Anantapur Latest News
-
‘ఖరీఫ్’ లక్ష్యం 4.38 లక్షల హెక్టార్లు
● అత్యధికంగా కళ్యాణదుర్గం మండల వ్యాప్తంగా 22,910 హెక్టార్లలో పంటలు ● మొత్తం నీటి వసతి కింద 1,32,321 హెక్టార్లలో సాగు ● వర్షాధారంగా 3,06,450 హెక్టార్ల సాగు అంచనాఅనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు సంబంధించి జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ముంగారు (ఖరీఫ్) వ్యవసాయానికి రైతులు సిద్ధమవుతుండగా... ఇందుకు అనుగుణంగానే ఈ ఏడాది ఖరీఫ్లో పంటల సాగు అంచనాలు కూడా అధికారులు ఎక్కువగానే అంచనా వేశారు. ఇందులో భాగంగానే నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలపై వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, జొన్న, పొద్దుతిరుగుడు తదితర 15 రకాల పంటలు 3,06,450 హెక్టార్లలో సాగులోకి రావచ్చని అంచనా వేశారు. అలాగే నీటి వసతి కింద వరి, మొక్కజొన్న, ఎండుమిరప, టమాట ఉల్లి, మల్బరీ తదితర పంటలు 1,32,321 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేశారు. గత ఐదేళ్లలో ఈ–క్రాప్లో నమోదైన గణాంకాల ఆధారంగా ఈ ఖరీఫ్లో అన్ని రకాల పంటలు 4,38,771 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావచ్చని అధికారులు అంచనాకు వచ్చారు. కళ్యాణదుర్గం టాప్ ఖరీఫ్లో అటు నీటి వసతి, ఇటు వర్షాధారంగా కళ్యాణదుర్గం మండలంలో 22,910 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారిక అంచనా. ఇందులో నీటి వసతి కింద 6,527 హెక్టార్లు, వర్షాధారంగా 16,383 హెక్టార్లుగా గుర్తించారు. అలాగే తాడిపత్రి మండలంలో అతి తక్కువగా 8,261 హెక్టార్లలో అన్ని రకాల పంటలు వేస్తారని అంచనా వేశారు. ఆ తర్వాత పెద్దపప్పూరులో 8,372 హెక్టార్లు, పుట్లూరులో 9,412 హెక్టార్లు, యల్లనూరులో 9,728 హెక్టార్లు, బుక్కరాయసముద్రంలో 9,670 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగులోకి వస్తాయని లెక్క వేశారు. శింగనమల నియోజక వర్గ పరిధిలో తక్కువ విస్తీర్ణంలో పంటలు వేయనున్నారు. ఇందులోనూ నీటి వసతి కింద ఉద్యాన పంటలు ఎక్కువగానూ, వర్షాధారంగా తక్కువగా పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఓవరాల్గా వర్షాధారంగా యల్లనూరు మండలంలో కేవలం 2,243 హెక్టార్లలో పంటలు సాగులోకి వస్తున్నట్లు అంచనా. వరి పంట ఎక్కువగా ఉన్నందున కణేకల్లు మండలంలో 8,204 హెక్టార్లలో నీటి వసతి కింద పంటలు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. -
ఆస్తి పన్ను పెంపు అసంబద్ధం : సీపీఎం
గుంతకల్లు టౌన్: పట్టణాల్లో ఆస్తి పన్ను పెంపు అసంబద్ధంగా ఉందని, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై కోట్లాది రూపాయల భారాన్ని మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప అన్నారు. ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం చేపట్టిన ప్రజా పోరుయాత్రను సోమవారం ఆయన గుంతకల్లులో జెండా ఊపి ప్రారంభించారు. ఆస్తి పన్నులను 20 శాతం పెంచేలా త్వరలో చేపట్టనున్న సర్వేను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మారుతి, నాయకులు నాగరాజు, సురేంద్ర, రంగమ్మ, తిమ్మప్ప, ఓబులేసు పాల్గొన్నారు. అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తు చేసుకోండి బుక్కరాయసముద్రం: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సులకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర తెలిపారు. 2025–25 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి https://angrau.ac.in/ వెబ్సైట్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు రెడ్డిపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదించాలన్నారు. -
ఈ స్థలం నాది.. కాదనేవారెవ్వరు?
తాడిపత్రి: ‘అధికారం మాది.. ఇక్కడ మేము ఏమీ చేసినా చెల్లుబాటు అవుతుంది. మమ్మల్ని అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు’ అనే ధోరణి టీడీపీ నేతలో వ్యక్తమైంది. గ్రామ కంఠం స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకుని బండలు పాతేయడమే కాక... ఆ స్థలం తనదని, కాదనేవారెవ్వరూ లేరంటూ దౌర్జన్యానికి తెరలేపిన ఘటన తాడిపత్రి మండలం ఇగుడూరు గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు... ఇగుడూరు గ్రామంలోని సర్వే నంబర్ 306లో కొంత స్థలం గ్రామ కంఠంగా ఉంది. ఈ స్థలానికి అవతలి వైపు పట్టా భూముల్లో కొందరు పక్కా గృహాలు నివాసముంటున్నారు. వీరి ఇళ్లకు రాకపోకలు సాగించేందుకు సర్వే నంబర్ 306లోని గ్రామ కంఠంలోని 12 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు ఉన్న స్థలమే ప్రధాన మార్గం. కాగా, ఈ స్థలానికి ఓ వైపు పుల్లన్న అనే వ్యక్తి ఇంటిని నిర్మించుకుని 30 ఏళ్లుగా నివాసముంటున్నాడు. అతడి ఇంటి ముందర రస్తాకు ఓ వైపు పంచాయతీ బోరును వేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సదరు రస్తాతో పాటు పుల్లన్న ఇంటిని ఆక్రమించుకునేందుకు అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత బోయ వారాది పావులు కదిపాడు. ఇందులో భాగంగానే గత నెల 9న టీడీపీకి చెందిన బాలమద్దిలేటి మరికొందరితో కలసి పంచాయతీ బోరును దౌర్జన్యంగా తొలగించారు. ఈ విషయంగా స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెండు రోజుల క్రితం బోయ వారాది, బాల మద్దిలేటి మరికొందరు కలసి రస్తాను ఆక్రమించి అటు వైపు నివాసముంటున్న వారు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా దౌర్జన్యంగా బండల పాతారు. ఇది చూసిన స్థానికులు అడ్డుకోబోతే ఆ స్థలం తనదంటూ వారాది దౌర్జన్యానికి తెగబడ్డాడు. రెవెన్యూ అధికారుల అండతోనే టీడీపీ నేతలు బరి తెగించారని, సమస్య పరిష్కారానికి తహసీల్దార్ రజాక్వలి ఎంత మాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ ఇళ్లకు రాకపోకలు సాగించేలా ఉన్న రస్తా ఆక్రమణలను తొలగించాలని కోరారు. గ్రామ కంఠాన్ని ఆక్రమించి బండలు పాతిన టీడీపీ నేత రెవెన్యూ అధికారుల అండతోనే దౌర్జన్యమంటున్న స్థానికులు -
పరాకాష్టకు ‘రెడ్బుక్’ వేధింపులు
● అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం ● వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యుడు రమేష్గౌడ్ అనంతపురం కార్పొరేషన్: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వేధింపులు పరాకాష్టకు చేరుకున్నాయని వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ను ఖండించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కక్షక్ష పూరిత చర్యలకు పాల్పడడడం దారుణమన్నారు. పల్నాడు జంట హత్య కేసులో టీడీపీకి సంబంధించిన ఇరువర్గాలు గొడవపడి ఓ వర్గం వారిని హత్య చేశారని, మృతుల బంధువుల చెబుతున్నా.. ఎలాంటి సంబంధం లేని పిన్నెల్లి బ్రదర్స్ను కేసులో ఇరికించడం అన్యాయమన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళీ, వల్లభనేని వంశీను ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన నాయకులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని తిరుగోమనం దిశగా మళ్లించారని మండిపడ్డారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరు ముందుకు వస్తారన్నారు. అమరావతి జపం, రెడ్బుక్ రాజ్యాంగం అమలు తప్ప కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదన్నారు. ఏడాది గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. హెచ్ఎం పదోన్నతులకు నేడు సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని పాఠశాల సహాయకుల నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ప్రొవిజినల్ సీనియార్టీ జాబితాలో ఉన్న టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. https://deoanantha puramu.blogspot.com వెబ్సైట్లో ప్రొవిజినల్ సీనియార్టీ ఉంచినట్లు తెలిపారు. ఈ జాబితాలోని పీఎస్హెచ్ఎంలు/స్కూల్ అసిస్టెంట్లు తమ విద్యార్హత ఒరిజనల్ సర్టిఫికెట్లు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు కుల ధ్రువీకరణ పత్రాలు, పీహెచ్ టీచర్లు తమ ఒరిజనల్ విద్యార్హత పత్రాలతో పాటు మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు అనంతపురంలోని మొదటి రోడ్డులో ఉన్న శారదా బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో చేపట్టిన పరిశీలన ప్రక్రియకు హాజరు కావాలని సూచించారు. -
వ్యవసాయశాఖలో ‘బదిలీల జాతర’
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖలో సోమవారం బదిలీల జాతర జరిగింది. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో నిర్వహించిన జోనల్స్థాయి కౌన్సెలింగ్కు రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్, సిఫారసుల కింద కూడా కొందరు ఉద్యోగులు హాజరయ్యారు. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో అర్హత కలిగిన 31 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఐదుగురు సూపరింటెండెంట్లు, 19 మంది ఏడీఏలు, 118 మంది ఏఓలతో పాటు 120 మందికి పైగా రిక్వెస్ట్ కింద బదిలీ కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. వ్యవసాయశాఖ కమిషనరేట్కు చెందిన అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్ సమక్షంలో అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, నాగేశ్వరరావు, చంద్రానాయక్, మురళీక్రిష్ణ, వరలక్ష్మి, ప్రసాదరావు, జే.మురళిక్రిష్ణతో పాటు ఆయా జిల్లాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, సూపరింటెండెంట్లు కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. కాగా, కౌన్సెలింగ్ జరుగుతున్న తీరుపై కొందరు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు కొందరివి పరిగణలోకి తీసుకుంటున్నా... మరికొందరివి తీసుకోవడం లేదన్నారు. అలాగే తమ విన్నపాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని కొందరు అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పశుశాఖలో.. స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్స్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, 23 మంది ఆఫీస్ సబార్డినేట్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, ఆఫీస్ మేనేజర్, సూపరెండెండెంట్లు పాల్గొన్నారు. -
ముచ్చుకోట స్కూల్ హెచ్ఎంకు షోకాజ్
అనంతపురం ఎడ్యుకేషన్: విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యంకు షోకాజ్ నోటీసు జారీ అయింది. కీలకమైన టీచర్ల బదిలీల ప్రక్రియపై అలసత్వం వహించిన ఆయన తన స్కూల్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న టీచర్లకు సంబంధించిన హార్డ్కాపీలపై కౌంటరు సంతకాలు చేయకపోవడమే కాక, వారికి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. ఫోన్లు చేసి అడిగితే.. ‘నేను ఎంఈఓకు చెప్పాను వెళ్లి ఆయనను కలవండి. మీ దరఖాస్తును లాగిన్లో ఆమోదం తెలుపుతారని’ చెపుతూ వచ్చాడు. ఆ టీచర్లు ఎంఈఓను కలవగా... హెచ్ఎం కౌంటర్ సంతకం లేకుండా తాను ఓకే చేయలేనంటూ తెగేసి చెప్పాడు. ఆదివారం చివరి రోజు కావడం... హెచ్ఎం అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన టీచర్లు చివరకు విషయాన్ని డీఈఓ ప్రసాద్బాబు దృష్టికి తీసుకెళ్లారు. డీఈఓ పలుమార్లు ఫోన్ చేసినా సదరు హెచ్ఎం మొబైల్ పని చేయలేదు. చేసేదిలేక ఎంఈఓను ఆఫీసుకు పిలిపించి ఆ టీచర్ల దరఖాస్తులన్నీ ఆమోదం తెలపాలని సూచించారు. డీఓఈ ఆదేశాలతో ఎంఈఓ తన లాగిన్లో ఆమోదం తెలిపారు. ఈ వ్యవహారంపై ‘హెచ్ఎం నిర్ధారించకుండానే ఎంఈఓ ఆమోదం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. సమస్యను కొందరు పాఠశాల విద్య డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు హెచ్ఎం సుబ్రహ్మణ్యంకు డీఈఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు. నోటీసు అందుకున్న మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. -
పనిచేసినా పనిష్మెంట్!
● ఎస్జీటీ కేడర్ సర్వీస్ పాయింట్లు కలపని ప్రభుత్వం ● 6–10 ఏళ్ల సర్వీస్ పాయింట్లు కోల్పోతున్న టీచర్లు ● పాయింట్ల నమోదులో 2017 బదిలీ టీచర్లకూ తీవ్ర అన్యాయం ● లబోదిబోమంటున్న ఉపాధ్యాయులు అనంతపురం ఎడ్యుకేషన్: ఏళ్ల తరబడి పని చేసినా...తాజా బదిలీల్లో ప్రభుత్వం తమకు పనిష్మెంట్ ఇస్తోందని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఎస్జీటీ కేడర్కు ఎంపికై పని చేస్తూ...కొన్నేళ్లకు మరో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్గా ఎంపికై సర్వీస్లో ఒకరోజు కూడా గ్యాప్ లేకుండా పని చేస్తున్న టీచర్లకు ఎస్జీటీ కేడర్లో పని చేసిన సర్వీస్ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘టీచర్ల బదిలీ చట్టం–2025’లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నామంటూ బాధిత టీచర్లు వాపోతున్నారు. ఎస్జీటీ కేడర్లో పని చేసిన 6–10 ఏళ్ల సర్వీస్ను కోల్పోతున్నారు. ఒక్కో టీచరు 3–5 పాయింట్లు దాకా నష్టపోతున్నారు. గతంలో జరిగిన పలు బదిలీల్లో తమకు ఎస్జీటీ కేడర్ పాయింట్లు సర్వీస్కు కలిపారని గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 మందికి పైగా ఇలాంటి టీచర్లు ఉన్నారు. వారంతా రోజూ డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. చివరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మెసేజ్లు పెడుతూ ప్రభుత్వానికి తమగోడు వినిపించాలంటూ సోషల్ మీడియా వేదికగా విన్నవించుకుంటున్నారు. తప్పనిసరి బదిలీ... పాయింట్లలో అన్యాయం 2017లో బదిలీ అయిన టీచర్లందరినీ తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. 8 ఏళ్లు సర్వీస్ పూర్తికాకపోయినా ఈనెల 31 కటాఫ్ తేదీగా పెట్టి 23.2828 పాయింట్లతో 8 ఏళ్లు పూర్తయినట్లు భావించి వారందరి పోస్టులను ఖాళీలుగా చూపించారు.8 ఏళ్లు అంటే 24 పాయింట్లు ఇవ్వాలి. అదే 2023, 2021 రేషనలైజేషన్కు గురైన వారికి పూర్తిగా 24 పాయింట్లు ఇచ్చారు. దీంతో వారందరూ 2017 బ్యాచ్ వారికంటే ముందుకు వచ్చారని 2017 బదిలీ అయిన టీచర్లు వాపోతున్నారు. 9 ఏళ్లు సర్వీస్ అయినా 8 ఏళ్లకే పాయింట్లు 2014 డీఎస్సీలో ఎంపికై న వారు 2016 జూన్ 1న పాఠశాలల్లో చేరారు. వారందరికీ 2024 జూన్ 1 నాటికి ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తయింది. వారంతా అదే ఏడాది తప్పనిసరిగా బదిలీ కావాలి. అయితే ఆ ఏడాది బదిలీలు జరగలేదు. ప్రస్తుతం (9వ సంవత్సరం) కూడా అదే పాఠశాలలో పని చేస్తూ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారికి గరిష్టంగా 8 ఏళ్లకే స్టేషన్ పాయింట్లు చూపిస్తున్నారు. ఒక ఏడాదికి స్టేషన్ పాయింట్లు పూర్తిగా కోల్పోతున్నారు. 2021, 2023 సంవత్సరాల్లో జరిగిన బదిలీల్లో ఎలాంటి సీలింగు విధించకపోవడం వల్ల గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు పని చేశారో అన్ని సంవత్సరాలకూ స్టేషన్ పాయింట్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం గరిష్టంగా 8 ఏళ్లు సీలింగ్ పెట్టడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని 2014 డీఎస్సీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు హెచ్ఎంల తుది సీనియార్టీ జాబితా.. బదిలీల్లో భాగంగా మంగళవారం హెచ్ఎంల తుది సీనియార్టీ జాబితా ప్రదర్శించనున్నారు. ఖాళీలను వెబ్సైట్లో ప్రదర్శించనున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ప్రొవిజినల్ సీనియార్టీ జాబితాను ప్రదర్శించనున్నారు. ఎస్జీటీల దరఖాస్తులను నేడు, రేపు పరిశీలించనున్నారు. -
జిల్లా అంతటా సోమవారం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. గాలివేగం పెరిగింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
‘చల్లగా’ వచ్చేసింది ● 10 రోజులు ముందుగానే ‘నైరుతి’ పలకరింపు అనంతపురం అగ్రికల్చర్: ఆశల ‘నైరుతి’ (సౌత్వెస్ట్ మాన్సూన్స్) ఉమ్మడి అనంతను సోమవారం పలకరించింది. ఉమ్మడి జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. సోమవారం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులతో ‘నైరుతి’కి స్వాగతం పలికాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు జూన్ 5 లేదా ఆ తర్వాత అనంతపురం జిల్లాలోకి ప్రవేశించే పరిస్థితి ఉండేదని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. అయితే ఈ సారి వాతావరణం అనుకూలంగా ఉన్నందున ఈనె 24న కేరళను తాకిన నైరుతి సోమవారం ‘అనంత’లోకి ప్రవేశించాయన్నారు. రుతువపనాల ప్రభావంతో రాగల మూడు రోజులు జిల్లాకు వర్షసూచన ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడవచ్చన్నారు. కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడవచ్చన్నారు. ఖరీఫ్కు కీలకం.. ఉమ్మడి జిల్లా పరిధిలో ఖరీఫ్ కింద దాదాపు 8 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో సాగులోకి వచ్చే వ్యవసాయ, ఉద్యాన పంటలకు ‘నైరుతి’ ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. రుతుపవనాలు ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు కురుస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో కీలకమైన ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. జూన్లో 61 మి.మీ, జూలైలో 63.9 మి.మీ, ఆగస్టులో 83.8 మి.మీ, సెప్టెంబర్లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. -
జననాలంటే ‘లెక్కే’లేదు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రైవేటు ఆస్పత్రుల విచ్చలవిడితనం రకరకాల ఇబ్బందుకు గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏ జిల్లాలో అయినా మారుమూల గ్రామానికి చెందిన మహిళ ప్రసవించినా తల్లీ బిడ్డ వివరాలు నమోదు చేయాలనేది నిబంధన. కానీ మిస్సింగ్ రిజిస్ట్రేషన్లలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉంది. జరుగుతున్న ప్రసవాలకు, నమోదవుతున్న వాటికీ పొంతన లేకుండా పోయింది. దీంతో కేంద్రం నుంచి ప్రసవ సమయంలో వచ్చే లబ్ధి కూడా జరగకుండా పోతోంది. జనాభా లెక్కల్లోనూ భారీ తేడా చోటు చేసుకుంటోంది. 8,661 మిస్సింగ్ రిజిస్ట్రేషన్లు.. 2024–25 సంవత్సరంలో జిల్లాలో వాస్తవానికి 48,224 డెలివరీలు జరిగినట్టు సీఆర్ఎస్ (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం)లో నమోదైంది. ఈ సంఖ్య ఆర్సీహెచ్ (రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్)లో 34,858గా ఉంది. ఒక్కో కేంద్రం పోర్టల్లో ఒక్కో రకంగా సంఖ్య నమోదై ఉంది. జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే డెలివరీలు, గర్భిణుల నమోదు తప్పుల తడకగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 8,661 ప్రసవాలు అసలే నమోదు కాలేదు. దీంతో జిల్లాలో ఎంతమంది పుడుతున్నారు, ఎవరికి ఎలాంటి లబ్ధి జరుగుతోందన్నది తెలియడం లేదు. 2,800కు పైగా అబార్షన్లు..! జిల్లాలో మిస్సింగ్ ప్రసవాలే కాదు అబార్షన్లు కూడా గుట్టుగా జరుగుతున్నాయి. ఈ ఏడాది రమారమి 2,800కుపైగా అబార్షన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగినట్టు తెలిసింది. వాస్తవానికి ప్రసవం లేదా అబార్షన్ ఏదైనా నమోదు చేసి జిల్లా ఆరోగ్యశాఖ (డీఎంహెచ్ఓ)కు సమాచారం ఇవ్వాలి. ఎందువల్ల అబార్షన్ చేయాల్సి వచ్చిందనేది నివేదికలో పొందుపరచాలి. ఈ విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నాయి. లింగనిర్ధారణ చేసి ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేస్తున్నట్టు కూడా విమర్శలొస్తున్నాయి. ఓవైపు జననాల రేటు తగ్గిపోతుంటే ప్రైవేటు వైద్యులు అబార్షన్లు చేసి మరింత తగ్గిపోయేలా చేస్తున్నారు. ప్రస్తుతం బర్త్రేటు 1.5 కంటే తక్కువగా నమోదవుతోంది. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకూ ప్రసవాల నమోదు ఇలా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 11,591 ప్రైవేటు ఆస్పత్రుల్లో 20,481 ఆర్సీహెచ్ పోర్టల్లో నమోదైనవి 34,858 సీఆర్ఎస్లో నమోదైనవి 48,224 మిస్సింగ్ రిజిస్ట్రేషన్స్ 8,661 (ఒక్కో పోర్టర్లో ఒక్కో రకంగా నమోదు కావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది) ప్రైవేటు ఆస్పత్రుల మాయాజాలం ప్రసవాల రిజిస్ట్రేషన్స్లో అవకతవకలు నమోదులో లేని 8,661 ప్రైవేటు ఆస్పత్రుల ప్రసవాలు రాష్ట్రంలో అత్యధికంగా మిస్సింగ్ రిజిస్ట్రేషన్లు జిల్లాలోనే నర్సింగ్ హోంలలో జరిగే ప్రతి ప్రసవంపై సమాచారం ఇవ్వాలని నిబంధన ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకంతో జనగణనలో ఇబ్బందులు -
వామ్మో.. ఇన్ని సమస్యలా...
తాడిపత్రి టౌన్: తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో తమ సమస్యలపై అర్జీలు సమర్పించేందుకు వచ్చిన వారు వీరు. అధికారులు ఊహించని రీతిలో అర్జీదారులు రావడంతో మున్సిపల్ కార్యాలయం కిక్కిరిసిపోయింది. కలెక్టర్ వినోద్కుమార్, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ శివ్నారాయణశర్మ, ఇతర జిల్లాధికారులు అర్జీలు స్వీకరించారు. దాదాపు 380 అర్జీలు వచ్చినట్లు తెలిసింది. అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై అర్జీలున్నట్లు సమాచారం. ఇక.. అర్జీదారులకు అనుగుణంగా మున్సిపల్ కార్యాలయంలో సౌకర్యాలు ఏర్పాట్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం పైఅంతస్తులో కార్యక్రమం నిర్వహించడంతో దివ్యాంగులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. వినతుల్లో కొన్ని.. 544డీ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన తమకు పరిహారం అందలేదని తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి, పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దపప్పూరు మండలంలోని తిమ్మనచెరువు గ్రామంలోని వజ్రగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములను కొందరు కబ్జా చేశారని, భూములను కాపాడాలని ఆలయ అర్చకులు వినతిపత్రం అందజేశారు. తాడిపత్రిలో ప్రెస్క్లబ్ ఏర్పాటు చేయాలని విలేకరులు ఎమ్మెల్యే, కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అలాగే విలేకరులకు ఇంటి స్థలాలివ్వాలని కోరారు. -
నాడు
జిల్లాలో చౌక ధరల దుకాణాలు 1,645 రేషన్కార్డు దారులు 6,60,330 ఎండీయూ వాహనాలు 405 వాహనాలపై ఆధారపడిన నిరుద్యోగులు 810 మంది నేడుపొట్ట కొట్టి.. అవస్థలు తెచ్చిపెట్టి! ● కూటమి సర్కార్ కక్ష సాధింపు ● ఎండీయూ వాహనాల రద్దు ● రేషన్ దుకాణాల వద్దే సరుకులు తీసుకునేలా ఆదేశాలు ● ఎండీయూ వాహనదారులు, ఆపరేటర్లకు ఉపాధి కోత ● ‘పాత’ కష్టాలు తలచుకుని కార్డుదారుల గగ్గోలు రాయదుర్గం: పేదల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్కు పేరొస్తుందనే అక్కసుతో నిర్దయగా నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా.. ఇంటింటా బియ్యం పంపిణీ చేసే ఎండీయూ వాహన వ్యవస్థను రద్దు చేసింది. ఎండీయూ వాహనాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న నిరుద్యోగుల పొట్టకొట్టింది. మరోవైపు కూటమి సర్కారు చర్యలపై కార్డుదారులు సైతం గగ్గోలు పెడుతున్నారు. బియ్యం, పప్పుల కోసం ఇక ప్రతి నెలా కుస్తీలు పట్టాల్సి వస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల కోసం ఎండీయూ వాహనాల ద్వారా ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు పంపిణీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఎండీయూ వాహనాల్లో త్రాసుతో తూకం వేసి బ్యాగులో బియ్యం పోసేవారు. 20 కిలోల కార్డుకు ఆ మేర తూకం పడితేనే సిగ్నల్ చూపేది. గతంలో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేసే క్రమంలో తకరారు చేసి కొంత మిగుల్చుకునేవారు. దీంతో కార్డుదారులకు నష్టం చేకూరేది. అలాంటి అవకతవకలకు చెక్ పెడుతూ పేదలకు సౌలభ్యంగా ప్రవేశపెట్టిన విధానాన్ని మరింత మెరుగుపర్చాల్సింది పోయి పూర్తిగా ఊపిరి తీస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబం వీధిన పడుతుంది గతంలో కూలి పనిచేసుకునేదాన్ని. మాకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎండీయూ మంజూరు కావడంతో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో గౌరవంగా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మా బాబు వలంటీర్గా ఉండేవాడు. అది తొలగించారు. ఇప్పుడు వాహనాలను తొలగిస్తే మా కుటుంబం వీధిన పడుతుంది. –బండి ముంతాజ్, వైఎస్సార్ కాలనీ, కురుగుంట కంతులు ఎలా చెల్లించాలి? ఎండీయూ వాహనాల్ని రద్దు చేయడంతో ఆపరేటర్లు చిక్కుల్లో పడినట్లయింది. వాహనాలకు సంబంధించి నెలవారీ కంతులు బ్యాంకులకు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో ఆపరేటర్లకే కాదు, కార్డుదారులకూ ఇబ్బందులు తప్పవు. అందరినీ దృష్టిలో ఉంచుకుని ఎండీయూ వ్యవస్థపై ప్రభుత్వం పునరాలోచించాలి. తగిన నిర్ణయం తీసుకోవాలి. – సుధాకర్, ఎండీయూ ఆపరేటర్, రాయదుర్గం అనంతపురం అర్బన్: ‘‘ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలను తొలగించి మా పొట్ట కొట్టొద్దు. ఉపాధి కోల్పోయి మా కుటుంబాలు రోడ్డున పడతాయి‘‘ అంటూ ఎండీయూ నిర్వాహకులు పేర్కొన్నారు. ఎండీయూ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నగరంలో ఎండీయూ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు మాట్లాడుతూ ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థలో భాగంగా 2021 నుంచి జిల్లాలో 405 వాహనాల నిర్వాహకులు జీవనోపాధి పొందుతున్నామన్నారు. ఎండీయూ వాహనాలు తొలగిస్తే తమతో పాటు హెల్పర్లుగా ఉన్నవారు కూడా ఉపాధి కోల్పోయి వీధిన పడతారన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఎండీయూ వ్యవస్థను కొనసాగించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బాబావలి, బాబ్జాన్, ఖాసీమ్, గంగాధర్, గణేష్, హనుమంత, పోతయ్య, బషీర్, రమేష్, కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.నిర్దయపై నిరసనాగ్రహం -
కక్ష సాధింపులు తప్ప సంక్షేమం లేదా?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం కార్పొరేషన్: ‘కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఇవి ప్రజల్లో మెదలినప్పుడల్లా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కక్ష సాధింపులు తప్ప.. సంక్షేమం, అభివృద్ధి అవసరం లేదా? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు దారుణ’మని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కాకాని అరెస్టును ఖండించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులకు పాల్పడుతూ రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతున్నారని విమర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో భయానకమైన వాతావరణాన్ని తీసుకువస్తున్నారన్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, విశ్రాంత అధికారులను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలంటూ ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి గురించి ఏమాత్రమూ ఆలోచించడం లేదని విమర్శించారు. ఆయన జీవితమంతా అబద్ధాలమయ మని దుయ్యబట్టారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తప్పక బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గిరిజన పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు అనంతపురం రూరల్: గిరిజన పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామాంజినేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 9 పాఠశాలలు ఉన్నాయన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి 3 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు ఆయా పాఠశాలల్లో ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. యువ వైద్యుడిని మింగిన రోడ్డు ప్రమాదం కోలారు: రోడ్డు ప్రమాదం ఓ యువ వైద్యుడిని మింగేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. కర్ణాటకలోని కోలారు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అనంతపురం నగరానికి చెందిన యువ వైద్యుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు.. అనంతపురం నగరంలోని ఇందిరానగర్కి చెందిన వెంకటేశులు కుమారుడు కృష్ణ జగన్ (24) చిత్తూరు జిల్లా కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం హౌస్సర్జన్గా పని చేస్తున్నాడు. ఇటీవల వ్యక్తిగత పని నిమిత్తం అనంతపురానికి వెళ్లిన ఆయన మళ్లీ సోమవారం తెల్లవారుజామున కళాశాలకు కారులో బయలుదేరాడు. కోలారు జిల్లా సిద్ధనహళ్లి వద్ద చైన్నె – బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో ఉదయం 8.30 గంటల సమయంలో కృష్ణ జగన్ ప్రయాణిస్తున్న కారు టైరు పేలి అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా తీవ్ర గాయాలైన డాక్టర్ కృష్ణ జగన్ ఘటనా స్థలంలోనే మరణించారు. బంగారుపేట పోలీసులు చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కృష్ణ జగన్ మరణవార్తను తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. యోగాతో మానసికోల్లాసం తాడిపత్రి రూరల్: యోగాతో మానసికోల్లాసం కలుగుతుందని కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. పట్టణంలోని పార్వతీ సమేత బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో సోమవారం ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పెన్నానది ఒడ్డున గల బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణలో యోగాసనాలు వేయడం సంతోషకరమని తెలిపారు. పట్టణంలోని భూదేవి, శ్రీదేవి సమేత చింతల వేంకటరమణస్వామి దేవాలయం, గుత్తి కోట పరిసరాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్లో రిజిస్ట్రేషన్ కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బుగ్గ రామలింగేశ్వరస్వామిని కలెక్టర్ దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మునిసిపల్ వైస్ చైర్మన్లు తదితరులున్నారు. -
చెరువు మట్టినీ మింగేస్తున్నారు!
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి సర్కారు కొలువుదీరాక అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో సహజ వనరుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, కాలువ గట్లతో పాటు రాయలచెరువు గ్రామ సమీపంలోని చెరువులో మట్టినీ మింగేస్తున్నారు. పచ్చని ప్రకృతిపై పంజా విసిరి, సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు. చెరువులో రోజూ 500 టిప్పర్ల మట్టిని తోలుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. పత్రికల్లో కథనాలు వస్తే ఒకటి, రెండు రోజులు ఇరిగేషన్ అధికారులు హడావుడి చేసి.. మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాట నిలబెట్టుకున్న పెద్దారెడ్డి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో రాయలచెరువు గ్రామ సమీపంలో రిజర్వు కొండ, ఊరుగట్ట, పిచ్చల కొండల మధ్య సర్వే నంబర్ 705లో 525 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. ఈ మూడు కొండల్లో ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. తవ్వకాలు చేపట్టిన తర్వాత నుంచి క్రమేణా కొండల ఆనవాళ్లే లేకుండా పోతున్నాయి. 2017లో తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి మండలం బోగాలకట్ట నుంచి రాయలచెరువు గ్రామం వరకు పాదయాత్ర చేపట్టిన సమయంలో తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే చెరువును నింపి.. సమీపంలోని కాలువలకు నీటిని విడుదల చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఎమ్మెల్యే అయ్యాక నాలుగు సార్లు రాయలచెరువు చెరువును నింపి.. కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. చెరువును విస్మరించిన జేసీ కుటుంబం తాడిపత్రి నియోజకవర్గం నుంచి గెలిచిన జేసీ సోదరులు 35 ఏళ్ల రాజకీయ జీవితంలో రాయలచెరువును పూర్తిగా విస్మరించారు. తమ స్వలాభం కోసం చెరువును నీటితో నింపకుండా వదిలేశారు. ఇక్కడ రైతులు, కూలీలు ఎప్పుడూ దయనీయ స్థితిలో ఉండటమే వారు కోరుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి పలు సందర్భాల్లో జేసీ సోదరులను విమర్శించారు. ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ ప్రజల వద్దకు వెళ్లరని, వారికి ఏదైనా సమస్యను చెప్పాలన్నా ప్రజలు భయపడిపోయేవారని అన్నారు. చెరువు మట్టిని దోచేస్తున్నారిలా.. అధికార పార్టీకి చెందిన యాడికి మాజీ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో గత ఏడాది అక్టోబర్ నుంచి మట్టి దోపిడీ కొనసాగుతోంది. మూడు హిటాచీలతో రోజుకు 500 టిప్పర్ల మేర రాయలచెరువు నుంచి మట్టిని తవ్వేస్తున్నారు. ఇప్పటి వరకు వంద ఎకరాల విస్తీర్ణంలో మట్టిని తవ్వేసినట్లు తెలుస్తోంది. రాయలచెరువు పరిసర ప్రాంతాల్లోని పొలాలైతే టిప్పర్కు రూ.3 వేల ప్రకారం, వేరే మండలాలకు దూరాన్ని బట్టి రూ.10వేల వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. చెరువు మట్టిని అధికారుల అనుమతితో రైతులు ఉచితంగా పొలాలకు తరలించుకునే వెసులుబాటు ఉంది. అయితే టీడీపీ నాయకులు మాత్రం రైతులను చెరువు దరిదాపులకు రానివ్వకుండా తాము నిర్ణయించిన ధరతోనే తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అనుమతుల్లేవు రాయలచెరువు 525 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ మట్టి తవ్వకాలకు ఎవ్వరికీ అనుమతులు లేవు. అయితే కొంతమంది రైతులు తమ పొలాలకు మట్టి కావాలని కోరితే ఇరిగేషన్ శాఖ అధికారులకు నివేదిక పంపించాం. – ప్రతాప్రెడ్డి, తహసీల్దార్, యాడికి రాయలచెరువు గ్రామ సరిహద్దులో ఆగని మట్టి దోపిడీ 24 గంటలూ హిటాచీ, జేసీబీలతో తవ్వకాలు రోజూ రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం -
ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన కురుబ విద్యార్థులకు ఆదివారం స్థానిక గుత్తి రోడ్డు లోని కనకదాస కల్యాణమంటపంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనకదాస ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్వేటి పద్మావతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, అనంతపురం నగర మాజీ మేయర్ రాగే పరశురాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు తుప్పటి ఈశ్వరయ్య, ఆర్డీఓ మధులత, డాక్టర్ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... కురుబ విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనపరచడం కులానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు తెచ్చుకుని తల్లిదండ్రులు, కులానికి, సమాజానికి ఉపయోగపడాలన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఆడపిల్లలను బాగా చదివించాలన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు దండు వెంకటరాముడు, ప్రధాన కార్యదర్శి మంగలకుంట నాగరాజు, కోశాధికారి ఓబులేసు, అడ్వయిజరీ చైర్మన్ గజ్జల రామకృష్ణ, సూర్యనారాయణ, జనార్ధన్, ఉపాధ్యక్షులు బుల్లే ఆదినారాయణ, పాటల హరికృష్ణ, జగన్నాథ్, లక్ష్మీదేవి, శివ శంకర్, రమేష్, అక్కులప్ప, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ● వడ్డెర సేవా సంఘం జిల్లా అద్యక్షుడు లక్ష్మినారాయణ అనంతపురం రూరల్: విద్య తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. పది ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన వడ్డెర విద్యార్థులకు ఆదివారం నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చదువులో రాణించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వడ్డే శ్రీరాములు, మారుతీప్రసాద్, లోకనాథ్, గంగన్న, సూర్యబాబు, రాయుడు, శంకర్, రాజశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక అనంతపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా కృష్ణప్రసాద్, రఘురామానాయుడు వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా గోపీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రామునాయక్, అసోసియేట్ ప్రెసిడెంట్గా వేణుగోపాల్, ఉపాధ్యక్షులుగా అశోక్బాబు, నాగేశ్వరయ్య, వెంకటరాముడు, కలీం అహ్మద్, డాక్టర్ శివారెడ్డి, శశిధర్రెడ్డి, పౌల్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కేసీ నాగరాజు, జాయింట్ సెక్రటరీలుగా హనుమంతు, వరప్రసాద్, చంద్రశేఖర్, భారతమ్మ, మహబూబ్బాషా, వసంత, రామాంజినేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రూరల్ కమిటీ అధ్యక్షుడు మారుతీప్రసాద్ పాల్గొన్నారు. ప్రమాదంలో హెచ్ఎం టీవీ రిపోర్టర్ మృతిఉరవకొండ: స్థానిక 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో హెచ్ఎం టీవీ రిపోర్టర్ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బూదగవి గ్రామానికి చెందిన బోయ నాగరాజు (32)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. హెచ్ఎం టీవీ రిపోర్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆదివారం రాత్రి ఉరవకొండ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరిన ఆయన గ్రామ శివారులోకి చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా ఉన్నఫళంగా వచ్చిన గేదెను ఢీకొనడంతో వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చాలా సేపటి తర్వాత అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి, జర్నలిస్టులు పి. షెక్షావలి, కె.ఆనందరావు, వడ్డె రమేష్, సాదిక్, వీరేష్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక సరిహద్దున ప్రమాదంలో ఇద్దరి మృతి శెట్టూరు: స్థానిక కర్ణాటక సరిహద్దున చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కళ్యాణదుర్గంలో నివాసముంటున్న శ్రీనివాసులు (28), కళ్యాణ్ (31) ఉన్నారు. వ్యక్తిగత పనిపై కర్ణాటకకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు శెట్టూరు మండలంలో ప్రవేశిస్తుండగా అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కర్నాటక పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
రాప్తాడులో రౌడీ రాజ్యం
ఆత్మకూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ టీడీపీ నాయకులు భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ హయాంలో హంద్రీ నీవా కాలువ పనులు చేపట్టి కృష్ణా జలాలను జిల్లాకు అందించారని గుర్తు చేశారు. ఈ కాలువను 83 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యానికి పెంచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పనులు ప్రారంభించారని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 టీఎంసీలకే పరిమితం చేస్తూ కాలువకు లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు చేపట్టారని తెలిపారు. కాలువకు లైనింగ్ పనులు పూర్తయితే రాప్తాడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలు, హిందూపురం పార్లమెంట్ పరిధిలో దాదాపు 5 లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 29వ తేదీ నుంచి రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని రైతులతో కలసి ఆయా మండలంలోనే రిలే నిరాహార దీక్షలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అంతా అక్రమ ఆదాయమే.. రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురిని అతి కిరాతకంగా టీడీపీ నాయకులు హతమార్చారన్నారు. 300కు పైగా అక్రమ కేసులతో దౌర్జన్యాలకు దిగారన్నారు. ఇక దాడుల్లో గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉందన్నారు. లేని భూ సమస్యలను సృష్టించి సెటిల్మెంట్లకు రాకపోతే హత్యలు చేయిస్తున్నారన్నారు. రూ.లక్షల్లోనే మట్టి దోపిడీలు సాగిస్తున్నారన్నారు. కక్కలపల్లి టమాట మండిలో శ్రీరామ్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. ఏడాదికి రూ.5 కోట్లకు పైగా అక్రమంగా దోచుకుంటున్నారన్నారు. మద్యం దుకాణాల్లో బాటిల్పై రూ.10 శ్రీరామ్ ట్యాక్స్ అంటూ వసూలు చేస్తున్నారన్నారు. కంకర మిషన్ నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారన్నారు. ఇసుక అమ్ముకునేందుకు వీలుగా పేరూరు డ్యాంకు నీరు రాకుండా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి వైఎస్సార్సీపీ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి తప్ప కూటమి ప్రభుత్వంలో కాదన్నారు. జీడిపల్లి నుంచి ఆత్మకూరుకు నీటిని అందించేందుకు రూ.170 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఐదు సబ్ స్టేషన్లు తీసుకురాగా, వీటిలో తోపుదుర్తి, గొరిదిండ్ల సబ్స్టేషన్ల పనులను ఈ ప్రభుత్వం మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తోందన్నారు. అనంతపురం – తగరకుంట మార్గంలో సగం రోడ్డు పూర్తి చేస్తే ఆ తర్వాత సగం రోడ్డు పనులకు కనీసం కంకర కూడా వేయలేదన్నారు. పీఏబీఆర్ నుంచి రూ.67 కోట్లతో తాగునీటి పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా... నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే పరిటాల సునీత ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం ప్రకాష్రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పరిటాల సునీత నేతృత్వంలోనే అనంతపురం రూరల్ పరిధిలో ఇళ్లు కూల్చారని, దోపిడీలు, హత్యలు జరిగాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గార్మెంట్ పరిశ్రమ తీసుకువచ్చామని, అలాగే చేతనైతే పరిటాల సునీత కూడా నియోజకవర్గానికి నూతన పరిశ్రమలు తీసుకురావాలని అన్నారు. అనంతపురంలోని కళ్యాణదుర్గంలో రోడ్డులో 68 సెంట్లలో 20 ఇళ్లు కూల్చేసి ఆ స్థలంపై కన్నేస్తే బాధితుల పక్షాన నిలిచి కోర్డుకు వెళ్లి స్టే ఆర్డర్ తెప్పించామని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రకాష్రెడ్డిని విమర్శించడం మాని నియోజకవర్గ అభివృద్ధి దృష్టిపెట్టాలని హితవు పలికారు. భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలు హంద్రీ నీవా లైనింగ్ పనులతో రైతులకు తీరని అన్యాయం న్యాయం కోరుతూ ఈ నెల 29 నుంచి రాప్తాడు నియోజకవర్గంలో అన్నదాతల రిలే నిరాహార దీక్షలు వైఎస్సార్సీపీ నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
ఏఐజీడీఏ జోనల్ కార్యదర్శిగా రమేష్బాబు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆలిండియా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం (ఏఐజీడీఏ) కన్ఫరడేషన్ జోనల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, గోవా, ఒడిశా) సెక్రెటరీగా జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు పి.రమేష్బాబును నియమించారు. ఆదివారం ఆలిండియా గవర్నమెంట్ డ్రైవర్ల సంఘం కన్ఫడరేషన్ సమావేశం చత్తీస్ఘడ్లో జరిగింది. 18 రాష్ట్రాల నుంచి సంఘం అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐజీడీఏ కన్ఫరడేషన్ జోనల్ కార్యదర్శిగా రమేష్బాబుకు నియామక ఉత్తర్వులను ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు అందజేశారు. ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి పామిడి: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన వడ్ల చంద్రశేఖర్(38) అలియాస్ శేఖర్ చీనీ, వేరుశనగ, వడ్ల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వ్యాపారంలో భాగంగా పామిడికి చెందిన పిక్కిలి రామకృష్ణతో కలసి శనివారం గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి తిరుగు ప్రయాణమైన భోజనం చేసేందుకు 44వ జాతీయ రహదారిపై ఉన్న ఓ ధాబాకు చేరుకున్నారు. అప్పటికే మూసేయడంతో ధాబా సమీపంలోనే ద్విచక్ర వాహనం వద్ద నిలబడి మాట్లాడుకుంటుండగా... ఖల్సా ధాబా యజమాని తేజ ట్రాక్టర్పై వస్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఘటనలో ట్రాక్టర్ అదుపు తప్పి చంద్రశేఖర్పై పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, చంద్రశేఖర్కు భార్య లక్ష్మి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. హెచ్ఎం నిర్ధారించకుండానే ఎంఈఓ ఆమోదం అనంతపురం ఎడ్యుకేషన్: ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి దరఖాస్తుల హార్డ్కాపీలను సంబంధిత హెచ్ఎంలు నిర్ధారించి...వాటిని ఎంఈఓలకు అందజేస్తే వారి లాగిన్లో ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు ఆదివారం తుది గడువు. ఇంతటి కీలక సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సుబ్రహ్మణ్యం మూడు రోజులుగా పత్తా లేకుండా పోయాడు. దరఖాస్తు చేసుకున్న టీచర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంఈఓ రవికుమార్ను అడిగితే...హెచ్ఎం నిర్ధారించిన తర్వాతనే లాగిన్లో అప్లోడ్ చేస్తానని స్పష్టం చేశారు. అయితే స్కూల్ అసిస్టెంట్ల దరఖాస్తులను పరిశీలించి... ఎంఈఓలు తమ లాగిన్లో అప్లోడ్ చేసేందుకు ఆదివారమే చివరి గడువు కావడంతో దరఖాస్తు చేసుకున్న ఆ స్కూల్ టీచర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని డీఈఓ, గుత్తి డీవైఈఓ దృష్టికి తీసుకెళ్లారు. వారు నేరుగా ఎంఈఓ రవికుమార్తో మాట్లాడారు. డీఈఓ మౌఖిక ఆదేశాల మేరకు చివరి నిముషంలో ఎంఈఓ అప్లోడ్ చేశారు. -
● ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠం
పుట్లూరు: నిజం.. ఇది ఓ ఆటో డ్రైవర్ చెప్పిన నీతి పాఠమే. ఇందులోని సారాంశం అర్థమైన వారు శభాష్ గంగరాజు అంటూ సదరు ఆటో డ్రైవర్ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే... పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం నుంచి గూగూడుకు వెళ్లే మార్గం మొత్తం గుంతల మయంగా మారింది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. ఇంత కాలం ప్రభుత్వం స్పందించి కొత్తగా రోడ్డు నిర్మాణం చేపడుతుందని, అలా కాకున్నా... కనీసం మరమ్మతులైనా చేపడుతుందని గ్రామీణులు ఆశించారు. అయినా కనుచూపు మేరలో అలాంటి చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రహదారి మరింతగా దెబ్బతినింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు పడరాని పాట్లు పడేవారు. ఇలాంటి తరుణంలో రహదారి మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించి, పనులు చేపట్టాలంటే ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. విషయాన్ని గమనించిన ఎల్లుట్లకు చెందిన ఆటో డ్రైవర్ గంగరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. స్వయంగా రంగంలో దిగి తన రోజు వారి సంపాదన రూ.1,200 చొప్పున రెండు రోజుల ఆదాయం రూ.2,400 వదులుకుని ఒంటరిగానే మట్టితో గుంతలను పూడ్చి వేశారు. అటుగా వెళుతున్న వాహనదారులు ‘ఏందయ్యా గంగరాజు... ఏమిటీ పని ఒప్పుకున్నావా?’ అన్ని ప్రశ్నిస్తే.. ‘గుంతల వల్ల రోజూ ఎవరో ఒకరు కిందపడుతూనే ఉన్నారు కదన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ప్రమాదాలు ఏవీ జరగకూడదని మట్టితో గుంతలను పూడుస్తున్నా’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇది చూసిన పలువురు శభాష్ గంగరాజు అంటూ మెచ్చుకున్నారు. -
పెద్దల పొరపాటు.. ఇరువర్గాల ఘర్షణ
రాప్తాడు: ఎమ్మెల్యే, ఆర్డీఓ, తహసీల్దార్ చేసిన పొరపాటుకు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని రెండు రోజుల పాటు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వివరాలు.. రాప్తాడు మండలం భోగినేపల్లి గ్రామంలో శనివారం ఉదయం 10 గంటలకు అనారోగ్యంతో మాల రామచంద్ర (61) మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఖననం చేయడానికి అదే రోజు సాయంత్రం ఆ గ్రామానికి తూర్పున శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో గుంత తీసేందుకు కొందరు దళితులు అక్కడికి వెళ్లడంతో ఆ స్థలం తమదంటూ అదే గ్రామానికి చెందిన పలువురు కాలువ గొంచి రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడే ఖననం చేయాలంటూ రోడ్డుపై మృతదేహన్ని ఉంచి ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న రాప్తాడు, రూరల్ సీఐలు శ్రీహర్ష, శేఖర్, సిబ్బంది అక్కడకు చేరుకుని చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. వందేళ్లుగా తమ పూర్వీకుల అనుభవంలో ఉంటూ వచ్చిన భూమిని దళితుల శ్మశాన వాటికకు ఎలా కేటాయిస్తారంటూ కాలువగొంచి నిర్వాహకులు మండిపడ్డారు. అయితే తమ సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటిక లేక పడుతున్న ఇబ్బందులను గత ఏడాది ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామానికి తూర్పున ఉన్న సర్వే నంబర్ 281–4లో 1.08 ఎకరాలను దళితుల శ్మశాన వాటికకు కేటాయించాలంటూ అప్పట్లో ఆర్డీఓకు ఎమ్మెల్యే సూచించారని, దీంతో నాలుగు నెలల క్రితం శ్మశాన వాటికకు కేటాయిస్తూ తహసీల్దార్ విజయకుమారి పట్టాను ఎమ్మెల్యే పరిటాల సునీత చేతుల మీదుగానే తమకు ఇప్పించారంటూ దళితులు ప్రతిగా స్పందించారు. ఈ విషయంపైనే తాము కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చినట్లుగా కాలువగొంచి రైతులు అప్పటికే తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న కోర్టు స్టే ఆర్డర్ను చూపారు. గ్రామానికి దక్షిణం వైపు 3.80 ఎకరాల శ్మశాన వాటిక ఉందని, అక్కడికెళ్లి ఖననం చేసుకోవాలని సూచించారు. సమస్య కొలిక్కి రాకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశాలతో తహసీల్దార్ విజయకుమారి అక్కడకు చేరుకుని దళితులతో చర్చించారు. కోర్టు ఆదేశాలను గౌరవించాలని సూచించారు. ఈ అంశంలో న్యాయం చేస్తానని, శ్మశాన వాటికకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించి పాత శ్మశాన వాటికలోనే రామచంద్ర మతృదేహాన్ని ఖననం చేశారు. కాగా, ఘటనపై ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ.. గ్రామంలో దళితులను ఎమ్మెల్యే పరిటాల సునీత మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దళితులకు శ్మశాన వాటిక స్థలం కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. -
తాగునీటి పథకం కార్మికుడి దుర్మరణం
గుంతకల్లు/వజ్రకరూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. గుంతకల్లులోని ఆలూరు రోడ్డులో నివాసముంటున్న మంగే సూరప్ప (47) వజ్రకరూరు మండలం కొనకొండ్లలోని శ్రీసత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు వెళ్లి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో విధుల్లో పాల్గొనేందుకు శనివారం రాత్రి 10 గంటలకు ద్విచక్ర వాహనంపై కొనకొండ్లకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో రోడ్డుకు అడ్డుగా వచ్చిన గేదెలు ద్విచక్ర వాహనాన్ని తగలడంతో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య రోజా, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు, తాగునీటి పథకం కార్మికుల సంఘం నాయకుడు పి.చిన్న బాబయ్య గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచిన సూరప్ప మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సూరప్ప మృతిపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే రూ.20 లక్షల పరిహారం చెల్లించడంతోపాటు ఆయన కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి వెంట నాయకులు తిమ్మప్ప, సురేంద్ర, కె.రామాంజినేయులు, వెంకటాద్రి, సంతోష్ ఉన్నారు. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
పామిడి: స్థానిక టీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 విద్యాసంవత్సంలో పదో తరగతి చదువుకున్న వారు అదే పాఠశాల వేదికగా ఆదివారం కలుసుకున్నారు. 40 ఏళ్ల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాటి అల్లరి పనులు గుర్తు చేసుకుని మురిసిపోయారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులు ఆత్మానంద, వెంకటరమణప్ప, గురురాజమూర్తిని ఘనంగా సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అమరేంద్ర, తిరుపాలు, పీడీ గోపాల్, హెచ్.నారాయణరావు, గోపాల్రెడ్డి, నగేష్, ఎంపీ శ్రీనివాసులు, రాజశేఖర్, రఘునాథశర్మ నేతృత్వం వహించారు. శేషగిరి, మునిస్వామి, సతీష్కుమార్, శ్రీనివాసులు, సదానందబాబు, వెంకటేశ్వరరావు, పులిశేఖర్ కార్యనిర్వాహకులుగా వ్యవహరించారు. -
రేయ్ సాయిరాం నిన్ను చంపేస్తాం...
● తాడిపత్రిలో అర్ధరాత్రి వేళ రెచ్చిపోయిన టీడీపీ మూకలు తాడిపత్రిటౌన్: తాడిపత్రిలో శనివారం అర్ధరాత్రి టీడీపీ అల్లరి మూకలు రెచ్చిపోయాయి. వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రధాన అనుచరుడు సాయిరాం ఇంటిపై రాళ్లదాడికి తెగబడ్డాయి. దీంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలు... తాడిపత్రిలోని భగత్సింగ్ నగర్లో నివాసముంటున్న సాయిరాం ఇంటి వద్దకు శనివారం అర్ధరాత్రి 10 మంది టీడీపీ అల్లరి మూకలు మద్యం మత్తులో స్కార్పియో వాహనంలో చేరుకున్నాయి. ‘రేయ్ సాయిరాం.. బయటకు రారా.. నిన్ను చంపేస్తాం’’ అంటూ కేకలు వేస్తూ హల్చల్ చేశాయి. దీంతో సాయిరాం కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. బిక్కుబిక్కుమంటూ లోపలే ఉండిపోయారు. ఎంత అరిచినా సాయిరాం బయటకు రాకపోవడంతో అల్లరి మూకలు అతని ఇంటిపై రాళ్లదాడికి దిగాయి. ఇంటి తలుపులు, ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశాయి. ఫోన్లో సాయిరాం ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా.. మెల్లిగా అక్కడి నుంచి అల్లరి మూకలు జారుకున్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. -
చిత్ర విచిత్రాలు.. టీచర్ల గగ్గోలు
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీ దరఖాస్తులో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరికి ఏ పాయింట్లు నమోదవుతున్నాయో, అవి ఎప్పుడు తొలగిపోతాయో అంతుచిక్కడం లేదు. దీంతో ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. బదిలీల దరఖాస్తు ప్రక్రియను సాంకేతికపరమైన సమస్యలు చుట్టుముట్టాయి. దరఖాస్తు చేసిన సమయంలో నమోదు చేసిన పాయింట్లు హార్డ్కాపీ ప్రింట్ తీసుకునేలోపు మాయమవుతున్నాయి. పాఠశాల ఒక కేటగిరీ కింద ఉంటే...వెబ్సైట్లో మరో కేటగిరీ పాయింట్లు కనిపిస్తున్నాయి. రీ అపోర్షన్కు గురైన టీచర్లకు స్పెషల్ పాయింట్లు కనిపించడం లేదు. జనరేట్ అయిన స్పౌజ్ ప్రత్యేక పాయింట్లు గల్లంతయ్యాయి. గార్లదిన్నె మండలంలో ఓ గణితం టీచరుకు దరఖాస్తు చేసుకున్న రోజు 43.4898 పాయింట్లు చూపించగా రెండోరోజు 43.4713 పాయింట్లు, మూడోరోజు (ఆదివారం) 38.4713 పాయింట్లు చూపిస్తోంది. ఇక సోమవారం (నేడు) ఎన్ని పాయింట్లు కనిపిస్తాయోనని సదరు టీచరు బెంబేలెత్తుతున్నారు. చివరకు కొందరు ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసిన ఫారాలు కూడా వెబ్సైట్లో కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ‘టీచర్ల బదిలీ చట్టం–2025’ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ టీచర్లకు సమస్యగా మారింది. దరఖాస్తు గడువు ముంచుకొస్తుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అనంతపురంలో బదిలీల ప్రక్రియ జరుగుతున్న శారదా స్కూల్కు పరుగులు పెడుతున్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారం తమ పరిధిలో లేదంటూ ఇక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎం దరఖాస్తులు మాయం.. ఆన్లైన్లో దరఖాస్తు చేసి... హార్డ్కాపీలు ప్రింట్ తీసుకుని అధికారులకు అందజేసి నిర్ధారణ చేసిన తర్వాత కొందరు హెచ్ఎంల పేర్లు తాత్కాలిక సీనియార్టీ జాబితాలో కనిపించలేదు. తాడిపత్రి మండలం చుక్కలూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సి.సుధాకర్ ఈనెల 21న ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. డౌన్లోడ్ చేసుకుని 22న గుత్తి డీవై ఈఓకు సబ్మిట్ చేశారు. ఆన్లెన్ దరఖాస్తు అటు డీవైఈఓ లాగిన్లోనూ, ఇటు డీఈఓ లాగిన్లోనూ కనిపించలేదు. ఈలోగా గడువు ముగిసి తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదలైంది. ఇందులో సుధాకర్ పేరే లేదు. డీఈఓను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. కాగా సుధాకర్ రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. అదే తప్పనిసరి బదిలీ అయి ఉండి ఇలా ఆన్లైన్లో దరఖాస్తు కనిపించకపోతే పెద్ద సమస్య అయ్యేదని టీచర్లు చెబుతు న్నారు. మరో 10 మందిదాకా హెచ్ఎంలు సుధాకర్ లాంటి సమస్యను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. టీచర్ల బదిలీ ఆన్లైన్ దరఖాస్తులో సాంకేతిక సమస్యలు మాయమైపోతున్న పాయింట్లు ఉన్న పాయింట్లు చూపని వెబ్సైట్ చివరకు దరఖాస్తులూ కనిపించని వైనం డీఈఓ కార్యాలయం చుట్టూ ఉపాధ్యాయుల ప్రదక్షిణలు తమ చేతుల్లో లేదంటున్న అధికారులుస్కూల్ 3వ కేటగిరీ.. పాయింట్లు ఒకటో కేటగిరీవి.. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితం టీచరు బి.రామాంజనేయులు 8 ఏళ్లు పూర్తి కావడంతో తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రహారం జెడ్పీహెచ్ఎస్ 3వ కేటగిరీలో ఉంది. అంటే ఏడాదికి మూడు పాయింట్ల చొప్పున 24 పాయింట్లు రావాల్సి ఉంది. ఆన్లైన్లో ఈ స్కూల్ కేటగిరీ–1లో ఉన్నట్టు చూపిస్తోంది. కేటగిరీ–1కు ఏడాదికి ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. ఈ లెక్కన మొత్తం 8 పాయింట్లు మాత్రమే చూపిస్తోంది. మూడు రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా... ఏ ఒక్కరూ స్పందించడం లేదని రామాంజనేయులు వాపోతున్నారు. -
ఇదేం తాగుడు బాబోయ్..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలు తాము సంపాదించిన సొమ్ములో సగం మద్యానికి ఖర్చు చేస్తున్నారు. ఊరూరా బెల్టుషాపులు ఏర్పాటు కావడంతో మద్యం ప్రజల చెంతకే వెళ్లినట్టయింది. దీంతో వినియోగం కూడా భారీగా పెరిగింది. రోజుకు రూ.4.60 కోట్ల విలువ చేసే మద్యం తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. సరిగ్గా 8 నెలల క్రితం చంద్రబాబు సర్కారు కొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తెచ్చింది. అప్పటినుంచి శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మద్యం ఏరులై పారుతోంది. రూ.1,100 కోట్లు దాటింది... గడిచిన ఎనిమిది మాసాల్లో అంటే 2024 సెప్టెంబర్ 15 నుంచి మే 15 వరకూ రూ.1,100 కోట్ల మద్యం వినియోగించారు. అంటే సగటున రోజుకు రూ.4.58 కోట్ల మద్యం తాగుతున్నారు. అనంతపురం జిల్లాలో 1,200కు పైగా, శ్రీ సత్యసాయి జిల్లాలో 750కి పైగా మద్యం షాపులు ఉన్నాయి. ఇవి కాకుండా అర్బన్ ప్రాంతాల్లో పర్మిట్ రూములు ఏర్పాటు చేశారు. గల్లీ గల్లీకి, గ్రామ గ్రామానికి మద్యాన్ని అందుబాటులోకి తేవడం, బహిరంగ మద్యపానంపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల మద్య సేవనం విచ్చలవిడిగా మారింది. కూరగాయల షాపులకంటే మద్యం షాపులే ఎక్కువ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూరగాయలు అమ్మే షాపుల కంటే మద్యం షాపులు, బెల్టుషాపులు, పర్మిట్ రూములే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలే లిక్కర్ షాపులు నిర్వహిస్తుండటంతో విక్రయాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. వేళా పాళా ఉండటం లేదు. ఉదయం 6 గంటలకే మద్యం షాపులు తెరుస్తున్నారు. గుడులు, బడులు, ఆస్పత్రులు ఏమీ లెక్క చేయకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారు. ఇదిలాఉంటే.. మద్యం విచ్చలవిడి అమ్మకాల వల్ల నేరాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దీన్నే ‘లిక్కర్ బేస్డ్ క్రైమ్’గా పోలీసులు చెబుతున్నారు. తాగిన మత్తులో ఇతరులపైనా, కుటుంబ సభ్యులపైనా, భార్యల పైనా దాడులకు దిగడం ఎక్కువైంది. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 8 నెలల్లోనే రూ.1,100 కోట్ల విలువైన మద్యం అమ్ముడుబోవడం రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. 8 నెలల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు రూ.1,100 కోట్ల మద్యం వినియోగం -
నేడు తాడిపత్రిలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను సోమవారం తాడిపత్రి పట్టణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్కుమార్ తెలిపారు. పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. తాడిపత్రి పట్టణ, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 40 శాతం రాయితీతో విత్తన వేరుశనగ అనంతపురం అగ్రికల్చర్: రైతులకు విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ వర్తింపజేసినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది 50,592 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించారు. కే–6తో పాటు టీసీజీఎస్–1,694, కదిరి–లేపాక్షి (కే–1,812) విత్తన రకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కే–6, టీసీజీఎస్–1,694 రకం క్వింటా పూర్తి ధర రూ.9,300 కాగా అందులో 40 శాతం రూ. 3,720 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,580 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. కే–1,812 రకం పూర్తి ధర రూ.8,200 కాగా రూ.3,280 రాయితీ పోనూ రైతులు రూ.4,920 చెల్లించాలి. ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు బస్తాలు (ఒక్కోటి 30 కిలోలు) పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక.. 30 శాతం రాయితీతో కందులు, మినుములు, పెసలు, 50 శాతం రాయితీతో కొర్రలు, రాగులు, 50 శాతం రాయితీతో జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు జూన్ మొదటి వారంలో పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 ప్రాసెసింగ్ ప్లాంట్లలో వేరుశనగ విత్తనశుద్ధి జరుగుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ఆర్ఎస్కేలకు విత్తన సరఫరా చేసినట్లు వ్యవసాయ, ఏపీ సీడ్స్ వర్గాలు తెలిపాయి. ఎలుగుబంట్ల హల్చల్ కళ్యాణదుర్గం రూరల్: కళ్యాణదుర్గం పట్టణంలోని రోషన్ కొండ సమీపంలో ఆదివారం రెండు ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. ఈ క్రమంలోనే ఉరుసు ఉత్సవానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు కేకలు వేయడంతో భల్లూకాలు కొండల్లోకి పారిపోయాయి. ఇటీవల కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్లు జనావాసా ల్లోకి చొరబడుతున్నాయి. రెండు రోజుల క్రితం మండల పరిధిలోని మోరేపల్లి గ్రామం వద్ద వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఎలుగుబంట్ల బారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ‘యోగాంధ్ర’కు రిజిస్ట్రేషన్ చేసుకోండి : కలెక్టర్ అనంతపురం అర్బన్:యోగాంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని, ఇందుకోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ వి.వినోద్కుమార్ పిలుపునిచ్చారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర–2025 క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు https://yogandhra.ap.gov.in వెబ్సైట్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. -
అన్నదాతను నిండా ముంచారు..
ఉరవకొండ: హంద్రీ–నీవా కాలువ పనుల్లో భాగంగా కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా ఓ రైతు పంట నష్టపోయాడు. వివరాలు.. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామ సమీపంలో హంద్రీ–నీవా 22వ కిలోమీటరు వద్ద కాలువ పనులు జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన పి.శ్రీనివాసులు సర్వే నంబర్ 282–1బీలో తనకున్న 5 ఎకరాల్లో 2 నెలల క్రితం వేరుశనగ పంట సాగు చేశాడు. పంట పెట్టుబడుల కోసమని రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హంద్రీ–నీవాలో భారీగా నీరు చేరింది. దీంతో పనులకు అంతరాయం కలగడంతో ఆదివారం కాలువకు కాంట్రాక్టర్ గండి కొట్టి పక్కనే ఉన్న పి.శ్రీనివాసులు పొలంలోకి నీటిని వదిలాడు. దీంతో పంట మొత్తం నీట మునిగింది. విషయం తెలుసుకున్న రైతు అక్కడకు చేరుకుని సైట్ ఇంజినీర్ చంద్రతో మాట్లాడితే.. ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ.. టీడీపీ నేతలే గండి కొట్టమని చెప్పారని, ఎవరితోనైనా చెప్పుకో పొమ్మంటూ దురుసుగా ప్రవర్తించాడు. తనకు జరిగిన అన్యాయంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించాలని, తనకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతు విన్నవించాడు. కాగా, ఈ విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జాఫర్, ఓ.నల్లప్ప, కౌలు రైతు సంఘం నాయకులు బాలరంగయ్య స్పందించారు. బాధిత రైతుకు పరిహారం చెల్లించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. హంద్రీ–నీవా పనుల్లో ఇష్టారాజ్యం కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఐదెకరాల్లో నీట మునిగిన వేరుశనగ పంట -
జిల్లాలో అసైన్డ్ భూమి ఇలా
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వంలో రైతన్నలకు ‘కష్ట’ కాలం నడుస్తోంది. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నష్టపోతున్నా.. పరిహారం ఇవ్వడం లేదు... బీమా రాలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందించడం లేదు. ఈ క్రమంలోనే డీ–పట్టా పొందిన అసైన్డ్ భూములకు అర్హత ఉన్నప్పటికీ ఏడాదిగా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.ఈ భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపకుండా కూటమి ప్రభుత్వం ఫ్రీజింగ్లో పెట్టడంతో సమస్య తలెత్తింది. ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన పేరుతో చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న సాగదీత వైఖరి అసైనీలుగా ఉన్న రైతులకు శాపంగా మారింది. ఆర్థిక అవసరాలకూ భూములను అమ్ముకోలేక చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ సమస్యను బహిరంగంగా చెప్పుకునేందుకూ రైతులు సాహసించలేని పరిస్థితి నెలకొంది. ఆవేదనను బయటకు చెబితే ఎటువైపు నుంచి కొత్త సమస్య వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ● ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1954 జూన్ 18 కంటే ముందు అసైన్డ్ అయిన భూములకు నిరభ్యంతర పత్రం ఉంటుంది. ఇలాంటి భూములు జిల్లాలో 50 వేల ఎకరాల వరకు ఉండవచ్చని అంచనా. కూటమి ప్రభుత్వం మొత్తం అసైన్డ్ భూములకు సంబంధించి క్రయ, విక్రయాలు, ఇతర ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా ఏడాదిగా ఫ్రీజింగ్లో పెట్టింది. దీంతో నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందిన అసైన్డ్ భూములు కూడా రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఏడాదవుతున్నా.. ప్రభుత్వ భూములను 20 ఏళ్ల క్రితం అసైన్మెంట్గా పొందిన వారికి ఫ్రీహోల్డ్ ద్వారా యాజమాన్య హక్కు కల్పించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అటు తరువాత కూటమి ప్రభుత్వం రావడంతో ఫ్రీహోల్డ్ భూముల పరిశీలనకు తెరతీసింది. అయితే, ఏడాది అవుతున్నా ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఎప్పటికప్పుడు గడువును పొడిస్తూ సాగదీస్తూనే ఉన్నారు. పరిశీలన పూర్తయ్యే వరకు ఫ్రీజింగ్ను కొనసాగించే అవకాశం ఉండడంతో రైతుల కష్టాలు ఇప్పట్లో తొలిగేలా లేవు.ఏడాదిగా నిలిచిన డీ–పట్టా రిజిస్ట్రేషన్లుఅసైన్డ్ చేసిన మొత్తం భూమి 2,22,902.05 ఎకరాలు డీ–పట్టా పొందిన అసైనీలు 78,040భూమి కలిగిన నిజమైన అసైనీలు 28,115 నిజమైన అసైనీల వద్ద ఉన్న భూమి 75,828 ఎకరాలుఅసైనీల వారసులు 44,156 వారసుల వద్ద ఉన్న భూమి 1,33,425.42 ఎకరాలుఅసైన్డ్ భూమి తీసుకున్న థర్డ్ పార్టీ 5,769 థర్డ్ పార్డీ వద్ద ఉన్న భూమి 13,648.63 ఎకరాలుపరిశీలన జరుగుతోంది ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన ప్రక్రియ జరుగు తోంది. మరో రెండు నెలల్లో పూర్తికావొచ్చు. అటు తరువాత అసైన్డ్ భూములకు సంబంధించి లావాదేవీలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. – వి.వినోద్కుమార్, కలెక్టర్ కూటమి ప్రభుత్వం ఫ్రీజింగ్లో పెట్టడంతో సమస్య ఫ్రీహోల్డ్ భూముల పరిశీలన పేరుతో సాగదీత వర్ణనాతీతంగా అన్నదాతల ఆవేదన -
సజావుగా సివిల్స్ ప్రిలిమినరీ
అనంతపురం అర్బన్/అనంతపురం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగింది. ఏడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లు, మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. కేంద్రాలకు సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయించారు. కాగా.. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా సాగిన పరీక్షలో అభ్యర్థుల హాజరు 59.50 శాతంగా నమోదైంది. 2,546 మంది హాజరవ్వాల్సి ఉండగా ఉదయం పేపర్–1 పరీక్షకు కేవలం 1,522 మంది హాజరయ్యారు. 1,024 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 1,515 మంది హాజరుకాగా 1,031 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జిల్లా పరిశీలకులు ఎంఎం నాయక్, కలెక్టర్ వి.వినోద్కుమార్, జేసీ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు. 59.50 శాతం అభ్యర్థుల హాజరు ప్చ్.. అదృష్టం లేదు! యూపీఎస్సీ నిబంధనల ప్రకారం నిర్దేశించిన పరీక్ష సమయాని కంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేస్తూ వచ్చారు. ఉదయం 9 తరువాత, మధ్యాహ్నం 2 గంటల తరువాత కేంద్రంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. అయితే ఆదివారం కొందరు అభ్యర్థులు ఆలస్యంగా కేంద్రాలకు వచ్చారు. ఎస్ఎస్బీఎన్ కళాశాల కేంద్రంలో పరీక్షకు హాజరవ్వాల్సిన కదిరికి చెందిన షర్మిల, కర్నూలుకు చెందిన కిరణ్, అనంతపురం నగరానికి చెందిన స్రవంతి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. మరికొన్ని కేంద్రాల్లోనూ ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోపలికి పంపలేదు. -
వీఆర్ఓల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
అనంతపురం అర్బన్: ఏపీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రేడ్–2 వీఆర్ఓల సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి స్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేయానికి అందరూ కృషి చేయాలన్నారు. నూతన కమిటీ.. : సంఘం జిల్లా అధ్యక్షుడిగా సాయికుమార్, ప్రధాన కార్యదర్శిగా విరూపాక్షరెడ్డి ఎన్నికయ్యారు. కోశాధికారిగా రాజు, ఉపాధ్యక్షులుగా నరేష్కుమార్, కుమారస్వామి, రాఘవేంద్రరాజు, సంయుక్త కార్యదర్శులుగా అనిల్, అశోక్కుమార్, రఘు యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా పురుషోత్తం, లిఖిత ఎన్నికయ్యారు. పర్యవేక్షక సభ్యులుగా సయ్యద్ అఫ్రిది, వెంకట రాజేష్, దిల్షాద్, వీరేష్, ఆదినారాయణ, నీలకంఠరెడ్డి ఎన్నికయ్యారు. -
హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి బాధ్యతలు
అనంతపురం సెంట్రల్: హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల జిల్లా ఎస్ఆర్బీసీ ప్రాజెక్టు సర్కిల్–1 ఎస్ఈగా పనిచేస్తున్న ఆయనకు హెచ్చెల్సీ ఎస్ఈ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నూతన ఎస్ఈకు హెచ్చెల్సీ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. అదృశ్యమైన మహిళలు ఉరవకొండలో ప్రత్యక్షం ఉరవకొండ: కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్లో ఉన్న ఉజ్వల హోం నుంచి ఈనెల 22న అదృశ్యమైన ఇద్దరు మహిళల ఆచూకీ లభించింది. ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది వివరాల మేరకు.. కుందుర్పి, కణేకల్లు మండలాలకు చెందిన యువతులు కళ్యాణదుర్గంలోని ఉజ్వల హోం నుంచి అదృశ్యమైనట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశామన్నారు. ఉరవకొండ బస్టాండ్లో వారిని స్థానికులు గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. వెంటనే వారిని కళ్యాణదుర్గం పోలీసులకు అప్పగించామన్నారు. డ్రైవర్ దుర్మరణంవిడపనకల్లు: మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోని 67వ జాతీయ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ఈరన్న (42) మృతి చెందాడు. కర్ణాటకలోని కంప్లీ నుంచి గుంతకల్లు వైపు వెళ్తున్న లారీ మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోకి రాగానే టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ లారీని ఆపీ టైరు కింద రాళ్ళను పెట్టేందుకు వెనుక వైపునకు వెళ్ళాడు. అదే సమయంలో గుంతకల్లు వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి పంక్చరైన లారీని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్ ఈరన్న అక్కడికక్కడే చనిపోయాడు. -
కమీషన్ల కక్కుర్తికి బాలుడి ప్రాణాలు బలి
● బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని సీపీఐ నేత జగదీష్ డిమాండ్ గుంతకల్లు: నాసిరకం నిర్మాణ పనులతో ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీ.జగదీష్ విమర్శించారు. శుక్రవారం గుంతకల్లు రైల్వేస్టేషన్లో పెచ్చులూడి పడి మణికంఠ అనే బాలుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీఎం నాయకుల బృందం వేర్వేరుగా స్థానిక రైల్వేస్టేషన్లోని 6–7 నంబర్లు ప్లాట్ఫారాల్లో ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం సీపీఐ నేత జగదీష్ విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లు రైల్వేస్టేషన్ను రూ.కోట్ల ఖర్చుతో ఆధునీకరించారన్నారు. రైల్వే అధికారులు కమీషన్లు, పర్సంటేజీలకు కక్కుర్తిపడి నాసిరకం నిర్మాణాలను పట్టించుకోలేదన్నారు. నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్ట్రును బ్లాక్లిస్ట్ పెట్టడంతో పాటు సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మణికంఠ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి రైల్వే ఉద్యోగమిచ్చి ఆదుకోవాలన్నారు. అంతకుముందు సీపీఐ నాయకుల బృందాన్ని రైల్వేస్టేషన్లోకి వెళ్లాకుండా ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆర్పీఎఫ్పై అధికారి అనుమతితో వారిని స్టేషన్లోపలికి అనుమతి ఇచ్చారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు గోవిందు, వీరభద్రస్వామి, మహేష్, గోపీనాథ్, రామురాయల్, ఎస్ఎండీ గౌస్ పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతిరూపం కల్లూరు
విలక్షణ కథకుడు ‘బాలగొండ’ ●స్వాతంత్య్రోద్యమంలో కల్లూరు సుబ్బారావు కీలక పాత్ర ●నీలం, తరిమెల, ఐదుకల్లు వంటి వారిలో స్ఫూర్తి నింపిన వైనం ●ఆదివారం జయంతి నిర్వహణకు ఏర్పాట్లు ●కల్లూరు స్మారక పురస్కారానికి ఎంపికై న బాలగొండ అనంతపురం కల్చరల్: చాలా కొద్ది మంది మాత్రమే తమదైన వ్యక్తిత్వంతో విలువలతో కూడిన జీవన విధానంతో గొప్పవారవుతారు. ఆ కోవకు చెందిన ‘అనంత’ త్యాగధనుడు స్వాతంత్య్ర సమరయోధుడు కల్లూరు సుబ్బారావు. నిరుపమాన త్యాగమయ జీవితంతో, విలక్షణ వ్యక్తిత్వంతో ప్రసిద్ధికెక్కిన కల్లూరు సుబ్బారావు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే నగరానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త , సినీ దర్శకుడు బాలగొండ ఆంజనేయులకు ‘కల్లూరు సుబ్బారావు స్మారక అవార్డు అందిస్తున్నారు. రాయలసీమ పితామహుడు ‘కల్లూరు’ ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని కల్లూరు గ్రామంలో 1897 మే 25న కల్లూరు సుబ్బారావు జన్మించారు. 1913లో దివ్యజ్ఞాన సమాజం వ్యవస్థాపకులు అనిబీసెంట్ హిందూపురం రావడంతో ఆమె ప్రసంగాలకు ఆకర్షితులై జాతీయోద్యమంలో చేరారు. స్వాతంత్య్రోద్యమంలో రాయలసీమ జిల్లాల తరఫున శిక్షణ పొంది అందరిలో చైతన్యం తెచ్చారు. మన జిల్లాలో శిక్షణ పొందిన మొట్ట మొదటి రాజకీయ ఖైదీ సుబ్బారావు కావడం విశేషం. 1921 సెప్టెంబర్ 28న శిక్షాకాలం పూర్తయిన తర్వాత బళ్లారి సభలో గాంధీజీతో కలసి మళ్లీ ఉద్యమంలో పాల్గొన్నారు. 1928 నవంబర్లో నంద్యాలలో జరిగిన సభలో దత్త మండలాలకు రాయలసీమ అని పేరు పెట్టిన వారిలో కల్లూరు ప్రముఖులు. నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్ వంటి అనంత ఆణిముత్యాలు కల్లూరి సుబ్బారావు స్ఫూర్తితో జాతీయస్థాయిలో రాణించారు. 1937లో రాయలసీమ వారికి అన్యాయం జరగకుండా ‘శ్రీబాగ్ ఒడంబడిక’పై సంతకం చేశారు. అనంతపురంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపన, టవర్క్లాక్ నిర్మాణంలో ఆయన పాత్ర ఎనలేనిది. పద్మశ్రీతో సత్కారం లలితకళలపై అసమాన అభిమానంతో నగరంలోని విలువైన తన సొంత స్థలాన్ని కల్లూరు సుబ్బారావు ‘లలిత కళాపరిషత్’కు దానంగా ఇచ్చారు. అది ఇప్పటికీ ‘కల్లూరు సుబ్బారావు కళా ప్రాంగణం’ గానే పిలవబడుతోంది. కళాకారులు అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహం పూజలందుకుంటూనే ఉంది. ఆయన నిరుపమాన సేవలను గుర్తించి ప్రభుత్వం 1967లో ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. అభ్యుదయ కార్యక్రమాలకు నాంది పలికిన రాయలసీమ వైతాళికులు కల్లూరు సుబ్బారావు 1973 డిసెంబర్ 20న కన్నుమూశారు. కన్నడ, తెలుగు భాషా పండితుడిగా, త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిన కల్లూరు సుబ్బారావు చిరస్మరణీయ జీవితాన్ని భావితరాలు గుర్తుంచుకునేలా లలితకళాపరిషత్తు ఆధ్వర్యంలో ‘కల్లూరు సుబ్బారావు స్మారక అవార్డు’ అందిస్తున్నారు. ఈసారి ఆ అవార్డు బాలగొండ ఆంజనేయులును వరించింది. పోలీసు అఽధికారిగా, కథకుడిగా, కళాకారుడిగా, నవలా రచయితగా ప్రసిద్ధి పొందారు. ఆయన రాసిన కథలు, నవలలు ఎంతో మందిని ఆలోచింపజేశాయి. 1991 నుంచి 2001 వరకూ జిల్లా రచయితల సంఘంలో వివిధ హోదాలలో సాహితీ సేవలందించారు. ‘తిమ్మమ్మ మర్రిమాను’ ప్రాశస్త్యాన్ని నవల రూపంలో రాయడమే కాకుండా దాన్ని సినిమాగా తీసి స్వయంగా దర్శకత్వం వహించారు. అలాగే మొగ్గల్జడ నవల రాసి స్క్రీన్ప్లే, మాటలు అందించారు. గతంలో ఆయన ప్రభుత్వం అందించే ఉగాది పురస్కారాన్ని, మొల్ల సాహితీ పురస్కారాలనందుకున్నారు. బాలగొండ ఆంజనేయులు సేవలను గుర్తిస్తూ పురస్కారానికి ఎంపిక చేయడంపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఎల్కేపిలో పురస్కార ప్రదానోత్సవం, సాంస్కృతిక సంబరాలు జరుగుతాయని, కళాభిమానులు విచ్చేయాలని కార్యదర్శి పద్మజ కోరారు. -
రోగులకు మెరుగైన వైద్యసేవలందించండి
పామిడి: రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ వినోద్కుమార్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పామిడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆయన తనిఖీ చేశారు. వైద్యసేవలపై రోగులతో ఆరా తీశారు. అనంతరం వైద్యాధికారి శివకార్తీక్రెడ్డితో సమీక్ష నిర్వహించారు. సర్జికల్ ప్రొసీజర్స్పై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. నెలకు 30 ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. నియోజకవర్గ స్పెషలాఫీసర్లు ఆసుపత్రి వైద్యసేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ రవికుమార్, తహసీల్దార్ ఆర్.శ్రీధరమూర్తి, డాక్టర్ మహేష్, హెడ్ నర్స్ శివకుమారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనంతపురం అర్బన్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2025పై అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. పర్యావరణ దినోత్సవం థీమ్ ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడమేనన్నారు. ఈ క్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలుకు కార్యాచరణ తయారు చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణపై శనివారం గ్రామస్థాయిలో అవగాహన సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 25న వ్యర్థాల విభజన, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై ప్రచారం చేయాలన్నారు. ఇలా జూన్ 4 వరకు నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించి ప్రశంసాపత్రాలు, బహుమతులు ప్రదానం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, రేంజ్ అటవీ అధికారి శ్రీనివాసులు, పీఆర్ డీఎల్పీఓ విజయ్కుమార్, డీపీఆర్సీ రీసోర్స్ పర్సన్ మాధవి, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతోనే సమగ్రాభివృద్ధి పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా నిర్ణీత గడువులోపు మంజూరు చేయాలని ఆదేశించారు. స్టాండప్ ఇండియా పథకం కింద లబ్ధిదారుల రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఎల్డీఎంను ఆదేశించారు. విశ్వకర్మ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి శిక్షణ, రుణం మంజూరుకు చర్యలు తీసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిని ఆదేశించారు. బనానా ఫైబర్తో బ్యాగ్లు, టోపీలు తయారు చేయవచ్చన్నారు. ఇందుకు సంబంధించి ఎస్హెచ్జీ సభ్యులకు, రైతులకు పీఎంఈజీపీ కింద రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఇండస్ట్రియల్ డెలప్మెంట్ పాలసీ కింద 21 యూనిట్లకు రూ.62.86 లక్షల సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి శ్రీనివాసయాదవ్, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణారెడ్డి, ఎల్డీఎం నరేష్రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధికారి ప్రతాప్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
● సీఐ, ఎస్ఐలే కారణమంటున్న బాధితురాలు అనంతపురం మెడికల్/కదిరి అర్బన్: కదిరి పట్టణానికి చెందిన యషిక సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. యషిక, ఆమె తండ్రి లక్ష్మీనారాయణ వివరాల మేరకు.. కదిరికి చెందిన లక్ష్మీనారాయణ, శిరీష దంపతుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శిరీషకు సంబంధించి ఫొటోలను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై యషిక, ఆమె తండ్రి లక్ష్మీనారాయణ తదితరులను పోలీసుస్టేషన్కు రావాలని పిలుపుస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం యషికకు సీఐ నారాయణరెడ్డి ఫోన్ చేసి దుర్భాషలాడడంతో ఆమె స్టేషన్కు వెళ్లింది. అక్కడ సీఐతో పాటు ఎస్ఐ బాబ్జాన్ నానా మాటలు అనడంతో మనస్థాపంతో యషిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతోనే పోలీసులు తమను వేధిస్తున్నారని, శిరీషతో ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదిలా ఉండగా.. తాను తన మిత్రుడితో కలసి ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేశారని శిరీష కదిరి పట్టణ పోలీసులను ఆశ్రయించింది. రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించింది. శిరీష ఫిర్యాదు మేరకు ఆమె భర్త లక్ష్మీనారాయణ, కుమార్తె యషిక, ఆమె భర్త శివ, జగదీష్ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్
అనంతపురం అర్బన్: యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినోద్కుమార్ శుక్రవారం తెలిపారు. కంట్రోల్ రూమ్ 24, 25 తేదీల్లో ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా సమాచారం లేదా ఫిర్యాదు కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు 85002 92992 (వాట్సాప్), 08554– 220009ను సంప్రదించవచ్చని తెలిపారు. చుక్కల భూములకు పరిష్కారం అనంతపురం అర్బన్: నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వినోద్కుమార్ స్పష్టం చేశారు. అధికారులు కూడా ఆ దిశగా పనిచేయాలని చెప్పారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి కళ్యాణదుర్గం డివిజన్కు సంబంధించి డీఎల్సీ, డీఎల్ఎన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములను తొలగించేందుకు ప్రతి వారం షెడ్యూల్ ప్రకారం జిల్లా స్థాయి డాటెడ్ ల్యాండ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. కళ్యాణదుర్గం మండలానికి సంబంధించి ఒక కేసును విచారించి ఆమోదించామన్నారు. క్షేత్రస్థాయిలో తహసీల్దార్లతో ఆర్డీఓ పని చేయించాలని ఆదేశించారు. కలెక్టరేట్లో సెక్షన్ వారీగా ఫైళ్లు ఎన్ని పంపారు. ఎన్ని పరిష్కరించారనేది తనిఖీ చేయాలని జాయింట్ కలెక్టర్ను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ భాస్కర్, మునిసిపల్ కమిషనర్ వంశీకృష్ణ, కలెక్టరేట్ భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, డీటీ ప్రభంజన్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం అనంతపురం అర్బన్: చౌక ధరల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్శర్మ అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల అంశాలపై జేసీ శుక్రవారం ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను తీవ్రంగా పరిగణించాలన్నారు. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రవాణా చేస్తున్న వారిపై 6ఏ కేసు నమోదు చేయాలన్నారు. ఇదే వృత్తిగా ఎంచుకుని అక్రమాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం మేరకు కేసు పెట్టడంతో పాటు రౌడీ షీట్ తెరవాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. చౌక ధరల దుకాణాలను తూనికలు కొలతల శాఖ అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని చెప్పారు. చౌక దుకాణాలను ఆర్డీఓలు, తహసీల్దారులు, సీఎస్డీటీలు, డీఎస్ఓ తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్డుదారుల ఈ–కేవైసీ పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
‘మా ప్రభుత్వం.. మాదే రాజ్యం.. ప్రశ్నించకూడదు.. ఎదురు చెప్పకూడదు’ అన్నట్లు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు వ్యవహరిస్తున్నారు. వంగివంగి దండాలు పెడితే సరి.. లేకపోతే దండనకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరికలు పంపుతున్నారు. తప్పు చేయకపోయినా కుట్ర చేసి మరీ బదిలీ బహుమాన
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈఓ) రాజోలి రామచంద్రారెడ్డి విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఎక్కడ పని చేసినా.. ముక్కుసూటిగా పని చేయడంతో పాటు సౌమ్యుడిగా, వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. నంద్యాల జిల్లా డ్వామా పీడీగా పని చేస్తున్న ఆయన్ను కూటమి ప్రభుత్వం కొన్ని నెలల క్రితం అనంతపురం జెడ్పీ సీఈఓగా బదిలీ చేసింది. డిసెంబర్ 28న ఆయన సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రభుత్వ ప్రాధాన్యాల మేరకు పని చేశారు. అనతి కాలంలోనే సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకోగలిగారు. అలాంటి అధికారిని అధికార టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారు. ఎలాగైనా జిల్లా దాటించాలని కంకణం కట్టుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో సీఎం ఫొటో సరైన స్థానంలో లేదంటూ రచ్చచేసి... దానికి సీఈఓను బాధ్యున్ని చేసి... ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారు. రామచంద్రారెడ్డిపై కక్ష ఎందుకంటే.. వివిధ కారణాలతో ఖాళీ ఏర్పడ్డ స్థానిక సంస్థల పదవులకు ఇటీవల ఉప ఎన్నికలు నిర్వహించారు. ఆ సందర్భంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండల ఉపాధ్యక్ష (వైస్ ఎంపీపీ) స్థానానికీ ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికను ఎలాగైనా వాయిదా వేయించాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అక్కడి ఎంపీడీఓపై ఒత్తిడి తెచ్చారు. ‘ఇది ఎన్నికల కమిషన్ నిర్ణయం. మా చేతుల్లో ఏమీ ఉండదు సర్’ అంటూ అక్కడి అధికారి సమాధానమిచ్చారని తెలిసింది. దీంతో జెడ్పీ సీఈఓ ద్వారా ఎన్నిక వాయిదా వేయించాలనుకున్నా... అందుకు సీఈఓ అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు జిల్లాలో 15 మంది డిప్యూటీ ఎంపీడీఓ(ఈఓపీఆర్డీలు)లు, ఏఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతులు రాగా, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పదోన్నతిపై మరో ఐదుగురు ఎంపీడీఓలు జిల్లాకు వచ్చారు. వారికి పోస్టింగ్ వేసే క్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం ఎంపీడీఓగా విజయసింహారెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఆయనకు పోస్టింగ్ ఇచ్చే ముందు ఎమ్మెల్యే తనయుడితో పాటు పీఏకూ సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అయితే కూతురి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే తనకు తెలియకుండా ఎంపీడీఓకు పోస్టింగ్ ఇచ్చారని ఆగ్రహించి విజయ సింహారెడ్డిని వెనక్కి పంపేశారని సమాచారం. ఈ రెండు అంశాలను మనసులో పెట్టుకున్న ఎమ్మెల్యే సురేంద్రబాబు.. మడకశిర, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, దగ్గుపాటి ప్రసాద్ను కలుపుకొని.. సీఈఓ రామచంద్రారెడ్డిపై కక్ష గట్టినట్లు స్పష్టమవుతోంది. మహిళా చైర్పర్సన్ చాంబర్లోకి ప్రవేశించి.. బోయ సామాజిక వర్గానికి చెందిన గిరిజమ్మ వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి జెడ్పీ చైర్పర్సన్ అయ్యారు. ఆమె పదవీకాలం ఇంకా 15 నెలలు ఉంది. బీసీ కులం నుంచి వచ్చిన గిరిజమ్మ తమ అభిమాన నేత, మాజీ సీఎం జగన్ ఫొటోను తన చాంబర్లో ఉంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో కూడా తన చాంబర్లో ఏర్పాటు చేయించారు. అయితే ఈ నెల 21న జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతుండగానే...ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి తదితరులు జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లోకి చొరబడ్డారు. జిల్లా ప్రథమ పౌరురాలు, కేబినెట్ ర్యాంకు కలిగిన ప్రజాప్రతినిధి చాంబర్లోకి దూసుకెళ్లి చంద్రబాబు ఫొటో ఎక్కడంటూ రచ్చ చేశారు. ఈ సమయంలోనే జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడారు. గ్రూప్–1 అధికారి అన్న గౌరవం కూడా లేకుండా అవమానించారు. ఆ తరువాత మాజీ సీఎం జగన్ ఫొటోను బలవంతంగా తీయించి, గాంధీజీ ఫొటో స్థానంలో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టించారు. అంతటితో ఈ వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల దెబ్బకు జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి బదిలీ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో సహకరించలేదని అక్కసు ఓ ఎంపీడీఓకు పోస్టింగ్ విషయంలోనూ ఎమ్మెల్యే అమిలినేని అసంతృప్తి జెడ్పీ సమావేశానికి వచ్చి చైర్పర్సన్ చాంబర్లో చంద్రబాబు ఫొటో లేదంటూ రగడ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి... పోస్టింగ్ కూడా ఇవ్వకుండా కసి తీర్చుకున్న వైనం నిజాయితీ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారంటున్న ఉద్యోగులు -
విఠల.. విఠల.. పాండురంగ విఠల
వైభవంగా రుక్మిణీ పాండురంగస్వామి రథోత్సవం బొమ్మనహాళ్: ఆంధ్ర పండపరీపురంగా ప్రసిద్ధి చెందిన ఉంతకల్లులో రుక్మిణీ పాండురంగస్వామి బ్రహ్మ రథోత్సవం శుక్రవారం అత్యంత వైభంగా జరిగింది. సాయంత్రం 5.30 గంటలకు పండరీపుర పీఠాధిపతి గోపాల్ మహరాజ్ ఆధ్వర్యంలో రుక్మిణీ పాండురంగస్వామి రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తజన సందోహం నడుమ రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయం నుంచి గ్రామ ప్రధాన వీధి, బసవన్న ఆలయం వరకు రథాన్ని లాగారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు ‘విఠల... విఠల.. రుక్మీణీ పాండురంగ విఠల’ అంటూ భజనలు చేశారు. అనంతరం పల్లకీ మహోత్సవం నిర్వహించారు. ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
విద్యాశాఖలో ఏమి జరుగుతోంది?
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను గతంలో ఎప్పుడూ లేనివిధంగా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది అత్యంత రహస్యంగా నిర్వహించడం వెనుక ఆంతర్యమేమిటని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని శారదా బాలికల పాఠశాలలో డీఈఓ ప్రసాద్బాబును నిలదీశారు. ఇంత గోప్యతగా ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. డీఎస్సీల వారీగా మార్కులు, మెరిట్ ర్యాంకుల వివరాలు తెలియజేయాలని మూన్నెళ్ల నుంచి అడుగుతున్నా ఇప్పటిదాకా బయటకు పెట్టకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాంకులు, మార్కులు బయటకు చెప్పకుండా తాము ఇచ్చిన జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని అడిగితే ఎలా చెప్పాలని ప్రశ్నించారు. రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సీనియార్టీ జాబితాలు విడుదలవుతున్నా ఇక్కడ మాత్రం ఏఒక్కటీ చెప్పడం లేదన్నారు. సంఘాలకు చెప్పకూడదనుకుంటున్నారా? బదిలీలకు సంబంధించిన అనేక సందేహాల నివృత్తి కోసం డీఈఓకు వందలసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండి పడ్డారు. బదిలీలకు సంబంధించి రాష్ట్ర అధికారుల నుంచి రోజూ నాలుగైదుసార్లు వెబెక్స్లు నిర్వహిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నా ఏఒక్కటీ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు చెప్పడం లేదన్నారు. ‘అన్నీ ఎంఈఓలకు పంపుతున్నామంటున్నారు. అంటే ఉపాధ్యాయ సంఘాల నాయకులకు చెప్పకూడదనుకుంటున్నారా’ అని ప్రశ్నించారు. శనివారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి చర్చించకపోతే ధర్నా చేపడతామని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన డీఈఓ...ఇకపై టీచర్లకు సంబంధించిన ప్రతి సమాచారం సంఘాల నాయకుల వాట్సాప్ గ్రూపులోనూ పెడతామన్నారు. సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు విష్ణువర్దన్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్ నాయక్, రామాంజనేయులు, సూరీడు, సిరాజుద్దీన్, రమణారెడ్డి, ఎర్రిస్వామి, వెంకటరత్నం, శ్రీనివాస్ రెడ్డి, రాయల్ వెంకటేష్, లింగమయ్య, నరసింహులు, కులశేఖర్రెడ్డి, హనుమేష్. వెంకటసుబ్బయ్య, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఈఓను నిలదీసిన నాయకులు -
ముందస్తుగా ఆశల ‘నైరుతి’
అనంతపురం అగ్రికల్చర్: ఆశల ‘నైరుతి’ ముందస్తుగానే ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీపి కబురు చెబుతోంది. సాధారణంగా జూన్ ఒకటిన కేరళను తాకే ‘నైరుతి’ ఈసారి ఈ నెల 26నే తాకనున్నాయని ప్రకటించింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున ఈ నెల 29 నాటికే ఉమ్మడి ‘అనంత’లోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. జూన్ రెండో వారంలో చాలాసార్లు రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించాయి. అయితే ఈసారి దాదాపు 10 రోజులు ముందుగానే ‘నైరుతి’ పలకరించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి లక్షలాది హెక్టార్ల ఖరీఫ్ సాగుకు నైరుతి రుతుపవనాలు (సౌత్వెస్ట్ మాన్సూన్స్) అత్యంత కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు నమోదు కావాల్సి ఉంటుంది. నైరుతి వర్షాలపై గంపెడాశలు ఉమ్మడి జిల్లా పరిధిలో దాదాపు 7 లక్షల హెక్టార్లలో సాగులోకి వచ్చే ఖరీఫ్ పంటలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో కీలకమైన ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. జూన్లో 61 మి.మీ, జూలైలో 63.9, ఆగస్టులో 83.8, సెప్టెంబర్లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలపై ఆధారపడి ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 20 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్నతో పాటు మరో 15 రకాల పంటలు సాగు చేస్తారు. = ఇదిలా ఉండగా రాగల ఐదు రోజులు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా జూన్ రెండో వారంలోనే జిల్లాకు రుతుపవనాలు అయితే ఈ సారి ఈనెలాఖరుకే ప్రవేశిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ‘ఖరీఫ్’కు నైరుతి ప్రభావంతో వర్షాలు 319.6 మి.మీ సాధారణం కన్నా అధిక వర్షపాతంపై అన్నదాత ఆశలు -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఉక్కపోత తగ్గింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
పోలీస్స్టేషన్కు చేరిన కిడ్నాప్ కథ తాడిపత్రిటౌన్: పట్టణంలో కేబుల్ ఆపరేటర్ యజమానుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో గురువారం వైఎస్సార్సీపీ కార్యకర్త యాసిన్ను కొందరు టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్రెడ్డితో పాటు యాసిన్ తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకొని తనను టీడీపీ నాయకులు ధనుంజయరెడ్డి, పవన్కుమార్రెడ్డి, రామాంజులరెడ్డి, బేల్దారి ప్రసాద్ కిడ్నాప్ చేసి రూములో బంధించి ఇసుప పైపులు, కట్టెలతో చావబాదారని, గురువారం రాత్రి సమయంలో వదిలేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకొన్న తనకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స తీసుకొని వచ్చానని పేర్కొన్నారు. డిష్ గొడవలు ఉంటే యాజమాన్యాలు చూసుకోవాలి కాని అందులో పనిచేసే తమకు ఏం సంబంధం ఉంటుందని యాసిన్ పోలీసుల ముందు వాపోయారు. నాణ్యమైన విత్తనం అందించాలి అనంతపురం సెంట్రల్: ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. శుక్రవారం స్థానిక జస్వంత్ ప్రాసెసింగ్ ప్లాంట్లో జరుగుతున్న విత్తనశుద్ధి కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓలు రాకేష్నాయక్, శ్రీనాథ్రెడ్డి, ప్లాంట్ యజమాని రమణ తదితరులు పాల్గొన్నారు. -
తాడుతో గొంతు బిగించి.. కొడవలితో తలను వేరు చేసి
రాయదుర్గం టౌన్: ఈ నెల 15న చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాయదుర్గం పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ జయనాయక్తో కలసి డీఎస్పీ పి.రవిబాబు వెల్లడించారు. రాయదుర్గం మండలం కొంతానపల్లికి చెందిన బోయ అంజినయ్య కుమారుడు వినోద్కుమార్ (22) టైలరింగ్తో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో స్వగ్రామంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో స్థిరపడిన వినోద్కుమార్... ఇటీవల స్వగ్రామానికి చేరుకుని స్థానిక గార్మెంట్స్ పరిశ్రమలో కార్మికుడిగా పనిలోకి చేరాడు. ఈ నెల 17న రాయదుర్గంలో జరిగిన ప్రసన్న వేంకటరమణస్వామి రథోత్సవానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. 18న కొంతానపల్లి వద్ద పొలంలో హతుడై కనిపించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో కొంతానపల్లికి చెందిన యువకులు నాయకుల రమేష్, నాయకుల బొమ్మలింగను గురువారం బళ్లారి మార్గంలోని చదం రైల్వే గేట్ వద్ద అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో హత్య చేసింది తామేనని అంగీకరించారు. హత్యకు గల కారణాలు వారు వెల్లడించారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన గ్రామంలోని మహిళల పట్ల వినోద్కుమార్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా చెడుగా ప్రచారమూ చేసేవాడు. దీంతో వినోద్కుమార్పై కక్ష పెంచుకున్న రమేష్, బొమ్మలింగ.. వినోద్కుమార్ను హతమార్చాలని నిర్ణయించుకుని అవకాశం కోసం వేచి చూశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న రాయదుర్గంలో శ్రీవారి రథోత్సవానికి వినోద్కుమార్ వెళ్లినట్లుగా తెలుసుకుని అదే రోజు దారి కాపుకాచారు. సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వస్తున్న వినోద్కుమార్ను అడ్డుకుని పొలాల్లోకి లాక్కెళ్లి తాడుతో గొంతు బిగించారు. అనంతరం పదునైన కొడవలితో గొంతు కోసి తలను వేరుచేసి గుట్టు చప్పుడు కాకుండా ఉడాయించారు. హత్యకు ఉపయోగించిన నైలాన్తాడు, కొడవలి, మోటార్ సైకిల్, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. యువకుడి హత్య కేసులో వీడిన మిస్టరీ నిందితుల అరెస్ట్ -
స్పష్టత లేని బదిలీల జాబితాలు
● డీఈఓకు విన్నవించిన ఏపీటీఎఫ్ (1938) నాయకులు అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు, షెడ్యూలు విడుదలై ఓ వైపు దరఖాస్తు చేసుకుంటున్నా నేటికీ జాబితాల్లో స్పష్టత ఇవ్వలేదంటూ ఏపీటీఎఫ్ (1938) నాయకులు వాపోయారు. ఈ మేరకు గురువారం డీఈఓ ప్రసాద్బాబును కలసి వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని చాలా మండలాల్లో ఇప్పటి వరకూ ఏ స్కూల్లో ఏ ఉపాధ్యాయుడు సర్ ప్లస్ అయ్యాడనే దానిపై సమాచారం లేదన్నారు. ఎవరు బదిలీ కింద దరఖాస్తు చేసుకోవాలనే అంశంపై కూడా క్లారిటీ లేదన్నారు. అన్ని సబ్జెక్టులకు, ఎస్జీటీలకు సంబంధించిన ఫైనల్ వెకెన్సీ, ఫైనల్ ప్రమోషన్ సీనియార్టీ లిస్టు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఈఓ పూల్లో ఉన్న ఎల్పీలు, పీఈటీలు బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలా? వద్దా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు. డీఈఓ ఆఫీస్ నుంచి పంపుతున్న సమాచారం సరైన రీతిలో సర్కూలేట్ కావడం లేదన్నారు. పీహెచ్, వీహెచ్ ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీల నుంచి మినహాయింపు ఇస్తున్న తరుణంలో ప్రాథమికోన్నత పాఠశాలలో సర్ ప్లస్ కింద ఏ సబ్జెక్టు ఉపాధ్యాయులను తీసుకుంటారో.. సబ్జెక్టు వారీగా సీక్వెన్స్ తెలపాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసనాయక్, జిల్లా పూర్వ అధ్యక్షుడు రవీంద్ర, అదనపు ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు వజీర్బాషా, సాయినాథ్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు ఫక్రుద్దీన్, హుస్సేన్ ఖాన్ ఉన్నారు. -
రియల్టర్ ఇంట చోరీ
గుంతకల్లు: స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంట్ను రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆసీఫ్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి వేసిన తాళాలు బద్ధలు గొట్టిన విషయాన్ని గురువారం ఉదయం గుర్తించిన స్థానికులు ఆసీఫ్కు సమాచారం అందించారు. దీంతో ఆయన బంధువులు ఫిర్యాదు చేయడంతో టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, ఆసీఫ్ ఈ నెల 16న ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి అజ్మీర్ యాత్రకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో తాళం వేసిన ఇంటిని గుర్తించిన దొంగలు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తాళాలు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. బీరువాను తెరచి అందులోని రూ.4.5 తులాల బంగారు నగలతోపాటు 8 తులాల వెండి, రూ.55వేలు నగదు, ఎల్ఈడీ టీవీ, బియ్యం బస్తాలు, ఇంటి ఆవరణలో ఉంచిన వాటర్ పంప్ మోటార్ అపహరించారు. బాధితుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
క్రికెట్ మ్యాచ్ తెచ్చిన తంటా.. రెండు వర్గాల ఘర్షణ
గుంతకల్లు: క్రికెట్ మ్యాచ్లో చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవలో పెద్దలు తలదూర్చడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని సత్యనారాయణపేట మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో ఈ నెల 19న చిన్నపిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడారు. మ్యాచ్లో ఉడదాల గణేష్, ముక్కన్నగారి హస్సేన్ మధ్య ఘర్షణ జరిగింది. విషయాన్ని ఇంట్లో తెలపడంతో అదే రోజు రాత్రి ఇరు కుటుంబాల వారు గొడవపడ్డారు. ఆ సమయంలో ఉడదాల కుటుంబానికి చెందిన అంజి, వరుణ్, గణేష్ గాయపడ్డారు. దీంతో కక్ష పెంచుకున్న ఉడదాల కుటుంబసభ్యులు గురువారం రాత్రి సంజీవనగర్లో నివాసముంటున్న ముక్కన్నగారి హుస్సేన్ చిన్నాన్న సాయిప్రసాద్పై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి కొడవళ్లతో నరికి పరారయ్యారు. తలకు, కాళ్లకు తీవ్ర గాయాలైన సాయిని కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. కాగా ఘర్షణ పడిన రెండు వర్గాలూ టీడీపీకి చెందినవే కావడం గమనార్హం. బాధితుల ఫిర్యాదు మేరకు కసాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత : డీఎంఈ గుత్తి: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని గుత్తి డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ ప్రమోద్ అన్నారు. గుత్తి రైల్వే డీజిల్ షెడ్లో గురువారం రైల్వే కార్మికులు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అఽతిథిగా డీఎంఈ హాజరై, మాట్లాడారు. అనంతరం డీజిల్షెడ్ ఆవరణలో కార్మికులతో కలసి మొక్కలు నాటారు. -
వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
శింగనమల: సోదనపల్లిలో గురువారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. యల్లమ్మ పరుష, ఆగులూరప్ప స్వామి జల్ది పూజ వైభవంగా జరిగాయి. కురుబల ఆరాధ్య దేవరలైన రేవణ్ణ సిద్దేశ్వర, కాట్నేకాల్వ దేవరాయ గుణాచార్యులు, పెద్దయ్య, ఉజ్జినప్ప, ఆగులూరప్ప, నల్లబొల్లెప్ప, కొండారుపల్లయ్య, నాగులబురజప్ప, అంతరగంగప్ప, పెండేకల్లప్ప, శిలారామప్ప, బీరప్పస్వామి, గుంతకల్లప్ప, తాడిపత్రప్ప స్వామి, అయిలప్ప స్వామి, కోకొండ బీరప్ప స్వాములను పొలిమేర నుంచి అంగన్వాడీ స్కూల్ వరకూ ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. -
‘జాబితా మతలబు’పై కమిషనర్ ఆరా
అనంతపురం ఎడ్యుకేషన్: రివర్షన్ తీసుకున్న టీచరును ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల జాబితాలో ముందు వరుసలో చేర్చిన వైనంపై విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆరా తీశారు. ఫిజికల్ సైన్స్ టీచరుగా పని చేస్తున్న గుత్తా వెంకటనాయుడు 2023 జూలైలో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది ఆత్మకూరు మండలం తోపుదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మూన్నెళ్లు పని చేసిన తర్వాత రివర్షన్ (తిరిగి స్కూల్ అసిస్టెంట్గా) కోరుకుని ప్రస్తుతం డి.హీరేహాల్ మండలం 74–ఉడేగోళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల్లో నిబంధనల మేరకు రివర్షన్ తీసుకున్న ఉపాధ్యాయుడిని ఆ కేడర్లో అందరి కంటే జూనియర్గా పరిగణించాలి. అంటే రివర్షన్ వచ్చిన రోజు నుంచి కొత్తగా సర్వీస్ను లెక్కిస్తారు. ఈ లెక్కన ఆయన ఫిజికల్ సైన్స్ టీచర్లలో చివరివాడిగా దాదాపు 730 వరుస సంఖ్యలో ఉంటారు. మొత్తం స్కూల్ అసిస్టెంట్ కేడర్లో తీసుకుంటే చివరి స్థానం 6,291 నంబరులో ఉండాలి. ఈ విషయం ఇక్కడి అధికారులు, డీఈఓ కార్యాలయ ఉద్యోగులకూ తెలుసు. అయితే ఓ సంఘం నాయకుడు చక్రం తిప్పడంతో చిట్టచివరన ఉండాల్సిన గుత్తా వెంకటనాయుడు పేరు మొదటి స్థానంలోకి వచ్చింది. ఈ వ్యవహారంపై గురువారం ‘సాక్షి’లో ‘పదోన్నతుల జాబితాలో మతలబు ఏమిటో?’ శీర్షికన కథనం వెలువడింది. దీనిని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తీవ్రంగా పరిగణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో గురువారం జరిగిన వెబెక్స్లో ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆయన చర్చ లేవనెత్తారు. విద్యాశాఖ జేడీ సర్వీసెస్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 16న ప్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ (ఎఫ్ఏక్యూ)లో ఇదే అంశంపై స్పష్టంగా ఇచ్చినా... అనంతపురం జిల్లాలో రివర్షన్ టీచరును జాబితా ముందు వరుసలోకి ఎలా చేర్చారంటూ ప్రశ్నించారు. పక్కన రిమార్కులు రాశామంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన జిల్లా అధికారులు.. చివరకు జాబితాను మార్పు చేస్తామంటూ వివరణ ఇచ్చారు. అనంతరం గుత్తా వెంకటనాయుడును మోస్ట్ జూనియర్గా పరిగణిస్తూ స్కూల్ అసిస్టెంట్ కేడర్లో చివరి పేరుగా చేర్చారు. ఇదే విషయాన్ని డీఈఓ ప్రసాద్బాబు స్పష్టం చేశారు. -
ఆ టీచర్లకు సర్వీస్ పాయింట్లు ఇవ్వాలి
● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: రెండు డీఎస్సీల్లో సెలెక్ట్ అయి ప్రస్తుత బదిలీల్లో తీవ్రంగా నష్ట పోతున్న ఉపాధ్యాయులకు మొదటి నుంచి సర్వీస్ పాయింట్లు కేటాయించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒక ఉపాధ్యాయుడు మొదట ఎస్జీటీగా ఎంపికై న తర్వాత అన్ని అనుమతులతో ఎస్ఏగా సెలెక్ట్ అయినవారు ఒకే సర్వీస్ పుస్తకంలో అతని సర్వీస్ రాశారని వివరించారు. గత బదిలీల్లో సర్వీస్ పాయింట్లు వచ్చినా.. ప్రస్తుత బదిలీల్లో ఎస్ఏలుగా సెలెక్ట్ అయినప్పటి నుంచి సర్వీస్ పాయింట్లు మాత్రమే ట్రాన్స్ఫర్ అప్లికేషన్లో వస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి వారికి క్యాడర్తో నిమిత్తం లేకుండా సర్వీసులో చేరినప్పటి సర్వీస్ పాయింట్స్ ఇవ్వాలన్నారు. అలాగే ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు సక్రమంగా రూపొందించలేదన్నారు. కొన్ని మండలాల్లో అన్ని అర్హతలు ఉన్నా యూపీ పాఠశాలలను కొనసాగించకుండా మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా డీగ్రేడ్ చేశారన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వాటిని యూపీ పాఠశాలలుగా కొనసాగించక పోవడం చాలా అన్యాయమన్నారు. గవి మఠం భూముల వేలం రద్దు చేయాలి అనంతపురం అర్బన్: గవి మఠం భూముల వేలాన్ని రద్దు చేయాలని డీఆర్ఓ ఎ.మలోలకు సీపీఐ నాయకులు విన్నవించారు. ఈ మేరకు డీఆర్ఓని గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, తదితరులు కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం కొత్తకోట గ్రామంలో గవి మఠానికి సంబంధించి సర్వే నంబరు 590బి లో 12.5 ఎకరాలు, 835లో 39.63 ఎకరాలను 30 ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్నారన్నారు. దీనికి సంబంధించి గుత్త కూడా చెల్లిస్తున్నారన్నారు. పేదలు సాగు చేసుకుంటున్న ఈ భూములను శుక్రవారం వేలం వేసేందుకు దేవదాయ శాఖ సిద్ధపడిందన్నారు. భూములు వేలం వేస్తే సాగుదారులైన పేదల కుటుంబాలు వీధిపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని సాగులో ఉన్నవారికే భూములను క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చంద్రాయుడు, రామాంజినేయులు, సాగుదారులు పాల్గొన్నారు. -
వాళ్లకు వసూళ్లే ముఖ్యం.. మనతో ఏం పని!
టీడీపీలో పెల్లుబుకుతున్న అసమ్మతి ● ఇటీవల ‘అనంత మినీ మహానాడు’లో కార్యకర్త ఆత్మహత్యాయత్నం ● శింగనమల ఎమ్మెల్యే అవినీతిపై మంత్రికి ఓ తమ్ముడి ఫిర్యాదు ● గుంతకల్లు ఎమ్మెల్యే కుమారుడి దెబ్బకు ఒక కార్యకర్త ఆత్మహత్యాయత్నం ● హామీల అమలులో చేతులెత్తేసి అన్ని వర్గాలకూ ఇప్పటికే మోసం ● తమనూ దగా చేయడంపై ‘తమ్ముళ్లు’ రగిలిపోతున్న వైనం సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి నేడు మోసం చేయడంతో అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల తీరుతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఇదే క్రమంలో తమను అన్యాయం చేస్తున్నారంటూ సొంత పార్టీకి చెందిన ‘తమ్ముళ్లు’ కూడా అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నారు. కూటమి సర్కారులో ఎమ్మెల్యేల దెబ్బకు టీడీపీ కార్యకర్తలే కుదేలవుతున్నారు. పదకొండు నెలలు కూడా తిరక్కముందే ఎమ్మెల్యేలపై బహిరంగంగానే టీడీపీ కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటం కలకలం రేపుతోంది. అవినీతి, అక్రమాలు, కబ్జాలు, వసూళ్లతో తమను గాలికొదిలేశారని, పార్టీని గెలిపించి తప్పు చేశామంటుండటం గమనార్హం. ప్లాంట్ అప్పగించాలని వేధింపులు.. పెనుకొండ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ‘గ్రీన్టెక్’ పేరుతో ఓ వ్యక్తి రీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ నడుపుతున్నాడు. అయితే, ఈ ప్లాంటుపై కన్నేసిన మంత్రి సవిత తనకు అప్పగించాలంటూ నిర్వాహకుడిని భయపెట్టడం ప్రారంభించింది. కుటుంబానికి జీవనాధారమైన ప్లాంటును ఇవ్వాలనడంతో బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. చివరకు విధిలేని పరిస్థితుల్లో మంత్రి ఒత్తిడికి తట్టుకోలేక ఎంపీ పార్థసారధిని భాగస్వామిని చేసుకుని నడుపుకుంటున్నారు. ఉద్యోగులు.. అంగన్వాడీల పరిస్థితి ఘోరం గత ఎన్నికల ముందు ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలకు టీడీపీ నేతలు ఎన్నో హామీలుఇచ్చారు. తీరా ఇప్పుడు చూస్తే ఎమ్మెల్యేలు ఉద్యోగులను దారుణంగా చూస్తున్నారు. మొన్నటికి మొన్న మార్కెట్ యార్డులో ఓ ఉద్యోగిని ‘‘గాడిదలు కాస్తున్నావా’’ అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి అనడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఇక.. అంగన్వాడీ కార్యకర్తలు వేతనాల పెంపు కోసం ఇప్పటికే చలో విజయవాడ ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మిడ్ డే మీల్స్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరించి ఉద్యోగాలు పీకేస్తున్నారు. సీఐలు, తహసీల్దార్లను ఇంట్లో పనిమనుషులకంటే హీనంగా చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులను సైతం ఇష్టారాజ్యంగా తిడుతున్నారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్ పేరుతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. ‘నేను పార్టీకి ఎంతో కష్టపడి చేసినా న్యాయం చేయలేకపోయారు’ అంటూ మూడు రోజుల క్రితం అనంతపురంలో నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మినీ మహానాడు’ కార్యక్రమంలో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆయన పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. పట్టించుకునే దిక్కులేక ఆ కుటుంబం వీధిన పడింది. ఇలాంటి కుటుంబాలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలానే ఉన్నాయి. తన కుమారుడికి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తానని రూ.4 లక్షలు తీసుకుని మరొకరికి పోస్టు ఇవ్వడంతో గుంతకల్లుకు చెందిన టీడీపీ కార్యకర్త బోలే ఎల్లప్ప ఆత్మహత్యకు యత్నించాడు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తమ్ముడు గుమ్మనూరు నారాయణ.. బోలే ఎల్లప్ప కుమారుడు గిరీష్కు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఇస్తానని రూ.4 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత జయరాం కుమారుడు ఈశ్వర్.. గిరీష్ను తొలగించి మరొకరి దగ్గర రూ.8 లక్షలు తీసుకుని వేరొకరికి ఉద్యోగమిచ్చారు. దీంతో ఎల్లప్ప మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఈ మూడే కాదు.. ఉమ్మడి జిల్లాలో నేడు చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ‘శింగనమలలో వెస్ట్ నరసాపురం నుంచి గెలిచిన ఏకై క టీడీపీ ఎంపీటీసీ నా భార్య అంజనమ్మ. కానీ మాకు ఎమ్మెల్యే ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదు’ అంటూ టీడీపీ నేత ప్రసాద్ నాయక్ ఏకంగా ఇన్చార్జ్ మంత్రి టీజీ భరత్కు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే శ్రావణి ఎన్నిసార్లు వెళ్లినా పట్టించుకోలేదని, ఆమె తల్లి లీలావది షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతూ వసూళ్లకు పాల్పడుతోందంటూ మంత్రికి వివరించాడు. -
30 శాతం రాయితీతో కందులు, పెసలు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా 30 శాతం రాయితీతో కందులు, మినుములు, పెసలు, 50 శాతం రాయితీతో కొర్రలు, రాగులు ఇవ్వనున్నారు. ఈ మేరకు వాటి ధరలు, రాయితీలు ప్రకటించారు. విత్తన వరికి సంబంధించి జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం) అమలు చేస్తున్న జిల్లాల్లో క్వింటా వరి విత్తనాలపై రూ.వెయ్యి రాయితీ వర్తింపజేయగా, ఎన్ఎఫ్ఎస్ఎం అమలులో లేని జిల్లాల్లో రూ.500 రాయితీ ఇవ్వనున్నారు. అంటే క్వింటా 5,204 రకం వరి విత్తనాలు పూర్తి ధర రూ.4,300 కాగా ఎన్ఎఫ్ఎస్ఎం జిల్లాల్లో రూ.1,000 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.3,300 చెల్లించాలి. ఎన్ఎఫ్ఎస్ఎం లేని జిల్లాల్లో రూ.500 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.3,800 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఇక విత్తన కందులు క్వింటా పూర్తి ధర రూ.10,950 కాగా 30 శాతం అంటే రూ.3,285 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.7,665 ప్రకారం చెల్లించాలి. అలాగే మినుములు పూర్తి ధర రూ.13,800 కాగా అందులో 30 శాతం అంటే రూ.4,140 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.9,660 ప్రకారం చెల్లించాలి. పెసలు పూర్తి ధర రూ.13,500 కాగా అందులో 30 శాతం రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.9,450 ప్రకారం చెల్లించాలి. కొర్రలు క్వింటా పూర్తి ధర రూ.6 వేలు కాగా.. 50 శాతం రూ.3 వేలు రాయితీ పోనూ మిగతా రూ.3 వేల ప్రకారం చెల్లించాలి. రాగులు పూర్తి ధర రూ.6,900 కాగా అందులో రాయితీ పోనూ రూ.3,450 ప్రకారం చెల్లించాలి. కందులు, పెసరలు, మినుములు 4 కిలోల ప్యాకెట్ల రూపంలోనూ, కొర్రలు, రాగులు 2 కిలోల ప్యాకెట్ల కింద ఇవ్వనున్నారు. భూ విస్తీర్ణం బట్టి కందులు, పెసలు, మినుములు ఒక్కో రైతుకు గరిష్టంగా 10 బ్యాగులు, కొర్రలు 5 బ్యాగులు, రాగులు 6 బ్యాగులు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ, ఏపీ సీడ్స్ వర్గాలు తెలిపాయి. ఇక.. వేరుశనగకు సంబంధించి ఇంకా ధరలు, రాయితీ అధికారికంగా ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. వేరుశనగ క్వింటా రూ.9,300 కాగా అందులో 40 శాతం రాయితీ రూ.3,720 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,580 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. 50 శాతం రాయితీతో రాగులు, కొర్రలు విత్తన వరిపై రూ.500, రూ.వెయ్యి రాయితీ -
ప్రజా ప్రతినిధులా.. వీధి రౌడీలా?
అనంతపురం సిటీ: ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి ప్రసాద్ ప్రజా ప్రతినిధుల్లా కాకుండా వీధి రౌడీల్లా ప్రవర్తించడం దారుణమని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు విమర్శించారు. చైర్పర్స్న్ బోయ గిరిజమ్మ ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉండగా, ఆమె అనుమతి లేకుండా చాంబర్లోకి బలవంతంగా వెళ్లడాన్ని తప్పుబడుతూ అనంతపురం జెడ్పీ కార్యాలయం ఎదుట గల అంబేడ్కర్ విగ్రహం ఎదుట గురువారం నిరసన తెలిపారు. బీసీ కులానికి చెందిన బోయ గిరిజమ్మను అవమానించడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు జెడ్పీకి వచ్చారని బహుజన యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రచర్ల హరి దుయ్యబట్టారు. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మతో పాటు జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయవేదిక ప్రతినిధి కుళ్లాయప్ప, కనగానపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంకె లక్ష్మన్న, జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామాంజనేయులు, విద్యార్థి విభాగం ప్రతినిధులు గంగవరం శశి, నసనకోట ముత్యాలు, మాదాపురం అనిల్, ఉపాధ్యక్షుడు యోహాన్, ఏపీ కార్మిక సంఘం ప్రతినిధి నాగేంద్ర, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్, బేడ, బుడగ జంగాల జిల్లా అధ్యక్షుడు తాటికొండ నాగరాజు, ఏపీ ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లా అధ్యక్షుడు సాకే వన్నూరుస్వామి పాల్గొన్నారు. -
డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాల విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ (రెగ్యులర్ లాంగ్టర్మ్ ఇంటర్న్షిప్) ఫలితాలు విడుదలయ్యాయి. ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత గురువారం ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 6,361 మంది పరీక్ష రాయగా, 6,270 (98.57 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బీఏ కోర్సులో 346 మందికి గాను 339 మంది (97.98 శాతం), బీబీఏ కోర్సులో 530 మందికి గాను 521 (98.30 శాతం) మంది, బీసీఏలో 59 మందికి గాను 59 (100 శాతం) మంది, బీఎస్సీలో 1,809 మందికి 1,780 (98.40 శాతం), బీకాంలో 3,617 మందికి 3,571 (98.73 శాతం) ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి. లోకేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫలితాలకు జ్ఞానభూమి పోర్టల్లో చూడాలని కోరారు.వ్యవసాయ శాఖలో బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభంఅనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖలో బదిలీల ప్రక్రియ మొదలైంది. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో రెండు జిల్లాల జేడీఏలు ఉమామహేశ్వరమ్మ, సుబ్బారావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సుజాత, సూపరింటెండెంట్ ప్రభాకర్ సమక్షంలో గురువారం ఉదయం డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ (ఏఈఓ)కు కౌన్సెలింగ్ చేపట్టారు. ఇందులో 70 మందికి పైగా ఉద్యోగులు,సిబ్బంది పాల్గొన్నారు. జాబితాలు కమిషనరేట్కు పంపుతామని అధికారులు తెలిపారు. ఈనెల 26న అనంతపురంలో జోనల్ స్థాయిలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల అధికారులు, ఉద్యోగులు హాజరవుతారన్నారు. అన్ని విభాగాలకు సంబంధించి జూన్ 2 లోపు బదిలీ ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు.పశుశాఖలో 91 మందికి బదిలీలుజూన్ 2 లోపు ఉత్తర్వులుఅనంతపురం అగ్రికల్చర్: పశుసంవర్ధకశాఖలో ప్రస్తుతం జరుగుతున్న సాధారణ బదిలీల్లో 91 మందికి (ఉమ్మడి జిల్లావ్యాప్తంగా) స్థానచలనం ఉంటుందని ఆ శాఖ జేడీ డాక్టర్ జీపీ వెంకట స్వామి తెలిపారు. వీరందరూ ఒకే చోట ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారన్నారు. ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు, ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు, 20 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ (పశువైద్యులు).. ఉండగా ఇరువురు వెటర్నరీ లైవ్స్టాక్ ఆఫీసర్స్ (వీఎల్ఏ), 8 మంది జూనియర్ వెటర్నరీ ఆఫీసర్స్, 21 మంది లైవ్స్టాక్ అసిస్టెంట్స్, ముగ్గురు వెటర్నరీ అసిస్టెంట్స్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్స్, ఒకరు జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లు, మరో 23 మంది ఆఫీస్ సబార్డి నేట్స్ బదిలీ కానున్నట్లు తెలిపారు.వీరు కాకుండా రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ కింద మరికొందరు దరఖాస్తు చేసుకున్నారన్నారు. జిల్లా, జోనల్స్థాయిలో పరిశీలన చేపట్టి జాబితాలు కమిషన రేట్కు పంపుతామన్నారు. జూన్ 2 లోపు బదిలీ ఉత్తర్వులు వెలువడతాయని తెలిపారు.17 మండలాల్లో వర్షంఅనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 17 మండలాల పరిధిలో 5.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఉరవకొండ 30.2 మి.మీ, బెళుగుప్ప 23.8, శెట్టూరు 18.2, కణేకల్లు 17, కళ్యాణదుర్గం 16.4, వజ్రకరూరు 16.2, ఆత్మకూరు 12 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే డీ. హీరేహాళ్, రాయదుర్గం, శింగనమల, బ్రహ్మసముద్రం, కంబదూరు, గుంతకల్లు, విడపనకల్లు, కూడేరు, గుమ్మఘట్ట, గార్లదిన్నె తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. శుక్రవారం కూడా జిల్లాకు తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
అనంతపురం: ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఒక బీసీ మహిళ జెడ్పీ చైర్పర్సన్ హోదాలో ఉంటే కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ ధ్వజమెత్తారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లోకి ముగ్గురు ఎమ్మెల్యేలు చొరబడి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోను ధ్వంసం చేయడంపై నిరసన తెలిపారు. అప్రజాస్వామికంగా వ్యవహరించిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం టూటౌన్ పోలీస్స్టేషన్లో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్తో కలిసి గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ భేటీ బచావో..భేటీ పడావో అంటూ దేశంలో మహిళల సర్వతోముఖాభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే రాష్ట్రంలో మాత్రం మహిళలను అవమానపరుస్తున్నార న్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్ లోకి ఎమ్మెల్యేలు దౌర్జన్యంగా వెళ్లి ఆమె ప్రతిష్టను దెబ్బతీసే రీతిలో వ్యవహరించారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ అనుమతి లేకుండా చాంబర్లోకి వెళ్లి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో కిందపడేసి, ధ్వంసం చేశారని, సీఈఓను భయభ్రాంతులకు గురిచేశారని విమర్శించారు. జెడ్పీ సమావేశం జరుగుతుండగా, గందరగోళమైన పరిస్థితిని సృష్టించారన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా తలదించుకునే రీతిలో ప్రవర్తించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో పెట్టుకోవడం ఆమెకు ఉన్న హక్కు అని పేర్కొన్నారు. బోయ సామాజికవర్గానికి చెందిన గిరిజమ్మను అవమానపరిచే రీతిలో ప్రవర్తించడం చాలా బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలే దౌర్జన్యాలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. ఏకంగా జెడ్పీ చైర్పర్సన్నే అవమానానికి గురిచేయడం, వారి అనుచరులు మేయర్ వసీం సలీం చాంబర్లోనూ ఇదే తరహాలో ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు దాదు, జిల్లా సభ్యులు పావురాల జగదీష్, యువజన విభాగం నగర ఉపాధ్యక్షులు ఉదయ్, వినీత్, జనరల్ సెక్రెటరీ బిల్లే నాగార్జున, సెక్రెటరీలు వేణు, మైను, బ్రహ్మానంద రెడ్డి, వెంకట సుబ్బారావు, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, స్టేట్ స్పోక్ పర్సన్ సాకే చిరంజీవి, నాగార్జున నాయక్, గౌతమ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బీసీ మహిళ ప్రతిష్టకు భంగం కలిగించారు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ -
ప్రతి ఇంట్లోనూ అక్షరాస్యులే
ఉదయాన్నే పక్షుల కిలకిలరావాలు, ఆహారం కోసం అటు ఇటు తిరిగే సాధు జంతువులు.. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న చెట్లు, తోటలు, పంట చేలతో ఎంతో అందంగా ఆహ్లాదంగా ఉండే ఊరు. అక్కడ వాహనాల మోతలు వినిపించవు. వ్యవసాయ ఆధారత గ్రామంలో కల్మషం లేని రైతు బిడ్డలు సరస్వతీ పుత్రులుగా రాణిస్తున్నారు. పామిడి: మండలంలోని దేవరపల్లి గ్రామ ప్రజలు పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రధానంగా పత్తి, వేరుశనగ పంటలను పండిస్తున్నారు. దేవరపల్లి పంచాయతీ పరిధిలో మజారా గ్రామంగా ఓబుళాపురం కూడా ఉంది. ఈ గ్రామం కూడా పూర్తిగా వ్యవసాయాధిరతమే. రెండు గ్రామాల్లోనూ 3,200 మంది జనాభా ఉండగా... ప్రతి ఇంట్లోనూ అక్షరాస్యులే కనిపిస్తుంటారు. వీరిలో చాలా మంది టీటీసీ, డిగ్రీ, బీఈడీ, ఎంఈడీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు అభ్యసించి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వారూ ఉన్నారు. ఇటీవల కొందరు సివిల్స్కు సిద్ధమవుతున్నారు. మొత్తం 50 మందికి పైగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన వారు ఉన్నారు.స్థితిగతులు మార్చిన చదువుదశాబ్దాల క్రితం దేవరపల్లిలోనూ నిరక్షరాస్యత రాజ్యమేలింది. సంస్రదాయ వ్యవసాయంతో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు. ఈ క్రమంలోనే ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలు ఎక్కువ కావడం... కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో గ్రామస్తుల దృష్టి ఒక్కసారిగా చదువులపై పడింది. తమలా భవిష్యత్తులో పిల్లలు కష్టపడకూడదని భావించిన వారు.. పిల్లలను బడి బాట పట్టించారు. ఇది వారి స్థితిగతులను మార్చింది. నాడు ఒక్కరితో మొదలైన ప్రభుత్వ కొలువుల ప్రస్థానం నేడు పదుల సంఖ్యలో చేరుకుంది. కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే 50 మందికి పైగా స్థిరపడ్డారు. మరికొందరు రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ తదితర శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. ఇంజినీర్లుగా, సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. వృత్తి వ్యాపారాల్లోనూ రాణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకుని పంటల సాగు చేపట్టారు. పత్తి, వేరుశనగ, జొన్న, కొర్ర, పప్పుశనగ పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలతో ఆదర్శ జీవనం సాగిస్తున్నారు.గురువులే ఆదర్శంమా తల్లిదండ్రులకు పది మంది సంతానం కాగా, వీరిలో ఐదుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అందరిలోకి నేనే లాస్ట్. వ్యవసాయం ఒక్కటే మా జీవనాధారం. మా నాన్న నారప్ప అప్పట్లో గ్రామ సర్పంచ్గా పనిచేశారు. వ్యవసాయంలో నష్టాలు చూసి విసిగి పోయిన ఆయన చదువులు ఒక్కటే మా జీవితాలు మారుస్తాయని అనేవారు. అప్పట్లో మా ఊళ్లో పాఠాలు చెప్పేందుకు వచ్చే టీచర్లు పి.జయరాజు, టి.ఈశ్వరయ్య కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పారు. వారి స్ఫూర్తితోనే నేనూ ఎంఏ, ఎంఈడీ పూర్తి చేసి, ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాను. మా అక్క గౌరమ్మ, బావ, నా భార్య సైతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.– రామ్మోహన్, స్కూల్ అసిస్టెంట్, దేవరపల్లి గ్రామంఎంతో సంతృప్తినిస్తోందిమాది వ్యవసాయ కుటుంబమే. మా తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు సంతానం కాగా, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కరువు పరిస్థితుల వల్ల పంటల సాగులో నష్టాలు వచ్చేవి. దీంతో చదువులు ఒక్కటే మా జీవితాలు మారుస్తాయని నమ్మిన అమ్మ, నాన్న మమ్మల్ని బడి బాట పట్టించారు. ఎంఏ, ఎంఈడీ పూర్తి చేసి, ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాను. ఇది నాకెంతో సంతృప్తినిస్తోంది.– నారాయణస్వామి, దేవరపల్లి గ్రామం -
కుటుంబానికి చేదోడుగా ఉంటూ..
మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం కాగా, ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు కుమారులు ఉన్నారు. కుమారుల్లో నేనే పెద్దవాడిని. అమ్మ, నాన్న ప్రోత్సాహం.. గురువులు జయరాజు, ఈశ్వరయ్య స్ఫూర్తితో చదువులపై ఆసక్తి పెంచుకున్నా. ఓ వైపు వ్యవసాయ పనుల్లో అమ్మ, నాన్నకు తోడుగా ఉంటూనే మరోవైపు స్కూల్కు వెళ్లి వచ్చేవాడిని, ప్రాథమిక విద్యాభ్యాసం ముగిసిన తర్వాత దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పామిడిలోని పాఠశాలకు సైకిల్పై వెళ్లి వచ్చేవాడిని. పట్టుదలతో చదువుకుని ఎంఏ, బీఈడీ చేశాను. 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాను. నన్ను ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని చాలా మంది ఉపాధ్యాయ వృత్తిలోకి రావడం గర్వంగా ఉంది. – అనంతయ్య, విశ్రాంత టీచర్, దేవరపల్లి, పామిడి మండలం -
రేషన్ సక్రమంగా అందించాలి
‘క్లీన్ ఎయిర్’ పనులు పూర్తి చేయాలి అనంతపురం అర్బన్: నగర పరిధిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్సీఏపీ) కింద చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేపట్టిన మల్టీ లెవల్ పార్కింగ్ పనులు పది రోజుల్లో పూర్తవ్వాలన్నారు. రామ్నగర్ బ్రిడ్జి వద్ద గ్రీనరీ అభివృద్ధి, ఇతర పనులు పూర్తి చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, నాణ్యతా ప్రమాణాలు లేనట్లు తేలితే సంబంధిత అఽధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సమావేశంలో నగర పాలక కమిషనర్ బాలస్వామి, ఎస్ఈ చంద్రశేఖర్, డీటీసీ వీర్రాజు, ఈఈ షాకీర్ హుసేన్, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం అర్బన్: కార్డుదారులకు డీలర్లు రేషన్ సక్రమంగా అందించేలా చూడాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గురువారం సాయినగర్ లోని పలు చౌక దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, బియ్యం, తూకం తదితరాలను పరిశీలించారు. కార్డుదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ ఎలా చేస్తున్నారు... తూకం సరిగా ఇస్తున్నారా.. అని ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీజీఎస్ ఫీడ్బ్యాక్లో అనంతపురం అర్బన్లో ఎక్కువ మంది కార్డుదారులు బియ్యం నాణ్యత బాగా లేదని చెప్పారన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో తనిఖీ చేయడంతో పాటు లబ్ధిదారులతో మాట్లాడామన్నారు. అనంత పురం రూరల్, గుంతకల్లు మండలాల్లో బియ్యం తక్కువగా ఇస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దారు హరికుమార్, సీఎస్డీటీ రామకృష్ణ, వీఆర్ఓలు పాల్గొన్నారు. బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలి బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. ‘కిషోరీ వికాసం’లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కిషోరీ వికాసం’లో జూన్ 10 వరకు జరిగే సమ్మర్ స్పెషల్ క్యాంపెయిన్లో డీఆర్డీఏ పీడీ పాల్గొనాలని, బాల్యవివాహాలపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో గోడలపై పెయింటింగ్ వేయించాలని జెడ్పీ సీఈఓని ఆదేశించారు.గుత్తి, గుంతకల్లు ప్రాంతాల్లో ముస్లిం వర్గాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. మత పెద్దల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు మెమెంటో, ప్రశంసాపత్రాలను అందజేశారు. కలెక్టర్ వినోద్కుమార్ -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): వయసు మీరిపోతున్నా... పెళ్లి కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్నాటకలోని సండూరు తాలూకా తుమటి గ్రామానికి చెందిన గంగాధర్ (32) తోరనగల్లు సమీపంలోని జిందాల్ ఫ్యాక్టరీలో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులో మరో పని చేసుకునేందుకు వెళుతున్న ఇంట్లో చెప్పి నెల రోజుల క్రితం బయటకు వచ్చాడు. అనంతరం కుటుంబసభ్యులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆరా తీసినా ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం తుమటి గ్రామ శివారున కర్ణాటక సరిహద్దులోని డి.హీరేహాళ్ మండలం సిద్దాపురం గ్రామ శివారులో చెట్టుకు వేసుకున్న ఉరికి వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని గొర్రెల కాపరులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 20 రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. విచారణలో మృతుడిని గంగాధర్గా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించి నిర్ధారించారు. పెళ్లి ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరకపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతుడి తండ్రి సిద్ధేశ్వర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గురుప్రసాదరెడ్డి తెలిపారు.వ్యక్తి దుర్మరణంగుత్తి రూరల్: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (44) వ్యక్తిగత పనిపై గురువారం గుత్తికి వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. గుత్తి మండలం వన్నేదొడ్డి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో సహ ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.‘కేంద్రియ’లో ప్రవేశాలకు దరఖాస్తులుగుత్తి: పట్టణంలోని కేంద్రియ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరంలో 11వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మల్కీ సాబ్ తెలిపారు. స్థానిక విద్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 30 వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. టెన్త్లో మ్యాథ్స్, సైన్స్లలో 60 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. -
మెడికల్ కళాశాల అకౌంటెంట్పై ఫిర్యాదు
అనంతపురం: మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న మహిళా విద్యార్థినులకు సంబంధించిన మెస్ బిల్లులను నేరుగా సొంత ఖాతాలో జమ చేసుకున్న అకౌంటెంట్ వాణిపై కేసు నమోదు చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ .మాణిక్యరావు కోరారు. ఈ మేరకు అనంతపురం టూటౌన్ పోలీస్స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. హాస్టల్ బ్యాంకు ఖాతాకు కాకుండా తన వ్యక్తిగత ఫోన్పే నంబర్కు మెస్ బిల్లుల మొత్తాన్ని అకౌంటెంట్ జమ చేయించుకున్నాన్నారు. కొన్ని నెలలుగా మెస్బిల్లుల మొత్తం హాస్టల్ బ్యాంకు ఖాతాకు జమ చేయలేదన్నారు. ప్రొఫెసర్లు కమిటీ విచారణలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. డబ్బు తిరిగి చెల్లించేలా చూడాలని విన్నవించారు. -
అద్దె బస్సులపై ఆరా
● ఆర్టీసీ అధికారులు కళ్లు మూసుకున్నారా! ● ఏటా ఎంత నష్టమొచ్చిందో లెక్కలు తేల్చండి ● అద్దెబస్సుల టోల్ రాయితీ లెక్కగట్టే పనిలో విజి‘లెన్స్’ ● 2,788 అద్దెబస్సుల జాబితాను పరిశీలిస్తున్న అధికారులు ● నెలవారీ సమీక్షలో ఆరా తీసిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు అనంతపురం క్రైం: ఆర్టీసీలో అద్దె బస్సుల టోల్ చెల్లింపు రాయితీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారంపై ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. బుధవారం విజయవాడ బస్ భవన్లో నిర్వహించిన నెలవారీ సమీక్షలో అనంతపురం రీజియన్లో అద్దె బస్సుల టోల్ రాయితీ వ్యవహారం హాట్ టాపిక్గా నిలిచింది. సమీక్షకు హాజరైన అనంతపురం రీజియన్ సిబ్బంది, అధికారులు, యూనియన్ నేతల ద్వారా అంత్యంత విశ్వసనీయ సమాచారం ఇలా ఉంది... మంగళవారం ‘ఆర్టీసీలో అధికారులే టో(తో)లు తీశారు..’అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. రాష్ట్ర వ్యాఫ్తంగా అద్దె బస్సుల జాబితాను పరిశీలించాలని సూచించారు. డిపోల వారిగా అద్దె బస్సులు, వాటి రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ టెండరు నిర్వహణలో ప్రతి అంశాన్నీ పరిశీలించాల్సిన ఈడీ, ఆర్ఎం క్యాడర్ అధికారుల తప్పిదం ఇందులో స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు. అనంతపురం ఆర్టీసీ రీజియన్లో ఆరు నెలల క్రితమే ఈ విషయం బయటకు పొక్కినా సదరు అధికారులు ఎందుకు సీరియస్గా తీసుకోలేదని ఆరా తీసినట్లు తెలిసింది. కార్పొరేషన్కు రోజువారీ వస్తున్న నష్టాన్ని పూడ్చాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఒక్క అనంతపురం రీజియన్లోనే సుమారు రూ.5 కోట్లు నష్టపోయినట్లు తేలితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ నష్టం ఏమేరకు ఉంటుందో తక్షణం ఆరా తీయాలని సూచించినట్లు తెలిసింది. అద్దె బస్సుల యజమానులకు నోటీసుల జారీ రాష్ట్ర వ్యాఫ్తంగా నాలుగు జోన్ల పరిధిలో 2,788 అద్దె బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్సులు రోజువారీ ఎన్ని సింగిల్స్ తిరుగుతున్నాయి. ఎన్ని టోల్ గేట్లను దాటుకుని పోతున్నాయన్న దానిపై వివరాలు సేకరించాలని అకౌంట్స్ విభాగాలకు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలందినట్లు సమాచారం. తక్షణం అద్దె బస్సులు స్థానిక జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉంటే సదరు బస్సు యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఏదేమైనా ఇంత పెద్ద నష్టానికి కారకులైన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేక సర్దుకుంటారా? అన్నది తేలాల్సి ఉంది. టోల్ రాయితీ నష్టంపై విజి‘లెన్స్’ అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో అద్దె బస్సుల టోల్ రాయితీ పొందలేక పోవడానికి ప్రధాన కారణం లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడమే కారణమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు డిపోల వారీగా అద్దె బస్సుల వివరాలను సేకరించింది. ఈ మేరకు నివేదికను ఆర్టీసీ ప్రధాన కార్యాలయానికి పంపింది. కాగా ఎంత మేరకు నష్టం జరిగిందన్న వివరాలను ఇంకా సేకరిస్తున్నామని ఆర్టీసీ విజిలెన్స్ సీఐ విజయ్కుమార్ తెలిపారు. -
కలెక్టరేట్ మినహాయింపు కాదు కదా?!
అనంతపురం అర్బన్: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో కాలం చెల్లిన వాహనాలు, నిరుపయోగంగా ఉన్న సామగ్రిని వేలం వేయాలి’’ అని ఈ నెల 19న అధికారులను కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. వాస్తవానికి ఇతర కార్యాలయాల్లోని పరిస్థితి అటుంచితే... ఆయన ఆదేశాలు తొలుత కలెక్టరేట్ నుంచే మొదలుపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే కండిషన్లో ఉన్న వాహనాలను సైతం మూలకు వేసి కొత్త వాహనాలను వినియోగిస్తుండడంతో చివరకు అవి గుజరీకి కూడా పనికిరాకుండా పోయాయి. నాలుగు జీపులు, ఆరు అంబాసిడర్ కార్లు, ఒక సుమో, ఒక చవర్లెట్ ఐవరీ కారు ఇలా మొత్తం 12 వాహనాలు ‘తుక్కు’గా మారాయి. అలాగే కొత్త ఫర్నీచర్ వచ్చిందని అప్పటి వరకూ వినియోగించిన బీరువాలు, ర్యాక్లను ఆవరణలో పడేశారు. ఇందులో అత్యంత విలువైన స్టాంపింగ్ యంత్రం కూడా ఉంది. ఇవన్నీ ఎండకు ఎండి... వానకు తడిసి తప్పు పట్టిపోతున్నాయి. దీంతో ప్రక్షాళన అంటూ మొదలు పెడితే అది కలెక్టరేట్ నుంచే ప్రారంభం కావాలనే వాదన వినిపిస్తోంది. మరి ఆ దిశగా కలెక్టర్ చర్యలు చేపడతారో.. లేదో వేచి చూడాలి. -
ప్రాణం తీసిన అతివేగం
గుత్తి రూరల్: అతివేగం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో పెళ్లిబృందం కారును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికుమారుడితో సహా ఆరుగురుగాయపడ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రిలోని గాజులపాలెంకు చెందిన రాజేష్ వివాహం వజ్రకరూరులో గురువారం జరగనుంది. బుధవారం పెళ్లి కుమారుడు రాజేష్ బంధువులతో కలిసి ఇన్నోవా కారులో బయల్దేరారు. గుత్తి మండలం జక్కలచెరువు శివారు మలుపులో ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయిన ఇన్నోవా కారును రాజస్థాన్ నుంచి తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తాడిపత్రికి చెందిన కారు డ్రైవర్ జబ్బార్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లి కుమారుడు రాజేష్తో పాటు బంధువులు ఉమాదేవి, సరోజ, ఎన్.శ్రీనివాసులు, నారాయణమ్మ, శ్రీనివాసులు గాయపడ్డారు. వీరిని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉమాదేవి, నారాయణమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి పంపించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేష్ పరిశీలించి, కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో అటెండర్ దుర్మరణం గుంతకల్లు: రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ కార్యాలయ అటెండర్ షేక్ మహబూబ్బాషా (25) దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మోమినాబాద్కు చెందిన ఖాజా, మున్నీ దంపతుల కుమారుడు మహబూబ్బాషా ఆర్డీఓ కార్యాలయంలో అటెండర్ పని చేస్తున్నారు. ఇటీవలే డిప్యుటేషన్పై వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్గా బదిలీ అయ్యారు. రోజూ డ్యూటీకి ద్విచక్రవాహనంపై వెళ్లి వచ్చేవారు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్రవాహనంలో గుంతకల్లుకు బయల్దేరిన మహబుబ్బాషా మార్గమధ్యం కమలపాడు వద్ద వేగంగా వస్తున్న జీటీ ఆటో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆటో బోల్తా పడుటంతో గుంతకల్లులోని హౌసింగ్ బోర్డుకు చెందిన అబ్దుల్ రజాక్, అతని కూమరుడు రోషన్ గాయపడ్డారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మైమూన్ ఆస్పత్రికి వెళ్లి అటెండర్ మృతదేహానికి నివాళులర్పించారు. ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రమాదేవి మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
సబ్సిడీ బియ్యం పట్టివేత
రాప్తాడు: ప్రభుత్వం పేద ప్రజలకు సబ్సిడీపై అందిస్తున్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా దాడి చేసి స్వాఽధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ జమాల్ బాషా తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గార్లదిన్నెకు చెందిన శ్రీనివాసులు 65 క్వింటాళ్ల (140 బ్యాగులు) పీడీఎస్ బియ్యాన్ని కర్ణాటక రాష్ట్రంలోని బంగారు పేటకు లారీలో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని విజిలెన్స్ సీఐ జమాల్ బాషా, ఏఈ రవీంద్రనాథ్, సీఎస్డీటీ జ్యోతి తమకు అందిన సమాచారం మేరకు మండలంలోని గొల్లపల్లి దగ్గర లారీని ఆపి తనిఖీ చేశారు. బిల్లులు, రసీదులు లేకుండా తరలిస్తున్న 65 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రాప్తాడు సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్కు తరలించారు. -
బహిరంగచర్చకు ముఖం చాటేసిన కాలవ
ఎమ్మెల్యేలా.. వీధిరౌడీలా? అనంతపురం కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జిల్లాపరిషత్ కార్యాలయంలో వీధి రౌడీల్లా ప్రవర్తించారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు విమర్శించారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను తొలగించాలంటూ అధికారులపై హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడా లేదని పేర్కొన్నారు. అధికారులను బెదిరిస్తూ దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందనడానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యమని అభివర్ణించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఫొటోల కోసం పాకులాడటమేంటి? అనంతపురం కార్పొరేషన్: అభివృద్ధి మరచి ఫొటోల కోసం పాకులాడటం ఏంటని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్లో ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్ర బాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చర్యలను ఆయన ఖండిస్తూ బుధవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారన్నారు. జిల్లాలో హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటేవాటిపై పాలకులు నోరు మెదపకుండా దిగుజారుడు రాజకీయాలకు పాల్పడడం ఏంటని నిలదీశారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారన్నారు. ఉపాధి హామీ పనుల అవినీతిపై చర్చ జరిపిన పాపాన పోలేదన్నారు. ఓ బీసీ మహిళా ప్రజాప్రతినిధి చాంబర్లోకి వెళ్లి హంగామా చేయడమే కాకుండా జెడ్పీ సీఈఓపై దబాయించడమేంటన్నారు. హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి అనంతపురము సెంట్రల్: హెచ్చెల్సీ ఎస్ఈగా పురార్థనరెడ్డి నియమితులయ్యారు. నంద్యాల జిల్లా ఎస్ఆర్ బీసీ ప్రాజెక్ట్ సర్కిల్ –1 ఎస్ఈగా పని చేస్తున్న ఈయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా గత నెలాఖరులో హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ ఉద్యోగ విరమణ పొందారు. అయినప్పటికీ ఎస్ఈ నియామకం జరగక పోవడంతో ఈ నెల 13న ‘ప్రగతి తప్పిన హెచ్చెల్సీ’ శీర్షికన సాక్షిలో కథనం వెలువడటంతో ఉన్నతాధికారులు స్పందించి ఇన్చార్జ్ (ఎఫ్ఏసీ) ఎస్ఈగా పురార్థనరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉరవకొండ/ఉరవకొండ రూరల్: హంద్రీ–నీవా ప్రాజెక్టు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో.. ఏ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో అనే అంశంపై చర్చకు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విసిరిన చాలెంజ్ను ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ వై.శివరామిరెడ్డి స్వీకరించారు. బుధవారం ఆయన తన అనుచరులతో కలిసి ఉరవకొండలో ర్యాలీగా వెళ్లి క్లాక్టవర్ వద్దనున్న దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ చర్చ కోసం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హంద్రీ–నీవా శిలాఫలకాల ప్రాంగణం వద్దకు ఎమ్మెల్సీ తన అనుచరులతో వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు, అధికారులు తలుపులకు తాళం వేశారు. అయినా ఎమ్మెల్సీ వెనక్కు తగ్గలేదు. ప్రహరీ దూకి శిలాఫలకం వద్దకు చేరుకున్నారు. దాదాపు గంటకు పైగా వేచి చూసినా సవాల్ విసిరిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అక్కడకు రాలేదు. అనంతరం శివరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉరవకొండకు రాకుండా కాలవ శ్రీనివాసులు జీడిపల్లి రిజర్వాయర్ వద్ద చర్చకు రావాలంటూ కొత్త డ్రామాకు తెరదీయడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు మొదటి దశ పనులను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసి, జీడిపల్లి వరకు నీటిని తీసుకెళ్లారని గుర్తు చేశారు. 40 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టును చంద్రబాబు హయాంలో కుదించడానికి చర్యలు చేపట్టడంతో పాటు నిధులు విడుదల చేయలేదని, తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక హంద్రీ–నీవాను 6,300 క్యూసెక్యులకు పెంచి, రూ.9,318కోట్లు మంజూరు చేశారని జీఓ కాపీలు చూపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక హంద్రీ–నీవాను ఆదాయ వనరుగా భావించి 3,600 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను వెడల్పు చేయడానికి శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ఫోన్ చేసి బహిరంగ చర్చకు ఉరవకొండకు రావాలని ఆహ్వానించగా.. జీడిపల్లి వద్దకు రావాలని మెలిక పెట్టడం చూస్తే ఆయన సవాల్కు కట్టుబడి లేరని అర్థమైందని ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. హంద్రీ–నీవాపై మాట్లాడే దమ్ములేకే అని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ధ్వజం ఉరవకొండకు రమ్మంటే జీడిపల్లికి రావాలంటూ మెలిక పెట్టిన కాలవ -
జంట హత్యల కేసులో మరొకరు లొంగుబాటు
రాప్తాడు: జంట హత్యల కేసులో ఆరుగురు నిందితుల అరెస్టు తర్వాత.. తాజాగా మరొకరు కోర్టులో లొంగిపోయారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 17న రాప్తాడు మండలం గొల్లపల్లికి చెందిన రైతు చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతులపై టీడీపీ కార్యకర్తలు వేట కొడవళ్లు, కట్టెలతో దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి, మృతుడు నారాయణరెడ్డి కుమారుడు ప్రదీప్కుమార్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు ప్రత్యేక బృందాలతో వేట ప్రారంభించడంతో ఈ నెల 19న ఆరుగురు నిందితులు రాప్తాడుకు చెందిన పామల్ల ధనుంజయ, పామల్ల ఇంద్రశేఖర్, నీరుగంటి నిరంజన్రెడ్డి, దండు నరేంద్ర, గంగలకుంటకు చెందిన బుడగ లక్ష్మీనారాయణ, అనంతపురం రూరల్ మండలం కందుకూరుకు చెందిన దయ్యం హన్మంత్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నెల 20న వారిని రిమాండ్కు తరలించారు. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక పోలీసుబృందాలు గాలిస్తున్నాయి. హత్య జరిగిన సమయంలో గాయపడిన పామాల కొండప్ప అనే నిందితుడు అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగిలిన నలుగురు నిందితులు మొబైల్ ఫోన్లు స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం పోట్లమర్రికి చెందిన బాల నరసింహారెడ్డి బుధవారం కోర్టులో లొంగిపోయాడని సీఐ శ్రీహర్ష తెలిపారు. కోర్టు ఉత్వర్వుల మేరకు రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితులు రాప్తాడుకు చెందిన పామల్ల పండయ్య, పామాల్ల కొండప్ప, గొనిపట్ల శీనా, పాత్రికేయుడు గొల్లపల్లికి చెందిన పెద్దింటి జగదీష్ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. రాయదుర్గం విద్యార్థినికి ‘షైనింగ్ స్టార్’ అవార్డు రాయదుర్గంటౌన్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 587/600 మార్కులతో ప్రతిభ కనబరచిన రాయదుర్గం కేజీబీవీ విద్యార్థిని ఎన్.అక్షయ ‘షైనింగ్ స్టార్’ అవార్డుకు ఎంపికయ్యింది. బుధవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ అవార్డును అక్షయ అందుకుంది. గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రాన్ని అందజేసి కేజీబీవీ ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మితోపాటు విద్యార్థిని తల్లిదండ్రులు గంగమ్మ, మల్లికార్జునలను అభినందించారు. -
హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలపై పోరాడతాం
‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధమవుదాం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ పిలుపునిచ్చారు. అనంత మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కల్గిన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. మునిసిపాలిటీ, సర్పంచ్ ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువుందని, ఆ లోపు ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. ఏదైనా సమస్య ఎదురైతే నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుద్దామన్నారు. హంద్రీ–నీవా లైనింగ్ పనులను తక్షణం ఆపాలని, 10 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి తీసుకెళ్లేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించేలా పోరాడదామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అమరావతి జపం చేస్తూ.. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. విభజన హామీల్లో జిల్లాకు మంజూరైన ఎయిమ్స్ను గతంలో మంగళగిరికి తరలించారని, ఇప్పుడు రూ.లక్ష కోట్లతో అమరావతిని నిర్మిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వీటిపై అందరూ కలసికట్టుగా పోరాడదామన్నారు. అనంతరం సమన్వయకర్తలు మాట్లాడారు.అనంతపురం కార్పొరేషన్: ‘రాయలసీమ జిల్లాలకు కల్పతరువు లాంటి హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి.. కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో లక్షలాది మందికి అండగా ఉంటున్న ఆర్డీటీని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రజలకు అన్యాయం జరిగే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నా.. దానిపై వైఎస్సార్సీపీ పోరాడుతుంది’ అని ఎంపీ, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలోని ఓ హోటల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం జరిగింది. జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. హంద్రీ–నీవా, ఆర్డీటీ సమస్యలను జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉషశ్రీ చరణ్, సమన్వయకర్తలు రీజినల్ కో–ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ప్రధాన సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా డైవర్షన్ పాలిటిక్స్ మినహా ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటే.. ఇప్పుడు సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా సామర్థ్యాన్ని తగ్గించి, లైనింగ్ పనులను మొదలు పెట్టారన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో హంద్రీ–నీవా సామర్థ్యాన్ని పెంచేందుకు వీల్లేకుండా పోతుందన్నారు. రాయలసీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 రకాల సమస్యలను తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్కు సీఎం చంద్రబాబు తెర లేపారన్నారు. అందులో ఏ ఒక్క దాన్నీ నిరూపించలేకపోయారన్నారు. ప్రజలు కూడా కూటమి ప్రభుత్వ దుశ్చర్యలను గమనించాలన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అరాచక పాలన చేస్తే ప్రజల నుంచి ఏదో ఒక రోజు తిరుగుబాటు మొదలవుతుందని హెచ్చరించారు. డైవర్షన్ కోసమే.. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కూటమి ప్రభుత్వం మద్యం స్కాంను తెరపైకి తెచ్చిందని మిథున్రెడ్డి మండిపడ్డారు. దీనికి సంబంధించి ఒక్క రూపాయి కూడా సీజ్ చేయలేదన్నారు. రేషన్ షాపులను రద్దు చేస్తామంటూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నామన్నారు. సమావేశంలో అనంతపురం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి, హిందూపురం పార్ల మెంట్ పార్టీ పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి, సమన్వయకర్తలు డాక్టర్ సాకే శైలజానాథ్, వై.వెంకటరామిరెడ్డి, తలారి రంగయ్య, విశ్వేశ్వర రెడ్డి, మెట్టు గోవింద రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ఈరలక్కప్ప, దీపిక, మక్బూల్ అహ్మద్, మాజీ మంత్రి శంకర్ నారాయణ, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబ శివారెడ్డి, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ పంచా యతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడతాం ఎంపీ, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి -
మొత్తం ఖాళీలు 7,710
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేయడంతో జిల్లా అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లను వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేయనుండగా, ఎస్జీటీ కేడర్ టీచర్లను కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేసేలా షెడ్యూలులో పేర్కొన్నారు. అయితే మ్యానువల్గా నిర్వహిస్తారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుందని అధికారులు, సంఘాల నేతలు అంటున్నారు. ఇప్పటికే తప్పనిసరిగా బదిలీ అయ్యే హెచ్ఎంలు, టీచర్ల లెక్కలు తేల్చారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్–మండల పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ ఈ నాలుగు యాజమాన్యాల కింద జిల్లాలో మొత్తం 14,784 మంది అన్ని కేడర్ల టీచర్లు పని చేస్తున్నారు. ఆయా యాజమాన్యాల పాఠశాలల్లో ఏడు రకాల ఖాళీలను గుర్తించారు. మొత్తం 7,710 ఖాళీలను తేల్చారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 193, జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో 6,225, మునిసిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో 231, మునిసిపల్ స్కూళ్లలో 1,061 ఖాళీలున్నట్లు గుర్తించారు. ఏడు రకాల ఖాళీలు ఇలా... అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 5/8 ఏళ్లు పూర్తయిన హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల ఖాళీలు 3,826 ఉన్నాయి. రీ–అపోర్షన్ ఖాళీలు 2,913, స్పష్టమైన ఖాళీలు 942, ఫారెన్ సర్వీస్ కింద వెళ్లడంతో ఏర్పడిన ఖాళీలు 5, బాలికల పాఠశాలల్లో పురుష టీచర్లు పని చేస్తూ ఏర్పడిన ఖాళీలు 02, వివిధ డిగ్రీలు చేసేందుకు సెలవులో వెళ్లిన టీచర్ల స్థానాల్లో ఏర్పడిన ఖాళీలు 19, అనధికార గైర్హాజరుతో ఏర్పడిన ఖాళీలు 3 ఉన్నట్లు వెల్లడైంది. బదిలీల షెడ్యూలు ఇలా... హెచ్ఎంల బదిలీలకు సంబంధించి గురువారం ఆన్లైన్ దరఖాస్తు, పరిశీలన, 24న ప్రొవిజనల్ సీనియార్టీ జాబితా, 25న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 26న అభ్యంతరాల పరిష్కారం, 27న ఫైనల్ సీనియార్టీ జాబితా విడుదల, 28న వెబ్ ఆప్షన్స్, 30న బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు. అదేరోజు స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెచ్ఎంల పదోన్నతుల వెబ్ ఆప్షన్, కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. వీరికి 31న పదోన్నతల ఉత్తర్వుల జారీ ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ కేడర్కు సంబంధించి... 24 వరకు ఆన్లైన్ దరఖాస్తు. 25–దరఖాస్తుల పరిశీలన. 26,27 తేదీల్లో ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా ఆన్లైన్ ప్రదర్శన, 28న అభ్యంతరాల స్వీకరణ, 28,29 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం, 31న ఫైనల్ జాబితా ప్రకటన, జూన్ 1,2 తేదీల్లో వెబ్ ఆప్షన్, 4న బదిలీ ఉత్తర్వుల జారీ. 05న ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు వెబ్ ఆప్షన్లు, కౌన్సెలింగ్, 06న పదోన్నతుల ఉత్తర్వుల జారీ. ఎస్జీటీ కేడర్కు సంబంధించి... ఈనెల 27 వరకు ఆన్లైన్ దరఖాస్తు. 28–దరఖాస్తుల పరిశీలన. 31న ప్రొవిజినల్ సీనియార్టీ జాబితా ఆన్లైన్ ప్రదర్శన, జూన్ 01న అభ్యంతరాల స్వీకరణ, 01,02 తేదీల్లో అభ్యంతరాల పరిష్కారం, 06న ఫైనల్ జాబితా ప్రకటన, 07 నుంచి 10 వరకు తేదీల్లో వెబ్ ఆప్షన్, 11న బదిలీ ఉత్తర్వుల జారీ. వీరికి మ్యానువల్ కౌన్సెలింగ్ ఉన్నా ఈ షెడ్యూలు మేరకే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. టీచర్ బదిలీల ప్రక్రియ వేగవంతం 30న హెచ్ఎంల బదిలీల ఉత్తర్వులు జూన్ 4న స్కూల్ అసిస్టెంట్, 11న ఎస్జీటీలకు.. -
మెగా సప్లిమెంటరీ ఫలితాలొచ్చేశాయ్
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన డిగ్రీ మెగా సప్లిమెంటరీ (ఇయర్లీ వైజ్) ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత బుధవారం ఫలితాలను వెల్లడించారు. ఫలితాల కోసం జ్ఞానభూమి పోర్టల్లో చూడాలని సూచించారు. గతేడాది అక్టోబర్లో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ కోర్సుల్లో 99 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, బీఏ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలనూ విడుదల చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ జి. వెంకటనాయుడు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, పీఆర్వో ప్రొఫెసర్ కే.రాంగోపాల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి. లోకేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బెంగళూరు–బీదర్ మధ్య ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బెంగళూరు–బీదర్ మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22, 24, 26వ తేదీల్లో బెంగళూరు జంక్షన్ (06589)లో రాత్రి 9.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు బీదర్ జంక్షన్ చేరుతుందన్నారు. అదేవిధంగా ఈ నెల 23, 25, 27వ తేదీల్లో బీదర్ జంక్షన్ (06590)లో మధ్యాహ్నం 12.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజూమున 3 గంటలకు బెంగళూరు జంక్షన్కు చేరుతుందన్నారు. యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూర్, కృష్ణ, యాదగిరి, షాహబాద్, కలబురిగి, హోమ్నాబాద్ మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు. 3–ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఫార్మసీ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జి. నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలకు జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ శంకర్ శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న వర్షాలు అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు పలు మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. శింగనమల, నార్పల, అనంతపురం, రాయదుర్గం, శెట్టూరు, డీ.హీరేహాళ్, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, కంబదూరు, ఉరవకొండ, విడపనకల్లు, బ్రహ్మసముద్రం, కణేకల్లు, పెద్దపప్పూరు, గుత్తి, యాడికి, కూడేరు, బుక్కరాయసముద్రం, వజ్రకరూరు, కుందుర్పి తదితర మండలాల్లో వర్షం పడింది. కాగా గురువారం కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
25న సివిల్స్ ప్రిలిమినరీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 25న జరగనుందని కలెక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు.చీనీ టన్ను రూ.42 వేలు అనంతపురం మార్కెట్యార్డులో బుధవారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.42 వేలు పలికాయి. గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025అనంతపురం సిటీ: ‘విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం తారస్థాయికి చేరింది. ఉన్నతాధి కారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పేదల ప్రాణాలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు ధనదాహంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి’ అంటూ జెడ్పీ సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయ సమావేశ భవన్లో ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, శ్రీసత్యసాయి జిల్లా జేసీ అభిషేక్ కుమార్, సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, అనంతపురం,మడకశిర, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. ముందుగా భారత్–పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీనాయక్ సహా ఇతర సైనికుల ఆత్మ శాంతి కోసం మౌనం పాటించారు. ఆ తరువాత సభను చైర్పర్సన్ గిరిజమ్మ కొనసాగించారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ సహా అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, విడపనకల్లు, శెట్టూరు జెడ్పీటీసీ సభ్యులు జూటూరు చంద్రకుమార్, నీలం భాస్కర్, వాసల్లి హనమంతు, మంజునాథ, వజ్రకరూరు ఎంపీపీ రమావత్ దేవి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాతో పాటు కడప, కర్నూలు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల వారికి అనువైన అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సరిగా అందుబాటులో ఉండడం లేదన్నారు. కర్నూలు లేదా బెంగళూరుకు రెఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. వైద్యులు చాలా మంది ప్రభుత్వ సొమ్మును జీతంగా తీసుకుంటూ ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారన్నారు.సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అసమర్థత, నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, కొన్నేళ్లుగా పాతుకుపోయి మామూళ్ల మత్తుకు అలవాటుపడి ఆస్పత్రి పరువు తీస్తున్నారని, వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖమంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇటీవల ఓ రోగిని అనంతపురం శివారులోని సవీరా ఆస్పత్రికి తీసుకెళ్లగా స్టంట్ వేయాలని, అందుకు రూ. లక్షలు ఖర్చవుతుందంటూ అక్కడి వైద్యులు తెలిపారని, అయితే రోగిని బెంగళూరుకు తరలించి టెస్ట్ చేయించగా ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని చెప్పారని సభ్యులు పేర్కొన్నారు. అవసరం లేకపోయినా ఆపరేషన్లు, స్టంట్లు వేస్తూ సవీరా యాజమాన్యం రోగులను దోచుకుంటోందని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ, ఆ తరువాత వెళ్లిపోతుండటంతో అత్యవసర కేసులకు దిక్కులేకుండా పోతోందన్నారు. విడపనకల్లు మండలంలో తొమ్మిదేళ్ల బాలిక ప్రమాదానికి గురి కాగా, ప్రాణాపాయ స్థితిలో స్థానిక పీహెచ్సీకి తరలిస్తే.. ఒక్కరంటే ఒక్కరూ అందుబాటులో లేరని జెడ్పీటీసీ సభ్యుడు హనుమంతు ఆరోపించారు. బళ్లారికి తరలించేలోపే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ సవీరా ఆస్పత్రిలో జరిగే వ్యవహారాలపై కలెక్టర్ దృష్టి పెట్టాలని సూచించారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. సర్వజనాస్పత్రిలో పరిస్థితి గాడిన పడుతోందని, రోజూ 2 వేల నుంచి 2,500 వరకు రోగులు వస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ జోక్యం చేసుకుంటూ పేదల ప్రాణాలతో చెలగాటమాడే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ మాట్లాడుతూ సర్వజనాస్పత్రితో పాటు పీహెచ్సీ, సీహెచ్సీలను కూడా రాత్రిళ్లు తనిఖీ చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్, డీఎంహెచ్ఓలను ఆదేశించారు. తాను ఇటీవల కొన్ని గిరిజన ప్రాంతాల్లో పర్యటించానని, దయనీయ పరిస్థితి ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. ‘ఉపాధి’లో భారీగా అక్రమాలు ఉపాధి హామీ పథకం అమలులో విపరీతంగా అక్రమాలు జరుగుతున్నాయని సభ్యులు ఆరోపించారు. నిధులను ఎవరు మెక్కుతున్నారో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో కోరారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ సలీం బాషాను కలెక్టర్ ఆదేశించారు. జెడ్పీలో అతిథి గృహాలు లేక మహిళా జెడ్పీటీసీలు, ఎంపీపీలు అవస్థలు పడుతున్నారని కంబదూరు జెడ్పీటీసీ సభ్యుడు గుద్దెళ్ల నాగరాజు ఆవేదన వ్యక్తం చేయగా.. తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. 8లోన్యూస్రీల్ఉమ్మడి జెడ్పీ సమావేశంలో సభ్యుల నిలదీత వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో దయనీయ పరిస్థితులు అనంతపురం సర్వజనాస్పత్రిలో వైద్యులు, నర్సులు, సిబ్బంది ఇష్టారాజ్యం గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం ఆరోగ్యశ్రీ బాధితులను హడలెత్తిస్తున్న సైబర్ నేరగాళ్లు చిన్న సమస్యతో సవీరాకు వెళ్లినా ఆపరేషన్లు, స్టంట్లు అంటూ ప్రాణాలతో చెలగాటం ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం ఏం చేస్తోందంటూ సభ్యుల ధ్వజం -
మహాత్మా.. వారికి మంచి బుద్ధి ప్రసాదించు!
అనంతపురం సిటీ: మడకశిర, కళ్యాణదుర్గం, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి ప్రసాద్కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు శాంతియుత నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రధానమైన సమస్యలపై చర్చ జరుగుతున్న సందర్భంలో ముగ్గురు ఎమ్మెల్యేలు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ చాంబర్లోకి ఎటువంటి ముందస్తు అను మతి లేకుండా వెళ్లడమే కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించిన తీరుపై జెడ్పీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపినట్లు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తెలిపారు. చైర్పర్సన్ చాంబర్లోకి వెళ్లి రచ్చ చేసి.. జాతిపిత మహాత్ముడి చిత్రపటాన్ని తొలగించి సీఎం చంద్రబాబు ఫొటో పెట్టడం, మాజీ సీఎం జగన్ ఫొటో పూర్తిగా తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఏదైనా అభ్యంతరం ఉంటే జెడ్పీ సమావేశంలో చైర్పర్సన్ గిరిజమ్మ, కలెక్టర్ వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లకుండా.. అధికారం అండతో దౌర్జన్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. సీఈఓను ఏకవచనంతో దూషించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా.. సమావేశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. -
ఎట్టకేలకు మొదలైన విత్తనశుద్ధి
అనంతపురం అగ్రికల్చర్: ఎట్టకేలకు విత్తన వేరుశనగ పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టారు. ఖరీఫ్ సమీపిస్తున్నా రైతుల కష్టాలు కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని, వ్యవసాయఽశాఖ మొద్దునిద్ర వీడటం లేదని ‘సాక్షి’లో ఇటీవల వరుసగా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో 40 శాతం మేర రాయితీ, అమ్మకం ధరలు ఇంకా అధికారికంగా ప్రకటించక మునుపే బుధవారం విత్తనశుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికంగా ఉన్న విజయా ఆగ్రోసీడ్స్ ప్లాంట్లో ఏడీఏ ఎం.రవి ఆధ్వర్యంలో విత్తనశుద్ధిని ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనం అందించడానికి వీలుగా ప్రాసెసింగ్ చేయాలని ఏడీఏ ఆదేశించారు. ప్రాసెసింగ్ పూర్తయిన వెంటనే ఆర్ఎస్కేలకు సరఫరా చేయాలని సూచించారు. జూన్ మొదటి వారంలో విత్తన పంపిణీ మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ! విత్తన వేరుశనగపై 40 శాతం రాయితీ వర్తింపజేసినట్లు సమాచారం. అలాగే క్వింటా విత్తన వేరుశనగ పూర్తి ధర రూ.9,300 ప్రకారం ఖరారు చేసినట్లు తెలిసింది. దీనిపై అటు వ్యవసాయశాఖ, ఇటు ఏపీ సీడ్స్ అధికారులు మాత్రం అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇక.. కందులు, చిరుధాన్యాల ధరలు కూడా ఖరారు కాలేదు. జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తన కేటాయింపులు, ధరలు, రాయితీలు ప్రకటించి 15 రోజులు కావొస్తున్నా.. ఒక్క క్వింటా కూడా సరఫరా కాకపోవడం విశేషం. -
ఆర్టీసీ అధికారులపై కలెక్టర్ సీరియస్
అనంతపురం క్రైం: కలెక్టర్ వినోద్కుమార్ ఎట్టకేలకు స్పందించారు. ఆర్టీసీ బస్టాండ్తో పాటు డిపో, పరిసరాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ప్రతి సమస్యనూ అడిగి తెలుసుకుని ఏళ్ల తరబడి పట్టించుకోకుండా అలాగే ఎందుకు వదిలేశారంటూ సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపో లోపల డ్రెయినేజీ కాలువ మొత్తం చెత్తతో నిండి కంపుకొడుతున్న విషయాన్ని గుర్తించి వెంటనే జేసీబీలను రప్పించి శుభ్రం చేయించారు. బస్టాండు ప్రధాన ద్వారం వద్ద పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. బస్టాండు ఆవరణమంతా గుంతల మయంగా మారి వర్షపు నీరు నిండి ఉండటాన్ని గమనించి మట్టితో గుంతలను పూడ్చాలని సూచించారు. ఫ్లాట్ఫాంల వద్ద ప్రయాణికులను కలసి సమస్యలపై ఆరా తీశారు. ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించక పోతే ఎలా అని ప్రశ్నించారు. అధిక ధరలకు స్నాక్స్ విక్రయిస్తున్న రెండు దుకాణాలను గుర్తించి రూ.25 వేలు జరిమానా విధించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ప్రతి స్టాల్ నిర్వాహకుడు తప్పనిసరిగా దుకాణం ముందు డస్ట్బిన్ను ఏర్పాటు చేయకపోతే జరిమానా విధించాలన్నారు. ఇకపై పరిస్థితుల్లో మార్పురాకపోతే చర్యలు తప్పవని ఆర్టీసీ అధికారులను హెచ్చరించారు. -
కలెక్టరేట్ ఎదుట 102 వాహన డ్రైవర్ల ధర్నా
అనంతపురం అర్బన్: వేతన బకాయిలు చెల్లించడంతో పాటు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలంటూ కలెక్టరేట్ ఎదుట తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ (102 వాహనాలు) డ్రైవర్ల మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నగేష్ మాట్లాడారు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లుగా 500 మంది అరబిందో సంస్థ ద్వారా ఆరోగ్యశాఖకు సేవలందిస్తున్నారన్నారు. ఏడేళ్లుగా తమకు కేవలం రూ.8,800 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, గత మూడు నెలలుగా అదీ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీటీసీ పేరిట యాజమాన్యం కట్టాల్సిన పీఎఫ్ వాటానూ ఉద్యోగుల నుంచే మినహాయిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. వేతనాన్ని పెంచి ప్రతి నెలా రూ.18,500 కచ్చితంగా ఇవ్వాలన్నారు. తన వాటా పీఎఫ్ను యాజమాన్యమే చెల్లించాలన్నారు, చట్టప్రకారం సెలవులు అమలు చేయాలన్నారు. ఆరోగ్యబీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రమాదంలో మరణిస్తే ఎక్స్గ్రేషియా రూ.7 లక్షలు చెల్లించాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్కు అందజేశారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు సాయిచరణ్, కోశాధికారి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. ● డీఎంఈ నరసింహం -
‘సూపర్’ సేవలు మెరుగు పడాలి
అనంతపురం మెడికల్: జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో స్పెషాలిటీ సేవలు మరింత మెరుగుపడాలని సంబంధిత వైద్యాధికారులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం సూచించారు. మంగళవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. రోగులకందుతున్న సేవలు, రోజూ ఎన్ని శస్త్రచిక్సితలు చేస్తున్నారు, తదితర అంశాలపై ఆరా తీశారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, ఆ దిశగా వారిలో నమ్మకం కల్గించేలా చూడాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ పనులు వేగవంతం చేసి త్వరలో అందుబాటులో తీసుకురావాలని ఏపీఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల వైద్యులతో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరూ రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రధానంగా సమయపాలన పాటించాలన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం బోధనాస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు వినతి పత్రం అందించారు. పరికరాలు, ప్రత్యేక బడ్జెట్ను కేటాయించేలా చూడాలని కోరారు. వ్యక్తిపై కేసు నమోదు గార్లదిన్నె: ప్రధాని నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ... కల్లూరుకు చెందిన మహబూబ్బాషా సోషల్ మీడియాలో దేశ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టాడన్నారు. దీనిపై ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. రేషనలైజేషన్తో తీవ్రంగా నష్టపోతున్నాం అనంతపురం అర్బన్: ప్రభుత్వం చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా తీవ్రంగా నష్టపోతామని సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ వి.వినోద్కుమార్ను మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ వద్ద అసోషియేషన్ ఆఫ్ సెక్రటరీయేట్ రాష్ట్ర అధ్యక్షుడు సల్మాన్ బాషా, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మైలారప్ప, పవన్కుమార్, ఉపాధ్యక్షుడు అఖిల్కుమార్, తదితరులు కలిసి వినతిపత్రం అందజేసి సమస్య వివరించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అన్ని శాఖల్లో విలీనం చేసి ప్రమోషన్ ఛానల్ కల్పించాలని ప్రభుత్వం చేపడుతున్న రేషనలైజేషన్ ప్రక్రియ ద్వారా చాలా నష్టపోతామన్నారు. ఈ ప్రక్రియలో రెండు లేదా మూడు సచివాలయాలను క్లస్టర్గా చేస్తున్నారన్నారు. దీంతో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, మైనర్ ఇరిగేషన్, పంచాయతీ ఇలా అన్ని శాఖల పనులు ఒకేసారి చేయాల్సి వస్తుందన్నారు. దీంతో ఒత్తిడి పెరిగి పనిలో నాణ్యత లోపిస్తుందన్నారు. ఈ క్రమంలో చోటు చేసుకునే తప్పిదాలకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు బాధ్యులవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు శ్రీకాంత్, కులశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విచారణకు 33 మంది ఎల్టీల హాజరు అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాల(జీఎంసీ)లో ల్యాబ్ టెక్నీషియన్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం చేపట్టారు. బోధనాస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సంబంధించి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. 35 మందికి గాను 33 మంది హాజరయ్యారు. విచారణ కమిటీ సభ్యులుగా డాక్టర శ్యామ్, డాక్టర్ రామస్వామి, డాక్టర్ ఆది నటేష్ వ్యవహరించారు. -
బదిలీల గోలలో విత్తన పంపిణీ ఆలస్యం
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ ముంచుకొస్తున్నా ఇప్పటికీ విత్తన ప్రణాళిక అమలుకు నోచుకోలేదు. విత్తన సేకరణ, విత్తనశుద్ధి, సరఫరా, పంపిణీ చురుగ్గా కొనసాగాల్సివుండగా... ప్రస్తుతానికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ క్రమంలోనే వ్యవసాయ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభం కావడంతో విత్తన పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మండల వ్యవసాయాధికారులు (ఎంఏఓలు), వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ) విత్తన పంపిణీలో కీలకం. గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) అసిస్టెంట్లు భాగస్వాములు కావాలి. అయితే, ఏఓలు, ఏఈఓలు పెద్ద సంఖ్యలో బదిలీలు అవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖలో అన్ని విభాగాల పరిధిలో ఒకే స్థానంలో ఐదేళ్లు సర్వీసు పూర్తీ చేసుకున్నవారు ఏకంగా 144 మంది ఉన్నారు. వీరందరికీ తప్పనిసరిగా స్థానచలనం తప్పదు. ఈ క్రమంలో తమనూ బదిలీ చేయాలంటూ మరికొందరు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో వ్యవసాయశాఖలో భారీ ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి. ఇబ్బందులు తప్పవు.. ఎటూ బదిలీ కాక తప్పదనే ఆలోచనతో చాలా మంది ఏఓలు, ఏఈఓలు విత్తన పంపిణీ పక్రియ బాధ్యతలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. బదిలీల ప్రక్రియ జూన్ 2న ముగియనుండటంతో అంతవరకు విత్తన పంపిణీ ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు తీసుకున్న తర్వాతనే విత్తన పంపిణీలో భాగస్వాములు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాడిపత్రి, మడకశిర, ధర్మవరం పెనుకొండ, కదిరి ఏడీఏలతో పాటు ‘ఆత్మ’ ఏడీఏ కూడా బదిలీ కానున్నారు. 31 మంది ఏఓలు, 78 మంది ఏఈఓలు, మినిస్టీరియల్ స్టాఫ్ 20 మంది మారిపోనున్నారు. బదిలీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున విత్తన పంపిణీ ఆలస్యం కావడంతో పాటు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వ్యవసాయశాఖతో పాటు ఉద్యాన, ఏపీఎంఐపీ, మార్కెటింగ్, పట్టు, పశుసంవర్ధక, మత్స్యశాఖలో కూడా బదిలీల కోలాహలం మొదలైంది. సిఫారసు లేఖల కోసం ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కోరుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిసింది. వ్యవసాయ శాఖలో 144 మందికి స్థానచలనం విత్తన పంపిణీపై దృష్టి సారించని వైనం -
టీచర్ల బదిలీలకు వేళాయె
● నేటి నుంచి హెచ్ఎంల బదిలీలు అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, కార్పొరేషన్, మునిసిపాలిటీ యాజమాన్యాల స్కూళ్లల్లో మొత్తం 14,784 మంది హెచ్ఎంలు, టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో 375 మంది ప్రధానోపాధ్యాయులు, 329 మంది పీఎస్హెచ్ఎంలు, 6,850 మంది స్కూల్ అసిస్టెంట్లు, 7,230 మంది ఎస్జీటీ కేడర్ ఉపాధ్యాయులున్నారు. ముందుగా బుధవారం నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు తెలిపారు. హెచ్ఎం పోస్టులు 178 ఖాళీలుఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ కార్పొరేషన్తో పాటు మునిసిపాలిటీ యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న గ్రేడ్–2 హెచ్ఎంలు ఈనెల 31 నాటికి 5 ఏళ్లు సర్వీస్ పూర్తయ్యే వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థన బదిలీ కోరుకునేవారు (ప్రస్తుతం పని చేస్తున్న స్కూల్లో రెండేళ్లు పూర్తయి ఉండాలి) కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. -
రైతులపై చంద్రబాబు సర్కార్కు కాసింతైనా కనికరం లేకుండా పోతోంది. వారి పట్ల అంతులేని చులకనభావం ప్రదర్శిస్తోంది. జిల్లాలో అరకొరగా వరిధాన్యం సేకరణ చేపట్టి అంతటితోనే సరిపెట్టింది. దీంతో రైతుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
బొమ్మనహాళ్ వద్ద వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ట్రాక్టర్లో లోడ్ చేస్తున్న దృశ్యం (ఫైల్)రాయదుర్గం: జిల్లావ్యాప్తంగా గత రబీలో 4,528 హెక్టార్లలో వరి పంట సాగైంది. ఇందులో కణేకల్లు, బొమ్మనహాళ్, డీ హీరేహాళ్ మండలాల్లోని హెచ్ఎల్సీ ఆయకట్టు భూముల్లోనే 3 వేల హెక్టార్లకు పైగా సాగు చేశారు. ఈ క్రమంలో 29,960 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే, పంట కోతకొచ్చే ముందు ఈదురుగాలులు, వడగండ్ల వాన కారణంగా పంట దెబ్బతిని కేవలం 18 వేల మెట్రిక్ టన్నులే దిగుబడి వచ్చింది. 3,900 మెట్రిక్ టన్నులతో సరి.. ‘పండించిన ప్రతి ధాన్యం గింజనూ మద్దతు ధరతో కొంటాం. తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటాం’ అంటూ సీఎం చంద్రబాబు పలు సభలు, సమావేశాల్లో ప్రగల్బాలు పలికారు. అయితే ఆయన మాటలకు, క్షేత్రస్థాయిలో చేతలకు పొంతనే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం జిల్లాలో ఏడు చోట్ల ఆర్భాటంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. కేవలం 3,900 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో సరిపెట్టడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో జిల్లాలో రైతుల వద్ద ఇంకా సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉండిపోయింది. కొందరు దళారులకు అమ్ముకుంటుండగా.. చాలామంది ప్రభుత్వం ఇంకా సేకరిస్తుందేమోననే ఆశతో కల్లాల్లోనే ధాన్యం రాశులను కుప్పపోశారు. వరుణుడి భయం.. సాధారణంగా మేలో భానుడు భగభగ మండిపోతాడు. అయితే ప్రకృతి మార్పుల కారణంగా కొన్ని రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కల్లాల్లో ధాన్యం రాశులున్న అన్నదాతలు కలవరపాటుకు గురవుతున్నారు. కణేకల్లు ప్రాంతంలో ఇటీవల వర్షాలకు ధాన్యం తడిసిపోవడం గమనార్హం. ఇంకా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు అధికారులు చెబుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన అధికమవుతోంది. అదనంగా మరో 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా వీలైనంత త్వరగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరి రైతు ఘోష 3,900 మెట్రిక్ టన్నుల సేకరణతో సరిపెట్టిన కూటమి సర్కార్ మరో 3 వేల టన్నులు కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ ఇంకా కల్లాల్లోనే ధాన్యం రాశులు అన్నదాతలను భయపెడుతున్న వర్షాలు స్పందించని చంద్రబాబు ప్రభుత్వం -
శ్రీగంధం అలంకరణలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారు మంగళవారం శ్రీగంధం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేకువ జామునే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీగంధం అలంకరణలో తీర్చిదిద్ది భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ యాగశాలలో సుందరకాండ, మన్యుసూక్త వేద పారాయణం, శ్రీరామ ఆంజనేయ మూలమంత్ర అనుష్టానాల అనంతరం మన్యుసూక్త హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తిని ఆలయ ముఖ మండపంలో కొలువుదీర్చి సింధూరంతో లక్షార్చన చేపట్టారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా జరగాలి అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరం మారుతి నగర్లోని కేశవరెడ్డి స్కూల్లో సప్లిమెంటరీ పరీక్షలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 42 కేంద్రాలు ఏర్పాటు చేశారని, 11,124 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ఆదేశించారు. మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఈఓ ప్రసాద్ బాబు, తహసీల్దార్ హరికుమార్ ఉన్నారు. టీబీ డ్యాంకు 6,261 క్యూసెక్కుల ఇన్ఫ్లో బొమ్మనహాళ్: తుంగభద్ర రిజర్వాయర్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి 6,261 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండి నీటి నిల్వ 9 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర జలాశయం ఎగువ భాగంలోని ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద డ్యాంలోకి వచ్చి చేరుతోంది. మంగళవారం డ్యాంలో 1,633 అడుగులకు గాను 1,587.07 అడుగులకు నీటి మట్టం చేరింది. అవుట్ఫ్లో 2,139 క్యూసెక్కులుగా నమోదైంది. ఏపీ ఐసెట్లో 93 శాతం ఉత్తీర్ణత అనంతపురం: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్–2025 ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో మొత్తం 3,026 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,781 మంది పరీక్ష రాయగా, 2,590 మంది అర్హత సాధించారు. పురుషులు 1,401 మంది పరీక్షకు దరఖాస్తు చేయగా.. 1,304 మంది (93.08 శాతం), మహిళలు 1376 మంది దరఖాస్తు చేయగా.. 1,286 (94.67 శాతం) మంది అర్హత సాధించారు. జెడ్పీ సమావేశానికి హాజరుకండి అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరుకావాలని సీఈఓ రామచంద్రారెడ్డి సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల కలెక్టర్లు హాజరవుతారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. అలాగే గత సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలతో రావాలన్నారు. సమావేశానికి గైర్హాజరయ్యే అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. -
అధికారులే టో(తో)లు తీశారు!
అనంతపురం క్రైం: ఆర్టీసీ ఆదాయానికి అధికారులే గండి కొట్టారు. సంస్థను లాభాల్లో నడిపించాల్సింది పోయి జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా ఈ రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.వందల కోట్ల నష్టాన్ని ఆర్టీసీ చవిచూడాల్సి వచ్చింది. అద్దె బస్సుల టెండర్లలో కీలక నిబంధన గాలికి ఆర్టీసీకి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచాలనే లక్ష్యంతో అద్దె బస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆన్లైన్ టెండరు నిర్వహించారు. టెండరులో పాల్గొనే వాహన యజమానులకు 200పై చిలుకు నిబంధనలు విధించారు. ఇందులో 1 నుంచి 10 వరకు కీలక షరతులు ఉన్నాయి. ప్రధానంగా అద్దెకు ఇచ్చే బస్సు ఏ జిల్లాలో అయితే నడుపుతారో ఆ జిల్లాలోనే రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఇక్కడే అధికారులు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. జిల్లాలో 100కు పైగా అద్దె బస్సులను తిప్పుతున్నారు. ఇందులో 70కి పైగా అద్దె బస్సులు ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయించినవి కావడం గమనార్హం. సంస్థ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ఈడీ), రీజనల్ మేనేజర్ (ఆర్ఎం) ఉదాసీన వైఖరి కారణంగా అద్దె బస్సుల టెండర్ ఖరారులో కీలక నిబంధన కాస్త కనుమరుగైంది. ఈడీ అలాంట్మెంట్ ఆర్డరు ఇచ్చినప్పుడు అద్దె బస్సుకు లోకల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను పొందుపరిచినప్పటికీ జిల్లా స్థాయి అధికారి తుంగలో తొక్కి 9 ఏళ్ల కాల వ్యవధితో అద్దె ప్రాతిపదికన బస్సులు నడిపేలా ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకు అనుమతులు ఇచ్చేశారు. ఈ అనుమతుల జారీ వెనుక సదరు జిల్లా స్థాయి అధికారి భారీగా ముడుపులు దండుకున్నట్లుగా సంస్థ ఉద్యోగులే బాహాటంగా పేర్కొనడం గమనార్హం. సంస్థకు చేకూరిన నష్టమిలా.. లోకల్ రిజిస్ట్రేషన్ అయిన అద్దె బస్సులను ఆర్టీసీ నడిపితే టోల్ ఫీజులో రాయితీ వర్తిస్తుంది. 30 రోజుల పాటు ఒక బస్సు రోజుకు 366 కిలో మీటర్లు తిరిగితే నెలకు రూ.50 వేలు టోల్ఫీజు చెల్లించాలి. లోకల్ వాహనమైతే రూ.25 వేలతో సరిపోతుంది. కాగా నాన్లోకల్ వాహనం కావడంతో నెలకు అదనంగా ఆర్టీసీ రూ.25 వేలు చెల్లించాల్సి వచ్చింది. ఈ లెక్కన ఒక అద్దె బస్సుకు రెండేళ్లలో టోల్ ఫీజు కింద అదనంగా రూ.6 లక్షలను ఆర్టీసీ చెల్లించింది. ఇలా జిల్లాలో నాన్లోకల్ కింద రిజిస్ట్రేషన్ కలిగిన 70కి పైగా అద్దె బస్సులకు అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో సంస్థ రూ.4.20 కోట్లు నష్టపోయింది. నష్టాన్ని గుర్తించిన చిరుద్యోగి లోకల్ రిజిస్ట్రేషన్ లేకపోవడంతో అనంతపురం ఆర్టీసీ రీజియన్ పరిధిలో అద్దె బస్సులకు టోల్ఫీజు రాయితీ కోల్పోతోందనే విషయాన్ని ఓ చిరుద్యోగి గుర్తించారు. ఈ విషయాన్ని తన కార్యాలయంలోని ఆర్ఎంకు వివరించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న సదరు అధికారి మాత్రం కిమ్మనకుండా చేతులెత్తేశారు. కాగా, ఈ సమస్యను సదరు ఉద్యోగి గుర్తించి నేటికి ఆరు నెలలు కావస్తోందని సమాచారం. అకౌంట్ సెక్షన్ ఏం చేస్తోందంటూ తొలుత ఆర్ఎం హంగామా చేసినా క్రమేణా ఆ ఊసే ఎత్తకుండా మిన్నకుండిపోయారు. కాగా ఈ విషయం తెలుసుకున్న జిల్లాలోని ఓ డిపోలో అకౌంట్స్ సెక్షన్లో పనిచేస్తున్న ఉద్యోగి ఈ సమస్య తన తలకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుతూ ఆర్ఎంకు లేఖ ఇచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికీ అదే నిర్లక్ష్యం ఆరు నెలల క్రితమే ఓ చిరుద్యోగి జరుగుతున్న నష్టాన్ని పసిగట్టి సంస్థ ఏడాదికి ఎంత మేర నష్టపోతుందో గణాంకాలతో వివరించినా.. చర్యలు తీసుకోవడంలో అధికారులు మీన మేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. సదరు అద్దె బస్సుల యజమానులకు నోటీసులు జారీ చేసి ఇప్పటికై నా నష్టాన్ని పూడ్చాలని సలహా ఇచ్చిన పాపానికి ఉన్నతాధికారులు అందరూ ఏకమై విషయాన్ని తొక్కి పెట్టినట్లు సమాచారం. సమస్య గుర్తించిన తక్షణమే చర్యలు తీసుకుని ఉంటే ఈ ఆరు నెలల్లో రూ. కోట్లలో నష్టాన్ని అరికట్టి ఉండవచ్చు. అయినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అద్దె బస్సులతో ఆర్టీసీకి రూ.కోట్లలో నష్టం లోకల్ రిజిస్ట్రేషన్ ఉండాలన్న ప్రధాన నిబంధన తుంగలోకి నాన్లోకల్ వాహనాలు కావడంతో టోల్ ఫీజు చెల్లింపునకు వర్తించని రాయితీ -
కలెక్టరేట్ మినహాయింపు కాదు కదా?!
అనంతపురం అర్బన్: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో కాలం చెల్లిన వాహనాలు, నిరుపయోగంగా ఉన్న సామగ్రిని వేలం వేయాలి’’ అని ఈ నెల 19న అధికారులను కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. వాస్తవానికి ఇతర కార్యాలయాల్లోని పరిస్థితి అటుంచితే... ఆయన ఆదేశాలు తొలుత కలెక్టరేట్ నుంచే మొదలుపెట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే కండిషన్లో ఉన్న వాహనాలను సైతం మూలకు వేసి కొత్త వాహనాలను వినియోగిస్తుండడంతో చివరకు అవి గుజరీకి కూడా పనికిరాకుండా పోయాయి. నాలుగు జీపులు, ఆరు అంబాసిడర్ కార్లు, ఒక సుమో, ఒక చవర్లెట్ ఐవరీ కారు ఇలా మొత్తం 12 వాహనాలు ‘తుక్కు’గా మారాయి. అలాగే కొత్త ఫర్నీచర్ వచ్చిందని అప్పటి వరకూ వినియోగించిన బీరువాలు, ర్యాక్లను ఆవరణలో పడేశారు. ఇందులో అత్యంత విలువైన స్టాంపింగ్ యంత్రం కూడా ఉంది. ఇవన్నీ ఎండకు ఎండి... వానకు తడిసి తప్పు పట్టిపోతున్నాయి. దీంతో ప్రక్షాళన అంటూ మొదలు పెడితే అది కలెక్టరేట్ నుంచే ప్రారంభం కావాలనే వాదన వినిపిస్తోంది. మరి ఆ దిశగా కలెక్టర్ చర్యలు చేపడతారో.. లేదో వేచి చూడాలి. -
హంద్రీ–నీవాపై చర్చకు రా..
● రాయదుర్గం ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి సవాల్ ఉరవకొండ: హంద్రీ–నీవా అభివృద్ది పనులపై ముందుగా ప్రకటించినట్లుగానే నేడు (బుధవారం) బహిరంగ చర్చకు తాను సిద్దంగా ఉన్నానని, దమ్ముంటే చర్చ కోసం ఉరవకొండకు రావాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. హంద్రీ–నీవా కోసం ఏ ప్రభుత్వం ఎంత మేర ఖర్చు చేసిందో, ఎంత మేర పనులు పూర్తి చేసిందో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఉరవకొండ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న హంద్రీ–నీవా శిలాఫలకాల వద్ద బుధవారం ఉదయం 11 గంటలకు చర్చకు సిద్ధం కావాలన్నారు. ఎమ్మెల్యే కాలవ రాక కోసం తాను అక్కడే వేచి ఉంటానన్నారు. -
ధాన్యం తడిసిపోయింది
నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. రూ.లక్షల పెట్టుబడి పెట్టా. ప్రకృతి విపత్తులను దాటి అరకొరగా చేతికందిన పంటను కల్లంలో కుప్పచేసుకునే లోపే కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ ఆపేశారు. అధికారుల్ని అడిగితే టార్గెట్ పూర్తయిందని చెప్పారు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కల్లంలో ధాన్యం తడిసి ముద్దయింది. టార్ఫాలిన్ షీట్లు లేకపోవడంతో మొలకలు కూడా వచ్చాయి. ప్రభుత్వం త్వరగా స్పందించి మరింత ధాన్యం కొనుగోలు చేయాలి. – ముజంబిల్, కౌలు రైతు, కణేకల్లు -
రూ.37 లక్షల మెస్ బిల్లులకు లెక్కల్లేవ్
● డీఎంఈకి నివేదించిన విచారణ కమిటీ ● అకౌంటెంట్ వాణిపై ఫిర్యాదు చేయాలని డీఎంఈ ఆదేశం అనంతపురం మెడికల్: బోధనాస్పత్రిలో వైద్య విద్యార్థుల మెస్ బిల్లులకు సంబంధించి రూ.37 లక్షలకు లెక్కలు సరిగా లేవని విచారణ కమిటీ సభ్యులు డీఎంఈ డాక్టర్ నర సింహంకు తెలియజేశారు. మంగళవారం ప్రభుత్వ వైద్య కళాశాలలోని లైబ్రరీలో జరిగిన విచారణను డీఎంఈ పరిశీలించారు. విచారణ కమిటీ, వార్డెన్లతో మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వ వైద్య కళాశాలలో యూజీ విద్యార్థుల మెస్ బిల్లులు సంబంధిత అకౌంట్ నుంచి కాకుండా వైద్య విద్యార్థుల అకౌంట్ నుంచి అకౌంటెంట్కు వెళ్లినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు విచారణకు ఆదేశించారు. డాక్టర్ రామస్వామి నాయక్, డాక్టర్ సురేష్ తదితరులతో కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ చేపట్టిన కమిటీ సభ్యులు.. నలుగురు విద్యార్థుల వ్యక్తిగత అకౌంట్లకు ఒకరి ఖాతాలో రూ.30 లక్షలు, మరొకరి ఖాతాలో రూ.5 లక్షలు, ఇంకొకరి ఖాతాలో రూ.2 లక్షల వరకు జమ చేసినట్లు, వారి ద్వారా అకౌంటెంట్కు వెళ్లినట్లు గుర్తించారు. అందులో రూ.17 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు గోల్మాల్ జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో వార్డెన్ డాక్టర్ సుచిత్ర, డిప్యూటీ వార్డెన్లు డాక్టర్ విజయ, తదితరుల పర్యవేక్షణ లోపం ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో అకౌంటెంట్ వాణిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావును డీఎంఈ నరసింహం ఆదేశించారు. -
దారుణంగా రైతుల పరిస్థితి
వరి రైతులు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కంటికి రెప్పలా కాపాడిన పంటలపై ప్రకృతి పగ పడుతోంది. ఈ క్రమంలో అరకొరగా చేతికొచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 3,900 మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేస్తే, రైతుల వద్ద మిగిలిపోయిన దాన్ని ఎవరు కొంటారో అధికారులు, పాలకులు సమాధానం చెప్పాలి. మరో 5 వేల మెట్రిక్ టన్నులతో పాటు తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి. – మెట్టు గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త,రాయదుర్గం -
కఠినంగా ప్లాస్టిక్ నిషేధం అమలు
అనంతపురం అర్బన్: ‘‘నగర, పట్టణ ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తాం. విక్రయించే వ్యాపారులకు భారీ జరిమానాలు విధిస్తాం. ఇప్పటికే 56 మందికి నోటీసులిచ్చాం’’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారురు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో విలేకరులతో మాట్లాడారు. ఇంటింటి చెత్త సేకరణ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించరాదన్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనంలోనే చెత్త వేయాలన్నారు. త్వరలో నగరంలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, వీరు కాలనీల్లో తనిఖీ చేస్తూ చెత్తను బయట పడేస్తున్న వారికి జరిమానా విధిస్తారన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నెల రోజుల పాటు ‘యోగాంధ్ర–25’ కార్యక్రమాలను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. తొలి రోజు నగరంలోని ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం ఉంటుందన్నారు. యోగాపై పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. యోగాకు సంబంధించి యాప్ను అందుబాటులోకి తెస్తామని, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు అందులో రిజిస్టర్ కావాలని సూచించారు. సమావేశంలో నగర పాలక కమిషనర్ బాలస్వామి, డీఎంహెచ్ఓ ఈబీదేవి, డీఎస్డీఓ ఉదయభాస్కర్ పాల్గొన్నారు. వంకలు ఆక్రమిస్తే కఠిన చర్యలు వంకలు, వాగులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్కుమార్ హెచ్చరించారు. ఆక్రమణలపై మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నగర పరిధిలోని పండమేరు, తడకలేరు, నడిమివంక, మరువవంక తదితర వంకలు, వాగుల ఆక్రమణలపై సర్వే చేపట్టాలని సర్వే శాఖ అఽధికారులకు సూచించారు. ఆక్రమణదారుల ఇళ్లకు నోటీసులు అతికించడంతో పాటు చేతికి కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై జాయింట్ కలెక్టర్, ఆర్డీఓతో చర్చించాలన్నారు. ఎంత వర్షం వచ్చినా నగర పరిధిలోని అన్ని కాలువల్లోనూ నీరు నిలువకుండా సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. పండమేరు వంక నుంచి అనంతసాగర్ చెరువు వరకూ శుభ్రం చేయించాలన్నారు. అక్కడి నుంచి శింగనమల చెరువుకు నీరు సాఫీగా వెళ్లేందుకు అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, తహసీల్దార్లు హరికుమార్, మోహన్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ వి.వినోద్కుమార్ -
‘కూటమి’ అరాచకాలకు భయపడొద్దు
పుట్లూరు: కూటమి ప్రభుత్వ అరాచకాలకు భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ భరోసానిచ్చారు. పుట్లూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మంగళవారం మండల కేంద్రంలో జరిగింది. సమావేశంలో శైలు మాట్లాడారు. నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ప్రతి మండలంలో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై బెదిరింపులు, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హతే ప్రామాణికంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేశారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు సమష్టి కృషి, ప్రజల ఆశీర్వాదంతో మరోసారి వైఎస్ జగన్ను సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.రాఘవరెడ్డి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నాగేశ్వరరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ -
పకడ్బందీగా బదిలీల ప్రక్రియ
అనంతపురం అర్బన్: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీల ప్రక్రియలో నిబంధనలను అతిక్రమించరాదన్నారు. ఏ దశలోనూ విమర్శలు, ఆరోపణలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న వాహనాల వేలం ప్రక్రియను జూన్ 20లోపు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీఏ అధికారులకు లేఖ రాస్తే వారు వచ్చి పరిశీలించి నివేదిక ఇస్తారన్నారు. కార్యాలయాల్లో వృథా సామగ్రిని కూడా వేలం వేయించి సంబంధిత రికార్డుల్లో వివరాలను పొందుపర్చాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు.‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంఅనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి అడ్వా న్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు జిల్లాలో 975 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 3,043 మంది విద్యార్థులకు గాను 2,068 మంది హాజరయ్యారు. 42 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 21 కేంద్రాలను తనిఖీలు చేశాయి.రేపు డీఈఓ కార్యాలయ ముట్టడిటీచర్లు తరలిరావాలని ఉపాధ్యాయ సంఘాల వేదిక పిలుపుఅనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ రంగ సమస్యలపై సోమవారం ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈనెల 21న జిల్లాలో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు వైఎస్సార్టీఏ ఎస్.నాగిరెడ్డి, ఆప్టా కె.వెకంటరత్నం పిలుపునిచ్చారు. విజయవాడలోని విద్యాభవన్లో దాదాపు 8 గంటలకు పైగా పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, సంచాలకులు విజయరామరాజుతో ఉపాధ్యాయ సంఘాలు జరిపిన చర్యలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. 16 ప్రధాన డిమాండ్లపై ఉన్నతాధికారులు–ఉపాధ్యాయ సంఘాల నేతలు జరిపిన చర్చలు కొలిక్కి రాలేదన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో చర్చలు జరపాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరినా అధికారులు అంగీకరించలేదన్నారు. ఈ క్రమంలో 21న డీఈఓ కార్యాలయాల ముట్టడి, 23న కమిషనర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.బ్యాంక్కు తాళం వేసిన రైతులుశెట్టూరు: పంట రుణాలు రెన్యూవల్ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బ్యాంక్కు తాళం వేసి ధర్నా చేపట్టారు. శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో ఈ ఘటన చోటు చేసు కుంది. వివరాలు.. సోమవారం ఉదయం పంట రుణాల రెన్యూవల్ చేయాలంటూ లక్ష్మంపల్లిలోని కెనరా బ్యాంక్ శాఖకు 40 మంది రైతులు వెళ్లారు. అయితే బ్యాంక్లో రైతులకు సంబంధించి వన్ బీలు ఆన్లైన్లో కనిపించకపోవడంతో పంట రుణాలను రెన్యూవల్ చేయడం సాధ్యం కాదంటూ బ్యాంక్ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో కొందరు రైతులు మీ సేవ నుంచి, మరికొందరు తహసీల్దార్ సంతకంతో కూడిన 1 బీలను తీసుకెళ్లి బ్యాంక్ అధికారులకు అందజేశారు. వీటిని తాము పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు స్పష్టం చేయడంతో రైతుల్లో అసహనం పెల్లుబుకింది. వెంటనే బ్యాంక్కు తాళం వేసి గేట్ ఎదుట బైటాయించారు. సకాలంలో పంట రుణాలు రెన్యూవల్ చేయకపోతే తీవ్రంగా నష్టపోయేది రైతులేనన్న విషయాన్ని బ్యాంక్ అధికారులు విస్మరించారంటూ ఆందోళన వ్యక్తంచేశారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన బ్యాంకుల్లో రైతుల సమస్యలు, కష్టాలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పంట రుణాలు రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు వైస్ ఎంపీపీ ముత్యాలు,వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల నాయకుడు ఇమామ్ వలీ, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. -
మురిపించాయి.. ముంచేస్తాయా?
అనంతపురం అగ్రికల్చర్: అవసరం లేని సమయంలో అధిక వర్షాలు పడుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్లో పంటలు విత్తుకునే సమయంలోనూ, లేదంటే పంటలు కీలక దశకు చేరుకున్న సమయంలో వెనుకటి వర్షాలు చేయిస్తాయేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి అనుభవాలను చవిచూశామని గుర్తు చేసుకుంటున్నారు. ముందస్తు వర్షాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. మే సాధారణ వర్షపాతం 36.7 మి.మీ కాగా... అందులో మే 19 నాటికి 16.8 మి.మీ పడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే ఏకంగా 79.6 మి.మీ వర్షం కురిసింది. 31 మండలాల్లోనూ సాధారణం కన్నా ఐదు నుంచి పదింతల రెట్టింపు వర్షపాతం నమోదైంది. ఇంత వరకూ బాగానే ఉన్నా రాబోయే రోజుల్లో వర్షాలు ముఖం చాటేస్తాయేమోననే ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. విత్తుకు ఇంకా 10 రోజులు మిగిలిఉండటం, వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో... ఇప్పుడు కురిసే వర్షాలు ముంగారుకు ఏ విధంగానూ ఉపయోగపడవని చెబుతున్నారు. జూన్ 15 తర్వాత సాగుకు అదను.. ఖరీఫ్లో పంటలు విత్తుకునేందుకు జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు మంచి అదనుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ సారి ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా చాలా మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇంకా వర్షసూచన ఉందని చెబుతున్నారు. అలాగే కీలకమైన నైరుతీ రుతుపవనాలు ఈ సారి ముందస్తుగానే అంటే ఈనెల 27న కేరళను తాకుతాయని వారం క్రితమే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ప్రకటించింది. రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఉన్నందున ఇంకా ముందుగానే అంటే 24న కేరళను తాకవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ నెలాఖరుకు ‘అనంత’లోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. మరోపక్క కూటమి సర్కారు, వ్యవసాయశాఖ ఇప్పటికీ విత్తన పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టకపోవడం అన్నదాతలకు శాపంగా మారింది. బెళుగుప్ప మండలం నాగులచెరువులో నీరు ముందస్తు వర్షాలతో రైతుల్లో ఆందోళన ఖరీఫ్ కీలక దశలో ముఖం చాటేస్తాయేమోనని అనుమానం 23 మండలాల్లో వర్షం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 23 మండలాల పరిధిలో 6.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. కంబదూరు 28.8 మి.మీ, శింగనమల 22.2, నార్పల 18.6, కుందుర్పి 17.8, గార్లదిన్నె 13.6, డీ.హీరేహాళ్ 11, ఆత్మకూరు 10 మి.మీ వర్షపాతం నమో దైంది. గుమ్మఘట్ట, బొమ్మనహాళ్, పామిడి, రాప్తాడు, బుక్కరాయసముద్రం, అనంతపురం, బెళుగుప్ప, శెట్టూరు, బ్రహ్మసముద్రం, గుంతకల్లు, పుట్లూరు, యాడికి, వజ్రకరూరు, కళ్యాణదుర్గం, యల్లనూరు తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. రాగల రెండు రోజులు కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చెరువుల్లోకి నీళ్లు.. వర్షాలకు 20 చెరువులు పూర్తిగా నిండిపోగా మరో 20 చెరువుల్లోకి 75 శాతం నీళ్లు చేరినట్లు తెలిసింది. బెళుగుప్ప, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్లు, పామిడి, పెద్దవడుగూరు, రాప్తాడు, వజ్రకరూరు, అనంతపురం రూరల్, ఆత్మకూరు, బుక్కరాయసముద్రం, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో చెరువులు జలకళ సంతరించుకున్నాయి. -
సారూ.. సమస్యలు పరిష్కరించండి
అనంతపురం అర్బన్:‘సమస్యలు పరిష్కరించండి సారూ’ అంటూ అధికారులను పలువురు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి కలెక్టర్ వి.వినోద్కుమార్ తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల,డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్,రామకృష్ణారెడ్డి, ఆనంద్, తిప్పేనాయక్ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 460 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించడంతో పాటు ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. వినతుల్లో కొన్ని... ● చలానా కట్టినా భూమిని సర్వే చేసేందుకు రావడం లేదని అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డికి చెందిన రాము ఫిర్యాదు చేశాడు. సర్వే నంబరు 44–3లో 1.69 ఎకరాలు, 43–4లో 90 సెంట్ల సర్వే కోసం చలానా కట్టామని, సర్వేయర్ అందుబాటులో ఉండడం లేదని చెప్పాడు. తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ● ప్రభుత్వం మంజూరు చేసిన ప్లాట్కు హద్దులు చూపించడం లేదని అనురాధ ఫిర్యాదు చేసింది. రాప్తాడు మండలం పండమేరు గ్రామ సర్వే నంబర్ 134, 135లో వేసిన లే–అవుట్లో తమకు 362వ ప్లాట్ను ప్రభుత్వం మంజూరు చేసిందని, అయితే ఈ ప్లాట్కు హద్దులు చూపించాలని తహసీల్దారు కార్యాలయంలో పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపింది. సర్వే చేయించి ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరింది. ● శింగనమల మండలం చక్రాయపేట గ్రామ సర్వే నంబర్ 539–2,4,5, 538లో కొందరికి ప్రభుత్వం డీ పట్టా ఇచ్చిందని, అయితే ఒక వ్యక్తి ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ గుట్టతో పాటు భూముల్లో యంత్రాల సహాయంతో మట్టిని తోడేసి అక్రమంగా తరలిస్తున్నాడని వెంకటస్వామి ఫిర్యాదు చేశాడు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అర్జీదారుల వేడుకోలు వివిధ సమస్యలపై 460 వినతులు -
కంబదూరు వైస్ ఎంపీపీగా సోమశేఖర్
కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు వైస్ ఎంపీపీగా ఎనుముల సోమశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం కంబదూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా డీఎల్డీఓ నాగేశ్వర రావు వ్యవహరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ బలపరిచిన ఎంపీటీసీ సోమశేఖర్ను ఎంపీటీసీలు చేతులెత్తి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధికారులు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించి వైస్ ఎంపీపీగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. సోమశేఖర్కు వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వ య కర్త తలారి రంగయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. తన ఎన్నికకు సహకరించిన ఎంపీటీసీలకు సోమశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి, సమన్వయకర్త తలారి రంగయ్య, నాయకులు ఉమామహేశ్వర నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి, వైస్ ఎంపీపీ తిమ్మరెడ్డి, ఎంపీటీసీలు ఈరన్న, నాగలక్ష్మి, మాధవి, సరస్వతి, నాగరత్నమ్మ, విద్యావతి, శ్రీదేవి, లక్ష్మి, నరసక్క, శివమ్మ, పలు మండలాల పార్టీ కన్వీనర్లు హనుమంత రాయుడు, వెంకటప్ప, పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, గోళ్ల సూరి తదితరులు పాల్గొన్నారు. -
రూ. లక్షలు.. ‘చెత్త’లో పోసిన పన్నీరు!
రూ. లక్షలు పెట్టి ఈ వాహనాలు కొనుగోలు చేశారు. వాటితో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సి ఉంది. ఎందుకో తెలియదు కానీ.. పంపిణీ మాత్రం చేయలేదు. దీంతో ఇదిగో ఇలా అనంతపురం హౌసింగ్ బోర్డులోని పార్కులో వృథాగా పడి ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లలు వాటిపైకి చేరి ఆడుకుంటుండడంతో దెబ్బతింటున్నాయి. కొన్ని వాహనాల చక్రాలు అప్పుడే ఊడిపోయాయి. ప్రభుత్వ నిధులు వృథా కాకుండా ఇప్పటికై నా మున్సిపాలిటీ అధికారులు వాహనాలను వినియోగంలోకి తెస్తే నగరంలో పరిశుభ్రత మెరుగుపడుతందని ప్రజలు చర్చించుకుంటున్నారు. లేకుంటే రూ. లక్షలు... ‘చెత్త’లో పోసిన పన్నీరు చందంగా మారే పరిస్థితులు లేకపోలేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
వాహనం ఢీకొని యువకుడి మృతి
బెళుగుప్ప: వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరుకు చెందిన మహేష్(21), తన మిత్రుడు కాలువపల్లి తండా గ్రామానికి చెందిన భానుప్రకాష్ నాయక్తో కలసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాత్రి కాలువపల్లికి బయలుదేరాడు. మానిరేవు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ అటుగా వెళుతున్న వారు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మహేష్ మృతిచెందినట్లుగా నిర్ధారించారు. భానుప్రకాష్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి దుర్మరణం బత్తలపల్లి: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఆటో నడుపుతున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ముదిగుబ్బకు చెందిన మట్రా ఆంజనేయులు (59), అలివేలమ్మ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతులు ఆటోలో గ్రామాలు తిరుగుతూ తెల్లగడ్డలు విక్రయం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఽతెల్లవారుజామునే ముదిగుబ్బ నుంచి ధర్మవరానికి ఆటోలో బయలుదేరారు. బత్తలపల్లి మండలం వేల్పుమడుగు క్రాస్ దాటిన తర్వాత వెనుక నుంచి వేగంగా బండల లోడుతో దూసుకువచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఘటనలో ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన అలివేలమ్మను అటుగా వచ్చిన వారు గుర్తించి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘రెడ్బుక్ కుట్రలో భాగమే అక్రమ అరెస్టులు’
ఉరవకొండ: తప్పడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా విశ్రాంత అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది రెడ్బుక్ కుట్రలో భాగమేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం అక్రమ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్ ముమ్మాటికీ అక్రమమని అన్నారు. అధికారులన్న కనీస గౌరవం లేకుండా అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షపార్టీపై ప్రతీకారం తీర్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హమీలు నేరవేర్చే ధైర్యం లేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్సాఆర్సీపీ నేతలతో పాటు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు బసవరాజు పాల్గొన్నారు. -
యోగాంధ్రపై చైతన్యం తీసుకువస్తాం
● సీఎస్కు తెలిపిన కలెక్టర్ వినోద్కుమార్ అనంతపురం అర్బన్: యోగాంధ్ర–2025 క్యాంపెయిన్పై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. యోగాంధ్ర, తదితర అంశాలపై సీఎస్ సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వినోద్కుమార్, డీఆర్ఓ ఎ.మలోల, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో యోగాంధ్ర–2025 నిర్వహణలో భాగంగా తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వర ఆలయం, గుత్తి కోట వంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో నగర పాలక కమిషనర్ బాలస్వామి, డీఎంహెచ్ఓ ఈబీదేవి, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి కళ్యాణదుర్గం రూరల్: విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కంబదూరులోని కోట వీధిలో నివాసముంటున్న రామాంజినమ్మ, మల్లేశప్ప దంపతలకు ఇద్దరు కుమార్తులు, కుమారుడు శ్యామ్ (24) ఉన్నారు. బేల్దారి పనులతో శ్యామ్ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. సోమవారం రోజులాగే కంబదూరులో గృహ నిర్మాణ పనుల్లో పాల్గొన్న శ్యామ్... ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో షాక్కు గురై భవనం పైనుంచి కిందపడ్డాడు. గమనించిన స్తానికులు వెంటనే కంబదూరులోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కంబదూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాపంపేటలో మహిళ ఆత్మహత్య రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన లక్ష్మీదేవి (45) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త కుళ్లాయప్ప గతంలోనే చనిపోయాడు. కుమారుడు రామాంజనేయులు ఆటోమొబైల్స్లో పని చేస్తున్నాడు. కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీదేవి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎకై ్సజ్ ఇన్చార్జ్ సీఐగా గురుప్రసాద్ కళ్యాణదుర్గం రూరల్: స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్గా గురుప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ హసీనాభాను అవినీతి ఆరోపణలపై బదిలీ అయిన విషయం తెలిసిందే. దీంతో విడపనకల్లు చెక్పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న గురుప్రసాద్కు ఉన్నతాధికారులు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలిసింది. నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి చెన్నేకొత్తపల్లి: గ్రామాల్లో నాటుసారా నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఎకై ్సజ్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సర్కిల్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. నవోదయం 2.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని తెలిపారు. గతంలో గ్రామాల్లో నాటుసారాను తయారు చేసే పాత నేరస్తులపై నిఘా ఉంచాలని ఆదేశించారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణా, విక్రయంపై నిఘా పెట్టాలని సూచించారు. బెల్టుషాపులు లేకుండా చూడాలన్నారు. లైసెన్స్ మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధర కన్నా ఎక్కువ విక్రయిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐ ఫరూక్ ఆజామ్, ఎస్ఐ శివప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యతోనే ఉజ్వల భవిత
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ప్రతి విద్యార్థి చదువులపై దృష్టి సారించి ఉన్నత విద్యాభ్యాసంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. పదో తరగతి, ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వాల్మీకి/బోయ సామాజికవర్గానికి చెందిన విద్యార్థులకు సోమవారం స్థానిక రుద్రంపేట సమీపంలోని వాల్మీకి కల్యాణమంటపంలో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేరేలా పట్టుదల, ఏకాగ్రతతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్సీ అక్కులప్ప, ప్రధాన కార్యదర్శి ఎ. చైతన్యకుమార్, కోశాధికారి జి. పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు, పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, విశ్రాంత డీఎఫ్ఓ ఆదినారాయణ, ఏడీసీసీ మాజీ చైర్మన్ వీరాంజనేయులు, తలారి ఆదినారాయణ, ఎంఈఓ వాణీదేవి, అంకె ముత్యాలు, మాజీ సీఈఓ ఈశ్వరయ్య, నాగభూషణం పాల్గొన్నారు. వాల్మీకి విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవంలో వక్తలు -
నకిలీ అక్రిడిటేషన్ వ్యవహారంలో వ్యక్తి అరెస్ట్
అనంతపురం: జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ అక్రిడిటేషన్లు సృష్టించిన వ్యవహారంలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం వన్టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. ప్రజాబలం పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే చందులాల్నాయక్, మన్నల దేవరాజు ఇద్దరూ కలిసి నకిలీ అక్రిడిటేషన్లు సిద్ధం చేసుకుని వాటిపై జిల్లా కలెక్టర్ డిజిటల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అసలు అక్రిడిటేషన్ కార్డుగా చలామణి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడ పనిచేసే ఉద్యోగులను బెదిరిస్తూ, అక్రమ వసూళ్లకు పాల్బడుతున్నట్లుగా తెలుసుకున్న డీఐపీఆర్ఓ గురుస్వామిశెట్టి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టారు. సోమవారం మన్నల దేవరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న చందులాల్నాయక్ కోసం గాలిస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు చేయాలి ● సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్ అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు సూపర్సిక్స్ హామీలను అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ జిల్లా మహాసభలను జూలై 25 నుంచి 27వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు, ఇతర ప్రజాసమస్యలపై జిల్లా మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎన్నికల హామీ మేరకు పట్టణ పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ పేదలకు మూడు సెంట్ల స్థలం ఇవ్వాలన్నారు. ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలనే డిమాండ్తో జూన్ 2వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నామన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు మల్లికార్జున, రాజారెడ్డి, కేశవరెడ్డి, రాజేష్గౌడ్, రామాంజినేయులు పాల్గొన్నారు. -
రామగిరి ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా
రామగిరి: రామగిరి ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సభ్యులు రానందున వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి సంజీవయ్య ప్రకటించారు. గత ఎన్నికల్లో మొత్తం 10మంది ఎంపీటీసీ సబ్యులుండగా ఇందులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు తొమ్మిది మంది, ఒకరు టీడీపీ సభ్యుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ సభ్యులతో ఎంపీపీ స్థానాన్ని అప్పట్లో వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. మూడు నెలలక్రితం అప్పటి ఎంపీపీ మీనుగ నాగమ్మ అనారోగ్యంతో మృతిచెందగా ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. ఈ ఏడాది మార్చి 27న ఎన్నిక జరపాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడంలో అధికారులు ఎన్నిక ప్రక్రియ మొదలు పెట్టారు. అనివార్య కారణాలతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో మరుసటి రోజు (మార్చి 28)కు ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు రామగిరిలో జరిగే ఎన్నిక ప్రక్రియకు హాజరవుతుండడంతో మార్గమధ్యంలోనే పెనుకొండలో పేరూరు2 ఎంపీటీసీ సభ్యురాలు భారతిని టీడీపీ మూకలు బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకుని ఎన్నిక వాయిదా పడ్డానికి కారణమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంపీపీ ఎన్నికకు టీడీపీకి బలం లేకున్నా ఆ పార్టీ నాయకులు ఇద్దరు వైఎస్సార్సీపీ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి లోబర్చుకున్నారు. దీంతో ఆరుగురు సభ్యులున్న వైఎస్సార్సీపీకి ఎంపీపీ స్థానం లాంఛనమే అవుతుంది. ఇది జీర్ణించుకోలేని పరిటాల కుటుంబం రామగిరిలో తమ మాటే జరగాలంటూ సభ్యులను భయబ్రాంతులకు గురిచేస్తూ ఎన్నిక వాయిదా పడ్డానికి కారణమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రామగిరి వైస్ సర్పంచ్పై రౌడీషీటర్ దాడి.. రామగిరి ఎంపీపీ ఎన్నిక జరుగుతున్న సమయంలో రామగిరి గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ బోయ రామాంజినేయులపై రౌడీషీటర్ శివకుమార్ తన అనుచరులతో కలసి సోమవారం దాడి చేశాడు. టీ తాగేందుకని ఓ హోటల్కు వెళ్లగా సమీపంలో ఉన్న 20 నుంచి 30 మంది టీడీపీ శేణులు ఒక్క సారిగా శివకుమార్ ఆధ్వర్యంలో రామంజినేయులను చుట్టముట్టారు. ‘‘ఇక్కడ నీకేం పని’’ అని ప్రశ్నిస్తూ రామాంజినేయులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. రామగిరి ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రామగిరిలో టీడీపీ మూకలు హల్చల్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేయగా, పోలీసు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. పోలీసుల అత్యుత్సాహం ఎంపీపీ ఎన్నిక జరిగే సమయంలో ఎంపీటీసీ సభ్యులతోపాటు ఎన్నికల అధికారులు, మీడియా సిబ్బంది మాత్రమే హాలులోకి అనుమతి ఉంది. పోలీసులు సైతం ఎన్నిక గది బయటే విధులు నిర్వర్తించాలి. అయితే ఎన్నికల నియమావళిని అధికారులు తుంగలోతొక్కి ఏకంగా ఎన్నిక జరిగే గదిలోకి ప్రవేశించి వీడియోలు తీయడం చర్చనీయాంశగా మారింది. అంతేకాక వివాదాస్పద రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పదే పదే పోలీసులకు సలహాలు, సూచనలిస్తూ హడావుడి చేయడం గమనార్హం. -
కారుణ్యం లేదు.. కాఠిన్యం తప్ప
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో రెవెన్యూ శాఖ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్ని శాఖలకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఈ శాఖ... ప్రస్తుతం తన శాఖ ఉద్యోగుల నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రధానంగా కారుణ్య నియామకాల విషయంలో జాప్యంపై.. పదోన్నతుల అంశంలో కనబరుస్తున్న నిర్దయపై రోజురోజుకూ ఉద్యోగులో అసహనం పెరిగిపోతోంది. జాప్యానికి అధికారులు చెబుతున్న... చూపుతున్న కారణాలు సహేతుకమైనవి కాదని అభిప్రాయం ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతోంది. కారుణ్య నియామకాలకు మోక్షం ఎన్నడో ఓ ఉద్యోగస్తుడు మరణిస్తే ఆయన కుటుంబం దిక్కులేనిది కాకుండా ఉండేందుకు కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పిస్తారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉద్యోగం ఇవ్వాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు సంబంధించి కార్యుణ్య నియామకాలు కలెక్టర్ కార్యాలయం నుంచి జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ దాదాపు 32 మంది బాధితులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతంగా కారుణ్య నియామకాల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఓ వైపు కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో పోషణ భారమై ఉద్యోగం కోసం కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. పదోన్నతుల కల్పనలో కాఠిన్యం ఉద్యోగుల తమ సర్వీసులో కోరుకునే అత్యంత ప్రాధాన్యతా అంశం పదోన్నతి. పదోన్నతల కల్పనలో జాప్యం నెలకొంటే ఆ ప్రభావం ఉద్యోగుల విధి నిర్వహణపై పడుతుంది. వారిలో ఉత్సాహం సన్నగిల్లి... నిరాశ నిస్పహతో పనిచేస్తుంటారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఉద్యోగులు ఇలాంటి పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నారు. వివిధ కేడర్లలో ఖాళీగా పోస్టులకు పదోన్నతి అర్హత ఉన్న వారు ఏడాదిగా వేచి ఉన్నారు. అయితే పదోన్నతుల కల్పన నిర్ణయంపై ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో అంతులేని జాప్యం చోటు చేసుకుంటోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కావడం విశేషం. తప్పని ఎదురుచూపులు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు ఇప్పటికే సర్వే టెస్ట్, డిపార్ట్మెంటల్ టెస్ట్, ఆకౌంట్ టెస్ట్, ఇతర రెవెన్యూ టెస్ట్లు ఉత్తీర్ణత సాధించిన జూనియర్ అసిస్టెంట్లు (జేఏ) 30 మంది ఉన్నారు. శాఖలో 32 సీనియర్ అసిస్టెంట్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నా... నేటికీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ప్రస్తుతం డీటీలుగా పదోన్నతి పొందేందుకు అర్హులైన 15 మంది ఎస్ఏలు ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ నెలలుగా ముందుకు సాగకపోవడంతో వారికీ ఎదురు చూపులు తప్పలేదు. పెండింగ్లో కారుణ్య నియామకాలు ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలు పదోన్నతుల కల్పనలో అంతులేని నిర్లక్ష్యం ఏడాదిగా ఎదురుచూపులకే పరిమితమైన రెవెన్యూ ఉద్యోగులు ప్రక్రియ చేపడతాం కారుణ్య నియాకాలు, పదోన్నతుల ప్రక్రియ తక్షణం మొదలు పెడతాం. ఇందుకు సంబంధించి అంశాలను పరిశీలించాను. కారుణ్య నియామకాల ఫైళ్లను తెప్పించుకుని వీలైనంత త్వరగా ఉద్యోగాలు కల్పిస్తాం. ఇక పదోన్నతుల విషయంలో న్యాయపరమైన చిక్కులపై సలహా అడిగాం. త్వరలోనే ఈ ప్రక్రియనూ పూర్తి చేస్తాం. – వి.వినోద్కుమార్, కలెక్టర్ -
అబద్ధాల ప్రచారమేంటి లోకేష్?
అనంతపురం కార్పొరేషన్: ‘మంత్రి నారా లోకేష్ దావోస్లో ఒప్పందం చేసుకోవడం కారణంగానే జిల్లాకు సోలార్ ప్లాంట్, ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పీసీ 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్ట్ వచ్చాయని, కూటమి ప్రజాప్రతినిధులు చెప్పుకుంటున్నారు. ఈ అబద్ధాల ప్రచారమేంటి లోకేష్? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన ప్రాజెక్టుకు ఇప్పుడు శంకుస్థాపన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల విమర్శించారు. శనివారం ఆమె అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇంధన రంగంలో జగనన్న అత్యుత్తమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ఫలితంగా రూ.22,302 కోట్ల పెట్టుబడులు, 5,300 మందికి ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీకి గత ప్రభుత్వంలో నాంది పలికిన అంశానికి సంబంధించి పత్రికా కథనాలను చూపించారు. రెండ్రోజుల అనంత పర్యటనలో మంత్రి లోకేష్ ప్రజా సమస్యలపై ఎందుకు నోరుమెదపలేదో చెప్పాలన్నారు. ఇటీవల అనంతపురం జిల్లా కేంద్రంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో ఎలుకల వల్ల ఇబ్బంది పడ్డ విద్యార్థులను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. కక్ష సాధింపులో భాగంగానే లిక్కర్ స్కాం పేరుతో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్లను అరెస్టు చేశారన్నారు. దొంగ సాక్ష్యాలతో సంబంధం లేని వారిపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. మహిళలపై దౌర్జన్యాలు, బెదిరింపులు జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, నాయకురాళ్లు సుజాత, ఉష, భారతి, దేవి, తదితరులు పాల్గొన్నారు. జగనన్న తెచ్చిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల -
ఆర్డీటీని కాపాడుకుందాం
● సేవ్ ఆర్డీటీ పేరుతో తలారి రంగయ్య ఆధ్వర్యంలో కళ్యాణదుర్గంలో భారీ బైకు ర్యాలీ ● తక్షణమే ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్ కళ్యాణదుర్గం: కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యూవల్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, పీఏసీ సభ్యులు తలారి రంగయ్య ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్డీటీ’ పేరుతో శనివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మసముద్రం మండల కేంద్రం నుంచి శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాల మీదుగా కళ్యాణదుర్గం వరకు ర్యాలీ జరిగింది. బాబు, లోకేష్ పట్టించుకోలేదు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఫారిన్ కంట్రిబూషన్ రెగ్యులేషన్ (ఎఫ్సీఆర్ఏ) రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఆర్డీటీ ఆరోగ్యం, విద్య, క్రీడలు, భూగర్భ జలాల పెంపునకు వాటర్ షెడ్ల నిర్మాణం ఇలా ఎన్నో రకాల సేవలతో పేదలకు అండగా నిలిచిందన్నారు. గత ఎన్నికల సమయంలో ఎఫ్సీఆర్ఏను తాత్కాలికంగా రెన్యూవల్ చేశారని గుర్తు చేశారు. అప్పట్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేత, ఇప్పటి మంత్రి సత్యకుమార్, టీడీపీ నాయకులు వెళ్లి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యూవల్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల తర్వాత ఆర్డీటీ కష్టాలను పట్టించుకోవడం మానేశారన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ జిల్లాలో పర్యటించినా ఎక్కడా ఆర్డీటీకి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రజలందరూ ఉద్యమించాలి వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య మాట్లాడుతూ ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను రెన్యూవల్ చేయకపోవడంతో ఇప్పటికే ఆర్డీటీ సేవలు మందగించాయన్నారు. ఆర్డీటీని కాపాడుకోవాల్సిన అవసరం జిల్లా ప్రజలపై ఉందన్నారు. ఆర్డీటీ లబ్ధిదారులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేందుకు కూటమి ప్రభుత్వమే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకుండా నిలుపుదల చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వాల మెడలు వంచైనా ఆర్డీటీ సేవలను పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ పేద ప్రజల బాగు కోసం అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేత మాదినేని ఉమా మహేశ్వరనాయుడు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణకు పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. అనంతరం కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులతో కలిసి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఆర్డీటీ సేవలు నిలిచిపోతే పేదల పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తిప్పేస్వామి, పేరం స్వర్ణలతారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శులు చామలూరు రాజగోపాల్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణపురం వెంకటేశులు, జిల్లా ఉపాధ్యక్షులు కోనాపురం గంగాధరప్ప, జిల్లా ప్రధాన కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పెద్దవడుగూరులో రెచ్చిపోయిన జేసీ వర్గీయులు
సాక్షి టాస్క్ఫోర్స్: మండల కేంద్రమైన పెద్దవడుగూరులో శనివారం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. కొద్దిరోజులుగా పెద్దవడుగూరులోని శివప్రసాద్ ఇండియన్ గ్యాస్ గ్రామీణ విత్రక్ నిర్వహణ విషయంలో ఏజెన్సీ లైసెన్స్దారురాలు సరస్వతికి, నిర్వాహకుడైన వైఎస్సార్సీపీ నాయకుడు ఎద్దుల సూర్యప్రభాకర్రెడ్డికి విభేదాలు రావడంతో గ్యాస్ నిర్వహణ ఆగిపోయింది. ఏజెన్సీ తమకు స్వాధీనం చేసేలా సహకరించాలని జేసీపీఆర్ను సరస్వతి కోరారు. దీంతో ఆయన వారికి తోడుగా తన అనుచరులను గ్యాస్ గోదాము వద్దకు పంపారు. అక్కడ అడ్డుగా దారిలో ఉన్న రాళ్లు తీసివేస్తున్నారని బాటసారులు నిర్వాహకుడు సూర్యప్రభాకర్రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన అక్కడికి కారులో వెళ్లారు. అప్పటికే ఏజెన్సీ వారు గ్యాస్ సిలిండర్లను ఐచర్ వాహనంలో తరలిస్తున్న దృశ్యాన్ని చూసి కిందకు దిగి ప్రశ్నించారు. అక్కడున్న వారు రెచ్చిపోవడంతో తన వాహనంలో భయంతో ఇంటికి వెనుతిరిగాడు. కొందరు వ్యక్తులు రెండు వాహనాల్లో ఆయన్ను వెంబడించారు. సూర్యప్రభాకర్రెడ్డి కారును బయట ఉంచి ఇంట్లోకి వెళ్లిపోగా.. కారును ధ్వంసం చేశారు. అక్కడితో ఆగిపోకుండా ఇంటి తలుపులు కూడా బద్దలు కొట్టడానికి ప్రయత్నించినట్లు బాధితుడు వాపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పటికే పెద్దవడుగూరుకు చేరుకొన్న జేసీపీఆర్.. తాడిపత్రి ట్రైనీ ఏఎస్పీ రోహిత్కుమార్చౌదరిపై మండిపడ్డారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున తాడిపత్రిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జేసీ ప్రభాకర్రెడ్డి భౌతికదాడులు చేయించడం దారుణమని సూర్యప్రభాకర్రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై దాడి -
జగనన్న చేసిన మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అనంతపురం కార్పొరేషన్: ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారు. 11 నెలలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చడం లేదు. జగనన్న నాయకత్వంలో ప్రజలకు చేసిన మేలును ప్రజలకు వివరిద్దాం’ అని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి పేర్కొన్నారు. శనివారం న్యూజిల్యాండ్లోని ఆక్లాండ్లో జరిగిన గ్లోబల్ కనెక్ట్ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలను ఆయుధాలుగా చేసుకుని జగనన్న చేసిన మేలును ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. అలాగే కూటమి కుట్రలు, వైఫల్యాలను తెలియజేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ న్యూజిల్యాండ్ కన్వీనర్ బుజ్జిబాబు, కో కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, సుమంత్ డేగపూడి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దవడుగూరు: మండల పరిధిలోని రావులుడికి గ్రామంలో రైతు శివశంకర్రెడ్డి (56) అనే రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు.. శివశంకర్రెడ్డి ఉదయాన్నే రైతులు పుల్లారెడ్డి, ప్రతాప్రెడ్డి లతో కలిసి తోట వద్దకు వెళ్లారు. మృతుడు తన పొలం వద్దకు వెళ్లాడు. నీటి తొట్టెలో నీళ్లు లేకపోవడంతో మోటర్ వద్దకు వెళ్లాడు. కరెంటు లేకపోవడంతో సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా ఫీజు కట్ అయి ఉండటంతో ఫీజు వేసేందుకు యత్నించగా విద్యుదాఘాతంతో అక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జమెదారు అన్వర్బాషా తెలిపారు. -
సైనికుల త్యాగాలకు వందనం
‘దేశం కోసం త్యాగాలు చేస్తున్న సైనికులకు వందనం.. వారికి బాసటగా నిలుద్దాం’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైద్యారోగ్య శాఖమంత్రి సత్యకుమార్, ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ వి.వినోద్కుమార్ పిలుపునిచ్చారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల ధ్వంసమే లక్ష్యంగా భారత త్రివిధ దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతాన్ని పురస్కరించుకుని శనివారం సైనికులకు సంఘీభావంగా అనంతపురం నగరంలో ‘తిరంగా యాత్ర’ను నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి నగర పాలక సంస్థ ఎదురుగా ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వారు మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి ఎంతంటి త్యాగానికై నా సిద్ధంగా ఉన్నామని మన సైనికులు ప్రపంచదేశాలకు తెలియజేశారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన సైనికుడు మురళీ నాయక్ వీరమరణం పొందారని, సైనికులకు అందరం రుణపడి ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి.జగదీష్, జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, పల్లె సింధూరరెడ్డి, ఎంఎస్రాజు, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి, అహుడా చైర్మన్ టీసీ వరుణ్, ఆర్డీఓ కేశవనాయుడు, సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ఎన్జీఓలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
ఏడాదిలో అనంత రైల్వే స్టేషన్ విస్తరణ పనులు పూర్తి
● కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న అనంతపురం సిటీ: అమృత్ భారత్ పథకం కింద అనంతపురం రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను 2026 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న తెలిపారు. శుక్రవారం ఆయన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలసి స్థానిక రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రైల్వే శాఖ అధికారులు, ఇంజినీర్లతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ అంబికాతో కలసి విలేకర్లతో మాట్లాడారు. అనంతపురం రైల్వే స్టేషన్ విస్తరణలో భాగంగా తొలి విడతలో రూ.30 కోట్లు, మలి విడతలో రూ.22 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ఎస్కలేటర్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. పుట్టపర్తి–బెంగళూరు మధ్య నడిచే మెమూ రైలును అనంతపురం వరకు పొడిగించినట్లు వెల్లడించారు. అనంతపురానికి మరిన్ని రైల్వే సర్వీసులు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్కు అనంతపురంలో హాల్ట్ కల్పించాలని, ధర్మవరం–మచిలీపట్నం రైలుకు రాయలచెరువు స్టేషన్లో స్టాపింగ్కు చొరవ చూపాలని విన్నవించారు. గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, అనంతపురం రైల్వే స్టేషన్ మేనేజర్ మాసినేని అశోక్కుమార్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. వాహనం బోల్తా.. ఒకరి మృతి తాడిపత్రి: మండలంలోని ఇగుడూరు గ్రామం వద్ద బొలెరో లగేజీ వాహనం బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు కర్ణాటక ప్రాంతంలో కొనుగోలు చేసిన జీవాలను బొలెరో లగేజీ వాహనంలో ఎక్కించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం ఇగుడూరు గ్రామం వద్దకు చేరుకోగానే టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తాపడింది. ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన చాంద్బాషా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ హుస్సేన్ బాషా, ఎర్రగుంట్లకు చెందిన ఆంజనేయులు, గంగప్రతాప్ గాయపడ్డారు. ఘటనపై రూరల్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఆర్టీసీలో కదిలిన అక్రమాల డొంక
అనంతపురం క్రైం: ఆర్టీసీలో జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో చోటు చేసుకున్న అక్రమాల తీగ లాగిన కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆర్టీసీ ఆదాయానికి పటిష్ట రక్షణ కవచంగా ఉండాల్సిన విజిలెన్స్ విభాగంలోని ఉన్నత స్థాయి అధికారులే అందిన కాడికి దోచుకున్నట్లుగా ఇప్పటికే విచారణాధికారులు నిగ్గు తేల్చారు. కడప జోనల్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమాలకు ఊతమిచ్చిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి ముజఫర్ రహిమాన్ అవినీతి సెగ ప్రస్తుతం ప్రధాన కార్యాలయాన్ని తాకింది. ముజఫర్ ముఠాకు మహిళా అధికారి దన్ను ముజఫర్ అక్రమాలపై కొందరు బాధితులు నేరుగా విజయవాడలోని ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రధాన కార్యాలయంలోని విజిలెన్స్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ఓ మహిళా అధికారినికి బాధ్యతలు అప్పగించారు. అప్పటి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేస్తున్న సదరు అధికారి రంగంలోకి దిగి విచారణ పేరుతో నాటకీయ పరిణామాలకు తెరలేపారు. చివరకు ముజఫర్ ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదంటూ ఓ నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే క్లీన్చిట్ ఇచ్చేందుకు ముజఫర్ నుంచి రూ.5 లక్షలు సదరు అధికారి తీసుకున్నట్లు తాజా విచారణలో వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న సదరు అధికారి వెంటనే దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయినట్లు విస్తృతంగా చర్చ సాగుతోంది. ఆమె అక్రమాలకు సంబంధించిన బలమైన ఆధారాలను విచారణాధికారులు సేకరించారు. ఈ నివేధిక ఇంకా ప్రధాన కార్యాలయానికి చేరకనే ఆమె లాంగ్ లీవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. లోతైన దర్యాప్తు చేయాలి ముజఫర్ రహిమాన్ పని చేసిన సమయంలో ఉద్యోగులు, కార్మికులపై వచ్చిన అన్ని ఆరోపణలపై తిరిగి విచారణ చేపట్టాలని ఆర్టీసీలోని వివిధ యూనియన్ నాయకుడు డిమాండ్ చేస్తున్నారు. ఓ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ జరిపాలని కోరుతున్నారు. ఈ విచారణ జరిపితే అనంతపురం రీజినల్ కార్యాలయంలోని పెద్దల అవినీతి బాగోతాలు కూడా బయటపడతాయని వాదిస్తున్నారు. వెలుగు చూస్తున్న అక్రమాల బాగోతం కింది స్థాయి సిబ్బందిపై ఆరోపణ వస్తే చాలు వెనక ముందు ఆలోచించకుండా విచారణ పేరుతో పిలిపించి అందిన కాడికి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి ముజఫర్ రహిమాన్ దోచుకున్నారు. ఈ క్రమంలో తప్పుచేసిన వారు బయటపడ్డామని సంబరపడితే.. ఎలాంటి తప్పు చేయని వారు అనవసరంగా డబ్బు పొగొట్టుకున్నామని బాధపడ్డారు. ఈ అక్రమాలపై బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. దీంతో కడప జోనల్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఈ తరహా బాధితులు సుమారు 60 మందికి పైగా ఉన్నట్లు విచారణ అధికారులు నిగ్గు తేల్చారు. 2023 నుంచి ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేసిన ముజఫర్ రహిమాన్ ఇష్టారాజ్యంగా అక్రమాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూసింది. ఈ మొత్తం వ్యవహారం చూసిన విచారణాధికారులు తలలు పట్టుకుంటున్నారు. మలుపు తిరిగిన ఆర్టీసీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అక్రమాల బాగోతం భారీగా ముడుపులు దండుకుని తప్పుడు నివేదిక ఇచ్చిన విజిలెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వాస్తవాలు బయటపడడంతో దీర్ఘకాలిక సెలవులో అధికారి జోనల్ విజిలెన్స్ అధికారి ముజఫర్ రహిమాన్ బాధితుల జాబితా చూసి తలలు పట్టుకుంటున్న అధికారులు -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
● 4.5 కిలోల వెండి సామగ్రి, తులం బంగారం స్వాధీనం కళ్యాణదుర్గం రూరల్: నియోజవర్గ వ్యాప్తంగా పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితల వివరాలను ఏఎస్ఐ రామాంజనేయులుతో కలసి సీఐ వంశీకృష్ణ వెల్లడించారు. కళ్యాణదుర్గం రూరల్, కంబదూరు పీఎస్ పరిధిలో గత ఎనిమిది నెలలుగా దేవాలయాల్లో చోరీలు జరిగాయి.రెండు స్టేషన్ల పరిధిలో మొత్తం నాలుగు కేసులు నమోదుకాగా, డీఎస్పీ రవిబాబు ఽపర్యవేక్షణలో రూరల్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కళ్యాణదుర్గం మండలం హులికల్లు గ్రామం వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో ఆలయాల్లో చోరీలకు పాల్పడింది తామేనని అంగీకరించారు. పట్టుబడిన వారిలో ఆరుల రాజశేఖర్, గొల్ల బొబ్బిలి రాము ఉన్నారు. వీరి నుంచి 4.5 కిలోల వెండి సామగ్రి, ఒక తులం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కాగా, ఇదే కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. విజయనగరం జిల్లాకు చెందిన వీరు సంచార జీవనం సాగిస్తూ ఓ ప్రాంతంలో కొన్ని నెలల పాటు తిష్ట వేసి, ఆ ప్రాంతంలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడేవారు. వీరికి ఆధార్కార్డులు లేకపోవడంతో చోరీ జరిగిన సమయంలో వేలి ముద్రలు లభ్యమైనా ఆచూకీ దొరకకుండా తప్పించుకుని తిరిగేవారని పోలీసులు తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
రాయదుర్గం: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు రాయదుర్గం సీఐ వెంకటరమణ తెలిపారు. వివరాలను ఆయన వెల్లడించారు. శుక్రవారం ఉదయం కణేకల్లు క్రాస్లో కణేకల్లు ఎస్ఐ నాగమధు ఆధ్వర్యంలో సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన కళ్యాణదుర్గానికి చెందిన యువకుడు పిట్ట గంగాధర అలియాస్ సాంబ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చోరీల అంశం వెలుగు చూసింది. క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్కు ఇతర వ్యసనాలకు బానిసగా మారి తన అవసరాలు తీర్చుకునేందుకు దొంగతనాలకు పాల్పడుతూ వచ్చినట్లుగా అంగీకరించాడు. ఏడాదిన్నర కాలంగా కణేకల్లులో 2, రాయదుర్గం, కళ్యాణదుర్గం, అనంతపురం పీఎస్ల పరిధిలో ఒక్కొక్కటి, అన్నమయ్య జిల్లా రాయచోటిలో 1, అనంతపురం రూరల్ పరిధిలో 2 చోరీ కేసుల్లో నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి రూ.48 లక్షలు విలువ చేసే బంగారు నగలు, వెండి సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
నేడు లక్ష్మీనృసింహుడి బ్రహ్మరథోత్సవం
ఉరవకొండ/ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బ్రహ్మరథోత్సవం వైభవంగా జరగనుంది. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. దీంతో ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, ఉచిత భోజన వసతికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి పెన్నహోబిలం ఆలయానికి ప్రత్యేకంగా 42 ఆర్టీసీ సర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్ హంపయ్య తెలిపారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది తెలిపారు. -
కరువు సీమలో సాంకేతిక దీప్తిగా భాసిల్లుతున్న జేఎన్టీయూ (అనంతపురం) మరో స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను దేశానికి అందించిన జేఎన్టీయూ(ఏ)14వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరగనుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 49 మ
అనంతపురం: విశ్వఖ్యాతిగాంచిన జేఎన్టీయూ (ఏ) విశ్వవిద్యాలయం ఎందరో శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను ప్రపంచానికి అందించింది. ఏర్పడిన అనతి కాలంలోనే బీటెక్, బీ–ఫార్మసీ, ఫార్మా–డీ, ఎంటెక్, ఎం–ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది. అలాగే పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నూతన ప్రోగ్రామ్లు అందుబాటులోకి తెచ్చింది. వర్సిటీ పరిధిలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 68 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలు, 43 ఫార్మసీ కళాశాలలు, 24 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ఏటా 1.30 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనను అందిస్తున్నారు. జేఎన్టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, కలికిరి ఇంజినీరింగ్ , పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లోనూ పరిశోధన చేయడానికి వీలుగా 16 రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో గణనీయమైన ర్యాంకు దక్కించుకుని అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది. చేయూత అ‘పూర్వ’ం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 78 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గతంలో ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు వర్సిటీ పురోగతికి చేయూతనందించారు. రూ.8 కోట్ల వ్యయంతో 100 గదులతో కూడిన హాస్టల్ను పూర్వ విద్యార్థుల పేరుతో ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. రూ.50 లక్షలు విలువైన ల్యాబ్నూ ఏర్పాటు చేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ జేఎన్టీయూ క్యాంపస్ కళాశాలలో 2024–25లో బీటెక్ పూర్తి చేసిన మొత్తం 226 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ చాటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. వీరిలో 10 మందికి ఏడాదికి రూ.11 లక్షల వేతనంతో కూడిన కొలువులు దక్కడం విశేషం. జేఎన్టీయూ బంగారాలు: జేఎన్టీయూ అనంతపురం వర్సిటీ పరిధిలో 18 మందికి, జేఎన్టీయూ క్యాంపస్ కళాశాల పరిధిలో ఏడుగురికి మొత్తం 49 బంగారు పతకాలు, ఎంటెక్లో ఒకరు, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలో ఐదుగురి బంగారు పతకాలు దక్కాయి. వీరిలో జేఎన్టీయూ క్యాంపస్ కళాశాల మెకానికల్ విభాగానికి చెందిన నంద్యాల పూజిత్ కుమార్ రెడ్డి ఏకంగా ఆరు బంగారు పతకాలు దక్కించుకుని వర్సిటీ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కాన్పూర్లోని ఐఐటీలో ఎమిరటర్స్ ప్రొఫెసర్ ఎం.ఆర్.మాధవ్ హాజరుకానున్నారు. అలాగే జేఎన్టీయూ (ఏ) పాలకమండలి సభ్యులు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తుంది. ముఖ్య అతిథిగా హాజరవుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలకోపన్యాసం చేయనున్నారు. లైవ్స్ట్రీమ్ ద్వారా స్నాతకోత్సవాన్ని వీక్షించే అవకాశాన్ని కల్పించారు. అగ్రగామిగా తీర్చిదిద్దాలి అన్ని రంగాల్లో జేఎన్టీయూ (ఏ)అగ్రగామిగా తీర్చిదిద్దాలని వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు అన్నారు. శుక్రవారం ఆయన జేఎన్టీయూలోని పాలకభవనంలో స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. నాణ్యమైన పరిశోధనలతో పాటు అత్యుత్తమ బోధన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే దిశగా విద్యా ప్రణాళికలో సమూలంగా మార్పు చేశామన్నారు. గౌరవ డాక్టరేట్ను డాక్టర్ చావా సత్యనారాయణకు అందజేయడం గర్వంగా ఉందన్నారు. స్నాతకోత్సవ సందర్భంగా డిగ్రీలు అందుకునే విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. నేడు జేఎన్టీయూ (ఏ) 14వ స్నాతకోత్సవం చాన్సలర్ హోదాలో ప్రసంగించనున్న గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ ఫౌండర్ డాక్టర్ సత్యనారాయణ చావాకు గౌరవ డాక్టరేట్ 40,109 మంది విద్యార్థులకు డిగ్రీలు, 167 మందికి పీహెచ్డీల ప్రదానం -
చాలా సంతోషంగా ఉంది
మాది వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల. నాన్న బ్రహ్మానందారెడ్డి, అమ్మ మంజుల. నాన్న కడప స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు. బీటెక్లో టాపర్గా నిలవడం అందులోనూ ఆరు బంగారు పతకాలు సాధించడం సంతోషంగా ఉంది. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం టాపర్ (ఒక గోల్డ్మెడల్), ఎండోమెంట్ గోల్డ్మెడల్ ఫర్ బెస్ట్ అకడమిక్ ఫర్ఫార్మెన్స్ అమాంగ్ బాయ్స్ (ఒక గోల్డ్మెడల్), చల్లా సుబ్బారాయుడు ఎండోమెంట్ గోల్డ్మెడల్, ప్రొఫెసర్ వి. పాండురంగడు గోల్డ్మెడల్ (థర్మోడైనమిక్స్ సబ్జెక్టులో టాపర్), 1992 బ్యాచ్ స్పాన్సర్డ్ గోల్డ్మెడల్ , చుండుపల్లి వెంకట్రాయలు.. సరోజమ్మ గోల్డ్మెడల్ ఇలా మొత్తం ఆరు గోల్డ్మెడల్స్ దక్కాయి. అంతేకాక కోర్సు పూర్తికాగానే ఎల్అండ్టీ కంపెనీలో ట్రైనీ ఇంజినీర్గా ఎంపికయ్యాను. – నంద్యాల పూజిత్ కుమార్రెడ్డి -
నేడు నగరంలో తిరంగా యాత్ర
● ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కలెక్టర్ వినోద్కుమార్ పిలుపు అనంతపురం అర్బన్: ‘ఆపరేషన్ సిందూర్’ విజయోత్సవాన్ని పురస్కరించుకుని త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా శనివారం నగరంలో తిరంగా యాత్ర నిర్వహించనన్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఉదయం 8 గంటలకు స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి తిరంగా యాత్ర ప్రారంభమై సప్తగిరి సర్కిల్ మీదుగా నగర పాలక సంస్థ ఎదురుగా ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు సాగుతుందన్నారు. దేశరక్షణలో అహర్నిశలు నిమగ్నమైన సైనికులకు సంఘీభావం తెలపడంతో పాటు జాతీయ జెండా గౌరవాన్ని ఇనుమడింపజేసేలా, దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం ప్రతిభింబించేలా నిర్వహిస్తున్న తిరంగా యాత్ర ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ట్రాఫిక్, భద్రత సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీరు, వైద్య బృందం అందుబాటులో ఉంటుందన్నారు. నేడే సేవ్ ఆర్డీటీ బైక్ ర్యాలీ ● హాజరుకానున్న పార్టీ ముఖ్య నేతలు కళ్యాణదుర్గం: ఆర్డీటీ సంస్థకు కేంద్రం ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ చేయాలనే డిమాండ్తో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య తలపెట్టిన ‘సేవ్ ఆర్డీటీ’ బైక్ ర్యాలీ శనివారం ఉదయం 8 గంటలకు బ్రహ్మసముద్రంలో ప్రారంభం కానుంది. శుక్రవారం పార్టీ కార్యాలయంలో రంగయ్య ఆయా మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో బైక్ ర్యాలీపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బైక్ ర్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు వై.శివరామిరెడ్డి, మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, రాయదుర్గం, తాడిపత్రి సమన్వయకర్తలు మెట్టు గోవిందరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల హాజరవుతారన్నారు. ఆయా మండలాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందిన వారిని చైతన్య పరిచి కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. అలాగే వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దళిత మహిళలపై దాడి చేసిన వారిపై కేసు అనంతపురం/బ్రహ్మసముద్రం: తోటలో రాలిపడిన మామిడిపండ్లను తిన్న కుర్లగుండ గ్రామానికి ముగ్గురు దళిత మహిళలపై దాడి చేసి గాయపరిచిన తీటకల్లు గ్రామానికి చెందిన వారిపై ఎట్టకేలకు బ్రహ్మసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బొబ్బురు రామాంజనేయులు, అనిల్చౌదరి, క్రిష్టప్పలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు బ్రహ్మసముద్రం ఏఎస్ఐ తిమ్మరాజు తెలిపారు. కాగా, ఈ దాడిలో చెవి కర్ణభేరి దెబ్బతినగా, అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న మమత అనే మహిళను ఎస్సీ, ఎస్టీ జేఏసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పరామర్శించారు. పోలీసుల కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఎమ్మెల్యే కూతురి పెళ్లి బందోబస్తులో ఉన్నామని వచ్చిన తర్వాత విచారిస్తామని దాటివేయడం సిగ్గుచేటన్నారు. దళిత మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసిన అగ్రకులస్తులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సాకే హరి వెంట జేఏసీ నాయకులు ఎస్. రామాంజినేయులు, రామకృష్ణ, నారాయణస్వామి, నరేంద్ర, నాగేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీకి మహిళా అభ్యర్థులే ఎక్కువ అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి విడుదల చేసిన డీఎస్సీ–2025కు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళా అభ్యర్థులే ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 20న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గురువారం రాత్రితో ముగిసింది. అనంతపురం జిల్లాకు సంబంధించి మొత్తం 29,078 మంది అభ్యర్థుల్లో 17,070 మంది మహిళలే ఉన్నారు. 12,008 మంది పురుష అభ్యర్థులున్నారు. అర్హతను బట్టి కొందరు అభ్యర్థులు రెండు, మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. -
హనుమజ్జయంతికి ముస్తాబు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఏటా అత్యంత వైభవంగా జరిగే హనుమజ్జయంతి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ కే.వాణి తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని ఈఓ కార్యాలయం ముందు భాగంలో ప్రత్యేక యాగశాలను ఏర్పాటు చేసి.. అక్కడ 108 కలశాలను ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు యాగాలు, హోమాలు నిర్వహిస్తారు. ఈనెల 18వ తేదీన నెట్టికంటి ఆంజనేయ స్వామిని ప్రత్యేక పుష్పాలతో అలంకరిస్తారు. సాయంత్రం ఆలయ ముఖ మండపంలో స్వామివారి ఉత్సవ మూర్తికి తులసీ దళాలతో లక్షార్చన పూజ చేస్తారు. ఈనెల 19వ తేదీన నెట్టికంటి ఆంజనేయ స్వామిని డ్రైప్రూట్స్తో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అదే రోజు సాయంత్రం ఉత్సవ మూర్తికి సింధూరంతో లక్షార్చన పూజ నిర్వహిస్తారు. 20వ తేదీన ఆంజనేయుడిని గంధంతో అలంకరిస్తారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి తమలపాకులతో లక్షార్చన పూజ చేస్తారు. 21వ తేదీన యాగశాలలో నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అష్టోత్తరశత కలశాలతో స్వామికి మహాభిషేకం చేయనున్నారు. వివిధ రకాల పండ్లతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి మల్లెపూలతో లక్షార్చన పూజ నిర్వహిస్తారు. 22వ తేదీన హనుమజ్జయంతి సందర్భంగా హనుమంతుడిని స్వర్ణ, వజ్ర కవచాలతో అలంకరిస్తారు. ప్రత్యేక పుష్పాలు, తోమాలంకరణ అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. ఆలయ ముఖ మండపంలో ఉదయం 9 గంటల నుంచి శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించి పూర్ణాహుతితో ఉత్సవాలను ముగిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆంజనేయ స్వామిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. కసాపురంలో రేపటి నుంచి హనుమజ్జయంతి ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు -
యువ పరిశోధకుడిగా ప్రారంభమైన ‘చావా’ ప్రస్థానం
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. వేసవితాపం అధికంగా కొనసాగుతోంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. గంటకు 6 నుంచి 10 కి.మీ వేగంతో నైరుతి దిశగా గాలి వీచింది. ప్రతి స్నాతకోత్సవానికి విశిష్ట వ్యక్తులను గౌరవ డాక్టరేట్తో సత్కరించడం జేఎన్టీయూ(ఏ) ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో 14వ స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్ను వర్సిటీ చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావాకు అందజేయనున్నారు. ర్యాన్బ్యాక్సీలో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ చావా విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్సిక్స్లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎదిగారు. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005) (హైదరాబాద్)తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి దిశాదర్శకులయ్యారు. ఈ క్రమంలోనే ఆయన్ను 2021లో సాక్షి ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఘనంగా సత్కరించింది. 18 సంవత్సరాల క్రితం ఏర్పాటైన లారస్ ల్యాబ్స్ కంపెనీలో ఇప్పటి వరకూ 150 కొత్త మందులు కనిపెట్టారు. 150 పేటెంట్లు దక్కాయి. రెస్పెక్ట్.. రివార్డు..రీటైయిన్ అనే మూడు ప్రాధాన్యత అంశాలుగా ల్యాబ్స్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. -
అరెస్టులు అప్రజాస్వామికం: అనంత
అనంతపురం కార్పొరేషన్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లొకేష్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడారు. మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి కృష్ణమోహన్ అరెస్టులను ఖండించారు. వారిద్దరి అరెస్టులతో కూటమి సర్కార్ కక్ష సాధింపులు పరాకాష్టకు చేరాయన్నారు. సీఎం చంద్రబాబు సంక్షేమాన్ని పక్కన పెట్టి కక్ష సాధింపులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. లిక్కర్ కేసు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు చూపకుండానే బెదిరింపులకు పాల్పడి... తప్పుడు వాంగ్మూలాలను తీసుకుని అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మద్యం కల్తీ జరిగిందని ఆరోపిస్తున్నారని... మరి కూటమి ప్రభుత్వం కూడా అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని కొనుగోలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్లను లక్ష్యంగా చేసుకుని కొందరిపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులను ఎక్కడా చూడలేదన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలు అమలు చేయడం చేతకాని చంద్రబాబు.. ఏదో ఒక టాపిక్ను తెరపైకి తెచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఇది మంచి సంస్కృతికాదన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలో చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. -
మరోసారి ఫయాజ్ ఇంటికి మున్సిపల్ అధికారులు
తాడిపత్రి రూరల్: తాడిపత్రిలో టీడీపీ నాయకుడు, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కక్ష సాధింపుల పర్వం కొనసాగుతోంది. కమిటీ పేరుతో మరోసారి రెవెన్యూ, మునిసిపల్ అధికారులను గురువారం వైఎస్సార్సీపీ నాయకుడు ఫయాబ్బాషా ఇంటిపైకి ఉసిగొల్పారు. పట్టణంలోని చిన్న బజారులో ఉన్న ఫయాజ్బాషా ఇంటి కొలతల కోసం సోమవారం మునిసిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ వెళ్లింది. వారం క్రితం మొదటిసారి కొలతల కోసం వెళ్లినపుడు తలుపులు మూసేశారనే పేరుతో పంచనామా జరిపి తిరిగి వెళ్లారు. రెండో సారిగా గురువారం వెళ్లిన కమిటీకి మరోసారి తలుపులు మూసి వేసి కనిపించడంతో ఇంటి కొలతలు చేపట్టకుండా మరోసారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పట్టణంలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నా వాటి జోలికి వెళ్లని అధికారులు.. అన్ని అనుమతులతో సక్రమంగా నిర్మించుకున్న ఫయాజ్ ఇంటిపైకి వెళ్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
యువకుడి మృతదేహం వెలికితీత
రాయదుర్గం టౌన్: స్థానిక దుగ్గిలమ్మ గుడి కోనేరులో స్నేహితులతో కలసి ఈతకు వెళ్లి గల్లంతైన బోయ రాజశేఖర్ (30) రెండో రోజు గురువారం మృతదేహమై నీటిలో తేలియాడుతూ కనిపించాడు. ఈత రాకపోయినా స్నేహితుల ఒత్తిళ్ల కారణంగా బుధవారం బావిలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. గురువారం తెల్లవారుజాము నుంచినాలుగు భారీ స్థాయి ఆయిల్ మోటార్లతో బావిలో నీటిని బయటకు తోడేశారు. ఈ క్రమంలో దాదాపు 20 అడుగులకు పైగా నీటిని తోడిన తర్వాత గురువారం రాత్రి 8.30 గంటలకు రాజశేఖర్ మృతదేహం తేలియాడుతూ కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి అంబులెన్సులో స్థానిక ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఉద్దేహాళ్లో ఆగిపోయిన ధాన్యం లారీలు
బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలో 20 రోజుల క్రితం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం లారీల్లోనే ఆగిపోయింది. మూడు రోజులుగా ఇదే పరిస్థితి. శ్రీకాళహస్తిలో మిల్లర్లకు బ్యాంకు ష్యూరిటీ లేదని లారీలను అడ్డుకున్నారు. మూడు రోజులుగా లారీలు ఆగిపోవడంతో డ్రైవర్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గురువారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ‘మీ ధాన్యం రవాణా చేయడం కష్టం.. బస్తాలను ఇక్కడే అన్లోడ్ చేసుకోండి’ అంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బస్తాలు కిందికి దించితే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వీలైనంత త్వరగా తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. నేనే ‘రాజు’... నేనే మంత్రి ● విమర్శలకు తావిస్తున్న కూడేరు పీఎస్ సీఐ రాజు వ్యవహారం సాక్షి టాస్క్ఫోర్స్: కూడేరు పీఎస్ సీఐ రాజు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిగా కాకుండా నేనే రాజు.. నేనే మంత్రినంటూ వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్ను టీడీపీ కార్యాలయంగా మార్చినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు బాధితులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వెళితే.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు తప్ప మరెవ్వరూ అక్కడ ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జన్మదినం సందర్భంగా కూడేరు జెడ్పీహెచ్ఎస్లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ కార్యక్రమానికి ఏకంగా యూనిఫాంలో హాజరై ఆ పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కటింగ్లు చేస్తూ హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మంత్రి కేశవ్కు సీఐ రాజు షాడోగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి అధికారి ఇక సామాన్యులకు న్యాయం ఎలా చేస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. -
కమనీయం.. శ్రీవారి కల్యాణం
ఉరవకొండ రూరల్: ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. జిల్లా నలమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ప్రధాన అర్చకుడు ద్వారకనాథచార్యులు, ఈఓ సాకే రమేష్బాబు అధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీనృసింహస్వామి ఉత్సవ మూర్తులకు కల్యాణం జరిపించారు. అంతకు ముందు దేవేరులతో కలసి గరుడ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనిమిచ్చారు. -
ఉన్నట్లుండి ముంచుకొచ్చింది. ఒక్కసారిగా విరుచుకుపడింది. ఉరిమి ఉరిమి గడగడలాడించింది. పంటలకు నష్టం కలిగించింది. జీవాలను బలితీసుకుంది. భారీ వృక్షాలను సైతం నేలకూల్చింది. జిల్లాలో పలు చోట్ల వాన బీభత్సం సృష్టించింది. వరదతో ముంచెత్తింది. వర్షానికి తోడుగా మెరుపులు
రాప్తాడురూరల్/అనంతపురం అగ్రికల్చర్: రాప్తాడు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. 27 మండలాల పరిధిలో 16.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. రాప్తాడులో రికార్డు స్థాయిలో 141.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే, కళ్యాణదుర్గం 53.2 మి.మీ, ఆత్మకూరు 38, బ్రహ్మసముద్రం 35, బుక్కరాయసముద్రం 34.2, శెట్టూరు 27.6, పామిడి 26.4, నార్పల 25.6, అనంతపురం మండలంలో 24.6 మి.మీ వర్షం కురిసింది. కణేకల్లు, బొమ్మనహాళ్, విడపనకల్లు, ఉరవకొండ మినహా మిగతా మండలాల్లో మోస్తరుగా వాన పడింది. వణికిన రాప్తాడు.. రాప్తాడు మండలాన్ని వరుణుడు బెంబేలెత్తించాడు. మండలంలోని సీపీఐ కాలనీని వాన నీరు ముంచెత్తాయి. పలువురు స్థానికులు ఇళ్లపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను గురువారం ఉదయం అగ్ని మాపక సిబ్బంది తాళ్లు, ట్యూబుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ● అనంతపురం రూరల్ పరిధి కక్కలపల్లి పంచాయతీలోని బీజేపీ కొట్టాలు, ప్రజాశక్తినగర్, ఆర్డీటీ కాలనీల్లో దాదాపు 90 ఇళ్లల్లోకి నీరు చేరాయి. గురువారం తెల్లవారుజాము 4 గంటల నుంచి ఒక్కసారిగా ఇళ్లలోకి నీళ్లు చేరడం ప్రారంభించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బతుకు జీవుడా అంటూ పిల్లాపాపలతో బయటకు పరుగులు తీశారు. వాన నీరు ఇంట్లో చేరడంతో నారాయణ ఇంట్లో దాదాపు 20 ప్యాకెట్ల బియ్యం, కందిబేడలు తడిసిపోయాయి. నరసింహులు, నాయక్లు వ్యాపార నిమిత్తం తెచ్చుకున్న ఎండు కర్జూరం, 2 టన్నుల మామిడిపండ్లు పూర్తిగా తడిసిపోయాయి. ఎంపీడీఓ దివాకర్, ఈఓఆర్డీ వెంకటనాయుడు కాలనీల్లో పర్యటించారు. బాధితుల వివరాలను సేకరించారు. ● బీజేపీ కాలనీ పక్కన నెట్టెం ఆనంద్నాయుడు అనే వ్యక్తి వంకను ఆక్రమించి వెంచర్ ఏర్పాటు చేయడంతో వర్షం నీరు ఇళ్లలోకి చేరిందని స్థానికులు వాపోయారు. డ్రైనేజీని ఆక్రమించడంతో దుస్థితి నెలకొందని చెబుతున్నారు. ● కాటిగానికాలువకు చెందిన రైతు రామచంద్ర తన ఎకరా భూమిలో సాగు చేసిన బీరపంట మొత్తం నీటిలో మునిగిపోయింది. రామినేపల్లి గ్రామంలో రాగే లక్ష్మీనారాయణ అనే రైతు 1.80 ఎకరాల్లో 2 నెలల క్రితం సాగు చేసిన 2 వేల అరటి మొక్కలు కొట్టుకుపోయాయి. ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్మించిన చెక్డ్యాంకు రామయ్య అనే వ్యక్తి రంధ్రం వేశాడని, దీంతో నీరు తన పొలంలోకి చేరి పంట మొత్తం దెబ్బతిందని రామచంద్ర వాపోయాడు. మరో 15 రోజుల్లో కోత పెట్టాల్సిన సమయంలో ఇలా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ● వాన నీటితో పంగల్రోడ్డు సమీపంలోని శిల్పా లేపాక్షి నగర్లో పలు ఇళ్లు నీట మునిగాయి. ఆక్రమణల కారణంగానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు పేర్కొన్నారు. పంటలకు తీవ్ర నష్టం.. వర్షం ధాటికి జిల్లాలో పలు చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనంతపురం, కళ్యాణదుర్గం మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడా కరెంటు స్తంభా లు, వృక్షాలు నేలకూలాయి. కక్కలపల్లి సబ్స్టేషన్లోకి నీళ్లు చేరడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ వర్షాలు ఖరీఫ్ పంటల సాగుకు వీలుగా భూములు దుక్కులు చేసుకునేందుకు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లో వాన రాప్తాడులో కుండపోత రికార్డు స్థాయిలో 141.2 మి.మీ వర్షపాతం కాలనీలు జలమయం.. విద్యుత్ సరఫరాకు అంతరాయం పలు చోట్ల పంటలకు నష్టం జీవాల మృత్యువాత -
కంచె.. చేను మేసింది!
● ఆర్టీసీలో అధికారి ధన దాహానికి 60 మంది బలి ● జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి ముజఫర్ రహిమాన్ నయా దందా ● పక్కా ఆధారాలతో ఎండీకి నివేదిక ● విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు ● రోజుకో మలుపు తిరుగుతున్న అక్రమాల బాగోతం ● వసూళ్లకు 9 మంది ఏజెంట్లు ● రూ.కోట్లలో దండుకున్న వైనం అనంతపురం క్రైం: క్రమ శిక్షణకు మారుపేరుగా ఉన్న ఆర్టీసీలో ఉన్నతాధికారులే దారి తప్పారు. కింది స్థాయి ఉద్యోగులకు పర్యవేక్షకులుగా ఉండాల్సిన వారే దిక్కుమాలిన పనులు చేసి అడ్డంగా దొరికిపోయారు. కొంత కాలంగా ఆర్టీసీ జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా పని చేసిన ముజఫర్ రహిమాన్ అక్రమాల బాగోతం ప్రస్తుతం ఆ సంస్థను కుదిపేస్తోంది. అతనిపై చర్యలు తీసుకున్నా.. నేటికీ ఇంకా ఆయన బాధితులు కార్యాలయానికి క్యూ కడుతూనే ఉన్నారు. ఏకంగా 9 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని సుమారు రూ. 2 కోట్లకు పైగా ఆయన దోచుకున్నట్లు అధికారికంగా గుర్తించారు. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులే చెబుతుండడం గమనార్హం. 60 మందికి పైగా బాధితులు అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పరిధిలో సుమారు 60 మందికిపైగా ముజఫర్ రహిమన్ బాధితులున్నట్లు విచారణాధికారులు గుర్తించారు. వీరందరినీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. కొందరు మహిళా ఉద్యోగుల విషయంలోనూ ముజఫర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. కింది స్థాయి సిబ్బందిపై చిన్నపాటి ఆరోపణ వచ్చినా నేరుగా వారిని పిలిపించుకుని లోబరుచుకోవాలన్న ప్రయత్నాలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. జోన్ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 29 మందిని విచారణ చేసిన అధికారులు... వారి నుంచి ముజఫర్ రూ.16,65,650లు వసూలు చేసినట్లు నిగ్గు తేల్చారు. ఇంకా విచారణ కొనసాగుతోంది. రూ.2 కోట్ల వరకు కొల్లగొట్టినట్లుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. ముఠాను ఏర్పాటు చేసి.. ఆర్టీసీ కడప జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి ముజఫర్ రహిమాన్ తనదంటూ ప్రత్యేక అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని, దోపిడీకి తెరలేపారు. మూడు జిల్లాల పరిధిలోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులను ఎంపిక చేసుకుని వారి ద్వారా యథేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రాథమిక విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు... ముజఫర్ రహిమాన్కు సంబంధించిన 9 మంది ఏజెంట్లను గుర్తించారు. అనంతరం ముజఫర్పై సస్పెన్షన్ వేటు వేసి సమగ్ర విచారణ చేపట్టారు. ముజఫర్ ముఠాలో కీలకంగా కేవీ రెడ్డి, ఎన్పీఎల్ఎన్వీ ప్రసాద్, యూఎన్ఎస్ రెడ్డి, జీవీజీ రమణ, మనోహర్, కేఆర్సీ రెడ్డి, ఆర్ఎంఎస్ నాయక్, శివకుమార్, శంకరయ్య ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇంకా ఈ జాబితాలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన మరి కొందరు ఉన్నట్లు సమాచారం. తారస్థాయిలో అక్రమాల బాగోతం అనంతపురం ఆర్టీసీలో ఉన్నతాధికారులు కూడా ఇదే మార్గం నడిచినట్లు ఆరోపణలున్నాయి. గుత్తి డిపోలో కొంత కాలంగా ఉద్యోగుల పనితీరుపై అనేక ఆరోపణలున్నాయి. అలాగే ఉరవకొండ ఆర్టీసీ డిపోలోనూ రూ.42 లక్షల వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. దీనికి తోడు అనంతపురం కార్గో అధికారి అద్దె వాహనం పేరుతో చేసిన మోసంపై ఎలాంటి చర్యలూ లేవు. ఇలా అనంతపురం ఆర్టీసీలోని ఉన్నతాధికారుల అవినీతి బాగోతం కూడా వెలుగు చూస్తుండడంతో కార్మికుల్లో అసహనం రేకెత్తుతోంది. ఆర్టీసీ ఆర్ఎం స్థాయి అధికారి కూడా అక్రమాలకు పాల్పడిన వారికి దన్నుగా నిలుస్తూ వారిని కాపాడేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఈ అవినీతి అక్రమాలపై ఆర్టీసీ ఎండీ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంస్థ కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలోని యూనియన్ల నేతలు మాత్రం తాజాగా ఎండీని కలసి ఉద్యోగులు, కార్మికుల నుంచి జోనల్సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి ముజఫర్ రహిమాన్ బాధితులకు తిరిగి డబ్బు ఇప్పించాలని విన్నవించిసట్లు తెలుస్తోంది. -
21న జెడ్పీ సర్వసభ్య సమావేశం
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21న నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఈఓ జి.వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు అనంతపురంలోని జిల్లా పరిషత్ సమావేశ ప్రధాన మందిరంలో చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. సీఈఓ రాజోలి రామచంద్రారెడ్డి చర్చ ప్రారంభిస్తారని, గత సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలకు సంబంధించి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారనే విషయంపై సమగ్ర వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు హాజరయ్యే సమావేశానికి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని స్పష్టం చేశారు. గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీ ఈసెట్లో 91.71 శాతం ఉత్తీర్ణత అనంతపురం: ఏపీ ఈసెట్లో జిల్లాకు చెందిన విద్యార్థులు 91.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్కు మొత్తం 2,538 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,448 మంది పరీక్షకు హాజరయ్యారు. 2,245 మంది అర్హత మార్కులు సాధించారు. బాలురు 1,735 మంది దరఖాస్తు చేసుకోగా 1,668 (91.25శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. 1,522 మంది అర్హత సాధించారు. బాలికలు 803 మంది దరఖాస్తు చేసుకోగా, 780 మంది పరీక్ష రాశారు. 723 (92.69 శాతం) మంది అర్హత సాధించారు. రాయలచెరువు విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ యాడికి: ఈసెట్ ఫలితాల్లో మండలంలోని రాయలచెరువు గ్రామానికి చెందిన టోపీఖాన్ కుమారుడు రఖీబ్ ఖాన్ సత్తా చాటాడు. 200 మార్కులకు 96 మార్కులు సాధించి జిల్లాలో మొదటిస్థానంలో నిలిచాడు. విద్యార్థి రఖీబ్ ఖాన్ను స్థానికులు అభినందించారు. గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు అనంతపురం అర్బన్: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గవర్నర్ ఈనెల 17న జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేయనున్నారు. ఆ రోజున గవర్నర్ విడిది చేయనున్న ఆర్అండ్బీ అతిథి గృహాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అతిథి గృహంలోని గదులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిథి గృహం పరిశుభ్రంగా ఉండా లని, ఆవరణను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సోఫాలు, ఫర్నీచర్, ఏసీలు మరమ్మతు చేయించాలని సూచించారు. నీటి సరఫరా, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలని, అతిథి గృహాన్ని ఒక రోజు ముందే ఆధీనంలోకి తీసుకోవాలని టూటౌన్ సీఐ శ్రీకాంత్కు చెప్పారు. లైజనింగ్ అధికారులు, సిబ్బంది తప్ప ఇతరులెవరినీ లోపలికి అనుమతించకూడదన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శివ్ నారాయణ్ శర్మ, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ రామ్మెహన్, ఆర్అండ్బీ డీఈఈ కాటమయ్య, పౌర సరఫరాల శాఖ డీఎం రమేష్రెడ్డి, డీఎస్ఓ జగన్మో హన్రావు, తహసీల్దార్లు హరికుమార్, బ్రహ్మయ్య, రియాజ్బాషా, ఆర్ఐ సందీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎంటెక్, ఫార్మాడీ ఫలితాల విడుదల అనంతపురం: ఎంటెక్, ఫార్మాడీ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ (ఏ) పరిధిలో మార్చిలో నిర్వహించిన ఫార్మాడీ, ఎంటెక్ నాలుగో సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను గురువారం వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు విడుదల చేశారు. ఫలితాల కోసం జేఎన్టీయూ(ఏ) వెబ్సైట్లో చూడాలని కోరారు. -
ఐదురోజులు వర్షసూచన
ముందస్తు నైరుతి నేపథ్యంలో రానున్న ఐదు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లాలో కొన్ని ప్రాంతాలకు భారీ వర్షసూచన తెలియజేస్తూ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించినట్లు పేర్కొన్నారు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులకు సంబంధించి వచ్చే రెండు రోజులు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించినట్లు తెలిపారు. ఈ నెల 17 నుంచి 19 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే సూచన ఉన్నట్లు తెలిపారు. -
అక్లాండ్లో వైఎస్సార్సీపీకి అపూర్వ ఆదరణ
అనంతపురం కార్పొరేషన్: న్యూజిలాండ్లోని అక్లాండ్లో వైఎస్సార్సీపీకి అపూర్వ ఆదరణ లభించింది. పార్టీ కార్యకలాపాల్లో ప్రవాసాంధ్రులను మమేకం చేసేలా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి గురువారం అక్లాండ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరు, కో కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, సమంత్ డేగపూడి, తదితర ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం అక్లాండ్లోని గ్లోబల్ కనెక్ట్ మీటింగ్లో ఆలూరు సాంబశివారెడ్డి ప్రసంగించనున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, సంక్షేమ పథకాల అమలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. భవిష్యత్తులో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎన్ఆర్ఐలు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చాటిన ఉమ్మడి జిల్లాలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ మేరకు నక్కారామారావు ఎడ్యుకేషనల్, కల్చరల్ ట్రస్ట్ బోర్డు, యాదవ సంఘం, యాదవ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆయా సంఘాల ప్రతినిధులు జి.నాగభూషణం, జి.శ్రీనివాసులు, రామకృష్ణ, ఎం.శ్రీరాములు, ఉమాశంకర్, హేమంత్, లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతిలో 400పైబడి మార్కులు, ఇంటర్లో 700పైబడి మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులు. జూన్ 1న పురస్కారాలు అందజేయనున్నారు. పూర్తి వివరాలకు 83094 75846, 94922 87710లో సంప్రదించవచ్చు. -
యువకుడి అనుమానాస్పద మృతి
అనంతపురం: స్థానిక అశోక్నగర్లో నివాసముంటున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వన్టౌన్ సీఐ వి.రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం నిమ్మగల్లుకు చెందిన తిప్పేస్వామి కుమారుడు శివప్రసాద్ (22) అనంతపురంలో డీజేగా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న ఉదయం ఉరవకొండ నుంచి అనంతపురానికి వచ్చి అశోక్నగర్లోని తన స్నేహితులతో కలిసి రూంలో ఉంటున్నాడు. కియా పరిశ్రమలో పనిచేస్తున్న స్నేహితులందరూ బుధవారం విధులకు వెళ్లి రాత్రి 2 గంటలకు గదికి చేరుకున్నారు. అప్పటికే గదిలో నిద్రపోతున్న శివకుమార్ లేచి తలుపు తీసి, కాసేపు మాట్లాడి తిరిగి గదిలోనే నిద్రపోయాడు. గురువారం ఉదయానికి మృతి చెంది కనిపించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. టవాల్తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్నేహితులు తెలిపారు. అయితే టవాల్తో ఉరి వేసుకోవడం సాధ్యం కాదనే వాదనలు వినిపించాయి. ఘటనపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కారు దగ్ధం ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామ సమీపంలో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. వెనిల్ అనే వ్యక్తితో కలసి మరో వ్యక్తి అనంతపురం నుంచి కారులో ధర్మవరానికి బయలుదేరాడు. చిగిచెర్ల సమీపంలోకి చేరుకోగానే ఒక్కసారిగా కారులో నుంచి పొగలు రాసాగాయి. గమనించిన వారు కారు ఆపి కిందకు దిగారు. అప్పటికే మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
గెలుపునకు అడ్డదారులా?
ఆత్మకూరు: గొర్రెల, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని, ఇందుకు అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన మలరాయుడు, వైస్ ప్రెసిడెంట్ స్థానానికి పోటీ చేసిన శివప్రసాద్ ఆరోపించారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. గొర్రెల, మేకల ప్రాథమిక సహకార సంఘం ఎన్నికలకు ఈ ఏడాది జనవరి 25న మదిగుబ్బలో ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. గ్రామంలొ మొత్తం 152 మంది సభ్యులుండగా ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతు అభ్యర్థి మలరాయుడుకు 93 మంది, టీడీపీ మద్దతు అభ్యర్థి నరసింహులుకు 12 మంది సభ్యులు మద్దతు పలికారన్నారు. ఇది గిట్టని టీడీపీ నేతలు అధ్యక్ష స్థానం తమకే దక్కాలన్న అక్కసుతో దాదాపు 50 మంది పోలీసులను అడ్డం పెట్టుకుని గొడవ చేసి ఎన్నికలను వాయిదా పడేలా చేశారన్నారు. ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత 152 సభ్యుల్లో కేవలం 90 మందికి మాత్రమే సభ్యత్వం ఉందని అధికారులు చెబుతున్నారని, అలాగే రెండు రోజుల క్రితం పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి టీడీపీకి అనుకూలంగా ఉన్న 67 మందిని సభ్యులుగా చేర్చారని వివరించారు. ఎన్నికలు వాయిదా పడిన తర్వాత కొత్త సభ్యులను ఎలా చేరుస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. 2018 నాటికి సంఘంలో 90 మంది సభ్యులు ఉన్నారని, 2019లో ప్రెసిడెంట్ స్థానానికి పోటీ చేసిన పోతిరెడ్డి 62 మందికి చలానాలు కట్టి సభ్యులుగా చేర్చారని గుర్తు చేశారు. చలానా కట్టి సభ్యులుగా పేర్లు నమోదు చేయాలంటే ఆడిట్ తప్పనిసరిగా చేయాల్సి ఉందన్నారు. 2017 నుంచి 2018 వరకు ఆడిట్ ప్రక్రియను ఎందుకు చేపట్టలేదో అధికారులకే తెలియాలన్నారు. దొంగ రసీదులు సృష్టించి అధ్యక్ష స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు ఆడిన చదరంగంలో అధికారులు పావులుగా మారారన్నారు. ఈ అంశంపై పంపనూను పశువైద్యాధికారి దిలీప్ను వివరణ కోరగా... ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు కొత్తగా 67 మంది సభ్యులను చేర్చినట్లు తెలిపారు. ఏపీసీఎస్ యాక్ట్ 1964 సెక్షన్ 19 ప్రకారం వారందరూ సభ్యులుగా పరిగణించబడుతారని వివరించారు. గొర్రెల, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో వంచనకు తెరలేపిన అధికారులు ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత జాబితాలో కొత్తగా 67 మంది చేర్పు -
విత్తనకాయల పంపిణీకి సిద్ధంగా ఉండండి
అనంతపురం అర్బన్: జిల్లాలో వేరుశనగ విత్తనకాయల పంపిణీకి అవసరమైన చర్యలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కిసాన్ డ్రోన్లను పంపిణీ చేయాలని చెప్పారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్–2025కు సంబంధించి 50,592 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. జిల్లాకు 35 డ్రోన్లు కేటాయించారన్నారు. 31 మండలాల పరిధిలో గుర్తించిన 26 గ్రూపులకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మిగిలిన గ్రూపులను ఎంపిక చేసి ఈ నెలాఖరులోగా డ్రోన్లు పంపిణీ చేయాలన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు ఇరువైపులా ఉద్యాన పంటలు సాగయ్యేలా చూడాలన్నారు. కాలువ గట్టుపై టేకు మొక్కల ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జేడీ వెంకటస్వామి, ఉద్యాన శాఖ డీడీ రఘునాథరెడ్డి, ఏడీ ఫిరోజ్ఖాన్, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, డీసీఓ అరుణకుమారి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, ఏడీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానా అనంతపురం కార్పొరేషన్: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే వ్యాపారులకు జరిమానా విధిస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ హెచ్చరించారు. బుధవారం నగరంలోని హౌసింగ్ బోర్డు సెవెన్హిల్స్ కాలనీలో ఇంటింటా చెత్త సేకరణను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలనీలో డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని ముస్తాఫా అనే వ్యక్తి కలెక్టర్కు విన్నవించగా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ బాలస్వామిని ఆయన ఆదేశించారు. నిషేధిత ప్లాస్టిక్ను వాడకుండా పబ్లిక్ నోటీసును జారీ చేయాలన్నారు. ప్రతి షాపు వద్ద తడి, పొడి చెత్త డస్ట్ బిన్లను ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఎస్ఈ చంద్రశేఖర్, ఈఈ షాకీర్, ఇన్చార్జ్ ఈఈ బీఎల్ నరసింహ తదితరులున్నారు. రైతు గ్రూపులకు కిసాన్ డ్రోన్లను పంపిణీ చేయండి కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం -
యథేచ్ఛగా ఎర్రమట్టి దోపిడీ
జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. వేసవితాపం అధికంగా కొనసాగింది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రాయదుర్గం టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల దోపిడీకి అంతులేకుండా పోతోంది. సహజ వనరులను యథేచ్ఛగా కొల్లగొట్టి రూ. కోట్లలో దోచేస్తున్నారు. టీడీపీ నేతల స్వార్థానికి రాయదుర్గం నియోజకవర్గంలో సహజ సిద్దంగా ఏర్పడిన కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. గత రెండు రోజులుగా రాయదుర్గంలోని శనీశ్వరాలయం వెనుక ఉన్న హౌసింగ్ లే అవుట్కు ఆనుకుని కొండ ప్రాంతంలో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. అదే ప్రాంతంలో కొండ పొరంబోకు స్థలంలో భారీ విస్తీర్ణాన్ని చదును చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించేందుకు ఓ టీడీపీ నాయకుడు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు. ఎంసీఏ కళాశాల, ఇందిరమ్మ లేఅవుట్లు, గౌడ లేవుట్ సమీపంలో ఉన్న కొండల్లో నుంచి గ్రావెల్ తవ్వకాలు పెరిగిపోయాయి. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఎర్రమట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ప్రైవేటు వ్యక్తులు తమ స్థలాలను ప్లాట్లు వేసి, రోడ్లను చదును చేసేందుకు కొండల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
బీపీఈడీ ఫలితాల విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీపీఈడీ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ఆచార్య బి.అనిత బుధవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 73.77 శాతం, మూడో సెమిస్టర్లో 82.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలు జ్ఞానభూమి పోర్టల్లో చూడవచ్చు. అలాగే బీఎస్సీ, బీకాం, బీసీఏ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్ దరఖాస్తుకు ఈ నెల 30 చివరి తేదీగా నిర్దేశించినట్లు అనిత పేర్కొన్నారు. కార్యక్రమంలో రెక్టార్ జి.వెంకటనాయుడు, రిజిస్ట్రార్ డాక్టర్ ఈ.రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సి.లోకేశ్వర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సహజ వనరుల లూటీ విచ్చలవిడిగా జరుగుతోంది. మట్టి, ఇసుక, గ్రావెల్ మొదలుకొని అన్నింటినీ ‘తెలుగు తమ్ముళ్లు’ దోపిడీ చేస్తున్నారు. ‘పచ్చ’ నేతల హస్తం ఉండటంతో తనిఖీలకు వెళ్లేందుకు మైనింగ్ అధికారులు జంకుతున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మట్టి, ఇసుక, గ్రావెల్ తదితర వాటిని వాణిజ్య అవసరాలకు తరలించే వాహనాల నుంచి రాయల్టీ డబ్బు వసూలు చేసేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రైవేటు సంస్థకు లీజు కట్టబెట్టేది. లీజు దక్కించుకున్న సంస్థ నెలానెలా ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో కొంత మొత్తం చెల్లించేది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం లభించేది. అయితే, జిల్లాలో ప్రైవేటు సంస్థ లీజు గడువు మార్చితోనే ముగిసింది. తర్వాత ఇప్పటివరకూ ఎవ రికీ ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి సహజ వనరుల అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 11 మాసాల్లోనే కొండల నేలమట్టం.. ‘కూటమి’ అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే అనంతపురం సమీప ప్రాంతాల్లో కొండలు కరిగిపోయాయి. గుట్టలు నేల మట్టమయ్యాయి. రాప్తాడు నియోజకవర్గంలోని క్రిష్ణంరెడ్డి పల్లి గుట్టలను కరిగించేశారు. రోజూ ఇక్కడి నుంచి వంద నుంచి 150 టిప్పర్ల మట్టి కర్ణాటకకు పంపిస్తున్నారు. ఇక్కడికి ఇద్దరు మైనింగ్ అధికారులు వెళ్లి వెనక్కు వచ్చారు. మహిళా అధికారులు మట్టి దొంగలను నిలువరించలేకపోయారు. ఇక.. ఆలమూరు కొండలంటే ఈ ప్రాంతంలో ప్రసిద్ధి. పశుపక్ష్యాదులకు ఆలవాలంగా ఉండటమే కాదు రాప్తాడు, అనంతపురం ప్రాంతాలకు రక్షణ కవచంలా ఉండేవి. అలాంటి కొండలను నేలమట్టం చేశారు. చివరకు కరెంటు పోళ్లు కూడా కిందపడిపోయేలా మట్టిని తవ్వారు. స్థానిక టీడీపీ నేత ఆధ్వర్యంలో అక్రమ వ్యవహారం ఇష్టారాజ్యంగా జరుగుతోంది. కరిగిపోయిన నేమకల్లు గుట్టలు రాయదుర్గం నియోజకవర్గం నేమకల్లులో జరుగుతున్న మైనింగ్.. రాష్ట్ర చరిత్రలోనే పెద్దదిగా చెప్పొచ్చు. మైనింగ్ డాన్గా పేరుగాంచిన టీడీపీ నేతలిద్దరు భారీగా క్రషర్లు పెట్టి కొండలను పిండి చేస్తున్నారు. ఆరు హెక్టార్లు లీజు ఉంటే 50 ఎకరాల్లో తవ్వుతున్నారు. రూ.20 కోట్ల పెనాల్టీ వేస్తే దాన్ని మాఫీ చేయించుకునేందుకు యత్నిస్తున్నారు. ‘తాడిపత్రి’లో విచ్చలవిడిగా... తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో ఇసుక, మట్టి దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. పెద్దపప్పూరు మండలంలోని సోమనపల్లి, తిమ్మనచెరువు గ్రామాల్లో విచ్చలవిడిగా మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకునేవారే లేరు. ఆత్మకూరు మండలంలో తారస్థాయికి.. ఆత్మకూరు మండలంలో ఎర్రమట్టి దందా తారస్థాయికి చేరింది. ‘తెలుగు తమ్ముళ్లు’ మట్టి దందాను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డు ప్రాంతం మొత్తం ఇప్పటికే వెంచర్లతో నిండిపోయింది. ఈ క్రమంలో ఆత్మకూరు మండలం వడ్డుపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఎలాంటి గ్రావెల్ లీజులు లేకుండానే కొండలను పిండి చేసి అక్రమంగా మట్టి రవాణా సాగిస్తున్నారు. హిందూపురంలో పట్ట పగలే దోపిడీ.. హిందూపురం పట్టణం చుట్టూ ఉన్న రూరల్ ప్రాంతాల నుంచి మట్టి యథేచ్ఛగా కర్ణాటకకు తరలిస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకుంటున్నా వినకుండా మట్టి తోలుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల అండగా తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ఎక్కడ చూసినా మట్టి, ఇసుక టన్నుల కొద్దీ కర్ణాటకకు వెళ్లిపోతోంది. ధర్మవరం నియోజకవర్గంలో.. ధర్మవరం నియోజకవర్గలోని చిత్రావతి నది నుంచి రోజూ వందలాది టిప్పర్ల ఇసుక అక్రమంగా తోలుతున్నా పట్టించుకునే దిక్కులేదు. ప్రధాన హైవేలోనే నిర్భయంగా టిప్పర్లు వెళుతున్నా రెవెన్యూ అధికారులు గానీ, మైనింగ్ అధికారులు గానీ వాహనాలను పట్టుకోలేదు. టీడీపీ వాహనాలు అనగానే పోలీసులు వాటికి రాచబాట వేసి మరీ బార్డరు దాటిస్తున్నారు. సహజ వనరుల స్వాహాపర్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలో విచ్చలవిడిగా దోపిడీ రోజూ వందలాది టిప్పర్ల ఇసుక, మట్టి కర్ణాటకకు కొండలు కరిగిపోతున్నా.. గుట్టలు నేలమట్టమవుతున్నా ఎవరికీ పట్టని వైనం -
విశ్రాంత డీఈఓ ఆనందమూర్తి కన్నుమూత
అనంతపురం ఎడ్యుకేషన్: విశ్రాంత జిల్లా విద్యాశాఖ అధికారి సెట్టేల ఆనందమూర్తి (74) కన్నుమూశారు. అనంతపురం నగరంలోని అరవిందనగర్లో నివాస ముంటున్న ఆయన.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆనందమూర్తి సొంతూరు శెట్టూరు మండలం ములకలేడు గ్రామం. భార్య 2008లోనే మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమా రులు సంతానం కాగా... ఇద్దరు హిందీ పండిట్లుగా, ఒకరు పీఈటీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆనందమూర్తి భౌతికకాయానికి గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. ఆనందమూర్తి 1980లో జేఎల్గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. పదోన్నతిపై 1996 నుంచి 2004 వరకు పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పని చేశారు. తర్వాత 2004 నుంచి 2006 వరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఐటీడీఏ, ఎస్సీఈఆర్టీలో పని చేసి 2008లో రిటైర్డ్ అయ్యారు. ఆయన మృతి పట్ల ఎంఈఎఫ్ నాయకులు బండారు శంకర్, హనుమంతరావు, రమేష్, రామన్న తదితరులు సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అప్పట్లో ‘సింగిల్ ఆర్డర్లు’ కలకలం.. ఆనందమూర్తి డీఈఓగా పనిచేసిన కాలంలో జిల్లాలో టీచర్ల బదిలీలకు సంబంధించి ‘సింగిల్ ఆర్డర్లు’ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ప్రభుత్వం జారీ చేసిన బదిలీలతో పాటు ఆయా ఖాళీలకు డీఈఓ సింగిల్ ఆర్డర్ ఇచ్చి బదిలీలు చేశారు. ఒత్తిళ్ల కారణంగా డీఈఓ కొన్ని ఆర్డర్లు ఇస్తే వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి అప్పట్లో కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమకు అనుకూలమైన వారికి చాలా ఆర్డర్లు ఇప్పించుకున్నారు. ఇంకా కొందరు డీఈఓ సంతకాలను సైతం ఫోర్జరీ చేసి ఆర్డర్లు ఇచ్చారు. ఇలా చేసి పలువురు నాయకులు భారీగా వెనకేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో డీఈఓను విశాఖ జిల్లా అరకు ఐటీడీఏకు బదిలీ చేశారు. -
కళ్లకు కట్టారు.. అవగాహన పెంచారు
నంతపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అపార్ట్మెంట్లో బుధవారం జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. విపత్తులు సంభవించిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా వ్యవహరించాలనే విషయాలను అగ్నిమాపక సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. బాంబులు పేలిన సమయంలో హెచ్చరిక సైరన్ మోగించడం నుంచి క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్చడం, సీపీఆర్ చేయడం తదితర విషయాలను క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వినోద్కుమార్ మాట్లాడుతూ విపత్తుల సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టం గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అనంతరం పిల్లలు, యువతకు క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాస రెడ్డి, ఆర్డీఓ కేశవ నాయుడు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి, తహసీల్దార్ హరిప్రసాద్ పాల్గొన్నారు. – అనంతపురం అ -
హనుమద్ వాహనంపై నృసింహుడి విహారం
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు బుధవారం హనుమద్ వాహనంపై విహరించారు. ఉదయం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భూదేవి, శ్రీదేవి సమేతంగా హనుమద్ వాహనంపై కొలువు దీర్చి ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సాకే రమేష్బాబు, అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి, ఉత్సవ ఉభయదాతలు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుర్రం సుధాకర్, గుర్రం రవీంద్రనాథ్ పాల్గొన్నారు.● బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అత్యంత కీలకమైన స్వామివారి కల్యాణోత్సవం ఉంటుంది. అలాగే, గరుడ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతికళ్యాణదుర్గం రూరల్: పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన మండలంలోని మానిరేవు పంచాయతీ ఓబుళాపురంలో జరిగింది. వివరాలు.. ఓబుళాపురం గ్రామానికి చెందిన రామలింగ (40)కు భార్య అశ్విని, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గొర్రెల కాపరి అయిన రామలింగ రోజులాగే బుధవారం తన గొర్రెలను మేపు కోసం గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వర్షం కురవడంతో ఓ చెట్టు చాటుకి వెళ్లాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో రామలింగ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రామలింగ మృతి చెందడంతో భార్యాపిల్లలు బోరున విలపించారు.పాలిసెట్లో 93 శాతం ఉత్తీర్ణతఅనంతపురం: డిప్లొమో కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించిన ఏపీ పాలిసెట్ –2025లో జిల్లా విద్యార్థులు 93.11 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 7,908 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 7,363 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 4,824 మంది హాజరు కాగా, 4,443 (91.89 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. బాలికలు 3,084 మంది హాజరు కాగా, 2,930 (95.01 శాతం) పాస్ అయ్యారు.హారికకు మొదటి ర్యాంకుపాలిసెట్లో జిల్లాకు చెందిన నిమ్మనపల్లి హారిక మోహన్ రాష్ట్ర స్థాయిలో 54వ ర్యాంకు, జిల్లాలో మొదటి ర్యాంకు సాధించింది. మొత్తం 119 మార్కులతో సత్తా చాటింది. మేథమేటిక్స్లో 49 మార్కులు, ఫిజిక్స్లో 40, కెమిస్ట్రీలో 30 మార్కులు సాధించింది.● పగిడి మహమ్మద్ అస్లాం జిల్లా స్థాయి రెండో ర్యాంకు(రాష్ట్ర స్థాయిలో 107)సాధించాడు. మొత్తం 118 మార్కులతో ప్రతిభ కనబరిచాడు. ఈ విద్యార్థికి మేథమేటిక్స్లో 49 మార్కులు, ఫిజిక్స్లో 39, కెమిస్ట్రీలో 30 మార్కులు వచ్చాయి.మహిళపై హోంగార్డు దాడిపుట్లూరు:మండలంలోని కడవకల్లు గ్రామంలో హోంగార్డు దాడి చేయడంతో ఓ మహిళ గాయపడింది. బాధితురాలు తెలిపిన మేరకు.. కడవకల్లు గ్రామంలో తనుజ ఇంటి పక్కనే హోంగార్డు రాజశేఖర్ నివాసముంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తన ఇంటి వద్ద తనుజ దుస్తులు ఉతుకుతున్న సమయంలో రాజశేఖర్ ద్విచక్ర వాహనంపై వెళుతూ తన కాలు తగిలించాడు. దీంతో ఆమె చూసుకుని వెళ్లాలంటూ హోంగార్డుకు సూచించింది. ఆ సమయంలో హోంగార్డు రెచ్చిపోయి ‘నాకే చెబుతావా?’ అంటూ ఆమె గొంతు పట్టుకుని నోటిని అదిమిపెట్టి విచక్షణారహితంగా చితకబాదాడు. గాయపడిన బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదుకు ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లుగా తెలిసింది. దాడికి పాల్పడిన హోంగార్డును కాపాడేందుకు కేసును నిర్వీర్యం చేస్తున్నారంటూ కడవకల్లు వాసులు అసహనం వ్యక్తం చేశారు. -
కేంద్రం ఆధీనంలోకి ‘ఉపాధి’
అనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇక పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ సైతం ఉండకుండా ‘కేంద్రం’ అంతా తానై పథకాన్ని నడపనుంది. ఉపాధి హామీ పథకానికి ఏటా కేంద్రం బడ్జెట్లో నిధులను కేటాయిస్తోంది. అయితే, నిధుల ఖర్చు, పనుల గుర్తింపు తదితర వాటిని అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది. దీంతో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలున్నాయి.ఈ క్రమంలో అక్రమాలు అరికట్టి పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ‘యుక్తధార్’ పేరిట యాప్ తీసుకొ చ్చింది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని 31 మండలాల్లో మండలానికి ఒక పంచాయతీ చొప్పున 31 చోట్ల ‘యుక్తధార్’ పోర్టల్ ద్వారా ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు.యాప్పై అవగాహన కల్పించేందుకు ఉపాధి హామీ సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సదస్సులను నిర్వహిస్తున్నారు. సర్వం యాప్ ద్వారానే.. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న ఉపాధి పనుల గుర్తింపు దగ్గర నుంచి పనులకు వచ్చే కూలీల వివరాలు, బిల్లుల చెల్లింపులు తదితరాలన్నీ ‘యుక్తధార్’ యాప్ ఆధారంగానే జరగనున్నాయి. జియోస్పేషియల్ ప్లానింగ్ పోర్టల్కు అనుగుణంగా ‘యుక్తధార్’ పనిచేస్తుంది. ఈ క్రమంలో ఉపాధి పనులను గుర్తించిన అనంతరం వాటిని జియోట్యాగ్ ద్వారా యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పనులకు వచ్చే కూలీల వివరాలు సైతం పొందుపరచాలి. జియోట్యాగ్ చేసిన పనుల వద్దే కూలీల ఫొటోలను తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ క్రమంలో అవకతవకలకు తావుండదు. కూలీలకు వేతనాలు కూడా త్వరగా విడుదలవుతాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో గ్రామ పంచాయతీల్లో ప్రణాళికలు సులభతరం కానున్నట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. అక్రమాలను అరికట్టేందుకు చర్యలు ప్రత్యేకంగా ‘యుక్తధార్’ యాప్ పనుల గుర్తింపు, బిల్లుల చెల్లింపులు సైతం యాప్ ద్వారానే..31 పంచాయతీల్లో యుక్తధార్ ద్వారా పనులు పైలట్ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 మండలాల్లో మండలానికి ఒక పంచాయతీ చొప్పున 31 గ్రామ పంచాయతీల్లో ‘యుక్తధార్’ పోర్టల్ ద్వారా ఉపాధి హామీ పనులను చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యుక్తధార్ యాప్నకు అనుసంధానం చేసింది. పనుల గుర్తింపు దగ్గర నుంచి బిల్లుల చెల్లింపు వరకూ అన్ని వివరాలు ఈ యాప్ ద్వారానే నడవనున్నాయి. వచ్చే నెలలో పూర్తిస్థాయిలో అన్ని పంచాయతీల్లో అమలు చేయనున్నాం. –సలీంబాషా, డ్వామా పీడీ -
ఖరీఫ్ సాగులో వైవిధ్యం
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ పంటల సాగులో వైవిధ్యం కనిపిస్తోంది. ఒకట్రెండు పంటలపై ఆధారపడకుండా రైతులు మరికొన్ని పంటల సాగుపై దృష్టి సారించారు. అలాగే పెరిగిన పెట్టుబడులు, కూలీల కొరతను దృష్టిలో పెట్టుకుని తక్కువ పెట్టుబడుల పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా కొన్ని దశాబ్దాలుగా ఏకపంటగా లక్షల హెక్టార్లలో సాగవుతున్న వేరుశనగ క్రమేణా సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది. నల్లరేగడి భూముల్లో కేవలం తెల్లబంగారాన్ని నమ్ముకున్న రైతులు ఇటీవల పత్తి సాగును తగ్గించారు. వేరుశనగ, పత్తి స్థానాల్లో కంది, మొక్కజొన్న బాగా పెరిగింది. అలాగే పాతతరం పంట కొర్ర కూడా పెరుగుతోంది. పెసర, అలసంద, ఉలవ తగ్గిపోగా మినుము, సోయాపై మక్కువ చూపుతున్నారు. సజ్జ, జొన్న, పొద్దుతిరుగుడు పంటలు తగ్గుముఖం పట్టాయి. గత ఖరీఫ్లో ‘కంది’ చరిత్ర గత ఖరీఫ్లో కంది పంట చరిత్రను తిరగరాసింది. తొలిసారిగా లక్ష హెక్టార్లకు పైగా సాగులోకి రావడం గమనార్హం. గతేడాది కంది పంట 37,367 హెక్టార్లలో రావచ్చని అంచనా వేయగా... చివరకు ఏకంగా 1.03 లక్షల హెక్టార్లకు ఎకబాకింది. అంటే మూడింతల సాగు పెరిగింది. 31 మండలాల్లోనూ కందిపై రైతులు మొగ్గుచూపారు. ఉమ్మడి జిల్లా చరిత్రలో కూడా ఎప్పుడూ కంది పంట 70 వేల హెక్టార్లు దాటకపోవడం గమనార్హం. 11 వేల హెక్టార్లు సాధారణ సాగుగా అంచనా వేసిన మొక్కజొన్న 20 వేల హెక్టార్లకు పెరిగింది. ఇటీవల కాలంలో చాలామంది రైతులు మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రెండు పంటలకు పెట్టుబడులు తక్కువ కావడంతో విస్తీర్ణం క్రమేణా పెరుగుతోంది. కొర్ర కూడా 1,500 హెక్టార్లుగా అంచనా వేయగా రెట్టింపు విస్తీర్ణంలో 3 వేల హెక్టార్లకు పెరిగింది. ఇక ఐదారేళ్లుగా ఆముదం పంట కాస్త అటుఇటుగా 15 వేల హెక్టార్లతో స్థిరంగా కొనసాగుతోంది. బాగా తగ్గిన వేరుశనగ, పత్తి గతి తప్పిన వర్షాలు, పెరిగిన పెట్టుబడులు, గిట్టుబాటు ధర లభించని కారణంగా రైతులు వేరుశనగ, పత్తి సాగును తగ్గించేశారు. గత ఖరీఫ్లో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 1.98 లక్షల హెక్టార్లు కాగా 57 శాతంతో 1.12 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. అలాగే పత్తి సాగు కూడా 48,586 హెక్టార్లకు గానూ 59 శాతంతో 28,530 హెక్టార్లలో వేశారు. ఖరీఫ్ జాబితాలో వేరుశనగ, పత్తి ప్రధాన పంటలుగా ఉండగా... ఇపుడు వాటి స్థానంలో కంది, మొక్కజొన్న పంటలు చేరుతున్నాయి. ఇక నీటి వసతి కింద 20 వేల నుంచి 22 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగులోకి వస్తోంది. హైబ్రీడ్ విత్తన రకాలపై దృష్టి కంది, మొక్కజొన్న పంటల విస్తీర్ణం పెరుగుతున్న తరుణంలో హైబ్రీడ్ రకాల విత్తనాలు రాయితీతో ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీతో పాతవి ఎల్ఆర్జీ రకాలు ఇస్తుండటంతో అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఎల్ఆర్జీ కంది రకాలు ఉచితంగా ఇచ్చినా వద్దనే పరిస్థితి నెలకొంది. మార్కెట్లో మంచి హైబ్రీడ్ రకాలు ఉన్నందున వాటిపై దృష్టి పెడుతున్నారు. అలాగే మొక్కజొన్న, ఆముదం కూడా రాయితీపై ఇస్తే చాలా వరకు మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. పెరిగిన కంది, కొర్ర, మొక్కజొన్న గత ఖరీఫ్లో రికార్డు స్థాయిలో 1.03 లక్షల హెక్టార్లలో కంది సాగు 3 వేల హెక్టార్లలో కొర్ర, 20 వేల హెక్టార్లకు పెరిగిన మొక్కజొన్న పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో భారీగా తగ్గిన వేరుశనగ, పత్తి -
స్నాతకోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహిద్దాం
● జేఎన్టీయూ వీసీ సుదర్శనరావు అనంతపురం: జేఎన్టీయూ (ఏ) 14వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 17న పకడ్బందీగా నిర్వహిద్దామంటూ సంబంధిత అధికారులకు వర్శిటీ వీసీ హెచ్.సుదర్శనరావు పిలుపునిచ్చారు. స్నాతకోత్సవం నిర్వహణపై సమన్వయ కమిటీ సభ్యులతో బుధవారం వీసీ సమీక్షించారు. ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో స్నాతకోత్సవంలో పాల్గొంటారని, గౌరవ డాక్టరేట్ను డాక్టర్ చావా సత్యనారాయణకు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో హాజరుకానున్న ప్రముఖులకు ఎలాంటి లోటుపాట్లు రానివ్వరాదన్నారు. ఉదయం 9:30 గంటల్లోపు గోల్డ్మెడల్స్ గ్రహీతలు, పీహెచ్డీ అవార్డులు పొందిన విద్యార్థులు ఆడిటోరియానికి చేరుకునేలా చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఓఎస్డీ టూ వీసీ ప్రొఫెసర్ ఎన్.దేవన్న, డైరెక్టర్లు పాల్గొన్నారు. యువకుడి గల్లంతు రాయదుర్గం టౌన్: స్నేహితులతో కలసి ఈతకు వెళ్లిన ఓ యువకుడు బావిలో గల్లంతయ్యాడు. వివరాలు... రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రి వెనుక వీధిలో నివాసముంటున్న సత్యనారాయణ, పద్మ దంపతుల కుమారుడు బోయ రాజశేఖర్ (30)కు భార్య నేత్ర, ఇద్దరు కుమారులు ఉన్నారు. గార్మెంట్స్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం నలుగురు స్నేహితులతో కలసి రాజశేఖర్ స్థానిక దుగ్గిలమ్మ ఆలయం వద్ద ఉన్న బావిలో ఈతకు వెళ్లాడు. బావిలో దిగిన రాజశేఖర్ కొద్ది సేపటికే గల్లంతయ్యాడు. దీంతో భయపడిన స్నేహితులు బయటకు వచ్చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు విషయం తెలుసుకున్న బంధవులు, పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. గత ఈతగాళ్లను రంగంలో దించారు. బావిలో పూర్తి స్థాయిలో నీరు ఉండడం, లోతు కూడా ఎక్కువగా ఉండడంతో ఆచూకీ లభ్యం కాలేదు. సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కాగా, ఈత రాని రాజశేఖర్ను స్నేహితులు బలవంతం చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అంతేకాక అప్పటికే స్నేహితులందరూ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. -
ఆర్థిక అసమానతల వల్లే మతమార్పిడి
అనంతపురం కల్చరల్: సమాజంలో పెరిగిన ఆర్థిక అసమానతల వల్లనే మత మార్పిడులు జరుగుతున్నాయని వీహెచ్పీ జాతీయ కార్యదర్శి వై.రాఘవులు అన్నారు. బుధవారం అనంతకు విచ్చేసిన ఆయన స్థానిక కోర్టురోడ్డులోని శివకృప (ఆర్ఎస్ఎస్ భవన్)లో జిల్లా అర్చక ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. సనాతన హైందవ ప్రచారానికి ప్రాముఖ్యతనిచ్చే అర్చకులు మరిన్ని మార్గాల ద్వారా ధర్మాన్ని కాపాడాలని సూచించారు. దేవాలయానికి వచ్చే భక్తులకు దేశకాల పరిస్థితులను వివరించడం, పరిణామ సంకీర్తనలు చేయించడం, సేవా కార్యక్రమాలలో అందరనీ భాగస్వాములను చేయడం ద్వారా మత మార్పిడులను అరికట్టవచ్చన్నారు. అనంతరం అర్చక సమాఖ్య అధ్యక్షుడు వైపీ ఆంజనేయులు నేతృత్వంలో ఎండోమెంటు సహాయ కమిషనర్ ఆదిశేషు నాయుడిని కలిసి అర్చక సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అర్చక సమాఖ్య ప్రతినిధులు తిరుపతయ్య, శ్రీనివాసులు, మారుతీప్రసాద్, వీహెచ్పీ ఉపాధ్యక్షుడు కేవీ రమణబాబు, జిల్లా కార్యదర్శి విశ్వనాథరెడ్డి, సభ్యులు గురప్ప, దినేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.యువ రైతు ఆత్మహత్య విడపనకల్లు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం వి.కొత్తకోటకు చెందిన కోనంపల్లి రవియాదవ్ (26), కొంత కాలంగా మిర్చి పంట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటల సాగుకు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో అప్పులు తీరిపోతాయని భావించాడు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత మార్కెట్లో ధర లేకపోవడంతో ఒక్కసారిగా కుదేలయ్యాడు. కనీసం పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో ఇక అప్పులు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన రవి యాదవ్.. బుధవారం తెల్లవారుజామున తన ఇంటి పక్కనే ఉన్న రేకుల షెడ్డులో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.వ్యక్తి అనుమానాస్పద మృతికణేకల్లు: మండలంలోని మాల్యం ఎస్సీ కాలనీలో నివాసముంటున్న హరిజన యల్లప్ప (70) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. వర్షానికి కారుతున్న తన పూరి గుడిసెను మరమ్మతు చేసేందుకు అవసరమైన ఆపు (గడ్డి) కోసుకొచ్చేందుకు బుధవారం ఉదయం 10 గంటలకు గ్రామ శివారులోని వంక వద్దకు వెళ్లాడు. గంట తర్వాత ఇద్దరు మనవళ్లు తాతకు తాగునీటి బాటిల్ ఇచ్చేందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ యల్లప్ప కనిపించలేదు. దీంతో పిల్లలు ఇంటికెళ్లి విషయాన్ని తమ తండ్రి రమేష్కు తెలపడంతో ఆయన అక్కడకు చేరుకుని పరిశీలించారు. అక్కడ అచేతనంగా పడి ఉన్న యల్లప్పను గమనించి వెలికి తీశాడు. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా నిర్దారించుకుని సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కాగా, ఆపు కోస్తున్న సమయంలో నీళ్లలో నుంచి విద్యుత్ ప్రసారం జరిగి మృతి చెందాడా? లేక, గుండెపోటుతోనా? వడదెబ్బతోనా అనే అనుమానాలు వ్యక్తం కాగా పోలీసులు ఆ దిశగా కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
విశిష్ట వేడుకకు వేళాయె
రాయదుర్గం టౌన్: విశిష్ట వేడుకకు స్థానిక కోట ప్రాంతంలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకూ కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైన శ్రీవారి కల్యాణోత్సవం ఈ నెల 15న గురువారం నిర్వహించనున్నారు. కల్యాణోత్సవంలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 8 లేదా 9 ఏళ్ల మైనర్ బాలికతో శ్రీవారి వివాహం జరిపించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. నిశ్చితార్థం మొదలు కల్యాణం వరకూ అన్ని శాస్త్రబద్దంగా పురోహితుల మంత్రోచ్చరణల మధ్య జరిగే వివాహ తంతు దాదాపు 60 ఏళ్ల క్రితం పద్మశాలియ వంశస్తుల ఆధ్వర్యంలో కొనసాగుతూ వస్తోంది. ఏటా పద్మశాలియ వంశంలో అరవ తెగకు చెందిన బాలికతో వివాహం జరిపిస్తుంటారు. ఈ నెల 15న గురువారం 11.30 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవానికి పండితులు ముహూర్తం నిర్ణయించారు. అరవా శ్రీనివాసులు, శ్వేత దంపతుల కుమార్తె శ్రీధన్యతో శ్రీవారి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలో భాగంగా పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక మిటీ సభ్యులు, పుర ప్రముఖులు మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (శ్రీధన్య)ను ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొస్తారు. అక్కడి నుంచి పెళ్లి కుమార్తెను అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లి వేద మంత్రోచ్ఛరణలతో వివాహం జరిపిస్తారు. నేడు ప్రసన్న వేంకటరమణస్వామి కల్యాణోత్సవం తొమ్మిదేళ్ల మైనర్ బాలికతో శ్రీవారి వివాహ ఘట్టం బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూర్తయిన ఏర్పాట్లు -
మీ–సేవా కేంద్రంలో చోరీ
గార్లదిన్నె: స్థానిక మీ సేవా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నెకు చెందిన సోమశేఖరరెడ్డి స్థానిక కెనరా బ్యాంక్ సమీపంలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం లావాదేవీలు ముగించుకున్న అనంతరం రాత్రి తాళం వేసి ఇంటికెళ్లిపోయాడు. అర్థరాత్రి సమయంలో దుండగులు మీసేవా కేంద్రం తాళాలు బద్దులుగొట్టి లోపలకు ప్రవేవించి, రూ.1.50 లక్షల నగదు అపహరించారు. బుధవారం ఉదయం కేంద్రం వద్దకు చేరుకున్న సోమశేఖరరెడ్డి చోరీ విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి దుండగుల వేలి ముద్రలు సేకరించారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చినట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
హంద్రీ–నీవాపై బహిరంగ చర్చకు సిద్ధం
గుంతకల్లు టౌన్: హంద్రీ–నీవా కెనాల్ పనులు పూర్తి చేసిందెవరు? అందుకు ఎవరెంత నిధులిచ్చారో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ప్రకటించారు. హంద్రీ–నీవాకు శిలాఫలకం వేసిన ఉరవకొండలోనే బహిరంగంగా చర్చిద్దామని, తేదీ, సమయమెప్పుడో నిర్ణయించాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులుకు ఆయన ప్రతి సవాల్ విసిరారు. బహిరంగచర్చ జరిగే రోజున పోలీసులపై ఒత్తిడి తీసుకెళ్లి తమను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయించొద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం గుంతకల్లుకు విచ్చేసిన ఆయన స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి, మైసూరారెడ్డి సారధ్యంలో మొదలైన రాయలసీమ ఉద్యమంపై అప్పటి సీఎం ఎన్టీ.రామారావు స్పందించి హంద్రీ–నీవాకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. తిరిగి తొమ్మిదేళ్లు సీఎంగా కొనసాగిన చంద్రబాబు హంద్రీ–నీవాకు రెండుసార్లు శంకుస్థాపన చేయడం తప్ప సాధించిన ప్రగతి అంటూ ఏదీ లేదన్నారు. 2004లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాకనే హంద్రీ–నీవా పనులు వేగవంతమయ్యాయన్నారు. హంద్రీ–నీవా గురించి అన్నీ తెలిసిన కాలవ శ్రీనివాసులు నేడు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీనీవాలో 6,300 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారని, తిరిగి కూటమి ప్రభుత్వం 3,850 క్యూసెక్కులకే పరిమితం చేయడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి, మంత్రి కేశవ్కు, విప్ కాలవకు చిత్తశుద్ధి ఉంటే 10 వేల క్యూసెక్కులకు హంద్రీ–నీవా సామర్థ్యం పెంచేలా పనులు చేపట్టాలని సవాల్ విసిరారు. మురళీనాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమరుడైన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. జవానుల వీరోచిత పోరాటాన్ని ఆయన కొనియాడారు. మురళీనాయక్తో పాటు యుద్ధంలో అసువులు బాసిన జవానులు, పహల్గామ్ ఘటనలో మృతి చెందిన అమాయకపు ప్రజల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సమావేశంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఖలీల్, రాము, కౌన్సిలర్ చాంద్బాషా, పార్టీ సీనియర్ నేతలు భీమలింగప్ప, దశరథరెడ్డి, కాకర్ల నాగేశ్వరరావు, నిజామి, పార్టీ అనుబంధ విభాగాల నియోజకవర్గం అధ్యక్షులు రంగనాయకులు, బాసిద్, బాబూరావు పాల్గొన్నారు. ఉరవకొండ వేదికగానే తేదీ, సమయం చెప్పండి ప్రభుత్వ విప్ కాలవకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ప్రతి సవాల్ -
ఇన్ సర్వీస్ టీచర్లపై వివక్ష వీడాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రస్తుతం చేపట్టనున్న ఉపాధ్యాయుల బదిలీల్లో ఇన్ సర్వీస్ టీచర్లపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు మండిపడ్డారు. వివక్షను వీడాలంటూ బుధవారం డీఈఓ ప్రసాద్బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భగా ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నీలూరి రమణారెడ్డి, ఎస్.రామాంజనేయులు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగమయ్య మాట్లాడుతూ... రాజ్యాంగం కల్పించిన సౌకర్యం ప్రకారం ఉన్నత ప్రమోషన్ కోసం ఇన్సర్వీస్లో బీఈడీ చేయడం ఉపాధ్యాయుల హక్కు అన్నారు. 8 ఏళ్లు పూర్తయిన వారికి, రేషనలైజేషన్ గురైన వారికి ప్రస్తుత బదిలీల్లో అవకాశం కల్పించాలన్నారు. ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల స్థానాల్లో మిగులు టీచర్లు, ఎంటీఎస్ ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. డీఈఓను కలిసిన వారిలో ఎస్టీయూ నాయకులు సురేష్కుమార్, మల్లికార్జున, ఉపాధ్యాయులు రామన్న, ఓబన్న, ఆదినారాయణ, మురళి, సుమలత, సరోజబాయి, పెద్దన్న, మేరీలత, చంద్రశేఖర్, మహేష్, మహాలక్ష్మి ఉన్నారు. డ్రోన్ వినియోగంపై దృష్టి సారించండి : డీడీహెచ్అనంతపురం అగ్రికల్చర్: ఉద్యాన తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి వీలుగా డ్రోన్లను వినియోగించేలా రైతుల్లో అవగాహన పెంచాలని ఉద్యానశాఖ అధికారులకు ఆ శాఖ డీడీ జి.ఫిరోజ్ఖాన్ సూచించారు. బుధవారం స్థానిక ఉద్యానశాఖ కార్యాలయంలో సూపరెండెండెంట్ బాషా, టెక్నికల్ హెచ్ఓ రత్నకుమార్, ఉద్యానాధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఉద్యాన రంగం పురోభివృద్ధికి కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించినందున వాటి ఫలాలు రైతులకు అందేలా క్షేత్రస్థాయిలో హెచ్ఓలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. డ్రోన్ వినియోగంపై ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ కింద గార్లదిన్నె మండలం ముకుందాపురం రైతులను చైతన్య పరిచినట్లు తెలిపారు. హంద్రీ–నీవా కాలువ వెంబడి ఉద్యాన పంటల పెంపకం ప్రోత్సహించాలన్నారు. అలాగే హెచ్చెల్సీ వెంబడి కూడా కొబ్బరి, వెదురు, అరటి, మునగ లాంటి పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. అరటి, మామిడి పండ్లకు వాడే కవర్లు రాయితీతో అందించాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ, వాడకంలో కూడా రైతులకు మేలు జరిగేలా చూడాలని ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి సూచించారు. -
వడదెబ్బతో మహిళ మృతి
ఆత్మకూరు: వడదెబ్బకు గురై మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. ఆత్మకూరుకు చెందిన ఉరుముల రామాంజినమ్మ (59) సోమవారం తనకు ఉన్న రెండు ఆవులను తోలుకొని మేత కోసం పొలంలోకి వెళ్లింది. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆమెకు కోసం వెతికారు. పొలం వద్ద స్పృహ కోల్పోయి పడి ఉన్న ఆమెను హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే రామాంజినమ్మ మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. రామాంజినమ్మకు భర్త, కుమారుడు ఉన్నారు. ‘శ్రీరామిరెడ్డి’ కార్మికులతో అధికారుల చర్చలు విఫలం కూడేరు: శ్రీరామిరెడ్డి పథకం కార్మికులతో అధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. మండలంలోని పీఏబీఆర్ సమీపంలో ఏర్పాటైన శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ వద్ద కార్మికులతో మంగళవారం అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్ చర్చలు జరిపారు. పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలను ఈ నెల 17న, పీఎఫ్ ఈ నెలాఖరుకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అందుకు కార్మికులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అంగీకరించలేదు. 38 రోజులుగా సమ్మెలో ఉన్నామని, వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేసే దిశగానే మాట్లాడితే ఎలా.. అని ఓబులు ప్రశ్నించారు. ‘సమ్మెలోకి వెళ్లిన ప్రతిసారీ ఫలానా గడువులోపు ఇస్తామంటారు.. మళ్లీ స్పందించరు.. మీ హామీలపై నమ్మకం లేదు, కార్మికులు సమ్మె కొనసాగిస్తారు’ అని ఓబులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మురళీధర్, డీఈ శిరీషా, తహసీల్ధార్ మహబూబ్ బాషా, సర్వేయర్ అయేషా సిద్దికీ, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ జిల్లా యూనియన్ అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్మికులు కొండారెడ్డి, రామాంజనేయులు, నాగరాజు, వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఇక 9 రకాల పాఠశాలలు
●నూతన విధానాలు ప్రకటించిన ప్రభుత్వం ●పాఠశాలల పునర్విభజన, క్రమబద్ధీకరణకు జీఓలు అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలో 9 రకాల పాఠశాలలు పుట్టుకొచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం విధి విధానాలను ప్రకటించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల పునర్విభజన, క్రమబద్ధీకరణకు మంగళవారం జీఓలు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన జాబితాలను అనంతపురం శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో రెడీ చేస్తున్నారు. గతంలో 117 జీఓను అనుసరిస్తూ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4.5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. 1,2 తరగతులను ఫౌండేషన్ స్కూళ్లుగా మార్చారు. కూటమి ప్రభుత్వంలో 117 జీఓ రద్దు తర్వాత చాలా వరకు ఫౌండేషన్ స్కూళ్లను అలానే ఉంచారు. 3,4,5 తరగతులను సమీపంలోని మరో ప్రాథమిక పాఠశాలల్లోకి విలీనం చేశారు. ఇవీ పాఠశాలలు... శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1,పీపీ–2), ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, 1–2 తరగతులు), బేసిక్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1, పీపీ–2,1–5 తరగతులు), మోడల్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1, పీపీ–2, 1–8 తరగతులు), ఉన్నత పాఠశాలలు (6–10 తరగతులు), ఉన్నత పాఠశాలలు (1–10 తరగతులు), హైస్కూల్ ప్లస్ (6–12 తరగతులు), హైస్కూల్ ప్లస్ (1–12 తరగతులు). జిల్లాలో ఏయే స్కూళ్లు ఎన్నంటే... శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1 నుంచి 2వ తరగతి వరకు)–92, బేసిక్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1–5 తరగతులు, 1–5 తరగతులు) 621, మోడల్ ప్రైమరీ పాఠశాలలు (పీపీ–1–5, 1–5 తరగతులు) 626, ప్రాథమికోన్నత పాఠశాలలు (1–7/8 తరగతులు) 59, ఉన్నత పాఠశాలలు (6–10 తరగతులు) 338 పాఠశాలలుగా మారాయి. మొత్తం 1,736 పాఠశాలలుగా ఏర్పాటు చేయనున్నారు. ఆ పాఠశాలల హెచ్ఎంలుగా ఎస్ఏలు నూతన విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,556 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం/స్కూల్ అసిస్టెంట్గా కన్వర్షన్ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో 520 పోస్టులను సృష్టించారు. ఎంపీపీ, జెడ్పీ పాఠశాలల్లో 515, ప్రభుత్వ పాఠశాలల్లో 5 పోస్టులను కన్వర్షన్ చేశారు. ప్రస్తుతం ఆయా స్కూళ్లలో పని చేస్తున్న ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల గురించి స్పష్టత ఇవ్వలేదు. అలాగే జిల్లాలో మరో 34 (ఎంపీపీ, జెడ్పీ–31, ప్రభుత్వం–3) స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అదే మేనేజ్మంట్ స్కూళ్లలో కన్వర్షన్ చేశారు. అయితే ఏయే సబ్జెక్టులనేది అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
ఆర్టీసీ బస్టాండ్లో బంగారు నగల చోరీ
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో ఓ ప్రయాణికురాలి వద్ద ఉన్న బంగారు నగలను దుండగులు అపహరించారు. వివరాలు... కర్నూలుకు చెందిన సుభాన్బీ సోమవారం గుంతకల్లులో జరిగిన బంధువుల ఇంట శుభ కార్యానికి వెళ్లారు. మంగళవారం ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. బస్సు గుత్తి బస్టాండ్కు చేరుకోగానే కాసేపు ఆగింది. కాసేపటి తర్వాత తన వద్ద ఉన్న బ్యాగ్ను పరిశీలించుకున్న ఆమె... అందులో ఉంచిన ఆరు తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో అపహరణకు గురైనట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆ ఎస్ఐపై వేటు● సరెండర్ చేస్తూ డీఐజీ ఉత్తర్వుల జారీఅనంతపురం: శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎం. ప్రదీప్కుమార్పై వేటు పడింది. అతన్ని సరెండర్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఉమ్మడి జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రదీప్కుమార్ ఉన్నతాధికారుల అండ చూసుకుని లాబీయింగ్ చేసేవారని, డీఎస్పీ, సీఐలను సైతం లెక్క చేయకుండా వ్యవహరించే వారని సమాచారం. దీంతో పాటు రాజకీయ అండతో పంచాయితీలు, పైరవీలు చేస్తుండటంపై ఇటీవల ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో స్పందించిన అనంతపురం రేంజ్ డీఐజీ.. ప్రదీప్కుమార్ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ సినిమాలో ఓ ఆసక్తికర సీను అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. విలన్ గ్యాంగ్... యురేనియం కోసం తవ్వకాలు జరిపిన అనంతరం వ్యర్థాలను రివర్స్ బోరింగ్ ద్వారా భూమిలోకి వదులుతారు. ఫలితంగా సమీప ప్రాంతాల్లోని పసికందుల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్
రాచానపల్లి సమీపంలో ఇటీవల రిపేరీ చేయించిన బోరులో వస్తోంది ఆయిల్ కాదు నీరే..వ్యర్థాలు భూమిలోకి వదులుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీ ● చుట్టు పక్కల ప్రాంతాల్లో కలుషితమవుతున్న భూగర్భజలాలు ● ఇటీవల రాచానపల్లి పంచాయతీ బోరులో నల్లటి ద్రావకం ● పొగ, దుర్వాసన కూడా వెదజల్లుతున్న వైనం ● ఇబ్బందులు పడుతున్న ప్రజలు రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ పరిధి బళ్లారి రోడ్డు సమీపంలో ఉన్న ఔషధాల తయారీ సిఫ్లాన్ డ్రగ్స్ ఫ్యాక్టరీ వ్యర్థాలు తీవ్ర ప్రమాదకరంగా మారాయి. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలను రివర్స్ బోరింగ్ ద్వారా భూమిలోకి వదులుతుండటంతో దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. ఫ్యాక్టరీకి చుట్టుపక్కల 6–7 కిలోమీటర్ల వరకు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సిఫ్లాన్ ఫ్యాక్టరీకి దాదాపు ఒకటిన్నర కిలోమీటరు దూరంలోని చెక్ డ్యాంలో ఉన్న రాచానపల్లి పంచాయతీ బోరు ఇటీవల చెడిపోగా.. రిపేరీ చేయించారు. మోటారు ఆన్ చేయగానే నల్లటి ద్రవం బోరులో నుంచి ఎగజిమ్మింది. రెండు ఇంచుల పైపులో దాదాపు రెండు గంటల పాటు ఇదే పరిస్థితి. ఈ బోరు 250 అడుగుల లోతు ఉంది. దీన్ని బట్టి రసాయన వ్యర్థాల ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తీవ్ర అవస్థలు.. ‘సిఫ్లాన్’ భూతం కారణంగా రాచానపల్లి, కొడిమి పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాచానపల్లి పంచాయతీలో కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీరు కలుషితమై వస్తోందని మహిళలు వాపోతున్నారు. తాగేందుకు ఏమాత్రమూ ఉపయోగపడడం లేదని, దుస్తులు ఉతకడానికి కూడా వినియోగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పంట భూముల్లోనూ డ్రగ్స్ వ్యర్థాల అవశేషాల ప్రభావం పడిందంటున్నారు. దీనికితోడు పొగ, దుర్వాసన వెదజల్లుతుండడంతో అవస్థలు పడుతున్నామంటున్నారు. -
యువరైతు బలవన్మరణం
విడపనకల్లు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాలు.. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన రైతు బోయ సుధాకర్(27)కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. గత రెండేళ్లుగా మిరప పంట సాగు చేస్తున్నాడు. సరైన దిగుబడి రాకపోవడంతో పాటు దిగుబడి ఉన్న సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో పంట సాగు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.10 లక్షలకు చేరుకుంది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడే సుధాకర్.. సోమవారం క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
26 నుంచి అగ్నివీర్ మురళీనాయక్ స్మారక క్రికెట్ టోర్నీ
అనంతపురం: ఆపరేషన్ సిందూర్లో భాగంగా అమరుడైన అగ్నివీర్ మురళీనాయక్ స్మారకార్థం ఈ నెల 26 నుంచి అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఉమ్మడి జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు, అనంతపురం నగర డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. ఆసక్తి ఉన్న క్రీడా జట్లు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 80085 50464, 79893 69100, 73969 27271, 98855 31051, 94407 58953లో సంప్రదించాలని కోరారు.ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డితాడిపత్రి టౌన్: ఉపాధ్యాయ బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం ఎస్టీయూ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం చేపట్టనున్న ఉపాధ్యాయ బదిలీల్లో ఖాళీలను బ్లాక్ చేయకుండా పారదర్శకత పాటించాలన్నారు. ప్రతి యూపీ పాఠశాలలో నిబంధనలకు అనుగుణంగా పోస్టులు కేటాయించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు ఇచ్చిన గ్రీవెన్స్ను క్లియర్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజినేయులు, ఆర్థిక కార్యదర్శి ప్రసాద్, తిరుపాల్నాయుడు, శివచంద్ర, డేనియల్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
ప్ర‘గతి’ తప్పిన హెచ్చెల్సీ
అనంతపురం సెంట్రల్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)ను ప్రాజెక్టును కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తోంది. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో మొత్తం 2.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందించే ఈ బృహత్తర ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు అధికారిని నియమించకపోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో హెచ్చెల్సీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ)గా పనిచేసిన రాజశేఖర్ పదవీ కాలం ముగియడంతో గత నెలాఖరున ఆయన ఉద్యోగ విరమణ చేశారు. కీలకమైన ఖరీఫ్ సీజన్ ఆరంభం కానున్న ప్రస్తుత తరుణంలో ఉన్నతాధికారి పోస్టు భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. కనీసం ఇన్చార్జ్ ఎస్ఈ నియామకంపై కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ ఖరీఫ్ సీజన్లో ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే దాదాపు రూ.30 కోట్లకు పైగా నిధులతో కల్వర్టులు, శిథిలావస్థకు వచ్చిన తూముల మరమ్మతులు జరుగుతున్నాయి. వీటిని పర్యవేక్షించి పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాల్సిన జిల్లా స్థాయి అధికారి నియామకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం అభివృద్ధి పనులు గతి తప్పాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులకు మంచి అవకాశం జిల్లాకు వరదాయినిగా ఉన్న హెచ్చెల్సీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారానే కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు అందుతోంది. హెచ్చెల్సీ పరిధిలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో మొత్తం 2.85 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయకపోవడంతో అధికారులకు ఆదాయ మార్గాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎస్ఈ స్థాయి అధికారులు సైతం ఇక్కడ పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. త్వరలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతోంది. ఈసారి నైరుతీ రుతుపవనాలు తొందరగానే పలకరిస్తాయని శాస్త్రవేత్తలూ పేర్కొంటున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే తుంగభద్ర డ్యాం ద్వారా ఈ సారి భారీగా నీరు అందే అవకాశమూ ఉంది. ఇలాంటి కీలక సమయంలో కాలువ మరమ్మతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తుంగభద్ర డ్యామ్ నుంచి 100 కిలోమీటర్ల వరకూ కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ఉంది. ఆ తర్వాత పులివెందుల వరకూ నీటిని అందించాలంటే కాలువ పటిష్టత మరింత మెరుగుపడాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కాలువలో మరమ్మతులు, ముళ్ల కంపలు తొలగించడానికి నీటి ప్రవాహం లేని ప్రస్తుత తరుణమే మంచి అవకాశమని పేర్కొంటున్నారు. అతిథి గృహంలోనే విధులు జిల్లా కేంద్రంలో హెచ్చెల్సీ కార్యాలయానికి దిక్కు లేకుండా పోయింది. గతంలో తెలుగుతల్లి విగ్రహం వద్ద ఉన్న కార్యాలయం ప్రభుత్వాసుపత్రికి కేటాయించడంతో అక్కడున్న కార్యాలయాన్ని దశాబ్దాల క్రితం కిత్రం నిర్మించిన అతిథి గృహానికి మార్చారు. హెచ్చెల్సీకి నూతన కార్యాలయం నిర్మాణం ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. దీంతో రెండేళ్లుగా అతిథిగృహం ఇరుకు గదుల్లోనే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ స్పందించి హెచ్చెల్సీకి పూర్వవైభవం కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యవేక్షణ అధికారి లేకపోవడంతో నిర్వీర్యమవుతున్న బృహత్తర ప్రాజెక్ట్ కనీసం ఇన్చార్జ్ ఎస్ఈని నియమించని కూటమి సర్కార్ నానాటికీ ప్రశ్నార్థకమవుతున్న ఆయకట్టు సాగు -
అధైర్య పడొద్దు... అండగా ఉంటాం
పుట్లూరు: అధైర్య పడొద్దు.. అండగా ఉంటామని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఆ పార్టీ శింగనమల నియోజకర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ భరోసానిచ్చారు. పుట్లూరు మండలం కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. కోమటికుంట్లలో టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన ఎరికలయ్య కుటుంబాన్ని, అనంతరం గరుగుచింతపల్లిలో టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన పెద్దన్న , నాగరాజును పరామర్శించారు. గ్రామంలోని పెద్దమ్మ ఆలయం వద్ద మద్యం విక్రయించరాదన్నందుకు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు పెద్దన్న కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శైలజనాథ్ మాట్లాడుతూ... ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలని, అభివృద్ధి చేసి చూపించి గొప్పగా చెప్పుకోవాలి తప్ప ఇలా దాడులు చేసి పైశాచిక అనందం పొందడం భావ్యం కాదన్నారు. అధికారం ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా నడుచుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గరుగుచింతపల్లి గ్రామంలో జరుగుతున్న పరిణామాలపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు అండగా నిలుస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎంపీపీ బి.రాఘవరెడ్డి, సర్పంచ్లు ఓబులేసు, రామకృష్ణారెడ్డి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నాగేశ్వరరావు, నాయకులు రామమోహన్రెడ్డి, జేఆర్పేట మహేశ్వరరెడ్డి, విష్ణునారాయణ, శింగనమల ప్రసాద్, పోలిరెడ్డి, వెంకటశివుడు, కృష్ణయ్య, సూరి తదితరులు ఉన్నారు. వీరజవాన్ మురళీనాయక్ త్యాగం జాతి మరవదు గోరంట్ల: వీర జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని భరత జాతి ఎన్నటికీ మరిచిపోదని డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. సోమవారం గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్న ఆయన మురళీనాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ను పరామర్శించారు. అనంతరం వీరజవాన్ మురళీనాయక్ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శత్రుమూకలతో మురళీనాయక్ సాగించిన వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాలకు శింగనమల సమన్వయకర్త శైలజనాథ్ భరోసా -
భూసేకరణ ప్రతిపాదనలు పంపండి
● అధికారులతో జేసీ శివ్నారాయణ్ శర్మ అనంతపురం అర్బన్: వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియ ప్రతిపాదనలను త్వరితగతిన పంపించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ ఆదేశించారు. భూ సేకరణ అంశంపై సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో ఆయన సమీక్షించారు. జాతీయ రహదారులు 544డి, 67, 150తో పాటు రైల్వే, ఇతర ప్రాధాన్యత ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, భూ బదలాలియింపుపై పెండింగ్ ప్రతిపాదనలు జాతీయ రహదారి అధికారులకు పంపించాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఎన్హెచ్ పీడీ తరుణ్కుమార్, భూ విభాగం సూపరిటెండెంట్ రియాజుద్ధీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. చెరువు మట్టినీ బొక్కేస్తున్నారు... పెద్దవడుగూరు: మండలంలోని చిత్రచేడు గ్రామంలో మట్టి దందాకు స్థానిక టీడీపీ కార్యకర్తలు తెరలేపారు. గత రెండు రోజుల క్రితం తగ్గు ప్రాంతాలను చదును చేసేందుకు గ్రామంలోని రెండు వర్గాల వారు జేసీబీలతో మట్టిని తరలించేందుకు ప్రయత్నించడంతో అధికారులు తక్షణమే స్పందించి అడ్డుకున్నారు. ఇదే అదునుగా చేసుకుని గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు ఏకంగా పది ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని, చెరువులోని మట్టిని జేసీబీలతో పెకలించి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పార్టీ పెద్దల పేర్లు చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాక్టర్లు, జేసీబీని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే టీడీపీ బడా నేత ఫోన్ చేయడంతో వాటిని అక్కడే వదిలేసి వచ్చారు. కాగా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా చెరువులోని మట్టిని తరలిస్తుండటంపై విమర్శలు వ్యక్తవమవుతున్నాయి. ఆ టీచర్లకు ప్రాధాన్యతనివ్వాలి అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్దీకరణకు రూపొందించిన నిబంధనల్లో స్టేషన్ పాయింట్లకు సంబంధించి ఒక పాఠశాలలో 8 ఏళ్లు పూర్తి కాకుండానే రేషనలైజేషన్కు గురవుతున్న టీచర్లకు 8 ఏళ్ల పూర్తి పాయింట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాసనాయక్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసనాయక్ మాట్లాడారు. సీనియర్/జూనియర్ ఎవరు రీ అపోర్షన్కు గురైనా రీఅపోర్షన్ పాయింట్లు కేటాయించాలన్నారు. ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎంలుగా ప్రమోషన్ కల్పించి మోడల్ ప్రైమరీ పాఠశాలలకు నియమించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల శాతాన్ని 1:45 ప్రకారం నిర్ధారిస్తూ పోస్టులు కేటాయించాలన్నారు. బదిలీ పాఠశాలల్లో పోస్టులు బ్లాక్ చేయరాదన్నారు. ఇంగ్లిషు తదితర సబ్జెక్టుల సీనియార్టీ లిస్టు ఫైనలైజ్ చేసి.. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించిన తర్వాతనే మిగులు పోస్టులు ప్రకటించాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కులశేఖర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ, సత్యప్రసాద్, అశోక్ నాయక్, వజీర్ బాషా, నారాయణ నాయక్, దామో దర్ రామాంజనేయులు, హుసేన్ఖాన్ పాల్గొన్నారు. -
జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసులా?
చెన్నేకొత్తపల్లి: ‘‘ టీడీపీ నేతల చేతుల్లో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి గత నెల 8న హెలికాప్టర్లో తమ నాయకుడు వైఎస్ జగన్ వస్తే హెలిప్యాడ్ వద్ద తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రజలు హెలికాప్టర్ వరకూ దూసుకెళ్లారు. నేనే మైక్ తీసుకుని వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాను. అయినా అభిమానులు దూసుకెళ్లడంతో హెలికాప్టర్ విండ్షీల్డ్ దెబ్బతినింది. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమే. కానీ జనాన్ని కంట్రోల్ చేసిన నాపై కేసు పెట్టారు’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ సంఘటనకు సంబంధించి సోమవారం చెన్నేకొత్తపల్లిలోని రామగిరి సర్కిల్ కార్యాలయంలో జరిగిన విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. లింగమయ్యను అగ్రకులాలకు చెందిన వారు కొందరు హత్య చేసినా.. వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ హత్యలో ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, బంధువులు హస్తం ఉందని తోపుదుర్తి ఆరోపించారు. గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులతో గొడవలు జరిగాయని, తర్వాత పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడిన వారితో కలిశారన్నారు. ఈ విషయాన్ని కొన్ని మీడియాలు తప్పుదోవ పట్టించే విధంగా రకరకాలుగా ప్రసారం చేశాయన్నారు. వాస్తవాన్ని వదలి ప్రజల దృష్టిని మరల్చే విధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరించాయన్నారు. హెలిప్యాడ్ వద్ద ఎక్కువ జనం రావడంతో పోలీసు ఉన్నతాధికారి సూచన మేరకు తాను మైక్ ద్వారా సంయమనం పాటించాలని హెలిప్యాడ్ వద్దకు వెళ్లరాదని సూచించారన్నారు. ఇవన్నీ వదిలి నాపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉంది.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. అభివృద్ధి చేయడం మాని, రక్తపాతం సృష్టిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఆయన ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రకాష్రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గోవిందరెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీలు ఉన్నారు. పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ ఘటన పోలీసుల వైఫల్యమే సంబంధం లేని నాపై కేసు పెట్టారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాలు సేకరించాలి : ఎస్పీ
అనంతపురం: నేరస్తులకు పక్కాగా శిక్షలు పడాలంటే నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాలు సేకరించాలని సిబ్బందికి ఎస్పీ పి.జగదీష్ సూచించారు. ‘ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్’’పై పోలీసు అధికారులకు సోమవారం సోమవారం వర్క్షాప్ నిర్వహించారు. నేర స్థలంలో ఆధారాల సేకరణ, వాటి ప్యాకేజింగ్, భద్రతా ప్రమాణాలు, సిరాలజీ, డీఎన్ఏ, టాక్సికాలజీ, సైబర్ ఫోరెన్సిక్స్ వంటి విబాగాల్లో నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు నేరస్తులు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారని, అలాంటి వారిని సమర్థవంతంగా పట్టుకుని చట్టం ద్వారా శిక్షలు వేయించాలంటే ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. వివిధ అంశాలపై అనంతపురం ఆర్ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజా రంగనాథరెడ్డి, ఫోరెన్సిక్ సైంటిఫిక్ ఆఫీసర్ సుధారాణి, సైంటిఫిక్ అసిస్టెంట్లు మురళి, వెంకటేశ్వరరావు తదితరులు అవగాహన కల్పించారు. -
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
గార్లదిన్నె: ‘వివిధ ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో మీ వద్దకు వచ్చి అర్జీలు ఇస్తున్నాం. ఇప్పటికే ఐదు, ఆరు సార్లు అర్జీలిచ్చాం. ఇప్పటికై నా పట్టించుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి’ అంటూ పలువురు అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం గార్లదిన్నె మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ వినోద్కుమార్తో పాటు జేసీ శివ్ నారాయణ్ శర్మ, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, డీఆర్ఓ మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, తిప్పేనాయక్, మల్లికార్జున, ఆర్డీఓ కేశవనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 360 వినతులు అందాయి. అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పదే పదే వస్తున్న అర్జీలను పరిష్కరించే బాధ్యతను జేసీకి అప్పజెబుతామని, ఇందులో అధికారుల తప్పు ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. గ్రామ, క్షేత్ర స్థాయి అధికారులపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం అమర జవాన్ ‘అగ్నివీర్ మురళీ నాయక్’కు ఘన నివాళులర్పించారు. వినతుల్లో కొన్ని... ● చీనీ మార్కెట్ యార్డులో ఈ నామ్ వ్యవస్థను రద్దు చేసి వేలం ద్వారా అమ్మకాలు జరపాలని, సూట్ విధానం రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగారాజు నాయకులు చెన్నారెడ్డి, ఓబిలేసు, సంగప్ప విన్నవించారు. ● గార్లదిన్నె నుంచి మర్తాడు, కోటంక వరకు తారు రోడ్డు అధ్వానంగా ఉందని, నూతనంగా రోడ్డు వేయాలని ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, ఆయా గ్రామస్తులు కోరారు. ● కొప్పలకొండ గ్రామంలో సీసీ రోడ్డుపై రాకపోకలు సాగించకుండా ఓ వ్యక్తి ట్రాక్టర్లు, బొలెరో వాహనాలు అడ్డు పెడుతున్నారని గ్రామానికి చెందిన నాగరాజు విజ్ఞప్తి చేశాడు. ● గార్లదిన్నె డిప్యూటీ తహసీల్దార్ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని, డబ్బు ఇస్తేనే పనులు చేస్తున్నారని రైతు సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. ● ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టించి, అవమానాలకు గురి చేస్తోందని, న్యాయం చేయాలని కనంపల్లికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త కలెక్టర్కు విన్నవించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల వేడుకోలు వివిధ సమస్యలపై 360 వినతులు ఈమె పేరు సుబ్బమ్మ. గార్లదిన్నె మండలం శిరివరంవాసి. ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. పది సంవత్సరాల క్రితం సుబ్బమ్మ భర్త చనిపోయాడు. కుమారుడు రేవంత్కు పుట్టుకతోనే కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. సదరం క్యాంపులో 100 శాతం వైకల్యం ఉందని సర్టిఫికెట్ మంజూరు చేశారు. ప్రభుత్వం పింఛన్ రూ.6 వేలే అందిస్తోంది. సుబ్బమ్మ కుటుంబానికి భూమి లేదు. రోజూ కూలీ పనులకెళ్తేనే కుటుంబ జీవనం సాగుతుంది. ఈ క్రమంలో కుమారుడికి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని సుబ్బమ్మ పలుమార్లు మండల అధికారులను వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో గార్లదిన్నెలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అధికారులు, ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలోనూ సరిపడా ఫ్యాన్లు ఏర్పాటు చేయకపోవడంతో టెంట్ల కింద ఉక్కపోతతో నలిగిపోయారు. పేపర్లను ఊపుకుంటూ ఉపశమనం పొందారు.