వీకరించి వారు ఎక్కడికి పోస్టింగ్ కోరుకుంటున్నారో మరీ తెలుసుకుని కేటాయించారు. తొలి రోజు అనుభవంతో.. మలి రోజు ప్రశాంతం సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. తొలి రోజు (శనివారం) నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారి.. ఆందోళనలతో ముగిసింది. ఈ అనుభవంతో మలి రోజు (ఆదివారం) అధికారులు తీసుకున్న కొన్ని చర్యలు సాఫీగా సాగేలా దోహదపడ్డాయి. అభ్యర్థులందరినీ బయటే ఉంచి.. కొందరిని మాత్రమే అనుమతిస్తూ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టడంతో తొక్కిసలాటకు తావు లేకుండా పోయింది. అయితే అర్ధరాత్రి వరకూ కౌన్సెలింగ్ కొనసాగినా ఇంకా అభ్యర్థులు మిగిలే ఉన్నారు. లెటర్లు ఉన్న వారికే ప్రాధాన్యత.. ఎమ్మెల్యేల లెటర్లు ఉన్న వారికే అధికారులు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల లెటర్లు తెచ్చారా.. అయితే రండి. మీకు కావాల్సిన స్థానం కోరుకోండి అంటూ అడిగి మరీ వారికి సహకరించారు. మరి కొందరి విషయంలో ఎమ్మెల్యేలు నేరుగా ఫోన్లు చేసి పేర్లు సిఫారసు చేయడం గమనార్హం. జెడ్పీ క్యాంపస్లోని డీపీఆర్సీ భవన్లో డిజిటల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్ కొనసాగుతుండగా డీపీఓ నాగరాజునాయుడుకు తరచూ ఫోన్ కాల్స్ వచ్చాయి. అయినా ఆయన ఓపిగ్గా మాట్లాడుతూ కనిపించారు. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి ఓ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ర్యాంక్లో తొలి స్థానంలో ఉన్నా.. అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణ నుంచి ఓ అమ్మాయి లెటర్ తెచ్చుకున్నారు. ఒకే స్థానం కోసం ఇద్దరూ పోటీపడ్డారు. అయితే అప్పటికే ఆ స్థానం తొలి ర్యాంకర్ అబ్బాయికి కేటాయించగా.. అమ్మాయికి సర్దిచెప్పి మరో చోట అవకాశం కల్పించారు. అయితే ఏమాత్రం పలుకుబడి లేని వారు, ఎమ్మెల్యేల లెటర్లు తెచ్చుకోలేకపోయిన వారు మదనపడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా పశుసంవర్థక శాఖలో.. పశుసంవర్ధక శాఖలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్కడి అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారని సచివాలయ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. కౌన్సెలింగ్కు ముందే అభ్యర్థులు మూడు స్థానాలను ఆప్షన్లగా చూపిస్తూ దరఖాస్తు చేసి ఉన్నారు. ఇందులో ఏదో ఒక స్థానాన్ని కౌన్సెలింగ్కు పిలిచినప్పుడు కేటాయించాల్సి ఉంటుంది. అయితే పశుసంవర్ధక శాఖలో మాత్రం మీరు ఏవైనా మూడు మండలాలు కోరుకొని ఆప్షన్లు ఇచ్చి వెళ్లండి. అందులో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇస్తామంటూ’ ఉద్యోగులను వెనక్కి పంపడంపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకూ కొనసాగిన కౌన్సెలింగ్.. ఉమ్మడి జిల్లా యూనిట్గా సచివాలయ ఉద్యోగులకు అనంతపురంలోని పలు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో మిగిలి ఉండడంతో అర్ధరాత్రైనా సరే పూర్తి చేయాలన్న పట్టుదలతో అధికారులు పని చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగింది. చాలా చోట్ల కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఉద్యోగులు అసౌకర్యానికి గురయ్యారు. సచివాలయ ఉద్యోగుల కౌన్సెలింగ్లో అధికారుల తీరు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలకు ప్రాధాన్యం ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా అధికారులకు ఫోన్ చేయించినా సరే మంచి ర్యాంకు ఉన్నా సరే దూరంగానే పోస్టింగ్ పలుకుబడి లేని ఉద్యోగుల పరిస్థితి దయనీయం అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల అసహనం -
‘అధికార’ అండ.. మట్టి దందా
● దొడగట్ట చెరువులో భారీగా మట్టి దోపిడీ ● కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు డి.హీరేహాళ్(రాయదుర్గం): డి.హీరేహాళ్ మండలం దొడగట్ట చెరువులో కొద్ది రోజులుగా భారీఎత్తున మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. టీడీపీ నాయకుల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తొలుత ట్రాక్టర్ల ద్వారా మట్టి రవాణా మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా జేసీబీలతో టిప్పర్లలోకి లోడ్చేసి పగలు, రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని సండూరు, రాంపురం, బళ్లారి తదితర ప్రాంతాల్లో ఇటుకల బట్టీలకు ఒక్కో ట్రిప్పు మట్టి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ దందా వెనుక గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడి హస్తం ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా.. మట్టి అక్రమ తవ్వకాలు చేపట్టిన దొడగట్ట చెరువును ఆదివారం రైతులతో కలసి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సందర్శించారు. అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దులో మార్తల్ వద్ద నిల్వచేసిన సుమారు వంద ట్రిప్పుల మట్టిని పరిశీలించారు. అక్కడి నుంచే కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, మైనర్ ఇరిగేషన్ డీఈకి ఫోన్ చేసి.. మట్టి అక్రమ రవాణాను సత్వరం అడ్డుకోవాలని కోరారు. అలాగే మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అండ చూసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారన్నారు. ఇసుక, మట్టితో పాటు ప్రకృతి సంపద కొల్లగొట్టడమేనా సమర్థ నాయకత్వం అంటే అని ప్రశ్నించారు. మెట్టు వెంట స్థానిక సర్పంచ్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రవీంద్రనాథ్రెడ్డి, నాయకులు ఎర్రగుంట కేశవరెడ్డి, మురడి మురళీమోహన్రెడ్డి తదితరులు ఉన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలి ● ఎస్యూసీఐ (సీ) కేంద్ర కమిటీ సభ్యుడు అమర్నాథ్ అనంతపురం టవర్క్లాక్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కూటమి ప్రభుత్వాన్ని ఎస్యూసీఐ(సీ) కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి అమర్నాథ్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన ఎస్యూసీఐ (సీ) జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను సీఎం చంద్రబాబు మభ్య పెట్టారని మండిపడ్డారు. అశాస్త్రీయ విధానాలతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ భూములను కారు చౌకగా పెట్టుబడి దారులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో గ్రాఫిక్ డిజైన్లను ప్రదర్శిస్తున్నారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. శ్రమ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్యూసీఐ జిల్లా కార్యదర్శి రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలి
● ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి డిమాండ్ అనంతపురం టవర్క్లాక్: ఆర్టీసీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ కూటమి ప్రభుత్వాన్ని ఏపీపీటీడీ ఈయూ (ఎంప్లాయీస్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన టేబుల్పై ఉన్న ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ జూలై 4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నడిపించాలని, ఉద్యోగ విరమణ పొందిన వారికి గ్రాట్యూటీ, టర్మినల్ ఎన్క్యాష్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు వెంటనే చెల్లించాలన,ఇ డబల్ డ్యూటీలకు సంబంధించి ఉద్యోగులకు ఇస్తున్న రెమ్యూనరేషన్ను మరింత పెంచాలని కోరారు. టిమ్స్ డ్యామెజీలపై చేస్తున్న రికవరీలను నిలుపుదల చేయాలన్నారు. కాలం చెల్లిన బస్సుల బ్రేక్ డౌన్ విషయంలో గ్యారేజీ సిబ్బందిని బాధ్యులను చేస్తూ పనిష్మెంట్ ఇస్తున్నారని, ఈ విధానాలకు స్వస్తి పలకాలని కోరారు. కార్యక్రమంలో ఈయూ నాయకులు ఖాన్, రామకృష్ణ, కొండయ్య, మల్లికార్జున, విశ్వనాథరెడ్డి, గోపాల్, ఓబులరత్నం తదితరులు పాల్గొన్నారు. బదిలీల తీరుపై ఆర్ఎస్కే అసిస్టెంట్ల అసంతృప్తి అనంతపురం సెంట్రల్: ఉమ్మడి జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ ఆదివారం ఉద్యాన, పశు సంవర్థకశాఖ కార్యాలయాల్లో కొనసాగింది. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్ కింద ధరఖాస్తు చేసుకున్న వారికి కౌన్సెలింగ్ చేపట్టారు. అయితే కొందరు తాము కోరుకున్న స్థానం కాకుండా మరో స్థానం కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యానశాఖ పరిధిలో చేపట్టిన బదిలీల ప్రక్రియకు 280 మంది విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు హాజరు కాగా, వారి ఎస్ఆర్లు ఇతర ధ్రువీకరణ పత్రాలను ఉద్యానశాఖ ఉమ్మడి జిల్లాల డీడీలు ఉమాదేవి, చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్రెడ్డి, ఏడీహెచ్ దేవాందన్, సూపరింటెండెంట్ బాషా తదితరులు పరిశీలించి, పోస్టింగ్ కల్పించారు. అలాగే పశు సంవర్థకశాఖ కార్యాలయంలో రెండు జిల్లాల జేడీలు వెంకటస్వామి, శుభదాస్, డీడీలు, సూపరింటెండెంట్ల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్కు 180 మంది విలేజ్ అనిమిల్ హస్బెండరీ అసిస్టెంట్లు హాజరయ్యారు. ట్యాంకర్ దగ్ధం గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లి శివారున కర్నూలు జిల్లా జి.ఎర్రగుడి గ్రామం వద్ద ఆదివారం టైరు పేలి మంటలు చెలరేగడంతో ఓ ట్యాంకర్ దగ్ధమైంది. గుత్తి నుంచి ఆదోని వైపు బెల్లం పాకంతో వెళ్తున్న ట్యాంకర్ గుత్తి–పెండేకల్లు రైలు మార్గంలోని రైల్వే బ్రిడ్జి కిందకు చేరుకోగానే టైరు పేలింది. దీంతో మంటలు చెలరేగి ట్యాంకర్కు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్, క్లీనర్ బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పే లోపు ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలాన్ని రైల్వే అధికారులతో పాటు జొన్నగిరి పోలీసులు పరిశీలించారు. వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటిపై రాళ్ల దాడి నార్పల: మండలంలోని వెంకటాంపల్లిలో నివాసముంటున్న వైఎస్సార్సీపీ కార్యకర్త మహబూబ్పీరా ఇంటిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఏడుగురు ఆదివారం రాళ్లతో విరుచుకుపడ్డారు. బాధితుడు తెలిపిన మేరకు... తన ఇంటి పక్కనే ఉన్న కొద్దిపాటి స్థలాన్ని గతంలో మసీదుకు మహబూబ్ పీరా విరాళం కింద ఇచ్చాడు. ఆ స్థలంలో గ్రామంలోని ముస్లిములంతా కలసి మసీదుతో పాటు ప్రహరీనీ నిర్మించారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు జోక్యం చేసుకుని మసీదుకు ప్రహరీ నిర్మాణాన్ని ఆక్షేపిస్తూ మహబూబ్పీరాను నిలదీశారు. సర్దిచెప్పే ప్రయత్నం చేసిన మహబూబ్పీరాపై దాడికి ప్రయత్నించడంతో ఆయన ఇంట్లోకి వెళ్లిపోయి తలుపులు వేసుకున్నాడు. దీంతో ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఘటనలో మహబూబ్పీరా కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలు నడిమిదొడ్డి రహీం, అప్పడు, హుసేన్పీరా, కాదర్వలి, హాజీ వలి, వలి, హాజీవలిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. వ్యక్తి దుర్మరణం డి.హీరేహాళ్(రాయదుర్గం): వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. డి.హీరేహాళ్ గ్రామానికి చెందిన షబ్బీర్ (45) కుమార్తె బళ్లారిలో చదువుకుంటోంది. ఈ క్రమంలో ఆదివారం బళ్లారికి వెళ్లి కుమార్తెను పలకరించి, ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన షబ్బీర్.. గ్రామ సమీపంలోకి చేరుకోగానే హెల్మెట్ జారి కిందపడడంతో బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనుకనే వేగంగా దూసుకొచ్చిన టెంపో ట్రావెలర్ వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి కేసు నమోదు చేశారు. -
సజావుగా వీఆర్ఓల బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆదివారం చేపట్టిన చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల గ్రేడ్–2 వీఆర్ఓల బదిలీల కౌన్సిలింగ్ సజావుగా జరిగింది. మొత్తం 328 మంది హాజరు కాగా, ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారు 121 మంది ఉన్నారు. మరో 53 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ బదిలీ కౌన్సెలింగ్ను డీఆర్ఓ ఎ.మలోల, అనంతపురం. శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టరేట్ పరిపాలనాధికారులు అలెగ్జాండర్, వెంకటనారాయణ నిర్వహించారు. ఎస్ఆర్లు, ఇతర పత్రాలను డిప్యూటీ తహసీల్దార్లు మూర్తి, లీలాకాంత్ పరిశీలించారు. ఇదిలా ఉండగా ఉదయం 11గంటలకు మొదలు కావాల్సిన బదిలీల కౌన్సెలింగ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలు కావడంతో చంటిపిల్లలతో వచ్చిన మహిళా వీఆర్ఓలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలి : ఎస్టీయూ అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి ఎస్.రామాంజనేయులు పేర్కొన్నారు. పీఆర్సీతో పాటు డీఏ కూడా ప్రకటించాలన్నారు. బదిలీ అయిన టీచర్లకు పొజిషన్ ఐడీలు కేటాయించి జీతాలకు ఆలస్యం కాకుండా చూడాలన్నారు. సోమవారం ఉద్యోగ విరమణ పొందుతున్న టీచర్ల స్థానాల్లో సర్దుబాటు కింద ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి వి.రాజశేఖర్, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ జి.కిషోర్, జిల్లా కార్యదర్శి మల్లికార్జున, రామకృష్ణ, నరసింహ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరణ?
పామిడి/పుట్టపర్తి: అదనపు కట్నం కోసం తమ కుమార్తెను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడంటూ బాధిత కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులు తెలిపిన మేరకు... పామిడిలోని ఎద్దులపల్లి రోడ్డులో నివాసముంటున్న కమ్మరి రామాచారి, పుష్పవతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కార్పెంటర్ వృత్తితో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో 9 నెలల క్రితం రామాచారి తన పెద్ద కుమార్తె శ్రావణి(25)ని శ్రీసత్యసాయి జిల్లా బుక్క పట్నం మండలం కృష్ణాపురానికి చెందిన గోవిందాచారి, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమారుడు నీలకంఠాచారికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో కట్న కానుకల కింద రూ.లక్షలు విలువ చేసే బంగారు, నగదు ఇచ్చారు. పెళ్లి అనంతరం నీలకంఠ కృష్ణాపురంలోనే వేరు కాపురం పెట్టాడు. వ్యవసాయంతో పాటు వేరుశనగ పప్పు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల వ్యాపారానికి సంబంధించి యంత్రాల కొనుగోలుకు డబ్బు అవసరం కావడంతో శ్రావణి తల్లిదండ్రులు నీలకంఠకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం శ్రావణిని నీలకంఠ వేధించడం మొదలు బెట్టాడు. తరచూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీనికి తోడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యసనాలు మానుకోవాలని భార్య పదేపదే చెప్పినా వినేవాడు కాదు. ఈ క్రమంలో తనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న భార్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నీలకంఠాచారి పథకం ప్రకారం శనివారం రాత్రి నిద్రపోతున్న భార్య గొంతునులిమి హతమార్చి, అనంతరం ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనంతరం పామిడిలోని అత్తామామకు ఫోన్చేసి విషయం తెలిపాడు. అక్కడకు చేరుకున్న రామాచారి దంపతులు... తమ కుమార్తెది ఆత్మహత్య కాదని, హత్యగా నిర్ధారించుకుని నిలదీసేలోపు నీలకంఠాచారి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, పుట్టపర్తి డీఎస్పీ విజయ్కుమార్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అందే నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపడతామని డీఎస్పీ విజయ్కుమార్ పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా కృష్ణాపురంలో ఘటన మృతురాలు పామిడి నివాసి కుమార్తె కుటుంబ సభ్యులు నిలదీస్తుండగానే భర్త పరారీ -
విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి
కళ్యాణదుర్గం రూరల్: రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని కూటమి ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టమైన హామీనిచ్చిన చంద్రబాబు... అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కి విద్యుత్ చార్జీలను ఇష్టానుసారంగా పెంచుతున్నారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయన్నారు.కళ్యాణదుర్గం కేంద్రంగా వెలుగు చూసిన ఈ–స్టాంప్ కుంభకోణం రాష్ట్ర మంతటా వ్యాపించి ఉంటుందని, ఆ దిశగా సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ జూలై 5న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, కార్యదర్శి వర్గ సభ్యుడు సంజీవప్ప, నియోజకర్గ కార్యదర్శి గోపాల్, మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ -
ప్రభుత్వ బడిని కాపాడుకుందాం : యూటీఎఫ్
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రజలను సమన్వయం చేసుకుని ప్రభుత్వ బడులను కాపాడుకుందామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య పిలుపునిచ్చారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైతిక విలువలు నేర్పుతున్న ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య మాట్లాడుతూ.. పాఠశాల ప్రారంభ దినాల నుంచి విద్యలో వెనుకబడిన విద్యార్థులకు చదువుపై ఆసక్తిని కల్పించేలా కృషి చేయాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు అబ్దుల్ వహాబ్ ఖాన్, శేఖర్, రాముడు, సుబ్బరాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ, ఆడిట్ కమిటీ కన్వీనర్ చంద్రమోహన్ పాల్గొన్నారు. -
సీటు.. ‘తమ్ముళ్ల’తో తలపోటు!
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బి.ఉజ్జినప్ప. బుక్కరాయసముద్రం మండలం దండువారిపల్లి గ్రామం. ఈయన భార్య మృతి చెందింది. కూతురు బి.హారిక 7వ తరగతి పూర్తయింది. ఈసారి 8వ తరగతికి వెళ్తోంది. బుక్కరాయ సముద్రం కేజీబీవీలో 3, కురుగుంట కేజీబీవీలో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ముందుగా తల్లిదండ్రులు లేని పిల్లలకు, ఆ తర్వాత తల్లి లేదా తండ్రి లేని పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ క్రమంలో ఆ రెండు కేజీబీవీల్లోనూ ఖాళీ సీట్లయితే భర్తీ చేశారు కానీ తల్లిలేని హారికకు కాకుండా తల్లిదండ్రులిద్దరూ ఉన్న పిల్లలకు అవకాశం కల్పించారు. ఈ వ్యవహారం వెనుక కొందరు మంత్రాంగం నడిపారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. హారిక తండ్రి రోజూ సమగ్రశిక్ష కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. అనంతపురం ఎడ్యుకేషన్: కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం రాజకీయ పైరవీలు, అధికార పార్టీకి చెందిన చోటా నాయకుల ఒత్తిళ్లు వెరసి అర్హులైన ఆడ పిల్లలకు అవకాశం దక్కకుండా పోతోంది. జిల్లాలో మొత్తం 32 కేజీబీవీలున్నాయి. ప్రతి కేజీబీవీలోనూ ఈ విద్యా సంవత్సరం (2025–26)లో 6వ తరగతిలో చేరేందుకు 40 సీట్లు, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు 40 సీట్ల చొప్పున భర్తీకి చర్యలు తీసుకున్నారు. అంతా ఆన్లైన్ విధానంలో రాష్ట్ర స్థాయి అధికారులే ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అయితే మిగులుగా ఉన్న సీట్ల భర్తీ జిల్లా అధికారులకే ఇవ్వడం తలనొప్పిగా మారింది. మా వారికి సీటు ఇవ్వాల్సిందే.. ఖాళీ సీట్ల భర్తీకి జాబితా చాంతాడంత తయారైంది. దీంతో ఎవరికివారు పైరవీలు చేస్తూ జిల్లా అధికారులతో పాటు స్పెషల్ ఆఫీసర్లపై ఒత్తిళ్లు చేస్తున్నారు. కొందరు చోటా నాయకులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు తీసుకొచ్చి అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారు. ఓ మంత్రి తన నియోజకవర్గంలోని కేజీబీవీ ఎస్ఓపై చోటా నాయకులు తీవ్ర ఒత్తిడి చేసి ‘మేము చెప్పినట్టు చేయకపోతే నిన్ను తీసేయిస్తాం’ అంటూ హెచ్చరించడంతో ఆమె అంతేస్థాయిలో తిరగబడ్డారు. అయితే ఏమి జరిగిందే ఏమో తెలీదుకాని ఇటీవల ఖాళీ సీట్ల భర్తీకి వచ్చేసరికి వారు ఏది చెబితే అందుకు ఆమె అంగీకరిస్తూ జిల్లా అధికారులకు సిఫార్సు చేయడం విశేషం. కేజీబీవీ ప్రవేశాలకు ఎస్ఓలు, అధికారులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు అర్హులైన ఆడబిడ్డలకు అన్యాయం నిబంధనల మేరకే భర్తీ కేజీబీవీల్లో వివిధ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ విషయంలో నిబంధనల మేరకే ముందు కెళ్తున్నాం. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన అనుమతితోనే భర్తీ చేస్తున్నాం. తల్లిదండ్రులు లేని, తల్లి లేక తండ్రి ఉన్న బాలికలకే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ తర్వాత డ్రాపౌట్స్, పేద పిల్లలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. – టి.శైలజ, సమగ్రశిక్ష ఏపీసీ -
గందరగోళంగా సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని సర్వే, భూరికార్డుల శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. సీనియార్టీ జాబితాపై గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర నాయకులు అడ్డుచెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జాయినింగ్ డేట్ ఆధారంగా జాబితా ఎలా ఇస్తా రంటూ సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్తో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహేష్నాయుడు వాగ్వాదానికి దిగారు. ఇతర శాఖలు, జిల్లాల్లో మాదిరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ర్యాంక్ ఆధారంగా జాబితా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాదంటే కౌన్సెలింగ్ను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రక్రియ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. పరిస్థితిని డీఆర్ఓ మలోల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. వెంటనే ఆయన సర్వే శాఖ కార్యాలయానికి చేరుకుని సీనియారిటీ జాబితాపై ఏడీలు రూప్లానాయక్, విజయశాంతిబాయి, సూపరింటెండెంట్ అయూబ్తో సమీక్షించారు. ఆయన సూచన మేరకు ర్యాంక్ ఆధారంగా సీనియారిటీ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ తతంగం కారణంగా ఉదయం 9 గంటలకు మొదలవ్వాల్సిన బదిలీ కౌన్సెలింగ్ ఆరు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. సీనియార్టీ జాబితాపై తీవ్ర అభ్యంతరం ఆరు గంటలు ఆలస్యంగా కౌన్సెలింగ్ ప్రారంభం -
జిల్లా అంతటా ఆదివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
అపార్ట్మెంట్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య అనంతపురం: అపార్ట్మెంట్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. టౌ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపిన మేరకు వివరాలు.. కడపకు చెందిన మునయ్య కుమారుడు సుంకర మునిశేఖర్ (50) ఆదివారం అరవింద నగర్లో పరిటాల రవి ఇంటి సమీపంలోని సాయి కొరల్ కౌంటీ అపార్ట్మెంట్లో ఉన్న తన స్నేహితుడు జయప్రకాష్ నాయుడును కలవడానికి వచ్చాడు. అయితే, తాను ఊరికి వెళ్తున్నానని చెప్పి జయప్రకాష్ నాయుడు వెళ్లిపోగా.. మునిశేఖర్ అక్కడే ఉన్నాడు. రాత్రి 7 గంటల సమయంలో అపార్ట్ మెంట్ 5వ ఫ్లోర్ నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలిలోనే ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని సీఐ శ్రీకాంత్యాదవ్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, మునిశేఖర్ గతంలో సోషల్ వెల్ఫేర్ విభాగంలో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసినట్లు తెలిసింది. స్థానిక అశోక్నగర్లోని మినర్వా స్కూల్ సమీపంలో ఓ గదిలో అద్దెకున్నట్లు సమాచారం. భార్య లక్ష్మితో 2015 నుంచి మునిశేఖర్ విడిగా ఉంటున్నాడు. భార్య, పిల్లలు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. -
ఇక చూస్తూ ఊరుకొనేది లేదు
అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వం వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. అందులో పోలీసు వ్యవస్థ ఒకటి. జిల్లాలో మద్యం మాఫియా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నా, అరాచకాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోరు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు రక్షణ కల్పిస్తూ తాడిపత్రికి పంపాలి. లేని పక్షంలో ఎస్పీ కార్యాలయ ఆవరణంలోనే భారీ ధర్నా చేస్తాం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు ఆది వారం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని బలవంతంగా తాడిపత్రి నుంచి అనంతపురం తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న అనంత, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య, పార్టీ శ్రేణులు నగరంలోని పెద్దారెడ్డి క్యాంపు ఆఫీస్కు చేరుకుని ఆయనతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘అనంత’ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపాలని ఈ ఏడాది ఏప్రిల్ 30న డీజీపీ, ఎస్పీలను హైకోర్టు ఆదేశించిందన్నారు. ఈ విషయమై తాము ఎస్పీ జగదీష్కు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ నెల 25న ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ అధిష్టానం ఆదేశించిందని, ఆ కార్యక్రమంలో భాగంగా తాడిపత్రిలోని తన సొంత ఇంటికి పెద్దారెడ్డి వెళ్లారన్నారు. అయితే, పెద్దారెడ్డి అక్కడ ఉండకూడదంటూ పోలీసులు బలవంతంగా అనంతపురం తరలించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తున్నారో లేదో ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.హైకోర్టు, చట్ట ప్రకారం ముందుకెళ్తున్నారా.. లేక కూటమి ప్రభుత్వం, డీజీపీ ఆదేశాలతో ముందుకెళ్తున్నారా అని ప్రశ్నించారు. పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి బహిష్కరించారా అని పోలీసుల వైఖరిని దుయ్యబట్టారు. ప్రభాకర్ రెడ్డికి ఎందుకంత భయం.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లా పోలీసులు వ్యవహరిస్తుండడం అన్యాయమన్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన తనను తాడిపత్రిలోకి వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తనను చూస్తే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎందుకంత భయమో అర్థం కావడం లేదన్నారు. ‘నన్ను చూస్తే ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుందా..’ అని ఎద్దేవా చేశారు. రాజకీయంగా వైఎస్సార్ సీపీ బలపడుతుందనే ఆలోచనతో వారున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని, హైకోర్టును మరోసారి ఆశ్రయించి, వారి ఉత్తర్వుల మేరకే తాడిపత్రిలో అడుగుపెడతానని స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు తామూ అదే రీతిలో బుద్ధి చెబుతామన్నారు. ‘నేను రాజకీయాలు చేయకపోతే, అక్కడ ఉండలేకపోతే నువ్వు తాడిపత్రిని సరిహద్దుగా చేసుకుని ఉండాల్సి ఉంటుంది’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి చురకలు అంటించారు. అనంతపురంలో ప్రభాకర్ రెడ్డిని అడ్డుకుంటామని, ఏది చేతనైతే అది చేసుకోవాలని పేర్కొన్నారు. పెద్దారెడ్డిని పోలీసులే తాడిపత్రికి తీసుకెళ్లాలి లేకుంటే ఎస్పీ కార్యాలయం వద్ద భారీ ధర్నా చేస్తాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పోలీసుల తీరుపై ధ్వజమెత్తిన పార్టీ నేతలు -
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపైజేసీ కక్ష సాధింపు
● అధికారులను ఉసిగొల్పి ఇంటికి కొలతలు తాడిపత్రి టౌన్: ఆక్రమణల పేరుతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు రమేష్రెడ్డి, ఫయాజ్బాషాపై అధికారులను ఉసిగొల్పి వేధింపులకు పాల్పడిన ఆయన.. శనివారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైకి మున్సిపల్ అధికారులను ఉసిగొల్పారు. తాడిపత్రి పట్టణంలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్దారెడ్డి ఇంటి పరిసరాలు, లోపల టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత కొలతలు వేసి రికార్డు చేశారు. భారీ బందోబస్తు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద మున్సిపల్ అధికారులు కొలతలు వేస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, సీఐ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు చేపట్టారు.కేతిరెడ్డి ఇంటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రధాన కూడళ్లలో సిబ్బందిని మోహరించారు. విధ్వంస పాలన.. జేసీ ప్రభాకర్రెడ్డి విధ్వంస పాలనకు తెరలేపాడని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. పట్టణ అభివృద్ధి గురించి మరిచి రోడ్లు కొడతా..సమాధులు కొడతా.. వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లు కొడతా అంటూ రోజూ అలజడి సృష్టిస్తున్నాడని దుయ్యబట్టారు. మొన్నటి వరకు తమ పార్టీ నాయకుల ఇళ్లను ధ్వంసం చేసి నేడు నా ఇంటికి కూడా కొలతలు వేయించారని విమర్శించారు. తాను చట్టానికి లోబడే ఉంటానని స్పష్టం చేశారు. సచివాలయాల్లోనే సబ్ డివిజన్కు రుసుం స్వీకరణ అనంతపురం అర్బన్: ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ కింద దరఖాస్తు రుసు మును సచివాలయాల్లోనే సిబ్బంది స్వీకరించారు. దరఖాస్తు రుసుం స్వీకరించని అంశంపై ‘సాక్షి’లో ‘అమలుకాని ఆదేశాలు’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సబ్డివిజన్ కోసం వచ్చే రైతుల నుంచి దరఖాస్తు రుసుం స్వీకరించాలని సిబ్బందిని సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్ ఆదేశించారు. జేసీ ఆదేశాలను అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలోనే రైతు కిష్టకు కొర్రపాడు–2 (బోడిగాని దొడ్డి) సచివాలయ సిబ్బంది ఫోన్ చేసి సబ్డివిజన్కు రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. వీఆర్ఓలు, సర్వేయర్లకు నేడు బదిలీల కౌన్సెలింగ్ అనంతపురం అర్బన్: సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రేడ్–2 వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్ల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా సచివాలయాల్లో 328 మంది గ్రేడ్–2 వీఆర్ఓలు ఉండగా ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 121 మంది ఉన్నారు. మొత్తం 130 ఖాళీలను చూపించారు. ఇక గ్రామ సర్వేయర్ల బదిలీలు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో జరగనున్నాయి. -
ఢిల్లీలో శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్
వజ్రకరూరు: ఢిల్లీలోని డాన్బోస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శనివారం ప్రారంభమైన ‘షీ రెప్రజెంట్స్–2025’ అనే ప్రతిష్టాత్మక నాయకత్వ అభివృద్ధి– శిక్షణకు వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా హాజరయ్యారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ అనే సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి.. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు మంచి నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం కలిగిన 45 మంది మహిళా ప్రజాప్రతినిధులను ఎంపిక చేశారు. అందులో వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా ఒకరు. వీరికి ఏడు రోజులపాటు పాలన, కమ్యూనికేషన్, ప్రజానైతికత, నాయకత్వ నైపుణ్యాలు, సమస్యలు– వాటిపరిష్కార పద్ధతులు, పార్లమెంట్ సందర్శన తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. మోనాలిసా మాట్లాడుతూ ఢిల్లీ శిక్షణకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. సిగ్నల్ లోపం.. ఆగిన రైలుతాడిపత్రి రూరల్: కోమలి రైల్వే స్టేషన్లో అటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తి ధర్మవరం – మచిలీపట్టణం ఎక్స్ప్రెస్ గంటకు పైగా నిలిచిపోయింది. తాడిపత్రి రైల్వే స్టేషన్కు రాత్రి 7.24 గంటలకు రావాల్సి ఉండగా.. సిగ్నల్ లోపం కారణంగా 8.33 గంటలకు వచ్చింది. రెండు రోజుల క్రితం అటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాడిపత్రి రైల్వే స్టేషన్లో అటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన ప్యానల్ బోర్డు ఏర్పాటు చేశారు. వారం క్రితం కోమలి రైల్వే స్టేషన్లో తెల్లవారుజామున ఒక దుండగుడు సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన వైర్లను తొలగించారు. సిగ్నల్ పడకపోవడంతో స్టేషన్ బయట నిలిచి ఉన్న రైలులోకి చొరబడిన దుండగుడు ప్రయాణికురాలు వనజాక్షి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. మరోసారి ఇలాంటి సంఘటన పునరావృతమైందన్న భయం ప్రయాణికుల్లో ఏర్పడింది. సిగ్నల్ వ్యవస్థలో ఏర్పడ్డ సాంకేతిక లోపం వల్ల రైలు నిలిచిపోయిందని తెలియడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక సిబ్బంది యుద్ధప్రాతిపదికన సిగ్నల్ వ్యవస్థను పునరుద్దరించి రైలును ముందుకు పంపించారు. రైల్లో ప్రయాణికురాలి మృతి గుత్తి: రైల్లో ప్రయాణిస్తున్న మహిళ హైషుగర్తో కుప్పకూలి మృతి చెందింది. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపిన మేరకు... బెంగళూరులోని యలహంకకు చెందిన లక్ష్మీబాయి (53) కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఇటీవల పూరి యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని ‘పూరి ఎక్స్ప్రెస్’లో యలహంకకు బయల్దేరారు. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చినపుడు లక్ష్మీబాయి షుగర్ పెరిగిపోయి కుప్పకూలింది. కుటుంబ సభ్యులు ఎంత లేపినా లేవలేదు. అప్పటికే ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీబాయి మృత దేహాన్ని జీఆర్పీ పోలీసులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పని ఒత్తిడి తగ్గించండి
అనంతపురం అర్బన్: పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ఏపీ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వర్ల శంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలన్నారు. అన్ని రకాల సర్వేలు, స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్ను వసూళ్లు, పీఆర్ ఎన్యాప్, గ్రామ సచివాలయ సర్వేలు, రెవెన్యూ, పీజీఆర్ఎస్ పనులు, గ్రామ సభలు, గ్రామ పంచాయతీ సమావేశాలు, ప్రొటోకాల్ విధులు ఇలా పలు రకాలు పనులు పంచాయతీ కార్యదర్శులతో చేయిస్తుండడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ఇదే క్రమంలో ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో ఫిర్యాదులు వచ్చాయంటూ తమపై చర్యలు తీసుకుంటూ మరింత మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల్లో చాలామంది మహిళలు, వయసు పైబడిన వారు ఉన్నారన్నారు. వీరి గురించి అధికారులు ఆలోచించాలన్నారు. పంచాయతీ కార్యదర్శిని సచివాలయంలో జరిగే సంక్షేమ పథకాల సర్వే విధుల నుంచి తొలగించాలన్నారు. పీఎస్ లాగిన్కు సంబంధించి పీజీఆర్ఎస్ సమస్యలను ఆయా శాఖల వారికే కేటాయించాలన్నారు. పీఎస్ల అన్ని గ్రేడ్లలోనూ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగ నిర్వహణలో విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ప్రధానంగా ఉదయం 6 గంటల నుంచి పారిశుధ్య పనులతో మొదలుకొని, గ్రామ, వార్డు సచివాలయ సర్వేలు మనమిత్ర, ఈ–కేవైసీ, ఎంబీయూ, జియో ట్యాగింగ్, బియ్యం కార్డు, తదితర వాటితో పాటు రోజూ రెండు లేదా మూడు వెబెక్స్, గూగుల్ మీటింగ్లు మరింత ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. ఇవి కాకుండా వాట్సాప్ మెసేజ్లు, స్ప్రైడ్షీట్, ఫొటోలు, వీడియోల అప్డేట్లు, ప్రజల మొబైల్ ఫోన్ నుంచి ఓటీపీ మెసేజ్ సేకరణ వంటి పనులు చేస్తున్నారన్నారు. ఇలా విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను, ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ను కలిసి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షుడు భీమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటరాముడు, కార్యదర్శి రాఘవేంద్ర, సభ్యులు శివమూర్తి, శ్వేత పద్మిని, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే అడు!్డ
సాక్షి టాస్క్ఫోర్స్: రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరగకుండా ఎమ్మెల్యే అడ్డుపడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాంప్లేట్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ సాకే రాజేష్ కుమార్ పేర్లు ముద్రించడాన్ని సహించలేక కక్షసాధింపులకు దిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఆదేశాలతో నిర్వాహకులకు అధికారులు నోటీసు లిచ్చి కార్యక్రమాన్ని నిలిపివేయించారు. వివరాలు.. రాప్తాడులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భీమ్ రావ్ యువజన సంఘం నాయకులు 2021 ఏప్రిల్లో తీర్మానం చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ముందు విగ్రహ ఏర్పాటుకు తహసీల్దార్, ఎంపీడీఓ అనుమతి తీసుకున్నారు. విగ్రహ ప్రతిష్ట కోసం చందాలు వసూలు చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రూ.2 లక్షలు, శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలానికి చెందిన ప్రొఫెసర్ సాకే రాజేష్ కుమార్ రూ.7 లక్షల విరాళం అందించారు. పలువురి ద్వారా మొత్తం రూ.15 లక్షలు వసూలు చేసిన భీమ్ రావ్ యువజన సంఘం నాయకులు రాప్తాడులో విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆదివారం ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. నెల క్రితమే ఉత్సవానికి సంబంధించి పాంప్లేట్లు కొట్టించి అందరికీ పంచారు. ఆ రెండు పేర్లు తొలగించండి..! విగ్రహావిష్కరణ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహోదగ్రులైనట్లు తెలిసింది. అధికారులకు ఫోన్ చేసి మండిపడినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, సాకే రాజేష్ కుమార్ పేర్లు ఉండకూడదని ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. ఎలాగోలా కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో విగ్రహ ఏర్పాటుకు పర్మిషన్ లేదంటూ నిర్వాహకులకు పోలీసుల ద్వారా నోటీసులు ఇచ్చారు. పర్మిషన్ తీసుకుని పనులు చేసుకోవాలని, లేని పక్షంలో అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించినట్లు తెలిసింది. పార్టీలకతీతంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశాం.. నోటీసులపై భీమ్ రామ్ యువజన సంఘం అధ్యక్షుడు కటిక జయరామ్, వైస్ ప్రెసిడెంట్ బాల నాగేంద్ర విలేకరులతో మాట్లాడారు. 2021 నుంచి పనులు జరుగుతున్నా అధికారులు ఏనాడూ అడ్డు చెప్పలేదన్నారు. పార్టీలకతీతంగా చందాలు వసూలు చేశామన్నారు.పాంప్లేట్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేష్ కుమార్ పేర్లు తొలగించి కార్యక్రమాన్ని చేసుకోవచ్చని సమాచారమిచ్చారన్నారు. సర్పంచు సాకే తిరుపాల్, పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ కూడా దళితులే అని, అయినా విగ్రహ ప్రతిష్టకు అనుమతి లేదంటూ అడ్డు పడడం దళిత జాతికే సిగ్గు చేటన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజేష్కుమార్ పేర్లు ఉండటంతో కక్ష సాధింపు రాప్తాడులో ఆగిపోయిన విగ్రహ ప్రతిష్టాపనోత్సవం -
‘ఉపాధి’ అక్రమాలపై విచారణ చేపట్టాలి
అనంతపురం కార్పొరేషన్: ఉపాధి హామీ పనుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధి అక్రమాలపై విచారణకు, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఈ నెల 30 రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో జరిగే ‘ప్రజా సమస్యల పరిష్కారవేదిక’లో కలెక్టర్లకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. శనివారం ఆయన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం విడుదల చేసిన రూ.1150 కోట్ల పంచాయతీరాజ్ నిధులను సీఎం చంద్రబాబు ఇతర పనులకు బదలాయిస్తే.. ఎన్నికలకు ముందు మీ గొంతుకనవుతా.. ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. సొంత శాఖకు చెందిన డబ్బులు ఇతర అవసరాలకు వాడితే గ్రామాభివృద్ధి ఎక్కడ సాధ్యపడుతుందని ప్రశ్నించారు. సర్పంచ్లకు ‘తల్లికి వందనం’ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 11 రద్దు చేసి.. 1,350 మంది పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్లు ఇచ్చి 10 నెలలుగా జీతాలు విడుదల చేయలేదన్నారు. గ్రామాల్లో వసూలు చేస్తున్న ఇంటి పన్నును స్థానిక సంస్థల ఖాతాల్లోకి జమచేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు యోగేందర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కిరణ్, నాయకులు అంజన్రెడ్డి పాల్గొన్నారు. -
‘స్టాంప్’ కుంభకోణంపై చంద్రబాబు నోరు విప్పాలి
అనంతపురం టవర్క్లాక్: నకిలీ స్టాంపుల కుంభకోణంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరు విప్పాలని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి కోరారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1995లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన తెల్గీ కుంభకోణాన్ని తల దన్నేలా ప్రస్తుత స్టాంపుల కుంభకోణం ఉందన్నారు. ఈ స్కామ్ను ఒక వ్యక్తిపై తోసి సురేంద్రబాబు తప్పించు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆర్బీఐ, ఫైనాన్స్ మినిస్టర్, ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ స్కామ్ సంబంధించి 40 డాక్యుమెంట్లతో రెండు డాక్యుమెంట్లతోనే రూ.900 కోట్లు, మరో డాక్యుమెంటులో రూ.700 కోట్లు, ఇంకో డాక్యుమెంట్లో రూ.20 కోట్ల వరకు అవకతవకలు పాల్పడినట్లు తెలుస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కు అనంతపురంలో కార్యాలయం ఉంటే కళ్యాణదుర్గంలో డాక్యుమెంట్లు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు. ఎస్ఆర్సీ ఇన్ఫ్రాకు సంబంధించి ప్రతి డాక్యుమెంట్నూ విచారణ చేసి ప్రభుత్వ ఖజానాకు డబ్బు చేరిందా లేదా అని చూడాలన్నారు. ధాబా నిర్వాహకురాలిపై దాడి గుత్తి రూరల్: ధాబాను తగులబెట్టేందుకు ప్రయత్నించిన దుండగులు.. అడ్డుకోబోయిన నిర్వాహకురాలిపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు... ఊబిచెర్ల గ్రామానికి చెందిన ఓబులేసు, అంజలి దంపతులు గ్రామ శివారు 44వ నంబరు జాతీయ రహదారి పక్కన ధాబా హోటల్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి దాబా మూసివేసిన అనంతరం అంజలి అక్కడే నిద్రించింది. అర్ధరాత్రి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ధాబాలోని వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం పెట్రోలు పోసి తగులబెట్టేందుకు ప్రయత్నిస్తుండగా అలికిడికి అంజలి నిద్రలేచి కేకలు వేసి,అడ్డుకుంది. దీంతో వారు అంజలిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. కేకలు విని సమీపంలోని వారు వస్తుండటం గమనించిన దుండగులు ద్విచక్రవాహనం వదిలి పారిపోయారు. గాయపడిన అంజలిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారు దొంగలా.. లేక ఇతర కారణాలతో దాడి చేశారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యత
అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ, కౌన్సెలింగ్ గందరగోళంగా తయారైంది. పారదర్శకత కరువైంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ సాగిస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. పలుకుబడి, డబ్బు, ప్రజాప్రతినిధుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత, సీనియార్టీ పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా బదిలీల ప్రక్రియ చేపడుతున్నారని అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు అసిస్టెంట్లు మండిపడుతున్నారు. ప్రణాళికేదీ...? కలెక్టర్ అనుమతితో ఈనెల 30లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, పట్టుపరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో శనివారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (వీఏఏ)కు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. రెండు జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, సూపరింటెండెంట్ల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. పద్ధతి, ప్రణాళిక లేకుండా చేపట్టడంతో ఏం జరుగుతుందనే వీఏఏలు ఆందోళనతో ఎగబడ్డారు. ర్యాంకులు, మెరిట్ ప్రకారం వీఏఏలు పట్టుబట్టగా, అధికారులు మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రకారం కొనసాగిస్తామని చెప్పారు. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ గంట పాటు నిలిపేశారు. చివరకు ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్కు అధికారులు అంగీకరించారు. సోమవారం ఉత్తర్వులు.. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం పోస్టులు 282 ఉండగా... అందులో పనిచేస్తున్న వారు 248 మంది ఉన్నారు. అందులో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వీఏఏలు 229 మంది బదిలీకి అర్హత ఉన్నట్లు తెలిపారు. మరో 19 మంది రిక్వెస్ట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. అటు ఉద్యానశాఖ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 323 మంది వీహెచ్ఏలు ఉండగా అందులో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు 280 మందికి బదిలీలు చేపట్టారు. మరికొందరు రిక్వెస్ట్ కింద దరఖాస్తు చేసుకున్నారు. శనివారం రెండు జిల్లాల నుంచి తరలివచ్చిన వీహెచ్ఏలు ఆప్షన్లు ఇచ్చేశారు. సోమవారం సాయంత్రానికి బదిలీ ఉత్తర్వులు ఇస్తామని అధికారులు తెలిపారు. ఖాళీల వివరాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆప్షన్లు ఇవ్వడానికి వీహెచ్ఏలు కూడా ఇబ్బంది పడ్డారు. పట్టుపరిశ్రమశాఖ అసిస్టెంట్ల బదిలీలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్ఎస్కే అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియలో పారదర్శకత కరువు -
వంకలనూ వదలని తమ్ముళ్లు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో ఇసుక, మట్టి అక్రమ రవాణా ఊపందుకుంది. ఈ క్రమంలో వాగులు, వంకలు, చెరువులు, రస్తాలను సైతం ఆక్రమించేస్తున్నారు. వంకలు, వాగుల్లో పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ● బడా నేతల పేర్లతో బెదిరింపులు ● పట్టించుకోని అధికారులు పెద్దవడుగూరు: ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సంపద సృష్టి అంశం దేవుడెరుగు కానీ, టీడీపీ నేతలు మాత్రం పేట్రెగిపోయి అక్రమార్జనపై దృష్టి సారించారు. పెద్దవడుగూరు మండలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగానే కనిపిస్తోంది. మండల పరిధిలోని క్రిష్టిపాడు, ఆవులాంపల్లి, కొండూరు గ్రామాల్లో కొందరు టీడీపీ కార్యకర్తలు బరితెగించి మట్టి, ఇసుక దందాకు తెరలేపారు. ఇదేమని ప్రశ్నించిన అధికారులను బడా నేతల పేర్లు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో ఈ తలనొప్పి తమకెందుకు అనే ధోరణితో అధికారుల్లో ఉదాసీనత వ్యక్తమవుతోంది. తగ్గు ప్రాంతాల చదును కోసమని రెండు వారాల క్రితం తగ్గు ప్రాంతాలను చదును చేసుకునేందకు కొందరు రైతులు వంకల్లోని మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించే ప్రయత్నం చేశారు. ఈ డిమాండ్ను గుర్తించిన స్థానిక టీడీపీ కార్యకర్తలు వెంటనే మట్టి తరలింపులను అడ్డుకున్రాఉ. గ్రామాల్లో ఉన్న విబేధాలతో గొడవలకు తెరలేపారు. దీంతో రైతుల తమ పొలాలకు మట్టిని తరలించుకోవడం మానేశారు. ఇదే అదనుగా భావించిన టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోయారు. మండల కేంద్రం నుంచి కొండుపల్లికి వెళ్లే మార్గంలోని గ్రామ శివారున ప్రధాన రహదారి పక్కన ఉన్న వంకలోని మట్టిని అక్రమంగా తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకోసాగారు. జేసీబీలను పెట్టి మరీ మట్టి తవ్వకాలు చేపట్టడంతో రోజుల వ్యవధిలోనే వంకలో భారీ ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. దిక్కున్న చోటు చెప్పుకోండి మట్టి అక్రమ తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే బడా నాయకుల పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసుల నుంచి అనుమతులు తీసుకున్నామని, దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకొండి అంటూ దౌర్జన్యానికి తెరలేపడంతో సామాన్యులు మాట్లాడలేకపోతున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా వంకలోని మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా వంకలో మట్టి తరలింపులు కొనసాగిస్తుండడంతో ఇప్టికే 15 అడుగుల లోతుతో, నాలుగు మీటర్ల వెడల్పుతో, సుమారుగా 20 మీటర్లకు పైగా పొడవునా భారీగా గోతులు ఏర్పడ్డాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెరువులు, వంకల్లో మట్టిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.అనుమతులు ఇవ్వలేదు పెద్దవడుగూరు మండలం నుంచి మట్టి, ఇసుక తవ్వకాలు, తరలింపులకు అనుమతులు ఇవ్వలేదు. నిబంధనలు ఉల్లంఘించి మట్టి, ఇసుక అక్రమ తరలింపులు చేపడితే వారిపై చట్ట పరౖమైన చర్యలు తీసుకొంటాం. మట్టి, ఇసుక తరలించాలంటే మైనింగ్ అండ్ జియాలజీ శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. – ఉషారాణి, తహసీల్దార్, పెద్దవడుగూరు -
ప్రతి విద్యార్థికీ విద్యా సామగ్రి అందాలి
ఆత్మకూరు: ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా సామగ్రి ప్రతి ఒక్క విద్యార్థికి తప్పనిసరిగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ పరిశీలకుడు వెంకట శివసాయి సూచించారు. ఆత్మకూరులోని ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించరాదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సబ్సిడీ బియ్యం పట్టివేత రాప్తాడు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేసులు తెలిపారు. సోమందేపల్లికి చెందిన నరేష్ 42 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కర్ణాటకలోని పావగడకు బొలెరో వాహనంలో తరలిస్తూ శుక్రవారం రాప్తాడులోని వైఎస్సార్ సర్కిల్లో పట్టుపడ్డాడన్నారు. వాహనాన్ని సీజ్ చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్టాక్ పాయింట్కు తరలించినట్లు వివరించారు. పశు శాఖ జేడీగా సుధాకర్ అనంతపురం సెంట్రల్: పశు సంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్గా డాక్టర్ టీవీ సుధాకర్ను నియమిస్తూ ఆ శాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత జేడీ వెంకటస్వామి ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. -
బోడాయిపల్లిలో వేటకొడవళ్లతో స్వైరవిహారం
తాడిపత్రి టౌన్: మండలంలోని బోడాయిపల్లిలో శుక్రవారం ఉదయం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన కుళ్లాయప్ప, అదే గ్రామానికి చెందిన రంగనాథ్ భార్యపై దాదాపు ఏడాది క్రితం అత్యచారయత్నం చేశాడు. ఆ సమయంలో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పంచాయితీ నిర్వహించి కుళ్లాయప్పపై ఏడాది పాటు గ్రామ బహిష్కరణ విధించారు. ఏడాది పూర్తి కావడంతో కుళ్లాయప్ప గ్రామానికి చేరుకుని తన సోదరుడు బాలయ్యతో కలిసి గ్రామ సమీపంలోని పొలంలో శుక్రవారం ఉదయం పనుల్లో నిమగ్నమైన సమయంలో రంగనాథ్తో పాటు రాజేష్, రంగ సుధాకర్, పృథ్వీ, రాకేష్, హరీంద్ర మరో ముగ్గురు అక్కడకు చేరుకుని వేటకొడవళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. దాడిని ప్రతిఘటిస్తూ తనకు అందుబాటులో ఉన్న వేటకొడవలితో కుళ్లాయప్ప కలబడాడ్డు. ఘటనలో కుళ్లాయప్ప కాలుకు, చేతిపై నరుకుడు గాయాలయ్యాయి. రంగనాథ్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఇరువురి పరిస్థితి విషమంగా మారింది. బాలయ్య, రాజేష్, రంగసుధాకర్, పృద్వీ, హరీంద్రకు చిన్నపాటి రక్తగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని దాడులను అడ్డుకుని క్షతగాత్రులను తొలుత తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న సీఐ శివగంగాధర్రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు వివరించారు. -
రోడ్డు ప్రమాదాలు నివారించాలి
అనంతపురం అర్బన్: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. రోడ్డు భద్రతపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోలతో కలసి ఎస్పీ మాట్లాడారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పరిమితికి మించి ప్రయాణికులను చేర వేసే వాహనాలే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. ప్రమాదాలకు గల కారణాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఇందు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడింగ్ అతి వేగంగా వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. 19 వేల మందిపై కేసు నమోదు ఈ ఏడాది మే1వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 19,982 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ వీర్రాజు తెలిపారు. వీరిలో హెల్మెట్ దరించకుండా డ్రైవింగ్ చేసిన 544 మంది, ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడిపిన 749 మంది, డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్సీ.. ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన 13,892 మంది, మద్యం సేవించి వాహనాలు నడిపిన 282 మంది ఉన్నారన్నారు. వీరికి రూ.56,96,885 జరిమానా విధించినట్లు వివరించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ రాజగోపాల్, జాతీయ రహదారి శాఖ పీడీ తరుణ్, పంచాయతీరాజ్ ఎస్ఈ జహీర్ అస్లాం, ఆర్టీసీ ఆర్ఎం సుమంత్, డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు చర్యలు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్సీ పి.జగదీష్ ఆదేశించారు. నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ జిల్లాస్థాయి కమిటీ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఈగల్ టాస్క్ఫోర్స్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఆర్ఐఓ వెంకటరమణనాయక్, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ జగదీష్ ఆదేశం -
సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో గందరగోళం
అనంతపురం కార్పొరేషన్: సచివాలయ ఉద్యో గుల బదిలీల ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం బదిలీలు చేపట్టాలని ఆగమేఘాలపై సర్క్యులర్ విడుదలైంది. ముందురోజు అర్ధరాత్రి 11 గంటలకు సంబంధిత ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం తెలపడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నగరపాలక సంస్థ, 11 మున్సిపాలిటీల పరిధిలో విధులు నిర్వర్తించే సచివాలయ ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతపురంలోని జీసస్నగర్లోని జయమణెమ్మ కళ్యాణమంటపంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి నేతృత్వంలో వివిధ మునిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. స్పష్టతలో జాప్యం : ఉమ్మడి జిల్లాలో 304 సచివాలయాల పరిధిలో 286 మంది అడ్మిన్ పోస్టులుండగా.. అందులో 18 ఖాళీలున్నాయి. కౌన్సెలింగ్కు 176 మంది అడ్మిన్లు హాజరయ్యారు. మునిసిపల్ ఆర్డీ విశ్వనాథ్ ఎవరైనా ఏదైనా మునిసిపాలిటీ పరిధిలో 5 ఏళ్ల పాటు పని చేసి ఉన్న వారు బదిలీకి అర్హులని చెప్పారు. దీంతో దీనిపై స్పష్టత రాలేదు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 74 సచివాలయాల్లో పది మందికిపైగా బిల్ కలెక్టర్లు అడ్మిన్లు చేస్తున్నారు. ఈ సచివాలయాలను బదిలీల జాబితాలో చూపలేదు. మునిసిపాలిటీల్లో వివిధ సచివాలయాల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కొందరినీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో సచివాలయ ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. ఇతర మునిసిపాలిటీల్లో ఈ విధంగా జరగడం లేదన్నారు. అనంతరం సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు మునిసిపల్ ఆర్డీ విశ్వనాథ్కు ఫిర్యాదు చేశారు. మరోసారి బదిలీ జాబితాను పక్కాగా నమోదు చేసి బదిలీలు చేపట్టాలని కమిషనర్ బాలస్వామిని ఆర్డీ ఆదేశించారు. దీంతో గంటసేపు పైగా బదిలీల కౌన్సిలింగ్ నిలిపివేశారు. తమ్ముళ్ల సిఫార్సు : బదిలీల్లో తెలుగు తమ్ముళ్ల సిఫార్సు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధుల లెటర్లతో కొందరు బదిలీలకు రావడంతో వివిధ మునిసిపాలిటీల్లోని కొన్ని ప్రాంతాలను అధికారులు ఖాళీలు చూపనట్లు తెలుస్తోంది. దీంతో అర్హులైన ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అడ్మిన్ బదిలీల కౌన్సెలింగ్ రసాభాస.. వాయిదా :అడ్మిన్ బదిలీల కౌన్సెలింగ్ రసాభాసగా సాగింది. శుక్రవారం రాత్రి ఉద్యోగుల ర్యాంక్, స్పౌజ్ల విషయంలో గందరగోళం నెలకొంది. పారదర్శకంగా చేపట్టడం లేదంటూ అడ్మిన్ కార్యదర్శులు ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆర్డీ విశ్వనాథ్ బదిలీల కౌన్సెలింగ్ వద్దకు చేరుకున్నారు. బదిలీలు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారని, తమకు అన్యాయం జరగుతోందంటూ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బదిలీల కౌన్సెలింగ్ను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఆర్డీ విశ్వనాథ్ ప్రకటించారు. -
సీఆర్ఎంటీలకు బదిలీ టెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్రశిక్ష పరిధిలో పని చేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ల (సీఆర్ఎంటీ)కు ‘బీ కాంప్లెక్స్’ల బదిలీ టెన్షన్ పట్టుకుంది. జిల్లాలో మొన్నటి వరకు మొత్తం 155 క్లస్టర్లు ఉండేవి. కూటమి ప్రభుత్వం రీ–ఆర్గనైజేషన్ ప్రక్రియ చేపట్టడంతో వివిధ నిబంధనలతో వాటిని 135కు కుదించారు. దీంతో మిగులుగా ఉండే సీఆర్ఎంటీఎల్లో గుబులు రేగుతోంది. తమను ఎక్కడికి సర్దుబాటు చేస్తారోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. సర్దుబాటు పేరుతో అన్యాయం 1 నుంచి 10 తరగతులు ఉన్న క్లస్టర్ స్కూళ్లలో కొత్తగా ‘బీ క్లస్టర్లు’ తీసుకొచ్చారు. ఇలా జిల్లాకు 20 బీ క్లస్టర్ స్కూళ్లు వచ్చాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం పని చేస్తున్న మండలాల్లో కాకుండా పక్క మండలాల్లో ఎక్కువగా ఉండడంతో సీఆర్ఎంటీలు భయపడుతున్నారు. అనంతపురం అర్బన్ పరిధిలో 12 కాంప్లెక్స్లుంటే ఆరు రద్దయ్యాయి. మరో నాలుగు కొత్తగా వచ్చాయి. అంటే మొత్తం 10 క్లస్టర్ స్కూళ్లు ఉన్నాయి. ఇక్కడ 12 మంది సీఆర్ఎంటీలు పని చేస్తున్నారు. మిగులుగా ఉన్న ఇద్దరిని పక్క మండలాల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. సమీపంలో అంటే గార్లదిన్నె మండలంలో ఒక బీ క్లస్టర్ స్కూల్ ఉంది. మరొకటి దరిదాపుల్లో లేదు. అలాగే నార్పల మండలంలో ఒక సీఆర్ఎంటీ మిగలగా, చుట్టుపక్కల మండలాలైన శింగనమల, బుక్కరాయసముద్రం, అనంతపురంలో ఖాళీలు లేవు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొందని బాధిత సీఆర్ఎంటీలు వాపోతున్నారు. జీతం అక్కడ...పని ఇక్కడ! మరోవైపు సీఆర్ఎంటీలు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అదే మండలాల్లోనే ఉంటారని జీతం సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్తగా ‘బీ కాంప్లెక్స్’లను తీసుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. మిగులుగా ఉన్న సీఆర్ఎంటీలు బీకాంప్లెక్స్కు కేటాయించినా జీతాలు అక్కడ తీసుకుంటూ పని మాత్రం ప్రస్తుతం చేస్తున్న చోటే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. భవిష్యత్తులో ప్రతి నెలా ఇక్కడ పని చేస్తూ జీతాలు వేరే మండలాల ఎంఈఓలు చేయాలంటే ఏమి అడ్డంకులు చెబుతారోనని ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నామమాత్రంగా ఉన్న బీక్లస్టర్ల అవసరం లేదని నివేదికలు సిద్ధంచేసి, వాటిని తీసేస్తే తమ పరిస్థితి ఏమి కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు సీఆర్ఎంటీలు శుక్రవారం సమగ్రశిక్ష కార్యాలయానికి వచ్చారు. ఏపీసీ శైలజ అందుబాటులో లేకపోవడంతో మాజీ ఏఎంఓ చంద్రశేఖర్రెడ్డిని కలసి తమగోడు వెల్లబోసుకున్నారు. తమకు ఎలాంటి ఇతరత్రా అలవెన్సులు ఉండవని, నామమాత్రపు జీతాలతో పని చేస్తున్న తమను దూర మండలాలకు పంపితే ఇబ్బంది పడతామని వాపోయారు. బీక్లస్టర్ స్కూళ్లకు మ్యాపింగ్ చేసి, పనిమాత్రం ప్రస్తుతం ఉన్నచోట చేయాలని చెబుతున్నా భవిష్యత్తులో ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలతో తాము ఇబ్బందులు పడతామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రీ–ఆర్గనైజేషన్ అనంతరం జిల్లాలో 20 బీ క్లస్టర్ స్కూళ్లు సర్దుబాబు పేరుతో సొంత మండలాల్లో కాకుండా దూర మండలాలకు పంపే ప్రయత్నం లబోదిబోమంటున్న సీఆర్ఎంటీలు -
రేషన్కు నగదు బదిలీ ఆలోచన మానుకోవాలి
రాయదుర్గంటౌన్: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా లబ్ధిదారులకు రేషన్కు నగదు బదిలీ చేయాలనే ఆలోచనను మానుకోవాలని కూటమి ప్రభుత్వానికి సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి హితవు పలికారు. స్థానిక ఏపీఎన్జీఓ భవనంలో శుక్రవారం రాయదుర్గం, కణేకల్లు, డి.హీరేహాళ్ మండలాల సీపీఎం నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నల్లప్ప మాట్లాడుతూ.. రేషన్ బియ్యం పథకాన్ని కచ్చితంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నగదు బదిలీ చేస్తే నిజమైన లబ్దిదారులు, పేదలు నష్టపోతారన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మల్లికార్జున, నాగరాజు, లోకేష్, నాగరాజు, మధు, తిమ్మరాజు, శంకర్, పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ బాధితులకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు పి.నారాయణస్వామితో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్ బాధితులను ఆదుకునే అంశాన్ని టీడీపీ తన ఎన్నికల మేనిఫేస్టోలో ఉంచిందని గుర్తు చేశారు. హామీని అమలు చేయకపోతే బాధితులతో కలిసి మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధేశ్వర్, జిల్లా అధ్యక్షుడు నారాయణప్ప, సభ్యులు కుళ్లాయప్ప, ధనుంజయ, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు. మట్కా రాస్తున్న మహిళల అరెస్ట్ తాడిపత్రి టౌన్: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మట్కా రాస్తున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. అందిన సమాచారం మేరకు శుక్రవారం తనిఖీలు చేపట్టి పక్కా ఆధారాలతో సరస్వతి, కుళ్లాయమ్మ, జ్యోతిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1.30 లక్షల నగదు, సెల్ఫోన్లు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమానాస్పద మృతి అనంతపురం: నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న అభిషేక్కుమార్ (20) గురువారం రాత్రి బాత్రూంలో వాంతి చేసుకుని మృతి చెందాడు. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని వన్టౌన్ ఎస్ఐ లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. బీహార్లోని వెస్ట్ చంపారన్ జిల్లా బహుర్వా గ్రామానికి చెందిన సీతాదేవి, శంభురామ్ దంపతుల చిన్న కుమారుడు అభిషేక్ కుమార్ ఇంటర్ పూర్తి చేసి రెండు నెలల క్రితం ముంబయిలోని యూనీ సర్వేడ్ టెక్ సొల్యుషన్స్ కంపెనీలో నెట్వర్క్ టెక్నీషియన్గా పనిలో చేరాడు. శిక్షణ అనంతరం కంపెనీ ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నుంచి అనంతపురం కేంద్రంగా విధులు చేపట్టాడు. శ్రీకంఠం సర్కిల్లోని పీజీ హాస్టల్లో ఉంటూ విధుల్లో భాగంగా యాడికి సమీపంలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఎయిర్టెల్ నెట్వర్క్ చెకింగ్కు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో శుక్రవారం విధులు ముగించుకుని వస్తూ మార్గమధ్యంలో తన స్నేహితుడు జయప్రకాష్కుమార్ రాయ్తో కలసి గోబీ మంచూరియా తిని సాయంత్రం హాస్టల్కు చేరుకున్నాడు. రాత్రి 7గంటలకు జయ ప్రకాష్ పిలిచినా భోజనానికి వెళ్లలేదు. కాసేపటి తర్వాత భోజనం గదిలోకి తెచ్చి పెట్టి తినమని జయప్రకాష్ తెలపడంతో ఆరోగ్యం ఇబ్బందిపెడుతుంటే మందులు వేసుకున్నానని అలాగే నిద్రపోయాడు. రాత్రి 8:15 గంటలకు బాత్రూంకు వెళ్లిన అభిషేక్ అక్కడ వాంతులు చేసుకుంటూ కుప్పకూలాడు. గమనించిన జయప్రకాష్కుమార్ వెంటనే తన రూం మేట్స్ నాగూర్ వలి, పోతులయ్య, పీజీ హాస్టల్ యజమాని నాగేశ్వరరెడ్డితో కలసి ఆటోలో సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అభిషేక్కుమార్ మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అభిషేక్ బావ రూపేష్రామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం వన్టౌన్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
గూగూడు కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం
నార్పల: గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తిరుమల కొండన్న వంశీయులు కుళ్లాయిస్వామి పీరును భద్రపరిచే పెట్టెను కిందకు దింపి.. సుగంధ ద్రవ్యాలతో శుభ్రం చేశారు. కుళ్లాయిస్వామి ప్రతిమకు, అగ్ని గుండానికి ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి దివిటీల వెలుగులో, సన్నాయి వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు, బంగారు గొలుసుల నడుమ కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం భక్తులకు కల్పించారు. ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు గూగూడు ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా గట్టి బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ జగదీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన గూగూడు గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఆలయ పరిసరాలు, పికెట్లు, గ్రామంలోని రహదారులు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశులు, సీఐ కౌలుట్లయ్య, ఎస్ఐ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
అరాచకాలను తిప్పికొట్టాలి
మహిళలకు రక్షణ కరువు బుక్కరాయసముద్రం/శింగనమల: చంద్రబాబు ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజలకు చేసిన మోసాలను లెక్కలతో సహా వివరిద్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెడ్బుక్ మాటున సాగిస్తున్న అరాచకాలకు, బెదిరింపులకు భయపడేది లేదన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. శింగనమల నియోజకవర్గానికి సంబంధించి బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఇదే వేదిక నుంచి ‘రీ కాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ పోస్టర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిఽథున్రెడ్డి, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్రెడ్డి, రమేష్రెడ్డి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీచరణ్, నియోజకవర్గ సమన్వయకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, తలారి రంగయ్య, ఈరలక్కప్ప, దీపిక, మక్బుల్ అహ్మద్, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అధికార ప్రతినిధి ఎంపీ గోరంట్ల మాధవ్, పీఏసీ సభ్యులు మాలగుండ్ల శంకరనారాయణ, మహాలక్ష్మి శ్రీనివాస్, అనంతపురం మేయర్ వసీం, టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్ గౌడ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల నాయక్, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు పెన్నోబిలేసు, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి కృష్ణవేణి, పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు సోమశేఖర్రెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథులకు తహసీల్దార్ కార్యాలయం వద్ద నాయకులు స్వాగతం పలికారు. అక్కడే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ జెండా అవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి సిద్దరాంపురం రోడ్డు మీదుగా వైఎస్సార్సీపీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ప్రజలను మోసగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలందరికీ గుర్తు చేయడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. 2019–24 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. 5 ఏళ్ల పాలనతో జగనన్న రాష్ట్రాన్ని పదేళ్లు ముందుకు తీసుకెళితే చంద్రబాబు ప్రస్తుత ఏడాది పాలనలో రాష్ట్రాన్ని 15 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్పర్సన్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీలు భాస్కర్, భోగాతి ప్రతాప్రెడ్డి, నాయకులు నరేష్, సర్పంచ్ పార్వతి, పూల నారాయణస్వామి, నందినేని మల్లికార్జున, గువ్వల శ్రీకాంత్రెడ్డి, నారాయణరెడ్డి, రాజశేఖర్రెడ్డి, బొమ్మన శ్రీరామిరెడ్డి, తరిమెల వంశీ గోకుల్రెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, రఘనాథరెడ్డి, ముత్యాల శీనా, పురుషోత్తం, పెద్ద కొండయ్య, చికెన్ నారాయణస్వామి, శ్రీనివాస రెడ్డి, ఆది, తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు తోడుగా ఉంటా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలామంది బాలికలు మిస్సింగ్ అవుతున్నా మహిళా పక్షపాతి అని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం నోరుమెదపరన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బాలికలపై అత్యాచారాలు జరిగితే సీఎం, హోంమంత్రి, డిప్యూటీ సీఎం కానీ పరామర్శించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టకపోయినా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. హామీల అమలులో ఘోరంగా విఫలం బెదిరింపులు, కేసులకు భయపడేది లేదు వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల వైఎస్సార్సీపీ కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక అధికార పార్టీ నాయకులు రెడ్బుక్ మాటున అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ వారు ఇసుక, ఎర్రమట్టి, రేషన్ బియ్యం దందా కోసం కొట్టుకుచస్తున్నారన్నారు. నాణ్యమైన చదువు, నాణ్యమైన మందులు, నాణ్యమైన భోజనం ఇస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రులను చూశాం కానీ.. నేడు నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడడం పిరికిపంద చర్య అని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ఖండించారు. అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా ఉంటామన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వాటిని ఏమాత్రం పట్టించు కోకుండా చంద్రబాబు నుంచి గ్రామస్థాయి నాయకుల వరకు అవినీతి అక్రమాల్లో మునిగిపోయారన్నారు. హామీలు అమలు చేయకుంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. -
అత్యాశ అస్త్రం.. అథఃపాతాళం
లుక్.. అవుట్ ● అనంతపురంలోనే 3 వేల మంది బాధితులు ● రూ.కోట్లు లూటీ చేశాక యాప్ క్లోజ్ ● పోలీస్స్టేషన్లకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు అనంతపురం: అత్యాశ అస్త్రానికి ఎందరో అమాయకులు బలయ్యారు. ఓ డొల్ల కంపెనీ ప్రవేశ పెట్టిన ‘లుక్’ యాప్కు ఆకర్షితులైన వారు అందులో డిపాజిట్లు పెట్టి.. నిలువునా మోసపోయారు. రూ.కోట్లు కొల్లగొట్టి యాప్ క్లోజ్ చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయండంటూ అనంతపురం నగరంలో సైబర్ విభాగానికి, ఆయా పోలీస్స్టేషన్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క అనంతపురం నగరంలోనే ‘లుక్’ బాధితులు మూడువేల మంది దాకా ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. సింహభాగం సైబర్ కాల్ సెంటర్కు ఫిర్యాదులు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన కుంభకోణం కావడంతో రికవరీకి ఎన్ని రోజులు పడుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. పక్కా కుట్ర.. ‘లుక్’ పేరుతో యాప్ రూపొందించి వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. డబ్బు డిపాజిట్ చేస్తే ప్రతి వారం ఆదాయం పొందవచ్చని కొంతమంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రచారం చేయడంతో ఎక్కువమంది ఆకర్షితులయ్యారు. యాప్లో 9 రకాల స్కీంలు ప్రవేశపెట్టారు. రూ.2,250 నుంచి మొదలై .. గరిష్టంగా రూ.75.6 లక్షల వరకు డిపాజిట్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. యాప్లో చేరిన వారందరికీ ఒక వాట్సాప్ గ్రూపులో చేర్చి ఎప్పటికప్పుడు స్కీంల సమాచారాన్ని పోస్ట్ చేస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 17 వేల నుంచి 20 వేల మంది సభ్యులు ఉన్నారు. యాప్లో చేరిన వారికి అనుమానం రాకుండా తొలుత పక్కాగా చెల్లింపులు చేశారు. సేవా కార్యక్రమాల పేరుతో గాలం నిర్వాహకులు యాప్కు ప్రచారం కల్పించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించారు. విస్తృతంగా సభ్యులుగా చేరిన ప్రాంతాలను ఎంపిక చేసి.. ఆయా ప్రాంతాల్లో పేదలకు నిత్యావసర సరుకులు, పుస్తకాలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. అనంతపురంలోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం లుక్ యాప్ పేరుతో జరిగిన మోసానికి బలైన బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. బాధితులు సైబర్ క్రైం సెల్తో పాటు ఆయా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. నేర తీవ్రతను బట్టి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –షేక్ జాకీర్ హుస్సేన్, సైబర్ క్రైం సీఐ -
అమలుకాని ఆదేశాలు
● సబ్డివిజన్ కోసం రైతుల అగచాట్లు ● దరఖాస్తు రుసుం స్వీకరించని సచివాలయ సిబ్బంధి ● 30వ తేదీతో ముగియనున్న ప్రత్యేక డ్రైవ్ అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం రైతులతో చెలగాటం ఆడుతోంది. ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. అధికారులు చెప్పారు కదా అని సచివాలయానికి వెళ్లిన రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఈ నిర్లక్ష్యం రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రత్యేక సబ్డివిజన్ డ్రైవ్ అమలులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. భూముల రీ–సర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్ ఎల్పీఎంలు సబ్డివిజన్ చేసుకునేందుకు ‘ప్రత్యేక సబ్డివిజన్ డ్రైవ్’ నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సబ్డివిజన్కు సంబంధించి రూ.500 రుసుం మినహాయింపు పోగా దరఖాస్తు రుసుము నామమాత్రంగా రూ.50 సచివాలయంలో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ అవకాశం ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకున్నవారికే ఉంటుందని స్పష్టం చేశారు. రుసుము స్వీకరణకు నో సబ్డివిజన్ కోసం సచివాలయాలకు వెళ్లిన రైతుల నుంచి సిబ్బంది దరఖాస్తు రుసుం కట్టించుకోవడం లేదు. ఇది తమకు సంబంధం లేదని, రెవెన్యూ శాఖ చూసుకుంటుందని చెబుతుండడంతో రైతులు ఏమిచేయాలో దిక్కుతోచక వెనుతిరుగుతున్నారు. అధికారులేమో సచివాలయంలో చెల్లించాలని చెబుతున్నారు.. ఇక్కడికొస్తే మాకు సంబంధం లేదంటున్నారని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితిని బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు–2 (బోడిగానిదొడ్డి) సచివాలయం పరిధిలోని రైతులు ఎదుర్కొన్నారు. మిగిలింది మూడు రోజులే.. ప్రత్యేక సబ్డివిజన్ డ్రైవ్కు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఈ నెల 30తో ముగియనుంది. దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజులు మాత్రమే ఉంది. గడువు ముగిసిన తరువాత సబ్డివిజన్ చేసుకునేందుకు రైతు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒకరకంగా రైతుకు భారమే అవుతుంది. -
రూ.3.03 కోట్ల విలువజేసే సెల్ఫోన్ల అందజేత
అనంతపురం: ‘చాట్బాట్’ ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా రికవరీ చేసిన రూ.3.03 కోట్ల విలువ చేసే 1,216 మొబైల్ ఫోన్లను శుక్రవారం అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మేళాలో ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా అందజేశారు. ఇప్పటి వరకు జిల్లా పోలీసు శాఖ 12,594 మొబైల్ ఫోన్లను అందజేసింది. వీటిన్నింటి విలువ రూ.24.11 కోట్లు అని పోలీసుల శాఖ పేర్కొంది. పోయిన ఫోన్లు తిరిగి చేతికి అందడంతో బాధితుల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీకి గురైనా.. అవి ఇతర రాష్ట్రాలకు చేరినా రికవరీ విషయంలో జిల్లా పోలీసులు రాజీ పడలేదు. ఇప్పటి వరకు రికవరీ చేసిన 12,594 ఫోన్లలో దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో బాధితులకు ముట్టజెప్పిన ఫోన్లు 1179, మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా కాకుండా తక్కిన జిల్లాల్లో 2,795 ఫోన్లు అందజేశారు. అందజేసిన మొబైల్ ఫోన్ విలువ రూ.499 నుంచి రూ.1,41,000 వరకు ఉంది. 2022 జూన్ 26న జిల్లా పోలీసు శాఖ ‘చాట్బాట్’ సేవలు ప్రారంభించి.. చోరీకి గురైనా లేదా మిస్ అయినా మొబైల్ ఫోన్ల జాడ కనుక్కుని రికవరీ చేసి ప్రజలకు అందజేస్తోంది. సెల్ఫోన్ దుకాణం నిర్వాహకులైనా, వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని ఎస్పీ సూచించారు. అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్ వివరాలు కలిగిన బాక్సు ఉంటే కొనుగోలు చేయాలని తెలిపారు. 10 నుంచి హెచ్చెల్సీకి నీటి విడుదల బొమ్మనహాళ్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు జూలై పదో తేదీన నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. శుక్రవారం బెంగళూరులోని విధాన సౌధ సమావేశ మందిరంలో 124వ ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. హెచ్చెల్సీకి జూలై పది నుంచి 31వ తేదీ వరకు సగటున 700 క్యూసెక్కులు, ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ 30 వరకు 1,300 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయనున్నారు. తుంగభద్ర జలాశయానికి ఉన్న 33 క్రస్ట్ గేట్లలో 19వ క్రస్ట్ గేటు గతేడాది కొట్టుకుపోవడం, మిగిలిన 32 గేట్లు కూడా దెబ్బతినడం వల్ల నిపుణుల సూచన మేరకు వాటిని మార్చాలని టీబీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయంలో గేట్ల అంచు వరకు 80 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని నిబంధన పెట్టారు. టీబీడ్యాంకు 157 టీఎంసీల నీరు చేరుతాయని అంచనా వేసిన అధికారులు.. వాటా ప్రకారం వివిధ కాలువలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పోటెత్తిన వరద తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతం 44,569 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా.. డ్యాంలో 57 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన ఉన్న శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి , చిక్కమంగళూరు, వరనాడుతో పాటు జలాశయం పరిసరాల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో ఇన్ఫ్లో మరింత పెరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో టీచర్లకు గాయాలు ఉరవకొండ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయులు గాయపడ్డారు. అనంతపురం నుంచి 15 మంది ఉపాధ్యాయులు పాల్తూరు వరకు గల వివిధ పాఠశాలల్లో విధులకు వెళ్లేందుకు శుక్రవారం తుఫాన్ వాహనంలో బయల్దేరారు. ఉరవకొండ మండలం కోనాపురం సమీపంలోకి రాగానే పొలంలోంచి ఓ ట్రాక్టర్ ఉన్నపళంగా రోడ్డుపైకి వచ్చింది. దాన్ని తప్పించేందుకు ప్రయత్నించి తుఫాన్ వాహన డ్రైవర్ కుడివైపునకు తిప్పబోయాడు. ఈ క్రమంలో అదుపుతప్పి వాహనం బోల్తాపడింది. ఇద్దరు ఉపాధ్యాయులు తీవ్రంగా, మరో 13 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఆ వెనుకే మరో వాహనంలో వస్తున్న ఇతర ఉపాధ్యాయులు వెంటనే 108 సిబ్బందికి సమాచారమందించి గాయపడిన వారిని ఉరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేస్తున్న ఎస్పీ జగదీష్ -
చిత్తశుద్ధితో పనిచేయండి
అనంతపురం అర్బన్: ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉత్తమ జిల్లాగా నిలిపేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో సానుకూల అవగాహనపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల పరిధిలో ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రభావవంతంగా అమలు చేయాలన్నారు. సానుకూల అవగాహనపై జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, జిల్లా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అధికారుల పనితీరు మారాలి ‘సేవలందించడంలో అధికారుల ప్రవర్తన సరిగాలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. మీ వైఖరి కారణంగా పలు అంశాల్లో జిల్లా ర్యాంకింగ్ తగ్గిపోతోంది. క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలులో అధికారుల పనితీరు, ప్రవర్తనలో మార్పు రావాలి’ అని ఆదేశించారు. ప్రధానంగా రెవెన్యూ, సర్వే శాఖల పరిధిలో ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించేవారిపైనా, వైఫల్యం చెందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫైళ్లు పక్కాగా ఉండాలి చుక్కల భూములు, 22ఏ జాబితా ఫైళ్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. చుక్కల భూముల క్లెయిమ్ల పరిష్కారంపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా డాటెడ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 22ఏ (నిషేధిత భూముల) జాబితాలోని 12 క్లెయిమ్లను ఆమోదించారు. చుక్కల భూములకు సంబంధించి 24 ఆమోదించారు. -
వ్యవస్థలు నాశనం
పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను కూటమి సర్కారు నాశనం చేసిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్ష నేతలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేసులు పెడతామని, భూములను లాక్కుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడవద్దని అన్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామన్నారు. అధికారులు, పోలీసులుకు భారత రాజ్యాంగం ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చారని, దానికి లోబడే పని చేయాలని హితవు పలికారు. రెడ్బుక్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తించి విమర్శలపాలు కావొద్దని పోలీసు అధికారులకు సూచించారు. -
అశాసీ్త్రయ బదిలీల ప్రక్రియతో నష్టం
● సమస్యలకు పరిష్కారం చూపాలి ● కలెక్టరేట్లో గ్రామ సర్వేయర్ల నిరసన అనంతపురం అర్బన్: సమస్యలు పరిష్కరించకుండా చేపట్టనున్న అశాసీ్త్రయ బదిలీల ప్రక్రియతో తీరని నష్టం వాటిల్లుతోందని గ్రామ సర్వేయర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీల ప్రక్రియలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్వేయర్ల సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఆవరణలో సర్వేయర్లు ప్లకార్డులతో నిరసన తెలిపారు. సంఘం అధ్యక్షుడు అరుణ్నాయక్ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన కాకుండా రెవెన్యూ గ్రామ విస్తీర్ణం ప్రామాణికంగా తీసుకుని హేతుబద్దీకరణ చేయాలన్నారు. హేతుబద్ధీకరణ చేస్తున్న సర్వేయర్లను వారి సమ్మతి మేరకే బదిలీల కౌన్సెలింగ్ చేపట్టాలన్నారు. ఉద్యోగుల అభిమతానికి అనుగుణంగా ఇతర శాఖలు కేటాయించాలన్నారు. పదోన్నతులు కల్పించిన తరువాత సీనియారిటీ ప్రాతిపదికన హేతుబద్ధీకరణ పూర్తి చేసి బదిలీలు చేయాలన్నారు. అడవులు, ముళ్లపొదల్లో వెళ్లి సర్వే చేసే తమకు రిస్క్ అలవెన్స్లు ఇవ్వాలన్నారు. సమస్యలను పరిష్కరించే వరకూ నిరసనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు సునీల్కుమార్, దామోదర్, మల్లికార్జున, ప్రతాప్, జోత్స్న, గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. పత్తి తూకంలో మోసం బొమ్మనహాళ్: మండలంలోని కృష్ణాపురం గ్రామంలో పత్తి తూకంలో మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన పత్తి వ్యాపారులు మూడు రోజులుగా కృష్ణాపురం గ్రామంలో పత్తి కొనుగోళ్లు చేపట్టారు. గ్రామానికి చెందిన రైతులు తిప్పేస్వామి, వన్నూరుస్వామి, కొత్తపల్లి తిప్పయ్య, సుబ్బుతో పాటు మరికొందరు రైతులకు చెందిన పత్తిని గురవారం క్వింటా రూ.7,400 నుంచి రూ.7,800 వరకు కొనుగోలు చేశారు. కాటా వేస్తున్న సమయంలో మోసాలకు తెరలేపారు. దీంతో రైతు తిప్పేస్వామికి అనుమానం వచ్చి పరిశీలించగా క్వింటాకు 20 కేజీలు తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో రైతులు చుట్టుముట్టి నిలదీయడంతో వ్యాపారులు అక్కడి నుంచి పారిపోయారు. దళారులు జోక్యం చేసుకోని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి 250 క్వింటాళ్ల పత్తికి నగదు కట్టించేలా చర్యలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బొమ్మనహాళ్ పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా రైతులు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని తెలిపారు. మాదక ద్రవ్యాల నివారణకు సమష్టి కృషి అనంతపురం: మాదక ద్రవ్యాల నివారణకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణ దినం సందర్భంగా గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని యువతకు సూచించారు. ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలను వినియోగించిన, అమ్మిన, నిల్వ ఉంచినా, అక్రమ రవాణా చేసినా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారని పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్ పాల్గొన్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. వ్యక్తి ఆత్మహత్య గుంతకల్లు టౌన్: స్థానిక రైల్వేస్టేషన్ పార్సిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్క్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం సాయంత్రం అటుగా వెళ్లిన ప్రయాణికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని పరిశీలించారు. చొక్కా జేబులో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు కర్నాటకలోని రాయచూర్ జిల్లా గుడెదనాల్కు చెందిన శరణప్ప(39)గా గుర్తించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. పనస కాయల వాహనం బోల్తా కనగానపల్లి: బెంగళూరు నుంచి అనంతపురానికి పనస కాయల లోడ్తో వెళుతున్న బొలెరో వాహనం కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై బోల్తాపడింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మామిళ్ల పల్లి సమీపంలోని గ్లాస్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే వాహనం ముందరి టైర్లు రెండూ ఒక్కసారిగా పేలాయి. దీంతో రోడ్డుకు అడ్డంగా వాహనం బోల్తాపడింది. పనస కాయలన్నీ రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. ఘటనతో రూ.30 వేల మేర నష్టం వాటిల్లినట్లు అనంతపురానికి చెందిన వ్యాపారి పోతులయ్య వాపోయాడు. కాగా, ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. -
వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ పంపిణీ
రాప్తాడురూరల్: 60 ఏళ్లు పైబడిన వారికి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేపట్టాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి గ్రామంలో 60 ఏళ్లు నిండిన వృద్ధుల ఇళ్ల వద్దకు వెళి్ల్ల్ స్వయంగా ఆయన రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30లోపు ప్రకియను పూర్తి చేయాలని ఆదేశించారు. విషయం మీకు తెలియజేశారా అంటూ వృద్ధురాలు నారాయణమ్మతో ఆరా తీశారు. బియ్యం నాణ్యత బాగుందా అని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మోహన్కుమార్, రేషన్షాపు డీలర్ యమున, ఆర్ఐ సందీప్, వీఆర్ఓ రామకృష్ణ, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ప్రతి నెలా 26 నుంచి 30 వరకూ.. గార్లదిన్నె: ప్రతి నెలా 26 నుంచి 30వ తేదీ లోపు వృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేయాలని జేసీ శివ్ నారాయణ్ శర్మ పేర్కొ న్నారు. గురువారం ఆయన గార్లదిన్నెలో పర్యటించారు. రేషన్ షాపు తనిఖీ చేశారు. అనంతరం జగనన్న లేఅవుట్ను పరిశీలించారు. లోకాయుక్తకు సంబంధించి భూమి సమస్యపై విచారించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, తహసీల్దార్ ఈరమ్మ పాల్గొన్నారు. -
సచివాలయ ఉద్యోగులకు ‘ఐడీ’ తప్పనిసరి
● కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం ఎడ్యుకేషన్: సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల విధులపై ఆరా తీశారు. ఐడీ కార్డులు ధరించని వారిపై క్రమశిక్షణ చర్యలుంటాయని హెచ్చరించారు. సచివాలయంలో నీరు రావడం లేదని వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ మోహన్కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్కుమార్, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు అనంతపురం: అనారోగ్యంతో మృతి చెందిన అనంతపురం డీటీసీ సీఐ పవన్కుమార్ మృతదేహానికి గురువారం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు శాఖలో 1996లో ఎస్ఐగా చేరారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బంధువులు, స్నేహితులు, అధికారులు, బ్యాచ్మేట్ల సందర్శనార్థం ఆయన మృతదేహాన్ని అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న స్వగ్రహంలో ఉంచారు. అనంతరం గురువారం పిల్లిగుండ్ల కాలనీ సమీపంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, సీఐలు దేవానంద్, శేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అడహాక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్నాథ్, ఆర్ఎస్ఐ జాఫర్, సూర్యకుమార్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. మత్తుకు బానిస కావొద్దు అనంతపురం: మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా అనంతపురం నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో జిల్లా ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ఫ్యాషన్ పేరుతో యువత గంజాయికి బానిసలుగా మారుతోందని, దీంతో తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల ప్రభావం గురించి వివరించారు. చట్టంలో విధించే శిక్షలపై అవగాహన కల్పించారు. మత్తుకు బానిసలు కావొద్దని పిలుపునిచ్చారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. తమకు తెలియకుండానే డ్రగ్స్ వలలో విద్యార్థులు చిక్కుకుంటున్నారని పేర్కొన్నారు. చెడు స్నేహాలతో మంచి విద్యార్థులు కూడా క్రమంగా వ్యవసనాల బారినపడుతున్నారన్నారు. డ్రగ్స్ వినియోగం నుంచి విక్రయదారులుగా మారుతుండడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.రామ్మోహన్రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీరామ్, రేవతి, ఎస్ఎస్బీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ సరితారెడ్డి పాల్గొన్నారు. -
శ్రీసత్యసాయిజిల్లాలో వరుస హత్యలు
శ్రీసత్యసాయిజిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. భార్యపై అనుమానంతో ఓ యువకుడిని మరొకరితో కలసి రెండు రోజుల క్రితం భర్త మట్టుబెట్టగా గురువారం వెలుగు చూసింది. మరో ఘటనలో జిల్లా సరిహద్దున కర్ణాటక ప్రాంతంలో మద్యం మత్తులో చోటు చేసుకున్న గొడవలో హిందూపురం మండలానికి చెందిన ఓ యువకుడు హతమయ్యాడు. అనుమానం పెనుభూతమై.. లేపాక్షి: భార్యపై అనుమానంతో ఓ యువకుడిని వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన ఘటన గురువారం లేపాక్షి మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన రవికుమార్ (37)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి అశ్వత్థప్పతో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో తన ఇంటికి సమీపంలో నివాసముంటున్న బంధువు ఆనంద్ కుటుంబంతో రవికుమార్ చనువుగా ఉండేవాడు. తరచూ ఇంటికి రాకపోకలు సాగిస్తుండడంతో తన భార్య ప్రవర్తనపై అనుమానాలు పెంచుకున్న ఆనంద్ ఎలాగైనా రవికుమార్ను హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంలో తన సోదరుడు గోవిందప్పతో కలసి పథకం రచించాడు. ఇందులో భాగంగానే మంగళవారం రాత్రి స్థానిక రైతు లింగప్ప తోటలో మందు పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపి రవికుమార్ను రప్పించుకున్నారు. ముగ్గురూ కలసి మద్యం సేవించారు. అదే సమయంలో మత్తులో జోగుతున్న రవికుమార్పై వేటకొడవలితో దాడి చేయడంతో మొండెం నుంచి తల వేరుపడింది. అనంతరం మృతదేహాన్ని నీటి గుంతలో గొయ్యి తీసి పాతిపెట్టారు. బుధవారం తెల్లవారినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో అశ్వత్థప్ప ఆరా తీయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆనంద్, గోవిందప్ప ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అసలు విషయం బయటపడడంతో నీటి గుంతలో పాతిపెట్టిన మృతదేహాన్ని గురువారం వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. ఘటనపై మరింత లోతైన విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్ర తెలిపారు. మద్యం మత్తులో... గౌరిబిదనూరు/హిందూపురం: మండల పరిధిలోని తూముకుంట చెక్పోస్టు ప్రాంతంలో నివాసముటున్న రవికుమార్ (37) జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలో దారుణ హత్యకు గురయ్యాడు. వెల్డర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న అతనికి భార్య అనుపమ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిస కావడంతో అతనిలో మార్పు తీసుకువచ్చేందుకు భార్య విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా మార్పు రాకపోవడంతో 4 ఏళ్ల క్రితం భర్తను వదిలేసి పిల్లలను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె రాలేదు. దీంతో ఒంటరిగా మారిన రవికుమార్ ఎప్పుడూ మద్యం మత్తులో జోగుతూ జులాయిగా తిరగసాగాడు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలోని గంగోత్రి బార్ వద్దకు గురువారం వెళ్లిన అతను సాయంత్రం మద్యం మత్తులో జోగసాగాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న హిందూపురంలోని బాపూజీనగర్కు చెందిన ఆటో డ్రైవర్ అశోక్తో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరూ పరస్పరం కొట్టుకున్నారు. గొడవ తారస్థాయికి చేరుకోవడంతో ఆటో డ్రైవర్ బీరు బాటిల్ ముక్క తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశాడు. వరుస పోట్లకు గురి కావడంతో రవికుమార్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న కర్ణాటకలోని గౌరిబిదనూర్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సీసీ ఫుటేజీలను సేకరించారు. ఘటనపై గౌరిబిదనూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. భార్యపై అనుమానంతో లేపాక్షి మండలంలో ఓ యువకుడి హత్య మంగళవారం రాత్రి వేటకొడవళ్లతో నరికి హతమార్చిన వైనం పోలీసుల అదుపులో నిందితులు జిల్లా సరిహద్దున కర్ణాటక పరిధిలో గురువారం తూముకుంట వాసి హత్య -
రైళ్లల్లో కొరవడిన భద్రత
●రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు ●ప్రయాణికుల సొమ్ముకు రక్షణ కరువు ●నిద్రావస్థలో రైల్వే పోలీసులు గుంతకల్లు: రైలు ప్రయాణమంటనే ప్రయాణికులు హడలెత్తిపోయే రోజులు వచ్చాయి. ముఖ్యంగా దుండగులు ఆర్ధరాత్రి సమయాల్లో సిగ్నల్ కోసం వేచి చూస్తూ రైల్వేస్టేషన్ ఔటర్ ప్రాంతాల్లో నిలిపిన రైళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు తెరలేపడమే ఇందుకు కారణం. ఇంత జరుగుతున్న రైల్వే ఎస్కార్ట్, నిఘా వ్యవస్థలు నిద్రావస్థలో ఉండిపోయాయి. రైళ్లల్లో గస్తీ నిర్వహించే పోలీసులు ఏసీ బోగీల్లో నిద్రపోతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రైళ్లలో జరిగిన చోరీలు.. ● ఈ ఏడాది ఏప్రిల్ 29న నిజాముద్దీన్–తిరుపతి మధ్య నడిచే రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలు గుత్తి జంక్షన్ సమీపంలో ఔటర్లో సిగ్నిల్ ఇవ్వకపోవడంతో నిలిచిపోయింది. ఇదే అదనుగా భావించిన దుండగులు ముందస్తు పథకం ప్రకారం దాదాపు నాలుగు స్లీపర్ బోగీల్లోకి చొరబడి మారణాయుధలతో ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ 10 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించారు. ● మూడేళ్ల కిత్రం వరురసగా హంపి, రాయలసీమ, చైన్నె ఎక్స్ప్రెస్ రైళ్లు అదే ఔటర్లో సిగ్నల్ కోసం నిలిపిన సమయంలో దుండగులు చొరబడి దాదాపు 30 తులాలకు పైగా విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. ● గుత్తి–అనంతపురం రైలు మార్గంలోని తురకపల్లి రైల్వేస్టేషన్, గుత్తి–తాడిపత్రి రైలు మార్గంలోని జక్కలచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ వైర్లును కట్ చేయడంతో రైలు ముందుకు పోవడానికి అవకాశం లేకుండా చేసి, ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణలు ఎత్తుకెళ్లారు. ● తాజాగా (గడిచిన సోమవారం వేకువజాము) తాడిపత్రి రైల్వేస్టేషన్ ఔటర్లో సిగ్నల్ వైర్లను కట్ చేసి కోమలి రైల్వేస్టేషన్ ఔటర్లో నిలిచిన ముంబై–చైన్నె ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికురాలు విశాలక్ష్మి మెడలోని 2.7 తులాల బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు. అదే రోజు రాత్రి పాండిచ్చేరి–కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికురాలు దివ్వభారతి మెడలోని 3.5 తులాల బంగారు చైన్ను లాక్కొని ఉడాయించారు. గుత్తి రైల్వేస్టేషన్లో ఆగిన రైలు కిటికి వద్ద కూర్చొన్న ఓ ప్రయాణికుడి చేతిలోని ఖరీదైన సెల్ఫోన్ను అపహరించారు. వేధిస్తున్న సిబ్బంది కొరత గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధి 12 జిల్లాలకు విస్తరించి ఉంది. ఇందులో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు. కడప, నంద్యాల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని ఆర్పీఎఫ్, జీఆర్పీలతోపాటు కర్ణాటకలోని రాయచూర్, బళ్లారి జిల్లాలకూ గుంతకల్లు రైల్వే పోలీస్ కేంద్రంగా ఉంది. గుంతకల్లు డివిజన్ వ్యాప్తంగా 900 మంది పోలీసులు అవసరం కాగా, ప్రసుత్తం 550 మంది మాత్రమే ఉన్నారు. 350కి పైగా ఖాళీలు ఉన్నాయి. డివిజన్ వ్యాప్తంగా రోజూ 300కు పైగా ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే గుంతకల్లు, గుత్తి రైల్వేజంక్షన్ల మీదుగా రాత్రి పూట దాదాపు 50కి పైగా ఎక్స్ప్రెస్ రైళ్లు తిరుగాడుతున్నాయి. ఈ రైళ్లకు 20 నుంచి 24 బోగీలు ఉంటాయి. రాత్రి పూట తిరిగే ఎక్స్ప్రెస్ రైళ్లలో కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే ఎస్కార్ట్గా కేటాయిస్తున్నారు. స్టాఫ్ తక్కువగా ఉండటంతో ఉన్న సిబ్బందితోనే 24 గంటలు విధులు నిర్వహిస్తుండటంతో విశ్రాంతి లేక జీఆర్పీ, ఆర్పీఎఫ్లు ఒత్తిడికి లోనువుతున్నారు. ప్రయాణికుల రక్షణే ధ్యేయం ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా ఉన్న కొద్ది పాటి సిబ్బందితో ర్యాండమ్గా రైళ్లలో బందోబస్తు చేపడుతున్నాం. జీఆర్పీ సిబ్బంది ఇద్దరితో పాటు ఆర్పీఎఫ్కు చెందిన మరో కానిస్టేబుల్కు రైళ్లలో ఎస్కార్టు విధులు కేటాయిస్తున్నాం. సమస్యాత్మక రైలు మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు సేకరిస్తున్నాం. – హర్షిత, జీఆర్పీ ఇన్చార్జ్ డీఎస్పీ, గుంతకల్లు -
లుక్ పేరుతో బుక్ చేసేశారు!
అనంతపురం: రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేల ఆదాయం వస్తుందని నమ్మించారు. రూ.20,300 చెల్లిస్తే.. నిత్యం రూ.700 ఆదాయం వస్తుందని గాలం వేశారు. చివరికి రూ.కోట్లలో డిపాజిట్ చేయించుకుని బుక్ చేసేశారు. ‘లుక్’ పేరిట ఆన్లైన్లో సామన్యుల నుంచి అత్యున్నత స్థాయి వారిని ఆకర్షించి సొమ్మును డిపాజిట్ చేయించుకుని బోర్డు తిప్పేసిన ఓ ముఠా సాగించిన వ్యవహారమిది. వివరాలు.. అమెరికన్ కంపెనీ ‘లుక్’ పేరుతో యాప్ను ప్రవేశపెట్టారు. పుస్తకాలు, గ్రంథాలు ఆన్లైన్లో చదివే ‘లుక్’ యాప్లో చందాదారుల పేరుతో దోపిడీ ప్రారంభించారు. రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేలు ఆదాయం వస్తుందని నమ్మించారు. ప్రతి బుధవారం నగదు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. రూ.20,300 చెల్లిస్తే.. రోజూ రూ.700 ఆదాయం వస్తుంది. ప్రతి రోజూ యాప్లో 25 టాస్క్లు ఉంటాయి. వీటిపై క్లిక్ చేస్తే ఒక్కో టాస్క్కు రూ.28లు నగదు క్రెడిట్ అవుతుంది. ఇలా ప్రతి బుధవారం నగదు డ్రా చేసుకోవచ్చు. కొత్త ఖాతాదారులను చేర్పిస్తే 30 శాతం వెంటనే నగదు ఖాతాలోకి జమ అవుతుంది. ఇలా ప్రారంభంలో అత్యంత నమ్మకంగా, కచ్చితంగా మొత్తాలను చెల్లించారు. అనంతపురం నగరంలోనే రూ.20 వేల చందాదారులు వేలల్లో ఉన్నారు. రూ.2.50 లక్షల చందాదారులు వందల్లో ఉన్నారు. బుధవారం డ్రా చేసుకునేందుకు క్లిక్ చేయగా, తక్షణమే 30 శాతం చెల్లిస్తే.. ఈ 30 శాతం ఖాతాలో ఉన్న మొత్తం అంతా డ్రా చేసుకోవచ్చని యాప్లో మెసేజ్ చేశారు. దీంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పోటీ పడి నగదు డిపాజిట్ చేశారు. అప్పులు చేసి మరీ డిపాజిట్ చేశారు. బుధవారం రాత్రి రూ.2.50 లక్షలు చెల్లించిన వారే అధికంగా ఉన్నారు. రూ.20 వేలు చెల్లించిన చందాదారులు తక్షణమే రూ.6,090 చెల్లించాలి. లేదంటే ఖాతా క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఉన్న ఫలంగా రూ.6,090 చెల్లించారు. ఇలా ఖాతాదారులకు అత్యాశ చూపించి బుధవారం రాత్రే అధికంగా మొత్తాలను కట్టించుకున్నారు.డబ్బు డ్రా చేయడంతో బ్యాంకు ప్రాసెస్లో ఉందంటూ గురువారం రాత్రి యాప్లో డేటాను తొలగించేశారు. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ‘లుక్’ పేరుతో కోట్లాది రూపాయలు దోచేశారని ఆందోళన చెందుతున్నారు. సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సైబర్ క్రైం హెల్ప్లైన్ నెంబర్ 1930కు ఫోన్లు చేస్తున్నారు. సైబర్ ముఠా పనేనా: ప్రజలకు ఆశ చూపి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. సైబర్ క్రైం నిపుణుల పన్నాగమేనని భావిస్తున్నారు. ఆశ చూపి కోట్లు కొల్లగొట్టడమే కాకుండా.. ప్రజల బ్యాంకు ఖాతాలను సైతం యాప్లో అప్లోడ్ చేశారు. వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని యాప్ ద్వారా సేకరించి ఉంటారు. ఇలాంటి యాప్ల ద్వారా డబ్బు సంపాదిస్తే.. సదరు బ్యాంకు ఖాతాలను ఆయా మేనేజర్లు ఫ్రీజ్ చేస్తున్నట్లు తెలిసింది. సైబర్ క్రైం జరిగే అవకాశం ఉండడంతో మేనేజర్లు ముందస్తుగా ఫ్రీజ్ చేస్తున్నారు. ఇలాంటి యాప్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తే మరో వైపు బ్యాంకు రుణాలు ఇచ్చే అవకాశం ఉండదు. రూ.వందల కోట్లు డిపాజిట్ చేయించుకుని మోసం చేసిన వైనం రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేల ఆదాయం అంటూ గాలం అపరిమితంగా ఖాతాదారులను పెంచుకుని బురిడీ -
బాల్య వివాహాలు అరికట్టాలి
అనంతపురం అర్బన్: ‘జిల్లాలో బాల్యవివాహాలను అరికట్టాలి. ఈ విషయంలో సంబంధిత అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. బాల్యవివాహలు జరిపించేవారితో పాటు ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేయండి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలతో కలిగే దుష్ప్రభావాలపై స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మండల, గ్రామస్థాయి, విద్యాసంస్థల్లో బాలికలకు అవగాహన కల్పించాలన్నారు. బాలికలు కనపడడం లేదంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారితో సున్నితంగా మాట్లాడాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో బాలికలను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లలో భాగస్వాముల్ని చేయాలన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ నాగమణి, జెడ్పీ సీఈఓ శివశంకర్, తదితరులు పాల్గొన్నారు. డీఎంఎఫ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా మినరల్ ఫండ్స్(డీఎంఎఫ్)తో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ మినరల్ ఫండ్స్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2024–25లో 116 పనులకు రూ.11.72 కోట్లు మంజూరు చేస్తే ఇప్పటి వరకు 10 పనులు మాత్రమే పూర్తి చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యధిక ప్రాధాన్యత కింద రూ.4 కోట్లతో 27 పనులకు ప్రతిపాదనలు వచ్చాయని, చెక్లిస్ట్ ప్రకారం నివేదికలను ఆయా శాఖలకు అధికారులు అందజేయాలని చెప్పారు. ఇప్పటికే మంజూరై మొదలు పెట్టని పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి వాటిని చేపట్టాలో వద్దా అనేదానిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
నేడు వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభోత్సం
శింగనమల: బుక్కరాయసముద్రంలో శుక్రవారం శింగనమల నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు మాజీ మంత్రి, పార్టీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ తెలిపారు. గురువారం బుక్కరాయసముద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ పీవీ మిథన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి, రమేష్రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, పార్టీ ముఖ్యనాయకులు హాజరవుతారన్నారు. నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ భాస్కర్, మండల కన్వీనర్ నరేష్, నాయకులు పూల నారాయణస్వామి, నందినేని మల్లికార్జున, పెద్ద వెంకటరెడ్డి, బోనా నాగలింగారెడ్డి, ముత్యాల శ్రీనివాసులు, పెద్ద కొండయ్య,పురుషోత్తం, ముసలన్న, ప్రతాప్రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ బాబుతో ఎంత నష్టం జరిగిందో వివరిస్తాం అనంతపురం కార్పొరేషన్: ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను ఉమ్మడి అనంతపురం జిల్లా స్థాయిలో ప్రజలకు గుర్తు చేసే కార్యక్రమాన్ని శుక్రవారం బీకేఎస్లో లాంఛనంగా చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం బీకేఎస్లో ప్రారంభించనున్న శింగన మల వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఏ కుటుంబానికి ఎంత నష్టం జరిగిందో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేస్తామన్నారు. -
లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు
అనంతపురం మెడికల్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి పేర్కొన్నారు. గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జిల్లా స్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు అనుమతి లేకుండా నడుపుతుంటే చట్టరీత్యా చర్యలకు ఆదేశిస్తామన్నారు. లింగ నిర్ధారణకు ప్రోత్సహించినా చర్యలు తప్పవన్నారు. ఆడ బిడ్డ ప్రాముఖ్యతతో పాటు చట్టాన్ని అతిక్రమిస్తే ఎదురయ్యే పరిణామాలపై ఏఎన్ఎం, ఆశాల ద్వారా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణకు పాల్పడినట్లు తెలిస్తే కమాండ్ కంట్రోల్ 08554–228234కు ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నారాయణస్వామి, డాక్టర్ అనుపమజేమ్స్ తదితరులు పాల్గొన్నారు. అలా ముగించేశారు! అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్ల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు. ‘తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు’ అన్న చందంగా మొండివైఖరితో ముందుకెళ్లింది. ఫలితంగా తక్కువ వేతనంతో పని చేస్తున్న వీరందరూ జిల్లా సరిహద్దు మండలాలకు వెళ్లాల్సి వచ్చింది. మొత్తం మీద వారిగోడును ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అలా ముగించేశారు. తొలిరోజు 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తికాగా, రెండోరోజు గురువారం 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ ఉంటుందంటూ ఉదయం అందరికీ మెసేజ్లు పెట్టారు. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఖాళీల అంశంపై మాట్లాడే ప్రయత్నం చేసినా...డీఈఓ ప్రసాద్బాబు అంగీకరించలేదు. తన పరిధిలో లేని అంశం అని... కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఎవరైనా కౌన్సెలింగ్కు అటెండ్ కామని చెబితే మాత్రం అలాంటి వారికి నేరుగా కమిషనర్ కార్యాలయం నుంచే స్కూళ్లు అలాట్ చేస్తారని, అవి ఎక్కడొస్తాయో కూడా తెలీదంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండుమార్లు కౌన్సెలింగ్ను బాయ్కాట్ చేసినా ప్రభుత్వం కరుణించలేదని ఎంటీఎస్ టీచర్లు వాపోయారు. తక్కువ వేతనంతో పని చేస్తున్న తమపై ఇంత కక్షసాధింపుగా వ్యవహరించడం సరికాదని వాపోయారు. ఎట్టకేలకు అందరూ అంగీకరించడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అర్ధరాత్రి దాకా కొనసాగింది. 404 మంది కౌన్సెలింగ్కు హాజరయ్యారు. ముందురోజు 190 మందికి 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. నిబంధనల మేరకే ఉన్న ఖాళీలను చూపించామని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ఏదిఏమైనా కౌన్సెలింగ్కు సహకరించి ప్రశాంతంగా జరిగేలా చేసిన ఎంటీఎస్ టీచర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. గంజాయి సాగు చేస్తే జిల్లా బహిష్కరణ : డీఐజీ అనంతపురం: గంజాయి సాగు, వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల సాగు, వినియోగం, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిని జిల్లా నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు పదార్థాల నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమని స్పష్టం చేశారు. గంజాయి పొగ రూపంలో తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలు, దీర్ఘకాలంలో ప్రాణాప్రాయం తలెత్తుతుందన్నారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
‘నైపర్’లో సత్తా
అనంతపురం: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) జేఈఈ–2025 ప్రవేశ పరీక్షల్లో జేఎన్టీయూ (ఏ) ఓటీపీఆర్ఐ విద్యార్థులు సత్తా చాటారు. అఖిల భారత స్థాయిలో ర్యాంకులు సాధించారు. కే. గురు చరణ్ 793 ర్యాంకు, డి. హేమంత్ కుమార్ 1,561, జి. దేవీ ప్రియ 2,187, ఎస్. కుష్వంత్ 3,205, బి. ఆర్తి 3,527, కే. సాయి కిరణ్ 5,124, కె. హేమంత్ 5,254 ర్యాంకులతో మెరిశారు. ఈ సందర్భంగా ఓటీపీఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీ సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. గోపినాథ్ ఆయా విద్యార్థులను బుధవారం అభినందించారు.ఆర్ఎస్కే సిబ్బంది బదిలీలకు గ్రీన్సిగ్నల్అనంతపురం సెంట్రల్: రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారికి ఆఫ్లైన్లో,ఐదేళ్లలోపు సిబ్బంది రిక్వెస్ట్ బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రిక్వెస్ట్ బదిలీ ఉద్యోగులకు వారి సొంత మండలంలో కాకుండా ఇతర మండలాల్లో పోస్టింగ్ కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేసే పనిలో ఆయా శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో 867 రైతు సేవా కేంద్రాలున్నాయి. అనంతపురం జిల్లాలో 126 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 124 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. వీరిలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు ‘అనంత’లో 101 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 102 మంది ఉన్నారు. హార్చికల్చర్ అసిస్టెంట్లు ‘అనంత’లో 180 మంది,‘శ్రీ సత్యసాయి’లో 143 మంది ఉండగా అందరికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇక.. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సెరికల్చర్ అసిస్టెంట్లు ‘అనంత’లో 12 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 73 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పశు సంవర్ధక శాఖకు సంబంధించి 666 మంది వెటర్నరీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు.గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మఅనంతపురం సిటీ: గ్రామీణాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా సర్పంచులకు అనంతపురం జిల్లా పరిషత్ క్యాంపస్లో గల డీపీఆర్సీ భవన్లో మూడ్రోజులుగా నిర్వహించిన డివిజనల్ స్థాయి శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి. ముగింపు సభకు జెడ్పీ సీఈఓ శివశంకర్ అధ్యక్షత వహించగా, చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఒక ప్రధాన భాగమన్నారు. ఇలాంటి తరుణంలో కేవలం ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనంత మాత్రాన లక్ష్యం నెరవేరదన్నారు. పాలనలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకున్నప్పుడే రాజకీయాల్లో రాణించగలరన్నారు. ఇందుకు సరైన పరిజ్ఞానం, నైపుణ్యం, ఆత్మ విశ్వాసం అవసరమని పేర్కొన్నారు. మహిళా సర్పంచులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకొని, గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై అవగాహన పెంచుకోగలిగితే పాలనా రంగంలోనూ మహిళలు తీసిపోరని నిరూపించినట్లు అవుతుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సర్పంచులకు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య అభినందనలు తెలిపారు. అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. -
హెచ్ఐవీపై చైతన్యం తీసుకువద్దాం
● ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి అనంతపురం మెడికల్: హెచ్ఐవీ నియంత్రణలో భాగంగా గ్రామీణ ప్రాంతాలు, హెచ్ఐవీ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కె.నీలకంఠారెడ్డి సూచించారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో పని చేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రాంతీయ సమీక్షా సమావేశం నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో బుధవారం జరిగింది. హైరిస్క్ గ్రూపులు, మహిళా సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లు, తదితరులకు అందిస్తున్న సేవలపై పీడీ నీలకంఠారెడ్డి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైరిస్క్ గ్రూపులతో పాటు వారి భాగస్వామ్యులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. హెచ్ఐవీ సంక్రమించే అవకాశం ఉన్న యువత, ఫ్యాక్టరీ కార్మికులు, ఇతర వర్గాలను గుర్తించి వారికి కూడా హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు చేపట్టాలన్నారు. ఏపీఎస్ఏసీఎస్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ... స్వచ్చంధ సంస్థలు అందించిన సేవల ఆధారంగా ప్రతి స్వచ్చంద సంస్థకు గ్రేడింగ్ ఇస్తారన్నారు. దీని ఆధారంగా నిధులు మంజూరవుతాయని పేర్కొన్నారు. ఏపీ సాక్స్ డిప్యూటీ డైరెక్టర డాక్టర్ శ్రీనివాసవర్మ, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ సుకుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారులు డాక్టర్ అనుపమజేమ్స్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ శారదాబాయి, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్లు వెంకటరత్నం, అలీహైదర్, రమణ, సిబ్బంది మురళి, నారాయణ స్వామి పాల్గొన్నారు. -
1,39,000
ప్రైవేటు ప్రొవైడర్లు చార్జీలు పెంచడంతో బీఎస్ఎన్ఎల్కు వచ్చిన వారు అనంతపురం1,05,000 పైగా 6,00,000● కలగానే బీఎస్ఎన్ఎల్ పూర్వవైభవం ● అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేని సంస్థ ● పెరిగిన కస్టమర్లను నిలుపుకోలేని వైనం ● అనంతపురం జోన్లో లక్ష మందికి పైగా సర్వీసు నుంచి బయటకు ● పుట్టపర్తికి చెందిన శ్రీరామ్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. సదరు సంస్థ ‘సీయూజీ’ సిమ్ ఇవ్వడంతో ఆ నంబర్ వాడేవాడు. కానీ మూడేళ్ల క్రితం ఆయన ఆ సంస్థ నుంచి బయటకు వచ్చాడు. కానీ ఆ నంబర్ను వదులుకోలేక పోయాడు. సంస్థను అభ్యర్థించి ఆ నంబర్ మరో నెట్వర్క్లో ఉంటే పోర్టబులిటీ ద్వారా బీఎస్ఎన్ఎల్కు మారాడు. అప్పటి నుంచి అతనికి సమస్యలు మొదలయ్యాయి. సిగ్నల్ సరిగా లేక డాటా కూడా ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది. ఎవరికి ఫిర్యాదు చేసినా సేవలు మెరుగుపడకపోవడంతో ఇటీవలే మరో నెట్వర్క్లోకి మారిపోయాడు. ● అనంతపురానికి చెందిన మురళీమోహన్రెడ్డి 20 ఏళ్లుగా బీఎస్ఎన్ఎల్ నంబర్ వాడుతున్నారు. సిగ్నల్ సమస్య వచ్చినా, నెట్వర్క్ సరిగా రాకపోయినా మరో నెట్వర్క్లోకి మారేందుకు ఇష్టపడలేదు. కానీ రానురాను సమస్య మరీ తీవ్రంగా మారింది. ఇన్కమింగ్ కాల్స్ కూడా రావడం లేదు. పైగా మిత్రులంతా ఎందుకని ఎప్పుడూ సెల్ స్విచాఫ్ చేసుకుని ఉంటావంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో మురళీమోహన్రెడ్డి కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేశారు. ఫలితం లేదు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్లి సమస్య వివరించినా ఫలితం లేకపోవడంతో ఇటీవల మరోనెట్వర్క్కు మారిపోయాడు. సేవలు సరిగా లేకసాక్షి ప్రతినిధి, అనంతపురం: అవకాశాలు రాక.. వ్యాపారాలు లేక చాలా దిగ్గజ సంస్థలన్నీ నిరాశగా ఉండగా బీఎస్ఎన్ఎల్ మాత్రం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఒక దశలో లక్షలాది మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ కావాలని సిమ్లు తీసుకుంటే వారికి సర్వీసు ఇవ్వ లేక చతికిల పడింది. సిగ్నల్స్ ఉండవు, ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు, నెట్ సరిగా రాకపోవడంతో సిమ్కార్డు ఎందుకు తీసుకున్నాం రా బాబూ అంటూ వినియోగదారులు గగ్గోలు పెట్టిన పరిస్థితి. అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల పరిధిలో ఎంతో ఆశగా బీఎస్ఎన్ఎల్ సిమ్లు తీసుకున్న సంతోషం నాలుగు నెలల్లోనే ఆవిరి అయిపోయింది. టారిఫ్లు పెంచడంతో.. కొన్ని నెలల క్రితం జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేటు మొబైల్సర్వీస్ ప్రొవైడర్లు ఒక్కసారిగా నెలవారీ చార్జీలు పెంచాయి. దీంతో అనంతపురం జోన్ (కడప–అనంతపురం) పరిధిలో సుమారు 1.85 లక్షల మంది కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపారు. దీంతో బీఎస్ఎన్ఎల్కు పూర్వవైభవం వచ్చినట్టయింది. కానీ కస్టమర్ల సంతోషం ఎక్కువరోజులు నిలవలేదు. సిమ్కార్డు తీసుకున్న వారం లోనే కష్టాలు మొదలయ్యాయి. మొబైల్కు సిగ్నల్స్ రాకపోవడం, నెట్సరిగా ఉండకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విసుగెత్తిపోయారు. పైగా సిబ్బందికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేక పోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంకా 4జీనే.. అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలను ఒక జోన్గా పరిగణిస్తారు. ఇటీవల ఈ జోన్లో సుమారు 1.85 లక్షల మంది బీఎస్ఎన్ఎల్కు మారారు. దీంతో భారీగా బిజినెస్ పెరిగింది. సిమ్లు విచ్చలవిడిగా అమ్ముడయ్యాయి. కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. కానీ నెలరోజుల్లోనే నెట్వర్క్ సరిగా పనిచేయలేదు. కాస్త రూరల్కు వెళితే సిగ్నల్స్ లేవు. పైగా ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్లు 6జీకి వెళుతుంటే బీఎస్ఎన్ఎల్లో 4జీనే సరిగా రాదు. దీంతో కస్టమర్లలో సుమారు 1.39 లక్షల మంది వెనక్కు వెళ్లిపోయారు. టవర్లు తక్కువగా ఉండటం, సర్వీసులను ఉన్నతీకరించక పోవడం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడి వెనక్కు వెళ్లినట్టు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ నుంచి తిరిగి వెనక్కు వెళ్లిన వారువైఎస్సార్ కడప 80,000 పైగాఅనంతపురంజిల్లాలో టవర్లుప్రస్తుతం రెండు జిల్లాల్లో బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు450 వరకూ వైఎస్సార్ కడప జిల్లాలో టవర్లు350 వరకూ -
రైల్వే అభివృద్ధికి పాటుపడదాం : డీఆర్ఎం
గుంతకల్లు: అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ రైల్వే అభివృద్ధికి పాటుపడదామని ఉద్యోగులకు డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ప్రతిభ కనిబరిచిన టీటీఈలకు మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం సాయంత్రం డీఆర్ఎం కార్యాలయంలో జరిగింది. టిక్కెట్ చెకింగ్ స్క్వాడ్ గత నెలలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసుకున్న దాదాపు 14 మందికి అవార్డులను డీఆర్ఎం అందజేసి, అభినందించారు. ఏడీఆర్ఎం సుధాకర్, సీనియర్ డీసీయం మనోజ్, కమర్షియల్ బ్రాంచ్ ఉద్యోగులు పాల్గొన్నారు. కర్ణాటక మద్యం తరలింపుదారుడి అరెస్ట్ రాయదుర్గం: జిల్లాలోకి అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తూ రాయదుర్గం మండలం కాశీపురం గ్రామానికి చెందిన కావలి తిప్పేస్వామి పట్టుబడినట్లు ఎకై ్సజ్ సీఐ మహేష్కుమార్, ఎస్ఐలు పవన్కుమార్, దామోదర్ తెలిపారు. కొంత కాలంగా తిప్పేస్వామి అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్నట్లుగా సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టి నిందితుడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు వివరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి
అనంతపురం అర్బన్: సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్కు ఎన్జీఓ, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు విన్నవించారు. రాజకీయ సిఫారసులు, పైరవీలు, అవకతవకలకు తావులేకుండా చూడాలని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ను ఆయన చాంబర్లో ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, చంద్రమోహన్, కోశాధికారి ప్రవీణ్, తదితరులు కలిసి వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. ఐదేళ్లగా కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోకుండా ప్రజలకు సేవలందించిన సచివాలయ ఉద్యోగులకు బదిలీల్లో అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. నిబంధనల మేరకు సీనియారిటీ జాబితా ప్రకారం బదిలీలు నిర్వహించాలన్నారు. ఖాళీ స్థానాల జాబితాను ముందుగానే ప్రకటించడం తద్వారా అభ్యర్థులు స్థానాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. రేషనలైజేషన్లో మిగిలిన వారి అంశంలో ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకోవాలని కోరారు. బదిలీల్లో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎన్జీఓ సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి లింగమేష్, సహాయ కార్యదర్శి మహేశ్వరరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు షణ్ముఖ, సాయినాథరెడ్డి, అనిల్, రవి పాల్గొన్నారు. కలెక్టర్కు సచివాలయ ఉద్యోగులు, ఎన్జీఓ సంఘం నాయకుల వినతి -
‘అనంత’లో వరుస హత్యల కలకలం
అనంతపురం: ఒక్క రోజు వ్యవధిలోనే రెండు హత్యలు చోటు చేసుకోవడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ పరిసరాల్లో గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన రామలింగ కుమారుడు జి.సిదానంద (28) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మరువక ముందే మంగళవారం రాత్రి కుమ్మర నరసాపురం సురేష్ బాబు(43) దారుణంగా హతమయ్యాడు. శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతలు లోపించాయనేందుకు నిదర్శనంగా ఇప్పటికే పలు హత్యలు చోటు చేసుకున్నాయి. కేవలం 30 రోజులు కూడా గడవక ముందే మూడు హత్యలు చోటు చేసుకుని పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపాయి. నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన యువతి తన్మయి (19)ని అతి కిరాతకంగా హత్య చేశారు. రాష్ట్రంలోనే ఈ ఘటన కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటన మరువక ముందే అనంతపురం నగరంలో ఒక్క రోజు వ్యవధిలోనే మరో రెండు హత్యలు జరిగాయి. పోలీసులకే సవాల్ విసిరిన గంజాయి బ్యాచ్ అనంతపురం నగరంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. ఏకంగా వన్టౌన్ పోలీస్ స్టేషన్ ముందే ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అంటూ గంజాయి బ్యాచ్ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం ద్వారా పోలీసులకు సవాలు విసిరింది. కొన్ని రోజులుగా పుష్ప పాటతో రీల్ చేస్తూ సోషల్ మీడియాలో టాటూ చరణ్ అనే యువకుడు వైరల్ చేశాడు. ఈ నెల 18న అనంతపురంలోని సున్నపుగేరిలో నివాసముంటున్న యశోద ఇంట్లో టాటూ చరణ్, పవన్ చొరబడి డబ్బు కోసం బెదిరించి.. దాడి చేసి దౌర్జన్యంగా సెల్ఫోన్ లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 21న టాటూ చరణ్, ఇతని అనుచరుడు పవన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఇది వరకే దొంగతనం, మనుషులపై దాడి కేసులో నిందితులు. -
ప్రజావ్యతిరేకత దిశగా ‘కూటమి’
అనంతపురం అర్బన్: ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందని సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎంపీ పి.మధు అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి క్లాక్ టవర్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మధుతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్, జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప మాట్లాడారు. నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో నేడు మతోన్మాద వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రిన దేశంలో ఎమర్జెన్సీని అప్పటి కేంద్ర ప్రభుత్వం విధించి 1.13 లక్షల మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయించిందని గుర్తు చేశారు. యాభై ఏళ్ల అనంతరం ఎమర్జెన్సీ చీకటి పాలనను గుర్తు చేసుకుంటే నేడు అంతకంటే ఎక్కువ ప్రమాదకర పరిస్థితి ఉందన్నారు. కార్పొరేట్, మతోన్మాద పాలకుల చేతిలో ప్రజలు నిర్బంధాన్ని చూడాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయిందన్నారు. డీసీఎం పవన్కల్యాణ్ ద్వారా రాష్ట్రంలో మత రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. నిర్బంధ, మతోన్మాద దుష్ట పాలనపై ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం స్ఫూర్తితో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాల ద్వారానే పేదల సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు జి.ఓబుళు, రామరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు సావిత్రి, జిల్లా నాయకులు బాలరంగయ్య, చంద్రశేఖర్రెడ్డి, వెంకటనారాయణ, ప్రకాష్రెడ్డి, గోపాల్, వలి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. నాటి ఎమర్జెన్సీ చీకటి పాలనను తలదన్నేలా నేడు రాష్ట్రంలో పరిస్థితులు మతోన్మాద, నిర్బంధ పాలనపై ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం సీపీఎం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ పి.మధు -
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని బాలవెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు జిలాన్బాషా ప్రమాదకరమైన లింపోమా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు హిమాంబీ, ఫకృద్దీన్, భార్య షర్మిలతో కలసి వ్యవసాయంతో జీవనంతో సాగించేవాడు. 2023, నవంబర్లో ఆరోగ్యం క్షీణించడంతో అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. లింపోమా క్యాన్సర్తో బాధపడుతున్నట్లుగా నిర్ధారించారు. అప్పటి నుంచి బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకూ చికిత్స కోసం దాదాపు రూ.30 లక్షల వరకూ ఖర్చు పెట్టారు. అయినా నయం కాలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం చికిత్సకు చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం స్థానిక టీడీపీ నేతల ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వైఎస్సార్సీపీ సానుభూతి పరులంటూ దరఖాస్తును స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కార్యాలయ సిబ్బంది తిరస్కరించారు. పూర్తిగా క్యాన్సర్ నయం కావాలంటే బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని, ఇందుకు రూ.20 లక్షలకు పైగా అవసరమవుతుందని అక్కడి వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు వివరించారు. ఆపన్న హస్తం అందించి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. ఆర్థిక సాయం చేయదలిస్తే.. పేరు : జిలాన్బాషా బ్యాంక్ : ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, నూతిమడుగు శాఖ ఖాతా నంబర్ : 9109 362 3576 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఏపీజీబీ0001004 ఫోన్ పే నంబర్ :90003 95868 -
మద్యం రాసిన మరణ శాసనం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా సీఎం చంద్రబాబు మార్చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల నిర్వహణను దక్కించుకున్న ‘పచ్ఛ’ నేతలు నిబంధనలు తుంగలో తొక్కి వేళాపాళా లేకుండా విక్రయాలు చేపడుతున్నారు. దీంతో యువత మత్తులో జోగుతోంది. తాగుడు మానేయమని ఇంట్లో వారు ఒత్తిడి చేస్తే మందుబాబులు ఆత్మహత్యలకు వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనలు తరచూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో ఈ పరిస్థితి లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు సాగిస్తుండడంతో తమ పిల్లలు మత్తుకు బానిసలవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మద్యం రాసిన మరణ శాసనం. ఈ శాసనానికి బుధవారం ఇద్దరు యువకులు బలయ్యారు. ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమయపాలనలేని మద్యం విక్రయాలు ● మద్యానికి బానిసవుతున్న యువత ● తాగుడు మానేయమంటే ఆత్మహత్యలే ధర్మవరం అర్బన్: మద్యం తాగొద్దని భార్య చెప్పినందుకు మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మార్కెట్వీధిలో జరిగింది. వన్టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... మార్కెట్వీధికి చెందిన డ్రైవర్ రాజేంద్రప్రసాద్(30)కు భార్య చంద్రకళ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజూ మద్యం తాగి ఇంటికి వస్తుండేవాడు. తాగుడు మానేయాలని భార్య బతిమాలినా వినేవాడు కాదు. మద్యం మానేయమంటే తాను చనిపోతానంటూ తరచూ బెదిరించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఉన్న రూ.200 నగదు తీసుకుని మద్యం తాగి రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు. ఈ విషయంపై భార్య ప్రశ్నించడంతో ఏదో ఒకటి చేసుకుని చనిపోతానంటూ బెదిరించి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి హాల్లో నిద్రించాడు. రోజూ బెదిరించేది మామూలే కదా అనుకుని ఆమె కూడా పిల్లల పక్కన పడుకుని నిద్రపోయింది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో భార్యకు మెలకువ వచ్చి చూడగా హాల్లో నిద్రపోతున్న భర్త కనిపించలేదు. వంట గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్ హుక్కుకు బెడ్షీట్తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ● గుమ్మఘట్ట: తాగుడు మానేయమన్నందుకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పైదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజన్న, లక్ష్మక్క దంపతులకు నలుగురు కుమారులు కాగా, వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. కుమారుల్లో చివరి వాడైన శశికుమార్ (28)కు పెళ్లి కాలేదు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానేయాలని కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఈ నేపథ్యంలో మంగళవారం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న కుమారుడికి తల్లిదండ్రులు మరోసారి నచ్చచెప్పారు. తాగుడు మానేస్తే ఎవరైనా పిల్లనిచ్చేందుకు ముందుకు వస్తారని ఇప్పటికై నా మద్యం సేవించడం మానేయాలని హితవు పలికారు. దీంతో మనస్తాపం చెందిన శశికుమార్ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు విషయాన్ని గుర్తించి బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం
అనంతపురం అర్బన్: ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పథకంలో 17.08 శాతం ఎస్సీలకు, 5.53 శాతం ఎస్టీలకు లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు. లక్ష్యాలను నిర్దేశించుకుని వందశాతం అమలు చేయాలని చెప్పారు. ‘ఉన్నతి’ పథకం కింద సీ్త్ర నిధి ద్వారా మహిళలకు రుణాలు అందించాలన్నారు. ‘జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్’ అమలులో దేశంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. పీఎంఈజీపీ రుణాలకు సంబంధించి యూనియన్ బ్యాంక్ పరిధిలో సక్రమంగా మంజూరు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని డీఐసీ జీఎంను ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లను లబ్ధిదారులకు అందించాలన్నారు. సమావేశంలో డీటీడబ్ల్యూఓ రామాంజనేయులు, జెడ్పీ సీఈఓ శివశంకర్, సీపీఓ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు దక్కింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తలుపూరు ప్రతాపరెడ్డి (శింగనమల), సహాయ కార్యదర్శిగా ఉమ్మడి మనోజ్కుమార్రెడ్డి (అనంతపురం), ఆర్టీఐ వింగ్ కార్యదర్శిగా ఈ.లక్ష్మీకాంతయ్య (అనంతపురం) నియమితులయ్యారు. పోక్సో కేసు నమోదు కుందుర్పి: మండలంలోని జంబుగుంపల గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత మంగళవారం సాయంత్రం ఓ చిన్నారిపై సదరు యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు బాధిత చిన్నారి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. రామేశ్వరానికి ప్రత్యేక బస్సు హిందూపురం: హిందూపురం డిపో నుంచి జూలై 12వ తేదీన రామేశ్వరం యాత్ర స్పెషల్ బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీకాంత్ తెలియజేశారు. 12న ఉదయం 7 గంటలకు హిందూపురం నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, శ్రీరంగం, మధురై చివరగా రామేశ్వరం దర్శనం తర్వాత 16న ఉదయం తిరిగీ హిందూపురం చేరుకుంటుందన్నారు. టికెట్ల కోసం ఫోన్నంబర్ 9440834715కు సంప్రదించాలన్నారు. -
చెత్త హామీతో ప్రజల చిత్తు
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనంతపురంలో కంపోస్టు యార్డు తరలిస్తామని ‘తెలుగు తమ్ముళ్లు’ ప్రగల్భాలు పలికారు. అయితే, అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇంత వరకు కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణ జరగలేదు. రోజురోజుకూ చెత్త గుట్టలు గుట్టలుగా చేరుతోంది. కంపోస్టు యార్డులో దాదాపు 2 లక్షల టన్నులకుపైగా చెత్త ఉంది. నగరంలోని 50 డివిజన్లకు సంబంధించి 74 సచివాలయాల పరిధిలో రోజూ 120 టన్నుల నుంచి 140 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అందులో 12 నుంచి 18 టన్నులు ప్లాస్టిక్ ఉంటోంది. ఈ క్రమంలో చెత్త నిర్వహణ పక్కాగా చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష నరకం.. కంపోస్టు యార్డు ఉండే గుత్తి రోడ్డు, ఆ చుట్టు పక్కల ప్రాంతాలైన లెక్చరర్స్ కాలనీ, రాజీవ్ కాలనీ వాసులతో పాటు ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఈదురుగాలులు వచ్చాయంటే భారీ మంటలు చెలరేగి దట్టమైన పొగ వస్తోంది. ఈ క్రమంలో పొగలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుత్తి రోడ్డు మార్గంలో ప్రయాణమంటేనే వాహనదారులు హడలెత్తి పోతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు లోనవుతున్నారు. ఇక.. కంపోస్టు యార్డు నుంచి వచ్చే దుర్వాసన భరించలేక అక్కడి ప్రజలు నిత్యం తలుపులు, కిటికీలు మూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కలెక్టర్ దృష్టి సారిస్తేనే.. కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను ప్రారంభించి, పనికిరాని చెత్త, ప్లాస్టిక్ను అల్ట్రాటెక్, తదితర కంపెనీలకు పంపిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. నిషేధిత ప్లాస్టిక్ కూడా టన్నుల కొద్దీ కంపోస్టు యార్డులో పేరుకుపోయింది. ఈ క్రమంలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే విషవాయువులు వెలువడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇప్పటికై నా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ స్పందించి కంపోస్టు యార్డును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ‘అనంత’లో అటకెక్కిన కంపోస్టు యార్డు తరలింపు అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామని ‘తమ్ముళ్ల’ ప్రగల్బాలు ఏడాది పూర్తయినా పట్టించుకోని వైనం స్థానికులు, వాహనదారులకు తీవ్ర అవస్థలు -
ప్రతిభ కనబరిస్తే తల్ సైనిక్ క్యాంపునకు ఎంపిక
కూడేరు: పది రోజుల పాటు కొనసాగే ఎన్సీసీ శిక్షణా తరగతుల్లో ప్రతిభ కనబరిస్తే ఽఢిల్లీలో జరిగే తల్ సైనిక్ క్యాంపునకు ఎంపికవుతారని ఎన్సీసీ క్యాడెట్లకు క్యాంప్ కమాండర్ కల్నల్ ఎల్డీ రాడ్రిక్స్ సూచించారు. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఎన్సీసీ నగర్లో సీఏటీసీ–5 ఎన్సీసీ క్యాడెట్ల శిక్షణా తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల నుంచి 500 మంది క్యాడెట్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్యాంప్ కమాండర్ ఎల్డీ రాడ్రిక్స్ మాట్లాడారు. ఎన్సీసీ శిక్షణ మంచి భవిష్యత్తును ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు శారద, సంగీత శశికళ, ఇంద్ర బహుదూర్, నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.రైల్వే స్టేషన్లో కుప్పకూలి వ్యక్తి మృతిగుత్తి: స్థానిక రైల్వే స్టేషన్లో చంద్రశేఖరరెడ్డి (51) అనే వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన చంద్రశేఖరరెడ్డి ఇటీవల తిరుపతి వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చిన ఆయన గుత్తి రైల్వే స్టేషన్లో రైలు దిగాడు. స్టేషన్లో బయటకు వెళ్లడానికి మెట్లు ఎక్కుతున్న సమయంలో కుప్పకూలి కింద పడి మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందినట్లుగా జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపారు.ఉత్తమ బాడీ బిల్డర్గా హేమంత్బుక్కరాయసముద్రం: బెంగళూరు వేదికగా ఐసీఎన్ ఇండియా ఇటీవల నిర్వహించిన బాడీ బిల్డర్, ఫిట్నెస్ మోడలింగ్ అంతర్జాతీయ స్థాయి పోటీల్లో బీకేఎస్ మండలం రేకులకుంట గ్రామానికి చెందిన ఆకుల నాగభూషణ కుమారుడు హేమంత్ బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు, బాడీ బిల్డర్లు, ఫిట్నెస్ మోడల్స్ తలపడిన ఈ పోటీల్లో ప్రామాణిత డ్రగ్ టెస్టింగ్ ద్వారా పరీక్షలు నిర్వహించారు. -
జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
30 వరకే సబ్డివిజన్ డ్రైవ్ అనంతపురం అర్బన్: ‘భూములు రీ–సర్వే జరిగిన గ్రామాల్లో ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ ఈనెల 30 వరకే ఉంటుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా సమాచారం చేరవేయండి’ అని అధికారులను జేసీ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. సబ్ డివిజన్ డ్రైవ్ అంశంపై జేసీ బుధవారం కలెక్టరేట్ నుంచి డివిజన్, మండలస్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాయింట్ పట్టాదారులుగా నమోదైన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడంలో నెలకొన్న ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవర్ చేపట్టామన్నారు. రెవెన్యూశాఖ సబ్ డివిజన్ సేవకు నిర్ధారించిన రుసుము రూ.550లో రూ.500 మినహాయింపు ఇచ్చారన్నారు. నామమాత్రంగా దరఖాస్తు రుసుం రూ.50 సంబంధిత గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వద్ద చెల్లించాలన్నారు. తదుపరి జాయింట్ పట్టాదారులకు ఉచితంగా సబ్డివిజన్ చేస్తారన్నారు. ఈ అవకాశం ఈనెల 30 తేదీలోపు దరఖాస్తు చేసుకున్నవారికే ఉంటుందన్నారు. రీ–సర్వే జరిగిన గ్రామాల్లో రైతులకు ఈ విషయాన్ని తెలియజేసి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో సర్వే శాఖ ఏడీ రూప్లానాయక్ పాల్గొన్నారు. ఏఈఓలకు ఇన్చార్జ్ ఏఓ బాధ్యతలు అనంతపురం సెంట్రల్: వ్యవసాయశాఖలో పలువురు ఏఈఓలకు మండల ఏఓలుగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. డీ హీరేహాళ్ ఏఈఓ ఎన్.వి.గోపాల్కు బ్రహ్మసముద్రం ఏఓగా, కళ్యాణదుర్గం ఏఈఓ విజయకుమార్కు కుందుర్పి, గుత్తి ఏఈఓ మధుకర్కు ఉరవకొండ, తాడిపత్రి ఏఈఓ మధుకుమార్కు యల్లనూరు మండల వ్యవసాయాధికారిగా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అలాగే క్వాలిటీ కంట్రోల్ కళ్యాణదుర్గం ఏఓగా శ్రావణ్కుమార్, కంబదూరు ఏఓగా మహేష్, గుంతకల్లు ఏఓగా లీనావసుందర, పుట్లూరు ఏఓగా కాత్యాయిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అనుకున్నట్టే చేశారు!
● 2008, 1998 ఎంటీఎస్ టీచర్లకు వేర్వేరుగా బదిలీల కౌన్సెలింగ్ ● బెదిరించే ధోరణితో ముందుకెళ్లిన అధికారులు ● ఎట్టకేలకు 2008 ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి అనంతపురం ఎడ్యుకేషన్: ఇప్పటికే రెండుమార్లు వాయిదా పడ్డ ఎంటీఎస్ టీచర్ల బదిలీల అంశంలో అధికారులు కొత్త పంథా ఎంచుకుని అనుకున్నట్టే చేశారు. సీనియార్టీ జాబితాలో 2008 ఎంటీఎస్ టీచర్లు ముందున్నారు. వీరి తర్వాతనే 1998 ఎంటీఎస్ టీచర్లు మొదలవుతారు. ఖాళీలన్నీ దూర ప్రాంతాల్లో ఉండడం, ఉన్న వాటిలో 2008 ఎంటీఎస్ టీచర్లకు కాస్తా మంచివి దక్కుతాయి. రెండుసార్లు వాయిదా పడడంలో 1998 ఎంటీఎస్ టీచర్ల పాత్ర ఎక్కువగా ఉందని నిర్ణయానికి వచ్చిన విద్యాశాఖ... ఎంటీఎస్ టీచర్ల మధ్య ‘విభజించు–పాలించు’ సూత్రాన్ని అమలు చేసింది. 2008, 1998 వారిని కలిపికాకుండా వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో డీఈఓ పేరుతో మెసేజ్ పంపారు. ‘2008 ఎంటీఎస్ టీచర్లకు మాత్రమే సాయంత్రం 5 గంటలకు కౌన్సెలింగ్’ ఉంటుందని పేర్కొన్నారు. గొడవతో ఉద్రిక్తత.. సాయంత్రం 5 గంటలకు 2008 ఎంటీఎస్ టీచర్లందరూ వచ్చారు. జాబితాలో 50 మందికి మాత్రమే మంచి స్కూళ్లు వస్తాయి. తక్కిన 147 మంది దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని వాపోయారు. ఇలా రెండు గ్రూపులు విడిపోయి వాదించుకున్నారు. ఇదే సమయంలో ‘కౌన్సెలింగ్కు హాజరుకాకపోతే నేరుగా కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జనరేట్ అవుతాయి.. ఎవరికి ఎక్కడొస్తాయో మీ ఇష్టం’ అంటై విద్యాశాఖ సిబ్బంది బెదిరింపులకు గురి చేయడంతో ఎంటీఎస్ టీచర్లు ఇరకాటంలో పడ్డారు. జాబితాలో ముందున్న కొందరు తాము కౌన్సెలింగ్లో పాల్గొంటామని చెప్పడంతో మరికొందరు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు రాత్రి 7 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. డీఈఓ ఎం. ప్రసాద్బాబు పర్యవేక్షణలో ప్రక్రియ సాగింది. ఇక.. నేడో, రేపో 1998 ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కమిషనరేట్ నుంచి ఆదేశాలు రాగానే 1998 ఎంటీఎస్ టీచర్లకు సమాచారం చేరవేస్తామని డీఈఓ వెల్లడించారు. -
అధినేతతో భేటీ
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్గౌడ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రైలులో దొంగతనం గుత్తి/తాడిపత్రి రూరల్/ కడప కోటిరెడ్డిసర్కిల్: సాంకేతిక లోపం కారణంగా మార్గ మధ్యంలో నిలిచిపోయిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (ఎగ్మూర్ ఎక్స్ప్రెస్) రైలులో చోరీ జరిగింది. గుత్తి జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపిన మేరకు... ముంబయి నుంచి చైన్నెకి బయలుదేరిన ఎగ్మూర్ ఎక్స్ప్రెస్ రైలు (22159) మంగళవారం తెల్లవారుజామున 4గంటలకు గుత్తి జీఆర్పీ పరిధిలోని కోమలి రైల్వేస్టేషన్ సమీపంలోకి చేరుకోగానే సిగ్నలింగ్లో తలెత్తిన లోపం కారణంగా పొలాల్లో నిలిచిపోయింది. ఆ సమయంలో ఎస్–1 భోగీలోని సీటు నంబర్ 17లో నిద్రిస్తున్న విశాలాక్షి మెడలోని మూడు తులాల బంగారు చైన్ను ఓ దుండగుడు లాక్కొని ఉడాయించాడు. గుత్తి ఆర్ఎస్లోని మోడల్ స్కూల్లో పనిచేస్తున్న విశాలాక్షి కడపలో జరుగుతున్న పరీక్షలకు ఎగ్జామినర్గా హాజరయ్యేందుకు గుత్తిలో తెల్లవారుజామున 3గంటలకు రైలు ఎక్కారు. తన మెడలోని బంగారు గొలుసు లాగగానే మేల్కొన్న ఆమె గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. ఘటనపై బాధితురాలు కడప జీఆర్పీలో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న గుత్తి ఆర్పీఎఫ్ సీఐ రవిప్రకాష్, ఎస్ఐ కృష్ణ, జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
గుత్తి: ప్రస్తుతం ప్రపంచమంతా కంప్యూటర్ చుట్టూ తిరుగుతోందని, సాంకేతికతను అందిపుచ్చుకుంటే సులువుగా మంచి భవిష్యత్తు అందుతుందని గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా అన్నారు. గుత్తిలోని కోట ఉన్నత పాఠశాలలో వెబ్ టెక్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను మంగళవారం డీఆర్ఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ జ్ఞానం ఉంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. రోజూ కనీసం గంట పాటైనా సాధన చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, వెబ్ టెక్ కంపెనీ ప్రతినిధి రాజీవ్, సీనియర్ డీఎంఈ ప్రమోద్, ఎంఈఓ రవి నాయక్, హెచ్ఎం సుబహాన్ మాట్లాడుతూ కంప్యూటర్ ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, గుంతకల్లు సీనియర్ డీఎంఈ రామాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ● కాగా, గుత్తి ఆర్ఎస్లో టెన్నిస్ కోర్టును డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా ప్రారంభించారు. గుత్తి కోటను సందర్శించారు. డీజిల్షెడ్ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో గుత్తి, గుంతకల్లు సీనియర్ డీఎంఈలు ప్రమోద్, మంగాచారి, రైల్వే ఇన్స్టిట్యూట్ చైర్మన్ నేత చంద్ర పాల్గొన్నారు. గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా -
జగనన్నను కలసిన ప్రవాసాంధ్రులు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రవాసాంధ్రులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిలో సుబ్బారెడ్డి(యూఎస్ఏ కన్వీనర్), ఇలియాజ్ (గల్ప్ కన్వీనర్), ఆర్బీఎస్ రెడ్డి (డల్లాస్), శేఖర్రెడ్డి (యూఎస్ఏ), రాజేశ్వర్ యాదవ్ (యునైటెడ్ కింగ్డమ్), షేక్ అప్సర్ అలీ, నరసింహయాదవ్, షేక్ నసర్ (కువైట్), షేక్ దర్బార్ (ఖతార్) తదితరులున్నారు. ఈ సందర్భంగా వారి వెంట పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఉన్నారు. మహిళను కత్తులతో బెదిరించి బంగారు అపహరణ బెళుగుప్ప: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కత్తులతో బెదిరించి బంగారు నగలు, నగదు అపహరించిన ఘటన సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం రామసాగరం గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న తోటలో తన కుమారుడు శ్రీనాథరెడ్డితో కలసి ముడిమి లక్ష్మీదేవి నివాసముంటోంది. సోమవారం రాత్రి కూరగాయలు తీసుకు వచ్చేందుకు శ్రీనాథ్రెడ్డి రామసాగరం గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో గదిలో లక్ష్మీదేవి వంట చేస్తుండగా ముగ్గురు ఆగంతకులు లోపలకు ప్రవేశించారు. వంట గదిలో ఉన్న లక్ష్మీదేవిని వెనుక నుంచి అదిమిపట్టి కిందపడేసి కత్తులతో బెదిరిస్తూ నోట్లోకి గుడ్డలు కుక్కారు. ఆమె శరీరంపై ఉన్న బంగారు చైను, చేతిలోని నాలుగు బంగారు గాజులు లాక్కొని, ఇంట్లో ఉన్న రూ.96వేల నగదును అపహరించారు. కొద్ది సేపటికి ఇంటికి చేరుకున్న కుమారుడు విషయం తెలుసుకున్ని గ్రామంలోకి వెళ్లి బంధువులకు, గ్రామస్తులకు తెలపడంతో చుట్టుపక్కల గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులు, ప్రొబేషనరీ డీఎస్పీ అస్రప్ అలీ, సీఐలు మహానంది, ప్రవీణ్కుమార్, విడపనకల్లు, వజ్రకరూరు ఎస్ఐలు ఖాజాహుస్సేన్, నాగస్వామి, బెళుగుప్ప ఎస్ఐ శివ పరిశీలించారు. స్నిప్పర్ డాగ్ను రంగంలో దించారు. క్లూస్ టీం సాయంతో నిందితుల వేలి ముద్రలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్య గార్లదిన్నె: మండలంలోని జంబులదిన్నె గ్రామానికి చెందిన పెద్దన్న (60) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన తరచూ కడుపు నొప్పిస్తుండడంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం గార్లదిన్నె రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాక్ సిబ్బంది సమాచారంతో జీఆర్పీ ఎస్ఐ వెంకటేశులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
కొనసాగుతున్న సచివాలయ ఉద్యోగుల ధర్నా
అనంతపురం మెడికల్: కూటమి ప్రభుత్వం చేపట్టిన అసంబద్ధ బదిలీలపై సచివాలయ ఉద్యోగుల్లో నిరసన పెల్లుబికుతోంది. రెండ్రోజులుగా సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టిన సచివాలయ ఉద్యోగులు మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ప్లకార్డులు ప్రదర్శించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్స్ వెంటనే అందజేయాలని, బదిలీల్లో స్థానికంగా ఉండే వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సెలవు దినాల్లోనూ తమతో పనులు చేయించుకునే వైఖరి వీడాలన్నారు. బదిలీల పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు లక్ష్మీనారాయణ, సుధాకర్, వరప్రసాద్, మహేష్ నాయక్, వినయ్, భగీరథ రెడ్డి, జైనబ్బీ, జ్యోతిలక్ష్మి, కుళ్లాయమ్మ, విమల, మౌలాలమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో చోరీ గుత్తి రూరల్: మండలంలోని మాముడూరు గ్రామంలో వెలసిన రేవణదొడ్డి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున చోరీ జరిగింది. గ్రామ శివారులోని ఆలయానికి వేసిన తాళాన్ని బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు హుండీ తాళాలను ఇనుప రాడ్తో మెండి ధ్వంసం చేశారు. అందులోని సుమారు రూ.5వేల వరకూ ఉన్న నగదును అపహరించారు. మంగళవారం ఉదయం ఆలయానికి వెళ్లిన అర్చకుడు చోరీ విషయాన్ని గుర్తించి గ్రామస్తులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడి బలవన్మరణం రాప్తాడు: మండలంలోని గంగలకుంట సమీపంలో మంగళవారం ఉదయం 8 గంటలకు రైలు కింద పడి ఓ గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు ధర్మవరం రైల్వే పోలీసులు తెలిపారు. సుమారు 65 నుంచి 70 మధ్య వయస్సు గల వ్యక్తి తెలుగు రంగు చొక్కా, నలుపు రంగు డ్రాయర్, బ్రౌన్ కలర్ లుంగీ ధరించాడు. అతనికి ఎడమ కాలు లేదు. రెండు చేతులు కూడా అవిటిగా ఉన్నాయి. ఆచూకీ తెలిసిన వారు 95502 16049, 99513 25345 కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు. -
‘తమ్ముళ్ల’ బాహాబాహీ
● శింగనమల మండల డీలర్ల సంఘం అధ్యక్షుడి ఎన్నికలో ఉద్రిక్తత శింగనమల: మండల ప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్ల సంఘం అధ్యక్షుడి ఎన్నికలో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకునేందుకు సిద్ధమయ్యారు. శింగనమల తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శింగనమల మండలంలో 45 ప్రభుత్వ చౌకధాన్యపు డిపో డీలర్లు ఉండగా.. డీలర్ల సంఘం అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై వారం రోజులుగా టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు. ఈ క్రమంలో సీనియర్ నాయకులందరూ సి.బండమీదపల్లికి చెందిన చెన్నయ్య పేరును ప్రతిపాదించగా, యువ నాయకులు శింగనమలకు చెందిన మసూదువలికి మద్దతు తెలిపారు. తహసీల్దార్ శేషారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సూర్యప్రతాప్, సీఎస్డీటీ చంద్రకళ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో మండల డీలర్ల సమావేశంలో డీలర్ల సంఘం అధ్యక్షుడి ఎన్నిక చేపట్టారు. సమావేశానికి డీలర్లతో పాటు టీడీపీకి చెందిన సీనియర్, జూనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తమకు చెప్పిందని సీనియర్లు, కాదు తమకే చెప్పిందని జూనియర్లు వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో పరిస్థితి చేజారి నాయకులు తన్నుకునేందుకు సిద్ధమయ్యారు. తహసీల్దార్ శేషారెడ్డి, ఎస్ఐ విజయకుమార్ ఇరువర్గాలను ప్రాధేయపడి ఎమ్మెల్యే చెప్పిన వారికే అధ్యక్ష స్థానం కేటాయిస్తామని తెలపడంతో వివాదం సద్దుమణిగింది. -
బీమా చట్టాల సవరణ బిల్లు వద్దు
హిందూపురం: కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని ఎల్ఐసీ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి, ఉద్యోగుల సంఘం హిందూపూర్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి బి.నరసింహులు పిలుపునిచ్చారు. సంఘం అధ్యక్షులు యల్.చంద్రకళ ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఐసీ డివిజనల్ ఆఫీసు ఎదుట దేశవ్యాప్త పిలుపుమేరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్నారని దాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎల్ఐసీలో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించుకునే కార్యక్రమానికి మరోమారు ప్రయత్నించడం సరికాదన్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కొత్త పెన్షన్ విధానానికి స్వస్తిపలికి పాత పెన్షన్ విధానాన్ని అమలుకు సిద్ధపడుతున్నాయని చెప్పారు. ఎల్ఐసీలో కూడా అందరికీ పాత పెన్షన్ విధానమే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నేతలు మధుసూదన్రావు, గంగాధర్, శ్రీలక్ష్మి, మాధురిబాయ్, మాధురిలత, జ్యోతిర్మయి, మాధవి, నాగారత్న, నాగరాజు, రామచంద్రప్ప, మనీష్ ప్రితం, రవితేజ, పెన్షన్ యూనియన్ సభ్యులు నాగప్ప,నరసింహారెడ్డి పాల్గొన్నారు. తండ్రిపై తనయుడి దాడి గార్లదిన్నె: మండలంలోని ఇల్లూరులో తండ్రిపై తనయుడు దాడి చేశాడు. డబ్బు విషయంగా రామాంజనేయులుతో గొడవపడిన కుమారుడు మణికంఠ ఆవేశంతో కట్టె తీసుకుని దాడి చేయడంతో తండ్రి తకు బలమైన గాయమైంది. గమనించిన కుటుంబసభ్యులు దాడిని అడ్డుకుని క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా అనంతపురంలోని జీజీహెచ్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్బాషా తెలిపారు. -
‘అనంత’లో యువకుడి హత్య
అనంతపురం: నగరంలోని బళ్లారి బైపాస్లో ఉన్న అన్న క్యాంటీన్ వద్ద ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన రామలింగ కుమారుడు జి. సిదానంద (28)కు అదే మండలం యర్రగుంట్ల గ్రామానికిచెందిన ఎర్రిస్వామి కుమార్తె శోభాతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. గార్లదిన్నెలో కాపురం ఉండేవారు. ఈ క్రమంలో పది నెలల క్రితం శోభ ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో సిదానందను పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపారు. రిమాండ్ నుంచి వచ్చిన అనంతరం అనంతపురంలోని పాతూరులో ఉన్న ఓ కిరాణా షాపులో సిదానంద పనిలోకి చేరాడు. రోజూ ఉదయం కోటంక నుంచి అనంతపురానికి వచ్చి వెళ్లేవాడు. మూడు రోజుల క్రితం అనంతపురానికి వచ్చిన సిదానంద ఆ తర్వాత ఇంటికి వెళ్లలేదు. మంగళవారం ఉదయం బళ్లారి బైపాస్ రోడ్డు వద్ద ఉన్న అన్న క్యాంటీన్ సమీపంలో అందరూ చూస్తుండగా దుండగులు సిదానంద తలపై బండరాయితో మోది హతమార్చారు. సమాచారం అందుకున్న నాల్గో పట్టణ పీఎస్ సీఐ జగదీష్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. హతుడి జేబులో లభ్యమైన గుర్తింపు కార్డు ఆధారంగా వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచార ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. హతుడి తమ్ముడు జి. దినేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, సిదానంద భార్య ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆవేశానికి లోనవుతూ సిదానందను చంపుతామని బెదిరించినట్లు హతుడి కుటుంబసభ్యులు గుర్తు చేశారు. దీంతో శోభ కుటుంబసభ్యులా, లేదా ఇతర కారణాలతో మరెవ్వరైనా ఈ ఘాతుకానికి తెగబడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దారుణానికి పాల్పడింది ఎవరనేది స్పష్టం కాలేదు. -
షెడ్ల నిర్మాణాలు పూర్తి చేయండి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్లకు (ఎస్డబ్ల్యూపీసీ) సంబంధించిన షెడ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. పంచాయతీ సెక్టార్, ఇతర అంశాలపై కలెక్టర్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 526 ఎస్డబ్ల్యూపీసీలు ఉండగా 72 చోట్ల విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదన్నారు. 10 చోట్ల నీటి సరఫరా లేదని, 8 చోట్ల రోడ్డు కనెక్టివిటీ పనులు పెండింగ్ ఉన్నాయన్నారు. వీలైనంత త్వరగా ఆ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్డబ్ల్యూపీసీ లేని గ్రామ పంచాయతీల్లో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. గ్రీన్ అంబాసిడర్లకు, గ్రీన్ గార్డులకు డబ్బులు పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు. షెడ్లలో చెత్త సేకరణ వాహనాలు, వర్మీ బెడ్డింగ్, ఉత్పత్తి, అమ్మకాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సచివాలయాల అంశాలకు సంబంధించి మన మిత్ర క్యాంపెయిన్లో హౌస్హోల్డ్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని సూచించారు. రేపటి నుంచి జీవాలకు టీకాలు అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకలకు గురువారం నుంచి ఉచితంగా టీకాలు (వ్యాక్సినేషన్) వేసే కార్యక్రమం మొదలవుతుందని పశుసంవర్ధక శాఖ రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీ డీఎల్) ఏడీ డాక్టర్ రవిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.నట్టలు(డీవార్మింగ్), నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్), థైలేరియాసీస్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49 లక్షలు గొర్రెలు, 9 లక్షల మేకలు... మొత్తంగా 58 లక్షల జీవాలకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్ఎస్కేల వేదికగా శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేపట్టడానికి పారాస్టాప్తో బృందాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు వ్యాధులకు సంబంధించి అవసరమైన మందులు ఇప్పటికే పశువుల ఆస్పత్రులకు చేర్చామన్నారు. జులై 10 వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. వక్ఫ్ భూములకు కౌలు వేలం అనంతపురం రూరల్: వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూముల సాగుకు కౌలు వేలం నిర్వహించనున్నారు.ఈ మేరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రామసుబ్బారెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గుంతకల్లులోని హజరత్సయ్యద్, అక్బర్ ఉర్ఫ్ మస్తాన్వలి దర్గాలకు చెందిన సర్వే నంబర్ 132–ఏలో 7.34 ఎకరాలు, సర్వే నంబర్ 132–సీలో 28.74 ఎకరాలతో పాటు, బొమ్మనహాళ్ మండలం గోవిందవాడలోని సర్వే నంబర్ 209లోని 25.30 ఎకరాలను కౌలుకు సాగు చేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 28న జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో నిర్వహించే వేలం పాటలో పాల్గొనవచ్చు. వేలం పాటలో పాల్గొనే వారు ముందుగా రూ.10 వేల ధరావత్తును చెల్లించాలి. పూర్తి వివరాలకు 99666 47586లో సంప్రదించవచ్చు. -
మామిడిలో యాజమాన్యం చేపట్టండి
అనంతపురం అగ్రికల్చర్: మామిడి కోతలు పూర్తయిన అనంతరం సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు శ్రీసత్యసాయి జిల్లా ఉద్యానశాఖ డీడీ జి.చంద్రశేఖర్ సూచించారు. తోటల్లో కాయలన్నీ కోసిన తర్వాత ఒక నీటి తడి ఇచ్చి ఎండుపుల్లలు, పూతకాడలు, ఆకుగూళ్లను తొలగించాలన్నారు. చెట్టు మధ్య భాగంలో ఉన్న చిన్న కొమ్మలు, నాలుగు దిక్కులా సూర్యరశ్మిని అడ్డుకునే కొమ్మలను తొలగించి గాలీవెలుతురు ప్రసరించేలా కత్తిరించాలన్నారు. బాగా ముదిరిన పెద్ద చెట్లలో రంపం లేదా పవర్సాను ఉపయోగించి చెట్టు ఎత్తును తగ్గించాలన్నారు. అనంతరం కత్తిరించిన కొమ్మల చివర కాపర్ సంబంధిత శిలీంధ్రం లేదా కార్బండిజమ్ను పూయాలని తెలిపారు. తొలకరి సమయంలో చెట్టు మొదలు దగ్గరగా భూమిని దున్నడం లేదా పాదులు తవ్వి తిరగేయాలని తెలిపారు. జూన్, జూలై మాసంలో ఎకరాకు 10 కిలోలు జీలుగ లేదా 25 కిలోలు జనుము లాంటి పచ్చిరొట్ట పైర్లు వేసి 40 నుంచి 45 రోజుల సమయంలో భూమిలో కలియదున్నితే సేంద్రియ పదార్ధం, భూసారం బాగా పెరుగుతుందన్నారు. ప్రతి చెట్టు పాదులో 100 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు లేదా 10 కిలోలు వర్మికంపోస్టు వేయాలన్నారు. సిఫారసు చేసిన విధంగా ప్రతి చెట్టుకూ 1.7 కిలోల యూరియా, 1.1 కిలోల సింగిల్ సూపర్పాస్ఫేట్, 1.15 కిలోల పొటాషియం సల్ఫేట్ లేదా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఏడాదికి రెండు సార్లు అంటే జూన్–జూలై అలాగే అక్టోబర్–నవంబర్లో వేయాలన్నారు. కొత్త చిగుర్లు వచ్చే సమయంలో 5 గ్రాముల జింక్ సల్ఫేట్ , 2 గ్రాముల బోరాక్స్, 10 గ్రాముల యూరియా కలిపిన ద్రావణాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే వచ్చే ఏడాది మంచి దిగుబడులు పొందవచ్చనని పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా ఉద్యానశాఖ డీడీ చంద్రశేఖర్ సూచన -
యంత్ర సాయమేదీ?
● ఇప్పటి వరకూ అడ్రస్ లేని కిసాన్ డ్రోన్లు ● వ్యవసాయ యంత్ర పరికరాలకు రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయని కూటమి ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ హయాంలో రూ.16.40 కోట్ల రాయితీతో సీహెచ్సీల ఏర్పాటు అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడుగడుగునా రైతులు మోసపోతూనే ఉన్నారు. ఏడాది పూర్తయినా ఎలాంటి సాయం చేయకుండా ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణి అవలంభిస్తున్నారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, ఇన్పుట్, ఇన్సూరెన్స్ కింద ఆర్థిక సాయం అందించకుండా ఎగ్గొట్టారు. మరోపక్క అడిగిన ప్రతి రైతుకూ వ్యవసాయ యంత్ర పరికరాలు పెద్ద ఎత్తున అందిస్తామని గొప్పగా చెప్పినా.. ఆచరణలో మాత్రమం చేతులెత్తేశారు. యాంత్రీకరణకు కేటాయించిన రూ.3 కోట్లు బడ్జెట్ కూడా వెచ్చించకుండా మిగిలించేశారు. కనిపించని డ్రోన్లు వ్యవసాయ యంత్ర పరికరాల వితరణకు సంబంధించి కాగితాల్లో 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించినా మార్కెట్ ధరలను బట్టి చూస్తే రైతుకు 20 శాతం కూడా రాయితీ దక్కే పరిస్థితి లేదు. మరోపక్క కిసాన్ డ్రోన్లు ఇస్తామంటూ ఏడాదిగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారు. ఇప్పటికీ ఆ డ్రోన్లు ఎక్కడున్నాయో అంతుచిక్కడం లేదు. తొలి విడత కింద 50 శాతం రాయితీతో ఆర్ఎస్కేలకు అనుబంధంగా 35 డ్రోన్లు మంజూరైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఇది ఆచరణలోకి రాలేదు. డ్రోన్లు మంజూరు చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి యుటిలైజేషన్ సర్టిఫికేషన్ ఇచ్చిన తర్వాత 50 శాతం రాయితీ విడుదల చేస్తామని మెలికపెట్టారు. దీంతో రైతుల్లో ఆసక్తి నశించింది. ఇప్పటికిపుడు రూ.5 లక్షలు చెల్లించడానికి రైతులు ముందుకు రాకపోవడంతో డ్రోన్ల కార్యాచరణ అడ్రస్ లేకుండా పోయింది. అన్నదాతకు అండగా గత ప్రభుత్వం గతంలో 2019–24 మధ్య అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారు. రూ.50 కోట్లకు పైగా విలువ చేసే యంత్ర పరికరాలను అందజేశారు. ప్రతి ఆర్బీకేకు అనుబంధంగా కమ్యూనిటీ హైయరింగ్ సెంటర్లు (సీహెచ్సీ) పేరున రైతు గ్రూపులు ఏర్పాటు చేసి వారు కోరుకున్న ట్రాక్టర్లు, ఇతర ఆధునిక యంత్రపరికరాలు రెండు విడతలుగా అందించారు. తొలివిడతగా రూ.8.25 కోట్ల రాయితీ ఇచ్చి 219 సీహెచ్సీలు ఇవ్వగా, రెండో విడతగా మిగతా రూ.8.15 కోట్లు రాయితీ ఇచ్చి 230 సీహెచ్సీలు మంజూరు చేశారు. ఒక్కో సీహెచ్సీలో రూ.15 లక్షలు విలువ చేసే కోరుకున్న ట్రాక్టర్తో పాటు ఆధునిక పరికరాలకు 40 శాతంతో రూ.16.40 కోట్ల మేర రాయితీ వర్తింపజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు విశిష్ట సేవలందిస్తున్న ఆర్బీకేలను ఆర్ఎస్కేలుగా పేరు మార్చి నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కల్వర్టుపై దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు
రాయదుర్గం టౌన్: మండలంలోని జుంజురాంపల్లి సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి కల్వర్టుపై దూసుకెళ్లింది. రోజూ మంగళవారం మధ్యాహ్నం బెళుగుప్ప నుంచి గుండ్లపల్లి, కెంచానపల్లి మీదుగా బెంగళూరుకు ఎస్ఆర్జే ప్రైవేటు బస్సు వెళుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం బెళుగుప్ప నుంచి బయల్దేరిన బస్సు జుంజురాంపల్లి సమీపంలోకి చేరుకోగానే కల్వర్టుపై దూసుకెళ్లి నిలిచిపోయింది. ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మెట్లపై నుంచి జారిపడి వ్యక్తి మృతి బత్తలపల్లి: మేడపైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ జారి కిందపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కడప జిల్లా వేంపల్లి మండలం అయ్యవారిపల్లికి చెందిన కోనేటి సుధాకర్ (38) బతుకుదెరువు నిమిత్తం 11 ఏళ్ల క్రితం బత్తలపల్లికి వచ్చాడు. ఆర్డీటీ ఆస్పత్రి సమీపంలో టిఫెన్ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 20న రాత్రి మిద్దైపె పడుకునేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో భార్యతోపాటు స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం.. అటు నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రాయితీతో సూక్ష్మ సేద్యం పరికరాలు
గార్లదిన్నె: ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీతో సూక్ష్మ సేద్యం పరికరాలను అందజేస్తున్నట్లు ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి తెలిపారు. గార్లదిన్నె మండలం యర్రగుంట్ల, ముకుందాపురం గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన పీడీ రఘునాథరెడ్డి మాట్లాడుతూ 5 ఎకరాల వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, 10 ఎకరాల వరకు భూమి ఉన్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులకు 90 శాతం సబ్సిడీతో 10 ఎకరాలు పైబడి భూమి ఉన్న రైతులకు 50 శాతం సబ్సిడీతో డ్రిప్పు, స్ప్రింక్లర్లను అందజేస్తామన్నారు. సూక్ష్మ సేద్యం పరికరాలు అవసరమున్న రైతులు ఆర్ఎస్కేల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ విస్తరణాధికారి రామాంజనేయులు, మండల వ్యవసాయాధికారి సోమశేఖర్ పాల్గొన్నారు. -
‘ఎంటీఎస్’ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ మళ్లీ వాయిదా పడింది. మూడు రోజుల క్రితం జరిగిన కౌన్సెలింగ్ను బాయ్కాట్ చేసిన టీచర్లు.. రెండోమారు మంగళవారం జరపాలని చూసిన కౌన్సెలింగ్లోనూ పాల్గొనకుండా బాయ్ కాట్ చేయడం విశేషం. స్థానిక సైన్స్ సెంటర్లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ను ఎంటీఎస్ టీచర్లు అడ్డుకున్నారు. తమపట్ల కూటమి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందంటూ వాపోయారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నామని, డీఏ, హెచ్ఆర్ఏ సదుపాయం ఉండదని, పైగా చాలామంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారన్నారు. ఇలాంటి వారందరికీ జిల్లా సరిహద్దు మండలాల్లో కనీసం రవాణా సదుపాయం లేని స్కూళ్లకు కేటాయిస్తే ఎలా పోవాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నియర్ బై రెసిడెంట్’ ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొండిగా కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం మరోవైపు విద్యాశాఖ అధికారులు మొండిగా కౌన్సెలింగ్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో సీనియార్టీ జాబితాలో ఉన్న పేర్లను పిలుస్తూ లోపలికి వచ్చి నచ్చిన స్థానాలు ఎన్నుకోవాలి.. లేదంటే బలవతంగా స్థానాలు కేటాయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఎంటీఎస్ టీచర్లు తిరగబడ్డారు. మైకులో అనౌన్స్ చేస్తున్న టీచరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంటీఎస్ టీచర్లు పెద్దస్థాయిలో తిరగబడడంతో కౌన్సెలింగ్ ప్రక్రియను అంతటితో ఆపేశారు. ఆర్జేడీ నోటా పాత మాటే రీజినల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆయనతో పాటు డీఈఓ ప్రసాద్బాబును ఎంటీఎస్ టీచర్లు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఆర్జేడీ నోటి నుంచి కూడా పాతమాటే వచ్చింది. విద్యార్థులకు సరిపడా పోస్టులు మాత్రమే ఉన్నాయి.. అంతకు మించి చూపించడం సాధ్యం కాదంటూ తెగేసి చెప్పారు. దీంతో ఎంటీఎస్ టీచర్లు ఆర్జేడీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ‘మా జీవితాలతో ఆడుకోవద్దండి. ఇన్ని ఇబ్బదులు పెట్టే బదులు కాసింత విషం ఇచ్చి చంపండి’ అంటూ వాపోయారు. సహకరించాలని పలుమార్లు ఆర్జేడీ వేడుకున్నా... టీచర్లు అంగీకరించలేదు. చివరకు రాత్రి 8 గంటల సమయంలో బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించి అందరూ కౌన్సెలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు టీచర్ల ససేమిరా.. -
అసలైన సూత్రధారుల గుట్టు విప్పాలి
కళ్యాణదుర్గం: ఈ–స్టాంప్ల కుంభకోణంపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో విచారణ జరిపించి, అసలైన సూత్రధారుల గుట్టు విప్పాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ మున్సిపల్ విభాగం కన్వీనర్ ఐ.సుధీర్, మండల కన్వీనర్ గోళ్ల సూర్యనారాయణ, అధికార ప్రతినిధి గోపారం శ్రీనివాసులు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు యాదవ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు. 25 ఏళ్ల క్రితం కూడా టీడీపీ హయాంలో స్టాంప్ల కుంభకోణం జరిగిందని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అవినీతికి హద్దు ఉండదన్నారు. కళ్యాణదుర్గంలో మీ–సేవ నిర్వాహకుడిని పావుగా వాడుకుని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కొన్ని కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ– స్టాంప్ కుంభకోణంపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపించాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వందల కోట్ల ఈ– స్టాంప్ల కుంభకోణం బయటకు రావడం ఆశ్చర్యకరమన్నారు. దీని వెనుక పెద్దల హస్తం ఉందని,వారందరినీ బయటకు లాగాలన్నారు. కేవలం కళ్యాణదుర్గంలోనే కుంభకోణం జరిగి ఉండదని, ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేస్తోందని, అక్కడ కూడా ఇలాంటివి జరిగి ఉంటాయని ఆరోపించారు. ఎమ్మెల్యేకు సంబంధం లేదంటున్నప్పుడు నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.సమావేశంలో నాయకులు గణేష్, కౌన్సిలర్లు లక్ష్మన్న, పరమేశ్వరప్ప, కో ఆప్షన్ మారుతి, శ్రీకాంత్, షేక్షావలి, నాగరాజు, చరణ్, రమేష్, రాజు, నారాయణస్వామి, ప్రతాప్, జాకీర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ స్టాంప్ కుంభకోణంపై సీబీఐ, ఈడీతో విచారణ చేయించాలి కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ నేతల డిమాండ్ టీడీపీలో ఉలికిపాటు స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని, తప్పుడు ఈ –స్టాంప్లతో బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాలను మోసం చేసిన టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కంపెనీ కుంభకోణం బయటపడటంతో ఆ పార్టీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. మీ సేవ నిర్వాహకుడు బాబుకు ఎమ్మెల్యే సపోర్ట్గా ఉంటూ కుంభకోణానికి సహకరించారనే అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలచే విచారణ చేయించాలని డిమాండ్లు పెరిగిపోవడం గమనార్హం. -
ధర్నాలతో అట్టుడికిన కలెక్టరేట్
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆందోళనలతో కలెక్టరేట్ అట్టుడికింది. హామీల అమలుకు... సమస్యల పరిష్కారానికి... డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు, మునిసిపల్ పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, రైతు కూలీ సంఘం నాయకులు వేర్వేరుగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలకు ఆయా సంఘాల నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు అందజేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలి.. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట పెద్దసంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, మినీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం అధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబుళు, సంఘం గౌరవాధ్యక్షుడు నాగేంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. అంగన్వాడీ వర్కర్లకు రూ.11,500, హెల్పర్లు, మినీ వర్కర్లకు రూ.7 వేలు వేతనం మాత్రమే వస్తోందని, అతితక్కువ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీలకు తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు కావడంతో కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వ లేదన్నారు. ప్రతి అంగన్వాడీకి సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాంటూ మునిసిపల్ కార్మిక, ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికులు సోమవారం కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, నాయకులు వెంకటనారాయణ, ముత్తూజ, గోపాల్, ఏటీఎం నాగరాజు, తదితరులు మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలన్నారు. పెరిగిన నగర విస్తీర్ణానికి అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలన్నారు. శాశ్వత ఉద్యోగులకు ఇచ్చిన జీఓ 1615 ప్రకారం బేసిక్ వేతనంతో పాటు హెచ్ఆర్ఏ, డీఏ ఇవ్వాలన్నారు. కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల అమలు కోసం అంగన్వాడీల బైఠాయింపు జీఓ 36 అమలు చేయాలంటూ ఇంజినీరింగ్ కార్మికుల ధర్నా సమస్యలు పరిష్కరించాలని పారిశుధ్య కార్మికుల ఆందోళన డిమాండ్ల సాధనకు మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరసన రైతుల సమస్యలు పరిష్కరించాలని ఏఐకేఎంఎస్ ధర్నా జీఓ 36 మేరకు వేతనాలివ్వాలి మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీఓ 36 మేరకు వేతనం ఇవ్వాలంటూ మునిసిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కమిటీ నాయకులు మల్లికార్జున, వీఎస్ రాయుడు, మురళీమోహన్, ఓబుళపతి, పోతులయ్య, తదితరులు మాట్లాడారు. 36 జీఓ ప్రకారం కార్మికులకు కేటగిరీ వారీగా రూ.21 వేలు, రూ.24,500 అమలు చేయాలన్నారు. కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. కార్మికులకు తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్ బకాయి తక్షణం చెల్లించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే జూలై 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి జీతం పెంపుదల, తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ ఏపీ మునిసిపల్ ఇంజినీరింగ్ కార్మిక సంఘం, ఐఎఫ్టీయూ సంయుక్త ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు భాస్కర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి లోకేష్ నాయుడు, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి సురేష్, ఎసీ సంఘం నాయకుడు సాకే హరి మాట్లాడారు. టెక్నికల్ కార్మికులకు రూ.29,200, నాన్ టెక్నికల్ కార్మికులకు రూ.24,500 వేతనం ఇవ్వాలన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికులకు 62 ఏళ్లకు ఉద్యోగ విరమణకు అవకాశం కల్పించాలన్నారు. సీనియార్టీ ప్రాతిపదికన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో మరణించి కార్మికునికి రూ.10 లక్షలు, అంగవైకల్యం పొందిన వారికి రూ.5లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు, రైతు కూలీల ధర్నా రైతులు, రైతు కూలీల సమస్యలు పరిష్కరించాలంటూ అఖిల భారత రైతుల కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజు, సహాయ కార్యదర్శి కిష్ట, కోశాధికారి రాయుడు, సభ్యుడు రామాంజనేయులు మాట్లాడారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం రూ.20 వేలు తక్షణం ఇవ్వాలన్నారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. స్మార్ట్ మీటర్ల బిగించకూడదన్నారు. ఎన్నికల హామీ మేరకు పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటిస్థలం కేటాయించి, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. ఉపాధి పని దినాలు 200 రోజులకు పెంచి, రోజు కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
‘పీఎం సూర్యఘర్’ను వేగవంతం చేయండి
● ఎస్పీడీసీఎల్ సీజీఎం వరకుమార్ అనంతపురం టౌన్: పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఏపీ ఎస్పీడీసీఎల్ సీజీఎం వరకుమార్ ఆదేశించారు. సోమవారం అనంతపురంలోని ఎస్ఈ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులు, బ్యాంకర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా విద్యుత్ వినియోగదారులు తమ ఇళ్లపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ను ఇంటి అవసరాలకు వినియోగించడంతో పాటు మిగులు విద్యుత్ను సంస్థకు విక్రయించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కిలో వాట్ల వారీగా సోలార్ ఫ్యానళ్ల ఏర్పాటుకు బ్యాంకర్లు సైతం రుణాలను అందజేయాలన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందజేస్తోందన్నారు. పీఎం సూర్యఘర్ పథకానికి వచ్చిన దరఖాస్తులను ఆయా ప్రాంతాల బ్యాంకర్లుతో సమన్వయం చేసుకొని గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఈఈ, ఏడీలను అదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఈఈ జేవీ రమేష్, ఏడీలు శ్రీనివాసులు, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ సభ్యుడిగా ఆచార్య శశిధర్ అనంతపురం: ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) సభ్యుడిగా జేఎన్టీయూ (ఏ) సీనియర్ ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది శశిధర్కు అభినందనలు తెలిపారు. హెచ్చెల్సీ పనుల పరిశీలన కణేకల్లు/బొమ్మనహాళ్: తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ పరిధిలో రూ.35.06 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులను క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ మునీర్బాషా, ఈఈ రమేష్, డీఈఈ చంద్రశేఖర్ సోమవారం తనిఖీ చేశారు. 115వ కిలోమీటర్ నుంచి 189వ కిలోమీటర్ వరకూ చేపట్టిన బ్రిడ్జి, యూటీ, లైనింగ్, అవుట్ఫాల్ రెగ్యులేటర్ పనులతో కలిపి మొత్తం 11 పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరిశీలించారు. నాణ్యత ప్రమాణాల మేరకు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్ డీఈఈ చంద్రశేఖర్, జేఈ ఓబుళపతి, రమణారెడ్డి, కన్స్ట్రక్షన్ ఈఈ పార్థసారథి, కణేకల్లు హెచ్చెల్సీ డీఈఈ దివాకర్రెడ్డి, జేఈలు నరేంద్రమారుతి, అల్తాఫ్, నజురీద్దీన్ పాల్గొన్నారు. -
చీటింగ్ టీచరుకు ‘అధికార’ అండ
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యాపారులను చీటింగ్ చేసి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిన ప్రభుత్వ టీచరు కాకర్ల దివాకర్నాయుడుకు అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దలు అండగా నిలిచారు. ఈ క్రమంలో ఆయనపై కనీస చర్యలు తీసుకోకుండానే తాత్కాలికంగా సస్పెన్షన్ ఎత్తివేయించి ఉద్యోగంలో చేరేలా చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో జోరుగా చర్చ సాగుతోంది. అనంతపురంలోని రాజేంద్ర నగర పాలక ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కాకర్ల దివాకర్నాయుడు చీటీల వ్యాపారంతో సుమారు రూ. 10 కోట్ల దాకా మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత కూడా అసలు విషయం తెలీక కొందరు కొన్ని నెలలు పాటు క్రమం తప్పకుండా చీటీల మొత్తం చెల్లిస్తూ వచ్చారు. ఆయన భాగోతాన్ని గతేడాది జూలైలో వరుస కథనాలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో బాధితులంతా అప్రమత్తమైనా అప్పటికే జరగాల్సిన నష్టం బాగా జరిగింది. కలెక్టర్, ఎస్పీని కలిసి విన్నవించడంతో వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు.. కాకర్ల దివాకర్నాయుడుకు తూర్పు రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్సీ అండగా నిలిచినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి స్కూల్కు పంపాలని, జీతానికి ఇబ్బంది లేకుండా చూడాలంటూ అధికారులపై ఒత్తిళ్లు చేశారు. ఈ అంశంపై జిల్లా స్థాయి అధికారులు నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో రాయలసీమ స్థాయి అధికారిపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో దివాకర్నాయుడుకు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు ఇవ్వకముందే సస్పెన్షన్ ఎత్తివేసి మే 1న అబుల్ కలాం స్కూల్కు కేటాయించారు. ఆ తర్వాత ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు ఇచ్చారు. దీనిపై ఆయన వివరణ ఇస్తే ఆ తర్వాత విచారణకు ఓ అధికారిని నియమిస్తారు. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఇప్పటిదాకా ఆయన వివరణ కూడా ఇవ్వలేదని తెలిసింది. ఇదే అంశంపై డీఈఓ ప్రసాద్బాబు మాట్లాడుతూ.. ‘దివాకర్నాయుడుపై సస్పెన్షన్ ఎత్తివేశాం. ఆ తర్వాత చార్జెస్ నోటీసు జారీ చేశాం. వివరణ ఇచ్చాడో లేదో తెలీదు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఉండడం వల్ల కాస్తా ఆలస్యమైంది. వెంటనే వివరణ తీసుకుని విచారణ అధికారిని నియమిస్తాం. ఆలస్యం కాకుండా నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తాం’ అని పేర్కొన్నారు. లబోదిబోమంటున్న బాధితులు.. చీటింగ్ కేసు నిందితుడు దివాకర్నాయుడు దర్జాగా తిరుగాడుతుండగా మరోవైపు బాధితులు లబోదిబోమంటున్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతూ తమ డబ్బు చెల్లించకుండా చుక్కలు చూపిస్తున్నాడంటూ వాపోతున్రాను. ఇలాంటి వారికి అండగా నిలిచిన ప్రజా ప్రతినిధులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు ఇవ్వకముందే సస్పెన్షన్ ఎత్తివేత ఆ తర్వాత నోటీసు జారీ చేసిన అధికారులు విధుల్లో చేరి రెండు నెలలవుతున్నా నేటికీ ఇవ్వని వివరణ తెర వెనుక ఉంటూ మంత్రాంగం నడుపుతున్న ఓ ఎమ్మెల్సీ -
ఇలా.. ఇంకెన్నేళ్ల్లు?!
అనంతపురం కార్పొరేషన్: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుస్తున్న తమ సేవలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు మండిపడ్డారు. పదోన్నతులు కల్పించకుండా బదిలీలు చేపట్టాడాన్ని నిరసిస్తూ సోమవారం అనంతపురంలోని మున్సిపల్ ఆర్డీ కార్యాలయాన్ని జేఏసీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు అండగా నిలుస్తామని పాలకులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. సర్వీస్ రూల్స్ కల్పించాలని, క్యాడర్ గుర్తింపు, పదోన్నతి, టెక్నికల్ పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జాబ్ చార్ట్ లేకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. అసంబద్ధమైన జీఓ 423ను రద్దు చేసి, పారిశుద్ధ్య కార్యదర్శులకు న్యాయం చేయాలన్నారు. సర్వేల భారం తగ్గించాలని, నోషనల్ ఇంక్రిమెంట్స్, డీఏ, పీఆర్సీలను అమలు చేయాలన్నారు. అనంతరం డిమాండ్ల కూడిన వినతి పత్రాన్ని మునిసిపల్ ఆర్డీ విశ్వనాథ్కు అందించారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు లక్ష్మీనారాయణ, సుధాకర్, లక్ష్మి, నరేష్, నారాయణ, వరప్రసాద్, హనుమంతు, మల్లికార్జున, శివశంకర్, వినయ్, నరేష్, భగీరథ రెడ్డి, విమల, మౌలాలమ్మ, హారతి, శశికళ, స్వాతి తదితరులు పాల్గొన్నారు. మునిసిపల్ ఆర్డీ కార్యాలయం ఎదుట ధర్నాలో సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు -
పరిష్కార వేదికకు పోటెత్తిన ప్రజలు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 725 వినతులు అందాయి. డీఆర్ఓ ఎ.మలోలతో పాటు డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణారెడ్డి, ఆనంద్, వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు, వైద్యశాఖ ఏఓ మల్లికార్జునరెడ్డి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో డీఆర్ఓ సమీక్షించారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వినతుల్లో కొన్ని... ● దివ్యాంగ పింఛను ఇప్పించాలని ఆత్మకూరు మండలం వడ్డుపల్లికి చెందిన దివ్యాంగుడు బాలయోగి విన్నవించాడు. ప్రమాదం జరిగిన అనంతరం జరిగిన శస్త్రచికిత్సలో ఎడమ చేతిని మోచేతి వరకు తొలిగించారని చెప్పాడు. దీంతో పనులు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉందని వాపోయాడు. ● కుటుంబ పోషణ భారంగా మారిందని, తనకు పింఛను ఇప్పించి ఆదుకోవాలని విన్నవించాడు. ● వితంతు పింఛను మంజూరు చేయించాలని అనంతపురంలోని రాణీనగర్కు చెందిన నాగలక్ష్మి విన్నవించింది. తన భర్త శరబయ్యకు వృద్ధాప్య పింఛను వచ్చేదని గుర్తు చేశారు. ఆయన 2023, జూన్ 27న మరణించాడని వివరించింది. జీవనానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నానని, వితంతు పింఛను మంజూరు చేయించాలని వేడుకుంది. వివిధ సమస్యలపై 725 వినతులు అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టండి అధికారులకు డీఆర్ఓ మలోల ఆదేశం -
నీళ్లు రాకపోతే ఎలా బతకాలి?
● కళ్యాణదుర్గంలో రోడ్డెక్కిన మహిళలు కళ్యాణదుర్గం రూరల్: ‘నాలుగు నెలలుగా తాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది. మున్సిపల్ అధికారులు, కూటమి నేతలకు అనేక సార్లు తెలిపినా ఎవరూ పట్టించుకోలేదు. నీళ్లు రాకపోతే ఎలా బతకాలి’ అంటూ కళ్యాణదుర్గంవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 6, 11 వార్డుల పరిధిలోని రాచప్ప కుంట వీధి, వడ్డే బండ వీధి కాలనీవాసులు రోడ్డెక్కారు. సోమవారం ఖాళీ బిందెలతో టీ సర్కిల్ల్లో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయా కాలనీల మహిళలు మాట్లాడుతూ నాలుగు నెలలుగా నీటి సమస్య వేధిస్తోందన్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ఇప్పటికే అనేక సార్లు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మరచిపోతున్నారన్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామంటూ కుటుంబానికి రూ. 50 చొప్పున మున్సిపల్ అధికారులు వసూలు చేస్తున్నారన్నారు. ఆ ట్యాంకర్లు కూడా టీడీపీ నేతల ఇంటి ముందు మాత్రమే ఆగుతాయని, మరోచోటికి రమ్మంటే నీళ్లు అయిపోయాయని చెబుతున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ వంశీ అక్కడికి చేరుకుని మహిళలతో మాట్లాడారు. నాలుగు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమించారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మిరప రైతుకు కుచ్చుటోపీ బెళుగుప్ప: మండలంలోని శీర్పి గ్రామానికి చెందిన రైతు ఏకాంబరేశ్వర బ్యాంక్ ఖాతా నుంచి రూ.2 లక్షలను సైబర్ నేరగాళ్లు అపహరించారు. పోలీసులు తెలిపిన మేరకు... రైతు ఏకాంబరేశ్వర తనకున్న ఏడెకరాల పొలంలో మిరప పంట సాగుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల సాగు చేసిన పంట చేతికి రావడంతో మార్కెట్లో విక్రయించాడు. దీంతో కళ్యాణదుర్గంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లోని రైతు ఖాతా (5010 059 3095 411)కు రూ.2 లక్షలను వ్యాపారి జమ చేశాడు. ఈ క్రమంలో మరో పంట పెట్టేందుకు సిద్ధమైన రైతు రెండు రోజుల క్రితం పెట్టుబడుల కోసమని డబ్బు డ్రా చేసేందుకు బ్యాంక్కు వెళ్లాడు. అయితే బ్యాంక్ ఖాతాలో నగదు నిల్వ లేకపోవడంతో అధికారులను కలసి ఆరా తీశాడు. తన ఖాతా నుంచి ఈ నెల 11న రూ.లక్ష ఇండియన్ బ్యాంకుకు, మరో రూ.లక్ష మహీంద్రా బ్యాంకుకు బదిలీ అయినట్లు బ్యాంక్ అధికారులు తెలపడంతో తన ప్రమేయం లేకుండా నగదు ఎలా బదిలీ అవుతుందని ప్రశ్నించాడు. బ్యాంక్ అధికారులు పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో మోసపోయినట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ తెలిపారు. నాయకత్వ అభివృద్ధి శిక్షణకు సర్పంచు మోనాలిసా వజ్రకరూరు: వజ్రకరూరు మేజర్ పంచాయతీ సర్పంచు మోనాలిసా నాయకత్వ అభివృద్ధి శిక్షణకు ఎంపికయ్యారు. ఈ నెల 28 నుంచి జులై 4 వరకు ఢిల్లీలో నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. ఇటీవల ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమోక్రసీ అనే సంస్థ దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు నాయకత్వ లక్షణాలు కలిగిన మహిళా ప్రజాప్రతినిధులు 45 మందిని శిక్షణకు ఎంపిక చేసింది. ఇందులో వజ్రకరూరు మేజర్ పంచాయతీ సర్పంచు మోనాలిసా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా సర్పంచు మోనాలిసా మాట్లాడుతూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందిస్తానని పేర్కొన్నారు. అవార్డు అందుకున్న కలెక్టర్, ఎస్పీ అనంతపురం అర్బన్: ‘యోగాంధ్ర’లో భాగంగా ఈనెల 14న అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల యోగా కార్యక్రమానికి అవార్డు లభించింది. సోమవారం విజయవాడలో జరిగిన ‘తొలి అడుగు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా కలెక్టర్ వి.వినోద్కుమార్, ఎస్పీ పి.జగదీష్ అవార్డును అందుకున్నారు. -
వ్యాధులతో టమాఠా..
ఆత్మకూరు: టమాట రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడం, ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలతో బాసటగా నిలవాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం వెరసి నష్టాలే మిగులుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రైతులు టమాట పంట సాగు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల వరకు పంట సాగైంది. జిల్లాలోని కళ్యాణదుర్గం, ఆత్మకూరు, శెట్టూరు, కంబదూరు, రాయదుర్గం మండలాల్లో అధికంగా టమాట సాగులోకి వచ్చింది. వ్యాధులతో అతలాకుతలం.. టమాట పంటను రైతులు ప్రత్యేక శ్రద్ధతో కాపాడుకుంటారు. ఒక ఎకరా భూమిలో పంట సాగుకు రూ.50 వేలకు పైగా ఖర్చు వస్తోంది. నార, భూమి చదును, ఎరువులు, మందులు తదితరాలకు రైతులు ఈ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. నార పెట్టిన 70 రోజుల్లో పంట కోతకు వస్తుంది. రెండు నెలల క్రితం సాగు చేసిన పంటను ప్రస్తుతం కోయాల్సి ఉంది. అయితే, పంటలపై వ్యాధుల పంజా విసరడంతో ఆశించిన దిగుబడి కానరావడం లేదు. చెట్లకు పురుగు పట్టి కాయలపై మచ్చలు వస్తుండటంతో చాలా వరకూ కాయలు వృథాగా పోతున్నాయి. ఈ క్రమంలో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సాధారణంగా టమాట సీజన్ మొదట్లో అధిక ధరలు లభించేవి. కానీ, ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. సాయం కరువు.. రైతులకు ప్రభుత్వం నుంచి కూడా పైసా సాయం అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంత వరకు ‘అన్నదాత సుఖీభవ’ కింఈ పంట పెట్టుబడికి కనీస సాయం చేయలేదు. దీంతో బయట అప్పులు చేసి పంటలను సాగు చేసుకుంటున్నారు. ఎంతో శ్రమకోర్చి సాగు చేసిన పంట చివరికి నష్టాలే మిగులుస్తుండతంతో అన్నదాతల ఆవేదన అంతా ఇంతా కాదు. దీనికితోడు అధికారుల నుంచి కూడా భరోసా కరువవడంతో బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఎప్పటికప్పుడు పంట పొలాల్లో పర్యటించి సలహాలు సూచనలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. రోగాల బారిన టమాట పంట అధిక భాగం కాయలకు మచ్చలు పెరికి రోడ్డుపక్కన పడేస్తున్న రైతులు ప్రభుత్వ సాయమూ కరువవడంతో అన్నదాతలు నష్టాలపాలుప్రభుత్వం ఆదుకోవాలి రెండు ఎకరాల్లో టమాట పంటను సాగు చేశా. రూ. లక్ష ఖర్చు వచ్చింది. ఈ ఏడాది టమాట ధరలు అనుకున్న స్థాయిలో లేవు. ప్రభుత్వం కనీస మద్దతు ధరతో టమాటను కొనుగోలు చేయాలి. అధికారులు రైతులకు సలహాలు సూచనలిస్తే బాగుంటుంది. – బసవరాజు, దొడగట్ట గ్రామం, కళ్యాణదుర్గం మండలం పెట్టుబడి కూడా వస్తుందో లేదో? నాలుగు ఎకరాల్లో టమాట పంటను సాగు చేశా. ఇప్పటికే రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పంట దిగుబడి అనుకున్న స్థాయిలో లేదు. టమాట కాయలకు కూడా పూర్తిగా మచ్చలు వచ్చాయి. కనీసం పెట్టుబడి కూడా వస్తుందో లేదో అని ఆందోళనగా ఉంది. – కందుల పుల్లారెడ్డి, రైతు, ఆత్మకూరు -
కనికరం లేని కూటమి సర్కారు
అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్ల బదిలీలకు సంబంధించిన ఖాళీలపై ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. తక్కువ వేతనంతో పని చేస్తున్న వారిపట్ల కాసింత కనికరం కూడా చూపలేదు. ఈ క్రమంలో తొలిరోజు చూపించిన ఖాళీలకంటే ఒక్కటంటే ఒక్కటికూడా అదనంగా చూపించలేమంటూ అధికారులు తేల్చి చెప్పారు. మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 2008, 1998 డీఎస్సీ క్వాలిఫై అయి ప్రస్తుతం ఎంటీఎస్ కింద పని చేస్తున్న టీచర్లందరూ తప్పకుండా హాజరుకావాలని సూచించారు. ఇదిలాఉండగా...ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 594 మంది ఎంటీఎస్ టీచర్లు పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రస్తుతం ఎంటీఎస్ టీచర్లు పని చేస్తున్న స్థానాలన్నీ ఖాళీలుగా చూపించారు. అవి భర్తీ కావడంతో ప్రస్తుతం కౌన్సెలింగ్ ద్వారా సీనియార్టీ మేరకు జిల్లాలో ఉన్న ఖాళీలను అనుసరించి ఎంటీఎస్ టీచర్లను సర్దుబాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 693 ఖాళీలు చూపించి ఆదివారం కౌన్సెలింగ్ ప్రక్రియ ఏర్పాటు చేశారు. అయితే, పోస్టుల్లో 80 శాతం దాకా జిల్లా సరిహద్దు మండలాల్లోనే ఉండటంతో ఎంటీఎస్ టీచర్లు ఆందోళనకు దిగారు. అనంతపురం కార్పొరేషన్తో పాటు అన్ని మునిసిపాలిటీ కేంద్రాలు, సింగిల్ టీచరు పని చేస్తున్న స్కూళ్లకు తమను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆందోళన చేపట్టారు. డీఈఓ ఎం.ప్రసాద్బాబు పలుమార్లు ఆర్జేడీ, రాష్ట్ర అధికారులతో ఫోన్లో చర్చించినా ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో రాత్రి 7 గంటల సమయంలో ప్రక్రియను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించి కౌన్సెలింగ్ కేంద్రం నుంచి అందరూ వెళ్లిపోయారు. నేడు కౌన్సెలింగ్ ఎంటీఎస్ టీచర్ల బదిలీలకు మంగళవారం ఉదయం 9 గంటలకు సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎం.ప్రసాద్బాబు తెలిపారు. ఖాళీలను చూపించే విషయంలో ఎంటీఎస్ టీచర్ల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రస్తుతం ప్రకటించిన ఖాళీలకు మించి ఏ ఒక్కటీ అదనంగా చూపించే వీలులేదని తేల్చి చెప్పినట్లు గుర్తు చేశారు. కౌన్సెలింగ్కు అందరూ విధిగా హాజరుకావాలని కోరారు. ఎంటీఎస్ టీచర్లపై దయ చూపని చంద్రబాబు ప్రభుత్వం బదిలీ ఖాళీలపై వెనక్కు తగ్గని వైనం -
ఆలయంలో అర్చకత్వంపై రగడ
రాయదుర్గం టౌన్: స్థానిక కోటలో వెలసిన పురాతన ప్రసన్న వేంటకరమణస్వామి ఆలయ అర్చకత్వంపై అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి ఆలయంలోనే ఆదివారం ఘర్షణకు దిగారు. శ్రీవారి సన్నిధిలోనే అర్చకులు, వారి బంధువులు కొట్టుకునే స్థాయిలో గొడవపడ్డారు. వివరాలు... ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయంలో 14 ఏళ్లుగా అర్చకుడు నరసింహమూర్తి, ఆయన కుటుంబసభ్యులే అర్చకత్వం నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీవైష్ణవులే అర్చకత్వం వహించాలని పలువురు భక్తుల డిమాండ్ మేరకు నరసింహమూర్తిని తొలగించి దేవాదాయశాఖ అధికారులు 8 నెలల క్రితం బాల మురళీకృష్ణకు అర్చకత్వ బాధ్యతలను అప్పగించారు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును నరసింహమూర్తి ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఉత్తర్వులు నరసింహమూర్తికి అనుకూలంగా రావడంతో ఆయనక అర్చకత్వం బాధ్యతలను ఆదివారం ఉదయం దేవాదాయశాఖ ఈఓ నరసింహారెడ్డి అప్పగించారు. విషయం తెలియగానే ప్రస్తుత అర్చకులు, వారి బంధువులు ఆలయానికి తరలివచ్చి గొడవకు దిగారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్దంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. కొందరు ప్రముఖులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. కోర్టు ఉత్తర్వ్ల మేరకు తనకు న్యాయం చేయాలని నరసింహమూర్తి డిమాండ్ చేస్తుండగా, వారసత్వంగా వస్తున్న సంప్రదాయం మేరకు అర్చకత్వాన్ని తామే నిర్వహించాలని ప్రస్తుత అర్చకులు బాల మురళీకృష్ణ డిమాండ్ చేశారు. మరో వైపు శ్రీవారి ఆలయంలో శాస్త్ర ప్రకారం శ్రీవైష్ణవులే పూజారులుగా కొనసాగించాలని కొందరు పట్టుబట్టారు. ఈ విషయమై ఈఓ నరసింహరెడ్డిని వివరణ కోరగా కోర్టు ఉత్తర్వుల మేరకు తాము నడుచుకుంటూ నరసింహమూర్తికి తాళాలు అప్పగించామని స్పష్టం చేశారు. -
కలెక్టరేట్ వద్ద నేడు ధర్నాలు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలనే డిమాండ్తో వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23న ‘యువత పోరు’ పేరుతో ధర్నా నిర్వహించనున్నారు. అలాగే మునిసిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలనే డిమాండ్తో సీఐటీయూ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికుల ధర్నా, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో సీఐటీయూ అనుబంధ అంగన్వాడీ వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. ఆటో బోల్తా – ఒకరి మృతిఉరవకొండ రూరల్: ఆటో బోల్తాపడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఓ యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన వన్నూరుస్వామి తన కుటుంబంతో కలసి శనివారం పెన్నహోబిలం క్షేత్ర దర్శనానికి వచ్చారు. రాత్రికి అక్కడే బస చేసిన వారు.. ఆదివారం ఉదయం పూజాదికాలు ముగించుకున్న అనంతరం ఆటోలో తిరుగు ప్రయాణ మయ్యారు. క్షేత్ర సమీపంలోనే ఆమిద్యాల మార్గంలో డ్రైవర్ అతి వేగంగా నడుపుతూ మలుపు వద్ద వేగాన్ని నియంత్రించుకోలేక పోవడంతో ఒక్కసారిగా ఆటో బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న లావణ్య (18)కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఉరవకొండలోని సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఇదే ఘటనలో లావణ్య కుటుంబసభ్యులు ఆరుగురు గాయపడ్డారు. ఘటనపై ఎస్ఐ జనర్దాననాయుడు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరు ● సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ తాడిపత్రి రూరల్: ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం ఎవరితరం కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ అన్నారు. తాడిపత్రిలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం సీపీఐ పట్టణ 3వ మహా సభలు జరిగాయి. ఆదివారం జరిగిన కార్యక్రమంలో జాఫర్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీల సాధనకు ఎన్ని ఉద్యమాలైనా చేస్తామన్నారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన హామీని నిలుపుకోలేకపోయిందన్నారు. ఈ క్రమంలో హామీల సాధనకు కూటమి ప్రభుత్వం మెడలు వంచేందుకు జిల్లా వ్యాఫ్తంగా చేపట్టిన ప్రజా ఉద్యమానికి విశేష స్పందన లభించిందన్నారు. అప్పట్లో చేపట్టిన ప్రజా ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కూటమి నేతలు అడ్డంకులు సృష్టించినా ఫలితం లేకపోయిందన్నారు. మహా సభలకు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి రాజారెడ్డి, తాడిపత్రి నియోజక వర్గ కార్యదర్శి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. మూడో సారి పట్టణ కార్యదర్శిగా చిరంజీవి.. మహాసభల్లో తాడిపత్రి పట్టణ సీపీఐ కమిటీని ఎన్నుకున్నారు. మూడో సారి కూడా చిరంజీవినే పట్టణ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శులుగా నాగేంద్ర శ్రీరాములును ఎంపిక చేశారు. మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి ఆత్మహత్యాయత్నం ధర్మవరం అర్బన్: భార్య మద్యం తాగొద్దన్నందుకు మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. పట్టణంలోని గీతానగర్కు చెందిన బేల్దారి పనిచేసే ఏడుకొండలు మద్యం తాగే అలవాటు ఉంది. తాగుడు మానేయాలని భార్య పావని చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం శ్మశాన వాటిక వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనస్థలానికి చేరుకుని అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రోటావేటర్లో పడి విద్యార్థి దుర్మరణం
రొద్దం: ప్రమాదవశాత్తు రోటావేటర్లో పడి ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రొద్దం మండలం రాగిమేకులపల్లికి చెందిన నరసింహులు కుమారుడు ప్రేమ్కై లాష్ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి పట్టునే ఉన్న బాలుడు.. ఓ రైతు పొలాన్ని విత్తుకు సిద్ధం చేసేందుకు వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్తో కలసి వెళ్లాడు. పొలంలో ట్రాక్టర్కు రోటావేటర్ అమర్చుకుని డ్రైవర్ పొలాన్ని కలియబెడుతుండగా దానిపై కూర్చొని ఉన్న ప్రేమ్కై లాష్ పట్టు తప్పి కిందపడ్డాడు. అదే సమయంలో రోటావేటర్ ముందుకు సాగడంతో అందులో చిక్కుకున్నాడు. డ్రైవర్ గమనించి ట్రాక్టర్ ఆపేలోపు ప్రాణాలు కోల్పోయాడు. వెలికి తీసేందుకు వీలు లేనంతగా చిన్నారి శరీరం అందులో చిక్కుకుపోయింది. మొండెం నుంచి తల వేరుపడింది. కుమారుడు మృతితో నరసింహులున అలివేలమ్మ దంపతులు బోరున విలపించారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ సోమిరెడ్డి పరామర్శించి, ఓదర్చారు. -
మలి వయసులో ఆసరా
అనంతపురం అర్బన్: సీనియర్ సిటిజన్ కార్డు ఒక్కటి ఉంటే చాటు ప్రభుత్వం నుంచి లభించే చాలా ప్రయోజనాలు అందుతాయి. 60 ఏళ్లు, ఆపై వయసున్న వారు సీనియర్ సిటిజన్ కార్డు పొందేందుకు అర్హులు. కార్డు తీసుకున్నవారికి ఆర్థిక, వైద్య, ప్రయాణ, పన్ను మినహాయింపు వంటి పలు ప్రయోజనాలు చేకూరుతాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఎఫ్డీలపై అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ వంటి ప్రభుత్వరంగ టెలికాం సంస్థలు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ప్లాన్లు ఇస్తాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ డిజిటల్ సేవల్లో సీనియర్ సిటిజన్ కార్డుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ● రైల్వే, ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్లకు టికెట్ ధరపై తగ్గింపు ఉంటుంది ● ఐఆర్సీటీసీ లేదా టికెట్ బుక్కింగ్ సమయంలో రాయితీ వర్తిస్తుంది. ● విమాన ప్రయాణాల్లోనూ కొన్నిసార్లు రాయితీలు ఉంటాయి. ● బస్సు పాసు తీసుకుంటే నెలవారీ ప్రయోజనాలు ఎక్కువగా లభిస్తాయి. ● ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ● వైద్య పరీక్షలు, చికిత్సలపై ఆస్పత్రుల్లో రాయితీలు లభిస్తాయి. ● ఔషధాల మీద కొన్ని ఫార్మసీల్లో తగ్గింపు లభిస్తుంది. ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాధాన్యతగా వైద్యం అందిస్తారు. ● ఈఎస్ఐసీ, సీజీహెచ్ఎస్ పథకాల్లో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. ● తలసేమియా, క్యాన్సర్, వైద్య రీయింబర్స్మెంట్ స్కీముల్లో అర్హత. ● ఆదాయ పన్నులో ప్రత్యేక మినహాయింపు ఉంటుంది. ● 2025–26లో రూ.3 లక్షల వరకు ఆదాయానికి పన్నులు చెల్లించనవసరం లేదు. ● 80డి కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై అధిక మినహాయింపు ఉంటుంది. ● 80టీటీబీ కింద ఎఫ్డీల మీద వడ్డీ ఆదాయానికి రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ● ఫారం 15 హెచ్ ద్వారా టీడీఎస్ మినహాయింపు పొందవచ్చు. ● పన్ను ఫైలింగ్ను సులభతరం చేసేందుకు ప్రత్యేక హెల్డ్ డెస్క్లు ఉంటాయి. ● రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ సిటిజన్ పోర్టల్ లేదా సర్కారీ సువిధ (https://sarkarisuvidha. online/) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ● ఆమోదం పొందిన తరువాత సీనియర్ సిటిజన్ కార్డును ఆన్లైన్లోనే పొందవచ్చు. ● సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) లేదా నగర, పురపాలక సంఘం కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ● దరఖాస్తు ఫారం, రెండు ఫొటోలు, చిరునామా, వయసు రుజుపు పత్రాలను అధికారులకు అందించాలి. ● ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లేదా పాన్ కార్డ్ ● జనన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్ లేదా పాన్కార్డ్ ● విద్యుత్ బిల్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ ● ఇటీవల తీయించుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు ● బ్యాంక్ పాస్బుక్ ● ఆరోగ్య పత్ర ఏబీహెచ్ఏ కార్డు, హెల్త్ ఐడీ. 60 ఏళ్లు, అంతకుపైబడి వయసున్న వారికి సీనియర్ సిటిజన్ కార్డు ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తుకు అవకాశం జిల్లా కేంద్రాల్లోనే పొందే అవకాశం ఆరోగ్య బీమా, వైద్య రాయితీ దరఖాస్తు ఇలా అవసరమైన పత్రాలు.. ప్రయాణంలో రాయితీ పన్ను మినహాయింపు -
రాజకీయ చట్రంలో ‘రెవెన్యూ’
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగాన్ని శాసించే రెవెన్యూ శాఖ అధికార పార్టీకి దాసోహమంటూ పూర్తిగా రాజకీయ చట్రంలో బందీగా మారింది. ఈ శాఖలోని అన్నిస్థాయిల అధికారులపై మితిమీరిన రాజకీయ పెత్తనం స్పష్టంగా కనిపిస్తోంది. వివాదాల పరిష్కారం ఊసే ఉండదు. విజ్ఞప్తులకూ స్పందించరు. కేవలం ప్రజాప్రతినిధుల సిఫారసులకు మాత్రమే రెవెన్యూ అధికారులు పెద్దపీట వేస్తున్నారు. ఇటీవల జరిగిన తహసీల్దార్ల బదిలీల ప్రక్రియనే ఇందుకు నిదర్శనం. సిఫారసులకు వెంపర్లాట.. తహసీల్దారు అంటే మండల స్థాయి మెజిస్ట్రేట్. ఇంతటి హోదాలో ఉంటూ తాత్కాలిక లబ్ధి కోసం ప్రజాప్రతినిధులను ఆశ్రయించి కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్ వేయించుకుంటున్నారు. ఈ తీరే వారి అస్థిత్వాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు అధికారులను పావులుగా వాడుకుంటూ వారిచేత చట్టవిరుద్ధంగా తమకు కావాల్సిన పనులను చేయించుకుంటున్నారు. దాసోహమంటూ.. ప్రజాప్రతినిధుల సిఫారసులతో పోస్టింగ్ పొందిన అధికారులు ఒక రకంగా వారికి దాసోహమై పని చేయాల్సి వస్తోంది. వారు చెప్పినట్లుగా నిబంధనలకు విరుద్ధంగా తప్పులు చేయక తప్పడం లేదు. ప్రధానంగా భూముల విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులు చెప్పినట్లుగా చట్ట విరుద్ధంగా నడుచుకోవాల్సి వస్తోంది. 2014–19 మధ్యకాలంలో జిల్లాలోని కొన్ని మండలాల్లో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల మేరకు తహసీల్దారులు కొండ గుట్టలను, ప్రభుత్వ భూములను, వాగులు, వంకల స్థలాలను టీడీపీ నాయకుల అనుచరులకు కట్టబెట్టి... అందుకు సస్పెన్షన్ అనే మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికే ఓ తహసీల్దారుకు పెన్షన్లో కోత పడింది. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్.. ప్రజాప్రతినిధులు సిఫారుసు, అండతో పోస్టింగ్ పొందిన వారు ఉన్నతాధికారుల ఆదేశాలనూ బేఖాతర్ చేస్తున్నారు. బదిలీ చేస్తే ప్రజాప్రతినిధులతో ఫోన్ చేయించి కోరిన స్థానానికి రీ–ఆర్డర్ తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు సైతం ప్రజాప్రతినిధుల సిఫారసులకు తలొగ్గుతున్నారు. ఇటీవల కొందరు తహసీల్దార్ల బదిలీల ప్రక్రియలో ఈ తంతు ఓ ప్రహసనంలా మారింది. పావులా వాడుకున్న వారు నష్టం జరిగినప్పుడు కనీసంగానూ పట్టించుకోవడం లేదని ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడిన పలువురు వాపోతున్నారు. వివాదాలు పరిష్కరించరు.. విజ్ఞప్తులకు స్పందించరు అన్నిస్థాయిల అధికారులపై అలవిగాని పెత్తనం ప్రజాప్రతినిధుల సిఫారసులకే పెద్దపీట -
ఆర్డీటీని కాపాడుకుందాం
అనంతపురం: ఐదున్నర దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలో విశిష్ట సేవలు అందించిన ఆర్డీటీని కాపాడుకుందామని సీనియర్ క్రికెటర్లు పిలుపునిచ్చారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ క్రికెటర్లు ఆర్డీటీ పరిరక్షణకు ఆదివారం కదం తొక్కారు. పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టిన రంజీ క్రీడాకారులు, మాజీ క్రీడాకారులు, మహిళా క్రికెటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ‘ సేవ్ ఆర్డీటీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతపురంలోని టవర్క్లాక్ వద్ద ప్రారంభమైన కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్న ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహం వరకూ కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆర్డీటీకి అన్ని విధాలుగా క్రికెటర్లు తోడుగా ఉంటాం. ఆర్డీటీ సేవలు కొనసాగేలా సంస్థకు ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయాలంటూ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవలు అగితే పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు భారీగా నష్టపోతారన్నారు. నిరుపేదలకు వైద్య సేవలు, క్రీడాకారులకు చేయూత, పేద విద్యార్థులకు ఉన్నత విద్యకు దన్నుగా నిలుస్తున్న ఆర్డీటీ సేవలు కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పగడాల మల్లికార్జున, సభాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం వెంటనే ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ చేసే వరకూ ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఐపీఎల్ క్రీడాకారుడు విజయకుమార్, ఏడీసీఏ జిల్లా కార్యదర్శి భీమలింగారెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, షాబుద్దీన్, ప్రసాదరెడ్డి, రంజీ క్రికెటర్లు సురేష్ మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ క్రికెటర్లు శ్రీనివాసులు, కమలాకర్నాయుడు, సీతారామారావు, రవీంద్రనాథ్, చంద్రమోహన్రెడ్డి, రంజీ మాజీ క్రికెటర్లు ఫయాజ్, షాషా వలి, మురళి, సర్దార్, సాగర్, విజయ్రాజు, దాదా ఖలందర్, సాదిక్, రంజీ క్రికెటర్లు వినయ్కుమార్, మచ్చా దత్తారెడ్డి, కోగటం హనీష్ వీరారెడ్డి, దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
చీనీ చెట్లు దగ్ధం
కూడేరు: మండలంలోని ఇప్పేరు గ్రామానికి చెందిన రైతు ఎన్.దస్తగిరి సాగు చేసిన చీనీ తోటలో ఆదివారం ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి తోటను చుట్టుముట్టాయి. దీంతో 8 ఏళ్ల వయసున్న 80 చీనీ చెట్లు, డ్రిప్ పరికరాలు, మోటారు కాలిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లో సమస్య ఉందని పలుమార్లు ట్రాన్స్ కో అధికారులకు తెలిపినా వారు పట్టించుకోలేదని, నష్టానికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమని ఈ సందర్భంగా బాధిత రైతు వాపోయాడు. రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు కనగానపల్లి: మండలంలోని కుర్లపల్లి గ్రామంలో ఆదివారం టీడీపీ కార్యకర్తల మధ్యన ఘర్షణ చోటు చేసుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. స్థానికులు తెలిపిన మేరకు.. టీడీపీ కార్యకర్త శంకర్ గ్రామంలోని ఆలయం వద్ద ఆదివారం మద్యం సేవిస్తుండగా అటుగా వెళ్తున్న మరో టీడీపీ కార్యకర్త శ్రీకాంత్రెడ్డి గమనించి పక్కకు వెళ్లి తాగాలని హితవు పలికాడు. ఆ సమయంలో శ్రీకాంత్రెడ్డితో శంకర్ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి కొట్టుకున్నారు. అనంతరం ఇద్దరూ కనగానపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదుల మేరకు ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒంటరి జీవితాన్ని తాళలేక వృద్ధురాలి బలవన్మరణం ఆత్మకూరు: మండల కేంద్రానికి చెందిన తిమ్మక్క (68) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు పెళ్లి కాలేదు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో ఒంటరి జీవితాన్ని తాళలేక మనోవేదనకు లోనైన ఆమె గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఆదివారం దూకి బలవన్మరణానికి పాల్పడింది. అటుగా వెళ్లిన వారు బావిలో తేలుతున్న మృతదేహాన్ని గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వెలికి తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రతి గొర్రెకూ ఓ ధర!
యాడికి: ఉమ్మడి జిల్లాలో ఉరవకొండ, కదిరి తర్వాత మేకలు, గొర్రెల సంతకు యాడికి ఖ్యాతి గాంచింది. ప్రతి సోమవారం నిర్వహించే ఈ సంతకు తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తుంటారు. ఏడాది క్రితం వరకూ ఇక్కడ వ్యాపార లావాదేవీలు సక్రమంగా సాగుతూ వచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధనార్జనే ధ్యేయంగా కొందరు టీడీపీ నేతలు అక్రమ వసూళ్లకు తెరలేపారు. సంత నుంచి గొర్రె కానీ, మేక కాని బయటకు తీసుకెళితే రూ.20 చెల్లించుకోవాలి. ఇవ్వకుంటే బెదిరింపులకు పాల్పడుతున్నారు. మార్కెట్ యార్డుకు రూ.24 లక్షల ఆదాయం యాడికి నుంచి వేములపాడుకు వెళ్లే మార్గంలో ఉన్న వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో గతంలో ప్రతి సోమవారం గొర్రెల సంత నిర్వహించేవారు. పెద్ద సంఖ్యలో వాహనాల్లో గొర్రెలు, మేకలను తీసుకొచ్చి క్రయవిక్రయాలు సాగించేవారు. ప్రతి సోమవారం 1,500 నుంచి 2,500 వరకూ జీవాలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. అప్పట్లో తాడిపత్రి మార్కెట్ యార్డుకు చెందిన సిబ్బంది నిర్ణీత రుసుం వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసేవారు. ఇలా గొర్రెల సంత ద్వారా ప్రతి సోమవారం రూ.40 వేలకు పైగా ఆదాయం ప్రభుత్వానికి సమకూరేది. ఈ లెక్కన నెలకు రూ.1.60 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా, ఏడాదికి రూ.24 లక్షల వరకూ మార్కెట్ ఫీజులు వసూళ్లయ్యేవి. ఇక పండుగల సందర్భంలో ఈ ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉండేది. ధనార్జనే ధ్యేంగా... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత గొర్రెల సంత ఆదాయంపై స్థానిక టీడీపీ నేత కన్ను పడింది. ఈ నేపథ్యంలో మరికొందరితో కుమ్మకై 4 నెలలుగా అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఈ క్రమంలో తమ దందాకు అనుకూలంగా ఉండేలా కుట్రలు పన్ని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డులోని గొర్రెల సంతను యాడికి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోన రోడ్డుకు మార్చేలా చేశారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి మార్కెట్ యార్డు ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గొర్రెలు, మేకలు విక్రయించిన వారి నుంచే నిర్ణీత రుసుం వసూలు చేయాల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా జీవాలు విక్రయించిన వారితో పాటు కొనుగోలు చేసిన వారి నుంచి కూడా రూ.20 వసూలు చేస్తున్నారు. చెల్లించకపోతే జీవాలను గేటు దాటనివ్వకుండా దౌర్జన్యాలకు దిగుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇదే విషయాన్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి దృష్టికి వ్యవసాయ మార్కెట్ అధికారులు తీసుకెళ్లారు. ఏటా గొర్రెల సంత ద్వారా మార్కెట్ యార్డుకు సమకూరుతున్న రూ.24 లక్షల ఆదాయానికి కొందరు టీడీపీ నేతలు గండి కొడుతున్నారని, ఈ అక్రమాలను అరికట్టాలని అభ్యర్థించినట్లు విశ్వసనీయ సమాచారం. అయినా దీనిపై ఎలాంటి చర్యలూ లేవు. మార్కెట్ యార్డు నుంచి బయటపడిన తర్వాత గొర్రెల సంతపై ఆదాయం స్థానిక పంచాయతీకి చెందాల్సి ఉంది. అయినా పంచాయతీకి నయాపైసా ఆదాయం సమకూరడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గతంలో మాదిరిగానే గొర్రెల సంతను వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డుకు తరలించి, ఆదాయం ప్రభుత్వానికే సమకూరేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. టీడీపీ నేతల నయా దందా సంతలో నుంచి గొర్రె బయటకు పోతే రూ.20 చెల్లించాలి ప్రతి సోమవారం అప్పనంగా రూ.50వేలకు పైగా అక్రమ వసూళ్లు -
మారమన్నందుకు మట్టుబెట్టాడు!
కనగానపల్లి: వ్యసనాలు మాని కుటుంబపోషణపై దృష్టి సారించాలని హితవు పలికినందుకు కట్టుకున్న భార్యనే ఓ కసాయి కడతేర్చిన ఘటన కనగానపల్లి మండలంలో సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు... మండల కేంద్రం కనగానపల్లికి చెందిన బోయ రాఘవ, కళావతి (32) దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో ఏడాదిగా రాఘవ మద్యానికి బానిసయ్యాడు. మద్యం కొనుగోలు చేసేందుకు అవసరమైన డబ్బు కోసం నేర ప్రవృత్తిని అలవర్చుకున్నాడు. దీంతో తరచూ దంపతుల మధ్య గొడవలు చోటుచేసుకునేవి. కట్టెల కోసమని వెళ్లి... శనివారం సాయంత్రం కట్టెల కోసమని గ్రామ శివారులోని ముళ్ల పొదల్లోకి కళావతితో పాటు రాఘవ వెళ్లాడు. అదే సమయంలో మరోసారి మద్యంతో పాటు ఇతర వ్యసనాలు మానుకోవాలని రాఘవకు భార్య హితవు పలికింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాఘవ...ఆమెతో ఏకీభవించకుండా వాగ్వాదానికి దిగి కొడవలితో దాడి చేశాడు. కుప్పకూలిన భార్య తలపై కంప కట్టెతో బాదడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమెను అక్కడే వదిలేసి రాఘవ ఇంటికి చేరుకున్నాడు. మొదట మిస్సింగ్ కింద ఫిర్యాదు.. చీకటి పడుతున్నా కుమార్తె ఇంటికి రాకపోవడంతో కళావతి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కుటుంబ సభ్యులతో కలసి ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆ సమయంలో వారితో పాటు రాఘవ కూడా ఉన్నాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా కళావతి కోసం గాలింపు చేపట్టారు. మధ్యాహ్నం గ్రామ సమీపంలోని ముళ్ల పొదల వైపుగా వెళ్లిన స్థానికులు అక్కడ మహిళ మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కళావతి మృతదేహంగా గుర్తించి కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. విషయం తెలుసుకున్న రామగిరి సీఐ శ్రీధర్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.రాఘవ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే హతమార్చినట్లు అంగీకరించినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను కొట్టి చంపిన భర్త తొలుత మిస్సింగ్ కింద పోలీసులకు ఫిర్యాదు ముళ్లపొదల్లో లభ్యమైన మృతదేహం -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. రెవెన్యూభవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. అర్జీలో ఆధార్, ఫోన్ నంబర్లు పొందుపరచాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలని సూచించారు. టీబీ డ్యాం @ 45 టీఎంసీలు బొమ్మనహాళ్: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయం నీటితో కళకళలాడుతోంది. డ్యాం మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి 45 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్ఫ్లో 30,594 క్యూసెక్కులుగా నమోదైంది. డ్యాంలో గతేడాది ఇదే సమయానికి 1,582.11 అడుగుల వద్ద 5.580 టీఎంసీల నీరు నిల్వ ఉండింది. 638 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,966 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండేదని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. విజయవాడ వెళ్లిన కలెక్టర్ ● జేసీ, ఆర్డీఓలు కూడా.. అనంతపురం అర్బన్: కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, ఆర్డీఓలు కూడా వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా సోమవారం విజయవాడలో నిర్వహిస్తున్న ‘తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీరందరూ వెళ్లినట్లు తెలిసింది. తిరిగి ఈనెల 24న విధులకు హాజరవుతారని కలెక్టర్ కార్యాలయ అధికారవర్గాలు తెలిపాయి. కామన్ తేదీ వేసేలా చర్యలు తీసుకోండిఅనంతపురం ఎడ్యుకేషన్: ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా పాఠశాల సహాయకులకు (హిందీ, తెలుగు) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిలీవింగ్ తేదీ కామన్గా వేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్యూపీపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం డీఈఓ ఎం.ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తెలుగు, హిందీ సహాయకులు తప్ప తక్కిన అందరు 8న రిలీవ్ అయి 9న కొత్త స్కూళ్లలో చేరారన్నారు. పీడీలు 14న రిలీవ్ అయి 15న చేరారన్నారు. తెలుగు, హిందీ టీచర్లు మాత్రం 15న రిలీవ్ అయి 16న చేరాలంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చారన్నారు. ఎలాంటి ఉత్తర్వులు లేనికారణంగా భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. హిందీ,తెలుగు టీచర్లను కూడా 8న రిలీవ్ చేసి 9న కొత్త స్కూళ్లలో చేరినట్లు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. డీఈఓను కలిసిన వారిలో ఆర్యూపీపీ జిల్లా గౌరవాధ్యక్షులు సి.ఎర్రిస్వామి, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వి.హనుమేష్, జి.తులశిరెడ్డి ఉన్నారు. ఆర్చకుడిపై బూతులతో రెచ్చిపోయిన ఈఓ పుట్లూరు: మండలంలోని చింతకుంట ఆలయ అర్చకుడు సూర్యప్రకాష్మూర్తిపై దేవదాయ శాఖ ఈఓ మురళీకృష్ణ బూతులతో రెచ్చిపోయారు. ఆలయంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి సూర్యప్రకాష్ మూర్తి తీసుకెళ్లారు. ఈ విషయం గిట్టని ఈఓ మురళీకృష్ణ అసభ్య పదజాలంతో అర్చకుడిపై మండిపడ్డారు. ‘సార్.. నేను మీపై ఫిర్యాదు చేయలేదు. సమస్య పరిష్కరించాలని కోరా’ అంటూ అర్చకుడు సర్దిచెప్పినా వినకుండా ఫోన్ కట్ చేయడం గమనార్హం. ఈ ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈఓ తీరుపై అర్చకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
అధికారం కోసం యువతకు అలవిగాని హామీలు గుప్పించారు. లేనిపోని ఆశలు కల్పించారు. అయితే, సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయినా ఒక్క హామీ అమలు చేయకుండా కుచ్చుటోపీ పెట్టారు. ఈ క్రమంలో యువతకు బాసటగా, చంద్రబాబు ప్రభుత్వ కపటత్వాన్ని నిరసిస్తూ, హామీల అమలు కోసం వైఎస్
మేనిఫెస్టో అమలు చేయాలి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. నిరుద్యోగ భృతిపై వెంటనే విధివిధానాలు విడుదల చేయాలి. ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ. 3 వేల చొప్పున అందజేయాలి. – కే. అశ్విని, బీఎస్సీ, అనంతపురంఅనంతపురం: ‘యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం... ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేల భృతి అందిస్తాం..’ అంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో యువతను మభ్యపెట్టిన చంద్రబాబు అండ్ కో.. నేడు ఆ ఊసే ఎత్తడం లేదు. పథకాలకు పేర్లు మార్చారే కానీ అమలు సంగతే మర్చిపోయారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలనూ తొలగించి రోడ్డుపాలు చేస్తున్నారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు. ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు ‘వసతి దీవెన’ అందించకపోవడంతో అప్పు భారం పడి ఆందోళన చెందుతున్నారు. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు.. చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉన్నత విద్య, ఉద్యోగాల సమయంలో సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ కాలేజీలకు ఫీజులు చెల్లిస్తున్నారు. వాస్తవానికి గడిచిన విద్యా సంవత్సరంలో చివరి రెండు త్రైమాసికాలకు ఫీజు రీయింబర్స్మెంట్, ‘వసతి దీవెన’ నిధులు గతేడాది జూన్లో చెల్లించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మళ్లీ వైఎస్ జగన్ సర్కారు వచ్చి ఉంటే డబ్బులు తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమయ్యేవి. కానీ, కూటమి అధికారంలోకి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధుల విడుదలను నిలిపివేసింది. పాత బకాయిలూ ఇచ్చిన ఘనత జగన్దే.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ చిత్తశుద్ధితో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. ప్రతి త్రైమాసికానికి ముందే నిధులు విడుదల చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఖాతాల్లోకి ఫీజు మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. పైగా రాజకీయాలకు అతీతంగా 2017–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం చెల్లించి పెద్ద మనసు చాటుకున్నారు. గతమెంతో ఘనం.. యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది. జిల్లాలో 18 వేల సచివాలయ ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖల్లో 8 వేల ఉద్యోగాల భర్తీతో పాటు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ఊరట కల్పించారు. యువతకు చంద్రబాబు అండ్ కో మోసం ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీ హుళక్కి కానరాని ‘ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ. 3 వేల భృతి’ ఫీజు బకాయిలు చెల్లించని వైనం ఉన్నత విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థులు ‘కూటమి’ కపటత్వాన్ని నిరసిస్తూ నేడు వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ నేడు వైఎస్సార్సీపీ యువత పోరుయువత పక్షాన నిలుస్తూ సోమవారం అనంతపురం కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ‘యువత పోరు’ ధర్నా నిర్వహిస్తోంది. యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో పాటు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
అనుబంధం.. అధ్వానం!
అనంతపురం అగ్రికల్చర్: ‘‘వ్యవసాయం దండగమారి... ఉచిత విద్యుత్ అమలు చేస్తే తీగలపై బట్టలు ఆరేసుకుంటారు... ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇస్తూపోతే పరిహారం కోసమైనా చస్తారు... పావలా వడ్డీ వేస్ట్... రాయితీలు ఇవ్వకూడదు’’ అంటూ వ్యవసాయ రంగాన్ని, రైతులను ఒకప్పుడు హేళన చేసిన చంద్ర బాబు.. ఇంకా తన తీరు మార్చుకోనట్లే కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు ‘సూపర్సిక్స్’, ‘అన్నదాత సుఖీభవ’ అంటూ మభ్యపెట్టి మరోసారి అధికారంలోకి వచ్చినా.... పాత బాణీ మరచిపోకుండా రైతులను దగా చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయినా ఎటువంటి సాయం చేయకుండా వ్యవసాయ రంగంతో పాటు అనుబంధ రంగాలైన పట్టు, పాడి, పశుపోషణ, ఉద్యాన తదితర రంగాలపై ఆధారపడిన రైతులను కూడా నష్టాల బాట పట్టించారు. మూగ వేదన.. పట్టుపరిశ్రమశాఖ ద్వారా మల్బరీ (రేషం) రైతులకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, బడ్జెట్ ఇవ్వకపోవడంతో మల్బరీ విస్తీర్ణం తగ్గుముఖం పడుతోంది. మల్బరీ రైతులు ఇతర పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. ఇక పాడి రైతులకు ఎంతో మేలు చేస్తున్న ‘అమూల్ పాల వెల్లువ’ను నిలిపివేయడంతో హెరిటేజ్ లాంటి ప్రైవేట్ డెయిరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పాల ధరలు పెంచాల్సింది పోయి లీటర్పై రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించేయడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. పశుపోషణకు ఎలాంటి పథకాలు అమలు చేయలేదు. కంటితుడుపుగా గడ్డి విత్తనాలు, పశుదాణా, గడ్డి కత్తిరించే యంత్రాలు ఇచ్చారు. పశుబీమా లేకపోవడంతో పాడి రైతులు, జీవాల కాపర్లు నష్టపోతున్నారు. ఏడాది కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 500 వరకు పశువులు, గేదెలు, 2,500 వరకు జీవాలు మృత్యువాత పడినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచిత బీమా పథకం అమలు చేయడంతో పశువులు, జీవాలు చనిపోయినప్పుడు 8 వేల మంది లబ్ధిదారులకు రూ.26 కోట్ల మేర బీమా కింద పరిహారం దక్కింది. దేశంలో మరెక్కడా లేని విధంగా 108 మాదిరిగా 1962 హెల్ప్లైన్ ద్వారా మారుమూల పల్లె ప్రాంతాలకు వెళ్లి ఇంటి వద్దనే వైద్య సేవలు అందించాలనే ఆశయంతో ప్రతి నియోజకవర్గానికి రెండు చొప్పున ఏర్పాటు చేసిన మొబైల్ అంబులెన్స్లు నేడు మూగవేదన అనుభవిస్తున్నాయి. నష్టాల్లో ఉద్యాన రైతులు.. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా 72 రకాల తోటలు, ఏటా 38 లక్షల మెట్రిక్ టన్నుల ఫలసాయంతో ఫ్రూట్బౌల్ ఆఫ్ ఏపీగా, ఉద్యాన హబ్గా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో ఇటీవల కాలంలో వ్యవసాయ పంటలను తగ్గించేసి పండ్లు, కూరగాయలు తదితర ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఐదేళ్లు రాయితీలు, గిట్టుబాటు ధరలతో ఆర్థికంగా గట్టెక్కించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం వెన్నంటి నిలవడంతో ఉద్యాన రైతులు మనోధైర్యంతో ముందడుగు వేశారు. ఉచిత పంటల బీమా కింద ఉద్యాన పంటలకు కూడా పెద్ద మొత్తంలో బీమా పరిహారం ఇవ్వడంతో వెసులుబాటు దక్కింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేశారు. 5 శాతం ప్రీమియం కట్టాల్సిందేనని నిబంధనలు పెట్టారు. చీనీ, అరటి, ద్రాక్ష, టమాట తదితర ప్రధాన ఉద్యాన ఉత్పత్తులకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించక భారీ నష్టాలు చవిచూస్తున్నారు. ప్రధానంగా 92 వేల ఎకరాల ద్వారా పండిన 5.20 లక్షల మెట్రిక్ టన్నుల చీనీ చేదెక్కడంతో భారీ నష్టాలు చవిచూస్తున్నారు. ఉద్యాన పంటల సాగు పెరుగుతున్నా అందుకు తగ్గట్లు రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వడంలో కూటమి సర్కారు విఫలమైంది. గతేడాది 42,100 హెక్టార్ల టార్గెట్ ఇవ్వడంతో దాదాపు 50 వేల మంది వరకు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. అందరికీ డ్రిప్, స్ప్రింక్లర్లు వస్తాయని ఆశించినా... చివరకు 18 వేల హెక్టార్లకు మంజూరు చేశారు. ఆ రైతులకూ పూర్తి స్థాయిలో పరికరాలు అందివ్వడంలో విఫలం కావడం గమనార్హం. ఇంకా 2 వేల మంది వరకు రైతులు పరికరాల కోసం ఎదురుచూస్తున్న దుస్థితి నెలకొంది. వ్యవసాయ అనుబంధ రంగాలకు గడ్డుకాలం నానా కష్టాలు పడుతున్న ఉద్యాన, పాడి రైతులు పట్టించుకునే నాథుడు కరువు -
మా బాధలు పట్టించుకోరా?
అనంతపురం ఎడ్యుకేషన్: తమ బాధలు పట్టని ప్రభుత్వం పొమ్మనలేక పొగ పెడుతోందంటూ ఎంటీఎస్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 594 మంది ఎంటీఎస్ టీచర్లు పని చేస్తున్నారు. వీరికి బదిలీ కౌన్సెలింగ్లో భాగంగా 693 ఖాళీలు చూపించారు. వీటిలో 80 శాతం దాకా జిల్లా సరిహద్దు (కర్ణాటక రాష్ట్రం బార్డరు) మండలాల్లోనే ఉన్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకే జిల్లా సైన్స్ సెంటర్కు బదిలీల కౌన్సెలింగ్ కోసం ఎంటీఎస్ టీచర్లు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఖాళీల సమాచారం తెలుసుకుని తీవ్ర ఆవేదనతో ఆందోళనకు దిగారు. మెజార్టీ ఖాళీలు గుడిబండ, డీ.హీరేహాళ్, అమరాపురం, అగళి, బొమ్మనహాళ్, బ్రహ్మసముద్రం, కంబదూరు, రాయదుర్గం, శెట్టూరు, కణేకల్లు మండలాల్లో చూపించారని వాపోయారు. తక్కిన మండలాల్లో 1,2,3 పోస్టులు మాత్రమే చూపించారన్నారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నామని, డీఏ, హెచ్ఆర్ఏ సౌలభ్యం కూడా ఉండదని, అలాంటి తమను అంతంత దూరం పంపితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు చాలామంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారన్నారు. గత ప్రభుత్వం తమకు ‘నియర్ బై రెసిడెంట్’ ఉత్తర్వులిస్తే... ఈ ప్రభుత్వం ‘లాంగ్ బై రెసిడెంట్’ ఉత్తర్వులు ఇస్తోందంటూ మండిపడ్డారు. డీఈఓను అడ్డగింత.. కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చిన డీఈఓ ప్రసాద్బాబును ఎంటీఎస్ టీచర్లు అడ్డుకున్నారు. కార్పొరేషన్, అన్ని మునిసిపాలిటీలతో పాటు ఏకోపాధ్యాయుడు ఉండే స్కూళ్లను ఖాళీగా చూపించాలని పట్టుబట్టారు. తన పరిధిలో లేదని, రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ చెప్పినా వినలేదు. ఆందోళన చేస్తున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. పైనుంచి ఏవైనా ఆదేశాలు వస్తే ఆమేరకు ముందుకెళ్తామన్నారు. అయితే, రాత్రి 7 గంటల సమయానికి కూడా స్పష్టత రాకపోవడంతో బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించి ఎంటీఎస్ టీచర్లు వెళ్లిపోయారు. ఎంటీఎస్ టీచర్లకు ఎస్టీయూ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, రామాంజనేయులు, వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, గోపాల్, వెంకటరమణ, ఏపీటీఎఫ్ నాయకులు వెంకటేష్, సిరాజుద్దీన్, నరసింహులు, నాగరాజు, తదితరులు మద్దతు తెలిపారు. ఓ సంఘం నాయకులపై తిరగబడ్డ ఎంటీఎస్ టీచర్లు ఓ సంఘం నాయకులు సైన్స్ సెంటర్కు చేరుకుని అధికారుల మెప్పు పొందేందుకు ఎంటీఎస్ టీచర్లను బెదిరించే ధోరణిలో మాట్లాడారు. ‘మీ పోస్టులు చట్టబద్ధం కావు. అనవసరంగా ఇబ్బంది పడతారు. మీరడుగుతున్నట్లు అన్ని ఖాళీలు చూపించడం వీలుకాదు. సజావుగా కౌన్సెలింగ్ జరిగేందుకు సహకరించండి’ అంటూ మాట్లాడగా అప్పటికే తీవ్ర అసహనంతో ఉన్న టీచర్లు తిరగబడ్డారు. మా బాధలు అర్థం కావడం లేదా.. అని మండిపడ్డారు. తక్కువ వేతనంతో పని చేస్తున్నామని, వయసుపైబడి రిటైర్మెంట్కు చాలామంది దగ్గరలో ఉన్నారని, అలాంటి వారు ఎలా వెళ్తారో తెలీదా అని నిలదీయడంతో ఆ సంఘం నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. బదిలీల ఖాళీలపై ఎంటీఎస్ టీచర్ల రగడ 80 శాతానికి పైగా కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఉన్నాయంటూ ఆవేదన సైన్స్ సెంటర్లో కౌన్సెలింగ్ అడ్డగింత.. బాయ్కాట్ -
జయరామ్.. నోరు అదుపులో పెట్టుకో
గుంతకల్లుటౌన్: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకులు నామినేషన్ వేయకుండా చేస్తానంటూ జయరామ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైవీఆర్ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు.ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే అమలు కావాలన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం ఇక్కడ చెల్లుబాటు కాదన్నారు. వ్యతిరేక వార్తలు రాసే పాత్రికేయులను పట్టాలపై పడుకోబెడతానని బెదిరించినట్లు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే సహించబోమన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవ్వరూ లేరన్నారు. జయరామ్ దౌర్జన్యాల నుంచి తమ పార్టీ కార్యకర్తలు, గుంతకల్లు నియోజ కవర్గ ప్రజలను కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధమని స్పష్టం చేశారు. జయరామ్కు ఎలా సమాధానం చెప్పాలో బాగా తెలుసునన్నారు. రాజకీయంగా ప్రాణం పోసి మంత్రి పదవిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే వెన్నుపోటు పొడిచారని, వెన్నుపోటులో చంద్రబాబును మించిపోయారని ఎద్దేవా చేశారు. పేకాట, లిక్కర్, ఇసుక స్కామ్లకు పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని టీడీపీ అనుకూల పత్రికలు, ఎల్లో మీడియాలోనే జయరామ్పై కథనాలు ప్రసారమవుతున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ అధిష్టానం జయరామ్కెప్పుడో రెడ్మార్క్ వేసిందన్నారు. ఇతడి ప్రవర్తన, దౌర్జన్యాలతో టీడీపీ శ్రేణులంతా విసిగిపో యారన్నారు. జయరామ్కు ధైర్యముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, తన నామినేషన్ను అడ్డుకోగలిగితే రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని వైవీఆర్ సవాల్ విసిరారు. మోసపూరిత హామీలు, ఈవీఎంల పుణ్యంతో గెలిచిన జయరామ్ ఇకనైనా దౌర్జన్యాలు చేయడం మానుకుని ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు. వెన్నుపోటులో చంద్రబాబును మించిపోయావ్ మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ ధ్వజం ధైర్యముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ -
మీరు కూడా రప్పా..రప్పా అంటే ఎలా?
అనంతపురం కార్పొరేషన్: ‘సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ భయం పట్టుకుంది. అందుకే రాష్ట్రంలో రెడ్ బుక్ పేరుతో దుష్ట సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం తీసిపోకుండా కొందరు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం సృష్టించేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా రప్పా.. రప్పా అంటే ఎలా.. వైఎస్సార్ సీపీ శ్రేణులను బెదిరించేలా వ్యాఖ్యలు చేసిన జయరామ్కు ప్రజలే తోక కట్ చేసి సున్నం పెడతారు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల నరకాలంటూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడడం దారుణమన్నారు. సినిమా డైలాగ్ను ఎవరో ప్లకార్డుపై ప్రదర్శిస్తే దానికి విపరీత అర్థాలు తీసుకువస్తున్నారన్నారు. రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్ సీపీ నాయకులను జైల్లో ఉంచి, ఆరోగ్యం క్షీణిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, సుప్రీంకోర్టు, హైకోర్టు అక్షింతలు వేసినా ప్రభుత్వంలో మార్పు రావడం లేదన్నారు. జయరామ్ ఎక్కడికి కాకుండా పోతావ్.. ఏడాది పాలనలో ప్రజలకు ఏమీ చేయకపోవడంతో ‘కూటమి’పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అనంత పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి ఎవరూ పోటీ చేయకూడదని, సరెండర్ కావాలని, లేకపోతే తోలుతీస్తాం, తాట తీస్తామని గుంతకల్లు ఎమ్మెల్యే జయరామ్ అంటున్నారని, ఇవన్నీ చూస్తూ ఇక్కడి ప్రజలు ఊరుకోరన్నారు. ఇటీవల విలేకరులను రైలు పట్టాలపై పడుకోబెడతానని బెదిరించారని, జయరామ్ నోటికి అదుపు లేదా అని ధ్వజమెత్తారు. గుంత కల్లు, గుత్తి, పామిడి మండలాల్లో షాడో ఎమ్మెల్యేలను పెట్టి ఇసుక దోపిడీ చేస్తున్నారన్నారు. గుంతకల్లులో పేకాట, మట్కా విచ్చలవిడిగా సాగుతోంద న్నారు. జిల్లా ప్రజలను తక్కువగా అంచనా వేస్తే ఎక్కడికి కాకుండా పోతారని హెచ్చరించారు. గుమ్మనూరు వ్యాఖ్యలను పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పరిటాల చరిత్ర తెలియదా: పరిటాల రాజకీయ ఎంట్రీ ఎలా జరిగిందో అందరికీ తెల్సిందేనని అనంత తెలిపారు. ఇవాళ ఆ కుటుంబం కూడా రప్పా..రప్పా అంటూ మాట్లాడి మరీ ఘోరంగా తయారవుతోందన్నారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని కూటమి ప్రజాప్రతినిధులు చూస్తున్నారని, ప్రజాస్వామ్య బద్ధంగా జరిగే ఎన్నికలకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందన్నారు. టీడీపీకి భవిష్యత్తు లేకుండా ప్రజలు సున్నం పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఓ సంస్థ ఇటీవల సర్వే నిర్వహిస్తే అందులో 53 మంది ఎమ్మెల్యేలు రెడ్జోన్లో ఉన్నారని, అందులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ఒకరని అనంత పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి మారుతీ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, నగరాధ్యక్షుడు శ్రీనివా స్దత్తా, ఉపాధ్యక్షుడు ఉదయ్, ప్రధాన కార్యదర్శి హిదాయతుల్లా పాల్గొన్నారు. పరిటాల సునీత వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత ఆగ్రహం జయరామ్కు ప్రజలే తోక కట్ చేసి సున్నం పెడతారని హెచ్చరిక -
యోగాతో ఒత్తిడి దూరం
అనంతపురం కల్చరల్: యోగాతో ఒత్తిడి దూరమవు తుందని కలెక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. స్థానిక పీటీసీ మైదానంలో శనివారం ఆయుష్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, వివిధ యోగా కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ వినోద్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్పీ పి.జగదీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగా భాగం కావాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే యోగాను అలవర్చుకోవాలన్నారు. బ్రహ్మకుమారీల ఇన్చార్జ్ సిస్టర్ శారద, వివేకానంద యోగా కేంద్ర అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, యోగా శిక్షకురాలు కృష్ణవేణి మాట్లాడుతూ యోగాతో ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించగలమన్నారు. అనంతరం క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. రాష్ట్రస్థాయి ‘యోగాంధ్ర’ పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసాపత్రాలనందించి సత్కరించారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్వో మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డీఎంహెచ్ఎ డాక్టర్ దేవి, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఆయుష్ అధికారులు డాక్టర్ రామకుమార్, లాల్యానాయక్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ మమత, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వినోద్కుమార్ -
బాలింతలతో ‘వసూళ్లు’
అనంతపురం మెడికల్: ప్రభుత్వాస్పత్రిలో ప్రసవమైన వారికి ఆర్థికసాయం ఇప్పిస్తామని అగంతకులు బాలింతల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి శనివారం వెలుగు చూసింది. అనంతపురం నగర శివారులోని ఆలమూరు రోడ్డులో ఉంటున్న కౌసర్ ఇటీవల ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేరింది. ఈ నెల 17న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు వీరికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఆమె ఆధార్, కుటుంబ వివరాలు తెలియజేసి.. రూ.1000 ఇస్తే, ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు మంజూరు చేయిస్తామని చెప్పాడు. దీంతో కౌసర్ నిజమని నమ్మి గూగుల్ పే నుంచి రూ.వెయ్యి పంపారు. అనంతరం డబ్బు వసూలు గురించి డేటా ఎంట్రీ ఆపరేటర్ల దృష్టికి వెళ్లడంతో వారు సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాంకు ఫిర్యాదు చేశారు. ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేసిన పని అని ఆస్పత్రి వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. అయితే సదరు అపరిచిత వ్యక్తికి తిరిగి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం లేదని తెలిసింది. ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయం తదితర సేవల గురించి అవగాహన కల్పించడంలో వైద్యులు, అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎస్ఆర్ఐటీలో ఉద్యోగాల పంట
అనంతపురం: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్దనున్న శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఆర్ఐటీ) కళాశాలలో 400 మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కొలువులు సాధించారు. ప్రముఖ బహుళజాతి సంస్థలు అయిన టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీ తదితర వాటిల్లో కొలువులు దక్కించుకున్నారు. ఏకంగా రూ.4 లక్షల నుంచి రూ.6.75 లక్షల వార్షిక వేతనం పొందనున్నారు. కాగ్నిజెంట్ కంపెనీలో 98 మంది, టీసీఎస్లో 157, ఇన్ఫోసిస్లో 21, హెచ్సీఎల్ టెక్లో 16, క్యాడ్ఎస్వైఎస్, లూమిన్, ప్లేటో, ఫోక్స్కాన్, ఐఆర్ఎంఏఐ కంపెనీల్లో 118 మందికి ఉద్యోగాలు వరించాయి. క్యాంపస్ కొలువులు అత్యధికంగా సాధించిన కళాశాలగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఎస్ఆర్ఐటీ అగ్రస్థానంలో ఉండడం విశేషం. ఈ నెల 26న కంపెనీల్లో ఉద్యోగాలకు చేరనున్నారు. ఈ మేరకు ఆఫర్ లెటర్లు సైతం ఆయా కంపెనీలు ఇచ్చాయి. ఈ సందర్భంగా శనివారం ఆ విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకబృందం అభినందించింది. కార్యక్రమంలో ఇండస్ట్రీ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎం.రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బాలకృష్ణ పాల్గొన్నారు 400 మంది విద్యార్థులకు క్యాంపస్ కొలువులు టీసీఎస్కు 157, కాగ్నిజెంట్కు 98 మంది ఎంపిక కళాశాలకు, కంపెనీకి అనుసంధానం విద్యార్థుల శ్రమకు, అధ్యాపకుల మార్గదర్శనానికి నిదర్శనమే ఈ ఫలితాలు. కళాశాలకు, కంపెనీకి అనుసంధానంతోనే సంచలన ఫలితాలు సాధ్యమయ్యాయి. సాఫ్ట్వేర్ కొలువులు పొందాలంటే ఎస్ఆర్ఐటీకే సాధ్యమని నిరూపించాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తర్ఫీదు ఇస్తున్నాం. మంచి కంపెనీల్లో కొలువులు దక్కిన విద్యార్థులందరికీ అభినందనలు. – ఆలూరు సాంబశివారెడ్డి, కరస్పాండెంట్, ఎస్ఆర్ఐటీ -
ప్రభుత్వానికి కనువిప్పు కల్గిద్దాం
అనంతపురం కార్పొరేషన్: యువతను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేందుకు వైఎస్సార్సీపీ ఈ నెల 23 పిలుపునిచ్చిన యువత పోరు ధర్నాను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబునాయుడు అన్ని వర్గాలనూ దగా చేస్తున్నారన్నారు. మోసపోతున్న యువతకు అండగా నిలవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏడాది గడిచినా ఇంత వరకు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఏడాదిగా ఉద్యోగాలు కల్పించకుండా.. ఉన్న ఉద్యోగులను తొలగిస్తూ, యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడుతూ పోరాటాలు చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణుల పట్ల ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తోందన్నారు. వైఎస్సార్సీపీలో యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నెల 23న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యువజన విభా గం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు, లేని పక్షంలో నిరుద్యోగ భృతి, ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామని చంద్రబాబు చేసిన వాగ్దాలను మర్చిపోయారన్నారు. యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెడలు వంచైనా యువతకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సచివాలయం, వైద్య రంగంలో లక్షలాది పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం మాటలతోనే కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతీనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, నగరాధ్యక్షులు దత్తా, ప్రధాన కార్యదర్శి హిదయతుల్లా, ఉపాధ్యక్షుడు ఉదయ్, నాయకులు మైను, సోహైల్, సాయికృష్ణ, బాలిరెడ్డికుమార్, జగదీష్, వేణు, బాబా పాల్గొన్నారు. యువత పోరును జయప్రదం చేద్దాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత -
నిద్రలోనే పరలోకాలకు...
గార్లదిన్నె: కల్లూరులో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ క్రిష్ణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కల్లూరుకు చెందిన నాగభూషణరెడ్డి, సావిత్రి దంపతుల కుమారుడు సుధీర్ రెడ్డి (29) పామిడిలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో మంచంపై నిద్రిస్తూనే ప్రాణం విడిచాడు. చెట్టంత కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మహిళ ఆత్మహత్య శెట్టూరు: అడవిగొల్లపల్లికి చెందిన రామాంజినమ్మ (45) జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. మూడేళ్ల వ్యవధిలో రామాంజినమ్మ భర్త, కుమారుడు మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగా జీవనం సాగిస్తున్న రామాంజినమ్మకు అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. జీవితంపై విరక్తి చెందిన ఆమె శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకుంది. ఉదయం ఎంతసేపటికీ రామంజినమ్మ బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా.. విగతజీవిగా కనిపించింది. వెంటనే కుమార్తె ఉమాదేవికి, పోలీసులకు గ్రామస్తులు సమాచారం చేరవేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు తావులేదు ఉరవకొండ: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తూ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వాఖ్యలను శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఖండించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవ్వరూ పోటీ చేయరాదని, ఎన్నికలకు ముందే అందరూ టీడీపీలో చేరాలని, లేకపోతే తోలు తీస్తాం, తోక కట్ చేస్తాంటూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, దౌర్జన్యాలకు తావు లేదన్నారు. మరో సారి ఇలాంటి వాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కర్నూలు జిల్లాలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి, చివరకు నీ తోక కట్ చేస్తే అనంతపురం జిల్లాకు వచ్చి చంద్రబాబుతో పైరవీలు చేసి గుంతకల్లు సీటు తెచ్చుకున్నావన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించకుండా సోదరులతో కలిసి అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తూ హింసాత్మక రాజకీయాలు చేస్తున్నావని, త్వరలోనే గుంతకల్లు ప్రజలు కూడా నీ తోక కట్ చేయనున్నారన్నారు. ఉడత ఊపులకు భయపడం అనంతపురం కార్పొరేషన్: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఉడత ఊపులకు ఎవరూ భయపడరని వైఎస్సార్సీపీ జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యులు రమేష్గౌడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీలోకి రాకపోతే వారి తాట తీస్తామంటూ గుమ్మనూరు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో ఆలూరు ప్రజలు గుమ్మనూరును కొడితే గుంతకల్లుకు వచ్చి పడ్డారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, స్థానిక సంస్థలకు ముందే భయాందోళన వాతావరణం సృష్టించేందుకు గుమ్మనూరు జయరాం చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు ఇటువంటి మాటలపై స్పందించి ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలన్నారు. మరోసారి దిగుజారుడు మాటలు మాట్లాడితే ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెబుతామన్నారు. -
‘సిద్ధార్థ’లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
నారాయణవనం: పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సుదర్శనరావు, వోల్వా గ్రూప్ రిటైర్డ్ డైరెక్టర్ ఇందు శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని పాస్ అవుట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మెడల్స్, పట్టాలు అందజేశారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన కాన్వొకేషన్ డే సమావేశంలో కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందించడానికి సిద్ధార్థ గ్రూప్ కళాశాలలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచస్థాయి ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, ఇంక్యుబేషన్ సెంటర్లను అభివృద్ధి చేశామన్నారు. విద్యా ప్రమాణాలు, నాణ్యతలో రాజీ పడకుండా విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు. వైస్ చాన్స్లర్ సుదర్శనరావు మాట్లాడుతూ తోటి వారితో పోటీ పడి సృజనాత్మక, ఇన్నొవేటివ్ విద్యపై శ్రద్ధ చూపాలన్నారు. యువ ఇంజినీర్లు నిరంతరం పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 903 మంది, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 485 మందికి డిగ్రీ కాన్వొకేషన్లు అందజేశారు. 2024–25లో విద్యా సంవత్సరానికి సంబంధించి 17 మంది విద్యార్థులకు గోల్డ్ మెడళ్లు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నామినీస్ ప్రశాంతి, అరుణక్రాంతి, ప్రిన్సిపాల్ మధు, జనార్దనరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ విజయభాస్కర్, గోపి, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
టీబీ డ్యాంకు కొనసాగుతున్న వరద
బొమ్మనహాళ్: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి 38 వేల క్యూసెక్కులకు చేరింది. జలాశయం ఎగువ ప్రాంతాల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వ 1,612.09 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 38,007 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 193గా ఉంది. గతేడాది ఇదే సమయానికి 1,582.32 అడుగుల వద్ద 5.700 టీఎంసీల నీరు నిల్వతో 831 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,802 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండిందని బోర్డు అధికారులు తెలిపారు. నీటి విడుదలపై 27న సమావేశం.. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, ఇతర కాలువలకు నీటి విడుదలపై ఈనెల 27న సమావేశం నిర్వహించనున్నట్లు తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. బెంగళూరు విధాన సౌధలో జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నీటి సలహా మండలి సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. కాగా, గతేడాది వరద నీటి ప్రవాహానికి టీబీ డ్యాం 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోవడంతో సాట్ప్లాక్ గేటు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది ముందుగానే నీటి విడుదలపై చర్చించనున్నట్లు సమాచారం. -
పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
అనంతపురం: పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉమ్మడి జిల్లాలోని అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, హిందూపురం మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. తొలిరోజు 1 నుంచి 15 వేల ర్యాంకు వరకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ చేపట్టినట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి. జయచంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 161 మంది కౌన్సెలింగ్కు హాజరైనట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలిలా.. 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 25 నుంచి 30 వరకు(25,26 తేదీల్లో 1–50,000 ర్యాంకు వరకూ, 27,28 తేదీల్లో 50,001–90,000 ర్యాంకు, 29,30 తేదీల్లో 90,001–చివరి ర్యాంకు) వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్లైన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన రసీదు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీపత్రాలు, కుల (ఓసీ అభ్యర్థులైతే ఈడబ్ల్యూఎస్), ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డుతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. పాలిటెక్నిక్ కౌన్సెలింగ్లో పాల్గొనే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 చొప్పున ఆన్లైన్ విధానంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. -
తక్కువ జీతం... ఎక్కువ దూరం
అనంతపురం ఎడ్యుకేషన్: మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) టీచర్లు తక్కువ వేతనంతో పని చేస్తున్నారు. వీరికి నెలకు దాదాపు రూ.32 వేల జీతం వస్తుంది. ఇది రెగ్యులర్ టీచర్లతో పోల్చితే సగం కూడా ఉండదు. సొంత మండలాలు, సమీప మండలాల్లోని స్కూళ్లలో పని చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఎక్కడో వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు వెళ్లాలంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ ఎంటీఎస్ టీచర్లకు జిల్లా సరిహద్దు మండలాలు తప్పేలా లేవు. నిబంధనల మేరకు మిగులు ఖాళీలను చూపిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఇందులో 70 శాతానికి పైగా ఉన్నవన్నీ సరిహద్దు మండలాల్లోనే. ఇటీవల జరిగిన బదిలీల తర్వాత మొత్తం జిల్లాలో 593 మిగులు ఖాళీలుగా తేల్చారు. ఇందులో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో 558, ప్రభుత్వ పాఠశాలల్లో 16, క్లస్టర్ స్కూళ్లల్లో 119 ఖాళీలున్నాయి. గత ప్రభుత్వంలో ఎంటీఎస్ టీచర్లకు సౌలభ్యమైన చోట్లే పని చేసే అవకాశాలు కల్పించారు. ఈసారి కొత్త చట్టం అనుసరించి బదిలీలు చేశామని, ఈక్రమంలో మిగులుగా ఉన్న స్కూళ్లకు ఎంటీఎస్లను సర్దుబాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఓడీచెరువు మండలంలో 19 మంది ఎంటీఎస్లు పని చేస్తుండగా ఇప్పుడు రెండు ఖాళీలు చూపించారు. అలాగే అమడగూరులో 11 మందికి గాను రెండు, కదిరి, ముదిగుబ్బ, తనకల్లు మండలాల్లో 9 మంది చొప్పున పని చేస్తుంటే రెండు చొప్పున, తలుపులలో 8 మంది పని చేస్తుండగా రెండు ఖాళీలు చూపించారు. అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, హిందూపురం ప్రాంతాల్లోని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి చోటా పదిమందికి పైగా పని చేస్తుండగా రెండు చొప్పున ఖాళీలు చూపించారు. ఎక్కువ సంఖ్యలో చూపించిన మండలాలు ఇలా... గుడిబండ 75, గుమ్మఘట్ట 71, డి.హీరేహాళ్ 60, అమరాపురం 57, అగళి 36, బొమ్మనహాళ్ 42, బ్రహ్మసముద్రం 30, కంబదూరు 23, కణేకల్లు 22, రాయదుర్గం 26, శెట్టూరులో 23 ఖాళీలున్నాయి. వీటి తర్వాత వజ్రకరూరు, మడకశిర మండలాల్లో అత్యధికంగా ఆరు ఖాళీలుండగా, తక్కిన అన్ని మండలాల్లోనూ 1, 2, 3 ఖాళీలున్నాయి. నేడు జిల్లా సైన్స్ కేంద్రంలో బదిలీల కౌన్సెలింగ్ డీఎస్సీ–1998, 2008 ఎంటీఎస్ టీచర్ల బదిలీలకు ఆదివారం ఉదయం 9 గంటలకు జిల్లా సైన్స్ కేంద్రంలో కౌన్సెలింగ్ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్బాబు తెలిపారు. ఉపాధ్యాయుల జాబితాను డీఈఓ బ్లాగ్స్పాట్లో ఉంచినట్లు వెల్లడించారు. బాయ్కాట్ యోచనలో ఎంటీఎస్ టీచర్లు ఇప్పటికే ఎక్కడెక్కడ ఖాళీలున్నాయనే దానిపై స్పష్టత వచ్చిన ఎంటీఎస్ టీచర్లు బదిలీ కౌన్సెలింగ్ను బాయ్కాట్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో వారి వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. తక్కువ జీతంతో ఎక్కువమంది సొంత మండలాలు, పక్క మండలాల్లో పని చేస్తున్నామని ఇప్పుడున్న ఖాళీలన్నీ జిల్లా సరిహద్దు మండలాల్లో చూపిస్తే.. కుటుంబాలు వదిలి ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. తనకల్లు, తలుపుల, నల్లచెరువు తదితర మండలాల్లో పని చేస్తున్న టీచర్లు దాదాపు 200 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే ఎక్కడ సాధ్యమని వాపోతున్నారు. ప్రభుత్వం తమపట్ల దయతలచి న్యాయం చేయాలని లేనిపక్షంలో కౌన్సెలింగ్ను బహిష్కరిస్తామని అంటున్నారు. ఇదీ ఎంటీఎస్ టీచర్ల బదిలీల దుస్థితి గత ప్రభుత్వంలో దాదాపు అందరికీ అనుకూలమైన స్కూళ్లలో కొలువులు ఈసారి మెజార్టీ టీచర్లకు జిల్లా సరిహద్దు మండలాలు తప్పేలా లేవు ఖాళీల మేరకే భర్తీ చేస్తున్నామంటున్న విద్యాశాఖ అధికారులు -
వివాహిత అనుమానాస్పద మృతి
పామిడి: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పామిడిలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఫారెస్ట్ బంగ్లా వద్ద నివాసం ఉంటున్న ఈశ్వర్రెడ్డి, రాజేశ్వరి (28) దంపతులు. వీరికి కుమార్తె భవ్యశ్రీ, కుమారుడు మూర్తీశ్వర్రెడ్డి సంతానం. ఈశ్వర్రెడ్డి కువైట్లో పనిచేస్తూ వీరిని పోషిస్తున్నాడు. రాజేశ్వరి స్థానిక నాగిరెడ్డి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ ఉప్పర భాస్కర్తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం బయట పడిన తర్వాత ఇరువర్గాల మధ్య పంచాయితీలు జరిగాయి. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లినా వారిలో మార్పు రాలేదు. యథావిధిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే కువైట్ నుంచి వచ్చిన భర్త శుక్రవారం రాత్రి తిరిగి విధి నిర్వహణ నిమిత్తం వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న భాస్కర్ శనివారం రాజేశ్వరిని ఆటోలో ఎక్కించుకుని వంకరాజుకాలువ గ్రామానికి వెళ్లే దారిలోని మోరీ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వారిమధ్య ఏమి జరిగిందో తెలియదు కానీ... రాజేశ్వరి రక్తగాయాలతో పడి ఉంది. దీన్ని అటుగా వచ్చిన వారు గమనించి భాస్కర్ను ప్రశ్నిస్తే.. రాజేశ్వరి తన భార్య అని, ఫిట్స్ వచ్చి పడిపోయిందని వారిని నమ్మించాడు. అనంతరం ఆటోలో ఆమెను పామిడి కమ్యూనిటీ ఆస్పత్రికి తెచ్చాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న గుత్తి సీఐ వెంకటేశ్వర్లు హుటాహుటినా పామిడి పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. రాజేశ్వరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవరే హత్య చేశాడు తమ కుమార్తె రాజేశ్వరిని ఆటో డ్రైవర్ ఉప్పర భాస్కర్ హత్య చేశాడని తల్లిదండ్రులు రామకృష్ణారెడ్డి, మాధవి ఆరోపించారు. బంధువులతో కలిసివారు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. హంతకుడుని కఠినంగా శిక్షించి, న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన -
తుంగభద్రకు పోటెత్తిన వరద
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. బుధవారం 19,265 క్యూసెక్కులు ఉన్న ఇన్ఫ్లో గురువారం 43,706, శుక్రవారం సాయంత్రానికి 51,261 క్యూసెక్కులకు పెరిగింది. శనివారం ఉదయానికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. డ్యాంలో నీరు 40 టీఎంసీలకు చేరువగా ఉంది. శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్కమంగళూరు, వరనాడు తదితర తుంగభద్ర జలాశయం ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డ్యాం ఎగువన నిర్మించిన అప్పర్తుంగా ప్రాజెక్ట్ (గాజనూరు జలాశయం) నిండటంతో 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీనికి తోడు రిజర్వాయర్ పరిసరాల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండడంతో ఇన్ఫ్లో మరింత పెరుగుతున్నట్లు తుంగభద్ర బోర్డు అధికారులు వెల్లడించారు. త్వరలోనే డ్యాంలో బోర్డు అధికారులు నిర్ణయించిన మట్టానికి నీరు చేరే అవకాశాలు ఉండటంతో జూలై 13న హెచ్చెల్సీకి నీటిని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ● గతేడాది 33 క్రస్ట్ గేట్లలో 19వ క్రస్ట్ గేటు కొట్టుకు పోవడం, మిగిలిన 32 గేట్లు కూడా దెబ్బతినడం వల్ల నిపుణుల సూచనల మేకు వాటిని మార్చాలని టీబీ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉన్న జలాశయంలో గేట్ల అంచు వరకు 80 టీఎంసీల నీరును మాత్రమే నిల్వ చేసి కాలువలకు వదులుతారు. ఎక్కువ వరద వస్తే నదికి వదిలేయనున్నారు. ఒక డ్యాంలో నీటి నిల్వ 40 టీఎంసీలకు తగ్గిన తర్వాత కొత్త గేట్లను అమర్చనున్నట్లు సమచారం. వచ్చే ఖరీఫ్ నాటికి గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ● ప్రసుత్తం తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 1,633 అడుగులకు గాను 1610.52 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 51,261 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 256గా ఉంది. మొత్తం నీటి సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రసుతం 38.610 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1582.48 అడుగుల వద్ద 5.790 టీఎంసీల నీరు నిల్వతో 759 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,796 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండేదని బోర్డు అధికారులు తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణా ఆరికట్టండి
అనంతపురం టౌన్: పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తరలింపులను ఆరికట్టాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఓబులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గనులశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్టు ఆదినారాయణను కలసి వినతి ప్రతం అందజేసి, మాట్లాడారు. శింగనమల, గార్లదిన్నె, పెద్దవడుగూరు మండలాల్లో పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. దీంతో రైతుల పొలాల్లోని బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గిపోయిందన్నారు. ఇసుక అక్రమ తరలింపులు ఇలాగే కొనసాగితే సాగు, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోజూ వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారన్నారు. ఇప్పటికే శింగనమల మండల పరిధిలోని గ్రామాల్లోని రైతులు ఇసుక అక్రమ రవాణను అడ్డుకుంటున్నా టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తరిమెల నాగరాజు, దండు విజయ్కుమార్, భాస్కరరెడ్డి పాల్గొన్నారు. -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
నేడు యోగా దినోత్సవం ● పీటీసీ మైదానంలో జిల్లాస్థాయి కార్యక్రమం ● పకడ్బందీ ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: నగరంలోని పీటీసీ మైదానంలో శనివారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లాస్థాయి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. పీటీసీ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 7 నుంచి ఉదయం 8 గంటల వరకు యోగా కార్యక్రమం ఉంటుందన్నారు. దాదాపు 5 వేల మంది పాల్గొంటారని, ఎలాంటి లోపాలకు తావివ్వకుండా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. మైదానంలో 25 మందికి ఒక గ్రిడ్గా 200కు పైగా గ్రిడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన సర్టిఫికెట్లు, టీషర్టులు, టోపీలను ప్రతి గ్రిడ్ ఇన్చార్జీకి అందించాలన్నారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని తిలకించేందుకు లైవ్ లింక్కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమానికి హాజరైన వారికి స్నాక్స్, తాగునీరు అందించేందుకు వీలుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆరోఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డీఎంహెచ్ఓ ఈబీ దేవి, నగర పాలక కమిషనర్ బాలస్వామి, డీఎస్పీ శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ శైలజ, మెప్మా పీడీ విశ్వజ్యోతి, ఆయుష్ అధికారులు రామ్కుమార్, లాల్యానాయక్, ఎన్ఐసీ అధికారి భారతి, డీఎస్ఓ వెంకటేశ్వరు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అప్డేషన్లో ఇబ్బంది రాకూడదు
అనంతపురం అర్బన్: ఎన్పీసీఐ, ఈ–కేవైసీ, తదితర అప్డేషన్ ప్రక్రియలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ అఽధికారులను ఆదేశించారు. అప్డేషన్ ప్రక్రియపై కలెక్టర్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్డేషన్ కోసం బ్యాంకులు, పోస్టీఫీసుకు వస్తున్న పిల్లలు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, రద్దీకి ఆస్కారమివ్వకుండా చూడాలన్నారు. అవసరమైతే అదనపు సమయం కేటాయించాలని ఆదేశించారు. బ్యాంకులు, పోస్టాఫీసులను లీడ్ బ్యాంక్ మేనేజర్ తనిఖీ చేస్తూ సమస్యలు రాకుండా చూడాలన్నారు. సీఐ జయనాయక్పై చర్య తీసుకోండి ● రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీ, హోం మంత్రికి ఫిర్యాదు సాక్షి టాస్క్ఫోర్స్: రాయదుర్గం అర్బన్ సీఐ జయనాయక్ వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని రాయదుర్గం మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడొకరు రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీ, హోం మంత్రి, ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి తమపై పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. సీఐ జయనాయక్ ఇటీవల పోలీస్స్టేషన్కు పిలిపించి ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టడమే కాకుండా ‘నీపై హత్యకేసు నమోదుచేస్తానం’టూ బెదిరించారని ఆరోపించారు. 2019లో జరిగిన ఓ కేసుతో తనకు సంబంధం లేకున్నా ఇరికించే కుట్రలు చేస్తున్నారని ఆవేదన చెందారు. చీటికీమాటికీ పోలీసులను పంపడం, ఫోన్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుండడంతో భరించలేక ఊరొదిలి దూరంగా వెళ్లినా ఇబ్బందులు తప్పలేదన్నారు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్మ చేసుకోవడం మినహా మరో మార్గం లేదని వాపోయారు. ‘ఉపాధి’ పనుల పరిశీలన అనంతపురం సిటీ: ఉపాధి హామీ పథకం కింద జిల్లా వ్యాప్తంగా చేసిన, చేస్తున్న వివిధ రకాల అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టీరియల్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి ప్రోగ్రాం ఆఫీసర్గా నబనీతదాస్ నేతృత్వంలో ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోంది. బృందంలో పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఈఎన్సీ రామ్మూర్తి, నాబార్డు కన్సల్టెంట్ హెడ్ సీఎస్ వెంకటేశ్వరరావ్, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ ఉన్నారు. ఈ బృందం శుక్రవారం వివిధ ప్రాంతాల్లో పర్యటించింది. పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కొడిమి గ్రామంలో పర్యటించింది. అక్కడ తారు రోడ్డు, డ్రెయినేజీ పనులను పరిశీలించింది. వాటి నాణ్యతను పరీక్షించింది. అక్కడి నుంచి భైరవనగర్, ఆదర్శనగర్ ఎక్స్టెన్షన్ కాలనీలోని రోడ్లను, ఫారంపాండ్లను పరిశీలించింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టారా లేదా అని కొలతలు కూడా తీసింది. వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన పనులతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పనులనూ ఈ బృందం చూసింది. పనులు నాణ్యతగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేసింది. డీఈఈ కె.లక్ష్మీనారాయణ సహా ఏఈ వెంకటశేషయ్య, ఇంజినీరింగ్ అసిస్టెంట్ కులశేఖర్రెడ్డి, ఇతర సిబ్బందిని ప్రత్యేక బృందం అభినందించింది. కార్యక్రమంలో ఎంపీడీఓ దివాకర్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. ప్రజెంటింగ్ అధికారి నియామకం అనంతపురం అర్బన్: అవినీతి కేసులో ఒక వీఆర్ఓ, డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐపై నమోదైన చార్జెస్పై విచారణ అధికారి ముందు వివరించేందుకు ప్రజెంటింగ్ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంఽధించి జీఓ 619ను శుక్రవారం జారీ చేశారు. రాప్తాడు మండలం గాండ్లపర్తి వీఆర్ఓ కె.నరసింహులు పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు యాలేటి పరదీప్కుమార్రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటూ 2023 ఫిబ్రవరి 21న ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆయన ద్వారా తీసుకున్న స్టేట్మెంట్లో రాప్తాడు డిప్యూటీ తహసీల్దారు టి.లక్ష్మీనరసింహులు, ఆర్ఐ జీసీహేమావతిపైనా చార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఈ చార్జెస్పై సంబంధిత విచారణ అధికారికి వివరించేందుకు అవినీతి నిరోధక శాఖ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు జయమ్మను ప్రజెంటింగ్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. -
ఏం తమాషా చేస్తున్నారా..?
‘ఏయ్.. ఏం తమాషా చేస్తున్నారా..? ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా.. మీకు మొన్నే చెప్పాను.. ఇది ఎమ్మెల్యే అనుచరుల ఆధీనంలో ఉందని ఎన్నిసార్లు చెప్పాలి.. వెంటనే కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోండి. లేదంటే పరిస్థితి బాగుండదు. మీకు చెప్పినా అర్థం కాదు కాబట్టే బయట తాళం వేసుకుని వెళ్తాము. మీకు దిక్కున్న చోట చెప్పుకోండం’టూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు గాలిమరల కంపెనీ కార్యాలయం వద్ద హల్చల్ చేశారు. వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోండి ● ఎట్రియా సిబ్బందిని భయపెట్టిన ఎమ్మెల్యే అనుచరులు ● సిబ్బందిని లోపల ఉంచి బయట గేటుకు తాళం వేసిన వైనం ● ఐదుకల్లు గాలిమరల కంపెనీ కార్యాలయం వద్ద ఘటన కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం సమీపంలోని ఐదుకల్లు రోడ్డులో ఎట్రియా బ్లైత్ విండ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట గాలిమరల కంపెనీ ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో సెక్యూరిటీ, సూపర్వైజర్లు, ఐటీ టెక్నీషియన్లు దాదాపు 70 మంది పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు ‘ఇక్కడ్నుంచి ఖాళీ చేసి వెళ్లిపోండి’ అని సెక్యూరిటీ సిబ్బందికి హుకుం జారీ చేశారు. మీరు వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా బెదిరించారు. తమకు ఇంకా రెండున్నరేళ్ల పాటు అగ్రిమెంట్ ఉందని, తామెందుకు బయటకు పోవాలంటూ సంస్థ ప్రతినిధులు ప్రశ్నించారు. భయపెట్టి.. తాళం వేసి.. తాజాగా శుక్రవారం ఎమ్మెల్యే అనుచరులు మరోసారి ఎట్రియా కార్యాలయానికి వెళ్లారు. ‘ఏం..మీకు చెప్తుంటే తమాషాగా ఉందా..? ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పాం కదా.. అభయ్ సెక్యూరిటీ ఏజెన్సీ కింద మా మనుషులు వస్తారు. ఇంకా ఇక్కడే ఉంటే చాలా ఇబ్బంది పడతారం’టూ తమ వెంట తెచ్చుకున్న సిబ్బందిని అక్కడే ఉంచి బయట గేటుకు తాళం వేశారు. లోపల ఉన్న ఎట్రియా సిబ్బంది సైతం భయపడుతూ లోపలి వైపు మరో తాళం వేసుకున్నారు. దీంతో బయట కొత్తగా వచ్చిన సిబ్బంది.. లోపల ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బంది ఉండటంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పొట్టకూటి కోసం వచ్చిన వారినీ వదల్లేదు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గాలిమరల కంపెనీలో సెక్యూరిటీగా, టెక్నికల్ సిబ్బందిగా పనిచేస్తున్న వారిని సైతం ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు వదిలిపెట్టడం లేదని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము టీడీపీకి చెందిన వారమైనా తమపైనే కక్ష సాధింపునకు దిగుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే పార్టీ నేతలు చూసుకోవాలి కానీ తమలాంటి పేదల పొట్ట కొట్టడం ఏంటని వారు నిలదీస్తున్నారు. రెండన్నరేళ్లు అగ్రిమెంట్ ఉన్నా తమను విధుల నుంచి తప్పుకోవాలని అమిలినేని అనుచరులు భయపెట్టడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని వారు అంటున్నారు. -
నరసాపురంలో చోరీ
బెళుగుప్ప: మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. గొర్రెల పోషణతో జీవనం సాగిస్తున్న తిమ్మారెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు. కుమారుడికి వివాహమైంది. ఈ క్రమంలో గ్రామ శివారులో ఉన్న గొర్రెల దొడ్డి వద్దకు గురువారం రాత్రి కాపలాకు తిమ్మారెడ్డి దంపతులు వెళ్లారు. అదే రోజు స్థానికంగానే ఉన్న పుట్టింటికి కోడలుతో పాటు కుమారుడూ వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన దుండగులు ఇంటికి వేసిన తాళాన్ని బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించి, బీరువాలోని రూ.1.50 లక్షల నగదు, ఓ బంగారు నెక్లెస్, రెండు జతల కమ్మలు, వెండి కాళ్ల పట్టీలు, కడియాలు అపహరించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివ క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు. రెవెన్యూలో పనిచేయడం అదృష్టంగా భావించాలి అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో పని చేయడాన్ని ఓ అదృష్టంగా భావించాలని ఉద్యోగులకు కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ‘రెవెన్యూ డే’ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అనంతరం పలువురు రెవెన్యూ విశ్రాంత అధికారులను, ఉద్యోగులను సన్మానించారు. రైల్లో చోరీకి పాల్పడిన యువకుడి అరెస్ట్ గుత్తి: కాచిగూడ –మైసూర్ ఎక్స్ప్రెస్ రైలు చోరీకి పాల్పడిన యువకుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే కాచిగూడ–మైసూర్ రైలులో ప్రయాణికురాలు పద్మావతికి చెందిన బ్యాగులోని రూ.3,700 నగదు, రెండు సెల్ఫోన్లు గురువారం అర్ధరాత్రి చోరీకి గురయ్యాయి. ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన జీఆర్పీ ఇన్చార్జ్ ఎస్ఐ గోపాల్, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. రెండో ప్లాట్ఫారం వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న తమిళనాడుకు చెందిన మొరసుకోడిని అదుపులోకి విచారణ చేయడంతో చోరీ చేసినట్లు అంగీకరించాడు. రూ.3,700ల నగదుతో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. యువకుడి ఆత్మహత్య కూడేరు: మండల కేంద్రానికి చెందిన మంగల సాయినాథ్ (33) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుల వృత్తితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మనస్తాపం చెందిన ఆయన శుక్రవారం సాయంత్రం ఇంటి వరండాలో చీరతో ఉరి వేసుకున్నాడు. గమనించిన రాజేశ్వరి వెంటనే స్థానికుల సాయంతో కాపాడి అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
దగాపడిన వరి రైతులు
‘ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తే వారం, పది రోజుల్లో నగదు చెల్లించేవారు. సాగుకు చేసిన అప్పులు తీర్చుకుని ప్రశాంతంగా జీవించే వాళ్లం. ప్రభుత్వ సూచన మేరకు ఆర్ఎస్కేల్లో విక్రయించాం. రెండు నెలలు కావస్తున్నా ధాన్యం నగదు చెల్లించలేదు. సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీల భారం పెరుగుతోంది. నగదు అడుగుతుంటే అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. మరో పక్క అప్పులు చెల్లించాలంటూ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి’ అంటూ వరి రైతులు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామంటూ వాపోతున్నారు. ● ‘మద్దతు’ పేరుతో ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ● విక్రయించి రెండు నెలలవుతున్నా చేతికి అందని చిల్లి గవ్వ ● 363 మంది రైతులకు రూ.8.59 కోట్ల బకాయి ● అయోమయంలో వరి రైతులు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం పంట పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద వడ్డీకి అప్పు చేశా. పంట విక్రయించి రెండు నెలలైంది కాబట్టి డబ్బు కట్టాలంటూ వారు ఒత్తిళ్లు చేస్తున్నారు. ఇంకా డబ్బులు పడలేదని చెబితే వినడం లేదు. అధికారులు కూడా మాకు సరైనా సమాధానం చెప్పడం లేదు. ఓ వైపు వడ్డీల భారం పెరిగి పోతోంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. – హనుమంతరెడ్డి, రైతు, ఉద్దేహాళ్ గ్రామం, బొమ్మనహాళ్ మండలం రాయదుర్గం: రబీలో వరి సాగు చేసిన రైతులు ఆరంభం నుంచి కష్టాలనే ఎదుర్కొన్నారు. ఎకరానికి 40 నుంచి 50 బస్తాలు పండాల్సిన చోట ప్రతికూల వాతావరణ పరిస్థితులు వెంటాడటంతో 20–25 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చింది. అరకొరగా పండిన పంటకు మద్దతు ధర వస్తుందని ఆర్ఎస్కే కేంద్రాలుగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే.. రెండు నెలలైనా పైసా జమ కాకపోవడంతో తామెలా బతకాలో చెప్పాలంటూ కూటమి ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపు రైతు ఖాతాల్లోకి నగదు జమ చేస్తామంటూ గొప్పలు చెప్పిన సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్కళ్యాణ్, మంత్రులు పత్తా లేకుండా పోయారంటూ రైతులు బాధపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గత రబీలో 4,528 హెక్టార్లలో వరి పంట సాగైంది. ఇందులో కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్ మండలాల్లోని హెచ్చెల్సీ ఆయకట్టు భూముల్లో సుమారు 3 వేల హెక్టార్లకు పైగా సాగు చేశారు. సుమారు 18 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువ కాకుండా పండించారు. కూటమి ప్రభుత్వం ఆర్భాంటంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కేవలం 3,859 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. ఇందులో సాధరణ రకానికి రూ.2,300, ఏ గ్రేడ్కు రూ.2320 చెల్లించేలా ధర నిర్ణయించింది. మిగిలిన ధాన్యాన్ని అందినకాడికి ధళారులకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఎప్పుడిస్తారో తెలియదు జిల్లా వ్యాప్తంగా రబీ లో 363 మంది రైతులతో 3,859 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరతో కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.8.95 కోట్లు కాగా నిబంధనల ప్రకారం ధాన్యం అమ్మిన 24 గంటల్లోపు రైతు ఖాతాల్లోకి నగదు జమచేయాల్సి ఉంది. కానీ, రెండు నెలలు కావస్తున్నా నేటికీ నగదు అందకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను అడిగితే వారం పది రోజులంటూ దాట వేస్తున్నారు. ‘పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తడిసి మోపెడవుతున్నాయి. గాలీవాన బీభత్సానికి నష్టపోయిన పంటలకు పరిహారం నేటికీ ఇవ్వలేదు. కనీసం అమ్ముకున్న పంటకై నా డబ్బులిస్తే అప్పులు తీర్చుకుంటాం’ అని రైతులు వేడుకుంటున్నా ఫలితం లేకపోతోంది. డబ్బులు కట్టాలంటూ అప్పులోళ్లు రోజూ ఇళ్ల చుట్టూ తిరుగుంటే సమాధానం చెప్పుకోలేక అన్నదాతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. -
చావనైనా చస్తాం.. భూములు ఇవ్వం
● సర్వేను అడ్డుకున్న రైతులు ● వెనుదిరిగిన రెవెన్యూ అధికారులురాప్తాడు: అన్నం పెట్టే భూములను పరిశ్రమల కోసం ఇవ్వలేం అంటూ రైతులు తెగేసి చెప్పారు. కాదని మా పొలాల్లో సర్వే చేస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాం అని హెచ్చరించారు. చేసేదిలేక అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎంఎస్ఎంఈ పార్క్ పేరిట బొమ్మేపర్తి గ్రామ రెవెన్యూ పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందు కోసం అక్కడ పేదలు సాగు చేసుకుంటున్న భూములను సేకరించడానికి చర్యలు తీసుకున్నారు. భూములు పోతే జీవనోపాధి కోల్పోతామని, ఇందుకు తాము సిద్ధంగా లేమని, వెంటనే బలవంతపు సేకరణ ఆపాలని బాధితులు సీపీఎం, రైతుసంఘం, సీఐటీయూ నాయకులతో కలిసి ఇదివరకు మండల అధికారులకు, కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీలు అందజేశారు. అయినా వాటిని పరిగణనలోకి తీసుకోని రెవెన్యూ అధికారులు శుక్రవారం సర్వే చేయడానికి వచ్చారు. దీంతో బాధిత రైతులు సర్వే చేయకుండా అడ్డుకున్నారు. వీరికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి.రామాంజినేయులు, రైతు సంఘం మండల కార్యదర్శి పోతులయ్య మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 307లో 27 మంది రైతులకు సంబంధించి 120 ఎకరాలు ఉన్నాయన్నారు. 60 ఏళ్ల కిందట డీ పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారన్నారు. అప్పట్లో గుట్టలు, రాళ్లు తొలగించి సాగు భూమిగా మార్చుకోవడానికి ఒక్కో రైతుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఖర్చయ్యిందన్నారు. కొందరు ఈ భూముల్లో షెడ్లు ఏర్పాటు చేసుకుని పాడి పెంపకం, గొర్రెల పెంపకం చేపట్టారన్నారు. వీరికి ఇంకెక్కడా సెంటు భూమి లేదన్నారు. ఇప్పుడు ఈ కాస్త భూమిని కూడా ఎంఎస్ఎంఈ పార్క్కు అప్పగిస్తే జీవనోపాధి కోల్పోతారన్నారు. ఈ ఏడాది మార్చిలో 307 సర్వే నంబర్లో 114 ఎకరాలు అప్పగించడానికి తహసీల్దార్ ఏపీఐఐసీ అధికారులకు లేఖ పంపారన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా పరిశ్రమల పేరుతో ఆ భూములను బలవంతంగా లాక్కోవడం దారుణమన్నారు. పరిశ్రమలు, ఉపాధి అవసరమే కానీ పేదల భూములను తీసుకోవడం సబబు కాదని హితవు పలికారు. పేదలకు ప్రభుత్వం సహాయం చేయాల్సింది పోయి ఇలా వారికి సమాచారం తెలియకుండా దౌర్జన్యంగా తీసుకోవడం అన్యాయమన్నారు. పరిశ్రమల కోసం తమ భూములను ఇవ్వలేమని రైతులు తెగేసి చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆనందరెడ్డి, బాధిత రైతులు ముత్యాలప్ప, మల్లికార్జున, మాధవయ్య, వేణుగోపాల్, వన్నూరప్ప, నిర్మల, మౌనిక, పార్వతమ్మ, యల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. భూమిని వదులుకోలేం బొమ్మేపర్తి రెవెన్యూ పొలంలో మాకు ఐదు ఎకరాలు ఉంది. 2012 జూలై 5న నా భర్త బాలగొండ గొల్లపల్లయ్య ఇదే పొలంలో కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని అప్పటి మంత్రిగా ఉన్న పరిటాల సునీతను వేడుకున్నాను. అయినా ఆర్థికసాయం అందలేదు. ఆ సమయంలోనే నిర్మించుకున్న పక్కాగృహానికి సంబంధించి బిల్లు కూడా పడలేదు. ఇప్పుడు ఈ భూమిని వదులుకునే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి వస్తే చావడానికి కూడా సిద్ధమే. – బాలగొండ నిర్మల -
జల్సాల కోసం చోరీలు
రాప్తాడు రూరల్: జల్సాలు తీర్చుకునేందుకు అవసరమైన డబ్బు కోసం చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు. అనంతపురం రూరల్ పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శేఖర్ వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన చిన్న బాబు, గుంతకల్లు మండలం దోసలుడికి గ్రామానికి చెందిన అరికిచెర్ల రామ్మోహన్ ఉన్నారు. చిన్నబాబు చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. దీంతో సరైన పర్యవేక్షణ లేక చిరు ప్రాయం నుంచే వ్యసనాలు, జల్సాల బాటపడ్డాడు. ఇందుకు అవసరమైన డబ్బు కోసం దొంగతనాలకు తెరలేపాడు. 2024లో మోటారు సైకిళ్లు, చిల్లర దొంగతనాలు, ఏటీఎం యంత్రాలను ధ్వంసం చేసి నగదు అపహరించడం తదితర కేసుల్లో పట్టుపడి రిమాండ్కు వెళ్లాడు. జైలు ఉన్న సమయంలోనే అప్పటికే హత్యాకేసులో ముద్దాయిగా ఉన్న రామ్మోహన్తో పరిచయమైంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ జల్సాలు తీర్చుకునేందుకు, చేసిన అప్పులు తీర్చడానికి అనంతపురం రూరల్ పరిధిలోని ఓవీఆర్ కాలనీలో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయుడు ఆంజనేయులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పట్టపగలే దొంగతనం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ జగదీష్ ఆదేశాలతో రూరల్ డీఎస్పీ వెంకటేషులు పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేశారు. పక్కా ఆధారాలతో చిన్నబాబు, రామ్మోహన్ను నిందితులుగా గుర్తించి శుక్రవారం అనంతపురంలోని కళ్యాణదుర్గంలో రోడ్డులో ఉన్న సెయింట్ ఆన్స్ స్కూల్ దగ్గర తచ్చాడుతున్న ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం వారి నుంచి బంగారు చిన్న నల్లపూసల దండ, పెద్ద నల్లపూసల దండ, చిన్న పిల్లల బంగారు బ్రాస్లేట్, చిన్న పిల్లల గాజులు నాలుగు, జుంకీ కమ్మల సెట్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ఇళ్లల్లో చోరీలకు పాల్పడే ఇద్దరి అరెస్ట్ -
2024 ఏప్రిల్లో రాప్తాడుకు చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ‘ఇక్కడ పొలాల్లోనే రైతులు కరెంటు ఉత్పత్తి చేసేలా చేసి, మిగులు కరెంటు ప్రభుత్వానికే అమ్మేలా చేస్తా’ అన్నారు. కానీ ఈరోజు చూస్తే కరెంటు ఉత్పత్తి దేవుడెరుగు కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నా
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సంపద సృష్టిస్తా అంటూ పదే పదే చెప్పే చంద్రబాబు నాయుడు మాటలకు.. చేతలకు పొంతన లేకుండా ఉంది. ఉమ్మడి జిల్లాలో సంపద మార్గాలు దేవుడెరుగు ఆదాయం లేక ప్రజలు అప్పులు చేసుకుంటున్న దుస్థితి నెలకొంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఏ రంగంలో చూసినా అప్పులే కానీ ఆదాయం లేని పరిస్థితి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు భారీగా నష్టపోయారు. కూరగాయల రైతులకు పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. మరోవైపు భూముల క్రయ విక్రయాలు లేక జిల్లాలో రెవెన్యూ వనరులు భారీగా దెబ్బతిన్నాయి. రైతుల నుంచి సామాన్యుల వరకూ ఎక్కడా అప్పులు పుట్టని పరిస్థితి నెలకొంది. కుదేలైన చిన్న మార్కెట్లు అనంతపురం జిల్లా కేంద్రంలో కమలానగర్ మార్కెట్ అంటే చాలా పేరుంది. రోజూ కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతుంది. బట్టల నుంచి యాక్సెసరీస్ వరకూ ఇక్కడ దొరకని వస్తువేదీ ఉండదు. నాలుగైదు వేల షాపులకు మించి ఉంటాయి. కూటమి సర్కారు వచ్చిన తర్వాత కమలానగర్ బోసిపోయింది. షాపులో ఓనరు, వర్కరు మినహా ఎవరూ లేరని వాపోతున్నారు. గతంతో పోలిస్తే 50 నుంచి 60 శాతం పైగా బిజినెస్ తగ్గిపోయిందని వ్యాపారులు వాపోతున్నారు. రిజిస్ట్రేషన్లు పడిపోయాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల పరిస్థితి దారుణంగానే ఉంది. స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేయాలంటేనే భయపడుతున్నారు. రెండు జిల్లాల్లోనూ సుమారు రూ.650 కోట్ల వసూళ్లు లక్ష్యం కాగా రూ.400 కోట్లు కూడా చేరుకోలేక పోయారు. ప్రభుత్వానికి ఇదే పెద్ద ఆదాయ వనరు. కానీ ఈ రంగం ఇప్పుడు కుదేలైంది. పరిశ్రమల ఆదాయం డౌన్ గడిచిన ఏడాది కాలంలో పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయం భారీగా పడిపోయినట్టు తేలింది. ప్రముఖంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు కియా సంస్థ నుంచి ఒక్క రూపాయి కూడా ట్యాక్సు రూపంలో రాలేదని జీఎస్టీ అధికారులు చెబుతున్నారు. చిన్న పరిశ్రమలు రాలేదు. దీంతో ఆదాయమూ లేదు, ఉద్యోగాలు అంతకంటే లేవు అని నిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఉద్యాన పరిస్థితి అధ్వానం రాష్ట్రంలోనే ఉద్యాన పంటల్లో అనంతపురం జిల్లా అగ్రగామి. అలాంటిది ఈ ఏడాది ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక ఆదాయం ఘోరంగా పడిపోయింది. మిరప, అరటి, చీనీ, మామిడితో పాటు టమాట లాంటి వాటి రేట్లు నేలచూపు చూశాయి. దీంతో భారీగా నష్టం వాటిల్లింది. ఎప్పుడూ లేని విధంగా ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధరలు లేక వేలాదిమంది రైతులు నష్టపోయారు. సంపద సృష్టి కాదు ఆదాయం లేకఅప్పులు చేస్తున్న దుస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీగా పడిపోయిన చిన్న మార్కెట్లు పంటలకు గిట్టు బాటు ధరలు లేక రైతులకు భారీగా నష్టాలు జీఎస్టీ వసూళ్లు దారుణంగా పడిపోయిన వైనం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో మరింతగా పడిపోయిన రెవెన్యూ -
మందకొడిగా విత్తన పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్: రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ మందకొడిగా సాగుతోంది. కేటాయింపులు, రాయితీలు, ధరలు, అనుమతులు, పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టకుండా కూటమి సర్కారు జాప్యం చేయడం, బదిలీల నేపథ్యంలో వ్యవసాయశాఖ కూడా రైతులను సమాయత్తం చేయడంలో విఫలం కావడంతో ఈ దుస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. గతంలో మే మూడో వారంలోనే విత్తన పంపిణీ మొదలు పెట్టి జూన్ మొదటి వారంలోపు పూర్తి చేసిన దాఖలాలు ఉన్నాయి. ఈసారి జూన్ 5న పంపిణీ మొదలు పెట్టారు. దీనికితోడు ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ, ఇన్పుట్, ఇన్సూరెన్స్ లాంటి వాటి ద్వారా ఎలాంటి సాయం అందకపోవడం.. విత్తన నాణ్యతపై విమర్శల నేపథ్యంలో రాయితీ వేరుశనగను తీసుకునేందుకు అన్నదాతలు ఆసక్తి చూపలేదు. 26 వేల క్వింటాళ్ల పంపిణీ.. ఈ ఏడాది జిల్లాకు చాలా తక్కువగా కేవలం 50,592 క్వింటాళ్లు కేటాయించారు. ఈనెల 5 నుంచి ఇప్పటి వరకు ... ఈ 15 రోజుల్లో 27 వేల మంది రైతులకు 26 వేల క్వింటాళ్లు పంపిణీ చేశారు. 36 వేల క్వింటాళ్లు అవసరమని 40 వేల మంది రైతులు ఆర్ఎస్కే రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా ఇప్పటి వరకు 38 వేల క్వింటాళ్లు సరఫరా చేశారు. మరోపక్క ప్రాసెసింగ్, సరఫరా కొనసాగుతోందని, ఇంకా రిజిష్ట్రేషన్లు, పంపిణీ జరుగుతున్నందున ఈ నెలాఖరులోపు కేటాయింపులు మేరకు వేరుశనగ పంపిణీ పూర్తీ చేస్తామని జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. మాకొద్దే వద్దు! గతానికి భిన్నంగా ఈ సారి తాడిపత్రి డివిజన్ పరిధిలో తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు, పెద్దపప్పూరు రైతులు వేరుశనగ సాగుపై అనాసక్తి ప్రదర్శించినట్లు విత్తన పంపిణీ సరళి తెలియజేస్తోంది. ఈ నాలుగు మండలాల్లో ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా రైతులు తీసుకెళ్లలేదు. ఇందులో యల్లనూరు మండలానికి ఒక్క క్వింటా కూడా కేటాయించలేదు. పుట్లూరుకు 50 క్వింటాళ్లు, తాడిపత్రికి 80 క్వింటాళ్లు, పెద్దపప్పూరుకు 100 క్వింటాళ్లు కేటాయించినా ఆర్ఎస్కేల్లో ఒక్క రైతు కూడా తమకు విత్తనం కావాలని రిజిష్ట్రేషన్ చేసుకోకపోవడం విశేషం. విడపనకల్, పెద్దవడుగూరు, ఉరవకొండ, బొమ్మనహాల్, పామిడి, బెళుగుప్ప, యాడికి తదితర మండలాల్లో కూడా పెద్దగా స్పందన కనిపించడం లేదు. శెట్టూరులో అత్యధికంగా 2 వేల క్వింటాళ్లు పంపిణీ కాగా... రాయదుర్గం, ఆత్మకూరు, కూడేరు, నార్పల, గుమ్మగట్ట, కణేకల్లు, బ్రహ్మసముద్రం, కుందుర్పి తదితర మండలాల్లో విత్తన పంపిణీ మోస్తరుగా సాగుతోంది. కేటాయించిన విత్తన వేరుశనగ పూర్తయ్యే వరకు పంపిణీ కొనసాగిస్తామని జేడీఏ, ఏపీ సీడ్స్ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు 27 వేల మందికి 26 వేల క్వింటాళ్ల పంపిణీ -
విద్యాసామగ్రి విక్రయిస్తున్న ‘నారాయణ’ గది సీజ్
అనంతపురం ఎడ్యుకేషన్: నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం నగరంలోని జీసస్ నగర్లో అక్రమంగా ఓ ఇంట్లో పుస్తకాలు, యూనిఫాం, బూట్లు ఇతర విద్యాసామగ్రిని డంప్ చేసి విక్రయాలు సాగిస్తుండగా శుక్రవారం ఏబీవీపీ నాయకులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న కార్పొరేషన్ శానిటరీ సెక్రటరీ వెంకటేశులు, నరసింహమూర్తి అక్కడకు చేరుకుని పరిశీలించారు. కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్న గదిని పోలీసుల సమక్షంలో సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అఖిల్ కుమార్రెడ్డి మాట్లాడుతూ... తమ మంత్రి పదవిని అడ్డుగా పెట్టుకుని నారాయణ విద్యాసంస్థల అధినేత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అధికార మదంతో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి పుస్తకాలు, యూనిఫాం వ్యాపారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేల రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించే ఏ విద్యాసంస్థనైనా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దివాకర్ నాయక్, భరత్ రెడ్డి, విజయ్, గణేష్, మణిదీప్, కుమార్ పాల్గొన్నారు. రూడ్సెట్లో ఉచిత శిక్షణ అనంతపురం సెంట్రల్: బ్యూటీషియన్ కోర్సుపై జిల్లా కేంద్రంలోని ఎస్కేయూ సమీపంలో ఉన్న రూడ్సెట్ సంస్థలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సు, రేషన్కార్డు కలిగిన గ్రామీణ నిరుద్యోగ మహిళలు అర్హులు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యం ఉంటుంది. పూర్తి వివరాలకు 94925 83484లో సంప్రదించవచ్చు. బాలిక అదృశ్యం బెళుగుప్ప: మండలంలోని కోనంపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక గురువారం నుంచి కనిపించడం లేదు. కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం ఉదయం తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ రామదాసు తెలిపారు. -
బాబుది ధృతరాష్ట్రుడి పాలన
అనంతపురం టవర్క్లాక్: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ధృతరాష్ట్రుడి పాలన కొనసాగిస్తోందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు మండిపడ్డారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ గురువారం స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ, కుల సంఘాల ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పెన్నోబులేసు మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఫలితంగా మహిళలు, బాలికలు, చిన్నారులపై దాడులు, అత్యాచారాలు హత్యలు పెరిగి పోయాయన్నారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ విద్యార్థినిపై 18 మంది సాముహికంగా ఆత్యాచారం చేసి గర్భవతిని చేసినా నిందితులను అరెస్ట్లో ఉదాసీనత వ్యవహరిస్తుండడం దుర్మార్గమన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతుంటూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. పోనీ బాధిత కుటుంబాన్ని ఉమ్మడి జిల్లాలోని దళిత ఎమ్మెల్యేలు కనీసంగానూ పరామర్శించలేదన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకాడబోమని, ఆ గ్రామాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటాలు సాగిస్తూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో నాయకులు వడియంపేట మంత్రి ఆంజనేయులు, సాకే శివశంకర్, సీపీ ఓబులేసు, సాకే ఆనంద్, వజ్రం గంగరాజు, వెంకటేశులు, నాగరాజు, విష్ణు నారాయణ, బండారు నగేష్, మారుతి, సాకే అంజి, మల్లేష్, జయరాం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు -
అసంబద్ధ జీఓలతో అన్యాయం చేశారు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయని, తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేష్ అధ్యక్షతన గురువారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో జరిగిన జిల్లా కమిటీ అత్యవర సమావేశంలో ఆ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.సిరాజుద్దీన్ మాట్లాడారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో చోటు చేసుకున్న తప్పిదాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రీవెన్స్లో ప్రయారిటీ ఇచ్చిన వాటిని సంపూర్ణంగా సవరించకుండానే బదిలీలు పూర్తి చేశారన్నారు. ఫలితంగా వందలాది మంది ఉపాధ్యాయులు భారీగా నష్టపోయారన్నారు. రోజుకు, గంటలకు మారుస్తూ విద్యాశాఖ జారీ చేసిన అసంబద్ధ జీఓలు తీవ్ర గందరగోళానికి తెరలేపాయన్నారు. ఈ క్రమంలో చేసిన చోటు చేసుకున్న తప్పిదాల కారణంగా అర్హత ఉన్న వారు సైతం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. తక్షణమే వీటిని సవరించి నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కొత్త పాఠశాలల్లో జీతాలు తీసుకోవడానికి వీలు లేకుండా అక్కడ పోస్టింగ్ చేశారని, వారందరికీ 1వ తేదీన జీతాలు చెల్లించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా నెలకొన్న జూనియర్, సీనియర్ వివాదానికి తెరదించేలా స్పష్టమైన ఆదేశాల ద్వారా పరిష్కారం చూపాలన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సర్దార్ వలి, రాష్ట్ర కౌన్సిలర్ బీవీ రమణ, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ కె.వన్నప్ప, నాయకులు అడవిరాజు, యల్లప్ప, చిదంబరయ్య, తిప్పేస్వామి, నజీర్, హనుమంతు, సలీం, మన్సూర్, అలీ, యాకూబ్, కరుణాకర్ పాల్గొన్నారు. -
5,967 కేంద్రాల్లో యోగా దినోత్సవం
అనంతపురం అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 21న జిల్లావ్యాప్తంగా 5,967 రిజిస్టర్ కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ వెల్లడించారు. 10 లక్షల మందితో యోగా దినోత్సవం నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు.జిల్లాలో ‘యోగాంధ్ర’ కింద 9,97,518 మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా 100 మంది మాస్టర్ ట్రైనర్లు, 6,504 మంది ట్రైనర్లు రిజిస్టర్ అయ్యారన్నారు. 21న ఉదయం 7 గంటలకు జిల్లాలో రిజిస్టర్ అయిన కేంద్రాల్లో యోగా ప్రదర్శన ఉంటుందన్నారు. జిల్లాస్థాయి కార్యక్రమంలో పీటీసీ మైదానంలో 5 వేల మంది పాల్గొంటార న్నారు. ‘యోగాంధ్ర’ రాష్ట్రస్థాయి పోటీల్లో వివిధ కేటగిరీల్లో జిల్లాకు చెందిన 27 మంది బహుమతులు సాధించారన్నారు. 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమంలో వారంతా పాల్గొంటారన్నారు. జిల్లావ్యాప్తంగా రిజిస్టర్ అయిన పౌరులందరూ పాల్గొనాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వినోద్కుమార్ -
●అధినేతతో భేటీ
శింగనమల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్, ఆయన తనయుడు సాకే రుత్విక్ కలిశారు. వీరితో పాటు నియోజకవర్గ నాయకులూ ఉన్నారు. గని కార్మికుడిపై యాజమాన్యం దాడి యాడికి: గనిలో పనికి వెళ్లకపోవడంతో కార్మికుడిపై యజమానులు దాడి చేశారు. బాధిత కార్మికుడు హుస్సేన్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన గని యజమానులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... యాడికి మండలం చందన గ్రామానికి చెందిన హుస్సేన్.. గ్రామ సమీపంలోని బాబుగౌడ్ గనిలో పదేళ్లుగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబపోషణకు అవసరమై కొంత డబ్బును యజమానులతో అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తాని గని యజమాని బాబుగౌడ్కు చెల్లించి, వారం క్రితం వేరే పనులకు హాజరయ్యేవాడు. ఇది గమనించిన బాబుగౌడ్ కుమారుడు గణేష్ రెండు రోజుల క్రితం వేరే పనులకు పోతున్న హుస్సేన్ను అడ్డుకుని గనిలో పనికే రావాలని గొడవపడి దాడి చేశాడు. ఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం గని యజమానులిద్దరిపై గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వెద్య కళాశాల ప్రిన్సిపాల్గా షారోన్ సోనియా ● జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఆత్మారాం అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ షారోన్ సోనియా, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ ఆత్మారాం నియమితులయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వ ప్రిన్సిపాల్ మాణిక్య రావు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర రావులను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆయా స్థానాల్లో షారోన్ సోనియా, డాక్టర్ ఆత్మారాంను నియమించారు. -
ఉపాధిని సద్వినియోగం చేసుకోండి
యల్లనూరు: ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర బృంద సభ్యులు సూచించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను గురువారం కేంద్ర బృంద సభ్యులు నవనీత, నాబార్డు కన్సల్టెంట్ వెంకటేశ్వర్లు, అడిషనల్ కమిషనర్ శివప్రసాద్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మండలంలో తిమ్మంపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు.చింతకాయమంద వద్ద రూ. 35 లక్షల నిధులతో 1.6 కిలోమీటర్ల మేర నిర్మించిన ఆర్అండ్బీ రోడ్డును పరిశీలించారు. పశువుల నీటి తొట్టెలు,ఫారం పాండ్లు, కందకం పనులపై అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. ఏ పనికి ఎన్ని నిధులను మంజూరు చేశారు.. ఎంత ఖర్చు చేశారు తదితర వివరాలపై ఆరా తీశారు. ఫారంపాండ్ల వద్ద మొక్కలు నాటారు. రైతులతో కాసేపు మాట్లాడారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గడ్డంవారిపల్లి సచివాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో కేంద్ర బృంద సభ్యురాలు నవనీత మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల ఆవశ్యకతను వివరించారు. అనంతరం తిమ్మంపల్లి సచివాల యం తనిఖీ చేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సలీం భాష, పంచాయతీ రాజ్ డీఈ కృష్ణ జ్యోతి, ఏపీడీ పుల్లా రెడ్డి, ఎంపీడీఓ కరుణ సాగర్, ఈసీ సత్య మూర్తి, టెక్నికల్ అసిస్టెంట్ జయరాం, పురుషోత్తం నాయుడు, చంద్రశేఖర్రెడ్డి, హరి కుమార్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరులో.. ఆత్మకూరు: మండల కేంద్రం సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను కేంద్ర బృందం పరిశీలించింది. పనులు ఎంత మేర చేశారు.. ఏ పనికి ఎంత కూలీ వర్తిస్తోంది తదితర వివరాలను బృంద సభ్యులు నవనీత్ దాస్, శంకర్, గౌతమ్ అడిగి తెలుసుకున్నారు. పర్కులేషన్ ట్యాంక్, హార్టికల్చర్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్రెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మి ఏపీఓ వెంకటనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ పాల్గొన్నారు. -
మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం
గుంతకల్లు: ప్రయాణికులు, ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజన్ అరుణ్కుమార్జైన్ పేర్కొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా గురువారం గుంతకల్లుకు వచ్చిన ఆయన డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తాతో కలిసి హెడ్క్వాటర్స్లోని లోకోమోటివ్ షెడ్లో రూ.కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత 115 కేఎంపీ అన్ గ్రిడ్ సోలార్ ప్లాంట్తో పాటు అనుబంధ సేవా భవనంలో ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్, టూల్ రూమ్, మహిళ ఉద్యోగుల విశ్రాంతి గదిని ప్రారంభించారు. లోక్మోటివ్ ఉద్యోగుల కోసం టూల్ రూమ్లో ఉంచిన పరికరాలను పరిశీలించి, వాటి ప్రాముఖ్యతను సీనియర్ డీఎంఈ మంగచార్యులను అడిగి తెలుసుకున్నారు. షెడ్ ఉద్యోగులకు అభినందన విద్యుత్ లోకో మెయింటెనెన్స్, విద్యుత్ ఆదా, పరిసరాల పరిశుభత్ర, ఉద్యోగుల భద్రత తదితర విభాగాల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన లోకోమోటివ్ షెడ్ ఉద్యోగులు క్యూఆర్ఓ, ఓటాబు సంస్థ నుంచి అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జీఎం... షెడ్ విభాగం ఉద్యోగులను అభినందించారు. రూ.25 వేల నగదు రివార్డును ప్రకటించారు. రైల్వే అభివృద్దికి ప్రతి ఉద్యోగీ తన వంతు సహకారం అందించాలన్నారు. తద్వారా ప్రయాణికులకు మెరుగైన ప్రయాణం అందించడానికి వీలుంటుదన్నారు. అంతకు ముందు లోకోమోటివ్ షెడ్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం డీఆర్ఎం కార్యాలయంలోని మీటింగ్ చాంబర్లో డివిజన్ స్థాయి అధికారులతో సమావేశమై మాట్లాడారు. డివిజన్ పగ్రతి, అభివృద్ది పనులు తదితరాలను ఆరా తీశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సుధాకర్, డీఈఈ నాగేశ్వరరావు, ఏడీఎంఈ కేవీ నరేష్కుమార్తో పాటు జోనల్, డివిజన్కు చెందిన వివిధ విభాగాల అధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు. రీ–సర్వే గ్రామాల్లో ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ అనంతపురం అర్బన్: భూముల రీ–సర్వే జరిగిన గ్రామాల్లో ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ చేపట్టినట్లు జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాయింట్ పట్టాదారులుగా నమోదైన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడంలో నెలకొన్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక సబ్ డివిజన్ డ్రైవ్ చేపట్టామన్నారు. రెవెన్యూ శాఖ సబ్ డివిజన్ సేవ కోసం నిర్ధారించిన రూ.500 రుసుంకు మినహాయింపు ఇచ్చారన్నారు. నామమాత్రంగా దరఖాస్తు రుసుం రూ.50ను సంబంధిత గ్రామ సచివాలయంలో చెల్లిస్తే జాయింట్ పట్టాదారుల భూములను ఉచితంగా సబ్ డివిజన్ చేస్తారన్నారు. ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకునే వారికే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర జల సంఘం సభ్యుల పర్యటన రాయదుర్గం టౌన్: మండలంలోని టి.వీరాపురం గ్రామంతో పాటు వివిధ ప్రాంతాల్లో కేంద్ర జల సంఘం బృందం సభ్యులు గురువారం పర్యటించారు. 6వ కేంద్ర జల అవార్డుకు జిల్లా ఎంపికై న నేపథ్యంలో వారి పర్యటన కొనసాగింది. కేంద్ర జల సంఘం డిప్యూటీ డైరక్టర్ కె.శంకర్, శాస్త్రవేత్త ఎంఎస్ గౌతమ్ నేతృత్వంలోని సభ్యుల బృందం టి.వీరాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో కందకాలు, మొక్కల పెంపకాన్ని ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు. అమృత్ సరోవర్ పథకంలో భాగంగా టి.వీరాపురం వద్ద ఏర్పాటు వద్ద నీటి చెరువు, వాటర్ షెడ్ పనుల్లో నాణ్యతను తనిఖీ చేశారు. కార్యక్రమంలో డ్వామా అడిషనల్ పీడీ సుధాకర్రెడ్డి, ఏపీడీ అసిస్టెంట్ దేవరాజ్, ఏపీఓ రవి, ఎఫ్ఆర్ఓ రామచంద్రుడు, డీఆర్ఓ దామోదర్రెడ్డి, బీట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
డయాలసిస్ రోగులకు తప్పిన విద్యుత్ కష్టాలు
గుంతకల్లు: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ రోగులకు ఎట్టకేలకు విద్యుత్ కష్టాలు తప్పాయి. ఆస్పత్రిలో నెలకొన్న దుస్థితిపై ఈ నెల 17న ‘సాక్షి’లో ‘పాలకుల నిర్లక్ష్యం..ప్రాణ సంకటం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ వినోద్కుమార్ సమస్యను పరిష్కరించాలని డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే గుంతకల్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజేంద్రరావుతో డీసీహెచ్ఎస్ మాట్లాడారు.డయాలసిస్ సెంటర్కు జనరేటర్ కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై అజేంద్రరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ డయాలసిస్ సెంటర్ను రాహి కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. జనరేటర్ కనెక్షన్ ఇవ్వడంతో విద్యుత్ సమస్య తీరినట్లేనన్నారు. జనరేటర్కు అవసర మైన డీజిల్ను రాహి కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారే భరించాల్సి ఉంటుందన్నారు.ఐటీఐ రెండో విడత అడ్మిషన్లు ప్రారంభంఅనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని బాలుర ఐటీఐ ప్రవేశాలకు మొదటి విడతలో పూర్తయిన తర్వాత రెండో విడత ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాయపరెడ్డి కోరారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు జూలై 17 మధ్యాహ్నం ఒంటి గంటలోపు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ చేయించుకున్న దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్లకు అర్హత పొందుతాయని స్పష్టం చేశారు. జూలై 21, 22 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. https://iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాయపరెడ్డి సూచించారు.టీబీ డ్యాంకు 43,706 క్యూసెక్కుల ఇన్ఫ్లోబొమ్మనహాళ్: జిల్లా ప్రజలకు హెచ్చెల్సీ (ఎగువ) ద్వారా తాగు, సాగు నీరందించే తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. గురువారం సాయంత్రానికి 43,706 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ,ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్ఫ్లో మొదలైంది. 10 రోజులుగా ఇన్ఫ్లో హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతోంది. మే మొదటి వారంలో జీరోగా ఉన్న ఇన్ఫ్లో.. నేడు 43,706 క్యూసెక్కులుగా నమోదవుతుండడం గమనార్హం. ప్రసుత్తం జలాశయంలో నీటి నిల్వ 1,633 అడుగులకు గాను 1,608.23 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 34.220 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకా వర్షాలు కురుస్తుండడంతో ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.పీపీ పదవికి హరినాథరెడ్డి రాజీనామాసాక్షి ప్రతినిధి, అనంతపురం: పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచమల్లు హరినాథరెడ్డి తన పదవికి గురువారం రాజీనామా చేశారు. 2019 డిసెంబర్ 21న ఆయన జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. రాజీనామా చేసిన అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాను పీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గట్టిగా వాదించి దోషులకు శిక్షలు పడేలా చేశామ న్నారు. తనను తొలగించాలని ఇటీవల ప్రభుత్వానికి కొందరు సిఫార్సు చేశారని, అయితే, ఈ విషయంలో తనకేమీ బాధ లేదన్నారు. తొలగించాల్సిన అవసరం లేకుండానే తానే పదవికి రాజీనామా చేస్తున్నాన న్నారు. రాజీనామాను ఆమోదించాలని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ను కోరినట్లు వెల్లడించారు. -
నాణ్యతకు తూట్లు..జేబుల్లోకి కోట్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం/ఆత్మకూరు : కరువు పీడిత రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో దివంగత నేత వైఎస్సార్ హంద్రీ–నీవా ప్రాజెక్టును చేపట్టి దాదాపు 90 శాతం పనులను తన హయాంలోనే పూర్తి చేయించారు. కాలువలో జలాలు పారడంతో ఆ మార్గంలోని భూముల్లో నీటి లభ్యత పెరిగి బోరు బావుల్లో నీరు సమృద్ధిగా లభించేవి. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 83 టీఎంసీలకు పెంచుతూ అనుమతులు ఇచ్చారు. కానీ ఎన్నికల కోడ్ వచ్చే సరికి ఆ పనులు ముందుకు సాగలేదు.నాసిరకంగా పనులు..కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు కాలువ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. లైనింగ్ వల్ల బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గి భూములు బీళ్లుగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో లైనింగ్ చేయకూడదని ఒక వైపు రైతులు వాపోతుంటే... కూటమి ప్రభుత్వం మాత్రం ‘తమ్ముళ్ల’ జేబులు నింపడానికి పనులకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 183 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన పనులను 7 ప్యాకేజీలుగా విభజించింది. 1 నుంచి 5వ ప్యాకేజీ వరకు రూ.936.70 కోట్లు, 6,7 ప్యాకేజీలకు రూ.319 కోట్ల ఖర్చుతో పనులు అప్పగించింది. 1,2,3 ప్యాకేజీలు ఆర్వీఆర్ కంపెనీ, 4,5 ప్యాకేజీలు బీఎస్ఆర్ కంపెనీ, 6,7 ప్యాకేజీల పనులు ఎస్ఆర్సీ కంపెనీ వాళ్లు దక్కించుకున్నారు.ఇష్టారాజ్యంగా పనులు..హంద్రీ–నీవా లైనింగ్ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. సిమెంట్ తక్కువగా వేయడంతో అప్పుడే ఇసుక, కంకర తేలి కనిపిస్తోంది. పూర్తిగా మిషన్లతో పనులు చేపట్టాల్సి ఉన్నా.. దీనికి విరుద్ధంగా కార్మికులతో చేయిస్తున్నారు. ఇక.. లైనింగ్ పనులకు కాంక్రీట్ వేయాలంటే కంకర తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆత్మకూరు మండలంలోని పంపనూరు తండా గ్రామం వద్ద హంద్రీ–నీవా కాలువ పక్కనే మొబైల్ క్రషర్ ఏర్పాటు చేసి కాలువలో ఉన్న రాళ్లతో పాటు పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోని కొండ నుంచి రాళ్లను తరలించి కంకర మిషన్లోకి వేస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు మొబైల్ క్రషర్కు అధికారులు అనుమతి ఇచ్చారా అనేది కూడా తెలియడం లేదు. కొండలోని రాళ్లను ఎలా కంకరగా తయారు చేసి వినియోగిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.జేబులు నింపుకోవడానికే..వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించ తలపెట్టిన గండికోట– గాలేరు నగరి, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు బ్రాంచ్కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడితే హంద్రీ–నీవా లైనింగ్తో పనే ఉండదు. అయినా.. ఆ ప్రాజెక్టులను రద్దు చేసి కేవలం తమ్ముళ్ల జేబులు నింపడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే విమర్శలున్నాయి. హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయకుండా, పిల్ల కాలువలు ఏర్పాటు చేసి నీరు ఇవ్వకుండా లైనింగ్ పనులకు తెరలేపిన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమకు అన్యాయం చేస్తూ ఎవరి జేబులు నింపడానికి ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తమకు కష్టాలు తప్పవేమో అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భూమి బీడుగా మారుతుంది
జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. గంటకు 8 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. నాకు కాలువ పక్కన ఐదెకరాల పొలం ఉంది. ప్రస్తుతం రెండు బోర్లు వేసి పంట సాగు చేస్తున్నా. కాలువకు లైనింగ్ వేస్తే భూమి లోపలికి నీరు ఇంకే అవకాశం ఉండదు. బోర్లు ఎండిపోతాయని భయంగా ఉంది. గతంలో పంటలు పండక వలస వెళ్లేవాళ్లం. వైఎస్సార్ చలువతో కాలువ నీటితో పంటలు పండించుకుంటున్నాం. చంద్రబాబు లైనింగ్ వేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. – వెంకట నాయక్, పంపనూరు తండా, ఆత్మకూరు మండలం -
నెత్తురోడిన రహదారులు
జిల్లాలో గురువారం రహదారులు నెతురోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఆరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతి వేగమే ప్రమాదాలకు కారణంగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు ఉద్యోగి దుర్మరణం శెట్టూరు: ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మరో బైక్పై వెళుతున్న బ్యాంక్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పార్థసారథి (53) శెట్టూరు మండలం ములకలేడులోని యూనియన్ బ్యాంక్ శాఖలో క్యాషియర్గా పనిచేస్తున్నారు. కళ్యాణదుర్గంలో నివాసముంటూ రోజూ ద్విచక్రవాహనంపై విధులకు వెళ్లి వచ్చేవారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు కళ్యాణదుర్గం నుంచి తన ద్విచక్రవాహనంలో ములకలేడుకు బయలుదేరారు. శెట్టూరు మండలం అడవిగొల్లపల్లి – యాటకట్లు గ్రామాల మధ్య ప్రయాణిస్తుండగా మలుపులో ఎదురుగా ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చిన కనుకూరు గ్రామానికి చెందిన సత్యప్ప ఢీకొన్నాడు. ఘటనలో రోడ్డుపై పడిన పార్థసారథి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సత్యప్పతో పాటు ఆయన కుమార్తెకూ తీవ్ర గాయాలయ్యాయి. ఆ మార్గంలో వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పార్థసారథి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి... ఉరవకొండ: స్థానిక అనంతపురానికి వెళ్లే మార్గంలోని 42వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో పడి ఉన్న మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని దూసుళ్లడంతో తల ఛిద్రమైపోయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. మృతుడికి దాదాపు 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుంది. బ్లూకలర్ ఫుల్ షర్ట్, బ్లూకలర్ గీతల ప్యాంటు, లెదర్ చెప్పులు ధరించాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ జనార్దననాయుడు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94407 40876కు సమాచారం అందించాలని కోరారు. ఆటో బోల్తా పడి.. కూడేరు: మండలంలోని ఎన్సీసీ నగర్ సమీపంలో ఆటో బోల్తాపడిన ఘటనలో అనంతపురంలోని భగత్సింగ్ నగర్కు చెందిన దూదేకుల షెక్షావలి (28) మృతి చెందాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలసి గురువారం ఉదయం ఉరవకొండ నుంచి అనంతపురానికి ఆటోలోషెక్షావలి బయలుదేరాడు. ఎన్సీసీ నగర్ సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ వేగాన్ని నియంత్రించుకోలేక పోవడంతో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉంచిన సిమెంట్ స్తంభాలపైకి ఎక్కి బోల్తాపడింది. ఘటనలో షెక్షావలి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానికులు 108 అంబులెన్స్లో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై కూడేరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బైక్ పైనుంచి పడి మహిళ... బొమ్మనహాళ్: కుమారుడితో కలసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న మహిళ అదుపు తప్పి కిందపడి మృతి చెందింది. వివరాలు... మండలంలోని లింగదహాళ్ గ్రామానికి చెందిన నీలమ్మ (55) గురువారం ఉదయం తన కుమారుడు విరూపాక్షితో కలసి ద్విచక్ర వాహనంపై ఉద్దేహాళ్ గ్రామంలోని ఏపీజీబీ బ్యాంక్కు బయలుదేరారు. లింగదహాళ్ గ్రామం దాటగానే నీలమ్మ చీర ద్విచక్ర వాహనం వెనుక చక్రానికి చుట్టుకోవడంతో అదుపు తప్పి కిందపడింది. దీంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి భర్త కోవిడ్–1లో మృతి చెందాడు. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ఢీకొని.. గుత్తి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన ఖాసీం (52) తన స్నేహితుడు హరిజన పెద్దయ్యతో కలసి ద్విచక్ర వాహనంపై గురువారం గుత్తికి వచ్చాడు. గుత్తి ఆర్ఎస్లోకి చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనం వెనుక కూర్చొన్న ఖాసీం ఎగిరి రోడ్డుపై పడడంతో అతని తల మీదుగా లారీ చక్కాలు దూసుకెళ్లి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. బైక్లు ఢీకొని.. కణేకల్లు: మండలంలోని జక్కలవడికి గ్రామ శివారులో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జక్కలవడికి గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు (55) ద్విచక్ర వాహనంపై వెళుతూ గ్రామ శివారులోకి చేరుకోగానే ఎదురుగా మరో ద్విచక్ర వాహనంపై వేగంగా దూసుకొచ్చిన లోకేష్రెడ్డి ఢీకొన్నాడు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరినీ స్థానికులు బళ్లారిలోని విమ్స్కు తరలించారు. తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉన్న ఆంజనేయులను బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఆర్డీటీ పరిరక్షణకు ఎందాకై నా పోరాడతాం
● అడ్డంకులు సృష్టించినా.. రంగయ్య పాదయాత్ర పూర్తి చేశారు●● కూటమి నేతలు వెంటనే ప్రధాని మోదీని కలవాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి కళ్యాణదుర్గం: కులమత భేదాలు చూపకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని వర్గాలనూ ఆదుకున్న ఆర్డీటీ పరిరక్షణకు ఎందాకైనా పోరాడతామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డీటీకి నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు డాక్టర్ తలారి రంగయ్య చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్ర 16 రోజులు కొనసాగి గురువారం ముగిసింది. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం బళ్లారి మిట్టపై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ‘అనంత’ మాట్లాడారు. ఆర్డీటీని కాపాడుకునేందుకు దశల వారీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని, అందులో భాగమే రంగయ్య పాదయాత్ర అన్నారు. రంగయ్య పాదయాత్ర చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల మద్దతుతో పాదయత్రను విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. పాదయాత్ర చేస్తే కాళ్లకు నొప్పులు...బొబ్బలు వస్తాయని టీడీపీ నేతలు వ్యంగంగా మాట్లాడారని దుయ్యబట్టారు. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ కోసం ఇప్పటికే బైకు ర్యాలీ చేశామన్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లైనా లేదన్నారు. బడుగు, బలహీన వర్గాలే వైఎస్సార్సీపీకి వెన్నెముక అన్నారు. ఆర్డీటీకి నష్టం కలిగించేందుకు బీజేపీ, కూటమి ప్రభుత్వం మతం రంగు పూసిందని మండి పడ్డారు. ఆర్డీటీపై ప్రజల అభిప్రాయాలను కేంద్రానికి పంపాలని సూచించారు. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ కోసం జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు మంత్రులు వెంటనే పీఎం మోదీ, కేంద్రం హోం మంత్రిని కలవాలన్నారు. రాయలసీమలో అత్యంత వెనుకబడిన అనంత పురం జిల్లాను అభివృద్ధి చేసేందుకు 55 ఏళ్ల నుంచి ఆర్డీటీ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ఆర్డీటీ మనుగడకే ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజల కోసమే.. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పార్లమెంట్ అబ్జర్వర్ నరేష్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆర్డీటీ కోసం రెండోసారి పోరాటం చేపట్టామన్నారు. ఈ ప్రాంత ప్రజల బాగు కోసం రంగయ్య పాదయాత్ర చేసినట్లు తెలిపారు. పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, వారు తుపాకులతో అడ్డుకున్నా రంగయ్య జంకలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, మడకశిర వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం నగరపాలక డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమా తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రజా ఉద్యమం.. పార్టీ ఆశీస్సులు, ప్రజా మద్దతుతో విజయ వంతంగా పాదయాత్ర పూర్తి చేశా. నాది రాజకీయ ఉద్యమం కాదు.. గొప్ప ప్రజా ఉద్యమం. ఆర్డీటీ ఆసుపత్రులు మూతపడితే పేద ప్రజలకు జరిగే నష్టాన్ని గుర్తెరిగి మంచి కోసం అందరూ పాటుపడాల్సిన అవసరం ఉంది. – తలారి రంగయ్య, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు -
నత్తే నయం...
● సాగుతున్న పీఏబీఆర్, ఎంపీఆర్ రెగ్యులేటర్ల నిర్మాణ పనులు ● రూ.8 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులు ఉరవకొండ: మండలంలోని మోపిడి వద్ద హెచ్చెల్సీ ప్రధాన కాలువపై 189.25వ కిలోమీటరు లింక్ చానల్ వద్ద ఉన్న పీఏబీఆర్, ఎంపీఆర్ రెగ్యులేటర్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.8 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఏడాది ఏప్రెల్ రెండో వారం పనులు ప్రారంభమయ్యాయి. మరో నెల రోజుల్లో తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీటి విడుదల కానున్న నేపథ్యంలో పనుల పూర్తిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో నిధుల మంజూరు పూర్తిగా శిథిలావస్థకు చేరిన మోపిడి సమీపంలోని హెచ్చెల్సీ లింక్ చానల్ వద్ద పీఏబీఆర్ హెడ్ రెగ్యులేటర్ 2020, ఆగస్టు మొదటి వారంలో కుప్పకూలింది. దీంతో ఇసుక మూటలు అడ్డుపెట్టి పీఏబీఆర్కు నీటిని మళ్లించే ప్రక్రియను చేపట్టారు. రెగ్యులేటర్ నిర్మాణానికి రూ.3.3 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలకు అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపి నిధులు కేటాయించింది. అయితే అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో నిధులు ఆగిపోయాయి. తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం పీఏబీఆర్తో పాటు ఎంపీఆర్కు నూతన రెగ్యులేటర్ల నిర్మాణానికి సంబంధించి చెరో రూ.4 కోట్లు చొప్పున మొత్తం రూ.8 కోట్ల నిధులను విడుదల చేసింది. పనులు పూర్తి కాకపోతే నీటి విడుదల ఎలా? పనులు పూర్తి చేయించడంలో అంతులేని ఉదాసీనత చోటు చేసుకుంది. పీఎబీఆర్ రెగ్యులేటర్ నిర్మాణ పనులు ఇంకా భూమి చదును చేసే దశలోనే ఉన్నాయి. ఎంపీఆర్ రెగ్యులేటర్ పనులు కొంత మేర జరుగుతున్నాయి. కాగా, జూలై రెండో వారంలో తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీరు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ లోపు పనులు పూర్తి కావాలి. లేకపోతే నీటి విడుదల జరిగితే కాలువకు గండ్లు పడే ప్రమాదముందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తి చేసేలా చర్యలు పీఎబీఆర్, ఎంపీఆర్ హెడ్ రెగ్యులేటర్ పనులు వేగవంతం చేస్తాం. భారీ వర్షాలతో పాటు హెచ్చెల్సీలో నీరు చేరి పనులకు అడ్డంకిగా మారాయి. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం. – దివాకర్రెడ్డి, హెచ్చెల్సీ, డీఈ -
‘యోగాంధ్ర’కు 280 బస్సులు
అనంతపురం క్రైం: కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న యోగాంధ్ర–2025 కార్యక్రమానికి అనంతపురం ఆర్టీసీ రీజియన్ నుంచి 280 బస్సులు వెళ్లనున్నాయి. జిల్లాలో ఆయా బస్సు రూట్లను 20వ తేదీ రాత్రి నుంచి రద్దు చేశారు. కూటమి సర్కారు వచ్చిన నాటి నుంచి ఇష్టారాజ్యంగా ఆర్టీసీ బస్సులను దారి మళ్లిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఏకంగా 400కు పైగా బస్సులను తరలించారు. దీంతో అప్పట్లో ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. తాజాగా యోగాంధ్ర అంటూ విశాఖ పట్నానికి బస్సులను మళ్లిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. సామాన్యుల గురించి పట్టించుకోరా అంటూ నిలదీస్తున్నారు. ఉన్నట్లుండి బస్సులను రద్దు చేస్తే సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో టీడీపీ నేతలు, ఉన్నతాధికారులు ఆలోచించాలని సూచిస్తు న్నారు. ఇదిలాఉంటే.. ఇష్టారాజ్యంగా బస్సుల మళ్లింపుపై ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే ఆలోచనలో పడినట్లు తెలిసింది. జెడ్పీ సీఈఓ శివశంకర్ బాధ్యతల స్వీకరణ అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధి కారి(సీఈఓ)గా శివశంకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో డ్వామా ఏపీడీగా పని చేస్తున్న ఆయన్ను జెడ్పీ సీఈఓగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య నుంచి ఆయన చార్జ్ తీసుకున్నారు. -
ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ల హెల్ప్డెస్క్ ఏర్పాటు
అనంతపురం ఎడ్యుకేషన్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియపై విద్యార్థుల అవగాహన కోసం అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాలలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 19 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ముగిసే వరకూ రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హెల్ప్డెస్క్ అందుబాటులో ఉంటుంది. నూతన విద్యా విధానాన్ని అనుసరించి ఈ విద్యా సంవత్సరంలో ఆర్ట్స్ కళాశాలలో 41 డబుల్ మేజర్ కోర్సులను ప్రవేశపెట్టారు. -
నలుగురు జీవిత ఖైదీల విడుదల
బుక్కరాయసముద్రం: మండలంలోని రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి నలుగురు జీవిత ఖైదీలు విడుదలయ్యారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ రహమాన్ తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేస్తూ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఓపెన్ ఎయిర్ జైలుకు చెందిన నలుగురు ఖైదీలు ఉన్నారు. విడుదలైన వారిలో ప్రకాశం జిల్లా పొన్నలూరు గ్రామానికి చెందిన రామస్వామి, వైఎస్సార్ కడప జిల్లా తొండూరు మండలం గొట్లూరు గ్రామానికి చెందిన పోల్రెడ్డి, అదే జిల్లా కడపలోని భగత్సింగ్ నగర్కు చెందిన ఫకృద్దీన్, నెల్లూరులోని జీనిగిల వీధికి చెందిన చంద్రశేఖర్ ఉన్నారు. వీరికి విడుదల ఆర్డర్ కాఫీతో పాటు నూతన వస్త్రాలను అందజేసి బుధవారం రాత్రి సాగనంపినట్లు జైలు సూపరింటెండెంట్ రహమాన్ తెలిపారు. -
మొన్నటి వరకూ ఇద్దరు... నేడు ఒక్కరు!
అనంతపురం ఎడ్యుకేషన్: ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ బీసీ, ఎస్సీ వర్గాలకు చెందినవారే. వాస్తవానికి అక్కడ రెండు ఎస్జీటీ పోస్టులు మంజూరయ్యాయి. మొన్నటిదాకా ఇద్దరు టీచర్లు పని చేశారు. వారికి 8 ఏళ్లు సర్వీస్ కావడంతో తప్పనిసరి మరోచోటుకు బదిలీ అయ్యారు. అయితే ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్లో ఆ స్కూల్కు ఒక టీచరును మాత్రమే కేటాయించారు. మరొక టీచరు విషయాన్ని పట్టించుకోలేదు. ఇది విద్యాశాఖ ఉద్యోగులు కావాలనే చేసిన తప్పిదంతో తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి బీసీకాలనీలోని పాఠశాల ఏకోపాధ్యాయుడితోనే కొనసాగించాల్సి వచ్చింది. విద్యార్థుల సంఖ్య ఎక్కువే యర్రగుంటపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 25 మంది విద్యార్థులు ఉన్నారు. నిబంధనల ప్రకారం 20 మంది విద్యార్థుల సంఖ్య దాటితే రెండో ఉపాధ్యాయుడు తప్పనిసరి. ఇక్కడ పని చేస్తున్న ఇద్దరు టీచర్లూ బదిలీల్లో భాగంగా మరో ప్రాంతానికి వెళ్లారు. దీంతో పుట్లూరు–2 పాఠశాల నుంచి ఎన్పీ శివశంకరయ్య బదిలీపై వచ్చారు. మరో పోస్టు ఖాళీగా ఉందని డిస్ప్లే చూపించింది. పలువురు టీచర్లు ఈ స్కూల్ కోరుకోవాలని చూసినా...డీఈఓ కార్యాలయ సిబ్బంది కల్పించుకుని అక్కడ పోస్టు లేదని, తీసుకున్నా జీతానికి ఇబ్బంది పడతారంటూ భయపెట్టారు. ఇంకొందరికై తే అప్పటికే మాధవి అనే టీచరు అక్కడికి వెళ్లారని, మరో టీచరుకు ఆ ప్లేస్ ప్రిపరెన్షియల్ కేటగిరీకి కేటాయించామని బుకాయిస్తూ వచ్చారు. వాస్తవానికి ప్రాథమిక పాఠశాల్లో రెండు పోస్టులున్న చోట ప్రిపరెన్షియల్ కేటగిరీకి చోటు లేదనే విషయాన్ని మభ్య పెట్టి ఆ స్కూల్కు రెండోటీచరు లేకుండా చేశారు. కాగా, ఈ పాఠశాలకు రెండో పోస్టు కేటాయించక పోవడంపై విద్యాశాఖ అధికారికి తాడిపత్రి ఎంఈఓ లేఖ రాశారు. విద్యాశాఖ ఉద్యోగుల నిర్లక్ష్యంతో భర్తీ కాని రెండో టీచర్ పోస్టు టీచర్లు కోరుకునే ప్రయత్నం చేసినా సాకులు చెప్పి తప్పించుకున్న వైనం -
కూటమి నేతల బాహాబాహీ
సాక్షి టాస్క్ఫోర్స్: చెన్నేకొత్తపల్లిలోని ఓ ధాబాలో కూటమి నేతలు బాహాబాహీకి దిగారు. ఓ వర్గం నాయకుడు కత్తితో దాడి చేయగా...మరోవర్గం వారు రాళ్లదాడితో రణరంగం సృష్టించారు. ఈ ఘటన బుధవారం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఎన్ఎస్గేట్కు చెందిన ఖాసీంవలి, నాగరాజు పరిటాల శ్రీరామ్ అనుచరులు. వీరిద్దరూ బుధవారం సీకే పల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ ధాబాలో కూర్చుని ఉన్నారు. అదే సమయంలో ధర్మవరం మండలం చిగిచెర్లకు చెందిన అరవింద్రెడ్డితో పాటు మరికొందరు టీ తాగేందుకు అదే ధాబాకు వచ్చారు.అరవింద్రెడ్డి గతంలో వరదాపురం సూరి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో పరిటాల శ్రీరామ్ అనుచరులు ఖాసీంవలి, నాగరాజు ధర్మవరం రాజకీయాలపై మాట్లాడుకుంటుండగా... అరవింద్రెడ్డి కలుగజేసుకున్నాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి... ఒకరిపై మరొకరు దాడికి దిగారు.దీంతో అరవింద్రెడ్డి వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకుని వచ్చి ఖాసీంవలి, నాగరాజుపై దాడి చేశాడు. వారిద్దరూ రాళ్లతో అరవిందరెడ్డిపై ప్రతిదాడి చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాల వారు గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని చెన్నేకొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అరవింద్రెడ్డి ఫిర్యాదు అందిన వెంటనే ఇరువర్గాలపై కేసు నమోదు చేస్తామని చెన్నేకొత్తపల్లి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. సీకేపల్లి ధాబాలో ఇరు వర్గాల ఘర్షణ ‘పరిటాల’ అనుచరులపై కత్తితో దాడి చేసిన సూరి అనుచరుడు ప్రతిదాడిగా రాళ్లతో రణరంగం సృష్టించిన పరిటాల వర్గం -
ఇదేం పద్ధతి మాస్టార్లూ..
● కార్పొరేషన్ స్కూళ్ల టీచర్ల లీలలు ● అనుకూలమైన పాఠశాలల కోసం అడ్డదారులు తొక్కడంపై విమర్శలు అనంతపురం ఎడ్యుకేషన్: కార్పొరేషన్ పాఠశాలల్లో పని చేస్తున్న కొందరు ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన స్కూళ్ల కోసం అడ్డదారులు తొక్కారు. కక్కుర్తి పడి అడ్డగోలుగా పాయింట్లు వేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వెబ్ కౌన్సెలింగ్లో తమను ఎవరూ పట్టించుకోరనే ధీమాతో ఇలా అడ్డగోలు పాయింట్లు పెట్టుకున్నారు. శారదా నగర పాలక బాలికల పాఠశాలలో హిందీ టీచర్గా పని చేస్తున్న చంద్రకళ భర్త ఎంటీఎస్ టీచరు. ఎంటీఎస్ టీచర్లకు స్పౌజ్ వర్తించదు. అయినా చంద్రకళ స్పౌజ్ పాయింట్లతో నేతాజీ స్కూల్కు వెళ్లారు. జ్యోతి అనే ఇంగ్లిష్ టీచరు సుమారు ఐదేళ్ల క్రితం స్పౌజ్ పాయింట్లతోనే శారదా స్కూల్కు వచ్చారు. ప్రస్తుతం రిక్వెస్ట్ బదిలీకి కూడా స్పౌజ్ పాయింట్లు వేసుకుని ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్కు వెళ్లారు. అలాగే మరో తెలుగు టీచర్ పుల్లమ్మ స్పౌజ్ పాయింట్లతో ఎస్కేడీ పాఠశాలకు వెళ్లారు. ఎవరి కోసం రిలీవ్ చేయొద్దన్నారో.. పాతూరు కస్తూర్బా బాలికల పాఠశాలలో సోషల్ టీచర్గా పని చేస్తున్న మనోరంజని 8 ఏళ్లు పూర్తయినా.. ఏడాదిలో రిటైర్డ్ కాబోతున్నారు. ఈమె విల్లింగ్ ఉంటే తప్ప బయటకు పంపరు. ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఎస్కేడీ పాఠశాల అలాట్ కావడంతో ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ ఆమెకు నచ్చిన స్కూల్ రాలేదంటూ ఇప్పటికీ రిలీవ్ కాలేదు. డీఈఓ కార్యాలయం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతో అక్కడే కొనసాగుతున్నారు. కాగా కస్తూర్బా స్కూల్ నుంచి ఎస్కేడీ స్కూల్ లాగిన్కు మనోరంజని పేరు మార్పు జరిగింది. అయినా నేటికీ డిప్యూటేషన్పై వస్తున్నట్లు అటెండెన్స్ వేస్తున్నారు. మరోవైపు ఎస్కేడీ పాఠశాలలో సోషల్లో మూడు పోస్టులుంటే ఈమె వెళ్లకపోవడంతో ఇద్దరే పని చేస్తున్నారు. అధికారుల ఇష్టారాజ్యం.. బాలికల పాఠశాలల్లో 50 ఏళ్లలోపు పురుష ఉపాధ్యాయులు ఉండకూడదంటూ ప్రభుత్వం ఇటీవల జీఓ విడుదల చేసింది. అలా పని చేస్తున్న స్థానాలను ఖాళీలుగా చూపించారు. అయితే నగరంలోని శారదా బాలికల పాఠశాలకు ఇద్దరు 50 ఏళ్లలోపు సోషల్ పురుష టీచర్లను కేటాయించడం గమనార్హం. వాస్తవానికి నగర పాలక పాఠశాలల్లో మహిళా టీచర్లు ఉన్నారు. వారందరికీ యూపీ పాఠశాలలు, బాలుర ఉన్నత పాఠశాలలు కేటాయించారు. శ్రీపొట్టి శ్రీరాములు పాఠశాలలో పని చేస్తున్న ఇందతుల్లా, జయకృష్ణ తప్పనిసరి బదిలీ కావాల్సి ఉంది. బాలుర పాఠశాలల్లో ఖాళీలు లేకపోవడంతో మొన్నటిదాకా వారు అక్కడే కొనసాగుతూ వచ్చారు. జీతాలకు ఇబ్బంది తలెత్తే ప్రమాదం నెలకొనడంతో రెండు రోజుల కిందట తప్పనిసరి పరిస్థితుల్లో బాలికల పాఠశాలకు కేటాయించారు. అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగానే ఈ దుస్థితి నెలకొందని పలువురు టీచర్లు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు. -
రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీల్లో జిల్లా వాసుల ప్రతిభ
అనంతపురం అర్బన్: ఈనెల 16, 17 తేదీల్లో విజయవాడ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లావాసులు వివిధ విభాగాల్లో ప్రతిభ చూపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ వి.వినోద్కుమార్ అభినందనలు తెలిపారు. వ్యాసరచన పోటీల్లో నగరానికి చెందిన బి.భావన రసజ్ఞ ప్రథమ బహుమతి సాధించారు. సోలో యోగా పోటీల్లో (35 ఏళ్లు ఆపై) నగరానికి చెందిన ఎం.చలపతి రెండో బహుమతి గెలుచుకున్నారు. షార్ట్ ఫిలిమ్ పోట్లీలో (35 ఏళ్లు ఆపై) గుత్తికి చెందిన సి.విజయభాస్కర్ చౌదరి ద్వితీయ బహుమతి సాధించారు. పోస్టర్ పోట్లీలో (35ఏళ్లు ఆపై) ఉరవకొండకు చెందిన కె.సునీత మూడో బహుమతి దక్కించుకున్నారు. యోగా షార్ట్ ఫిలిమ్ పోటీల్లో (10–18 ఏళ్ల మధ్య) ఉరవకొండకు చెందిని కె.భరణి రెండో బహుమతి, యోగా క్విజ్ పోటీల్లో (19–35 ఏళ్లు) నగరానికి చెందిన బి.భావన రసజ్ఞ, బి.సాయి చంద్రశేఖర్ (ఉరవకొండ), కె.రుషిత తన్మయి తృతీయ బహుమతి గెలుపొందారు. పందుల అపహరణ కనగానపల్లి: మండలంలోని దాదులూరు సమీపంలో 44వ జాతీయ రహదారిపై పందులను తరలిస్తున్న వాహనాన్ని దుండగులు అడ్డుకుని పందులను మరో వాహనంలో అపహరించారు. పోలీసులు తెలిపిన మేరకు... తెలంగాణలోని వికారాబాద్ జిల్లా దరూర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన ఎరికల రామకృష్ణ, బసవరాజు, వెంకటేష్ ఓ బొలెరో వాహనంలో మంగళవారం రాత్రి 89 పందులను కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలోని పేరసంద్రకు తీసుకెళుతున్నారు. వెంబడిస్తూ వచ్చిన మరో వాహనంలోని 15 మంది దుండగులు దాదులూరు సమీపంలోకి చేరుకోగానే బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం పందుల యజమానులను బెదిరించి 89 పందులను అపహరించుకెళ్లారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకుడి బలవన్మరణం బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని హైస్కూల్ కొట్టాలకు చెందిన సంగమేష్ కుమారుడు శివాజీ (22) ఆత్మహత్య చేసుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసినా.. తనకు ఉద్యోగం రాలేదన్న మనోవేదనతో బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రైతులకు రాయితీ పనిముట్ల పంపిణీ
అనంతపురం సిటీ: రాయితీతో అందజేస్తున్న యంత్ర పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని రైతులను అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యంత్రీకరణ పథకం కింద మంజూరైన వ్యవసాయ యంత్ర పరికరాలను కలెక్టరేట్లో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా 1,070 మంది రైతులకు వర్తించిన రాయితీకి సంబంధించిన రూ.2.29 కోట్ల చెక్కును ఆయన అందజేసి, మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతులకు వ్యక్తిగతంగా 50 శాతం సబ్సిడీతో వివిధ రకాల వ్యవసాయ పనిముట్ల అందజేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాలో 1,070 మంది రైతులకు 50 శాతం సబ్సిడీతో రాయితీ విడుదలైందన్నారు. డీఏఓ ఉమామహేశ్వరమ్మ, జెడ్పీ సీఈఓ శివశంకర్, ఆగ్రోస్ ఎండీ ఓబుళపతి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.దుర్మార్గపు పాలనకు బుద్ధి చెబుతాం● వైఎస్సార్ సీపీ టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్గౌడ్అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి పర్యటనను విఫలం చేసేందుకు అభిమానులు, ప్రజలను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జననేత నుంచి జనాన్ని దూరం చేయాలనుకుంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపడంలాంటిదేనన్నారు. సీఎం చంద్రబాబుకు ఎలాంటి ప్రజాదరణ లేదన్నారు. అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలుస్తూ, ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు నడుస్తున్న జగనన్నకు వస్తున్న ఆదరణను ఓర్వలేక చంద్రబాబు అండ్ కో దిగుజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. -
మావాళ్లొస్తారు.. మీరెళ్లిపోండి!
కళ్యాణదుర్గం: ‘మా వాళ్లు చాలా మంది ఉన్నారు... మీరెళ్లిపోండి... వారు విధుల్లోకి వస్తారు’ అంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు ఎట్రియా బ్లైత్ విండ్ పార్క్ సెక్యూరిటీ సిబ్బందిపై బెదిరింపులకు దిగిన విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. మూడు రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కళ్యాణదుర్గం ప్రాంతంలోని గాలిమరల వద్ద ఎట్రియా బ్లైత్ విండ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కింద సెక్యూరిటీ, సూపర్వైజర్లు, ఐటీ ఎక్స్పర్ట్లు సుమారు 70 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. కళ్యాణదుర్గం మండలంలోని ఐదుకల్లు గ్రామ సమీపంలో ‘ఎట్రియా’ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ఇంకా రెండున్నరేళ్ల పాటు అనుమతులు ఉన్నాయి. అంతవరకూ సిబ్బంది కొనసాగాల్సి ఉంది. అయితే మూడు రోజుల క్రితం అభయ్ సెక్యూరిటీ ఏజెన్సీ పేరుతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు కొందరు ఐదుకల్లు ‘ఎట్రియా’ కార్యాలయానికి వెళ్లారు. సిబ్బందిని బయటికి పంపి కార్యాలయ గేటుకు తాళాలు వేశారు. ‘మా పార్టీ అధికారంలో ఉంది.. ఇకపై మా వారే విధులకు వస్తారు’ అంటూ భయభ్రాంతులకు గురి చేశారు. కాగా.. గాలిమరల కంపెనీలో సెక్యూరిటీ సిబ్బంది విషయంపై మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, ప్రస్తుత ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు సమాచారం. ఉన్నం తనయులు ఎట్రియా బ్లైత్ విండ్ పార్క్ సంస్థ ద్వారా సిబ్బందిని నియమించుకున్నారు.దీన్ని తట్టుకోలేని అమిలినేని అనుచర గణం.. ఏకంగా కార్యాలయానికే వెళ్లి బెదిరింపులకు దిగడం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య సమస్యలుంటే ఇద్దరూ సమన్వయంతో పరిష్కరించుకోవాలి కానీ చిరుజీవుల కడుపు కొట్టేలా వ్యవహరించడమేంటని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీకి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు ఆందోళన వ్యక్తం చేస్తున్న చిరుద్యోగులుఎమ్మెల్యే చొరవ చూపాలి కళ్యాణదుర్గం ప్రాంతంలో 20 ఏళ్లుగా కంపెనీ తరఫున 70 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే అమిలినేని అనుచరులు కార్యాలయానికి వచ్చి సిబ్బందిని బెదిరించారు. మా పార్టీ అధికారంలో ఉంది.. మా వారే విధులకు వస్తారంటూ అభయ్ సెక్యూరిటీ ఏజెన్సీ పేరు చెప్పి కొందరు హల్చల్ చేశారు. చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకునే వారి పొట్ట కొట్టడం సరి కాదు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చొరవ చూపి, సిబ్బందికి న్యాయం చేయాలి. – సుధీర్, సూపర్వైజర్, ఎట్రియా బ్లైత్ విండ్ పార్క్ -
ఇంటి దొంగ గుట్టురట్టు
కణేకల్లు: విద్యుత్ సబ్ స్టేషన్లో పనిచేస్తున్న ఓ లైన్మెన్ కాపర్వైర్పై కన్నేశాడు. గుట్టుచప్పుడు కాకుండా కాపర్వైర్ను అపహరించి బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ అక్రమాలు కాస్త వెలుగు చూడడంతో విచారణకు ఆ శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. వివరాల్లోకి వెళితే.. కొన్నేళ్ల క్రితం కణేకల్లులోని వివిధ కాలనీలో కరెంటు సరఫరా కోసం విద్యుత్ స్తంభాలంపై కాపర్ వైర్తో లైన్లు ఏర్పాటు చేశారు. ఈ కాపర్ వైర్పై కన్నేసిన లైన్మెన్ ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాటిని తొలగించి, సిల్వర్ వైర్ లాగాడు. కణేకల్లులోని వివిధ ప్రాంతాల్లో 9 స్తంభాలకు ఏర్పాటు చేసిన సుమారు 300 మీటర్లు అంటే సుమారు 120 కిలోల కాపర్ వైర్ మాయమైనట్లు సమాచారం. వీటి విలువ రూ.72 వేలు ఉంటుందని అంచనా. ఎల్సీ ఎలా తీసుకొన్నాడు? కాపర్ వైర్ లైన్ మార్పిడి పనులు తమకు తెలియకుండా జరిగాయని లైన్ ఇన్స్పెక్టర్తో పాటు ఏఈ సైతం పేర్కొనడం గమనార్హం. లైన్ మార్పిడి చేయాలంటే తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ఆ తర్వాత మెటీరియల్ వస్తే అధికారుల ఆదేశాల మేరకు పనులు చేయాల్సి ఉంది. అయితే ఉన్నతాధికారులకు ఎంత మాత్రం తెలియకుండా ఓ లైన్మెన్ ఇంతటి సాహసానికి ఒడిగట్టడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాపర్ వైర్ లైన్ మార్పిడి సమయంలో ఎల్సీ ఎలా తీసుకొన్నాడు? పనులెప్పుడు చేశాడనేది మిలియన్డాలర్ల ప్రశ్నగా మారింది. ఎంఎస్ మీటర్ మార్పిడికీ డబ్బు వసూలు ఎంఎస్ మీటర్ (మీటర్ స్ట్రకప్ మీటర్) మార్పిడి అంశంలో మాముళ్ల వసూళ్లకు సదరు లైన్మెన్ తెరలేపినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక వేళ మీటర్లు కాలిపోతే వినియోగదారుడు డిపార్ట్మెంటుకు రూ.1,050 చెల్లించి కొత్త మీటర్ పొందాల్సి ఉంటుంది. అలా కాకుండా చెడిపోయినా, రీడింగ్ రన్నింగ్ కాకపోయినా వాటి స్థానంలో మరొకటి ఏర్పాటు చేయడానికి విద్యుత్ శాఖ ఉచితంగా మీటర్లను సరఫరా చేస్తోంది. దీనికి ఎలాంటి చార్జీలు వసూలు చేయరు. ఎంఎస్ మీటర్లను ఉచితంగా మార్చాల్సి ఉండగా... సదరు లైన్మెన్ వినియోగదారుల నుంచి రూ.1,500 నుంచి రూ. 2వేల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. కణేకల్లులో 50కి పైగా స్ట్రకప్ మీటర్లున్నాయని కొత్త మీటర్లు తీసుకెళ్లిన సదరు లైన్మెన్... వినియోగదారులు డబ్బు ఇవ్వకపోవడంతో వాటిని రిప్లేస్ చేయకుండా తన వద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. కాపర్ వైర్పై కన్నేసిన కన్నింగ్ లైన్మెన్ దాదాపు 300 మీటర్ల కాపర్ వైర్ అపహరణ.. విక్రయం అక్రమాలపై విచారణ చేపడతామన్న విద్యుత్ శాఖ ఏడీ ఇటీవలే నా దృష్టికి వచ్చింది కణేకల్లులో కాపర్ వైర్ మాయమైనట్లు ఇటీవలే నా దృష్టికి వచ్చింది. ఈ పని ఎవరు చేశారనే దానిపై విచారణ చేపడతాం. లైన్ మార్పిడి చేస్తే పాత కేబుల్ను ఏఈకు అప్పగించాలి. అలా చేయకుండా అమ్మేయడం తప్పు. కాపర్ వైర్ మాయం చేసిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. ఎంఎస్ మీటర్ల రిప్లేస్ అవినీతిపై కూడా విచారణ చేపడతాం. బాధితులెవరైనా ఉంటే నేరుగా ఫిర్యాదు చేయాలి. – భాస్కర్, విద్యుత్ శాఖ ఏడీ, ఉరవకొండ -
సాంకేతిక సాకు.. తిరకాసు
అనంతపురంలోని తపోవనంలో నివాసముంటున్న దామోదరరెడ్డి ఇటీవల 4 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు రామ్నగర్లోని ఓ డాక్యుమెంట్ రైటర్ని కలిశాడు. అతను స్టాంప్ వెండర్ దగ్గరకు పిలుచుకెళ్లి స్టాంపులు కావాలని అడిగితే స్థలం విలువలో 6.5శాతం స్టాంప్ డ్యూటీని స్టాక్ హోల్డ్ ఏజెన్సీ పేరిట చలానా తీస్తే ఈ–స్టాంపు ఇస్తామన్నాడు. దీంతో ఏజెన్సీ పేరిట చలానా తీసే సమయంలో ఖాతాలో నగదు కట్ అయింది కానీ, చలానా రాకుండా హోల్డ్లోకి వెళ్లింది. దీంతో దాదాపు రూ.40వేలకు పైగా నగదు అలాగే నిలిచిపోయింది. అనంతపురం టౌన్: భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో స్థలం విలువలో స్టాంప్ డ్యూటీ కింద 6.5శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 1 శాతం, యూజర్ ఛార్జీల కింద రూ.550 చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాలన్నింటినీ స్టాంప్స్ అండ్ రిజిస్ష్రేన్ శాఖకు చలానా రూపంలో వినియోగదారులు చెల్లించాలి. అయితే ప్రస్తుతం నాన్ జ్యూడిషియల్ స్టాంప్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించిన ఈ–స్టాంపుల విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ సాంకేతిక సాకును తమకు అనుకూలంగా మార్చుకున్న ఏజెన్సీ నిర్వాహకులు తిరకాసులు పెడుతూ స్టాంపు వెండర్లకు ఈ–స్టాంపుల స్టాక్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని స్టాక్ హోల్డ్ ఏజెన్సీ, భూపాళం కాంప్లెక్స్, కర్నూలు పేరిట చలానా తీస్తేనే ఈ–స్టాంపులు ఇస్తామని వెండర్లకు మెలిక పెడుతున్నారు. ఏజెన్సీ పేరుతో చలానా తీసే సమయంలో ఖాతాలోని నగదు హోల్డ్ పడితే ఎవ్వరిని అడగాలి? ఖాతా నుంచి కట్ అయిన నగదు తిరిగి ఖాతాలో జమ అవుతుందా? వీటికి స్టాక్ హోల్డ్ ఏజెన్సీ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ఒక్కరికే ఈ–స్టాంపులు రామ్నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపంలోని ఓ కస్టమర్ సర్వీస్ సెంటర్ నిర్వాహకుడికి మాత్రమే అధీకృత ఈ–స్టాంప్లను కర్నూలులోని స్టాక్ హోల్డ్ ఏజెన్సీ నిర్వాహకులు అందిస్తున్నారు. దీంతో ఈ–స్టాంపుల కోసం సీఎస్సీ కేంద్రం వద్ద గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకుని సదరు కేంద్రం నిర్వాహకుడు అధిక ధరకు ఈ–స్టాంప్లు విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. రూ.100 విలువ చేసే స్టాంపును రూ.150 నుంచి రూ.180 వరకు అవసరాన్ని బట్టి నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రూ.50 విలువ చేసే ఈ–స్టాంప్ను రాప్తాడుకు చెందిన ఓ వ్యక్తి రెట్టింపు ధరతో కొనుగోలు చేశాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టించుకోని అధికారులు: ఈ–స్టాంపుల అధిక ధర విక్రయాలను అడ్డుకోవాల్సిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో స్టాంప్ల విక్రయదారులు ఆడిందే ఆట... పాడిందే పాటగా వ్యవహరిస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారు. నగరంలో ఒక్కరికే ఈ–స్టాంప్ల విక్రయానికి అనుమతులు ఇవ్వడంతో ఆయన చెప్పిందే ధరగా మారింది. లేదంటే స్టాంపులు లేవంటూ నిర్లక్ష్యంగా వెనక్కు పంపించేస్తాడు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలోని స్టాంపుల విక్రయ కేంద్రాన్ని మూసి ఇప్పటికే ఏడాది కావస్తోంది. దీంతో స్టాంపుల కోసం అధిక మొత్తంలో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. స్టాంప్ వెండర్లను ఇబ్బందులకు గురి చేస్తున్న స్టాక్ హోల్డ్ ఏజెన్సీ ఏజెన్సీ పేరిట చలానా తీస్తేనే ఈ–స్టాంపులంటూ మెలిక చలానా తీసే సమయంలో నగదు హోల్డ్లో పడి నష్టపోతున్న వినియోగదారులు నగరంలో కేవలం ఒకరికే స్టాంపుల సరఫరా దందాకు తెరలేపిన సదరు స్టాంప్ వెండర్ పట్టించుకోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చర్యలు తీసుకుంటాంస్టాక్ హోల్డ్ కార్పొరేషన్ ఏజెన్సీ నుంచి జిల్లాలోని స్టాంప్ వెండర్లందరికీ స్టాంపులు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లాలో నెలకొన్న స్టాంపుల కొరత సమస్యపై ఉన్నతాధికారులతో చర్చించాం. అన్ని రకాల స్టాంపులను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అందుబాటులోకి తీసుకువస్తాం. – భార్గవ్, జిల్లా రిజిస్ట్రార్ -
దళితులకు రక్షణ కల్పించలేరా?
అనంతపురం అర్బన్: దళిత, గిరిజన మహిళలు, మైనర్ బాలికలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విద్యార్థి, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు ధ్వజమెత్తారు. అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయరా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థి, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు అనంతపురం సంగమేష్ సర్కిల్ నుంచి ప్రదర్శనగా వచ్చి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కార్యాలయ ద్వారం వద్ద అడ్డుగా ఉంచిన స్టాపర్లను తోసుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళిత, గిరిజన మహిళలు, మైనర్ బాలికలపై అకృత్యాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అమానవీయ ఘటన,నగరంలోని రామ కృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య ఘటన ప్రభుత్వ వైఫలానికి నిదర్శనమన్నారు. బాధిత కుటుంబాలను కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శించకపోవడం చూస్తే దళితులు, మహిళల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి స్పష్టమవుతోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నెల రోజుల్లో కేసు విచారణ పూర్తి చేసి దుండగులను కఠినంగా శిక్షించడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలన్నారు. అనంతరం జేసీ శివ్ నారాయణ్ శర్మకు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ రాము, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి సురేష్, రాయలసీమ విద్యావంతుల వేదిక వెంకటేష్, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ సాకే హరి, సామాజిక న్యాయ వేదిక కుళ్లాయప్ప, సీఎల్సీ ఆదినారాయణ, ఐఎఫ్టీయూ ఏసురత్నం, దావీదు, నిరుద్యోగ ఐక్యవేదిక రామన్న, పీపీఎస్ వీరనారప్ప, ప్రజాకళామండలి విజయ్ తదితరులు పాల్గొన్నారు. కదం తొక్కిన విద్యార్థి, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు ఉద్రిక్తతకు దారి తీసిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం -
బెంగళూరులో డి.చెన్నేపల్లి వాసి మృతి
కళ్యాణదుర్గం: కంబదూరు మండలం డి.చెన్నేపల్లికి చెందిన రామ్మోహన్ కుమారుడు సురేంద్ర (32) కుటుంబకలహాలతో విసుగు చెంది బెంగుళూరులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పదేళ్లుగా వీరి కుటుంబం హిందూపురంలో స్థిరపడినట్లు సమాచారం. సజావుగా ఏఎన్ఎంల బదిలీల కౌన్సెలింగ్ అనంతపురం మెడికల్: డీఎంహెచ్ఓ కార్యాలయంలో బుధవారం చేపట్టిన ఏఎన్ఎంల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 122 మందికి వారు కోరుకున్న ప్రాంతాలకు సీనియారిటీ ప్రాతిపదికన డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి బదిలీ చేశారు. ఏఓ గిరిజాకుమార్, సీనియర్ అసిస్టెంట్ కమలాకర్రాజు పాల్గొన్నారు.