Anantapur Latest News
-
కిరాతక భర్త అరెస్ట్
గుత్తి: అనుమానంతో భార్యను అతి కిరాతకంగా హతమార్చిన భర్తను అరెస్ట్ చేసినట్లు గుత్తి పోలీసులు తెలిపారు. బుధవారం స్థానిక పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ రామారావు, ఎసఐ సురేష్ వెల్లడించారు. గుంతకల్లు మండలం మైనాపురం గ్రామానికి చెందిన శివలింగయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా భార్య ప్రవర్తనపై శివలింగయ్య అనుమానాలు పెంచుకుంటూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు భార్యతో గొడవపడేవాడు. మంగళవారం లక్ష్మిని తన సోదరి ఊరైన కదిరిపల్లికి ద్విచక్ర వాహనంపై పిలుచుకెళ్లిన శివలింగయ్య... తిరుగు ప్రయాణంలో గుత్తి మండలం పూలకుంట సమీపంలో ఉన్న కంకర మిషన్ వద్ద బైక్ను ఆపి ఆమె కిందకు దిగగానే రాళ్లతో దాడి చేశాడు. బలమైన గాయం కావడంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బుధవారం గుత్తి శివారులోని లచ్చానపల్లి రోడ్డులో తచ్చాడుతున్న శివలింగయ్యను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హతమార్చానంటూ నిందితుడు అంగీకరించాడు. నిందితుడి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
బలవంతపు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: వేసవి సెలవుల వేళ జూనియర్ కళాశాలల్లో తరగతులు బలవంతంగా ప్రారంభించారు. పరీక్షలు ముగిసి రెండు వారాలు కూడా కాకుండానే బుధవారం నుంచి ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. జిల్లాలోని 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 3,600 మంది విద్యార్థులుంటే తొలిరోజు 300 మంది కూడా హాజరుకాలేదు. వేలల్లో విద్యార్థులు ఉన్న కళాశాలల్లో హాజరు వందల్లో కూడా నమోదు కాకపోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 600 మందికి పైగా విద్యార్థినులుంటే ఐదుగురు మాత్రమే వచ్చారు. తీరా 11 గంటల సమయంలో అధ్యాపకులు సమీపంలో ఉంటున్న విద్యార్థినులను బలవంతంగా పిలిపించుకోవడం కనిపించింది. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మండలాల్లో ఉన్న కళాశాలల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని అధ్యాపకులు వాపోతున్నారు. వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోతోందని అధ్యాపక వర్గాలు అంటున్నాయి. ఎక్కడుంటారు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అధికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై ఆధారపడుతుంటారు. వీరిలో చాలామంది హాస్టళ్లలో ఉంటున్నారు. ప్రస్తుతం హాస్టల్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, భోజనం–వసతి సమస్యలు ఇంకా పరిష్కారం కాకపోవడం వల్ల విద్యార్థులు కళాశాలకు హాజరుకావడంలో ఇబ్బందులు పడుతున్నారు. ‘హాస్టల్ సదుపాయం లేకుండా ఎలా చదువుకుంటారు?’ అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు వేసవి తీవ్రత, సెలవుల వాతావరణం కారణంగా విద్యార్థుల్లో నిరాసక్తత పెరిగింది. తల్లిదండ్రులు కూడా పిల్లలను పంపడంలో ఆసక్తి చూపడం లేదు. జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల నిరాసక్తత వేసవి సెలవుల్లో రాలేమంటున్న విద్యార్థులు.. ఆసక్తి చూపని తల్లిదండ్రులు తొలిరోజు తూతూమంత్రంగా వచ్చిన విద్యార్థులు -
ఇది దోపిడీ ప్రభుత్వం
రాప్తాడు రూరల్: రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం రాజ్యమేలుతోందని మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లూ చాలా క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపారని గుర్తు చేశారు. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో బుధవారం రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ సర్పంచులకు అనంతపురం రూరల్ పరిధిలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో సన్మాన సభ ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిశీలకులు రమేష్రెడ్డి హాజరయ్యారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలం, ఆదాయం లేకపోవడం, నిధుల లేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల బాగాలేకపోవడంతో గ్రామాల్లో ఆశించిన మేర అభివృద్ధి పనులు జరగలేదన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని, ప్రస్తుతం సర్పంచులగా పనిచేసిన వారందరికీ రానున్న రోజుల్లో మరింత గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికలకు చేతనైన మేరకు సాయం చేశామన్నారు. గౌరవం నిలబడేలా గుడికో, బడికో, ఆస్పత్రులకో ఇతర వాటి కోసమే రూ.కోట్లలో ఖర్చు చేశామన్నారు. తనకు జగన్మోహన్రెడ్డితో ఉన్న అనుబంధం భగవంతుడు, భక్తుడికి ఉన్న బంధం లాంటిదన్నారు. రాజకీయాల్లోకి రాకముందే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానన్నారు. పరిటాల కుటుంబం అంటే ప్రజల్లో ఉన్న భయాన్ని తాము దూరం చేస్తూ వచ్చామన్నారు. వారు మనుషులను చంపుతూ భయభ్రాంతులకు గురి చేసి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల కుటుంబం ధర్మవరం పోయినా, పెనుకొండకు పోయినా, రాప్తాడు నుంచి పోటీ చేసినా ఓడించి తీరుతామన్నారు. పరిటాల ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు కురుబ లింగమయ్యను హతమార్చారన్నారు. రాబోవు ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయలేమని భావించే పరిటాల కుటుంబం రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాల్లో దోపిడీలకు తెరలేపిందన్నారు. వారిలా హత్యలతో భయభ్రాంతులకు గురి చేసి జనాలను తాను లోబర్చుకోలేదన్నారు. తాను ఆర్థికంగా చెడిపోయినా రైతులకు మేలు చేశానన్నారు. జనాలకు ప్రేమతో దగ్గరయ్యానన్నారు. నేటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నామని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో జరిగిన కొన్ని పొరబాట్లను సరిదిద్దుకుంటామన్నారు. ఈసారి అసెంబ్లీ సీట్లు పెరగనున్న నేపథ్యంలో గ్రేటర్ రాయలసీమలో 111లో కనీసం 106 స్థానాలు వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంటుందని పేర్కొన్నారు. జగన్ పాలన కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆయనపైనే అన్ని వర్గాల ప్రజలు నమ్మకం పెట్టుకున్నారన్నారు. అనంతరం మండలాల వారీగా సర్పంచులను సన్మానించారు. కార్యక్రమంలో ఆహుడా మాజీ చైర్మన్ మహలక్ష్మీ శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నాయకులు కదిరి ఇస్మాయిల్, సానే రాజారెడ్డి, పేరూరు నాగిరెడ్డి, రంగంపేట గోపాలరెడ్డి, మదిగుబ్బ వీరాంజనేయులు, గంగుల సుధీర్రెడ్డి, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మండలాల కన్వీనర్లు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు జరిగిన మేలు ఏదీ లేదు వైఎస్ జగన్ క్రమశిక్షణతో ప్రభుత్వాన్ని నడిపారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
●తీవ్రమైన గ్యాస్ కష్టాలు
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ గ్యాస్ వినియోగదారులపై తీవ్రంగా పడుతోంది. సరఫరా మందగించడంతో గ్యాస్ డిమాండ్ అంతకంతకూ పెరిగిపోతోంది. కమర్షియల్ వంటగ్యాస్పై ఆధారపడిన హోటళ్ల నిర్వహణ భారంగా మారింది. గ్యాస్ దొరకని కారణంగా కొన్ని హోటళ్లు మూత పడుతున్నాయి. మరికొంతమంది పాత పద్ధతిలో కట్టెల పొయ్యిలపై వంట తయారు చేసి హోటళ్లను నెట్టుకొస్తున్నారు. ఇక గృహావసర వినియోగదారులకు గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో ప్రత్యేకంగా సమయం కేటాయించుకుని పుల్లలు ఏరుకొచ్చి కొందరు, కొనుక్కొచ్చి మరికొందరు పొయ్యి వెలిగిస్తున్నారు. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ఎదురుచూస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
రాజకీయ పోస్టింగ్లకు చెక్
● శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ నిర్ణయంతో 30 మంది బదిలీ అనంతపురం సెంట్రల్: రాజకీయ సిఫారసులకు చెక్ పెడుతూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తనదైన మార్క్ను చూపించారు. వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 30 మందికిపైగా కానిస్టేబుళ్లకు స్థాన చలనం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... జిల్లాల విభజన సమయంలో శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించిన కానిస్టేబుళ్లలో 30 మందికి పైగా అక్కడ పనిచేయడానికి అయిష్టత వ్యక్తం చేస్తూ రాజకీయ నాయకులతో సిఫారుసులతో అనంతపురం జిల్లాలోని వివిధ పీఎస్ల్లో తిష్ట వేశారు. వీరందరూ ఆయా పీఎస్ల్లో బాస్లకు అత్యంత కీలకమైన వారుగా చలామణి అవుతున్నారు. అనంతపురం వన్టౌన్ పీఎస్లోనే నలుగురు కానిస్టేబుళ్లు తిష్టవేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఓ కానిస్టేబుల్ ఇక్కడ పనిచేయడానికి ఇతర జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా నేరుగా డీజీపీ కార్యాలయం నుంచి సిఫారసు చేయించాడంటే వన్టౌన్ పీఎస్కు డిమాండ్ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్పీ సతీష్కుమార్ శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించిన కానిస్టేబుళ్లందరూ తక్షణమే అక్కడ రిపోర్టు చేసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ జిల్లాకు సదరు కానిస్టేబుళ్లు ఏకమై శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో సంప్రదించి ఎస్పీ సతీష్కుమార్పై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అయినా ఎస్పీ సతీష్కుమార్ తలొగ్గకుండా ఆ కానిస్టేబుళ్లందరూ శ్రీసత్యసాయి జిల్లాలోనే విధులు నిర్వర్తించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కానిస్టేబుళ్ల వంతు కాగా, తర్వాత మిగిలిన కేడర్లోనూ స్థాన చలనం తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎస్పీ సతీష్కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పోలీస్ శాఖలో హాట్టాపిక్గా మారింది. వ్యక్తి దుర్మరణంబత్తలపల్లి: మండలంలోని 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని గాండ్లవీధికి చెందిన బలిజ చింతా చిన్న కొండప్ప(36) స్థానికంగా ఓ సిల్క్ హౌస్లో గుమాస్తాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అనంతపురానికి ద్విచక్ర వాహనంపై వెళ్లిన కొండప్ప... అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమై బత్తలపల్లి మండలం సంజీవపురం సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో కాటికోటేశ్వరక్షేత్రానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ఆర్చ్ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొండప్ప భార్య గీత, కుటుంబసభ్యులు బంధువులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు. -
ఉద్యోగులను రోడ్డెక్కించిన ప్రభుత్వం
అనంతపురం అర్బన్: హక్కుగా రావాల్సిన ప్రయోజనాలను సాధించుకునేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను చంద్రబాబు ప్రభుత్వం రోడెక్కించిందని యూటీఎఫ్ నాయకులు మండిపడ్డారు. యూటీఎఫ్ రణభేరిలో భాగంగా బుధవారం కలెక్టరేట్ ఎదుట సంఘం జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు అధ్యక్షతన నాయకులు ఓబుళేసు, అర్జున్, హనుమంతరెడ్డి, మహేష్, గంగాధర్ తదితరులు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య, గౌరవాధ్యక్షుడు వెంకటరామరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం నెరవేరుస్తుందని రెండేళ్లుగా ఎదురు చూశామన్నారు. అడపాదడపా కొన్ని బకాయిలు చెల్లించడం తప్ప పూర్తిస్థాయిలో సమస్యలు తీరలేదన్నారు. దీపావళి కానుక ఒక డీఏతో సరిపెట్టారన్నారు. సంక్రాంతి కానుకగా రూ.11,100 కోట్లు డీఏ బకాయిల చెల్లింపులకు కేటాయించినా 50 శాతం మందికి జమ కాలేదన్నారు. అన్నింటికీ మించి ఉద్యోగులకు 12వ పీఆర్సీ 2027 జూలై 1 నుంచి అమలుకావాల్సి ఉందన్నారు. 20 నెలలు గడిచినా ఈ ప్రభుత్వం కొత్త కమిషన్ను నియమించలేదన్నారు. ఇప్పటికే 30 నెలల పాటు రావాల్సిన పీఆర్సీ ప్రయోజనాలను కోల్పోయామన్నారు. సకాలంలో డీఏలు ఇవ్వకుండా వాయిదా వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారి పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 అక్టోబరు నుంచి గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించకపోవడంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. సర్వీసులో ఉన్నవారికి సరెండర్ లీవులు ఇవ్వలేదన్నారు. ఎంప్లాయి హెల్త్ స్కీమ్ ఉదోగులకు ఏ విధంగానూ ఉపయోగపడడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 అమలు చేయడంలో తీవ్ర తాత్సారం జరుగుతోందని మండిపడ్డారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తామన్నా హామీని ప్రభుత్వం నిలుపుకోలేదని ధ్వజమెత్తారు. అనంతరం డీఆర్ఓ మలోలకు నాయకులు వినతిపత్రం అందజేశారు. నిరాహార దీక్షకు ఏపీఎన్జీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు మాధవ్, నగర అధ్యక్షుడు మనోహర్రెడ్డి, శ్రీధర్, పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాసులు, ఇతర నాయకులు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ కోశాధికారి రాఘవేంద్ర, రాష్ట్ర కౌన్సిలర్లు లింగమయ్య, గోవిందరాజులు పాల్గొన్నారు. రెండేళ్లయినా చంద్రబాబు సర్కార్ చేసిందేమీ లేదు నిరాహార దీక్షలో యూటీఎఫ్ నాయకులు -
వైభవంగా గొడుగుల మెరవణి
గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో జరుగుతున్న విశ్వకవి యోగి వేమన బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి గొడుగుల మెరవణి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కటారుపల్లి, గొల్లపల్లి గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా గొడుగులను తీసుకెళ్తూ మెరవణి నిర్వహించారు. వేమన భక్తులు స్వామిగొడుగులకు టెంకాయలు సమర్పించారు. కార్యక్రమంలో కేరళ నుంచి వచ్చిన కళాకారుల డ్రమ్స్ వాయిద్య ప్రదర్శన, కథాకళి నృత్యం, కేరళ మిర్రర్ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గొడుగుల మెరవణి తెల్లవారుజామున వరకు కొనసాగింది. దీంతో నాలుగు రోజుల పాటు కొనసాగిన బ్రహ్మోత్సవాలు ముగిశాయి. -
శభాష్ రోనాల్డ్..
గుంతకల్లు: అంతర్జాతీయ సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్ షిప్లో గుంతకల్లులోని శ్రీశంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాల బీసీఏ విద్యార్థి ఆరోనా రోనాల్డ్ హో రాణించాడు. గత నెల 25 నుంచి 30వ తేదీ వరకు థాయిలాండ్లోని పాథూంధానిలో రెండో ఏషియన్ యూనివర్సిటీ సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. ఆసియా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన 32 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరోనా రోనాల్డ్ కు కాంస్య పతకం దక్కింది. బుధవారం కళాశాలకు చేరుకున్న విద్యార్థిని కరస్పాండెంట్ కేసీ హరి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.సురేష్బాబు, అధ్యాపకులు టి.వెంకటరమణ, బశెట్టి కృష్ణయ్య, ఖాజావలి, కోచ్ శేఖర్ అభినందించారు. నేడు కూడేరు సంగమేశ్వరుడి రథోత్సవంకూడేరు: స్థానిక సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 6.45 గంటలకు మడుగు తేరు, సాయంత్రం 5.30 గంటలకు రథోత్సవం ఉంటుందని ఆలయ ఈఒ రమేష్ బాబు బుధవారం వెల్లడించారు. రథోత్సవానికి జిల్లా నలమూల నుంచే కాక కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చే భక్తులు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. గంజాయి పట్టివేతగుంతకల్లు రూరల్: స్థానిక శివారు ప్రాంతంలోని దోనిముక్కల మార్గంలో కారులో గంజాయి తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. వివరాలను గుంతకల్లు రూరల్ పీఎస్ ఎస్ఐ బాలముని బుధవారం వెల్లడించారు. బెంగళూరుకు చెందిన అరుణ్కుమార్ కారులో కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామం నుంచి గంజాయిని తీసుకుని బుధవారం తిరుగు ప్రయాణమయ్యాడు. ప్రధాన రహదారులపై ప్రయాణిస్తే పోలీసులకు పట్టుబడే ప్రమాదముండడంతో గ్రామీణ రహదారులను ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో గుంతకల్లు నుంచి దోనిముక్కల మార్గంలో పామిడి మీదుగా బెంగళూరుకు చేరుకోవాలని భావించి ఆ దిశగా కారును మళ్లించాడు. అయితే అప్పటికే దోనిముక్కల బ్రిడ్జి వద్ద వాహన తనిఖీలు చేపట్టిన గుంతకల్లు రూరల్ పోలీసులు.. శరవేగంగా వస్తున్న కారును గమనించి ఆపి పరిశీలించారు. అందులో కిలో గంజాయిని గుర్తించి అరుణ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
ఇష్టారాజ్యంగా యూరియా పంపిణీ
కూడేరు: స్థానిక మన గ్రోమోర్ ఎరువుల దుకాణంలో బుధవారం యూరియా పంపిణీ ప్రక్రియ గందరగోళానికి దారితీసింది. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ధ సంఖ్యలో తరలి వచ్చారు. ఒక్కో రైతుకు ఒక బస్తా ఇవ్వాలనే నిబంధన ఉందని మేనేజర్ దిలీప్ ప్రకటించడంతో రైతులు అసహనానికి గురయ్యారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. రెండు మూడు రోజులుగా కొందరు రైతులకు 2 నుంచి 6 బస్తాల వరకు పంపిణీ చేసి, ఇప్పుడు ఒక బస్తానే అంటే ఎలా అంటూ నిలదీశారు. ఈ అంశంపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. వాస్తవానికి మార్చి 25న సుమారు 12 టన్నుల యూరియా కూడేరులోని మన గ్రోమోర్ దుకాణానికి సరఫరా అయింది. అయితే యూరియా కోసం వచ్చిన రైతులకు ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేస్తామంటూనే కొందరు రైతులకు లోగుట్టుగా సరఫరా చేస్తూ వచ్చారు. ఆదివారం ముద్దలాపురానికి చెందిన ఒకే రైతుకు ఏకంగా 6 బస్తాల యూరియా ఇవ్వడం వివాదానికి కారణమైంది. -
పాత పనులకు పచ్చ ముద్ర
అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది. శిలాఫలకాలపై ఫొటో వేసుకునేందుకు గత ప్రభుత్వంలో చేసిన పనులను సైతం తన ఖాతాలోకి వేసుకుంటున్నారు. నవ్విపోదురుగాక మాకేటి సిగ్గు అన్న చందంగా వ్యవహరిస్తుండటం చూసి ప్రజలు విస్తుపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎ.నారాయణపురం బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అయితే ప్రస్తుత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంత్రితో కలిసి మళ్లీ శంకుస్థాపన చేయించారు. తాజాగా అనంతపురం రూరల్ గ్రామపంచాయతీలో తాగునీటి పథకం సంప్లను మరోమారు ప్రారంభించి ‘క్రెడిట్ చోరీ’కి యత్నించారు. వాస్తవానికి 2024 మార్చి 15న అనంతపురం రూరల్ వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి సర్పంచ్ ఉదయ్ ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత తన ఫొటో వేసుకుని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రారంభించారు. ఇవే కాదు.. రుద్రంపేట, రాజీవ్ కాలనీ పంచాయతీలు మొదలుకుని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక పనులను క్రెడిట్ చోరీ చేస్తుండడంతో అధికార టీడీపీ నాయకులే బాహాటంగా నవ్వుకుంటున్నారు. వీలైతే నిధులు మంజూరు చేయించుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టాలే కానీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేసిన పనులను తన ఖాతాలో వేసుకోవడం ఏంటంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించిన ‘అనంత’ అనంతపురం రూరల్ పంచాయతీలో ఆరువేలకు పైగా జనాభా ఉంది. పంచాయతీ ఆవిర్భావం నుంచి ప్రజల అవసరాలకు బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే ఆ నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన అప్పటి అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి ప్రజలు తమ సమస్యను వివరించి.. ఫోరైడ్ నుంచి విముక్తి కల్పించాలని కోరారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అనంత హామీ ఇచ్చారు. అందులో భాగంగానే సత్యసాయి తాగునీటి పథకం ద్వారా రూరల్ పంచాయతీకి 2.5 లక్షల లీటర్ల తాగునీటిని అందించే పథకాన్ని మంజూరు చేయించారు. ఇందుకు అవసరమైన నిధులను జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, అప్పటి ఎంపీ తలారి రంగయ్య సహకారంతో సమీకరించారు. వాటికి తోడుగా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వినియోగించారు. కోటి రూపాయల వ్యయంతో ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశారు. ఇది వరకే సురక్షిత తాగునీరు సరఫరా చేశారు. అయితే ఈ పనులను తానే చేయించినట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇప్పుడు హడావుడి చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. క్రెడిట్ చోరీలో దగ్గుపాటి దూకుడు శిలాఫలకాలపై ఫొటోలు వేసుకుని మురిసిపోతున్న ప్రజాప్రతినిధి ఇదెక్కడి చోద్యమంటూ విస్తుపోతున్న నగర ప్రజలు -
అర ఎకరాకు ఆరుగురు కాపలా!
అనంతపురం అగ్రికల్చర్: పట్టుపరిశ్రమ శాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతులను కలిసి మల్బరీ విస్తీర్ణం పెంపునకు చర్యలు చేపట్టడం లేదు. అక్కడక్కడా పట్టుగూళ్లు పెంచుతున్న రైతులకు సూచనలు చేయడానికి కూడా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వేసవిలో పంట సరిగా చేతికిరాక రైతులు అవస్థలు పడుతున్నారు. సిబ్బంది కొరత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న పట్టుపరిశ్రమ అధికారులు... అదే పట్టుశాఖ కార్యాలయ ఆవరణలో అర ఎకరా నర్సరీకి మాత్రం ఆరుగురిని కాపలా ఉంచటంపై సమాధానం చెప్పలేకపోతున్నారు. మల్బరీ నర్సరీ ఎవరూ తినేది కాదు. దొంగలు ఎత్తుకెళ్లేదీ కాదు. పంట సాగు చేసే రైతులకు మాత్రమే ఉపయోగపడుతుంది. దాని కోసం ఒకదిద్దరు టెక్నికల్ సిబ్బంది ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక సెరికల్చర్ ఆఫీసర్ (ఎస్వో) నేతృత్వంలో ఐదారుగురు పనిచేస్తుండటం గమనార్హం. ఏడాది పొడవునా నర్సరీ ద్వారా కనీసం ఒక లక్ష రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి లేకున్నా... కాపలాదారులకు మాత్రం పదింతలు వరకు వేతనాల రూపంలో వెచ్చిస్తున్నారు. కార్యాలయాలకు, నర్సరీ పర్యవేక్షణకు ఎపుడు వస్తారో తెలియదంటున్నారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతూ పట్టుశాఖ అధికారులు హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. 69 మంది షిఫ్ట్ ఆపరేటర్ల తొలగింపు అనంతపురం టౌన్: విద్యుత్ సబ్ స్టేషన్లలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన షిఫ్ట్ ఆపరేటర్లుగా విధుల్లోకి చేరిన వారిలో 69 మంది నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు విచారణలో తేలినట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. వారందరినీ తక్షణమే తొలగించడంతోపాటు చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్ఈలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని తిరుపతిలో ముగ్గురు, చిత్తూరులో నలుగురు, కడపలో 38 మంది, కర్నూలులో 16 మంది, అన్నమయ్యలో ఒకరు, అనంతపురంలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో నలుగురు చొప్పున నకిలీ ఐటీఐ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి షిఫ్ట్ అపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. వారందరిని తక్షణమే తొలగించడంతో పాటు ఏజెన్సీలకు నోటీసులను జారీ చేయాలని ఎస్ఈలకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడక్కడా అకాల వర్షాలు అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు 10 మండలాల పరిధిలో 3.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గుత్తి 31.2 మి.మీ, ఉరవకొండ 28.2, శెట్టూరు 14.6, కంబదూరు 14.6, వజ్రకరూరు 5.8, బ్రహ్మసముద్రం 5 మి.మీ, గుమ్మఘట్ట, పెద్దవడుగూరు, కూడేరు తదితర మండలాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలుల వల్ల అరటి, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నా... పంటలు దెబ్బతిన్నట్లు క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి రిపోర్టులూ రాలేదని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. వార్డుల సంఖ్య పెంపు తాడిపత్రి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెంచుకుని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య 50 నుంచి 62కు పెరిగింది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలో 36 నుంచి 48, గుంతకల్లులో 37 నుంచి 48, రాయదుర్గంలో 32 నుంచి 40, గుత్తిలో 25 నుంచి 32, కళ్యాణదుర్గంలో 24 నుంచి 32, కదిరిలో 36 నుంచి 44, పుట్టపర్తిలో 27 నుంచి 28, మడకశిరలో 20 నుంచి 23, హిందూపురంలో 38 నుంచి 52, పెనుకొండ నగరపంచాయతీలో 20 నుంచి 23కు వార్డుల సంఖ్య పెరిగింది. -
విధుల్లో నిర్లక్ష్యం వీడండి
● అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ఆదేశం బొమ్మనహాళ్: ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వీడి బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం ఆయన బొమ్మనహాళ్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ప్రభుత్వ సేవల అమలులో లోపాలు బట్టబయలయ్యాయి. బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత బొమ్మనహాళ్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసి.. వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడుతూ ఏ పంటలు సాగు చేశారని ఆరా తీశారు. నేమకల్లుకు చెందిన ఓ రైతు తనకు పట్టా ఉన్నా భూమిని ఆన్లైన్ చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఆసైన్మెంట్ కమిటీ వేస్తే నమోదు చేయవచ్చని తహసీల్దార్ మునివేలు తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ కమిటీ అమలులో ఉంది చదువుకోలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో మాట్లాడి రైతు సమస్య పరిష్కరించండని ఆదేశించారు. అనంతరం స్ధానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను తనిఖీ చేశారు. కలెక్టర్కే బురిడీ.. బొమ్మనహాళ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, వైద్య సేవలపై ఆరా తీశారు. ఆ సమయంలో వైదాధికారి శ్రీలక్ష్మి ఆస్పత్రిలో లేరు. ఎక్కడికెళ్లారని అడిగితే.. చంద్రగిరిలో 104 వైద్య శిబిరానికి వెళ్లారని సీహెచ్ఓ ఈశ్వరయ్య చెప్పారు. ఆయన మాటలపై అనుమానం వచ్చిన కలెక్టర్.. చంద్రగిరిలో పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి శిబిరం ఉందా.. డాక్టర్ ఉన్నారా లేరా అనేది చూసి చెప్పాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి రమేష్ వెళ్లి శిబిరం ఉందని చెప్పగా.. డాక్టర్తో మాట్లాడించాలని కోరారు. అయితే కార్యదర్శి ఎంఎల్హెచ్పీ రాధతో మాట్లాడించారు. తర్వాత అక్కడ డాక్టర్ లేరన్న విషయం తేటతెల్లమైంది. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించడంపై మండిపడ్డారు. ఆన్లైన్ నమోదులో నిర్లక్ష్యం కురువల్లి గ్రామంలోని అంగన్వాడీ –1 కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆ తర్వాత రెండో కేంద్రంలో తనిఖీకి వెళ్లినప్పుడు పిల్లల బరువు, ఎత్తు వివరాలను ఆన్లైన్లో తప్పుగా నమోదు చేయడాన్ని గమనించారు. వాస్తవ స్థితికి భిన్నంగా నమోదు చేసినందుకు అంగన్వాడీ వర్కర్ పార్వతిని సస్పెండ్ చేయాలని ఐసీడీఎస్ పీడీకి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్ధానిక సచివాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ, సర్వేయర్ రవితేజ పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలి : జేడీఏ
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు పెట్టుబడుల భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జేడీఏ ముదిగల్లు రవి అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అనంతపురంలోని ప్రకృతి వ్యవసాయ విభాగం కార్యాలయంలో నాచురల్ ఫార్మింగ్ చీఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీటీఐఓ) లక్ష్మానాయక్ అధ్యక్షతన వ్యవసాయ, సెర్ఫ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం జేడీఏ ప్రారంభించి, మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయ విధానాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుండటం అభినందనీయమని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులకు పెట్టుబడుల భారం తగ్గించి దిగుబడులు పెంచే ఆలోచన చేయాలన్నారు. ఇందుకు గాను పూర్వపు వ్యవసాయ విధానాలకు కాస్త ఆధునికత జోడించి శాసీ్త్రయ పద్ధతుల్లో పంటల సాగుచేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. ప్రకృతి సాగు పద్ధతుల్లో భాగంగా పీఎండీఎస్, డాక్టర్ పీఎం, హెచ్ఎం మోడల్స్ కింద వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు చేయించాలన్నారు. -
జొన్న ఇగురు తిని గొర్రెల మృతి
పెద్దవడుగూరు: జొన్న ఇగురు తిని 35 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బాధిత కాపరులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామానికి చెందిన చెట్ల పుల్లన్న, రామాంజనేయులు, గణేష్, నారాయణ, నాగార్జున, తరిమెల రామాంజనేయులు జీవాల పోషణతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో తమకున్న 800 గొర్రెల మందను మేపు కోసమని పి.కొట్టాలపల్లి గ్రామ సమీపంలో బుధవారం విడిచారు. అక్కడి ఓ రైతు పొలంలో ఉన్న లేత జొన్న ఇగురు మేసిన తర్వాత ఎండలు అధికంగా ఉండటంతో చెట్టు నీడకు గొర్రెలను తరలిస్తుండగా మార్గమధ్యంలోని కాలువను దాటే క్రమంలో సుమారు 45 గొర్రెల నీళ్లు తాగాయి. గమనించిన కాపరులు వెంటనే అప్రమత్తమై గొర్రెలు నీళ్లు తాగకుండా అక్కడి నుంచి చెట్టుకిందకు మళ్లించారు. కొద్ది సేపటి తర్వాత నీళ్లు తాగిన 40 గొర్రెలు అపస్మారక స్థితికి చేరుకున్నాయి. వాటిని కాపాడుకునేందుకు కాపరులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 39 గొర్రెలు మృతి చెందడంతో బాధితులు బోరుమని విలపించారు. రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
గాలీవాన బీభత్సం.. పంటలకు నష్టం
● పలు చోట్ల నేలకొరిగిన విద్యుత్ స్తంభాలుశెట్టూరు: జిల్లాలో పలు చోట్ల మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలీవానకు శెట్టూరు మండలం తిప్పనపల్లిలో నాలుగు విద్యుత్ స్తంభాలు, పలు చెట్లు నేలవాలాయి. ఇంకా మామిడి, ఇతర పంటలు దెబ్బ తిన్నాయి. గ్రామంలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. గుత్తిలోనూ భారీ వర్షం పడింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వజ్రకరూరు: మండల కేంద్రం వజ్రకరూరులో మంగళవారం సాయంత్రం గంటపాటు మోస్తరు వర్షం కురిసింది. పలువీధులు జలమయమయ్యాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలులకు నేలకొరిగిన అరటి కూడేరు: మండల పరిధిలో మంగళవారం ఈదురు గాలులు వీచాయి. జల్లిపల్లిలో రైతు దేవేంద్రకు చెందిన మూడు ఎకరాల్లోని అరటి చెట్లు నేలకొరిగాయి. ముద్దలాపురం, కొర్రకోడు, మరుట్ల, ఇప్పేరు, గొటుకూరు, కూడేరుతో పాటు మరికొన్ని గ్రామాల్లో మొక్కజొన్న, అరటి పంట నేలకొరిగింది. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేయించి ఆర్ధిక సహాయం అందజేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
అవినీతి అధికారికి 12 ఏళ్ల జైలు
అనంతపురం సెంట్రల్: కులాంతర వివాహం చేసుకున్న వారికి అందించే ప్రోత్సాహం మంజూరు చేసేందుకు ఓ వ్యక్తి నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అసిస్టెట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నాగభూషణంకు 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య మంగళవారం తీర్పు వెలువరించారు. ఆ వివరాలను అనంతపురం ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాయదుర్గానికి చెందిన కె.అజ్మిత్ 2014లో అనసూయమ్మను కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కులాంతర వివాహం చేసుకున్నాడు. 2016లో గిరిజన సంక్షేమశాఖ ద్వారా రూ.50 వేల పోత్సాహకం కోసం అనంతపురం కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పుడు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్న నాగభూషణం దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి రూ.4 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు 2018 ఏప్రిల్ 26న ఏసీబీని ఆశ్రయించాడు. 27న అనంతపురం గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో నాగభూషణం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకుని జ్యుడీషియల్ రిమాండ్కు పంపారు. ఈ కేసుల్లో అన్ని సాక్ష్యాధారాలు రుజువుకావడంతో మంగళవారం తుదితీర్పు వెలువరిచినట్లు డీఎస్పీ వివరించారు. ప్రివెన్షన్ కరప్షన్ యాక్టు–1998 కింద 5 సంవత్సరాలు, సెక్షన్ 13(2) కింద 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించారు. అందులో ఫిర్యాదుదారుకు రూ.1.90 లక్షలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించినట్లు తెలిపారు. కులాంతర వివాహ ప్రోత్సాహానికి రూ.4 వేలు డిమాండ్ 2018లో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు 8 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించిన కోర్టు -
వడదెబ్బతో మహిళా కూలీ మృతి
కూడేరు: ఎండలు భగభగ మండుతున్నాయి. ముద్దలాపురానికి చెందిన సుమన్ భార్య పర్మిల (26) అనే కూలీ వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పర్మిల భర్తతో పాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఎండలో పని చేస్తుండటం వల్ల రెండు రోజులుగా తలనొప్పితో బాధపడుతోంది. అయినా మంగళవారం ఓ రైతు పొలంలో బ్యాడిగి మిర్చి తొలగించే పనికి వెళ్లింది. అక్కడ ఉన్నపళంగా తలనొప్పి ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు కూడేరు పీహెచ్సీకి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి.. పర్మిల మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కనులపండువగా సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాలు కూడేరు: మండల కేంద్రం కూడేరులో పార్వతీపరమేశ్వర స్వయంభు జోడులింగాల సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం జోడు లింగాలకు ఆలయ అర్చకులు శివశంకర్ శాస్త్రి, ప్రవీణ్, మహేష్ స్వాములు క్షీర, రుద్రాభిషేకాలు నిర్వహించి, భక్తులకు దర్శనభాగ్యం కల్గించారు. రాత్రి 8 గంటలకు కమ్మ కులస్తుల సంఘం ఆధ్వర్యంలో నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుడు కొలువుదీరి గ్రామంలో మంగళవాయిద్యాల నడుమ విహరించారు. కమ్మకులస్తులు, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేయించారు. డీఆర్డీఏ పీడీగా సుధాకర్రెడ్డి అనంతపురం టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) పీడీగా ఆర్.సుధాకర్రెడ్డిని ఆశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) కార్యాలయంలో వాటర్షెడ్ విభాగం ఏపీడీగా పనిచేస్తున్న సుధాకర్రెడ్డికి పదోన్నతి కల్పిస్తూ డీఆర్డీఏ పీడీగా నియమించారు. ఇక్కడ ఇన్చార్జ్ పీడీగా పని చేస్తున్న శైలజను సమగ్రశిక్ష ఏసీపీగా మాత్రమే కొనసాగనున్నారు. మరో మూడు రోజుల్లో సుధాకర్రెడ్డి పీడీగా బాధ్యతలు చేపట్టనున్నారు. నేడు పింఛన్ల పంపిణీ అనంతపురం టౌన్: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు బుధవారం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ ఏపీడీ రాధారాణి మంగళవారం తెలిపారు. అన్ని రకాల పింఛన్దారులు 2,76,547 మందికి గాను రూ.124కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆయా పంచాయతీలలోని సచివాలయ ఉద్యోగులు పింఛన్ నిధులను డ్రా చేసినట్లు వెల్లడించారు. నేడు ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ మొదలవుతుందన్నారు. తొలిరోజు పింఛన్ తీసుకోని వారికి రెండో తేదీ మధ్యాహ్నం సచివాలయాల్లో అందజేయనున్నట్లు తెలిపారు. -
మోడల్ స్కూల్ ప్రవేశాలకు 2,313 దరఖాస్తులు
రాయదుర్గంటౌన్: ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో (ఏపీ మోడల్ స్కూల్) 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో మిశ్రమ స్పందన లభించింది. జిల్లాలో 15 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్నారు. మార్చి 31తో దరఖాస్తుల గడువు ముగిసింది. మొత్తం 2,313 మంది విద్యార్థుల దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించారు. దాదాపు ఆరు స్కూళ్లలో కనీసం దరఖాస్తుల సంఖ్య డబుల్ డిజిట్ దాటని పరిస్థితి ఉంది. మిగతా స్కూళ్లలో ఆశాజనకంగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో మోడల్ స్కూల్లో ఆరో తరగతిలో వంద సీట్ల ప్రవేశాలకు ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. -
జూనియర్ కాలేజీలకు కొత్త టైమింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: జూనియర్ కళాశాలల పని వేళలు మార్చారు. గతంలో 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఉండేవి. అయితే గతేడాది మధ్యలోనే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండేలా అమలు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా కొత్త వేళలే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మండిపడుతున్నారు. ఈ విషయంపై మంగళవారం డీవీఈఓ గురవయ్యశెట్టిని కలిసిన ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, కాంట్రాక్ట్, అతిథి అధ్యాపకులు వినతిపత్రం అందజేశారు. సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలు పెట్టుకోవడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు ఇంటికి చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. రవాణా సదుపాయం లేకపోవడంతో ఇళ్లకు చేరుకోవడం కష్టంగా ఉంటుందన్నారు. ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత విద్యార్థులు అందరూ ఇంటికి వెళ్లి పోతున్నారని గుర్తు చేశారు. అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు మాత్రమే ఉండాల్సి వస్తోందన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి 2024 –2025 విద్యా సంవత్సరం వరకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు టైమింగ్ ఉండేదన్నారు. 2025–2026 విద్యా సంవత్సరంలో ఈ సమయాలను మార్పు చేశారని ఫలితంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది సౌలభ్యం, భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పూర్వపు వేళల అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డీవీఈఓ హామీ ఇచ్చారు. నేటి నుంచి జూనియర్ కళాశాలల తరగతులు ప్రారంభం జూనియర్ కళాశాలల్లో బుధవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని డీవీఈఓ గురవయ్యశెట్టి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కళాశాలలు నిర్వహించాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. విద్యార్థులను కళాశాలలకు పంపేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని డీవీఈఓ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గతంలో 9:30 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు -
టీడీపీ వర్గీయుల బాహాబాహీ
పుట్లూరు: మండలంలోని కోమటికుంట్ల గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య కొడవళ్లు, కర్రలతో దాడులు చోటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు... స్థలం విషయంలో మూడు రోజుల క్రితం గ్రామంలోని రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ వర్గం ఫిర్యాదు మేరకు అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సోమవారం రాత్రి ఓ మహిళ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో దాదాపు 15 మంది కొడవళ్లు, కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడుల్లో ఎనిమిది మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నేడు యల్లనూరు, పెండేకల్లు చేపల చెరువుల వేలం అనంతపురం అగ్రికల్చర్: యల్లనూరు, పెండేకల్లు గ్రామాల్లోని చేపల చెరువులను వేలం వేయనున్నారు. ఈ మేరకు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ఎఫ్డీఓ) ఎంఎస్ ఆసీఫ్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. యల్లనూరు చెరువుకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆ గ్రామ సచివాలయంలో వేలం నిర్వహించనున్నారు. అలాగే పెండేకల్లు చెరువుకు సంబంధించి పెద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న మత్స్యకారులు రూ.వెయ్యి ధరావత్తు చెల్లించి వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చు. జాతీయ పోటీలకు ఎంపిక బుక్కరాయసముద్రం: ఈ నెల 6 నుంచి భువనేశ్వర్లో జరిగే జాతీయ స్థాయి రగ్బీ టోర్నీకు సిద్దరాంపురం జెడ్పీ హెచ్ఎస్ విద్యార్థిని సుస్మిత ఎంపికైంది. దీంతో మంగళవారం ఆమెను హెచ్ఎం నీరజ, పీడీ నాగరాజు అభినందించారు. -
సందర్భం నేడు ఆల్ ఫూల్స్ డే
మాట తప్పడానికీ ఓ రోజు! అనంతపురం కల్చరల్: మాటలతో ఎదుటి వ్యక్తులను ఫూల్స్ని చేయడం ఆల్ టైమ్ లేటెస్ట్ ట్రెండ్. ఈ క్రమంలోనే సరదాగా ఆటపట్టించే వేడుకగా ఏప్రిల్ 1న ‘ఆల్ ఫూల్స్ డే’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే ఇతరులను ఆటపట్టించాలనుకునే వారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే ఫూల్స్ అవడం వెనుక ఓ చారిత్రక కథనం వ్యాప్తిలో ఉంది. మనం అనుసరిస్తున్న క్యాలెండర్ 16వ శతాబ్దంలో తొలిసారిగా ఫ్రాన్స్లో తయారైందని ఆ దేశ చరిత్ర చెపుతోంది. దాని ప్రకారం ఆ దేశ ప్రభువు చార్లెస్ 1564లో జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కావాలని ఆదేశించారంట. అయితే అప్పటి వరకూ ఏప్రిల్ 1న నూతన సంవత్సరంగా జరుపుకునే వారందరూ రాజాజ్ఞ ప్రకారం జనవరి 1న నూతన సంవత్సరంగా అంగీకరిస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకోవడం మొదలు పెట్టారు. దీంతో వారిని చూసి పాత పద్దతి (ఏప్రిల్ 1)ని అనుసరించేవారు ఆట పట్టిస్తూ హేళన చేసేవారు. మాటల్లోనే కాకుండా లోపల ఏ వస్తువూ పెట్టకుండా అందమైన బహుమతులను అందించేవారు. ఆ ప్యాక్ తెరచి చూసి అవాకై ్క వెర్రి ముఖం వేసే వారిని ఫూల్స్ అయ్యారంటూ నవ్వుకునేవారు. కాలక్రమంలో ఈ పద్దతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఆ దినం ‘ఆల్ ఫూల్స్ డే’గా స్థిరపడింది. -
నగర పాలికలో రుద్రజాలం
అనంతపురం క్రైం/ అర్బన్: అధికారం మనదే.. అధికారులు మనం ఆడించినట్లు ఆడుతారు. మనల్ని అడిగేవారు, ఆడ్డుకునేవారు ఎవరూ లేరు.. ఉండరన్న బరితెగింపు.. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అహంకారం. ఆయనే కాదు.. ఆయన రక్తసంబంధీకులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకునేందుకు అడ్డదారులను ఎంచుకున్నారు. కోట్ల రూపాయలు దండుకునేందుకు నగరపాలక సంస్థను వేదికగా చేసుకున్నారు. నకిలీ కాంట్రాక్ట్ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారు. వాటితో కోట్ల రూపాయల పనుల టెండర్లు దక్కించుకున్నారు. కాసులముందు అధికారుల కళ్లు మూసుకుపోయాయి. రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అనేది పట్టించుకోలేదు. అదే పార్టీలోని ఓ సీనియర్ కాంట్రాక్టర్ ఈ విషయాన్ని పసిగట్టాడు. రాత్రికి రాత్రి ప్రజాప్రతినిధి రక్తసంబంధీకులు ఎలా కాంట్రాక్టర్లు ఆయ్యారని ఆరా తీశారు. సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న ప్రాథమిక సమాచారంతో అసలు గుట్టు రట్టయ్యింది. నకిలీ సంస్థ బాగోతం వెలుగులోకి.. : కాంట్రాక్టు పనులు చేయాలనుకునేవారు రోడ్లు, భవనాల శాఖలో కాంట్రాక్టు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. నీరుగంటి వీధికారి చెందిన ఆర్.శ్రీనివాసచౌదరి గత నెల 7న సమాచార హక్కుచట్టం కింద రుద్ర ఇన్ఫ్రా క్లాస్–3 కాంట్రాక్టు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తేదీ కోరారు. అదేవిధంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ (నంబర్ 37ఏబీజేఏఆర్6980ఎల్1జెడ్బీ) ఎప్పుడు జారీ చేశారు. కార్యాలయానికి ఎప్పుడు అందజేశారు.. క్లాస్–3 కాంట్రాక్టుకు సంబంధించి అనుభవ పత్రాలు అందజేశారా.. 2024 డిసెంబరు ఆరో తేదీకి సంబంధించిన పత్రాల సమాచారాన్ని ఇవ్వాలంటూ రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ను కోరారు. దీంతో ‘రుద్ర ఇన్ఫ్రా సంస్థ’కు సంబంధించి అనంతపురం ఆర్అండ్బీ సర్కిల్ పరిధిలో ఎలాంటి రిజిస్ట్రేషనూ కాలేదంటూ ఆ శాఖ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.గురుప్రసాద్ లిఖితపూర్వకంగా సమాచారం అందించారు. దీంతో ‘రుద్ర’ నకిలీ బాగోతం వెలుగుచూసింది. రుద్ర ఇన్ఫ్రా పేరుతో పనులు : శ్రీనగర్ కాలనీలో 80 అడుగుల రోడ్డు ఎక్స్టెన్షన్ క్రాస్ రోడ్డు నుంచి వరదాపురం సూరి కార్యాలయం వరకు అంచనా వ్యయం రూ.61.66 లక్షలతో బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం టీడీపీ కార్యాలయం వద్ద రూ.కోటి వ్యయంతో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బాగున్న రహదారిని ధ్వంసం చేసి కొత్త రోడ్డు నిర్మించడంపై స్థానికుల నుంచి విమర్శలు వినవస్తున్నాయి. ● సోమనాథనగర్ నడిమివంక నుంచి రామాలయం వరకు రూ.42 లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు వేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవికాకుండా సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఉన్న 50కి పైగా సివిల్ పనులు ఇతర కాంట్రాక్టర్లతో ఒప్పందం చేసుకుని దోపిడీ సాగించినట్లు విశ్వసనీయ సమాచారం. ముందే చెప్పిన ‘సాక్షి’ : అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో రూ.కోట్ల నిధులు దారిమళ్లుతున్న విషయాన్ని ఆధారాలతో సహా ‘సాక్షి’ పలు కథనాలను ప్రజలముందుంచింది. అయితే జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం ఈ అంశాన్నీ పట్టించుకోలేదు. దీంతో ప్రజాప్రతినిధి వర్గం మరింత చెలరేగిపోయింది. పర్యవరణ పరిరక్షణ పేరుతో ఉచితంగా అందించిన సంచులు, మహాత్ముని విగ్రహానికి రంగులు అద్దడం పనులతో పాటు ఎవరో వేసిన రహదారులకు లక్షల రూపాయలు అప్పనంగా బిల్లులు పెట్టుకుని దోచుకునేదాకా చేతివాటం సాగించారు. ఈ తరహా దోపిడి పదుల సంఖ్యలో సాగింది. తాజాగా హోర్డింగ్స్ లైసెన్స్దారుల జాబితాలో కూడా నకిలీ పేర్లు చొరబడ్డాయి. మా రికార్డుల్లో లేదు రుద్ర ఇన్ఫ్రా సంస్థకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇవ్వలేదు. అందుకు సంబంధించి రికార్డులు ఆర్అండ్బీలో లేవు. దానిపై పరిశీలన చేయాల్సి ఉంది. ఇక చర్యలు తీసుకోవాల్సిన అధికారం మాకు లేదు. – మురళీకృష్ణ, ఎస్ఈ, ఆర్అండ్బీ నకిలీ ఇన్ఫ్రా కంపెనీ దందా 50కి పైగా నిర్మాణాల పేరుతో రూ.కోట్ల దోపిడీ తాజాగా రూ.కోటితో సీసీ రోడ్డు నిర్మాణ పనులు -
అనుమానం పెనుభూతమై..
● భార్యను హతమార్చిన భర్త ● పోలీసుల అదుపులో నిందితుడు గుత్తి రూరల్: అనుమానం పెనుభూతమై చివరకు భర్త చేతిలో భార్య హతమైంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన శివలింగయ్యకు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కట్టేకల్లు గ్రామానికి చెందిన కొటేలీ లక్ష్మి(45)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రెండు నెలలుగా శివలింగయ్య పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ జులాయిగా తిరగసాగాడు. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానాలు పెంచుకుని ఆమెతో తరచూ గొడవ పడేవాడు. పలుమార్లు హత్యాయత్నం కూడా చేశాడు. దీంతో గుంతకల్లు మండలం గొల్లలదొడ్డిలో ఉంటున్న పెద్ద కుమార్తె శ్రీవిద్య తన తల్లిని పిలుచుకెళ్లి రక్షణ కల్పిస్తూ వచ్చింది. ఈ నెల 29న శివలింగయ్య గొల్లలదొడ్డికి వెళ్లి తన భార్య లక్ష్మిని పిలుచుకుని గుంతకల్లు మండలం కదిరిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. జాతరకు వెళదామంటూ... శివలింగయ్య, లక్ష్మి దంపతుల చిన్న కుమార్తె స్పందనకు కర్ణాటకలోని బళ్లారికి చెందిన యువకుడితో ఈ నెల 11, 12న వివాహం జరిగేలా నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లికి ముందు వరుడి ఇంట ఆచారం మేరకు మంగళవారం బళ్లారిలోని దుర్గమ్మ ఆలయంలో జాతరకు ఏర్పాట్లు చేశారు. వియ్యంకుల ఆహ్వానం మేరకు శివలింగయ్య కదిరిపల్లికి వెళ్లి తన భార్య లక్ష్మిని పిలుచుకుని గొల్లలదొడ్డిలో ఉన్న పెద్ద అల్లుడు మురళీకృష్ణ, మరో బంధువుతో కలిసి బళ్లారికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో మురళీకృష్ణను తప్పించి పూలకుంట గ్రామ శివారున మూతపడిన కంకర క్రషర్ యూనిట్ వద్దకు భార్యను పిలుచుకెళ్లి పై నుంచి కిందకు తోసేశాడు. ఈలోపు గుంతకల్లుకు చేరుకున్న మురళీ కృష్ణ తన మామకు ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయకపోవడంతో మరోసారి కాల్ చేశాడు. ఆ సమయంలో లక్ష్మి ఫోన్ ఎత్తి మాట్లాడుతూ... తనను ప్రాంతానికి తీసుకొచ్చి చంపే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పబోతుండగా ఫోన్ను శివలింగయ్య లాక్కొని కట్ చేశాడు. అనంతరం బండరాళ్లను ఆమె తలపై వేసి హతమార్చాడు. పొంతన లేని సమాధానాలు ఫోన్ కట్ కావడంతో అనుమానం వచ్చిన మురళీకృష్ణ, బంధువులు వెంటనే చెర్లోపల్లి, పూలకుంట, తదితర ప్రాంతాల్లో గాలిస్తూ కదిరప్పస్వామి కొండ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారికి తారసపడిన శివలింగయ్యను ఆపి లక్ష్మి గురించి ఆరా తీశారు. ఆ సమయంలో పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో దేహశుద్ధి చేశారు. దీంతో పెద్ద అల్లుడుకి విషయం తెలిపి లక్ష్మిని హతమార్చిన చోటుకు పిలుచుకెళ్లాడు. సమాచారం అందుకున్న విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి
అనంతపురం అర్బన్: తీవ్ర ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. జిల్లా సమాచార పౌర సంబంధాలు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అధికార యంత్రాంగం సంయుక్తంగా మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యులకు మెగా ఉచిత వైద్యశిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం స్వయంగా వైద్యపరీక్షలు చేయించుకుని, మాట్లాడారు. మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి డీంహెచ్ఓ, జీజీహెచ్, ప్రభుత్వ వైద్యకళాశాల బృందం, ఎన్టీఆర్ వైద్యసేవ అఽధికారులు పూర్తి సహకారం అందించారన్నారు. కాగా, జర్నలిస్టుల కోసం నిర్వహించిన మెగా ఉచిత వైద్యశిబరానికి విశేష స్పందన లభించింది. 236 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు సేవలు అందుకున్నారు. ఈ సందర్భంగా డీఐపీఆర్ఓ బాలకొండయ్య మాట్లాడుతూ.. శిబిరం విజయవంతం చేసిన జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటు అందించిన డీఎంహెచ్ఓ ఈబీదేవి, డాక్టర్ గంగాధరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ మల్లీశ్వరి, అడ్మినిస్టేటివ్ ఆఫీసర్ మల్లికార్జునరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, ప్రైవేటు ఆస్పతుల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టరేట్ ఉద్యోగులు శ్రీనివాసమూర్తి, పురుషోత్తం, రామప్ప, సమాచార శాఖ ఉద్యోగులు దామోదర్రెడ్డి, దుర్గా సుహాసిని, ప్రభావతి, చాంద్బాషా, కమల్బాషా, తాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. -
పంపనూరు ఆలయాన్ని సందర్శించిన ఎస్పీ
ఆత్మకూరు: మండలంలోని పంపనూరు వెలసిన సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని ఎస్పీ జగదీష్ మంగళవారం సందర్శించారు. ఈ ఆయనకు ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఆలయ కమిటీ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, సిబ్బంది నాగేశ్వరరెడ్డి, ఆనంద్, అర్చకులు రాము, సాయి తదితరులు ఉన్నారు. పండ్ల తోటను ధ్వంసం చేసిన రెవెన్యూ అధికారులు తాడిపత్రి టౌన్: మండలంలోని బుగ్గ గ్రామం వద్ద రైతు నాగరాజుకు చెందిన పండ్ల తోటను మంగళవారం సాయంత్రం 5 గంటలకు రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. మూడు ఎకరాల్లో మామిడి, అల్ల నేరేడు, సీతాఫలం, జామ చెట్లను రైతు పెంచుతున్నాడు. అయితే ప్రభుత్వ భూమిని అక్రమించాడనే నెపంతో 15 మంది వీఆర్ఓలు, వీఆర్ఏలతో కలసి ఆర్ఐ ఈశ్వర్రెడ్డి ఓ టెంపో వాహనంలో అక్కడకు చేరుకుని పండ్ల చెట్లను పెకలించేశారు. ఆ సమయంలో నాగరాజు కుటుంబసభ్యులు ప్రాదేయపడిన అధికారులు వినలేదు. దాదాపు రాత్రి 8 గంటల వరకూ ఈ ప్రక్రియ కొనసాగింది. గ్రామంలో చాలా మంది రైతులు ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు కేవలం నాగరాజు పైనే కక్షపూరితంగా వ్యవహరించారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రాఘవేంద్రప్రసాద్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ విషయమై వివరణ కోరేందుకు ఆర్ఐ ఈశ్వర్రెడ్డి ఫోన్లో ప్రయత్నించగా ఆయన అందుబాటులో రాలేదు. -
ఏసీబీ వలలో గుడిబండ తహసీల్దార్
గుడిబండ: మ్యుటేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గుడిబండ మండల తహసీల్దార్ శ్రీధర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి వివరాల మేరకు... గుడిబండ పరిధిలోని ఎస్.రాయాపురంకు చెందిన రైతు షేక్సద్దాం కొన్నేళ్లుగా పెనుకొండ మండలంలో ఉంటున్నారు. ఎస్.రాయాపురంలో తన పూర్వికుల ఆస్తి నాలుగు ఎకరాలు భూమి ఉండగా... ఆస్తి పంపకంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ ఆస్తి వివాదం పెనుకొండ ఆర్డీఓ కోర్టుకు చేరింది. కేసు విచారించిన ఆర్డీఓ కోర్టు ఎస్.రాయాపురంలోని నాలుగు ఎకరాల భూమిని షేక్సద్దాంకు మ్యుటేషన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షేక్సద్దాం కుమారుడు సద్దాంహుస్సేన్ కోర్టు ఆదేశాల ప్రకారం తమకు చెందాల్సిన నాలుగు ఎకరాల భూమికి పట్టాదారు పాసుబుక్ చేసి ఇవ్వాలని తహసీల్దార్ శ్రీధర్ను కోరారు. అయితే నెలలుగా తిరుగుతున్నా తహసీల్దార్ పట్టించుకోలేదు. మధ్యవర్తుల ద్వారా సంప్రదించగా తహసీల్దారు శ్రీధర్ రూ.లక్ష డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టలేని సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు తొలుత రూ.20 వేలు ఇస్తానని తహసీల్దార్కు తెలిపి మంగళవారం ఏసీబీ అధికారులు ఇచ్చిన డబ్బుతో కార్యాలయానికి వెళ్లాడు. అనంతరం తహసీల్దార్ శ్రీధర్కు రూ.20 వేలు ఇస్తుండగా... అక్కడ కాపుకాసిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ శ్రీధర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంటనే పంచనామా పూర్తి చేశారు. తహసీల్దార్ను కర్నూలు ఏసీబీ కోర్టు ఎదురు హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐ హమీద్ఖాన్ తెలిపారు. -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం టవర్క్లాక్: బాధ్యతతో విధులు నిర్వర్తించినప్పుడే ఉద్యోగులకు సరైన గుర్తింపు ఉంటుందని జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. ఇటీవల సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన పలువురు జూనియర్ అసిస్టెంట్లకు మంగళవారం తన చాంబర్లో ఉత్తర్వులను ఆమె అందజేసి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ నూతన సీఈఓ సుధాకరరెడ్డి, బదిలీ అయిన సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. నూతన సీఈఓ బాధ్యత స్వీకరణ జెడ్పీ సీఈఓగా సుధాకరరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఆ స్థానంలో పనిచేసిన శివశంకర్ మరో ప్రాంతానికి బదిలీ కావడంతో ఆయన సైతం మంగళశారం రిలీవ్ అయ్యారు. దీంతో ఇద్దరినీ జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన సుధాకరరెడ్డి ఒకే రోజు ఉద్యోగ విరమణ పొందడంతో ఇన్చార్జ్ బాధ్యతలను డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్యకు అప్పగించారు. ఈ నేపథ్యంలో సీనియర్గా ఉన్న గుంతకల్లు డీడీఓ విజయలక్ష్మిని సీఈఓగా నియమించే అవకాశమున్నట్లు సమాచారం. ఆత్మ పీడీ ఉద్యోగ విరమణ అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పీడీగా, రైతు శిక్షణా కేంద్రం (ఎఫ్టీసీ) ఇన్చార్జ్గా డీడీఏగా పనిచేస్తున్న పద్మలత మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ క్రమంలో ఆమెకు స్థానిక ఆత్మ కార్యాలయంలో చిరుసత్కారంతో అధికారులు, సిబ్బంది గౌరవంగా వీడ్కోలు పలికారు. కాగా, పద్మలత స్థానంలో ఆత్మ పీడీగా నారాయణనాయక్కు, ఎఫ్టీసీ ఇన్చార్జ్ డీడీఏగా శైలకుమారికి బాఽధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యవసాయశాఖ ఏడీఏగా రోజాపుష్పలత అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ ఏడీఏగా ఎల్.రోజాపుష్పలత మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలో పనిచేస్తున్న జీఎం అల్తాఫ్అలీఖాన్పై సస్పెన్షన్ వేటు వేస్తూ కమిషనరేట్ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానానికి స్థానిక భూసార పరీక్షా కేంద్రం (ఎస్టీఎల్) ఏడీఏగా ఉన్న ఎల్.రోజాపుష్పలతకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ జేడీఏ ముదిగల్లు రవి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. యువకుడి ఆత్మహత్య గుత్తి: స్థానిక నూతన నేసే కాలనీ సమీపంలోని గుట్ట కింద నారాయణస్వామి పొలంలోని వేప చెట్టుకు ఓ గుర్తు తెలియని యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సుమారు 28 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండవచ్చు. షర్ట్ కూడా లేదు. బనియన్తో ఉన్నాడు. పరిసరాల్లో మద్యం ఖాళీ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు పడి ఉన్నాయి. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కాగా, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే సమాచారం ఇవ్వాలని గుత్తి పోలీసులు కోరారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కమిటీలో గోపా మచ్చా అనంతపురం కల్చరల్: ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనంతపురానికి చెందిన గోపామచ్చా నరసింహులు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్తూరు అమ్మవారి శాలలో మంగళవారం రాత్రి ఆర్యవైశ్యలు ఆత్మీయ అభినందన సమావేశం ఏర్పాటు చేసి గోపామచ్చా నరసింహులును గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మాజీ సీఎం, దివంగత రోశయ్యకు ఆప్తుడిగా ఉంటూ ఆర్యవైశ్యులు అభ్యున్నతికి గోపామచ్చా నరసింహులు చేసిన కృషిని కొనియాడారు. టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా, రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా, వివిధ ఆలయాల కమిటీ సభ్యుడిగా నిస్వార్థ సేవలు అందించారన్నారు. నేషనల్ ఇంటిగ్రేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ ది ఇయర్, మెల్విన్ జోన్స్ ఫెలో అవార్డులు సొంతం చేసుకున్నారన్నారు. సమావేశంలో అమ్మవారి శాల ఉపాధ్యక్షుడు పొలమడ రమేష్బాబు, తల్లం మురళీకృష్ణ, మాజీ కార్పొరేటర్ వెంకటకృష్ణ, తాటి లావణ్య మనోజ్, సురేష్, క్రిష్టం రఘు, ఆదిశేషయ్య, సిరిగుప్ప వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీటీ సేవలు స్ఫూర్తిదాయకం
కళ్యాణదుర్గం: ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ అడ్డంకులు తొలగినందున ఆర్డీటీ సంస్థ ఇక ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలందించాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ, పార్టీ పీఏసీ సభ్యుడు డాక్టర్ తలారి రంగయ్య సూచించారు. పేదల కోసం పాటుపడుతున్న ఆర్డీటీకి భవిష్యత్తులో కూడా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో తలారి రంగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమానికి వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఉద్యమం తారస్థాయికి చేరడంతో కేంద్రం స్పందించి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేసింది. రెన్యూవల్ సాధనకు తోడ్పాటునందించినందున కృతజ్ఞతగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆర్డీటీ లబ్ధిదారులు సోమవారం కళ్యాణదుర్గంలో తలారి రంగయ్యకు ఘన స్వాగతం పలికి, సన్మానం చేశారు. విజయోత్సవ ర్యాలీ అనంతరం ఆర్డీటీ ఆస్పత్రికి ఎదురుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంగయ్య మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేదలకు విద్య, వైద్య, వ్యవసాయం, స్వయం ఉపాధి రంగాల్లో ఆర్డీటీ సంస్థ స్ఫూర్తిదాయకంగా సేవలందించిందన్నారు. అలాంటి సంస్థకు 2025లో ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ కాకపోవడంతో సేవలకు ఆటంకం ఏర్పడిందన్నారు. చివరకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. అయితే కూటమి పార్టీల నాయకులు గత వైఎస్సార్సీపీ హయాంలోనే ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ ఆగిపోయిందంటూ ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు అన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు. ఆర్డీటీని రాజకీయాలకు వాడుకోరాదని హితవు పలికారు. ఆర్డీటీ సంస్థ ద్వారా ప్రజలకు నిరాటంకంగా సేవలందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, సంయుక్త కార్యదర్శులు ములకనూరు తిమ్మరాయుడు, దొడఘట్ట నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఉరవకొండ కోర్టుకు బాంబు బెదిరింపు
ఉరవకొండ: ఉరవకొండ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో బాంబు ఉందంటూ సోమవారం మెయిల్ రావడం కలకలం రేపింది. సమాచారం తెలియగానే లాయర్లు, కోర్టు సిబ్బంది, ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఎస్ఐ జనార్దన్ నాయుడు తన సిబ్బందితో కోర్టుకు చేరుకుని సోదాలు చేశారు. అయితే ఎక్కడా బాంబు ఆనవాళ్లు కనిపించలేదు. కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడం ఇది మూడోసారి. మెయిల్ పంపిన వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ క్రైం పోలీసులను రంగంలోకి దింపనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పరిష్కరించకుంటే మెమో
● గార్లదిన్నె రెవెన్యూ సిబ్బందికి జేసీ హెచ్చరిక ● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం అర్బన్: ‘తమాషా చేస్తున్నారా.. సమస్య పరిష్కరించకుండా అర్జీదారును నాలుగేళ్లుగా తిప్పుకుంటారా.. వారంలోగా సమస్య పరిష్కరించకుంటే మీ అందరికీ మెమో జారీ చేస్తా’ అంటూ జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గార్లదిన్నె రెవెన్యూ సిబ్బందిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, పద్మావతితో కలిసి జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆనంద్ అనే కానిస్టేబుల్ తన సమస్యను జేసీకి విన్నవించారు. ‘గార్లదిన్నె మండలం కనంపల్లి సర్వే నంబరు 327లో మా నాన్న ఎర్రినాగప్ప పేరున రెండు ఎకరాల పొలం ఉంది. ఈ భూమిని నా భార్య పేరున (ఖాతా 5005, ఎల్పీ 298) మా నాన్న రాసిచ్చారు. దీనికి 2022లో (ఈ5/1620/2022) ఎన్ఓసీ వచ్చింది. అయితే ఇప్పటికీ ఆన్లైన్లో ప్రభుత్వ భూమిగానే ఉండటంతో దాన్ని తొలగించాలంటూ నాలుగేళ్లలో 100 సార్లకుపైగానే తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగినా సమస్య పరిష్కరించలేదు’ అని విన్నవించారు. జేసీ స్పందిస్తూ గార్లదిన్నె రెవెన్యూ సిబ్బందిని పిలిపించారు. వారంలోగా సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. లేదంటే అందరికీ మెమో జారీ చేస్తా అంటూ తీవ్రంగా హెచ్చరించారు. వినతులు కొన్ని.. ● అనంతపురం శివారు కళ్యాణదుర్గం రోడ్డులోని దామోదర సంజీవయ్య కాలనీలో నీరు, విద్యుత్ సదుపాయం లేదని కాలనీవాసి వెంకటేష్గౌడ్, తదితరులు అర్పీ అందజేశారు. తమ కాలనీకి నీటి, విద్యుత్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ● పంచాయతీ అనుమతి లేకుండా సొసైటీ స్థలంలో షాపు గదులు నిర్మిస్తున్నారని పెద్దపప్పూరుకు చెందిన నాగరాజు ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 63, 83లో సొసైటీ భూములు ఉన్నాయని తెలిపారు. సర్వే నంబరు 83లోని భూముల్లో ఎవరికీ తెలియకుండా పంచాయతీ అనుమతి లేకుండా దుకాణ గదులు నిర్మిస్తున్నారని, దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాడిపత్రి అభివృద్ధి ఎక్కడ జేసీ? ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ సస్పెన్షన్ అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ ఏడీఏ జీఎం అల్తాఫ్ అలీఖాన్పై సస్పెన్షన్ వేటు వేశారు. జాయింట్ కలెక్టర్ ిసిఫారసు మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ సోమవారం జీఓ విడుదల చేశారు. ఏడీఏ వ్యవహారశైలిపై తరచూ పత్రికలు, మీడియాలో వ్యతిరేక వార్తలు ప్రచురితం కావడం, అలాగే ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతులు లేకుండా జిల్లా కేంద్రంలో ఉన్న డివిజన్ కార్యాలయాన్ని రూరల్ మండలం కక్కలపల్లి ప్రాంతానికి మార్పు చేయడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్ వేటు వేశారు. తాడిపత్రి టౌన్: అభివృద్ధి అంటూ అరవడం తప్ప తాడిపత్రి ప్రాంతం ఎక్కడ అభివృద్ధి చెందిందో చెప్పాలంటూ టీడీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రశ్నించారు. రోడ్ల పక్కన మొక్కలు నాటి అదే అభివృద్ధి అంటే ఎలా అని నిలదీశారు. రోడ్లు వెడల్పు చేస్తామంటూ దుకాణాలు, ఇళ్లకు మార్కింగ్లు ఇచ్చి వ్యాపారులను, ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ వారి నుంచి ముడుపులు దండుకోవడం తప్ప తాడిపత్రి అభివృద్ధికి ఆయన తీసుకున్న చర్యలు ఏమీ లేవన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో పట్టణ, రూరల్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం కేతిరెడ్డి పెద్దారెడ్డి సమావేశమై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశముందని, ఈ నేపథ్యంలో ఎన్నికలకు అందరూ సిద్దంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ టీడీపీ నాయకుల దురాగతాలను ఎండగట్టాలన్నారు. అధికారం అండతో జేసీ సాగించిన అక్రమాలు, దుర్మార్గాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. 30 ఏళ్ల జేసీ సోదరుల రాజకీయంలో తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. పేకాట, మట్కా తదితర జూదాలతో పాటు గంజాయి కేంద్రంగా తాడిపత్రిని మార్చేశారని మండిపడ్డారు. తాడిపత్రిలో పేకాట నిర్వహణకు రోజూ రూ.30వేలు, మట్కా నిర్వహణకు ప్రతి నెలా రూ.50 లక్షలు చొప్పున మామూళ్లను పోలీసులు దండుకుంటున్నారని ఆరోపించారు. బడిపిల్లలకు సైతం గంజాయి దొరుకుతోందని మండిపడ్డారు. మున్సిపల్, తహసీల్దార్ కార్యాలయ అధికారులు జేసీకి తొత్తులుగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎర్రవంక భూముల అక్రమాలపై మున్సిపల్, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. జేసీ ప్రభాకరరెడ్డి దౌర్జన్యాలకు నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ రాబోవు రోజుల్లో న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ రాబర్ట్, రూరల్ కన్వీనర్ విజయ్కాంత్రెడ్డి, నాయకులు రాఘవేంద్ర ప్రసాద్, గంగులకుంట కేశవరెడ్డి, కాశీ మనోజ్, కంచం రామ్మోహన్రెడ్డి, నాగూర్ షరీఫా, ఆలూరు రామేశ్వరెడ్డి, నరసింహారెడ్డి, ఓబులరెడ్డి, గడ్డం పరమేష్, ఓబులేసు రెడ్డి, జిలాన్బాషా, రేవతి, డీవీ కుమార్, హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగంపల్లిలో రణబలి సందడి యల్లనూరు: మండలంలోని జంగంపల్లిలో రెండో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సందడి చేశారు. రాజుల కాలం నాటి కోటతో పాటు స్థానికుడు కృష్ణమనాయుడుకు చెందిన పురాతన ఇంటిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కోట తలుపులు బద్దలుకొట్టుకుని లోపలకు ప్రవేశించే సన్నివేశం ఆద్యంతం ఉత్కంఠను గొల్పింది. కాగా, జంగంపల్లిలో రణబలి షూటింగ్ ప్రక్రియ దాదాపు ముగిసినట్లయింది. చాలామంది అభిమానులు రెండు రోజులుగా విజయ్ దేవరకొండను కలిసి సెల్పీలు తీసుకోవాలని ఆత్రుత పడగా భద్రతా చర్యల నేపథ్యంలో వారికి నిరాశనే మిగిలింది. విద్యుదాఘాతంతో జేఎల్ఎం మృతి అనంతపురం టౌన్: విద్యుత్ షాక్కు గురై జూనియర్ లైన్మెన్ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే... అనంతపురంలోని డీ–3 సెక్షన్ పరిధిలో జేఎల్ఎంగా పని చేస్తున్న వెంగముని (43) ఆదివారం రాత్రి 1వరోడ్డులోని శివాలయం విద్యుత్ సమస్య తలెత్తడంతో మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. ఎల్సీ తీసుకుని ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎగ్జిట్ ఫ్యూజులు మారుస్తుండగా రివర్స్లో విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై పై నుంచి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, వెంగమునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు సోమవారం కళ్యాణదుర్గం రోడ్డులోని వెంగముని ఇంటికి చేరుకుని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. జర్నలిస్టులకు నేడు మెగా వైద్యశిబిరం అనంతపురం అర్బన్: అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యుల కోసం మంగళవారం కలెక్టరేట్లో మెగా వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు సమాచార శాఖ పీఆర్ఓ బాలకొండయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కలెక్టర్ సహకారంతో సమాచార, జిల్లా వైద్యారోగ్య శాఖలు, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం నిర్వహించనున్నారు. తొమ్మిది రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. కార్యక్రమంలో కిమ్స్ సవేరా, పావని, మార్క్, శ్రీనివాస, చంద్ర, కుమార్, స్నేహలత, మ్యాగ్నస్, మమత ఆస్పతులకు చెందిన జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జన్, కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, న్యూరో ఫిజీషియన్, నేత్ర, దంత, ఈఎన్టీ, యూరాలజిస్ట్ నిపుణులు పాల్గొని వైద్యసేవలు అందించనున్నారు. కనకరాజుకు ఎస్పీగా పదోన్నతి అనంతపురం సెంట్రల్: అదనపు ఎస్పీగా అనంతపురం పోలీసు ట్రైనింగ్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న కనకరాజుకు పదోన్నతి దక్కింది. సీఐడీ ఎస్పీగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు పీటీసీ ఉద్యోగులు అభినందనలు తెలిపారు. కుడి కాలువకు నీటి సరఫరా తగ్గింపు కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి ధర్మవరం కుడి కాలువకు నీటి విడుదలను సోమవారం తగ్గించారు. ఇప్పటి వరకూ 630 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తూ వచ్చారు. అయితే కాలువ పరిధిలోని ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 49 చెరువులు నీటితో నిండడంతో నీటి విడుదలను 300 క్యూసెక్కులకు తగ్గించినట్లు నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు. -
చట్టబద్ధత పేరుతో చంద్రబాబు కొత్త నాటకం
ఉరవకొండ: డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రాజధానికి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు కొత్త నాటకానికి తెరలేపారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలన్నీ పక్కదారి పట్టించేలా చట్టబద్ధత పేరుతో చట్టవిరుద్ధ తీర్మానం చేయడం అన్ని వర్గాలనూ మోసగించడమే అవుతుందన్నారు. ఆదివారం ఉరవకొండలోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో అమరావతికి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో నిర్వహించిన చర్చపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చర్చను తప్పుదోవ పట్టించారన్నారు. నిజమైన చర్చ రాజధాని పేరుతో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చ చేయాలన్నారు. 2014–2019 నాటి ఐదేళ్లు, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో రాజధాని ప్రాంత రైతుల్లో ఎంతమందికి ప్లాట్లు ఇచ్చారో, రాజధాని పేరుతో ఎంత అప్పులు చేశారో, ప్రధాని మోదీ అమరావతి నిర్మాణం కోసం రెండుసార్లు శంకుస్థాపన చేసినా పనులు ఎందుకు ప్రారంభం కాలేదో అన్న అంశం పై ప్రధానంగా చర్చ జరిపి ఉంటే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలిసేవన్నారు. ఈ సమస్యల పై చర్చించకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని దూషించడానికే ఆరు గంటల సమయం కేటాయించారని, ముఖ్యంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధ్వర్యంలో కొంతమంది చంద్రబాబుకు భజన చేయడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. భూసేకరణ కోసం మరో డ్రామా.. అమరావతి పేరుతో ఇప్పటికే దోపిడీ చేసిన చంద్రబాబు ‘రాజధానికి చట్టబద్ధత’ పేరుతో డ్రామాకు తెరలేపి రెండో విడత భూసేకరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారన్నారు. రాజధాని పేరుతో ఇప్పటికే రూ.50 వేల కోట్ల అప్పులు చేశారని, తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరో రూ.6వేల కోట్లు కేటాయించారన్నారు. ఇంతవరకు అమరావతిలో వర్షాల సమయంలో నీళ్లు బయటకు కొట్టడం, ముళ్లకంపలు పెరిగినప్పుడల్లా జంగిల్ క్లియరెన్స్ చేయడం తప్ప కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని చెప్పి దాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. మొదట విడత భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు ప్లాట్లు ఇవ్వకుండా వారిని మోసం చేసి, రెండో విడతలో మరో లక్ష ఎకరాలు సేకరించి బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుండి తప్పించుకోవడానికి ఉన్న ఫళంగా హైదరాబాద్ నుంచి పారిపోయి చంద్రబాబు విజయవాడకు వచ్చారన్నారు. అయితే విభజన హామీలు ఒక్కటీ అమలు కాకుండానే రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారన్నారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ లాంటివి సాధించకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించిన చంద్రబాబు ఈ భారమంతా ప్రజల నెత్తిపై మోపడానికి సిద్ధమయ్యారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు నరసింహులు, నాయకులు ఈడిగ ప్రసాద్, మండల సమన్వయకర్త ఓబన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఏసీ ఎర్రిస్వామి, రాష్ట్ర నాయకులు బసవరాజు, నాయకులు ఎర్రిస్వామి, ఎంపీటీసీ ఈశ్వర్, వేమన్న, మహానంది, పట్టణ నాయకులు ఆరె రాజా, విక్కీ తదితరులు పాల్గొన్నారు. అమరావతి నిర్మాణం అంటూ ఇప్పటికే రూ.50వేల కోట్ల అప్పులు ఆరు గంటల చర్చలో జగన్ను తిట్టడానికి, చంద్రబాబు భజన చేయడానికే సరిపోయింది వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం -
అనంత ఆశాకిరణం ఆర్డీటీ
రాప్తాడురూరల్: కరువు కష్టాలతో పోరాడుతున్న అనంతపురం జిల్లాకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఆశాకిరణం అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలుగా జిల్లాకు అండగా నిలిచిన ఆర్డీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్కు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్డీటీని ఇబ్బందులకు గురిచేసే పరిస్థితులు ఇటీవల నెలకొనడం బాధాకరమన్నారు. అయితే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆందోళనలు, ప్రజల మద్దతును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఆర్డీటీ మరింత విస్తృతంగా సేవలు అందించి, అనంతపురం జిల్లాలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్పై ‘తోపుదుర్తి’ హర్షం -
నేడు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాయలసీమ జోనల్ సమావేశం
అనంతపురం: వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాయలసీమ జోనల్ సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పాల్గొననున్నారు. అనంతపురం నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా..అనంతపుర నగరానికి వచ్చిన సుధాకర్ బాబును అనంతపురం జిల్లా ఎస్సీ సెల్ ఇంచార్జ్ కొర్రపాటి శరత్ బాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో మంత్రి ఆంజనేయులు, సిద్దరాంపురం సర్పంచ్ రామాంజనేయులు, సాకే అశోక్ కుమార్ ,మారుతి , తదితరులు పాల్గొన్నారు. -
రూ.19.76 కోట్లతో ఉద్యాన ప్రణాళిక
అనంతపురం అగ్రికల్చర్: ఏప్రిల్ నుంచి మొదలు కానున్న 2026–27 ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల అమలుకు జిల్లాకు రూ.19.76 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. అందులో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ (ఎంఐడీహెచ్) కింద రూ.17.50 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస యోజనా (ఆర్కేవీవై) కింద రూ.2.26 కోట్ల బడ్జెట్ ఇచ్చారన్నారు. ఆయిల్ఫాం కింద మరికొంత బడ్జెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో కొత్త తోటల విస్తరణ, పాత తోటల పునరుద్ధరణ, రెండు, మూడు సంవత్సరాల నిర్వహణ పథకం, యాంత్రీకరణ, పోస్టు హార్వెస్టింగ్ తదితర అన్ని రకాల పథకాలు అమలు చేయనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. -
ఆపరేషన్ నైట్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి
అనంతపురం సెంట్రల్: ఆపరేషన్ నైట్ సేఫ్టీపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. శనివారం రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి సమయాల్లో ఏ ఆపద వచ్చిన డయల్ –100ను సంప్రదించాలని, తక్షణం పోలీసు సిబ్బంది స్పందిస్తారన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, డీఎస్పీ శ్రీనివాసరావు, నగర సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పీఆర్సీ, మధ్యంతర భృతి కోసం పోరాటాలకు సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన, పాత పీఆర్సీ బకాయిల సాధనకు పోరాటాలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ నివేదికను ప్రవేశపెడుతూ మండల కౌన్సిళ్లు త్వరగతిన పూర్తి చేసి మండల నివేదికలు జిల్లా శాఖకు పంపించాలని కోరారు. అనంతరం రాష్ట్ర భవన నిర్మాణానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. -
మృతదేహం వెలికితీత
కళ్యాణదుర్గం రూరల్: భార్య చేతిలో దారుణ హత్యకు గురైన హనుమంతు మృతదేహన్ని అధికారులు ఆదివారం వెలికితీశారు. మండల పరిధిలోని పాతచెరువు గ్రామంలో భార్య సుకన్య భర్త హనుమంతును ముడునెలల క్రితం చంపి ఇంటి అవరణలో పాతిపెట్టిన ఘటన మూడురోజుల క్రితం బయట పడింది. నిందితురాలు సుకన్య రూరల్ పోలీస్స్టేషన్లో లొంగిపోయింది. ఆదివారం జిల్లా వైద్యాఽధికారి (హెచ్ఓడీ)శంకర నాయక్ బృందం, తహసీల్దార్ భాస్కర్, డీఎస్పీ రవిబాబు, సీఐ గణేష్ , గ్రామస్తుల సమక్షంలో హనుమంతు మృతదేహాన్ని వెలికితీసి ఫ్లోరెన్సిక్ ల్యాబ్ పంపారు. -
ఘరానా మోసగాళ్ల ముఠా అరెస్టు
రాయదుర్గం: అమాయకులకు లాభాల ఆశ చూపి.. వారి నుంచి నగదు వసూలు చేసుకుని మోసగిస్తూ.. ఎవరైనా నిలదీస్తే చంపుతానని బెదిరింపులకు దిగుతూ, అప్పుడప్పుడూ దారిదోపిడీలకు సైతం తెగబడుతున్న ముఠా గుట్టును రాయదుర్గం రూరల్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్లు ఈ ముఠాపై 15 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాయదుర్గం సర్కిల్ కార్యాలయం వద్ద సీఐ వెంకటరమణ వివరాలు వెల్లడించారు. గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన బెస్త ఓబులేసు నార్పల చుట్టుపక్కల ప్రాంతాల్లో గుజిరీ వ్యాపారం చేసేవాడు. అయితే ఇందులో వచ్చే ఆదాయం చాలడం లేదని చక్కెర, సిగరెట్ల హోల్సేల్ వ్యాపారిగా అవతారమెత్తాడు. ఈ క్రమంలో పామిడికి చెందిన పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, నార్పల మండలం కర్ణపుడికి చెందిన బెస్త మహేంద్రతో జత కట్టాడు. స్కార్పియో వాహనం తీసుకుని తమ కార్యకలాపాలు మొదలుపెట్టారు. ఓబులేసు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ మనోహార్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, భాస్కర్రెడ్డి, చక్కరరెడ్డి పేర్లతో దుకాణదారులను కలిసి తనవద్ద రూ.లక్ష సరుకు కొంటే రూ.10వేలు ఆదాయం పొందవచ్చని ఆశ చూపించాడు. దీంతో చాలామంది అతడి మాటలు నమ్మి డబ్బు చెల్లించారు. ఒక్కో ప్రాంతంలో కోటి రూపాయల దాకా వసూలు చేశాక అక్కడి నుంచి మరొక చోటుకు మకాం మార్చేసేవాడు. కొన్ని ప్రాంతాల్లో గొర్రెల వ్యాపారం చేసేవాడు. ఎక్కువ ఖరీదు కట్టి.. అడ్వాన్సు చెల్లించి గొర్రెలను తీసుకెళ్లి.. తర్వాత డబ్బు చెల్లించకుండా తప్పించుకునేవాడు. బాధితుడి ఫిర్యాదుతో... బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో బోయ గోవిందును కలిసి.. అతనివద్ద ఉన్న గొర్రెలను కొనడానికి బేరం కుదరకపోవడంతో వెనుదిరిగాడు. అయినా రెండు రోజులుగా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్నాడు. బోయగోవిందు ఎత్తినబూదేహాళ్లో బంధువుల వద్ద రూ.1.50 లక్షల నగదు తీసుకుని స్వగ్రామం నేమకల్లుకు ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా మార్గ మద్యంలో యూనిక్ క్రషర్ చెక్పోస్టు వద్ద స్కార్పియో వాహనంలో వచ్చిన ఓబులేసు బృందం అడ్డుకుంది. చాకుతో బెదిరించి అతడి జేబులోని నగదును దోచుకుని ఉడాయించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో విచారణ జరిపితే అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఉద్దేహాళ్లో ఓ గదిని ఓబులేసు బృందం అద్దెకు తీసుకుని, ఫేక్ ఐడీలతో సిమ్లు కొనడం, అవసరం తీరాక తీసేయడం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం నేమకల్లు సమీపంలో ఇన్చార్జ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పియోలో వచ్చిన ఓబులేసు బృందాన్ని పట్టుకుని విచారణ చేయడంతో వీరి మోసాలు బయటపడ్డాయి. ఓబులేసు, పెరుమాళ్ల రామకృష్ణారెడ్డి, బెస్త మహేంద్రలపై తాడిపత్రి, యర్రగుంట, ప్యాపిలి, ఆత్మకూరు, మెలకలచెరువు, కలికిరి, నల్లచెరువు, నెల్లూరు, యర్రగొండపాళ్యం, సోమందేపల్లి, గార్లదిన్నె, కూడేరు, ప్రకాశం జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తేలాయి. ఘరానా మోసగాళ్ల ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరచిన రూరల్ సీఐ వెంకటరమణ, సిబ్బందిని ఎస్పీ జగదీష్, డీఎస్పీ రవిబాబు అభినందించి, రివార్డులు ప్రకటించారు. విలేకరుల సమావేశంలో కణేకల్లు ఎస్ఐ నాగమధు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైగా మోసం 15 పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు -
కార్మికులపై కక్ష కట్టి తొలగించారు
అనంతపురం అర్బన్: ‘టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై కక్ష కట్టి తొలగించారు. ఇది సరైన తీరు కాదు. కార్మికులను రాజకీయాలకు అతీతంగా చూడాలి.’ అని మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి స్రవంతి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిప మధ్యాహ్న భోజన పథకం, ఆయా స్వీపర్లు వాచ్మెన్ల సంఘం జిల్లా మహాసభలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. మధ్యాహన భోజన కార్మికులకు గౌరవ వేతనం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంతకల్లు పట్టణంలో ఏప్రిల్ 18, 19 తేదీల్లో జరగనున్న ఏఐటీయూసీ జిల్లా మహా సభలకు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. మహాసభలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్గౌడ్, నగర అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక.. మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా కవితమ్మ, ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎం బాషా, ఉపాధ్యక్షురాలిగా ఉమాదేవి, చంద్రప్ప, వరలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా వనజ, రత్నమ్మ, నారాయణ, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఆయా, స్వీపర్ల, వాచ్మెన్ సంఘం ఎన్నిక.. స్కూల్ ఆయా, స్వీపర్, వాచ్మెన్ సంఘం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షురాలిగా లక్ష్మిదేవి, కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా దుర్గమ్మ, ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎం బాషా, ఉపాధ్యక్షులుగా పెద్దక్క, వెంకటలక్ష్మి, రత్నమ్మ, సహాయ కార్యదర్శులుగా నాగమణి, హజీవ్, ఆలీబాషా, కార్యకవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
వివరాలు సమగ్రంగా సేకరించండి
అనంతపురం అర్బన్: ‘జనగణనలో భాగంగా మొదటి దశలో చేపట్టనున్న గృహగణన పారదర్శకంగా నిర్వహించాలి. పూర్తిస్థాయిలో సర్వే చేయాలి. ఒక్క ఇంటినీ విడిచిపెట్టకూడదు. సెన్సెన్స్ మార్గదర్శాల ప్రకారం సమగ్ర వివరాలను సేకరించాలి.’’ అని డీఆర్ఓ ఎ.మలోల సెన్సెస్ ఫీల్డ్ ట్రైనర్లకు సూచించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో వారం రోజులుగా నిర్వహిస్తున్న జనగణనపై ప్రత్యేక శిక్షణ తరగతులు ఆదివారం ముగిసాయి. మూడు బ్యాచ్లుగా 82 మంది ఫీల్డ్ ట్రైనర్లకు ముగింపు కార్యక్రమంలో డీఆర్ఓ మాట్లాడారు. శిక్షణ పొందిన ఫీల్డ్ ట్రైనర్లు క్షేత్రస్థాయిలోని సెన్సెస్ సిబ్బందికి జనగణనపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే http:// census. ap. gov. in/ se వెబ్సైట్లో స్వీయగణన ద్వారా ప్రజలు తమ వ్యక్తిగత వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. కొన్ని ఇళ్లకు వెళ్లి సమాచారం సేకరించే ప్రక్రియను డీఆర్ఓ పరిశీలించారు. -
వ్యాఘ్ర వాహనంపై ఆదిదంపతులు
కూడేరు: జోడు లింగాల సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పార్వతీ పరమేశ్వరులకు అర్చకులు శివశంకర్శాస్త్రి, మహేష్, శివ, ప్రవీణ్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ఆలయం నుంచి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాల నడుమ పల్లకీలో ఆంజనేయస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ఈడిగ సంఘం ఆధ్వర్యంలో వ్యాఘ్ర వాహనంపై ఆదిదంపతుల ఉత్సవ విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ పీర్ల చావిడి వరకు ఊరేగింపు చేశారు. నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్ నంబర్ 8977716661 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ : అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వహిస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్నంబర్ 9154790350కు ఫిర్యాదు చేయాలని కోరారు. రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం గుంతకల్లు: గుంతకలు–నంచర్ల స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం గుర్తించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతిని వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. 25 నుంచి 30 ఏళ్లు వయస్సు ఉంటుందన్నారు. బ్లూకలర్లో బ్లాక్ కలర్ షర్ట్, బ్లాక్ జీన్స్ ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు వివరించారు. ఆచూకీ తెలిసిన వారు 7815865689కు సమాచారం ఇవ్వాలని జీఆర్పీ పోలీసులు తెలిపారు. -
నేడు పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న ‘పరిష్కార వేదిక’లో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూ సమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. -
వేమన ఉత్సవాలకు అంకురార్పణ
గాండ్లపెంట: మండల పరిధిలోని కటారుపల్లిలో ఆదివారం కుంభాభిషేకంతో యోగి వేమన ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ప్రతి ఇంటి నుంచి మహిళలు జొన్నలను ఆలయానికి తీసుకువచ్చి కుప్పగా పోశారు. ఈ జొన్నలను ఆలయ పీఠాధిపతులు ఆలయం ఎదుట రాసిగా పోసి పసుపు, కుంకుమ కలిపి మహాశక్తి పూజ చేసిన అనంతరం గ్రామస్తులకు పంచి పెట్టారు. ఈ ప్రసాదం కొన్ని రకాల వ్యాధులకు మందుగా కూడా వినియోగిస్తారు. వేమన సమాధి వద్ద పూజలు.. ఉత్సవాలను పురస్కరించుకుని వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. బెంగళూరుకు చెందిన కళాకారుల నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేమన ఉత్సవాల్లో భాగంగా సోమవారం బండ్లమెరవణి, పానక పందార్యము నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి పాటల కచేరీ ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి తెలిపారు. డీఎస్పీ శివనారాయణస్వామి, కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ఐ సుమతి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రజలు హర్షిస్తారా?
అనంతపురం: అమరావతి ప్రాంత పరిసరాల్లో రాజధాని అంటూ సరికొత్త డ్రామాలకు చంద్రబాబు ప్రభుత్వం తెరతీసిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉండాల్సిన ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే.. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు హర్షిస్తారా అంటూ ప్రశ్నించారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని కార్యాలయాలూ హైదరాబాద్లో కేంద్రీకృతం కావడం వల్ల విభజన సమయంలో మెట్రో సిటీని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని ప్రాంతాలనూ సమగ్రాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, విశాఖపట్నం పాలనా రాజధానిగా నిర్ధారించినట్లు స్పష్టం చేశారు. అవినీతిని చట్టబద్ధం చేయడానికే.. రాజధాని అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్న అవినీతిని చట్టబద్ధం చేసుకోవడం కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారని అనంత విమర్శించారు. అమరావతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో చేస్తున్న దోపిడీనే తాము ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ ఐదేళ్ల పాటు అమరావతిలో అభివృద్ధికి ఖర్చు చేసింది కేవలం రూ.5 వేల కోట్లు అని, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు పేరుతో కాలం గడిపారని గుర్తు చేశారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చాక అమరావతిలో రాజధాని అభివృద్ధి అంటూ రూ.48 వేల కోట్లు అప్పు చేశారన్నారు. గతంలోనే రాజధాని కోసం 50 వేల ఎకరాలు సేకరించారని, ఇప్పుడు మళ్లీ 30 వేల ఎకరాలు సేకరిస్తున్నారని, ఇంత భూమి ఎందుకని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసమే అసెంబ్లీ సమావేశం పెట్టారన్నారు. మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న భయం కూటమి నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఏదీ? రాష్ట్ర విభజన ప్రక్రియ అన్యాయంగా జరిగిందని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసమే కాదు.. రైల్వే జోన్, విశాఖ ఉక్కు, ప్రత్యేక హోదా, పోలవరం, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసమూ తీర్మానం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘అత్యంత వెనుకబడిన రాయలసీమ గురించి ఆలోచించరా? గతంలో కర్నూలుకు వచ్చిన లా యూనివర్సిటీని తరలించేశారు. హైకోర్టును అమరావతికి పంపారు. ఎయిమ్స్ వస్తే మంగళగిరికి తీసుకెళ్లారు’ అని ఆవేదన చెందారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలన్నారు. కర్నూలులో హైకోర్టు, లా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, హంద్రీ–నీవాను విస్తరించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పార్లమెంట్లో పోరాటం చేయలేదా? రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో వైఎస్ జగన్ కనిపించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు చెప్పారని, విభజనకు వ్యతిరేకంగా ‘స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ’ అంటూ వైఎస్ జగన్ నిరసన తెలియజేశారని అనంత గుర్తు చేశారు. ఆరోజు తాను ఎంపీగా ఉన్నానని, ఇందుకు తానే సాక్షినని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జానీ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న, సాంస్కృతిక విభాగం నగర అధ్యక్షుడు కేశవరెడ్డి, మైనార్టీ నాయకులు ముక్తియార్ పాల్గొన్నారు. అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే మా పార్టీ ధ్యేయం చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ ‘సీమ’ ప్రాజెక్టులపైనా ఉండాలి రాజధానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటే.. చంద్రబాబు ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
సుర్రుమన్న సూరీడు
అనంతపురం అగ్రికల్చర్: సూరీడు సుర్రుమన్నాడు. ఆదివారం మధ్యాహ్నం వరకు కాస్త చల్లబడినట్లు కనిపించిన సూరీడు తర్వాత నిప్పులు కురిపించాడు. సండే కాస్తా మండేలా వేసవితాపం కొనసాగింది. కళ్యాణదుర్గంలో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో కూడా 38 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదైంది. రాత్రి కూడా 25 నుంచి 28 డిగ్రీల మధ్య తీవ్రస్థాయిలో ఉక్కపోత నమోదైంది. జనం బయటకు రావడానికే భయపడ్డారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదు కావడంతో జనానికి ముచ్చెటమలు పట్టాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో భానుడి భగభగలు మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్లో 44 నుంచి 45 డిగ్రీల గరిష్ట సూచీని తాకే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. మండే ఎండలకు వడదెబ్బకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు -
ఈతకు వెళ్లి తిరిగిరాని లోకాలకు
నల్లచెరువు: సరదాగా ఈతకు వెళ్లిన తండ్రి, ఎనిమిదేళ్ల కుమారుడు కాలువలో మునిగిపోయిన ఘటన నల్లచెరువు మండలం బందార్లపల్లిలో విషాదం నింపింది. వివరాలు.. బందార్లపల్లికి చెందిన రాము (40) కూలి పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు కుమారులను పోషించుకుంటున్నాడు. తన చిన్న కుమారుడు చిన్నోడు (8)తో కలిసి ఆదివారం బందార్లపల్లిలో హెయిర్ కటింగ్ చేయించుకున్న రాము అనంతరం గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీ–నీవా కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. నీటి ప్రవాహ ఉధృతి గుర్తించక కాలువలో దిగిన ఇద్దరూ కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాము మృతదేహం లభ్యమైంది. చిన్నోడి ఆచూకీ లభించలేదు. గ్రామంలో విషాద ఛాయలు.. ఘటనతో బందార్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాము మృతదేహం వద్ద కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. అప్పటిదాకా తమతో మాట్లాడిన రాము విగతజీవిగా పడి ఉండడం చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. ‘గతంలోనే నా ఇద్దరు కుమారులు అనారోగ్యంతో మరణించారు.. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని కూడా తీసుకెళ్లావా దేవుడా’ అంటూ రాము తల్లి రమణమ్మ రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ప్రభుత్వం ఆదుకోవాలి.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి కోరారు. ఘటన గురించి తెలుసుకున్న ఆయన గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. చిన్నోడు ఆచూకీని వీలైనంత త్వరగా కనుగొనాలని అధికారులకు విష్ణువర్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. హంద్రీ–నీవా కాలువలో కొట్టుకుపోయిన తండ్రి,కుమారుడు తండ్రి మృతదేహం లభ్యం.. కుమారుడి ఆచూకీ గల్లంతు నల్లచెరువు మండలం బందార్లపల్లిలో విషాదం -
విద్యార్థి దుర్మరణం
● నేడు పుట్టిన రోజు.. అంతలోనే విషాదం తాడిపత్రి రూరల్: పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ విద్యార్థి విగతజీవిగా మారాడు. స్థానికులు తెలిపిన మేరకు.. తాడిపత్రిలోని భగత్సింగ్ నగర్కు చెందిన నారాయణ, మాధవి దంపతుల కుమారుడు అఖిల్ జస్వంత్కుమార్ (18) స్థానిక శ్రీరామ ఐటీఐలో మొదటి సంవత్సం చదువుతున్నాడు. తండ్రి లారీ డ్రైవర్గా, తల్లి బ్యూటీ పార్లర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి తన స్నేహితులు నాగేంద్ర, లక్ష్మీపతి, ఇంకరితో కలిసి ద్విచక్ర వాహనంపై ఈతకు వెళ్లిన అఖిల్... తిరుగు ప్రయాణంలో తేరన్నపల్లి సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా పుట్లూరు మండలం కడవకల్లుకకు చెందిన నరసింహులు, మరొకరు వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. రోడ్డుపై పడిన అఖిల్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. అఖిల్ స్నేహితులతో పాటు నరసింహలు, అతని స్నేహితుడూ గాయపడ్డారు. స్థానికులు గమనించి క్షతగాత్రులను వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న వారిని అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కాగా, అఖిల్ పుట్టినరోజు ఆదివారం కావడంతో వేడుకలకు అంతా సిద్ధం చేసుకున్నాడని, అయితే వేడుక జరుపుకోకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లాడంటూ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. ఘటనపై తాడిపత్రి అప్గ్రేడ్ పీఎస్ సీఐ శివగంగాధర్రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అనుమతి లేకుండా సెలవులో టీచరు ● పది రోజుల్లోపు రిపోర్ట్ చేయకపోతే తొలగిస్తామన్న డీఈఓ అనంతపురం ఎడ్యుకేషన్: గుత్తి జెడ్పీహెచ్ఎస్లో స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శైలజ విద్యాశాఖ అనుమతి లేకుండా సెలవులో వెళ్లారు. 2024 జూలై 25 నుంచి ఆమె విదేశాల్లోనే ఉండిపోయారు. ఈ విషయం డీఈఓ ప్రసాద్బాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ఇప్పటికే షోకాజ్ జారీ చేశారు. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరి అవకాశంగా మరోసారి నోటీసు జారీ చేసినట్లు డీఈఓ శనివారం వెల్లడించారు. పది రోజుల్లోపు కార్యాలయానికి ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వకపోతే, సేవా నియమావళి ప్రకారం ఉద్యోగం నుంచి తొలగింపు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుదాం ● కలెక్టర్ ఆనంద్ కళ్యాణదుర్గం రూరల్: స్వచ్ఛాంధ్ర స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ శ్రమదానంతో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని కలెక్టర్ ఆనంద్ పిలునిచ్చారు. శనివారం మండల పరిధిలోని పాల్వాయి, వర్లి, బొట్టువానిపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. పాల్వాయి గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం పడేయరాదన్నారు. పంచాయతీ వారు ఏర్పాటు చేసిన బాక్సుల్లోనే వేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తాగునీటి సమస్య గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ స్పందిస్తూ నీటిసమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బొట్టువానిపల్లిలో ప్రకృతి వ్యవసాయంతో సాగుచేసిన పంటను కలెక్టర్ పరిశీలించారు. -
రైల్వే ప్లాట్ఫాంపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
గుంతకల్లు: స్థానిక రైల్వే స్టేషన్లోని రెండో నంబర్ ఫ్లాట్ ఫారంపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని శనివారం గుర్తించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. 30 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు, తెలుపు రంగు మల్టీ రంగు ఫుల్ షర్ట్, మల్టీకలర్ లుంగీ, బ్రౌన్ కలర్ ఫుల్ డ్రాయర్ ధరించాడు. కుడి ఛాతీపై బి.ఆస్మ, ఎడమ వైపు బి.వెంకటేష్ అనే పేర్లు ఇంగ్లిష్ అక్షరాల పచ్చబొట్టు, ఎడమ భుజంపై గుర్రం పచ్చబొట్టు ఉంది. ఆచూకీ తెలిసిన వారు 78158 65689 కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు. -
సాంకేతికతపై పట్టు సాధించాలి
● విద్యార్థులకు ఎస్ఆర్ఐటీ కరస్సాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి సూచన బుక్కరాయసముద్రం: నానాటికీ పెరిగిపోతున్న సాంకేతిక విప్లవంతో పోటీ పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఎస్ఆర్ఐటీ కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి సూచించారు. బీకేఎస్ మండలం రోటరీపురంలో ఉన్న ఎస్ఆర్ఐటీ (అటానమస్)లో శనివారం సింఫనీ–2026 కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆలూరి సాంబశివారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రీనివాస రామానుజం చిత్ర పటానికి పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. దీనికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే ఉజ్వల భవిత ఉంటుందన్నారు. వృత్తి నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు ఉద్యోగం కల్పించే దిశగా కళాశాల యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. అనంతరం వివిధ బ్రాంచ్లలో సీనియర్ ప్రొఫెసర్లకు అవార్డులు, మెమెంటోలు, కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు పతకాలు, క్రీడలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానంచేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, ఐక్యూ ఏసీ డైరెక్టర్ డాక్టర్ సాయి చైతన్య కిషోర్, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలరించిన సినీ తారలు సింఫనీ–2026 కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా ఇటీవల విడుదలైన బ్యాండ్ మేళం చిత్రం హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి, ప్రొడ్యూసర్ కోణా వెంకట్ హాజరై, విద్యార్థులతో కలసి సందడి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో ఎస్ఆర్ఐటీ కళాశాలను చైర్ పర్సన్ జొన్నలగడ్డ పద్మావతి, కరస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి తీర్చిదిద్దారంటూ అభినందించారు. సినీ డైలాగ్లతో విద్యార్థులను ఉత్తేజ పరిచారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మాట్లాడుతున్న ఆలూరి సాంబ శివారెడ్డి నృత్యం చేస్తున్న సినీ తారలు రోషన్, శ్రీదేవి డ్యాన్స్తో హోరెత్తిస్తున్న ఎస్ఆర్ఐటీ విద్యార్థులు, కేరింతలు కొడుతున్న విద్యార్థులు -
సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్ జగన్
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం: ఆర్టీసీలో పనిచేస్తున్న వేలాది మందికి ఉద్యోగ భదత్ర కల్పిస్తూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా.. కుల వృత్తులపై ఆధారపడిన వారికి ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందించి కార్మిక, కర్షక సంక్షేమ పథకాల ప్రదాతగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో చోటు దక్కించుకున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి కొనియాడారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, నగర అధ్యక్షుడు మార్కెట్ ఖాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంత వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. ట్రేడ్ యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ చేసి మాట్లాడారు. ట్రేడ్ యూనియన్ సాగించిన పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే శ్రామికులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి సంక్షేమానికి బాటలు వేశారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ రమేష్గౌడ్, మాజీ మేయర్ వసీం, మాజీ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కొర్రపాడు హుస్సేన్ పీరా, రాజశేఖర్రెడ్డి, జిల్లా కార్యదర్శి సంపంగి రామాంజినేయులు, రాజారత్నం, అనిల్కుమార్గౌడ్, నగర అధ్యక్షుడు ఖాజా, కాకర్ల శ్రీనివాసరెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి రాజశేఖరరెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, జిల్లా అధ్యక్షుడు మొఘల్ సైఫుల్లా భేగ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కసనూరు రఘునాథ రెడ్డి, ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాసనాయక్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, న్యాయవాది నాగన్న, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, నాయకులు శ్రీదేవి, రాధాయాదవ్, శోభారాణి, శోభాబాయి, క్రిస్టియన్ మైనార్టీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ చిలకల థామస్, ఇంటలెక్చువల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబడి తానీషా, సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలామ్ బాబా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, కై లాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా రంగనాథస్వామి రథోత్సవం
బ్రహ్మసముద్రం : మండలంలోని వేపులపర్తి గ్రామంలో వెలసిన లక్ష్మీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉదయం ఆలయంలో అభిషేకాలు, విశేష అలంకరణ, అర్చనలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేసి మేళాతాళాలతో భక్తులు లాగారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. భక్తులకు దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. -
నేడు జంగంపల్లికి ‘రణబలి’
యల్లనూరు: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆదివారం యల్లనూరు మండలం జంగంపల్లి గ్రామంలో పర్యటించనున్నట్లు ‘రణబలి’ చిత్ర యూనిట్ మేనేజర్ సుబ్బు తెలిపారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ‘రణబలి’గా కనిపించనున్న విషయం తెలిసిందే. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఆ కాలంలోని సామాజిక పరిస్థితులు, స్వాభిమాన పోరాటాలు, భావోద్వేగ బంధాలను ప్రతిబించించేలా జంగంపల్లి కోట (బ్రిటీష్ పాలనలో నిర్మించిన) లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయ్ దేవరకొండపై పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. విద్యార్థుల ఘర్షణపై కేసు నమోదు వజ్రకరూరు: స్థానిక కేవీ జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద శనివారం పదో విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణపై కేసు నమోదు చేసినట్లు వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి తెలిపారు. కొనకొండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులపై గూళ్యపాళ్యం గ్రామానికి చెందిన విద్యార్థులు దాడి చేశారన్నారు. ఘటనలో విద్యార్థి భరత్ గాయపడి గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. మరో బాధిత విద్యార్థి రాంచరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఎస్కేయూ ప్రతిష్టను ఇనుమడింపజేస్తా
అనంతపురం: ఎస్కేయూ వీసీగా ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే, బీఆర్ అంబేడ్కర్, శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలకు నివాళులర్పించారు. ఆయనకు రెక్టార్ వెంకటనాయుడు, రిజిస్ట్రార్ రమేష్ బాబు, ప్రిన్సిపాల్ డి.ఆంజనేయులు ఘనంగా స్వాగతం పలికారు. పాలకభవనం ముందు మోకరిల్లి నమస్కరించిన అనంతరం లోపలికి వెళ్లారు. ఇన్చార్జ్ వీసీ అనిత నుంచి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఎస్కేయూ ప్రతిష్టను జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: పాత కక్షల నేపథ్యంలో యువకుడిని హతమార్చేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం వన్టౌన్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో పాతూరులోని ఆసార్ స్ట్రీట్కు చెందిన కటిక మహమ్మద్ సాధు, మున్నా నగర్ నివాసి షేక్ షౌకత్ ఆలీ, మూడో రోడ్డుకు చెందిన కట్టుబడి జహీర్బాషా ఉన్నారు. వీరు ఇటీవల పాతూరులోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఆకుల శ్రీనివాసులుపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. పిచ్చికుక్క దాడిలో 8 మందికి గాయాలు బ్రహ్మసముద్రం : భైరసముద్రం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. కనిపించిన వారిపై దాడి చేయడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్సులో బ్రహ్మసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి ● సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ శింగనమల(నార్పల): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. నార్పల మండలం బండ్లపల్లిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రద్దు చేసి కూలీల పొట్ట కొడుతోందని మండిపడ్డారు. ఏటా బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. తాజాగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, వీజీ రామ్జీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెంచిందన్నారు. దీంతో కేంద్ర నిర్ణయం మేరకు 40 శాతం నిధులను కేటాయించలేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయన్నారు. దీంతో ఉపాధి చట్టాన్ని కాపాడుకునేందుకు ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో అనంతపురం నుంచి బండ్లపల్లి వరకూ పాదయాత్ర చేపట్టి బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్, జిల్లా కార్యదర్శి పాలెం నారాయణస్వామి, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి తలారి నారాయణస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేష్ గౌడు, మండల కార్యదర్శి గంగాధర, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి కేశవరెడ్డి, నాయకులు పెద్దయ్య, బండి రామకష్ణ, బండారు రామాంజినేయులు, చేపల రామాంజి, పెద్ద పెద్దయ్య, రాము పాల్గొన్నారు. -
గడ్డి వాముల దగ్ధం
విడపనకల్లు: ఆరు గాలం శ్రమంచి పశువుల కోసం పోగు చేసుకున్న గ్రాసం అగ్నికి ఆహుతైంది. స్థానికులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన ఎస్సీలు, బీసీలు, దూదేకుల కులాలకు చెందిన చిన్న, సన్న కారు రైతులందరూ కలసి గాజుల మల్లాపురానికి వెళ్లే మార్గంలో గడ్డి వాములు వేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగాయి. ఏక మొత్తంగా గడ్డివాములన్నింటినీ మంటలు చుట్టుముట్టడంతో రైతులు హాహాకారాలు పెడుతూ అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేయడం గ్రామస్తులకు సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు రూ. 20 లక్షల విలువైన గడ్డి వాములు కాలి బూడిదయ్యాయి. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నుంచి వచ్చిన ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఘటనతో వన్నూరుసాహెబ్, వన్నూరువలి, ఓబులేసు, రహమత్ హుస్సేన్, చౌడిక హనుమంతు, చౌడిక యల్లప్ప, చౌడిక రామయ్య, బొమ్మయ్య గారి చిన్న మారెయ్య, మహేష్, రాముడు, పెన్నయ్య, సూరి, పంపా, వన్నారెడ్డి, హనుమంతు, ఓబులేసు, రంజాన్, యల్లప్ప మరికొందరు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరిలో వన్నూరు సాహెబ్కు చెందిన ఓ ఎద్దును సైతం మంటలు చుట్టుముట్టడంతో 60 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. అలాగే మాళాపురం గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో రైతు నాగన్న గౌడుకు చెందిన నర్సరీ కాలిపోయింది. రైతులను ఆదుకోవాలి : విశ్వ పాల్తూరులో దాదాపు 20 మంది రైతుల గడ్డి వాములు కాలిపోవడం చాలా బాధాకరమని ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా పాల్తూరులో వేసవిలో గడ్డి వాములకు నిప్పు పడుతూనే ఉందని, ఫలితంగా రైతులు నష్టపోతూనే ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికై నా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని సమగ్ర విచారణ చేపట్టి ఎవరైనా కావాలనే ఈ దుర్ఘటనకు పాల్పడి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకరూ పరిహారంతో పాటు పశుగ్రాసాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
దేశాభివృద్ధిలో భాగస్వాములు కండి
● కేవీఐసీ చైర్మన్ మనోజ్కుమార్ అనంతపురం టౌన్: దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ మనోజ్కుమార్ పిలుపునిచ్చారు. గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద శిక్షణ పూర్తి చేసుకున్న 430 మంది చేతివృత్తి కళాకారులకు శుక్రవారం అనంతపురంలోని కొత్తూరు జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పనిముట్లను పంపిణీ చేసి, మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న చేతివృత్తిదారులు ఆధునిక యంత్రాల సాయంతో మరింతగా రాణించాలన్నారు. ఖాదీ కేవలం ఒక వస్త్రం కాదని అది ఒక ఉద్యమంతో కూడిన ఆలోచన అన్నారు. సంప్రదాయ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంజీఈపీ పథకం కింద ప్రత్యేక రాయితీలతో కూడిన రుణ సదుపాయం కల్పిస్తోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీఐసీ డిప్యూటీ సీఈఓలు మదన్కుమార్రెడ్డి, నల్లమత్తు, డైరెక్టర్లు క్రీప్, మోహన్రావు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాసయాదవ్, చేనేత జౌళీశాఖ ఏడీ వరప్రసాద్, డీఓ బసవరాజు, కేవీఐసీ రవి, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు. రేపటి నుంచి యోగి వేమన తిరుణాల గాండ్లపెంట: విశ్వ కవి యోగి వేమన తిరుణాల ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని యోగి వేమన ఆలయంలో ఏటా ఉగాది తర్వాత వారం రోజులకు తిరుణాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆలయ పీఠాధిపతి ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు తిరుణాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం రాత్రి కుంభాభిషేకం, విశేష పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. 30వ తేదీ పానక పందేరం, బండ్ల మెరవణి, సాంస్కృతిక కార్యక్రమాలు, 31న ఉట్ల తిరుణాల, అగ్ని సేవ, ఏప్రిల్ 1న గొడుగుల మెరవణి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకార్యలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పీఠాధిపతి తుంగా చెన్నారెడ్డి తెలిపారు. -
ఉత్సాహంగా యువకుల బల ప్రదర్శన పోటీలు
గార్లదిన్నె: శ్రీరామ నవమి సందర్భంగా గార్లదిన్నె మండలం కొప్పలకొండ, పాత కల్లూరు, కల్లూరు (ఆర్ఎస్) గ్రామాల్లో శుక్రవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన యువకుల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆయా గ్రామాల్లో ఇసుక మూట యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 120 కిలోల ఇసుక బస్తాను స్వయంగా ఎత్తుకుని 10 నిమిషాల వ్యవధిలో ఎవరైతే ఎక్కువ దూరం వెళ్తారో వారిని విజేతలుగా ప్రకటించారు. పాత కల్లూరులో 9 మంది యువకులు పోటీల్లో పాల్గొనగా పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామానికి చెందిన సుధాకర్ మొదటి స్థానం, పాత కల్లూరుకు చెందిన అక్షింతల ఆనంద్ రెండో స్థానం, పామిడి మండలం వంకరాజుకాలువ నివాసి ఎర్రిస్వామి మూడో స్థానంలో నిలిచారు. విజేతలను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు. ఉత్కంఠగా ట్రాక్టర్ రివర్స్ పోటీలు శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పాత కల్లూరులో శుక్రవారం నిర్వహించిన ట్రాక్టర్ రివర్స్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. పోటీల్లో 26 మంది యువకులు పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో పామిడికి చెందిన నరేష్ మొదటి స్థానం, వంకరాజుకాలువకు చెందిన నరేంద్ర రెండోస్థానం, గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన హరి మూడో స్థానంలో గెలుపొందారు. విజేతలను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు. -
అతి వేగం.. తీసింది ప్రాణం
● గోనేహాళ్ క్రాస్ సమీపంలో ఐచర్, బైక్ ఢీ ● ఒకరి దుర్మరణం ● 14 మందికి గాయాలు బొమ్మనహాళ్: అతి వేగం నిేండు ప్రాణాన్ని బలిగొంది. మరో 14 మందిని తీవ్ర గాయాల పాలు చేసింది. స్థానికులు తెలిపిన మేరకు.. బొమ్మనహాళ్ మండలం గౌనూరు గ్రామానికి చెందిన ఉప్పర వీరేష్ (20) శుక్రవారం ఉదయం తన పత్తి పొలంలో పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై రోడ్డుపైకి చేరుకున్నాడు. అప్పటికే కణేకల్లు క్రాస్ వైపు నుంచి బొమ్మనహాళ్ వైపుగా మొక్కజొన్న లోడ్తో అతి వేగంగా వస్తున్న ఐచర్ వాహనాన్ని గుర్తించి వెంటనే ద్విచక్ర వాహనాన్ని కుడి వైపుగా మళ్లించాడు. ఆలస్యంగా ద్విచక్ర వాహనదారుడిని గుర్తించిన ఐచర్ డ్రైవర్ సైతం నిర్లక్ష్యంగా తన వాహనాన్ని కుడి వైపుగా తిప్పాడు. దీంతో వాహనదారులిద్దరూ వేగాన్ని నియంత్రించుకోలేక కొద్ది దూరం సమాంతరం వెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టుతో పాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మన్ను ఐచర్ ఢీకొని బోల్తాపడింది. ఘటనలో ఐచర్ వాహనం కింద నలిగి ఉప్పర నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్తంభం విరిగి పడిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బొమ్మనహాళ్ మండలం దేవగిరి గ్రామానికి చెందిన ఐచర్ వాహన డ్రైవర్ బసవరాజుతో పాటు హమాలీలు మాదిగ చంద్రశేఖర్, మాదిగ మారెన్న, మాదిగ ఉమేష్, హరిజన ఉమేష్తో పాటు మరో 10 మంది గాయపడ్డారు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను వెంటనే బళ్లారిలోని విమ్స్కు తరలించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కణేకల్లు, డి.హీరేహాళ్ ఎస్ఐలు నాగమధు, గురుప్రసాదరెడ్డి, బొమ్మనహాళ్ ఏఎస్ఐ విజయ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం వీరేష్ మృతదేహాన్ని బళ్లారిలోని విమ్స్కు తరలించారు. మృతుడి తల్లి ఉలిగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
నర్సరీల్లో నాసిరకం నారు
నర్సరీల నిర్వహణలో ప్రమాణాలు లేవు. పర్యవేక్షించే తీరిక ఉద్యాన అధికారులకు లేదు. ఇంకేముంది నర్సరీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా నాసిరకం నార్లు–మొక్కలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పంట దిగుబడులపై ప్రభావం.. పెట్టుబడుల వ్యయం పెరిగిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. అనంతపురం అగ్రికల్చర్: నర్సరీల్లో పెంచే కల్తీ నార్లను గుర్తించలేక తీసుకెళ్లి సాగు చేసి రైతులు నష్టాలపాలవుతున్నారు. జిల్లాలో 450 నుంచి 500 వరకు ఉన్న ఉద్యాన నర్సరీల ద్వారా వైరస్ ఉన్న పండ్ల మొక్కలు, నాసిరకం కూరగాయ పంటల నార్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. పంట కాలంలో చీడపీడల బెడద ఎక్కువై పెట్టుబడుల ఖర్చు భారీగా పెరగడంతో పాటు దిగుబడులపై ప్రభావం చూపిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. నర్సరీ చట్టంలో ఉన్న లొసుగులను అసరా చేసుకుని నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నా ఉద్యాన శాఖ నియంత్రించలేక పోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నార్లకు డిమాండ్ సంప్రదాయ వేరుశనగ, ఇతర వ్యవసాయ పంటల సాగు తగ్గించిన రైతులు గత కొన్నేళ్లుగా అంతో ఇంతో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ రకరకాల కూరగాయ పంటలు, కర్భూజా, కళింగర, బొప్పాయి, ఇతర పండ్లతోటలు సాగు చేస్తున్నారు. నార్ల కోసం చాలావరకు నర్సరీలపై ఆధారపడుతున్నారు. దీంతో నార్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో చాలామంది నర్సరీ నిర్వాహకులు నిబంధనలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా నార్లు పెంచుతూ వాటినే రైతులకు అంటగడుతున్నారు. నమ్మకంతో వాటిని తీసుకెళ్లి సాగు చేస్తే.. పంటలు తెగుళ్లబారిన పడుతున్నాయి. టమాట, మిరప కల్తీ నారు కారణంగా పంటకు తెగుళ్లబెడద ఎక్కువగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. చీనీ మొక్కల్లో వైరస్ గుర్తింపు నర్సరీ యాక్ట్ ఉన్నట్లు ఉద్యానశాఖ చెబుతున్నా అమలు చేయడానికి వెనకాడుతోంది వాటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు, పర్యవేక్షణపై ఉద్యానశాఖ దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నర్సరీలు లైసెన్సులు రెన్యూవల్ చేసుకోవడం లేదని చెబుతున్నారు. మూడు నెలలకోసారి ఉద్యానశాఖ తనిఖీలు కూడా చేయాల్సి ఉంటుంది. కూరగాయల నర్సరీల్లో మదర్బ్లాక్ తప్పనిసరిగా ఉండాల్సి ఉన్నా ఎక్కడా పాటించడం లేదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో అక్కడక్కడా కూరగాయల మొక్కలు నాటుకుని దిగుబడులు లేక చీడపీడల బెడదతో భారీగా నష్టపోయినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో చాలావరకు కూరగాయల నర్సరీల్లో కల్తీ విత్తనాల నుంచి పెంచిన నాసిరకం నారు పెంచుతున్నట్లు ఆ శాఖ వర్గాలు గుర్తించాయి. గతేడాది జిల్లాకు వచ్చిన శాస్త్రవేత్తల బృందం చీనీ తోటల్లో అధ్యయనం చేసింది. జిల్లా నుంచి 50 వరకు నమూనాలు (శాంపిల్స్)ను తిరుపతిలో ఉన్న చీనీ, నిమ్మ పరిశోధనా కేంద్రానికి పంపించారు. అందులో 20 వరకు నమూనాల్లో చిన్న మొక్కల్లోనే వైరస్ ఉన్నట్లు వెల్లడైనా.. చర్యలు తీసుకునేందుకు ఉద్యానశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వైరస్ వ్యాపించడం వల్ల చీనీ తోటల మనుగడపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నర్సరీలకు సంబంధించి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్, లేబులింగ్, మదర్బ్లాక్, నారుమడి పెంపకం పద్ధతులు, వాడుతున్న కంపెనీ విత్తనాలు, రైతులకు ఇస్తున్న రసీదు, రైతు పూర్తి వివరాలు, ఇతరత్రా రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి నర్సరీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉద్యానశాఖ అధికారులను రైతులు కోరుతున్నారు. గార్లదిన్నె మండలంలో నర్సరీని పరిశీలిస్తున్న ఉద్యానశాఖ ఏడీ దేవానందకుమార్ (ఫైల్) విడపనక ల్లు సమీపంలో తెగుళ్లు ఆశించిన మిరపను పరిశీలిస్తున్న ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి (ఫైల్) కన్నెత్తి చూడని ఉద్యాన శాఖ గతేడాది చీనీ నర్సరీల్లో సేకరించిన శాంపిల్స్ చాలావరకు ఫెయిల్ టమాట, మిరపలో కల్తీనారు వల్ల తెగుళ్ల బెడదతో రైతులకు నష్టాలు వైరస్ వ్యాపించడంతో చీనీ తోటల మనుగడపై శాస్త్రవేత్తల ఆందోళన -
●నెల తిరగకుండానే ఇలా..
అనంతపురం రూరల్ మండలం కామారుపల్లి పంచాయతీ గొల్లపల్లిలో ఇటీవల వేసిన బీటీ రోడ్డు నెల రోజులు తిరగకుండానే కంకర తేలింది. అనంతపురం–కళ్యాణదుర్గం ప్రధానరోడ్డు నుంచి గొల్లపల్లి మీదుగా కామారుపల్లి వరకూ సుమారు రూ. 90 లక్షలతో ఈ రోడ్డు నిర్మించారు. గతంలో 2006 అంటే 20 ఏళ్ల క్రితం ఇదే దారికి తారురోడ్డు నిర్మించారు. అక్కడక్కడ చిన్నచిన్న గుంతలు పడ్డాయి తప్ప పెద్దగా దెబ్బ తినింది లేదని గ్రామస్తులు చెబుతున్నారు. 25 రోజుల క్రితం వేసిన తారు రోడ్డు అప్పుడే గుంతలు పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లనే తారు రోడ్డు దెబ్బతినిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – రాప్తాడు రూరల్: -
అటకెక్కిన హామీలు
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తి కాకముందే పలు గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అన్నీ తానై వ్యవహరిస్తున్న పల్లె రఘునాథరెడ్డి.. పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తొలిసారి ఎమ్మెల్యే కావడం, ఆమెకు అండగా ఉన్న ఆమె మామ పల్లె రఘునాథరెడ్డి ఎమ్మెల్యేను పక్కనపెట్టి అన్ని తానై నడిపిస్తుండటంతో ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణ సమావేశాలతో పాటు అధికారిక సమావేశాల్లోనూ పల్లె రఘునాథరెడ్డి పాల్గొని హల్చల్ చేస్తుండడం చాలా మందికి మింగుడు పడడం లేదు. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దలకు సైతం ఇబ్బందిగా మారిందని విశ్వసనీయ సమాచారం. పార్టీలో ఒకరిద్దరు నాయకులు తప్ప ఎవరికీ ఆదాయ మార్గాలు లేక పోవడంతో చాలా మంది సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. వైఎస్సార్సీపీ, బీజేపీల్లోకి చేరికలు టీడీపీలో ఇమడలేని చాలా మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ, బీజేపీల్లో చేరుతున్నారు. వారంతా స్వచ్ఛందంగా పార్టీ మారడానికి ముందుకు వస్తున్నారు. ఇటీవల పుట్టపర్తి మున్సిపాలిటీలో వార్డు ఇన్చార్జ్ ఆవుల సుబ్రహ్మణ్యంకు విలువ ఇవ్వకపోవడంతో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ● పుట్టపర్తి మండలం పెడపల్లి పంచాయతీలోని సుబ్బరాయనిపల్లి, గువ్వలగుట్టపల్లి, బత్తలపల్లి గ్రామాల్లో సుమారు 250 కుటుంబాలు ఇటీవల వరుసగా టీడీపీ నుంచి బీజేపీలో చేరాయి. ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు ఆధిపత్యం చెలాయించడం...పల్లె రఘునాథరెడ్డి వారికే మద్దతుగా నిలవడంతో చాలా మంది కార్యకర్తలు టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు. ● రెండు రోజుల క్రితం నల్లమాడ మండలం దొన్నికోట పంచాయతీలోని సుబ్బరాయనపల్లిలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువ కప్పుకున్నారు. టీడీపీలో జీవితాంతం ఉన్నా విలువ లేదని, పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి వైఎస్సార్సీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. మరోసారి శ్రీధర్రెడ్డిని ఎమ్మెల్యేగా, వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. ఖాళీగా ‘పుడా’ చైర్మన్ పదవి నామినేటెడ్ పదవుల్లో ముఖ్యమైనది పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (పుడా) చైర్మన్. దీన్ని రెండేళ్ల పాటు ఎప్పుడూ ఖాళీగా ఉంచలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా ‘పుడా’ చైర్మన్ పదవిని ఎవరికీ కట్టబెట్టలేదు. పుడా చైర్మన్గా పల్లె రఘునాథరెడ్డి కూర్చుంటారని, అందుకే ఇంత కాలయాపన చేస్తున్నారనే వార్త చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ చైర్మన్ పదవిని లాక్కోవాలని చూసినా... అది కుదరక భంగపడ్డారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే... అసలు పుట్టపర్తి నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధి పని ఒక్కటీ చేయలేదని అన్ని వర్గాల ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం అందరికీ అందకపోవడంతో ప్రభుత్వంపై గుర్రుమంటున్నారు. ఎన్నికల సమయంలో పుట్టపర్తికి రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని, బుక్కపట్నం చెరువు ముంపు రైతులకు పరిహారం ఇప్పిస్తామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పారు. అలాగే ఇంటర్, డిగ్రీ కాలేజీలు తీసుకొస్తామని, శత జయంతి ఉత్సవాలకు సత్యసాయి బాబా విగ్రహాన్ని చిత్రావతిలో ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారు. రూ.వంద కోట్లతో ఇంటింటికీ తాగునీరు సరఫరా, టిడ్కో ఇళ్లు పంపిణీ, పేదలందరికీ పక్కా ఇళ్లు, 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్లు అందిస్తామని చెప్పినా ఆ హామీలన్నీ నీటి మీద రాతలుగానే మారాయి. ‘పల్లె’ పల్లెనా అసమ్మతి ఎమ్మెల్యేను డమ్మీ చేసిన మాజీ మంత్రి పల్లె అన్నీ తానై చక్రం తిప్పుతున్న వైనం తీవ్ర అసంతృప్తిలో టీడీపీ క్యాడర్ పార్టీని వీడేందుకు సిద్ధమైన నాయకులు, కార్యకర్తలు -
జిల్లా సుభిక్షంగా ఉండాలి
అనంతపురం అర్బన్: శ్రీరాముని కృపాకటాక్షాలతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో జిల్లా సుభిక్షంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ విష్ణచరణ్ ఆకాంక్షించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కృష్ణకళామందిర్లోని రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. జేసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందమయ జీవితం గడపాలని కోరుకున్నారు. కల్యాణోత్సవంలో డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, రిటైర్డ్ తహసీల్దార్ పగడాల మల్లికార్జున, తహసీతల్దార్లు హరికుమార్, శ్రీధర్మూర్తి, రజాక్, మారుతి పాల్గొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎన్ దివాకర్రావు, జి.సోమశేఖర్ పాల్గొన్నారు. -
టమాట రైతు కుదేలు
● ధరల భారీ పతనమే కారణం రాయదుర్గంటౌన్: టమాట ధరలు మరోమారు రైతులను నట్టేట ముంచాయి. పెట్టుబడి కూడా గిట్టక కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం 12 కేజీల టమాట బాక్స్ ధర రూ.30, అలాగే 24 కేజీల బాక్స్ ధర రూ.100 మాత్రమే పలుకుతోంది. నాలుగైదు నెలల క్రితం బాక్స్ ధర రూ.800 నుంచి రూ.1000 పలకగా ప్రస్తుతం దారుణంగా పడిపోయింది. కనీసం బాక్స్ ధర రూ.400 పలికినా గిట్టుబాటు అయ్యేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్కు తీసుకెళ్లేందుకు అయ్యే ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను తోటలోనే వదిలేస్తున్నారు. కన్నీరే మిగుల్చుతోంది పంట వేసే ముందు లాభాలు వస్తాయని ఆశించడం, తీరా పంట చేతికొచ్చాక మార్కెట్లో మద్దతు ధర లేక విలవిలాడిపోవడం పరిపాటిగా మారిందని రైతులు తెలిపారు. రాయదుర్గం అర్బన్, రూరల్ పరిధిలో దాదాపు 200 ఎకరాలకు పైగా టమాట పంట సాగైంది. పంట చేతికొచ్చినా ఎటువంటి ప్రయోజనమూ లేదని వాపోతున్నారు. ఎకరా సాగుకు అన్ని రకాల ఖర్చులు, కూలీలు, మందుల ధరలు కలిపితే రూ.80 వేల నుంచి రూ.లక్ష దాకా వెచ్చించారు. మార్కెట్లో ప్రస్తుత ధర కనీసం టమాట రవాణాకు కూడా సరిపోవడం లేదు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు. స్థానికంగాను, ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోనూ టమాట ఉత్పత్తి అధికం కావడం, ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం కారణంగా ఎగుమతి నిలిచిపోవడం లాంటి కారణాలతో ధర ఆమాంతం పతనమైనట్లు చెబుతున్నారు. -
చుక్కలు చూపిస్తున్నారు!
అనంతపురం ఎడ్యుకేషన్: రెవెన్యూ పరిపాలనలో కీలకమైన ఆర్డీఓ కార్యాలయంలో సేవలు మృగ్యంగా మారాయి. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న 22ఏ, చుక్కల భూముల ఫైళ్ల విషయంలో బాధితులకు ‘చుక్కలు’ చూపిస్తున్నారు. 22–ఏ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూములను నిషేధిత జాబితాలో ఉంచారు. అసైన్డ్ భూములు క్రయవిక్రయాలు చేయకూడదు. అయితే 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక జీఓ తెచ్చింది. 1954కు ముందు అసైన్డ్ చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, వాటిని క్రయ విక్రయాలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో చాలామంది అర్హులుగా ఉన్న రైతులు నిషేధిత జాబితా నుంచి తమ భూములు తొలగింపునకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం వీఆర్ఓలు చాలా రికార్డులు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. తహసీల్దార్ల ఆమోదాలతో ఆర్డీఓ కార్యాలయానికి పంపుతారు. వారు పరిశీలించి కలెక్టరేట్కు సిఫార్సు చేస్తే డీఆర్ఓ, జేసీ చివరకు కలెక్టర్ ఆమోదముద్ర వేస్తారు. దీంతో నిషేధిత జాబితా నుంచి భూములకు విముక్తి కలుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించడం లేదనే నానుడి ఆర్డీఓ కార్యాలయం అధికారులకు సరిగ్గా సరిపోతుంది. కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా వ్యాప్తంగా తహసీల్లార్లతో సమావేశాలు ఏర్పాటు చేసి అర్హులైన రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తుంటే అనంతపురం అర్డీఓ కార్యాలయంలో మాత్రం అడుగడుగునా కొర్రీలు వేస్తున్నారు. గేటు దాటని ఫైళ్లు అర్హత కల్గిన చాలా ఫైళ్లు అనంతపురం ఆర్డీఓ కార్యాలయం గేటు దాటడం లేదని రైతులు, తహసీల్దార్లు, వీఆర్ఓలు బాహాటంగానే చెబుతున్నారు. అక్కడ ఓ కీలక అధికారి ప్రతి ఫైలుకూ కొర్రీలు వేస్తున్నారని వాపోతున్నారు. గ్రామస్థాయి వీఆర్ఓలు, ఆర్ఐలు, సర్వేయర్లు, డీటీలు, తహసీల్దార్లు తమ విధులు నిర్వర్తించి పంపిన ఫైళ్లు కూడా ‘డిస్కషన్’ పేరుతో వారాల తరబడి పెండింగ్లో ఉండటం బాధితులను తీవ్రంగా నిరాశకు గురిచేస్తోంది. ‘సార్ చెప్పాడు..మీ తహసీల్దారును వచ్చి కలవమనండి. లేదంటే బాధిత రైతును వచ్చి కలవమనండి’ అంటూ వీఆర్ఓలతో చెబుతున్నట్లు తెలిసింది. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భూముల విలువ రూ.కోట్లకు చేరడంతో ఆర్డీఓ కార్యాలయంలో కొందరి అధికారులకు అంతేస్థాయిలో ‘ఆశ’ పుడుతోంది. ‘ఉచితంగా వచ్చిన భూములు రూ. కోట్లు విలువ అవుతున్నాయి. రూ.లక్షలు ఖర్చు పెట్టుకోలేరా?’ అంటూ ఓ అధికారి మాట్లాడుతున్నారంటే ఏ స్థాయిలో బరి తెగించారో అర్థం చేసుకోవచ్చని రైతులు వాపోతున్నారు. కోర్డు ఆదేశించినా... బ్రేక్ డివిజన్లోని ఓ బాధిత రైతు ఇటీవల హైకోర్టును ఆశ్రయించాడు. ‘మేము పూర్తిస్తాయిలో వాదోపవాదనలు విన్నామని బాధిత రైతు భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు పూర్తిగా అర్హత ఉంది’ అని హైకోర్టు స్పష్టంగా ఉత్తర్వు ఇచ్చినా ఆర్డీఓ కార్యాలయంలో ఓ అధికారి బ్రేక్ వేశాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు డీఆర్ఓ చొరవ తీసుకుని ఈ ఫైలును క్లియర్ చేయించినట్లు తెలిసింది. కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం ఆర్డీఓ కార్యాలయంలో సదరు అధికారి వ్యవహారంపై కొందరు వీఆర్ఓలు నేరుగా కలెక్టర్ ఆనంద్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని వారి తహసీల్దార్లకు ఖరాకండిగా చెప్పినట్లు తెలిసింది. తామంతా కష్టపడి ఫైళ్లను సిద్ధం చేసుకుని తీసుకెళ్తే.. రోజుకు మూడుపూటలా తిప్పుకుంటూ ముప్పుతిప్పలు పెడుతున్నారని ఇదే విషయాన్ని కలెక్టర్కు చెబుతామని చెప్పినట్లు తెలిసింది. అనంతపురం ఆర్డీఓ కార్యాలయంలో అన్నీ కొర్రీలే నిషేధిత జాబితా నుంచి తొలగని భూములు ఆమోదిత ఫైళ్లకూ ‘డిస్కషన్’ పేరుతో బ్రేక్ -
పన్ను వసూళ్లలో మున్సిపల్టీ
రాయదుర్గం టౌన్: ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు ఐదు మున్సిపాలిటీలు వెనుకంజలో ఉన్నాయి. మరో ఐదు రోజుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నాటికి 53.35 శాతం పన్ను వసూళ్లు మాత్రమే జరిగాయి. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం వరకు మాఫీ ఇచ్చినా ఆశించిన మేర ఫలితాలు దక్కలేదు. పూర్తి వడ్డీ మాఫీ వస్తుందని ఆశించిన యజమానులు... కేవలం 50 శాతం మాత్రమే ఇవ్వడంతో నిరాశకు గురయ్యారు. లక్ష్య సాధనలో సుదూరంగా... ఈ నెలాఖరులోపు వంద శాతం పన్ను వసూళ్లు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్, తాడిపత్రి, రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీల్లో 1,59,133 అసిస్మెంట్లు ఉండగా రూ.113.03 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకూ కేవలం రూ.60.32 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. 71.26 శాతంతో తాడిపత్రి మొదటి స్థానంలో ఉండగా, 69.75 శాతంతో రాయదుర్గం రెండో స్థానంలో నిలిచింది. 60.98 శాతంతో మూడో స్థానంలో గుత్తి, 50.87 శాతంతో నాల్గో స్థానంలో అనంతపురం, 47.67 శాతంతో ఐదో స్థానంలో గుంతకల్లు, 44.70 శాతంతో ఆరో స్థానంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత గడువులోపు లక్ష్యాన్ని సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక ఐదురోజులే గడువు లక్ష్య సాధనలో వెనుకంజ 71.26 శాతంతో మొదటిస్థానంలో తాడిపత్రి 69.75 శాతంతో రెండోస్థానంలో రాయదుర్గం -
ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ లేకనే సమస్య
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ సరిగా లేకనే సమస్య తలెత్తి తాగునీటికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సమగ్ర శిక్ష ఏపీసీ టీ.శైలజ పేర్కొన్నారు. ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణపై జిల్లాలోని 107 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గురువారం స్థానిక సైన్స్ సెంటర్లో ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆర్ఓ ప్లాంట్లు సరఫరా చేసిన ఆహ్లాద కంపెనీ, ఇన్నోవేటివ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొని డెమో ద్వారా ప్లాంట్ల నిర్వహణ, వినియోగ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏపీసీ మాట్లాడారు. చిన్నపాటి సమస్యలను సైతం పరిష్కరించకుండా అలాగే వదిలేస్తుండడంతో అవి పెద్ద సమస్యగా మారుతున్నాయన్నారు. సమస్యలు నెలకొన్న పాఠశాలల వివరాలు తెలియజేస్తే కంపెనీలతో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు. ఇంజనీర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. నీటి కొరత, పైప్లైన్ లేకపోవడం, విద్యుత్ సమస్యలు వంటి అంశాలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. అసిస్టెంట్ ఏఎంఓ నారాయణస్వామి మాట్లాడుతూ.. జిల్లాలో ఆర్ఓ ప్లాంట్లు సరఫరా చేసిన ప్రతి కంపెనీతో కలిసి పాఠశాల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీఓ నారాయణస్వామి మాట్లాడుతూ.. చిన్న పాటి సమస్యలను పాఠశాల స్థాయిలోనే పరిష్కరించుకోవాలని, పెద్ద సమస్యలను సమగ్ర శిక్ష ద్వారా పరిష్కరిస్తామని సూచించారు. -
ఆర్టీఈ ఉచిత సీట్ల ఫలితాల విడుదల
గుత్తిలో వరుస చోరీలు గుత్తి: స్థానిక తాడిపత్రి మార్గంలోని మూడు దుకాణాల్లో గురువారం తెల్లవారు జామున దొంగలు పడ్డారు. మురళీకృష్ణ జనరల్ స్టోర్స్, గంగాగౌరీ ట్రేడర్స్, శ్రీలక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ దుకాణాల్లో చొరబడిన దుండగులు కొంత నగదు, విలువైన సామగ్రిని అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 20 వేల హెక్టార్లకు డ్రిప్ ప్రతిపాదనలు అనంతపురం అగ్రికల్చర్: ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో 20 వేల హెక్టార్లకు రాయితీతో డ్రిప్, స్ప్రింక్లర్ యూనిట్లు కేటాయించనున్నట్లు ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి ఏపీడీ బీసీ ధనుంజయ తెలిపారు. ఈ మేరకు కమిషనరేట్కు ప్రతిపాదనలు పంపినట్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అనుమతులు త్వరలో రావచ్చన్నారు. ప్రస్తుతానికి 50,370 హెక్టార్లకు సంబంధించి పరికరాలు కావాలంటూ 37,812 మంది రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారన్నారు. నేడు కేవీఐసీ చైర్మన్ రాక అనంతపురం టౌన్: భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) చైర్మన్ మనోజ్కుమార్ శుక్రవారం అనంతపురం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాస యాదవ్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. చింత పండు ప్రాసెసింగ్, పేపర్ ప్లేట్ తయారీ, ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రం, ఎసీ మరమ్మతు, కుట్టు యంత్రం, నార తీయడం వంటి గ్రామీణ పరిశ్రమల కార్యకలాపాలకు సంబంధించి శిక్షణ పూర్తి చేసుకున్న 430 మంది చేతి వృత్తిదారులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం 11 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. జిల్లా రిజిస్ట్రార్గా శ్రీనివాసులు అనంతపురం టౌన్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్గా బి. శ్రీనివాసులను నియమిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. రెగ్యులర్ డీఆర్గా పని చేస్తున్న కోర్టు ఉత్తర్వుల మేరకు ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి భార్గవ్ను అనంతపురం జిల్లా ఆడిట్ డీఆర్గా బదిలీ చేశారు. ఆడిట్ డీఆర్గా పని చేస్తున్న శ్రీనివాసులను డీఆర్ (ఎఫ్ఏసీ) గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.అనంతపురం ఎడ్యుకేషన్: బాలల ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం (ఆర్టీఈ) 12(1)(సి) కింద 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి తొలివిడత లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. వివరాలను సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ టి. శైలజ గురువారం వెల్లడించారు. 1 కిలోమీటరు పరిధిలో ఉన్న 1,712 మంది విద్యార్థులు తొలి విడతలో ఎంపికయ్యారు. వీరి వివరాలను తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించారు. అలాగే ఫలితాలను https://cse.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎంపికై న విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీ లోపు సంబంధిత పాఠశాలలకు వెళ్లి ప్రవేశాలను నిర్ధారించుకోవాలి. విద్యార్థి, తల్లిదండ్రులు, తోబుట్టువుల ఆధార్ కార్డులు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, జనన సర్టిఫికేట్, రేషన్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాలి. సరైన కారణం లేకుండా అడ్మిషన్లు నిరాకరిస్తే సంబంధిత స్కూళ్ల యాజమాన్యాలపై శాఖాపరమైన చర్యలు ఉంటాయి. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత ఎంఈఓను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 18004258599 ను సంప్రదించవచ్చు. కాగా, 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న విద్యార్థుల కోసం రెండో విడత లాటరీ ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు. -
విరోష్.. ఫుల్ జోష్
క్రేజీ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక (విరోష్) జోడీ గురువారం అనంతపురంలో సందడి చేసింది. ఈ దంపతులిద్దరూ కలసి నటిస్తున్న ‘రణబలి’ చిత్రం షూటింగ్ త్వరలో జిల్లాలో జరగనుంది. ఈ క్రమంలోనే విరోష్ దంపతులు నగరానికి విచ్చేశారు. స్థానిక హౌసింగ్ బోర్డులోని అభయాంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించారు. నూతన దంపతులకు పురోహితులు ఆత్మీయ స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. రష్మిక, విజయ్దేవరకొండను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సెల్ఫీల కోసం పలువురు ఎగబడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం విరోష్ జోడీ రాక సందర్భంగా అభిమానుల కోలాహలంవిజయ్ దేవరకొండ, రష్మికను చూసిన ఆనందంలో నగరవాసులు -
జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
అనంతపురం: జిల్లా ప్రజలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడని పేర్కొన్నారు. లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదన్నారు.‘శ్రీరామనవమి అంటే పండుగ మాత్రమే కాదు.. సత్యం, ధర్మం, ఓర్పు కలిసిన జీవనమార్గం. ఆ మార్గంలో అందరూ పయనిద్దాం’ అని పిలుపునిచ్చారు. రామ నామం మధురం.. రామ నామం పవిత్రం..ఆ తారక మంత్రం ప్రజల జీవితాల్లో సుఖ శాంతులు నింపాలని ఆకాంక్షించారు. శ్రీరాముని కటాక్షం అందరిపై ఉండాలి అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ పి. జగదీష్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. శ్రీరాముడు ఆచరించిన జీవిన విధానం మానవాళికి మార్గదర్శనమన్నారు. శ్రీరాముని కరుణ, కటాక్షాలతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట సిరి సంపదలు వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఆనందమయ జీవితం గడపాలని కోరుకున్నారు. -
భానుడి భగభగలు
● 40 డిగ్రీల మార్క్ను చేరుకున్న ఉష్ణోగ్రతలు ● బెంబేలెత్తుతున్న జనంఅనంతపురం అగ్రికల్చర్: భానుడి భగభగలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత కొన్ని రోజులుగా 39 డిగ్రీల వద్ద ప్రతాపం చూపిస్తున్న సూరీడు ప్రస్తుతం 40 డిగ్రీల మార్క్ను చేరుకున్నాడు. ఈ సీజన్లో తొలిసారిగా గురువారం తాడిపత్రి మండలంలో 40.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దపప్పూరు, విడపనకల్లు, కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి, వజ్రకరూరు తదితర మండలాల్లో వేసవితాపం అధికంగా ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా 38 నుంచి 39 డిగ్రీలతో భగ్గుమంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా ఏప్రిల్, మే నెలలు ఉండటంతో ఈ సారి 45 డిగ్రీల మార్క్ చేరుకునే పరిస్థితి ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 42 డిగ్రీలు నమోదైతేనే ‘అనంత’ అగ్నిగుండంలా అట్టుడికిపోయే ప్రమాదం ఉండగా అంతకు మించి అంటుండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే సుర్రుమంటున్న సూరీడు సాయంత్రం 5 గంటల దాకా ప్రతాపం చూపిస్తున్నాడు. రాత్రిళ్లు ఉక్కపోత అధికమవుతోంది. వేడిగాలులు ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అత్యవసర పరిస్థితి అయితే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లడం మంచిది కాదని వైద్యులు అంటు న్నారు. మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి బోండాలు, పుచ్చకాయలు, పండ్ల రసాలు, ఓఆర్ఎస్, గ్లూకోజ్ ఎక్కువ తీసుకోవాలని చెబుతున్నారు. టోపీ, గొడుగు, మాస్క్ లాంటివి వాడటం మంచిదని సూచిస్తున్నారు. వడదెబ్బకు గురి కాకుండా వచ్చే రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
తాడిపత్రి రూరల్: ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. వివరాలు... తాడిపత్రి డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు బుధవారం ఉదయం ఊరుచింతల గ్రామం నుంచి 50 మంది ప్రయాణికులతో తాడిపత్రికి బయలు దేరింది. అవుల తిప్పాయపల్లి సమీపంలో రోడ్డు డైవర్షన్ కారణంగా 544డీ జాతీయ రహదారిపైకి చేరుకున్న బస్సు వెంకటరెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ఉన్నఫళంగా ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్ రూట్లో ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేస్తూ దూసుకెళ్లాడు. ఏ కాస్త అజాగ్రత్తగా వ్యవహరించిన ద్విచక్ర వాహనదారుడు బస్సు చక్రాల కిందపడే ప్రమాదముండడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని కుడి వైపుగా మళ్లించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో పక్కనే ఉన్న భారీ వాహనాన్ని ఢీకొనే అవకాశం ఉండడంతో వెంటనే ఎడమ వైపుగా మళ్లించడంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న డిపో అధికారుల సూచన మేరకు ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానానికి చేర్చారు. సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించి బస్సును డిపోకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్లు డిపో మేనేజర్ మురళీధర్ తెలిపారు. -
క్రైస్తవుల సంక్షేమం పట్టని బాబు
అనంతపురం: అధికారాన్ని హస్తగతం చేసుకుని రెండేళ్లు కావస్తున్నా.. క్రైస్తవుల సంక్షేమానికి సీఎం చంద్రబాబుకు చేసింది ఏమీ లేదని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ విమర్శించారు. ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు అధ్యక్షతన జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం క్రిస్టియన్ మైనార్టీ సెల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జాన్వెస్లీ మాట్లాడుతూ... పాలన పట్ల పారదర్శకత కన్నా వైఎస్సార్సీపీ నాయకులను అణచివేయడంపైనే సీఎం చంద్రబాబు దృష్టి సారించారని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో క్రైస్తవుల సంక్షేమానికి రూ.416 కోట్లు ఖర్చు చేశారన్నారు. 1.80 లక్షల మంది లబ్ధిదారులకు సంక్షేమం లభించిందని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవిత్ర జెరూసలేం పర్యటనకు ఒక్కరినీ కూడా ప్రభుత్వం తరఫున పంపించ లేదన్నారు. క్రైస్తవులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను స్వయంగా ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తూ మత వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నో చర్చిలు కూల్చివేశారన్నారు. 24 చర్చిల్లో ఆరాధన జరగకుండా చేశారన్నారు. నష్టపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర జానీ, థామస్, రాము, జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్కుమార్, కార్యదర్శులు ప్రభాకర్, సునీల్, అనంతపురం వింగ్ అధ్యక్షుడు సతీష్, గుంతకల్లు అధ్యక్షుడు బింగి కిరణ్, శింగనమల అధ్యక్షుడు ఆనంద్, ఉరవకొండ మోనాలిసా, జాకోబ్, సాల్మన్రాజ్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ -
బదిలీల రేషనలైజేషన్ మినహాయింపునివ్వాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రస్తుత ఉపాధ్యాయ బదిలీల్లో రేషనలైజేషన్ మినహాయింపు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (అపస్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం డీఈఓ కార్యాలయ ఏడీ శ్రీనివాసులును కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను డీఈఓ బ్లాగ్లో ఉంచాలన్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ఉన్నత పాఠశాలకు పీఈటీ పోస్టును మంజూరు చేయాలన్నారు. బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో మూడో పోస్టును మంజూరు చేయాలన్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్న, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పదో తరగతి మూల్యంకానికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఏడీని కలిసిన వారిలో అపస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఎర్రిస్వామి, ఉపాధ్యక్షులు శివప్రసాద్నాయుడు, హర్షవర్దన్, వై.రామన్న, ప్రధానకార్యదర్శులు రమేష్, దాసరి వరదరాజులు ఉన్నారు. -
రుణాలు రికవరీ చేయండి
అనంతపురం అర్బన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల పరిధిలో మంజూరు చేసిన రుణాలకు సంబంధించి రికవరీలు పూర్తి స్థాయిలో చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద ఆదేశించారు. సంక్షేమ శాఖల పనితీరుపై బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. దివ్యాంగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13,683 మంది దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు మంజూరు చేయాలన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో అవసరమైన చోట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా విషయంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రధానమంత్రి జనవికాస్ పథకం కింద మైనారిటీ జనాభా ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అవకాశం ఉన్న చోట వసతి గృహాలు, తరగతి గదులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాలు, కేజీబీవీలు, ఒకేషనల్ ఎడ్యుకేషన్ పాఠశాలల్లో వందశాతం విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఉండేలా చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి రెండు చొప్పున ఉన్నత పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్పై ఫిర్యాదులు వస్తున్నాయని, నిబంధనల ప్రకారం కేటాయింపులు జరగాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ, బీసీ సంక్షేమ డీడీ ఖుష్బూ కొఠారి, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజాక్ఖాన్, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, డీఎండబ్ల్యూఓ రామసుబ్బారెడ్డి, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుముద, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, డీఈఓ ప్రసాద్బాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం -
● కట్టెల పొయ్యే శరణ్యం
పశ్చిమ ఆసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలతో వంట గ్యాస్కు కరువొచ్చింది. దీంతో ఇళ్లలోనూ గ్యాస్ స్టౌ వెలగని పరిస్థితి. దీంతో పల్లె, పట్నం తేడా లేకుండా చాలామంది మళ్లీ కట్టెల పొయ్యిని ఆశ్రయిస్తున్నారు. పట్టణాల్లోని హోటళ్లలోనూ కట్టెలతోనే ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో నగర వాసులూ ఆటోలు, ద్విచక్రవాహనాలపై శివారు ప్రాంతాలకు వెళ్లి నాలుగు కర్రలు ఏరుకుని వస్తున్నారు. తమకా భాగ్యం కూడా లేకుండా పోతోందని అపార్ట్మెంట్ వాసులంతా అల్లాడిపోతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
28 గ్యాస్ సిలిండర్ల సీజ్
గుత్తి: వంట గ్యాస్ అక్రమ వినియోగం నిరోధానికి గుత్తి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ పుణ్యవతి, డీటీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు బుధవారం గుత్తితో పాటు ఆర్ఎస్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో వాడుతున్న 28 గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకుని, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కాగా, తనిఖీల సమాచారంతో గుత్తితో పాటు ఆర్ఎస్ ప్రాంతాల్లోని హోటళ్ల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. వెంటనే హోటళ్లను బంద్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో గుత్తి, ఆర్ఎస్ ప్రాంతాల్లోని 80 శాతం హోటళ్లు మూతపడడంతో కనీసం భోజనం, టీ, కాఫీలకు సైతం ప్రజలు ఇబ్బంది పడ్డారు. పామిడి: నిబంధనలకు విరుద్ధంగా పామిడిలోని చికెన్ సెంటర్లలో వినియోగిస్తున్న గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్లను తహసీల్దార్ సి.షర్మిల బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 5 భారత్, 17 ఇండియన్ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. తనిఖీల్లో తహసీల్దార్ వెంట వీఆర్వోలు గోపాలరెడ్డి, ఎర్రినాగప్ప, భాగ్య, జ్యోత్స్న పాల్గొన్నారు. వజ్రకరూరు: నిబంధనలకు విరుద్ధంగా వజ్రకరూరు, కొనకొండ్ల గ్రామాల్లోని టీస్టాల్స్, ఫాస్ట్పుడ్ సెంటర్లు, హోటళ్లలో వినియోగిస్తున్న 11 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వజ్రకరూరు తహసీల్దార్ నరేష్కుమార్ బుధవారం సీజ్ చేశారు. వీటిని వజ్రకరూరులోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి తరలించారు. కార్యక్రమంలో ఆర్ఐ సతీష్, వీఆర్వోలు భరత్కుమార్, మారెన్న, ఆదినారాయణ, ఛత్రునాయక్ పాల్గొన్నారు. 400 మంది విద్యార్థుల గైర్హాజరు అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన భౌతికశాస్త్రం పరీక్షకు 400 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 143 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 32,485 మందికి గాను 32,085 మంది హాజరయ్యారు. జిల్లా పరిశీలకులు సుబ్బారావు ఆరు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ ఏడు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 47 కేంద్రాలను తనిఖీలు చేశారు. అలాగే ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన సోషల్ పరీక్షకు జిల్లాలో 785 మంది విద్యార్థులకు గాను 620 మంది హాజరయ్యారు. 165 మంది గైర్హాజరయ్యారు. రైతు సేవలకు ప్రాధాన్యత అనంతపురం అగ్రికల్చర్: రైతు సేవలకు ప్రాధాన్యతనిస్తూనే జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించనున్నట్లు డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేశులు పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలోని డీసీఎంఎస్ ప్రాంగణంలో బిజినెస్ మేనేజర్ సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన వార్షిక మహాజనసభ జరిగింది. గతేడాది రూ.24.71 కోట్ల టర్నోవర్తో రూ.4.24 లక్షల నికరలాభం వచ్చిందన్నారు. ప్రస్తుత 2025–26 ఏడాది జనవరి నెలాఖరు నాటికే రూ.22.92 కోట్ల మేర టర్నోవర్ సాధించినట్లు వివరించారు. అనంతపురంతో పాటు తాడిపత్రి, పెనుకొండ, కదిరి, హిందూపురం, కళ్యాణదుర్గం, ధర్మవరం కేంద్రాల ద్వారా మున్ముందు మరింత ఆర్థిక పురోగతి కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి (డీసీఓ) అరుణకుమారి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జయచంద్రనాయుడు, అకౌంట్స్ మేనేజర్ సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గంజాయి విక్రేత అరెస్ట్ గుంతకల్లు: స్థానిక హనుమన్ సర్కిల్లో గంజాయి విక్రయిస్తున్న భాగ్యనగర్కు చెందిన షికారీ సోమిని అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ జి.శివసాగర్ తెలిపారు. అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టిన సమయంలో గంజాయి విక్రయిస్తూ సోమి పట్టుబడ్డాడన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి 515 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి ● నిందితుడి అరెస్ట్ అనంతపురం సెంట్రల్: నగరంలో మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులతో ఓ వ్యక్తి దురుసుగా వ్యవహరించాడు. అంతటితో ఆగకుండా ట్రాఫిక్ హెడ్కానిస్టేబుల్ హనుమాన్ను కిందకు తోసేసి తీవ్రంగా గాయపరిచాడు. వివరాలను బుధవారం వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నగరంలోని శ్రీకంఠం సర్కిల్లో మంగళవారం రాత్రి ట్రాఫిక్ ఎస్ఐ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో హెడ్కానిస్టేబుల్ హనుమాన్ తదితరులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో రాణినగర్కు చెందిన షేక్ టోపీవలీ స్కూటీపై అటుగా రావడంతో ఆపి బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో పోలీసులకు సహకరించకుండా దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయాడు. హనుమాన్ను కిందకు తోసేయడంతో తలకు తీవ్ర రక్తగాయమైంది. అనంతరం నిందితుడు ద్విచక్రవాహనంతో ఉడాయించాడు. ఘటనపై ట్రాఫిక్ ఎస్ఐ రామాంజులరెడ్డి ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, బుధవారం నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుడిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
డ్రగ్స్ కేసులో ముద్దాయిలకు పదేళ్ల శిక్ష
ఓడీచెరువు: మాదక ద్రవ్యాలను తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయిలకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ అనంతపురం 1వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సత్యవాణి తీర్పు వెలువరించారు. వివరాలను తనకల్లు పీఎస్ ఎస్హెచ్ఓ రాంప్రసాద్ బుధవారం వెల్లడించారు. 2019లో 60 కిలోల గసగసాల చెత్తను తొమ్మిది సంచులలో నింపుకుని ఆటోలో తరలిస్తూ ఓడీచెరువు మండలం మిట్టపల్లి వద్ద రఘునాథనాయుడు, కావలి మనోహర్, పూజారి శంకరప్ప పట్టుబడ్డారన్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచగా... అప్పటి నుంచి ఈ కేసు వాదనలు కోర్టులో కొనసాగుతూ వచ్చాయని వివరించారు. సమగ్ర విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయిలకు పదేళ్ల కఠిన కారాగారా శిక్ష, ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సత్యవాణి బుధవారం తీర్పు వెలువరించారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేపాక్షి నాయుడు వాదనలు వినిపించినట్లు తెలిపారు. కేంద్రం వైఖరికి నిరసనగా పాదయాత్ర● సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అనంతపురం అర్బన్: ఉపాధి పథకం అమలు విషయంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకూ పాదయాత్ర తలపెట్టినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. జిల్లా సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీ రామ్ జీ పథకానికి నిధులు కేటాయింపులో మార్పుల కారణంగా కూలీలకు ఇబ్బందులు తప్పవన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ నిష్పత్తిలో వచ్చిన మార్పులు క్షేత్రస్థాయిలో కూలీలకు శాపంగా మారే ప్రమాదం ఉందన్నారు. గ్రామీణ వ్యవస్థ కుప్పకూలకముందే నిధుల నిష్పత్తిని కేంద్రం పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ ఉపాఽధి పథకం ప్రారంభించిన బండ్లపల్లి వరకు చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, ఉమ్మడి జిల్లాల కార్యదర్శులు నారాయణస్వామి, వేమయ్యయాదవ్, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రియురాలి మోసం.. యువకుడి బలవన్మరణం తాడిపత్రి రూరల్: ప్రియురాలు మోసం చేసిందన్న బాధలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని అంకంపల్లికి చెందిన నాగమల్లారెడ్డి, పద్మావతి దంపతులకు ఇరువురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు శివపవన్కుమార్రెడ్డి వాటర్ బాటిళ్లను దుకాణాలకు వేస్తూ వచ్చిన కమీషన్ను కుటుంబ అవసరాలకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల యువతి తనను మోసం చేస్తున్నట్లుగా గుర్తించిన శివపవన్కుమార్రెడ్డి మనోవేదనకు లోనయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం పులివెందుల నుంచి తాడిపత్రికి బస్సులో వచ్చి ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్కు ఆటోలో చేరుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా తమ్ముడు శివనాగార్జునరెడ్డి ఫోన్ చేశాడు. కాల్ రిసీవ్ చేసుకున్న శివపవన్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎక్కడున్నానో తనకే తెలియదని, ఇక ఇంటికి రానని, ప్రేమ విఫలం కావడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తెలిపాడు. ఆందోళనకు గురైన తమ్ముడు వెంటనే సర్ది చెబుతూ ఎక్కడున్నావో లోకేషన్ షేర్ చేయాలని అడగడంతో శివపవన్కుమార్రెడ్డి ఫోన్ లోకేషన్ షేర్ చేశాడు. అప్పటికే కోమలి సమీపంలోకి చేరుకున్న శివపవన్కుమార్రెడ్డి ఎదురుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కో–పైలెట్ సమాచారంతో ఘటనా స్థలానికి జీఆర్పీ హెచ్సీ వరప్రసాద్ చేరుకుని పరిశీలించారు. కాసేపటి తర్వాత ఫోన్ లోకేషన్ ఆధారంగా ప్రత్యేక వాహనంలో తల్లిదండ్రులతో కలసి శివనాగార్జునరెడ్డి చేరుకున్నాడు. పట్టాలపై ఛిద్రమై పడి ఉన్న కుమారుడి శరీర భాగాలు చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
జీజీహెచ్లో అరుదైన శస్త్ర చికిత్స
అనంతపురం: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఓ మహిళకు పునర్జన్మను ప్రసాదించారు. వివరాలను బుధవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి వెల్లడించారు. పెనుకొండ మండలం బక్సంపల్లి గ్రామానికి చెందిన అనిత మూడో కాన్పు నిమిత్తం జీజీహెచ్లో చేరింది. గతంలో రెండు కాన్సులు సిజేరియన్ అయ్యాయి. మూడో కాన్పు కూడా సిజేరియన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు నిర్ధారించారు. అయితే గర్భిణి అనిత మెదడుకు వెళ్లే రెండు రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్టీఎల్, కెరటిక్ పద్ధతుల్లో శస్త్ర చికిత్స చేసి, అనిత ప్రాణాలు కాపాడారు. అయితే పురిటిలోనే నవజాత శిశువు మృతి చెందింది. ప్రస్తుతం అనిత కోలుకోవడంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరుదైన శస్త్రచికిత్సతో రోగి ప్రాణాలు కాపాడిన గైనకాలజిస్ట్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్బేగం, డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ అరుణ జ్యోతి, డాక్టర్ సౌజన్య, అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ నవీన్కుమార్, డాక్టర్ జగదీష్, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ సాహితీ బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి అభినందించారు. -
వంట గ్యాస్ సిలిండర్ల అపహరణ
గుత్తి: గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూ లైన్లో పెట్టిన నాలుగు వంట గ్యాస్ ఖాళీ సిలిండర్లు అపహరణకు గురయ్యాయి. బుధవారం ఉదయం గుత్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుత్తిలోని జంగాల కాలనీతో పాటు ఇతర కాలనీలకు చెందిన జయలక్ష్మి, లక్ష్మి, రాముడు, మరొకరు తాడిపత్రి రోడ్డులోని సుదర్శన్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద తమ ఖాళీ సిలిండర్లను క్యూలైన్లో పెట్టి, కౌంటర్ వద్ద నగదు చెల్లించేందుకు వెళ్లారు. అక్కడ జనం ఎక్కువగా ఉండడంతో రద్దీ నెలకొంది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ సిలిండర్లను అపహరించుకెళ్లారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పాడి, మాంసం ఉత్పత్తులకు ప్రోత్సాహం అనంతపురం అగ్రికల్చర్: ఆహార శుద్ధికి సంబంధించి పాడి, మాంసం ఉత్పత్తుల కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి రాయితీలు, బ్యాంకుల ద్వారా ప్రోత్సాహం కల్పిస్తామని పశుసంవర్ధకశాఖ జేడీ ప్రేమ్చంద్, ఎల్డీఎం నరేష్, పీఎంఎఫ్ఎంఈ రిసోర్స్ పర్సన్ హరీష్ తెలిపారు. ప్రధానమంత్రి ఆహారశుద్ధి క్రమ బద్ధీకరణ పథకం (పీఎం ఎఫ్ఎంఈ)పై బుధవారం స్థానిక పశుశాఖ డీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణసదుపాయం ఉంటుందన్నారు. ఇందులో 10 శాతం లబ్ధిదారులు భరిస్తే... 90 శాతం బ్యాంకుల ద్వారా రుణం అందేలా చూస్తామన్నారు. 35 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, కోవా, ఇతర మాంసం ఉత్పత్తులు తదితర పాడి అనుబంధ ఉత్పత్తుల యూనిట్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు రీసోర్స్ పర్సన్ హరీష్ (9676796974)ను సంప్రదించాలని సూచించారు. -
కోనుప్పలపాడులో బాలుడి కిడ్నాప్
తాడిపత్రిటౌన్: కోనుప్పలపాడులో స్కూలు బస్సు దిగి ఇంటికెళ్తున్న బాలుడిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. బంధువుల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతులు. వీరి కుమారుడు వేమచంద్ర యాడికిలోని ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజుమాదిరిగానే బుధవారం పాఠశాల ముగియగానే వేమచంద్రను స్కూల్ బస్సులో తీసుకొచ్చి స్వగ్రామంలో దింపారు. అప్పటికే అక్కడ ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి వేచి ఉన్నాడు. బస్సు ముందుకెళ్లగానే.. నడుచుకుంటూ వస్తున్న వేమచంద్రను ముసుగు వ్యక్తి అపహరించి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు కుమారుడు కనిపించలేదు. ఎక్కడికెళ్లాడో అని ఊరంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళనకు గురైన వారు.. స్కూలు బస్సు దింపే చోట సమీపంలోని దుకాణంలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. ముసుగు వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించగా ద్విచక్రవాహనం కుందనకోట వైపు వెళ్లినట్లు గుర్తించారు. బాలుడి తండ్రి గోవిందుకు పాత గొడవలు ఏమైనా ఉన్నాయా.. ఎవరిౖపైనెనా అనుమానం ఉందా అని ఆరా తీసిన తర్వాత.. బంధువు అయిన వినోద్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వినోద్ తన స్నేహితుని ద్వారా బాలుడిని కిడ్నాప్ చేయించినట్లు తెలిసింది. అర్ధరాత్రి వరకు బాలుడి ఆచూకీ దొరక్కపోవడంతో ఎస్పీ జగదీష్ రంగంలోకి దిగారు. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ రోహిత్కుమార్తో పాటు నియోజకవర్గంలోని సీఐలు, ఎస్ఐలు పోలీస్ సిబ్బందితో బృందాలుగా ఏర్పడి పలుచోట్ల గాలింపు చర్యలు చేపట్టారు. కుందనకోట గ్రామంలో కిడ్నాప్నకు ఉపయోగించిన ద్విచక్రవాహనం గుర్తించినట్లు తెలిసింది. -
మండుటెండల్లో రెక్కల కష్టం!
రాయదుర్గం: ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మండే ఎండలో పనిచేయడం ఎవరికై నా కష్టమే. వేసవి సీజన్లో ఉపాధి కూలీలు పనిచేసే చోట ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు టార్పాలిన్లతో టెంటు ఏర్పాటు చేయాలి. ఫిబ్రవరి నుంచి మే వరకు వేసవి అలవెన్స్ కింద గడ్డపారకు రూ.10, తట్టేందుకు రూ.5, మంచినీటికి రూ.5, ఐదు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చే వారికి రూ.20 చొప్పున అందజేయాలి. వీటితో పాటు పనిప్రదేశాల్లో నీడ కల్పించి విశ్రాంతి తీసుకునేలా చూడాలి. పని ప్రదేశంలో గాయమైతే ప్రథమ చికిత్స చేయడానికి కిట్లు అందుబాటులో ఉంచాలి. ప్రస్తుత ప్రభుత్వాలు ఈ సౌకర్యాలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. దీంతో కూలీలు మండుటెండలోనే పనిచేయాల్సి వస్తోంది. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి చెట్ల కిందకు వెళ్తున్నారు. ఒక్కోసారి ఏకధాటిగా ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బకు గురవుతున్న ఘటనలూ లేకపోలేదు. మజ్జిగ ప్యాకెట్లు– తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని కోరుతున్నారు. పని ప్రదేశాల్లో కనిపించని సౌకర్యాలు 40 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కూలీలకు పొంచిఉన్న వడదెబ్బ ముప్పు అందుబాటులో లేని మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్ ఇబ్బందులు పడుతున్నాం ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేవు. భగభగ మండుతున్న ఎండలకు వడదెబ్బ తగలడం, జ్వరాలు, విరేచనాలతో చాలామంది కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు. పని ప్రదేశాల వద్ద టెంటు, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కనిపించవు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల గురించి తెలుసుకుని, పరిష్కరించాలి. – హనుమంతు, కూలీ, బండూరు, బొమ్మనహాళ్ మండలం సౌకర్యాలు కల్పిస్తాం ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే కూలీలు ఎండాకాలం ముగిసేవరకు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఉదయం 6.30 నుంచి 11 గంటల్లోపు పనులు చేయాలి. పనులు అయిపోగానే విశ్రాంతి తీసుకోవాలి. వైద్య సామగ్రి కోసం ఇండెంట్ పెట్టాం. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. – సలీం బాషా, పీడీ, డ్వామా -
మార్కెట్యార్డులో ‘కాటా’ గొడవ!
● ఎమ్మెల్యే వర్సెస్ మార్కెట్యార్డు చైర్పర్సన్ భర్త అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో వే బ్రిడ్జి (లారీ కాటా) విషయంలో బుధవారం చైర్పర్సన్ బల్లా పల్లవి భర్త బల్లా సురేష్కు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. చైర్పర్సన్గా ప్రమాణస్వీకారం చేయకమునుపే అంటే గత జూలైలోనే ఎమ్మెల్యే మనుషులు వేబ్రిడ్జి టెండర్ దక్కించుకున్నారు. ఏడాదికి రూ.2 లక్షలు చొప్పున రెండేళ్లకు ఒకసారి 10 శాతం పెంపు చేసేలా ఐదేళ్ల పాటు టెండర్ కై వసం చేసుకున్నారు. మార్కెట్ యార్డుకు అంతో ఇంతో ఆదాయం వచ్చే వేబ్రిడ్జిని వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే మనుషులు ముందుగానే దక్కించుకున్నట్లు చెబుతున్నారు. అయితే 40 టన్నుల సామర్థ్యం ఉన్న వేబ్రిడ్జిని 100 టన్నుల సామర్థ్యానికి పెంచేలా ప్రస్తుత చైర్పర్సన్ ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు కమిషనరేట్కు ప్రతిపాదనలు పంపడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. సామర్థ్యం పెంచి ఏడాదికి ఒకరికి పాలక వర్గం సభ్యులకే టెండర్ వస్తే వారికి కూడా కొంత ప్రయోజనం ఉంటుందని చైర్పర్సన్ వర్గీయులు ఆలోచన చేసినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే దీనిపై నిలదీసినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై చైర్పర్సన్ భర్త బల్లా సురేష్, ఎమ్మెల్యే దగ్గుపాటి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. దీనిపై చైర్పర్సన్ బల్లా పల్లవిని వివరణ కోరగా... అలాంటిదేమీ లేదన్నారు. కొందరు పనిగట్టుకుని ఇలాంటి అవాస్తవాలు, అభిప్రాయభేదాలు ఉన్నట్లు సృష్టించే ప్రచారం చేస్తున్నారంటూ కొట్టిపారేశారు. కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నట్లు మార్కెట్వర్గాలు చెబుతున్నాయి. -
ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చాలి
అనంతపురం అర్బన్: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందించడంతో పాటు నిష్పక్షపాతంగా లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ మానిటరింగ్ కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా నిధులు వెచ్చించాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో వ్యయానికి సంబంధించి ఎస్సీలకు 17.08, ఎస్టీలకు 5.53 శాతం కచ్చితంగా ఖర్చు చేయాలని ఆదేశించారు. హౌసింగ్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లు మంజూరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీ్త్ర నిధి రుణాలు మంజూరు చేయాలన్నారు. కొత్త సామాజిక పింఛన్ల మంజూరు క్రమంలో సదరం క్యాంపులపైన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి పథకం కింద నమోదు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు లక్ష్యానికి మించి పనులు కల్పించాలన్నారు. గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అమలు చేయాలన్నారు. పనులు పూర్తి చేయాలి.. పీఎంఏజీవైకు సంబంధించి ప్రాజెక్టు మదింపు – సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎంఏజీవై కింద 11 గ్రామాల్లో మూడు దశల్లో పనులు చేపట్టారన్నారు. అందులో తొలిదశలో మంజూరైన 38 పనులు, రెండవ దశలో మంజూరైన 79 పనులు, మూడవ దశలో మంజూరైన 32 పనులు ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. -
మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం
తాడిపత్రిటౌన్: మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం– అధికార పార్టీ నేతల వ్యవహారశైలితో బుధవారం తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్సీపీ నాయకుడు మున్సిపల్ స్థలం ఆక్రమించారంటూ కట్టడం తొలగించేందుకు చేసిన హడావుడి ప్రజల్లో భయాందోళనలు సృష్టించాయి. వైఎస్సార్సీపీ నాయకుడు ఆకుల నాగిరెడ్డి పుట్లూరు రోడ్డులో భవన నిర్మాణం చేపట్టారు. బుధవారం మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి హిటాచీతో అక్కడికి చేరుకున్నారు. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించినందున తొలగించేందుకు వచ్చామని అధికారులు తెలపగా.. తాను ఎటువంటి ఆక్రమణకూ పాల్పడలేదని స్పష్టం చేశారు. అయినా అధికారులు వినలేదు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉన్నఫళంగా తొలగిస్తామనడం అన్యాయమని ప్రశ్నించారు. ఇలా వాగ్వాదం జరుగుతుండగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన చెందారు. కొద్దిసేపటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం ఉందని నాగిరెడ్డిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వ్యాపారం చేసుకునే నీకు రాజకీయాలెందుకంటూ రెండు, మూడు గంటలు స్టేషన్లోనే ఉంచారు. ఈలోపు మున్సిపల్ అధికారులు భవనం మెట్లను హిటాచీతో తొలగించి వెళ్లిపోయారు. న్యాయం చేయాల్సిన అధికారులు.. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ వైఎస్సార్సీపీ నాయకులను బెదిరింపులకు గురిచేస్తున్నారని నాగిరెడ్డి వాపోయారు. స్టేషన్ సమీపంలో కూడా ‘పచ్చ’ మూకల గుంపు తిరుగుతుండటం కనిపించింది. మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి రాజకీయ కక్షసాధింపులో భాగంగానే వైఎస్సార్సీపీ నాయకులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అధికారులను, పోలీసులను ఉసిగొలుపుతున్నారని పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. భయం.. భయం.. తాడిపత్రిలో ‘పచ్చ’ నేతల తీరుతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా అలజడులు సృష్టించేందుకు వారు కుయుక్తులు పన్నడమే ఇందుకు కారణం. వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఎప్పటికప్పుడు వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే బుధవారం ఆక్రమణల పేరిట తొలగింపు సమయంలో అధికార పార్టీ శ్రేణులు అదునుకోసం వేచిచూస్తున్నట్టుగా గుంపుగా వచ్చి అటుఇటు తిరుగుతూ కనిపించారు. తాడిపత్రిలో ఉద్రిక్తత వైఎస్సార్సీపీ నేత భవన నిర్మాణ తొలగింపునకు చర్యలు అధికారులు, పోలీసులను ఉసిగొల్పిన అధికార పార్టీ నేతలు! -
గవర్నర్కు స్నాతకోత్సవ ఆహ్వానం
అనంతపురం: ఏప్రిల్లో జరగనున్న జేఎన్టీయూ (అనంతపురం) 15వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని చాన్సలర్/ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ను వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం అమరావతిలో ఆహ్వాన పత్రికను వీసీ స్వయంగా గవర్నర్కు అందజేసి విన్నవించారు. యూనివర్సిటీ చేపట్టిన కార్యక్రమాలు, గౌరవ డాక్టరేట్ ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. గౌరవ డాక్టరేట్ను భారతదేశ క్షిపణి పుత్రి టెస్సీ థామస్కు ఇవ్వనున్నారు. ఇందుకు వీసీని గవర్నర్ అభినందించారు. -
‘బ్లాక్’ నిరోధానికి టాస్క్ఫోర్స్
అనంతపురం అర్బన్: వంట గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ను నిరోధించేందుకు మండలస్థాయిలో రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు శాఖతో కలసి సంయుక్తంగా టాస్క్ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు జేసీ సి.విష్ణుచరణ్ తెలిపారు. ఈ నెల 23న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘బ్లాక్లో డెలివరీ’ కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలోని హోటళ్లు, మాల్స్, పెద్ద టిఫిన్ సెంటర్లు, బేకరీలు, కేటరర్లు, వీధి స్థాయి వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సంస్థలపై నిఘా ఉంచి, తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద వీఆర్ఓని ఏర్పాటు చేసి, డొమెస్టిక్ సిలిండర్లు సక్రమంగా పంపిణీ అయ్యేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉంచిన, బ్లాక్ మార్కెట్ చేస్తున్న ప్రదేశాల్లో దాడులు నిర్వహించి ఆరుగురిపై 6–ఎ కేసులు నమోదు చేసి 85 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై చట్టపరమైన చర్యలకు సిఫారుసు చేశామన్నారు. క్షయ నివారణలో భాగస్వాములు కండి అనంతపురం: క్షయ వ్యాధి నివారణలో అందరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా లెప్రసి ఎయిడ్స్, క్షయ వ్యాధి నివారణా అధికారి డాక్టర్ బి జయలక్ష్మి, క్షయ వ్యాధి నిపుణులు డాక్టర్ సుధీంద్ర, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ అహమ్మద్, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ మనోహర్రెడ్డి, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రమణ, డెమో నాగరాజు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్య ఉద్యోగులు, ఆశాలు, నర్సింగ్ విద్యార్థులతో నగరంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి డీఎంహెచ్ఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
ఎలుగుబంటి హల్చల్
రాయదుర్గంటౌన్: అటవీ ప్రాంతం నుంచి మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోకి ఓ ఎలుగుబంటి చేరుకుంది. వాకింగ్ చేస్తున్న కొందరు గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్ను రంగంలో దించారు. బోన్ తెప్పించేలోపు ఎలుగుబంటి కళాశాల గోడ దూకి అక్కడ ఉన్న బాత్ రూములోకి దూరింది. దీంతో రెస్క్యూ టీమ్ దాదాపు మూడుగంటల పాటు శ్రమించి వలలు వేసి ఎలుగుబంటిని బంధించారు. స్థానిక పవువైద్యాధికారి పరీక్షించి ఎలుగుబంటి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించిన అనంతరం బోనులో తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదలారు. కుమారుడి హత్యకేసులో తండ్రి అరెస్ట్ అనంతపురం సెంట్రల్: యువకుడి హత్య కేసులో కన్న తండ్రిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను మంగళవారం అనంతపురం వన్టౌన్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామానికి చెందిన చింతమాను సురేంద్ర కుటుంబం కొన్నేళ్లుగా అనంతపురంలోని వైఎస్సార్కాలనీలో నివాసముంటోంది. సురేంద్ర కుమారుడు ప్రదీప్ తాగుడకు బానిసై జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో గతనెల 11న రాత్రి తండ్రితో గొడవ పడ్డాడు. నిన్ను చంపుతానంటూ తండ్రి సురేంద్రను మత్తులో ఉన్న ప్రదీప్ బెదిరించాడు. దీంతో తనను చంపుతాడనే భయంతో ఇనుపరాడ్తో సురేంద్ర దాడి చేయడంతో ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కర్నూలులోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న తండ్రిని మంగళవారం కలెక్టరేట్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి : కలెక్టర్ అనంతపురం అర్బన్: పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని విధాల ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. -
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలి
అనంతపురం అర్బన్: మాదకద్రవ్యాలు, గంజాయిని అరికట్టి అనంతను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ జగదీష్తో కలిసి నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యార్థులకు పొగాకు ఉత్పత్తులు సరఫరా చేస్తున్న వారిపై ఫుడ్ సేఫ్టీ, పోలీసు, ఈగల్, తదితర శాఖలు కలిసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటక సరిహద్దు మండలాల్లో కొందరు పశువుల ఆరోగ్య కారణాల పేరుతో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు గుర్తించారన్నారు. వ్యవసాయ అధికా రులు, పోలీసులు వెళ్లి చట్టం తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యాసంస్థల్లో ప్రసంగాలతో సరిపెట్టకుండా చిత్రలేఖనం, వ్యాసరచన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని చెప్పారు. డ్రగ్స్ వాడకంతో కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసు శాఖకు లేదా ఈగల్ టోల్ ఫ్రీ నంబరు 1972కు ప్రజలు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సమావేశంలో ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, రైల్వే ఎస్పీ వెంకటేషులు, ఎకై ్సజ్ ఏఈఎస్ రేవతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఐక్య పోరాటాల ఫలితమే ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్
● ఆర్డీటీ కోసం చేపట్టిన ధర్నాలు, లక్ష సంతకాల సేకరణ ఉద్యమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తడి పెంచాయి ● వైఎస్సార్సీపీతో పాటు అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల విజయం ఇది ● వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ: జిల్లా ప్రజలకు వరదాయినిగా నిలిచిన ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కావడంతో ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురంలోని తన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీతో పాటు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ప్రజాసంఘాల సమష్టి పోరాటాలతోనే ఈ అనుమతి దక్కిందన్నారు. ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య అధ్వర్యంలో జరిగిన పాదయాత్ర, సంతకాల సేకరణ కార్యక్రమాలు కేంద్రంపై ఎంతో ఒత్తడి పెంచాయన్నారు. ఢిల్లీ స్థాయిలో తమ పార్టీ ఎంపీలు ప్రధానిని కలిసి విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యమంలో భాగంగా ఉరవకొండలో తాను చేపట్టిన సంతకాల సేకరణ, అఖిలపక్ష పార్టీల నేతలతో కలసి చేపట్టిన మహాధర్నా కూడా ఇందుకు కారణం కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు వైఎస్సార్సీపీ పోరాటాలకు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ విజయంలో తమతో పాటు నడిచిన కాంగ్రెస్, వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు భద్రత వెబ్ పోర్టల్ ప్రారంభం అనంతపురం సెంట్రల్: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ రూపొందించిన సీ్త్ర రక్ష– ప్రతి ఇంటికి పోలీసు భద్రత వెబ్ పోర్టల్ను ఎస్పీ జగదీష్ మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. వెబ్పోర్టల్లో నమోదు చేసిన ఫిర్యాదులు తక్షణమే ఎస్పీ కార్యాలయంతో పాటు సంబంధిత పీఎస్లకు చేరుతుందన్నారు. వీటిపై వంద రోజుల్లో మిషన్మోడ్ తరహాల్లో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్చౌదరి, ప్రొబేషనరీ ఐపీఎస్ అశ్విని మణిదీప్, మహిళా డీఎస్పీ మహబూబ్బాషా, వెబ్పోర్టల్ రూపకర్త లక్ష్మీనారాయణ చరణ్ పాల్గొన్నారు. హత్యకేసులో నిందితులకు రిమాండ్ అనంతపురం సెంట్రల్: నగరంలో గత శనివారం రాత్రి చోటు చేసుకున్న ఆదర్శనాయుడు హత్య కేసులో ఐదుగురు నిందితులను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల్లో నగరంలోని వేణుగోపాల్ నగర్కు చెందిన కరమల్ల హుమాయూన్ అలియాస్ బన్ని, నీరుగంటివీధికి చెందిన కరుణాకర్రెడ్డి, రాణినగర్కు చెందిన కుమ్మర రాకేష్, బత్తపల్లి మండలం గంటాపురం నివాసి బోయపాటి అస్మిత్చౌదరి, బండి ఉజ్జినప్ప ఉన్నారు. ప్రధాన నిందితుడు బన్నీకి నగరానికి చెందిన వంశీకృష్ణతో రెండేళ్లుగా మనస్పర్థలున్నాయి. ఈ క్రమంలో వంశీకృష్ణతో పాటు ఆత్మకూరు మండలానికి చెందిన ఆదర్శనాయుడుపై ఈ నెల 22న బస్టాండ్ వద్ద దాడికి పాల్పడ్డారు. ఘటనలో టైల్స్ బండతో ఛాతిలో పొడవడంతో ఆదర్శనాయుడు (24) అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులను మంగళవారం గుత్తిరోడ్డు మార్కెట్యార్డు వద్ద అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. -
నీటి కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ‘హంద్రీ–నీవా ద్వారా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఎనిమిది నెలల్లో 52 టీఎంసీల నీటిని రాయలసీమ జిల్లాలకు తీసుకొచ్చాం, ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు 43 టీఎంసీలు చేరినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాకు ఎంత నీరు తీసుకెళ్లారో, చెరువులకు ఎంత నింపారో, భూగర్భజలాలకు ఎంత చేరిందో స్పష్టంగా వెల్లడించాలి. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవా ద్వారా కుప్పం ప్రాంతానికి నీరు తీసుకెళ్లేందుకు రూ.3,850 కోట్లతో కాలువకు లైనింగ్ చేశారన్నారు. లైనింగ్ పనుల వల్ల రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశువులకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. లైనింగ్ పనుల్లో సుమారు రూ.వెయ్యి కోట్ల దోపిడీ జరిగిందన్నారు. ఈ నిధులతో గాలేరు–నగరి నుంచి చిత్తూరు జిల్లాకు హంద్రీ–నీవా నీటిని తీసుకెళ్లే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేసి ఉండొచ్చన్నారు. ఫేజ్–2లో 4 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. పేరూరు డ్యాంకు ఒక్క టీఎంసీ కూడా ఇవ్వలేదేం? వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాంను నీటితో నింపామని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు 52 టీఎంసీల నీరు తెచ్చామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఒక్క టీఎంసీ కూడా పేరూరు డ్యాంకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. డ్యాంను నీటితో నింపే విషయంలో ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబుకు ఏమాత్రమూ చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. ఇసుకను అమ్ముకోవాలనే స్వార్థంతో పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా చేశారన్నారు. పెన్నానది నుంచి రోజుకు 500 ట్రాక్టర్ల ఇసుక తరలించేస్తున్నారన్నారు. ఇసుక తవ్వకాల ద్వారా పరిటాల సునీత దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర దోపిడీ చేశారని ఆరోపించారు. 2002కు ముందు ఉన్న కరువు పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని, రైతులు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 110 గ్రామాలకు తాగునీరు అందించేందుకు పీఏబీఆర్ నుంచి రూ.90 కోట్లతో ప్రారంభించిన పనులు నిలిచిపోయాయన్నారు. గ్రామాల్లో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కుతున్నారన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రామగిరి, సీకేపల్లి మండలాలకు నీరు అందించే పథకం కూడా నిలిచిపోయిందన్నారు. కేవలం కమీషన్ల కోసమే పనులు నిలిపేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, బండి పవన్, మీనుగ నాగరాజు, సాకే వెంకటేశు, ఆకుల మునిశంకరయ్య, గుగ్గిళ్ల ప్రసాద్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, చిరంజీవి, విశ్వనాథ్రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం
అనంతపురం: వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం ఫలించింది. కరువు సీమ వాసుల జీవనాడిగా ఉన్న ఆర్డీటీపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను ఎత్తి వేస్తూ విదేశీ నిధులు అందేలా ఎఫ్సీఆర్ఏ ను పునరుద్ధరించింది. 2031 సంవత్సరం వరకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఐక్య పోరాటాలతో కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తీసుకెళ్లిన ఒత్తిడి కారణంగా ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ సాధ్యమైందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. 2025లో ఆర్డీటీ ఖాతాలు ఫ్రీజ్.. ఆర్డీటీ అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ వస్తోంది. అలాంటి సంస్థను చంద్రబాబు ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. 2025 ఏప్రిల్ 21న ఆర్డీటీ విదేశీ ఖాతాలను ఫ్రీజ్ అయ్యాయి. ఫలితంగా ఆర్డీటీ సంస్థ సేవలు నిలిచిపోవడంతో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో చేయి చేయి కలిపారు. వైఎస్సార్సీపీ చేపట్టిన పోరాటంలో భాగస్వాములయ్యారు. కళ్యాణదుర్గం నుంచే ప్రజా పోరాటం.. ఆర్డీటీకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కాకపోవడంతో నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం పెల్లుబుకింది. ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలతో జిల్లా అట్టుడికింది. మరో వైపు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలంటూ వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. జిల్లాలో తొలుత ఆర్డీటీ ఎక్కడైతే కార్యకలాపాలు ప్రారంభించిందో అక్కడి నుంచే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ బాధ్యతలను భుజానకెత్తుకున్న తలారి రంగయ్య బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి పాదయాత్ర చేపట్టారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సాకే శైలజానాథ్, వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2025 మే 17న బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో కుందుర్పిలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రధానికి చేరవేశారు. అనంతరం ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిశారు. అదే రోజు న్యూఢిల్లీలో పార్లమెంట్ వద్ద పార్టీ ఎంపీలతో కలసి నిరసన వ్యక్తం చేశారు. ఇలా వరుస ఉద్యమాలతో ఢిల్లీని అట్టుడుకించి కేంద్రంపై ఒత్తిడి తీసుకెళ్లారు. ఏటా రూ.400 కోట్ల ఖర్చు.. ఏటా ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లను ప్రజల శ్రేయస్సు కోసం ఆర్డీటీ ఖర్చు చేస్తోంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య, వైద్యం, క్రీడలు, పేదలకు మెడికల్ బిల్లుల చెల్లింపు, పక్కా ఇళ్లు తదితర కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటికే దాదాపు మూడు సంవత్సరాలు ఖర్చు చేసేంత మొత్తం ఆర్డీటీ ఖాతాల్లో ఉంది. అయితే ప్రభుత్వానికి సమాంతరంగా నడుస్తన్న ఆర్డీటీ కార్యకలాపాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కన్నెర్ర చేశాయి. దీంతో ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కాకుండా తిరకాసు పెడుతూ వచ్చాయి. ఫలితంగా నిధులు ఖర్చు చేయడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించడంతో సంక్షేమానికి తెర తీసినట్లైంది. ప్రజా నాయకుడికి అధినేత ఫోన్ కాల్.. కళ్యాణదుర్గం రూరల్: ఆర్డీటీకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ అలుపెరగని పోరాటం చేసిన మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ జరిగిన విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఫోన్చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఆర్డీటీకు ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ కోసం జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమం మాజీ ఎంపీ తలారి రంగయ్య నేతృత్వంలో బైక్ ర్యాలీలు, పాదయాత్ర ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ ప్రజా పోరాటానికి లభించిన విజయం క్రెడిట్ చోరీకి సిద్ధమైన టీడీపీ నాయకులు.. ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేయాల్సిన అధికార పక్షానికి చెందిన టీడీపీ నాయకులు ఏ ఒక్క రోజూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కనీసం ఒక్క నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టలేకపోయారు. పేదల పక్షాన పోరాటం చేయని టీడీపీ నాయకులు తాజాగా తమ వల్లే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అయ్యిదంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని ప్రజలు విమర్శిస్తున్నారు. పది నెలలుగా జిల్లాలో ఆర్టీటీ కోసం వైఎస్సార్సీపీ సాగించిన అలుపెరగని పోరాటానికి అఖిలపక్షం నేతలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు తోడయ్యారని, దీంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిందని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పోరాటాలు సాగించిన ప్రతి వైఎస్సార్ సీపీ నాయకుడిని ప్రశంసిస్తున్నారు. -
భూ సమస్యలపై నిర్లక్ష్యం వీడండి : జేసీ
కూడేరు: భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. మంగళవారం కూడేరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ కేశవ నాయుడుతో కలిసి ఆయన సందర్శించారు. మండలంలో చేపట్టిన రీసర్వే ప్రక్రియపై తహసీల్దార్ ఉదయ్భాస్కర్, వీఆర్వోలతో ఆరా తీశారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా రీసర్వే పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. తర్వాత కూడేరులోని సర్వే నంబర్ 535 లో ఏర్పాటు చేసిన అహుడా లే–అవుట్, ఏపీఐఐసీ భూములను పరిశీలించారు. వేటగాళ్ల ఉచ్చుకు చిరుత కూన బలి కళ్యాణదుర్గం రూరల్: వేటగాళ్లు పన్నిన ఉచ్చులో ఓ చిరుత కూన చిక్కుకుని ప్రాణాలు విడిచింది. చాపిరి సమీపంలో వేటగాళ్లు కుందేళ్ల కోసం పలు చోట్ల ఉచ్చులు ఏర్పాటు చేశారు. మంగళవారం అటువైపు వెళ్లిన కాపరులకు ఉచ్చులో చిక్కుకున్న రెండు చిరుత కూనలు కనిపించాయి. ఇందులో ఒకటి బయటపడేందుకు ప్రయత్నించి చివరకు మృతి చెందింది. మరొక కూనను తల్లి చిరుత నోటకరచుకుని రక్షించుకుంది. చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులకు అనేకసార్లు సమాచారం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు. -
25న జాబ్మేళా
ఉరవకొండ: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదినారాయణ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జవహర్ నాలెడ్జ్ (జేకేసీ) ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో మెడ్ ఫ్లస్ సౌజన్యంతో నిర్వహించనున్న ఈ మేళాకు ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులు. ఫార్మసిస్ట్ పోస్టుకు డీ–ఫార్మసీ పూర్తి చేసి కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఎంపికై న వారికి నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం చెల్లిస్తారు. ఫార్మసీ ఎయిడ్ పోస్టుకు పది, ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటే చాలు. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. నెలకు రూ18,885 నుంచి రూ. 22 వేలు వేతనం చెల్లిస్తారు. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుకు పది, ఇంటర్ చదివిన వారు అర్హులు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. నెలకు రూ17,586 వేతనం చెల్లిస్తారు. ఎంపికై న వారు బెంగళూరులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 98664 17491 లో సంప్రదించవచ్చు. విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించండి కుందుర్పి: స్థానిక జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు తాగునీరు అందక నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ ఆ పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం కృష్ణమూర్తి కోరారు. ఈ మేరకు సోమవారం తహసీల్ధార్ ఓబుళేసును కలిసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. పాఠశాలలో 481మంది విద్యార్థులు ఉన్నారని, మధ్యాహ్న భోజనం తర్వాత గుక్కెడు నీటి కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న బోరుబావిలో భూగర్భజలాలు అడుగంటడంతో సమస్య నెలకొందన్నారు. సమస్యను పరిష్కరించి, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. రేపు డీసీఎంఎస్ వార్షిక మహాజనసభ అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (డీసీఎంఎస్) వార్షిక మహాజనసభ ఈ నెల 25న ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ ఎం.సత్యనారాయణరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు డీసీఎంఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగే మహాజనసభకు సభ్యులందరూ హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది డీసీఎంఎస్ బ్రాంచీల ద్వారా సాధించిన ప్రగతి, వ్యాపార లావాదేవీలు, జమా ఖర్చులు తదితర వాటిపై చర్చించి... అధ్యక్షుడు నెట్టెం వెంకటేశులు నిర్ణయం మేరకు మిగిలిన అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. రైల్వే డివిజన్ పరిధిలో పలువురికి అవార్డులు గుంతకల్లు: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు రైల్వే ఉద్యోగులకు మ్యాన్ అఫ్ మంత్ అవార్డులతో డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా సత్కరించారు. సత్కారం అందుకున్న వారిలో ట్రాక్ మెన్ అమిత్, పాయింట్స్మెన్ రమేష్మీనా, టెక్నిషియన్ దాదాహయత్ ఉన్నారు. వీరికి సోమవారం డీఆర్ఎం కార్యాయలంలోని మీటింగ్ చాంబర్లో ప్రశంసా పత్రాలను డీఆర్ఎం సీఎస్ గుప్తా అందజేసి, అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవాలి
అనంతపురం: నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని కలెక్టర్ ఆనంద్ను వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ను కలసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆకాల వర్షాలు, ఈదురుగాలులకు ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప, కూడేరు మండలాల్లో అరటి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రకృతి విపత్తు కారణంగా రూ. కోట్లలో నష్టాన్ని రైతులు మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నారు. 400 ఎకరాల్లో మొక్కజొన్న, 200 ఎకరాల్లో అరటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. అయితే క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి నష్ట పరిహారం అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. బెళుగుప్ప మండలం అంకంపల్లి, దుద్దేకుంట, గంగవరం, కూడేరు మండలం ముద్దలాపురం గ్రామాల్లో తాను పర్యటించి రైతులతో మాట్లాడి వివరాలను సేకరించానని, రూ.5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతులు వివరించారని పేర్కొన్నారు. పంటలు చివరి దశలో ఉండగా దెబ్బతినడంతో నష్ట తీవ్రత భారీగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో నష్టం అంచనాలను పునఃసమీక్షించి రైతులకు న్యాయం చేకూరేలా చొరవ తీసుకోవాలని కలెక్టర్కు విన్నవించినట్లు పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని, మద్దతు ధర క్వింటాకు రూ.2,600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నాయకులు మచ్చన్న, హనుమంతరాయుడు, రుద్రానంద, రామచంద్రారెడ్డి, ధనుంజయ, నారాయణరెడ్డి, అశోక్ కుమార్, మోపిడి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాలతో రూ.5 కోట్ల మేర నష్టం కలెక్టర్కు విన్నవించిన వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి -
రైలులో చైన్స్నాచింగ్
గుత్తి: స్థానిక రైల్వేస్టేషన్ అవుటర్ సిగ్నల్ పాయింట్ వద్ద తిరుచానూరు ఎక్స్ప్రెస్ రైలులో చైన్స్నాచింగ్ జరిగింది. చర్లపల్లి నుంచి తిరుపతికి బయలుదేరిన రైలు (07017) సోమవారం గుత్తి రైల్వే స్టేషన్ అవుటర్ సిగ్నల్ పాయింట్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ఎస్–5 కోచ్లోకి చొరబడిన దుండగులు ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును అపహరించి రైలు దిగి ఉడాయించాడు. అయితే ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, మహిళా ప్రయాణికురాలి మెడలోని బంగారు చైన్ను దుండగుడు ఎత్తుకెళ్లినట్లు పలువురు ప్రయాణికులు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా సోమవారం చైన్స్నాచింగ్ చోటు చేసుకున్న ప్రాంతంలోనే పలుమార్లు రైళ్లలో చోరీలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ విషయం తెలిసినా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా తమకు ఎలాంటి ఫిర్యాదు పోలీసులు బుకాయిస్తుండడం పరిపాటిగా మారిపోయింది. -
డ్రగ్స్ నుంచి సమాజాన్ని కాపాడాలి
అనంతపురం: డ్రగ్స్ ముప్పు నుంచి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. యువతలో పెరిగిన మత్తు వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనార్కోటిక్ డ్రగ్స్ – సైకోట్రోపిక్శ్రీ పదార్థాలపై మెడికల్ షాప్ యజమానులు, ఫార్మాసిస్టులకు జేఎన్టీయూ (ఏ)లో సోమవారం ఎస్పీ జగదీష్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు శ్రీఆపరేషన్ గరుడశ్రీను ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై కఠిన నిఘా, ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం, ముఖ్యంగా షెడ్యూల్ –హెచ్, హెచ్1 తదితర ఔషధాల దుర్వినియోగం పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టపరమైన నిబంధనలను మెడికల్ షాపు నిర్వాహకులు కచ్చితంగా పాటిస్తూ, సమాజాన్ని డ్రగ్స్ ముప్పు నుంచి కాపాడడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం, అనుమానాస్పద కార్యకలాపాలు, సహాయం కోసం ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు కాల్ చేయాలన్నారు. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఓ. విశ్వనాథరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వీరకుమార్ రెడ్డి, అనంతపురం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగారెడ్డి, తదితరులు పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం మత్తు పదార్థాల వినియోగాన్ని అరికడదామంటూ సదస్సుకు హాజరైన ప్రముఖులు, విద్యార్థులతో ఎస్పీ జగదీష్ ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ఈగల్ విభాగం ఐజీ ఆకే రవికృష్ణ -
ప్రభుత్వ ధనం.. ప్రైవేటు పరం
కూడేరు: అడిగేవారు లేరని అధికార పార్టీ నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏకంగా ప్రైవేట్ వెంచర్ కోసం సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ నిధులతో ప్రైవేట్ వారికి లబ్ధికలిగేలా రోడ్డు వేయడమేంటని ప్రజలు మండిపడుతున్నారు. ఇటీవల ఉపాధి హామీ పథకం కింద మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా గొటుకూరు పంచాయతీకి రూ.50లక్షల నిధులు మంజూరయ్యాయి. పంచాయతీ పరిధిలో బ్రాహ్మణపల్లి, రామచంద్రాపురం, గొటుకూరు గ్రామాలు ఉన్నాయి. ఇందులో చాలా కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. అయితే రామచంద్రాపురానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఇలాంటి కాలనీలను పక్కనపెట్టి బ్రాహ్మణపల్లి వద్ద అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కన స్కంద వెంచర్లో సీసీ రోడ్డు వేయాలని నిర్ణయించారు. అధికారులను సైతం ఇందుకు ఒప్పించారు. వారే కాంట్రాక్టర్ అవతారమెత్తారు. రెండు రోజుల క్రితం స్కంద వెంచర్లో 40 అడుగుల వెడల్పుతో వెయ్యి మీటర్లు సీసీ రోడ్డు నిర్మించేందుకు ఉపక్రమించారు. బెడ్డింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. రెండు రోజుల క్రితం కొంతదూరం వరకు సిమెంటు రోడ్డు వేసి.. నీళ్లు క్యూరింగ్ పెట్టారు. ఈ రోడ్డు వేస్తున్నది ప్రభుత్వ నిధులతో అని తెలుసుకున్న ప్రజలు అవాక్కయ్యారు. ప్రభుత్వ ధనం ప్రజలకు ఉపయోగపడాలి కానీ ఇలా ప్రైవేట్ వారికి ధారాదత్తం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రూ.50 లక్షలతో వెంచర్లో వేస్తున్న సిమెంట్ రోడ్డును రద్దు చేసి.. పంచాయతీ పరిధిలో అధ్వానంగా ఉన్న చోట్ల రోడ్లు వేయాలని కోరుతున్నారు. 6న జేఎన్టీయూ(ఏ) స్నాతకోత్సవం ● గౌరవ డాక్టరేట్కు టెస్సీ థామస్ ఎంపిక అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం) 15వ స్నాతకోత్సవం ఏప్రిల్ ఆరో తేదీన నిర్వహించనున్నారు. భారతదేశ క్షిపణి మహిళ (మిస్సైల్ ఉమెన్)గా ఖ్యాతి దక్కించుకున్న టెస్సీ థామస్ను గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేశారు. ఛాన్సలర్ /గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై జేఎన్టీయూ(ఏ) గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారు. ఈ మేరకు స్నాతకోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి. అగ్ని పుత్రి టెస్సీ థామస్ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)లో టెస్సీ థామస్ ఏరోస్పేస్ ఇంజినీర్ పనిచేస్తున్నారు. ఈమెను అగ్నిపుత్రిగా పిలుస్తారు. అగ్ని–4 క్షిపణికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించి, మిస్సైల్ ప్రాజెక్ట్ను నడిపించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఈమె కేరళలోని త్రిశూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్, పుణెలో ఎంటెక్, మిస్సైల్ గైడెన్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. 1988లో డీఆర్డీఓలో చేరి, అగ్ని సిరీస్ క్షిపణుల అభివృద్ధిలో, ముఖ్యంగా అగ్ని–2, 3, 4, 5 క్షిపణుల గైడెన్స్, నావిగేషన్ సిస్టమ్లో కీలక పాత్ర పోషించారు. టెస్సీ థామస్కు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మార్గదర్శకులు. కనికరించి.. పరిష్కరించరూ..!అనంతపురం అర్బన్: తమ పట్ల కనికరం చూపి.. సమస్యలను పరిష్కరించాలని అర్జీదారులు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, ఆనంద్ వివిధ సమస్యలపై ప్రజల నుంచి 417 అర్జీలు స్వీకరించారు. ఇందులో భూ సమస్యలపైనే 280 అర్జీలు ఉండటం గమనార్హం. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. జన గణన పక్కాగా చేపట్టాలిఅనంతపురం అర్బన్: జన గణన పక్కాగా చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. జనగణన–2027కు సంబంధించి మొదటి దశ గృహ గణన నిర్వహణపై నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల కామర్స్ కాన్ఫరెన్స్ హాలులో సిబ్బందికి ఏర్పాటు చేసిన మొదటి విడత శిక్షణ తరగతులను కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన ఈసారి గతం కంటే భిన్నంగా పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారన్నారు. జనగణన అధికారులు, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. మొదటి దశలో గృహ గణనకు సంబంధించి డేటా సేకరణలో ప్రజలకు ఉన్న అపోహలు తొలగించాలని చెప్పారు. 29వ తేదీ వరకు మూడు బ్యాచ్లకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన గణాంకాల ద్వారా గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయస్థాయిలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, సీపీఓ అశోక్కుమార్, ఆర్డీఓ కేశవ నాయుడు, గణాంక అధికారి గిరిధర్, అనంతపురం ఇన్చార్జ్ తహసీల్దార్ రాజా, సెన్సస్ విభాగం డీటీ మధుసూదన్రావు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు, మాస్టర్ ట్రైనర్లు జీఎల్ఎన్ ప్రసాద్, కిరణ్, సెన్సస్ నోడల్ అధికారులు మోహిత్ వర్మ, లక్ష్మీకళ, ఎన్నికల డీటీ కనకరాజు, తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ వెంచర్లో సీసీ రోడ్డు నిర్మాణం ఇదీ అధికార పార్టీ నేతల నిర్వాకం వంతపాడిన అధికార గణం ఆగ్రహించిన ప్రజానీకం అవును.. కొంత రోడ్డు వేశారు బ్రాహ్మణపల్లి వద్ద స్కంద వెంచర్లో ఉపాధి హామీ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టారు. కొంత దూరం వరకు రోడ్డు నిర్మించిన మాట వాస్తవమే. జియో ట్యాగ్ కాకపోవడంతో ప్రస్తుతం ఆ పనిని నిలిపివేశాం. – రమణయ్య, ఏఈ, పంచాయతీ రాజ్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల విన్నపాలు -
పాడి, మాంసం ఉత్పత్తుల తయారీ యూనిట్లకు రాయితీ
● ఈ నెల 25న ఔత్సాహికులకు అవగాహన సదస్సు అనంతపురం అగ్రికల్చర్: పాడి, మాంసం ఉత్పత్తుల తయారీలో భాగంగా ఆహార శుద్ధికి సంబంధించి చిన్నపాటి కుటీర పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలను అందజేయనున్నారు. ఈ మేరకు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ పి.ప్రేమ్చంద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి ఆహారశుద్ధి క్రమ బద్ధీకరణ పథకం (పీఎంఎఫ్ఎంఈ) కింద ఆసక్తి ఉన్న పాడి రైతులు, మహిళా సంఘాల సభ్యులు, ఎంటర్ప్రెన్యూర్స్కు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ కింద దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం సమృద్ధి సాధించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ప్రాజెక్టు విలువలో 10 శాతం లబ్ధిదారులు భరిస్తే... 90 శాతం బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పిస్తారు. ఇందులో 35 శాతం రాయితీ వర్తిస్తుంది. పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, కోవా, తదితర పాడి అనుబంధ ఉత్పత్తులు, ఇతర మాంస ఉత్పత్తుల యూనిట్లకు ప్రాధాన్యత ఉంటుంది. వీటికి సంబంధించి ఈ నెల 25న అనంతపురంలోని పశుశాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు అవగాహన సదస్సు ఉంటుంది. ఔత్సాహికులు, ఆసక్తి ఉన్న వారు సదస్సుకు హాజరై అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. యుద్ధోన్మాదం నశించాలి ● సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అనంతపురం టవర్క్లాక్: ప్రపంచ దేశాల శాంతియువత జీవనానికి ప్రమాదకరమైన అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం నశించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఇరాన్పై దాడులను ఖండిస్తూ అమెరికా – ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం, సామ్రాజ్యవాదం నశించాలని, ప్రపంచ శాంతి వర్ధిలాలనే అంశాలపై సోమవారం అనంతపురంలోని ఎన్జీఓ హోంలో సీపీఐ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణ స్వామి అధ్యక్షత వహించారు. రామకృష్ణతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష, ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి జాఫర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాసర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ తదితరులు మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతిని దేశ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయిల్తో కలిసి అమెరికా చేస్తున్న దాడులు ప్రపంచ శాంతికి ముప్పుగా మారాయన్నారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున, రాజారెడ్డి, శ్రీరాములు, కేశవరెడ్డి, రామకృష్ణ, పద్మావతి, నారాయణస్వామి, రాయుడు, కుళ్లాయిస్వామి, కోట్రేస్ తదితరులు పాల్గొన్నారు. వాహనం ఢీకొని వృద్ధుడి మృతి తాడిపత్రి రూరల్: స్థానిక ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కొండాపురం మండలం బుక్కపట్నంకు చెందిన ఆదినారాయణరెడ్డి (65) మృతి చెందాడు. వ్యక్తిగత పనులపై తాడిపత్రికి వచ్చిన ఆయన పని ముగించుకుని తిరుగు ప్రయాణమై రోడ్డు దాటుతున్న సమయంలో వాహనం ఢీకొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
దారి దోపిడీ యత్నం
గుత్తి రూరల్: మండలంలోని బాచుపల్లి గ్రామ శివారున దారి దోపిడీకి విఫలయత్నం జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు... గుత్తి మండలం కరిడికొండ గ్రామానికి చెందిన నాగరాజు ఆదివారం రాత్రి వ్యక్తిగత పనిపై బాచుపల్లి శివారున ఉన్న బాట సుంకులమ్మ ఆలయం వద్దకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకున్న అనంతరం గ్రామానికి నడుచుకుంటూ వెళుతుండగా 44వ జాతీయ రహదారిపై ప్లైఓవర్ బ్రిడ్జి పక్కన నిర్మానుష్య ప్రాంతంలోకి చేరుకోగానే ఇద్దరు యువకులు దాడి చేశారు. ఇనుప రాడ్లతో దాడి చేయడంతో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. సెల్ఫోన్, కొంత నగదు లాక్కొన్నారు. ఆ సమయంలో తేరుకున్న నాగరాజు బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు పరుగున అక్కడికి చేరుకున్నారు. వారిని గమనించిన దుండగులు పారిపోతుండగా వెంబడించి బాట సుంకులమ్మ ఆలయం ఎదురుగా క్రషర్కు వెళ్లే మార్గంలో పట్టుకున్నారు. అనంతరం సుంకులమ్మ ఆలయం వద్ద విద్యుత్ స్తంభానికి చీరలతో కట్టేశారు. గాయపడిన నాగరాజును చికిత్స నిమిత్తం గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకోండి
అనంతపురం అర్బన్: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా పర్యాటక కౌన్సిల్ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నగరంలోని శిల్పారామంలో చేతివృత్తులు, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. కుందుర్పి కోటకు సంబంధించి మెట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గుత్తి కోటకు నడక మెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో గుర్తించిన చారిత్రాత్మక ప్రదేశాలు, స్థలాల్లో నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అనంత సాగరం చెరువులో బోటింగ్ సదుపాయాన్ని త్వరగా ప్రారంభించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, జిల్లా పర్యాటక అధికారి జయకుమార్బాబు, డ్వామా పీడీ సలీంబాషా, ఆర్కియాలజీ ఏడీ స్వామి నాయక్, నగర పాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, మెప్మా పీడీ విశ్వజ్యోతి, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి దొమ్మేటి వెంకటరెడ్డి గొప్ప సంఘ సంస్కర్త అని, శెట్టిబలిజలకు ఆయన ఆరాధ్యుడని కలెక్టర్ ఓ.ఆనంద్ కొనియాడారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పుష్పాంజలి ఘటించి, మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, శెట్టిబలిజ సమాజంలో విద్య, ఐక్యత, ఆత్మగౌరవం కోసం వెంకటరెడ్డి చేసిన కృషిని వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ ఎ.మలోల, బీసీ సంక్షేమ శాఖ డీడీ కుష్బూకొఠారి. బీసీ కార్పొరేషన్ ఈడీ రామసుబ్బారెడ్డి, జిల్లా పర్యాటక అధికారి జయకుమార్బాబు, తదితరులు పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం -
27 నుంచి సంగమేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
కూడేరు: దక్షిణ భారత దేశంలోనే ప్రసిద్ధిచెందిన శివాలయాల్లో ఒక్కటిగా నిలిచిన కూడేరులోని శివపార్వతుల స్వయం భు జోడులింగాల సంగమేశ్వరుడి క్షేత్రంలో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 3 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఆహ్వాన ప్రతులను సోమవారం ఆలయ ఈఓ రమేష్బాబు విడుదల చేశారు. కార్యక్రంమలో అర్చకులు, ఆలయ సేవా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 27న బండారు (బ్రాహ్మణ) వంశీకుల ఆధ్వర్యంలో శివపార్వతులకు పుణ్యావాచనం, గంగపూజ, కలశ స్థాపన పూజలు ఉంటాయి. 28న రాత్రి 7 గంటలకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శేష వాహన సేవ, 29న ఈడిగ సంఘం ఆధ్వర్యంలో వ్యాఘ్ర వాహన సేవ, 30న వైశ్య సంఘం ఆధ్వర్యంలో నెమలి వాహన సేవ, 31న కమ్మ సంఘం ఆధ్వర్యంలో నంది వాహన సేవ ఉంటుంది. ఏఫ్రిల్ 1న వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో ఐరావత వాహనంపై ఆదిదంపతులు దర్శనమివ్వనున్నారు. 2న ఉదయం 7 గంటల్లోపు మడుగు తేరు, సాయంత్రం బ్రహ్మరథోత్సవం ఉంటుంది. 3న కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో అశ్వ వాహన సేవ, పారవేట ఉత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ● శత జన్మదిన వేడుక బొమ్మనహాళ్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పార్వతమ్మ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం శత జన్మదిన వేడుకలను కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించారు. కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా మొలకాల్మూరు తాలుకా కరడల్లి గ్రామానికి చెందిన పార్వతమ్మకు 1940లో బొమ్మనహాళ్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పాల్తూరు హీరేమఠ సాంబయ్యతో వివాహమైంది. నలుగురు కుమారులు, నలుగురు కుమారైలు ఉన్నారు. అలాగే పది మంది మనవళ్లు, పది మంది మనవరాళ్లూ ఉన్నారు. ఇటీవల ఆమె పెద్ద కుమారుడు మృతి చెందాడు. శతాధిక వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్న పార్వతమ్మను గ్రామస్తులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
సాహిత్య చరిత్రకు ప్రతిరూపం ‘కడపటి యుద్ధం’
అనంతపురం కల్చరల్: అద్భుతమైన చరిత్రకు ప్రతిరూపంగా రాసిన ‘కడపటి యుద్ధం’ మరో చరిత్రను సృష్టిస్తుందని మాజీ వీసీ, డాక్టర్ కొలకలూరి ఇనాక్ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండి నారాయణస్వామి రాసిన కడపటి యుద్ధం నవలను ఆదివారం స్థానిక ఎన్జీఓ హోమ్ వేదికగా స్పందన అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కవి తూముచర్ల రాజారామ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆచార్య కొలకలూరి ఇనాక్, ప్రజాకవి గోరేటి వెంకన్న, సాహితీ విమర్శకుడు భూమన్, అజూ పబ్లికేషన్స్ శ్వేత, డాక్టర్ అంకే శ్రీనివాస్, వర్దిల్లి వెంకటేశ్వర్లు, పద్మాకర్, చంద్రశేఖరశాస్త్రి తదితరులు ఉదయం సభలో ముఖ్య అతిథులుగా మాట్లాడారు. హంపీ విజయనగర వైభవం, తళ్శికోట యుద్ధం ఘట్టాలతో పాటు విశిష్టాధ్వైత మూలాల ప్రస్తావనను రచయిత సమర్థవంతంగా చిత్రీకరించారని కొనియాడారు. అలాగే మధ్యాహ్నం సభకు డాక్టర్ వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ప్రముఖ సాహితీ విమర్శకులు గుంటూరు లక్ష్మీనరసయ్య, ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. జీవిత వాస్తవికత కల్గిన పాత్రలతో రాసిన నవలలో అనేక ఆధారాలను చేర్చిన విషయం అభినందనీయమన్నారు. ఉప్పరపాటి వెంకటేశులు, ద్విభాషా కవి జూటూరు షరీఫ్, అప్పిరెడ్డి హరినాథరెడ్డి, పేరిందేవి, చెట్ల ఈరన్న, రియాజుద్దీన్, అశ్వర్థరెడ్డి, తరిమెల అమరనాథరెడ్డి, జింక వరుణ్ తదితరులు రచయితను ఘనంగా అభినందించారు. -
జాతీయ స్థాయిలో పి.నారాయణపురానికి గుర్తింపు
● క్విజ్ పోటీల్లో విజేతగా సర్పంచ్ హనుమంతరెడ్డి కూడేరు: జాతీయ స్థాయిలో కూడేరు మండల పరిధిలోని పి.నారాయణపురం పంచాయతీకి గుర్తింపు దక్కింది. వివరాల్లోకి వెళితే... ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజులుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ‘సర్పంచ్ సంవాద్’ యాప్ ద్వారా సర్పంచులకు క్విజ్ పోటీలు నిర్వహించింది. పి.నారాయణపురం సర్పంచ్ హనుమంతరెడ్డి నీటి సంరక్షణ, నిర్వాహణపై సరైన సమాధానాలు చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ హనుమంతరెడ్డిని విజేతగా ఆదివారం ప్రకటించింది. విజేతగా నిలిచిన హనుమంతరెడ్డికి పంచాయతీ ప్రజలు, తోటి సర్పంచులు అభినందనలు తెలిపారు. ఏపీసీపీఎస్ఈఏ జిల్లా నూతన కార్యవర్గం అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక ఉపాధ్యయ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం కమిటీని ఎన్నుకున్నారు. ఏపీసీపీఎస్ఈఏ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పాలెల రామాంజనేయులు యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా రాంభూపాల్రెడ్డి వ్యవహరించారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా మురళీకృష్ణ, గౌరవ సలహాదారుడిగా జి.ప్రభాకర్, అధ్యక్షుడిగా పి.జగదీష్, ప్రధాన కార్యదర్శిగా ఎం.రవికుమార్, ఆర్థిక కార్యదర్శిగా కె.గోపాల్నాయక్, సహాధ్యక్షుడిగా వరప్రసాద్, సహ కార్యదర్శిగా శర్మాస్సాబ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా వి.అర్చన, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా వి.కళ్యాణ్, వై.రామన్న, లక్ష్మణ్, కె.నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
పెద్దమ్మ ఆలయంలో వెండి ఆభరణాల చోరీ
పుట్లూరు: మండలంలోని కుమ్మనమల గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న 60 తులాల వెండి ఆభరణాలను దొంగలు అపహరించినట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సురేంద్రబాబు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘనంగా లంకా దహనం డీ హీరేహాళ్ (రాయదుర్గం): ప్రముఖ పుణ్యక్షేత్రం మురడి ఆంజనేయస్వామి ఉగాది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు లంకా దహనాన్ని కనుల పండువగా నిర్వహించారు. సుమారు రెండు గంటలకు పైగా సాగిన లంకా దహనాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అంతకు ముందు ఉదయం 7 గంటలకు గండ దీపం మోయడం, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అన్నదానం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు పానక వినియోగంజరిగింది. సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం నిర్వహించారు. రాత్రి 9 గంటలకు చెక్క భజన, లంకాదహనంతో ఉత్సవాలను ముగించారు. -
క్రమబద్ధీకరణ లేకుండా బదిలీలు చేయండి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో క్రమబద్దీకరణ చేయకుండా టీచర్ల బదిలీలు మాత్రమే చేపట్టాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో వైఎస్సార్టీఏ జిల్లా సబ్ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. క్రమబద్ధీకరణ జరిగి ఒక సంవత్సరం కూడా కాలేదని, ఒక విద్యా సంవత్సరంలో పాఠశాలల రోల్ పెరగడం అనేది అసాధ్యమని, ఫలితంగా చాలా పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. అలాగే గత సంవత్సరంలో బదిలీ అయిన ఉపాధ్యాయులు ఇప్పుడు కూడా క్రమబద్ధీకరణకు గురైతే తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం టీచర్ల బదిలీలు మాత్రమే నిర్వహించాలని, క్రమబద్ధీకరణ చేయకూడదని డిమాండ్ చేశారు. వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు గోపాల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.గోవిందరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రాధాకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణప్ప, రవీంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, ఓబిరెడ్డి, సిద్ధప్రసాద్ జిల్లా కార్యదర్శి కృష్ణా నాయక్, విశ్వనాథరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు. -
●అరటికి ఈతాకు రక్ష
అరటి పంటకు ఈతాకును రక్షణగా ఉంచిన దృశ్యం పెరుగుతున్న ఎండలతో పంటలను కాపాడుకునేందుకు రైతులు కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మండలంలోని బోరంపల్లి – గంగవరం గ్రామాల మధ్య అరటి రైతులు అరటి పిలకలకు రక్షణగా ఈతాకును ఏర్పాటు చేశారు. మొక్కను మొత్తం ఎండ నుంచి కాపాడుకునేందుకు రక్షణగా ఓ గొడుగులా చుట్టూ ఏర్పాటు చేశారు. అరటి మొదటి దశలో ఉండగా అంతర పంటగా పలువురు రైతులు టమాట, పప్పుశనగను సైతం సాగు చేశారు. – కళ్యాణదుర్గం: -
అబ్బురం.. పంటల వైవిధ్యం
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో మరే జిల్లాలోనూ లేనివిధంగా ‘అనంత’లో పంటల వైవిధ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దేశంలో పండే ప్రధాన పంటలన్నీ జిల్లాకు పరిచయం అవుతుండటం విశేషం. చివరకు కశ్మీర్, సిమ్లా లాంటి అతిశీతల వాతావరణంలో పండే యాపిల్ లాంటి పంట కూడా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నట్లు వెల్లడి కావడం గమనార్హం. ఈ–క్రాప్ సర్వేతో జిల్లాలో పంటల వారీగా దాదాపుగా కచ్చితమైన లెక్కలు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల పరిధిలో ఎన్ని రకాల వ్యవసాయ పంటలు, ఎన్ని రకాల పండ్లతోటలు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ పంటలు, పూల తోటలు సాగు చేస్తున్నారనేది వెల్లడవుతోంది. దీంతో గతంలో 15 నుంచి 20 వరకు వ్యవసాయ పంటలు, 20 నుంచి 25 వరకు ఉద్యాన పంటలు.. ఇలా ఏటా ఖరీఫ్లో 40 నుంచి 50 పంటలు, రబీలో అయితే 20 నుంచి 25 పంటలు చూపించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వందల సంఖ్యలో పంటలు సాగు చేస్తున్నట్లు వెల్లడవుతోంది. గత ఖరీఫ్లో ఏకంగా 150 రకాల పంటలు సాగు చేసినట్లు నమోదు చేశారు. రబీలో 127 రకాల పంటలు.. ఈ రబీలో జిల్లా వ్యాప్తంగా 3,93,958 ఎకరాల్లో 127 రకాల పంటలు సాగు చేసినట్లు ఈ–క్రాప్ ద్వారా వెల్లడైంది. అయితే ఇందులో కేవలం ఏడు రకాల వ్యవసాయ పంటలే 3,47,163 ఎకరాల్లో సాగులోకి రాగా.. మిగతా 46,795 ఎకరాల్లో 100 రకాల పంటలు వేశారు. అందులో పప్పుశనగ, వరి, వేరుశనగ, సజ్జ, మినుము, ఆముదం, బేబీకార్న్, పాప్కార్న్, పత్తి, అలసంద, పెసర, ఉలవ, జొన్న, మొక్కజొన్న, కొర్ర, కంది, కుసుమ, నువ్వులు, సోయాబీన్, చెరకు, పొద్దుతిరుగుడు, పత్తి, పొగాకు, గోధుమ, రాగి, మల్బరీ, ఉసిరి, చీనీ, నిమ్మ, సపోట, జామ, ద్రాక్ష, దానిమ్మ, అరటి, అంజూర, మామిడి, సీతాఫలం, పనస, మకాడమియా, అజ్వాన్, అమరాంథస్, ఆకు, వక్క, ఆపిల్, ఆపిల్ బేర్, అశ్వగంధ, అవకాడో, వెదురు, టమాట, వంగ, బెండ, బీన్స్, బీట్రూట్, బ్రాడ్బీన్స్, గుమ్మడి, కాకర, సొర, బీర, బూడిద గుమ్మడి, క్యాబేజ్, క్యాప్సికం, బెర్రీ, రేగు, క్యారెట్, కాలీఫ్లవర్, లిల్లీ, మల్లె, రోజ్, ట్యూబ్రోజ్, కనకాంబరం, చామంతి, బంతి, కొబ్బరి, ధనియాలు, కరివేపాకు, దోస, కర్భూజ, కళింగర, బొప్పాయి, కస్టర్డ్ యాపిల్, ఖర్జూరం, డ్రాగన్, మునగ, ఫీల్డ్బీన్, ఫ్లాక్స్ సీడ్, గోంగూర, పచ్చిమిరప, ఎండుమిరప, ఉల్లి, పొటాటో, స్వీట్ పొటాటో, ముల్లంగి, రాజ్మాబీన్, ఎర్రచందనం, శీకాకాయి, పసుపుతో పాటు మరికొన్ని కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ పంటలు.. మొత్తంగా 127 రకాలు సాగైనట్లు ఈ–క్రాప్లో నమోదు చేశారు. రబీలో 3,93,958 ఎకరాల విస్తీర్ణంలో 127 రకాల పంటలు సాగు గత ఖరీఫ్లోనూ ఏకంగా 150 రకాల పంటలు సాగైనట్లు ఈ–క్రాప్లో వెల్లడి సత్ఫలితాలిస్తున్న ఈ–క్రాప్ కచ్చితమైన సాగు గణాంకాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం తరఫున అర్హులైన రైతులకు అందాల్సిన ప్రయోజనాలు కల్పించడానికి వీలుగా గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తీసుకువచ్చిన ఈ–క్రాప్ (పంట నమోదు) ప్రక్రియ మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ –క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే) లేనప్పుడు అధికారులు, ఆయా శాఖల సిబ్బంది ఇచ్చిన కాకిలెక్కలే అన్నింటికీ ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొలువుతీరాక వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకే వ్యవస్థతో గ్రామ స్థాయిలో వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రణాళికలు అమలు చేయడంతో రైతులకు అన్ని రకాలుగా వెసులుబాటు లభించింది. ఈ క్రమంలో ఈ–క్రాప్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధి చేకూరి రైతులకు ఉపశమనం లభించింది. -
నిబంధనలకు నీళ్లు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పరవాలేదు’ అనే నానుడి ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ)గా పని చేస్తున్న వెంకటరమణనాయక్కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రిన్సిపాల్గా అత్యంత జూనియర్గా ఉన్న ఆయనను నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఐఓగా కొనసాగిస్తుండమే ఇందుకు నిదర్శనం. ఈ వ్యవహారం ఆర్ఐఓ, డీవీఈఓ కార్యాలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా జూనియర్ అధ్యాపకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ డీవీఈఓ వచ్చినా.... జీఓ నంబర్ 8 మేరకు హైకోర్టు ఆదేశాలతో అన్ని ఉమ్మడి జిల్లాలకు రెగ్యులర్ డీవీఈఓలను నియమించే సందర్భంలో సీనియార్టీ జాబితాలో 57, 59, 65, 66, 71, 73, 75 స్థానాల్లో ఉన్న వారిని కాదని 327వ స్థానంలో ఉన్న వెంకటరమణనాయక్ను డీవీఈఓ (ఎఫ్ఏసీ)గా కొనసాగించారు. ఇందుకు ఇంటర్ బోర్డులో పని చేస్తున్న ఓ రిటైర్డ్ అధికారి అండగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు సీనియర్లు కోర్టుకు వెళ్లడంతో 2025 జనవరి 5న ఆయనను డీవీఈఓ బాధ్యతల నుంచి తప్పించి రెగ్యులర్ డీవీఈఓగా గురువయ్యశెట్టిని నియమించారు. అదే ఏడాది జూలైలో ఆయా జిల్లాల్లో రెగ్యులర్ డీవీఈఓలకు ఆర్ఐఓ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇక్కడ మాత్రం వెంకటరమణనాయక్నే ఎఫ్ఏసీ ఆర్ఐఓగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఎఫ్ఏసీ హోదాలో మూడేళ్లు మాత్రమే ఉండొచ్చని అధ్యాపకులు చెబుతున్నారు. ఆయన మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్నారని అంటున్నారు. ● డీవీఈఓ అనుమతి లేకుండా ఉద్యోగులకు ఓడీ (ఆన్ డ్యూటీ) ఇవ్వకూడదు. 2019 మార్చి పరీక్షల సమయంలో ఒక రికార్డు అసిస్టెంట్కు ఆర్ఐఓ వెంకటరమణనాయక్ ఏకంగా 30 రోజులు ఓడీ ఇవ్వడాన్ని అధ్యాపకులు తప్పుపడుతున్నారు. ఈ విషయంపై 2021లో అప్పటి సెక్రటరీకీ కొందరు సాక్షాధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఈయనను ఆర్ఐఓ బాధ్యతల నుంచి తప్పించారని చెబుతున్నారు. అయితే కమిషనర్ మారిన వెంటనే మళ్లీ చక్రం తప్పి డీవీఈఓగా తెచ్చుకున్నారనే ఆరోపణలున్నాయి. 2024 ఏప్రిల్లో తిరిగి ఆర్ఐఓ బాధ్యతలూ చేపట్టారు. ● 2025 మార్చిలో జరిగిన పరీక్షల సమయంలో డీఈసీ మెంబరుగా నిబంధనలకు విరుద్ధంగా తనమిత్రుడికి లైబ్రేరియన్గా అవకాశం కల్పించారు. ఈ వ్యవహారంలో ఓ ప్రజాప్రతినిధి నేరుగా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో ఈసారి డీఈసీ కమిటీలో సదరు లైబ్రేరియన్ను తప్పించారని చెబుతున్నారు. ఈయన హయాంలో జరిగిన , జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తే మరిన్ని వెలుగులోకి వస్తాయని అధ్యాపకులు చెబుతున్నారు. రాష్ట్రమంతా రెగ్యులర్ డీవీఈఓలకు ఆర్ఐఓ బాధ్యతలు ఇక్కడ మాత్రం ఏళ్లుగా ఎఫ్ఏసీ ఆర్ఐఓగా వెంకటరమణనాయక్ సీనియర్లను కాదని జూనియర్ను కొనసాగిస్తుండడంపై అనుమానాలు -
జిల్లా బంద్కు మద్దతు ఇవ్వండి
అనంతపురం: కరువు సీమలో కల్పతరువుగా విరాజిల్లుతున్న ఆర్డీటీని పరిరక్షించాలన్న డిమాండ్తో ఏప్రిల్ 9న సీపీఐ ఉమ్మడి అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ , సీపీఎం మద్దతు ఇవ్వాలని సీపీఐ కోరింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, నగర కార్యదర్శి రామిరెడ్డి, బాలరంగయ్యలను సీపీఐ జిల్లా బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ.. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఎన్నో ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ఫలితం లేకపోయిందన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులను మాత్రమే కలిశామని, తక్కిన రాజకీయ, కుల సంఘాలను కలిసి బంద్ను విజయవంతం చేయాలని కోరతామన్నారు. ఏప్రిల్ 3న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుడతామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీరాములు, కేశవ రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ, సీపీఎం మద్దతు కోరిన సీపీఐ -
నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్ నంబర్ : 8977716661 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ.. అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు సెల్ నంబర్: 9154790350లో ఫిర్యాదు చేయాలని సూచించారు. హేతుబద్ధీకరణ ప్రక్రియ నిలిపేయాలి అనంతపురం ఎడ్యుకేషన్: రాబోయే విద్యా సంవత్సరం (2026–27) లో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులు ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో చాలా పోస్టులు పోయే ప్రమాదం ఉందని ప్రోగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.విష్ణువర్ధన్రెడ్డి, జి.తిమ్మారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎ.కేశవరెడ్డి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గత విద్యా సంవత్సరం హేతుబద్ధీకరణ జరిగిందని, వెంటనే మళ్లీ హేతుబద్ధీకరణ ప్రారంభిస్తే ఉపాధ్యాయ పోస్టులు పోతాయన్నారు. ఒకవేళ ప్రభుత్వం హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని మొండి పట్టుదలతో ముందుకెళితే, ప్రస్తుతమున్న ఉపాధ్యాయ – విద్యార్థుల నిష్పత్తిని 1:49 నుంచి 1: 40కి కుదించాలని డిమాండ్ చేశారు. మటన్ కడ్డీ గుచ్చుకుని వ్యాపారికి గాయాలు గుత్తి: పట్టణంలోని అమృత్ సినిమా థియేటర్ ఎదురుగా మటన్ షాప్ నిర్వాహకుడు కటిక ఖురేషి అన్వర్ ఆదివారం తీవ్రంగా గాయపడ్డాడు. మటన్ కొడుతున్న సమయంలో మటన్ కోసం ఏర్పాటు చేసిన కడ్డీ పొరపాటును చేతికి గుచ్చుకుంది. దీంతో రక్త స్రావం జరిగింది. స్నేహితులు డిష్ మహమ్మద్, వైఎస్సార్సీపీ కార్యకర్త మహమ్మద్ అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చేతికి కుట్లు వేసి కట్టు కట్టారు. అగ్ని ప్రమాదంలో ముగ్గురికి గాయాలు గుమ్మఘట్ట: మండలంలోని గోనబావి గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు... గ్రామానికి చెందిన శ్రీనివాసులు గోనబావిక్రాస్లో చిల్లర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. దుకాణంలో భార్య అనిత, కుమార్తె మేఘన చికెన్ను వండుతున్నారు. అంతలో ఓ ద్విచక్ర వాహనదారుడు వచ్చి లీటర్ పెట్రోల్ వేయాలని కోరాడు. వెంటనే మేఘన క్యాన్లో ఉన్న పెట్రోల్ను బాటిల్ వేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శ్రీనివాసులు, అనిత, మేఘనకు గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలని సూచించారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. నృసింహుడి ఆలయంలో అద్భుతం ● స్వామి వారి పాదాలను తాకిన సూర్య కిరణాలు గుత్తి: పట్టణంలోని కోటపై వెలసిన అతి పురాతన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు లక్ష్మీనరసింహస్వామి పాదాలపై ప్రసరించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. గత కొన్ని దశాబ్దాలుగా సూర్య కిరణాలు ఉగాది పర్వదినం మరుసటిరోజు స్వామి పాదాలపై పడుతున్నాయని అర్చకులు తెలిపారు. -
బ్లాక్లో డెలివరీ
అనంతపురం అర్బన్: ఇరాన్– ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా వంట గ్యాస్ సరఫరాలో సంక్షోభం తలెత్తింది. వాణిజ్య (కమర్షియల్) గ్యాస్ సిలిండర్ల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. ఇక గృహావసరాలకు వినియోగించే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లకు కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభాన్ని అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గ్యాస్ ఏజెన్సీల డెలివరీ బాయ్స్తో కుమ్మకై ‘బ్లాక్ దందా’ సాగిస్తున్నారు. హోటళ్లకు, టీస్టాళ్లకు డొమెస్టిక్ సిలిండర్లను అధిక ధరకు విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కొక్క సిలిండర్కు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల విజిలెన్స్ దాడులు పెరగడంతో అక్రమార్కులు రహస్య ప్రదేశాల్లో గ్యాస్ సిలిండర్లను నిల్వచేసి రాత్రి వేళల్లో తమ ‘కస్టమర్ల’కు అందజేస్తున్నట్లు సమాచారం. గ్యాస్ దందా ఇలా... గ్యాస్ సిలిండర్ల అక్రమ దందాలో డెలివరీ బాయ్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పలువురు డెలివరీ బాయ్స్ తమ కుటుంబ సభ్యులు, తెలిసిన వారి పేరిట గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నట్లు తెలిసింది. ఆ కనెక్షన్ల ద్వారా రీఫిల్ బుక్ చేసుకోవడం.. వాటిని హోటళ్లు, ఇతర కమర్షియల్ అవసరాలు ఉన్న వారికి రెట్టింపు ధరకు విక్రయించి సొమ్ము చేకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ వినియోగదారు 45 రోజులు, పట్టణ వినియోగదారు 25 రోజుల తర్వాత సిలిండర్ బుక్ చేసుకోవాలని నిబంధన విధించారు. ఇదివరకు ఈ నిబంధన లేకపోవడంతో ఇష్టారాజ్యంగా బుక్ చేసుకోవడం.. సిలిండర్లు పొందడం.. ఎక్కువ ధరకు అమ్ముకోవడం పరిపాటిగా మారిపోయింది. వీరితోపాటు కొందరు వ్యక్తులు సంపాదన కోసం అనధికారిక గ్యాస్ సిలిండర్ల వ్యాపారం ఎంచుకున్నారు. వీరు కుటుంబ సభ్యులు, బంధువర్గీయుల పేరిట గ్యాస్ కనెక్షన్లు తీసుకోవడం.. తద్వారా రీఫిల్ పొంది సిలిండర్లతో పాటు లూజుగా కిలోల చొప్పున భారీ మొత్తంలో విక్రయించుకుంటున్నారు. ఇలాంటి కనెక్షన్లు వందల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. వినియోగదారులకు తప్పని పాట్లు.. అక్రమార్కులు – డెలివరీ బాయ్స్ ఇష్టారాజ్య గ్యాస్ కనెక్షన్ల ప్రభావం సాధారణ వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా సాఫీగా సాగుతున్నపుడు ఎవరికీ ఇబ్బంది ఎదురవలేదు. ప్రస్తుతం యుద్ధం నేపథ్యంలో సరఫరా మందగించడం.. ఆన్లైన్ బుకింగ్ మొరాయించడంతో సిలిండర్లు దొరక్క పడరాని పాట్లు పడుతున్నారు. అక్రమార్కులు– డెలివరీ బాయ్స్ చాకచక్యంగా వారి కనెక్షన్ల పేరిట బుకింగ్ చేసుకోవడంతో పాటు సాధారణ వినియోగదారులకు కేటాయించిన రీఫిల్ను కూడా బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వినియోగదారులకు ఆలస్యంగా సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ఎత్తితే ఒట్టు.. ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు బిల్ జనరేట్ అయినా గ్యాస్ సిలిండర్ సకాలంలో డెలివరీ కావడం లేదు. వినియోగదారులు డెలివరీ బాయ్స్కు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. రోజుల తరబడి ఫోన్ రింగ్ అవుతున్నా ఎత్తడం లేదు. యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత కారణంగా ఒత్తిడితో ఎత్తడం లేదేమో అని సరిపెట్టుకుంటున్నారు. దీన్నే అదునుగా చేసుకున్న ‘బాయ్స్’ వారికి కేటాయించిన సిలిండర్లను తమకు కావలసిన వారికి సర్దుబాటు చేస్తున్నారు. ఒక వేళ ఫోన్ ఎత్తితే ఒక వారం ఆగండి వస్తుంది అంటూ సెలవిస్తున్నారు. వంట గ్యాస్ పక్కదారి.. డెలివరీబాయ్స్, అక్రమార్కుల దందా హోటళ్ల నిర్వాహకులతో కుమ్మక్కు సిలిండర్ రూ.2,500 వరకు విక్రయం విజిలెన్స్ దాడులతో వెలుగులోకి బాగోతం -
అరటి రైతుల కష్టాలు కనిపించలేదా?
అనంతపురం అర్బన్: ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరటి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని రైతులు నిలదీశారు. అరటి రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో అరటి గెలలు, బోదెలతో శనివారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ యుద్ధం నేపథ్యంలో అరటి పంట ఎగుమతులు నిలిచిపోయాయన్నారు. దీంతో ధర పతనమై రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. 20 రోజుల క్రితం అరటి టన్ను రూ.22 వేల నుంచి రూ.25 వేలు ధర పలికిందన్నారు. ప్రస్తుతం టన్ను ధర ఐదారు వేల రూపాయలకు పడిపోయిందన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని, ధరలు లేకపోతే గిట్టుబాటు ధర కల్పిస్తాంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో గొప్పలు చెప్పారన్నారు. క్షేత్రస్థాయిలో అరటి రైతులు నష్టపోతుంటే మాత్రం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి టన్ను రూ.25 వేలతో అరటి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు అరటి, బొప్పాయి, మొక్కజొన్న, మామిడి, తదితర పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్పయాదవ్, నాయకులు వన్నారెడ్డి, నారాయణస్వామి, రామకృష్ణ, వెంకటరాముడు, రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు. నేడు ‘కడపటి యుద్ధం’ ఆవిష్కరణ అనంతపురం కల్చరల్: విలక్షణ రచయిత బండి నారాయణస్వామి కలం నుంచి జాలు వారిన ‘కడపటి యుద్ధం’ నవల ఆదివారం ఆవిష్కరణ కానుంది. స్పందన అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్ వేదికగా జరిగే ఈ కార్యక్రజుమానికి ప్రజాకవి గోరేటి వెంకన్న, భూమన్, లక్ష్మీనరసయ్య, నాగోలు కృష్ణారెడ్డి హాజరు కానున్నారు. -
నేత్రపర్వం... లంకా దహనం
● కసాపురంలో ముగిసిన ఉగాది ఉత్సవాలు... గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఉగాది ఉత్సవాలు శనివారం ముగిశాయి. శనివారం సాయంత్రం నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పల్లకీపై ఊరేగిస్తూ అనుబంధ దేవాలయమైన కాశీవిశ్వేశ్వరాలయం వరకూ తీసుకెళ్లారు. అక్కడ ఈఓ ఎం.విజయరాజు, సిబ్బంది ఆధ్వర్యంలో కాశీవిశ్వేశ్వరుడికి పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని ఒంటె వాహనంపై కొలువుదీరిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణానికి చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లంకాదహనం వేడుకను ప్రారంభించారు. తిరిగి అక్కడ నుంచి ఊరేగింపుగా ఆలయం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి చేరుకుని అక్కడ లంకాదహనం వేడుకలను నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ వేడుకను చూసేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. లంకా దహనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఆలయ సిబ్బంది ఒంటె వాహనంపై కొలువు దీరిన నెట్టికంటి ఆంజనేయస్వామి -
కష్టాల్లో అరటి రైతులు
● భారీగా అరటి ధరల పతనం ● ఈదురుగాలులకు నేలవాలిన చెట్లు ● రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు సర్కారు అనంతపురం అగ్రికల్చర్: అరటి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక వైపు ధరల్లేక దిక్కులు చూస్తుంటే.. మరోవైపు ఈదురుగాలులకు తోటలు నేలవాలుతుండటంతో నష్టాలు రెట్టింపవుతున్నాయి. కోతకు వచ్చిన నాణ్యమైన మొదటి పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. టన్ను రూ.20 వేలకు పైగా ఉండాల్సిన ధర ఒక్కసారిగా నేలచూపు చూడటంతో టన్ను రూ.5 వేల నుంచి రూ.7 వేల మధ్యనే విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ● గత నవంబర్లోనే రెండో పంటను అమ్ముకోలేక ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాది మొదటి పంటకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నాలుగు రోజులుగా 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పలు మండలాల్లో అరటి తోటలు నేలవాలాయి. ఉద్యానశాఖ అధికారులు మాత్రం 33 శాతం దెబ్బతింటేనే నష్టం నమోదు చేస్తున్న పరిస్థితి. ఇలా పది మండలాల్లో 120 హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతినడంతో రూ.4.10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. అరటి తోటలకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే మరికొన్ని కూరగాయల పంటలు దెబ్బతినడంతో రూ.ఒక కోటి, మొక్కజొన్న, వరి పంటల నష్టం రూ.రెండు కోట్ల వరకు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అరటి తోటల రైతులకు ఈ ఏడాదీ కలిసిరాక పెట్టుబడులు కూడా దక్కించులేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు అరటి రైతుల గురించి ఆలోచించే తీరికలేకపోయింది. ఉద్యానశాఖ మాత్రం మొక్కుబడిగా నష్టం అంచనాలు వేసి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొంది. -
పది మంది భక్తులకు అస్వస్థత
గుంతకల్లు రూరల్: కలుషితాహారం తినడం వల్ల పది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. బాధితుల కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా మొలకాల్మూరు తాలూకా అశోక సిద్ధాపురం గ్రామానికి చెందిన దాదాపు 45 మంది భక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈనెల 19న కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో వసతి గదులు దొరక్క పోవడం, బయట అద్దె గదుల ధర భారీగా ఉండటంతో దిక్కుతోచని భక్తులు ఆలయం వెలుపలే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గడిచిన రెండురోజులుగా వారు ఆలయ కేసరి సదనం ముందు భాగంలో సొంతంగా వంట వండుకొని తింటూ, రాత్రి ఆరుబయటే బస చేస్తున్నారు. శుక్రవారం పాయసంతోపాటు, అన్నం, సాంబర్, వంకాయ కూర వండుకున్నారు. రాత్రికి అన్నం మాత్రమే వండుకొని ఉదయం చేసిన కూరలతో తిన్నారు. అర్ధరాత్రి కడుపునొప్పితో కూడిన వాంతులు, విరేచనాలు ఒకరి తరువాత మరొకరికి మొదలయ్యాయి. కొద్దిసేపటి వ్యవధిలోనే అస్వస్థతకు గురికావడంతో దాదాపు 10 మందిని వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు కూడా ఆస్పత్రికి చేరుకొని చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. విద్యార్థిని బలిగొన్న ఈత సరదా వజ్రకరూరు: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. వజ్రకరూరు మండలం పీసీపీ కొత్తకోట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన చిన్న మాదుల రాజేష్, సోమావతి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి చిన్న కుమారుడు అరుణ్తేజ్ (13) స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో మరో నలుగురు విద్యార్థులతో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి గ్రామానికి సమీపంలో ఉన్న సొంత పొలానికి అరుణ్తేజ్ వెళ్లాడు. కాసేపు ఆడుకున్న తర్వాత స్నేహితులతో కలిసి బావిలో ఈత కొడుతూ నీటి అడుగు భాగానికి వెళ్లిన అరుణ్తేజ్ ఎంత సేపటికీ పైకి రాలేదు. దీంతో కంగారు పడిన స్నేహితుల కేకలు విన్న కుటుంబసభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని బావిలో దూకి గాలింపు చేపట్టారు. నీటి అడుగున పూడికలో ఇరుక్కుపోయిన అరుణ్తేజ్ను వెలికి తీసి ఆగమేఘాలపై ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అరుణ్తేజ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రాజ్కుమార్, ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత
కళ్యాణదుర్గం రూరల్: టీడీపీ సీనియర్ నేత, కళ్యాణదుర్గం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. శనివారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం ఎర్రంపల్లిలోని స్వగృహానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, కాంగ్రెస్ నేత ఎన్.రఘువీరారెడ్డి తదితరులు ఎరరంపల్లికి చేరుకుని ఉన్నం హనుమంతరాయచౌదరి పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉన్నం కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
కూడేరు: ఉగాది పండుగ నేపథ్యంలో కూడేరు మండలం కొర్రకోడులో గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు పోటాపోటీగా సాగాయి. 14 జతల వృషభాలను పోటీకి రైతులు తీసుకువచ్చారు. బొమ్మనహళ్ మండలం గోవిందవాడ గ్రామ రైతు గురుస్వామి వృషభాలు ప్రథమ స్థానంలో నిలవగా, అదే గ్రామానికి చెందిన రైతు నరసింహులు వృషభాలు ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. మూడో స్థానంలో విడపనకల్లు మండలం పెంచలపాడుకు చెందిన రైతు భీమలింగ వృషభాలు, నాల్గో స్థానంలో బొమ్మనహళ్ మండలం లింగాదహళ్కు చెందిన వృషభాలు, ఐదో స్థానంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ రైతు మస్తానయ్య వృషభాలు, ఆరో స్థానంలో పత్తికొండ మండలం పులికొండ గ్రామ రైతు మాధవరాజులు వృషభాలు, ఏడో స్థానంలో వజ్రకరూరు మండలం ధర్మపురికి చెందిన రైతు అజిత్కుమార్ వృషభాలు, ఎనిమిదో స్థానంలో బొమ్మనహళ్ మండలం ఉద్దేహళ్కు చెందిన బసన్న వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు. -
అంగరంగ వైభవం.. అంజన్న రథోత్సవం
●భక్తులతో పోటెత్తిన మురడిడి.హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆంజనేయస్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం వైభవంగా సాగింది. దివ్య స్వరూపుడి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. రథం వద్ద మహిళలు పొర్లుదండాలతో మొక్కు తీర్చుకున్నారు. యువకుల నందికోలు నాట్యం, కోలాటం, చెక్కభజన వంటివి ఆకట్టుకున్నాయి. స్వామివారి ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆంజనేయస్వామి ఆలయం వద్ద లంకా దహనం నిర్వహించనున్నారు. –డి.హీరేహాళ్(రాయదుర్గం): -
దెబ్బతిన్న పంటల పరిశీలన
శెట్టూరు: అకాల వర్షాల కారణంగా మండలంలో దెబ్బతిన్న పంటలను శుక్రవారం కేవీకే కో–ఆర్డినేటర్ చెన్నరాయుడుతో పాటు శాస్త్రవేత్తలు, వ్యసాయ అధికారులు పరిశీలించారు. శెట్టూరు, అయ్యగార్లపల్లి, కనుకూరు గ్రామాల్లో గాలీవానకు దెబ్బతిన్న మొక్కజొన్న, బీర, మామిడి తోటలను పరిశీలించారు. దెబ్బతిన్న పంటలను రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టంపై నివేదికలను ఉన్నతాధికారులకు నివేదిస్తారన్నారు. అనంతరం మామిడిలో చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యలను రైతులకు కేవీకే శాస్త్రవేత్తలు మల్లికార్జున, శిరీష వివరించారు. మామిడిలో పూత, పిందె రాలిపోతున్న సమస్య నివారణకు ప్లానోఫిక్స్, 19:19:19 ను పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వాసుకీరాణి, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ముదిగల్లు సమీపంలో చిరుత కళ్యాణదుర్గం: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామ సమీపంలోని కంకర మిషన్ వద్ద ఉన్న ఓ గుట్టపై శుక్రవారం సాయంత్రం చిరుతలు సంచారించాయి. గుట్టకు ఆనుకుని పలువురు నివాసం ఉంటున్నారు. చిరుతను గమనించిన వారందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చిరుతల సంచారంపై పలుమార్లు అటవీ శాఖ అధికారులకు విన్నవించినా వాటిని బంధించే చర్యలు చేపట్టలేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి చిరుతలను బంధించాలని కోరుతున్నారు. -
కనుల పండువగా సిరిమాను ఉత్సవం
యల్లనూరు: మండలంలోని కొడవండ్లపల్లిలో వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ శుక్రవారం పెద్దమ్మ సిరిమాను ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిమ్మంపల్లి తిమ్మమ్మ గుడి నుంచి పెద్దమ్మ గుడి వరకూ ఎద్దుల బండిపై సిరిమానును ఊరేగింపుగా తీసుకువచ్చారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, రమాదేవి దంపతులు, కుమారుడు కేతిరెడ్డి సాయి ప్రతాప్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ సిరిమాను ఉత్సవాన్ని పెద్దారెడ్డి ప్రారంభించారు. 70 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున జంతు బలులతో మొక్కులు తీర్చుకున్నారు. కొడవండ్లపల్లి పెద్దమ్మ ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసింది. తిమ్మంపల్లి తిమ్మమ్మగుడి వద్ద, కొడవండ్లపల్లి పెద్దమ్మ గుడి వద్ద హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. చింతకాయమందలో పెద్దమ్మ, అంకాలమ్మ, యల్లనూరులో పెద్దమ్మ, చిలమకూరులో యల్లమ్మ ఆలయాల వద్దనూ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. 70 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో వేడుక పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి -
యువకుడిపై టీడీపీ నేతల దాడి
ఉరవకొండ రూరల్: మండలంలోని రేణుమాకులపల్లిలో టీడీపీ నేతలు బరితెగించారు. ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సర్ది చెప్పేందుకు వెళ్లిన యువకుడిపై దాడి చేసి తమ పైశాచాకాన్ని చాటుకున్నారు. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... చిన్నపాటి విషయానికి రేణుమాకులపల్లికి చెందిన దివ్యాంగులతో శుక్రవారం సాయంత్రం టీడీపీ నేతలు గొడవపడ్డారు. ఏకపక్షంగా దివ్యాంగులపై సాగుతున్న దౌర్జన్యాన్ని గమనించిన ఆ గ్రామ సర్పంచ్, వైఎస్సార్సీపీ మద్దతుదారుడు బోయ రామాంజనేయులు కుమారుడు మణి వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో టీడీపీ నేతలు మరింత రెచ్చిపోయి మణిపై కట్టెలతో దాడి చేశారు. తలకు బలమైన గాయాలు కావడంతో మణిని కుటుంబసభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. తండ్రి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. -
నేత్రపర్వంగా నెట్టికంటుడి రథోత్సవం
గుంతకల్లు రూరల్: ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ పురవీధులు పోటెత్తాయి. ఆంజనేయ రక్షమాం.. పవన పుత్ర పాహిమాం అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం పొందారు. శుక్రవారం వేకువజామునే నెట్టికంటి ఆంజనేయస్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పుష్పాలతో అలకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం ఎదుట రథాన్ని నిలిపి రథాంగహోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేసి ఆలయ పురవీధుల్లో భక్తులు లాగారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మరూరు జయరాం కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ పర్యవేక్షించారు. -
హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన
యాడికి: ఉగాది పండుగ సందర్భంగా యాడికి మండలం రాయలచెరువులోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలకు 14 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. ప్రథమ స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకట సుబ్బారెడ్డి వృషభాలు నిలిచాయి. ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్పల్లి రైతు నాగయ్య వృషభాలు, తృతీయ స్థానంలో వైఎస్సార్ కడప జిల్లా అక్కంపేట గ్రామ రైతు ఆదిల్ వృషబాలు, నాల్గో స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకటసుబ్బారెడ్డి రెండో జత వృషబాలు, ఐదో స్థానంలో గార్లదిన్నె మండలానికి చెందిన రైతు రామాంజనేయులు వృషభాలు, ఆరో స్థానంలో తాడిపత్రిలోని గన్నేవారిపల్లి రైతు రమేష్బాబుయాదవ్ వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో కొండుపల్లి చిలమకూరు జయప్రకాష్, ముత్తలూరు నరేష్ చౌదరి, న్యూ వికాష్ స్కూల్ రామకృష్ణ, జొన్నల వ్యాపారి పెద్దన్న, రాజ పుల్లయ్య, రంగస్వామి, నాగరంగయ్య, మదమంచి శివప్రసాదనాయుడు సత్యరించారు. నిరుద్యోగ యువతకు దగా అనంతపురం అర్బన్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను చంద్రబాబు ప్రభుత్వం దగా చేస్తోందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు. స్థానిక ఆ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో కేవలం 10 వేల ప్రభుత్వ ఉద్యోగాలను చూపించడం యువతను మభ్యపెట్టే మరో ప్రయత్నమేనని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో భర్తీ చేయకుండా తక్కువ సంఖ్యలో పోస్టులను ప్రకటించడం దారుణమన్నారు. మొక్కుబడిగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన హామీని రెండేళ్లవుతున్నా అమలు చేయలేదని విమర్శించారు. సమగ్ర నియామక ప్రణాళికతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
తప్పని గ్యాస్ తిప్పలు
శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026వినియోగదారులు ఆందోళన చెందొద్దు : కలెక్టర్ అనంతపురం ఎడ్యుకేషన్: గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెంద వద్దని, సరిపడు గ్యాస్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి సకాలంలో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. శుక్రవారం ఆయన అనంతపురం రూరల్ మండలం ఆలమూరు వద్దనున్న ఉమా భారతి ఇండేన్ గ్యాస్ గోడౌన్, నగరంలోని ఏిపీహెచ్బీ కాలనీలోని పావన్ గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేశారు. వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని, ఓటీపీ ద్వారా డెలివరీ చేస్తారని చెప్పారు. ఏజెన్సీల వద్దకు వెళ్లి బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఎవ్వరూ ఏజెన్సీల వద్దకు రావద్దని స్పష్టం చేశారు. ఇంటి వద్దనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తారన్నారు. రాయదుర్గంటౌన్/ కూడేరు: వినియోగదారులను వంటగ్యాస్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా మందగించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వంటింటి కష్టాలు మొదలయ్యాయి. ఆన్లైన్ బుకింగ్ ముప్పుతిప్పలు పెడుతోంది. శుక్రవారం రాయదుర్గంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రీఫిల్ కోసం క్యూలో పడిగాపులు కాసినా ప్రయోజనం లేకపోయింది. స్టాక్ లేదంటూ బోర్డు పెట్టారు. ఆదివారం స్టాక్ వస్తుందని తెలపడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇక కూడేరులోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్దకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వినియోగదారులు పోటెత్తారు. ఖాళీ సిలిండర్లను క్యూలో పెట్టి గంటల తరబడి ఎండలోనే నిల్చున్నారు. కొందరికి మాత్రమే సిలిండర్లు అందడంతో మిగిలిన వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారందరికీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. రంజాన్కు సర్వం సిద్ధం అనంతపురం కల్చరల్: సత్య నిష్ట, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాసాలతో పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో శనివారం పండుగ జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. జిల్లా అంతటా రంజాన్ వేడుకలకు మసీదులు, ఈద్గాలలో ఏర్పాట్లు చేశారు. నెలరోజుల ఉపవాస దీక్షల్లో చివరిరోజు శుక్రవారం ఇఫ్తార్ వేళ మసీదులన్నీ ముస్లింలతో రద్దీగా మారాయి. ● ముస్లింలకు కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ కృపాకటాక్షాలతో పాడిపంటలతో జిల్లా సుభిక్షంగా ఉండాలని, అందరి ఇళ్లలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ముస్లింలకు ‘అనంత’ రంజాన్ శుభాకాంక్షలు అనంతపురం: ముస్లింలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని.. మనిషిలోని చెడు భావనలు, అధర్మం, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగని పేర్కొన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ అని తెలిపారు. -
వ్యక్తి ఆత్మహత్య
గుత్తి: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని సీపీఐ కాలనీకి చెందిన రమేష్ (40) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు ప్రాధేయపడడంతో ఇటీవల మద్యం తాగడాన్ని పూర్తిగా మానేశాడు. అయితే స్వీయ నియంత్రణ కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో కుటుంబసభ్యులు అతన్ని ఇంటి నుంచి బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరికి తెలియకుండా బయటపడిన రమేష్ నేరుగా తురకపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుని అప్పటికే పట్టాలపై వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, రమేష్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. -
నేటి ‘పది’ పరీక్ష ఏప్రిల్ 2కు వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్: రంజాన్ పండుగ నేపథ్యంలో శనివారం పదో తరగతి విద్యార్థులకు జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్ష (13ఈ, 14ఈ)ను ప్రభుత్వ వాయిదా వేసిందని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తన చాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్ష ఏప్రిల్ 2న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షకులు పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకుని పరీక్ష సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. నేటి ఓపెన్ స్కూల్ పరీక్షలు 30కు వాయిదా ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం 211–గణితం, 223–భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు ఈనెల 30కు వాయిదా వేసినట్లు డీఈఓ తెలిపారు. ఆరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలు రాయనున్న అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్ పాల్గొన్నారు. -
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
● మాజీ మంత్రి శైలజానాథ్ శింగనమల: అకాల వర్షాలతో పంట నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. పంటలు చేతికి అందే సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్ర నష్టాలను చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఉదారంగా స్పందించి రైతులకు మంచి జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందించాలన్నారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెడుతున్నారన్నారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, ఉద్యానపంటలు చేతికి అందే సమయంలో పూర్తిగా దెబ్బతిన్నట్లు వివరించారు. కనీసం పంట కోత ఖర్చులు కూడా చేతికి అందే పరిస్థితి లేదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం అంచనాలను శాసీ్త్రయంగా రూపొందించాలని అధికారులను కోరారు. పంటను బట్టి ఎకరాకు కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు తక్షణ సాయం అందించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతుల పాత రుణాలను రీషెడ్యూల్ చేయడంతో పాటు తదుపరి పంట సాగుకు వడ్డీలేని కొత్త రుణాలను మంజూరు చేయాలన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో రైతులకు పరిహారం అందేలా చూడాలని, లేకుంటే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. -
ఆర్డీటీ కోసం ఊపందుకున్న ఉద్యమం
● 20 వేల పోస్టుకార్డులు వితరణ చేసిన డాక్టర్ వసంత్ కళ్యాణదుర్గం: ఆర్డీటీని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమానికి పలువురు తమ వంతు సాయంగా చేయూతనందిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బ్రహ్మసముద్రం మండలానికి చెందిన ఆర్ఎంపీ వసంత్ 20 వేల పోస్టుకార్డులను డాక్టర్ తలారి రంగయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ... ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఆర్డీటీ ఆవశ్యకతను వివరించినట్లు గుర్తు చేశారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం చేపట్టిన లక్ష పోస్టు కార్డుల ఉద్యమంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్రహ్మసముద్రం, శెట్టూరు మండలాల వైఎస్సార్సీపీ కన్వీనర్లు పాలబండ్ల చంద్రశేఖరరెడ్డి, ఎంఎస్ హనుమంతరాయుడు, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, వికలాంగుల విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పాతలింగ, ఎనుములదొడ్డి సర్పంచ్ విజయ్, నాయకులు మల్లాపురం మల్లి, హుళికల్లు మల్లి, నాగిరెడ్డిపల్లి మారుతి, మాకొడికి నాగేంద్రతో పాటు పలువురు సానుభూతిపరులు పాల్గొన్నారు. -
ఏయ్.. అందరినీ లోపలేస్తా..
కళ్యాణదుర్గం: ‘ఏయ్... ఇక్కడ ప్రోగ్రాం ఎవడు పెట్టమన్నాడు.. అనుమతి ఉందా.. మీ నాయకుడికి కూడా నోటీసు ఇస్తాం.. తమాషాగా ఉందా.. ఈరోజే మీరు ప్రోగ్రాం పెట్టాలా..? చలానా కట్టారా.. ముందు ఇక్కడి నుంచి వెళ్లకపోతే అందరినీ లోపలేస్తా..’ అంటూ కళ్యాణదుర్గం పట్టణ సీఐ హరినాథ్ వైఎస్సార్సీపీ నాయకులను హెచ్చరించారు. శుక్రవారం అక్కమాంబ జాతర సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యువల్ విషయంపై వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు లక్ష పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు అక్కమాంబ ఆలయం ఎదురుగా టెంటు వేసుకుని సంతకాల సేకరణ చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ హరినాథ్, రూరల్ సీఐ గణేష్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ‘సంతకాల సేకరణ కార్యక్రమానికి అనుమతి లేదం’టూ నానా యాగీ చేశారు. ఇది పేద ప్రజల కోసం, కళ్యాణదుర్గం ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడిన ఆర్డీటీ సంస్థను కాపాడుకునేందుకు అంటూ వైఎస్సార్సీపీ నాయకులు ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. జాతరకు వచ్చే ప్రజల్లో టీడీపీపై వ్యతిరేకత వస్తుందన్న భయంతో టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు ప్రజా కార్యక్రమాన్ని అడ్డుకోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. కాగా జాతరకు ఆటంకం కలిగిస్తున్నారన్న నెపంతో వైఎస్సార్సీపీ నాయకులు రామాంజినేయులు, భట్టువానిపల్లి అంజి, మల్లాపురం మల్లికార్జునలను పోలీసు స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అడ్వకేట్ హనుమంతరెడ్డి, సీనియర్ నాయకులు గోపారం శ్రీనివాసులు, తిరుమల వెంకటేశులు, మండల కన్వీనర్లు గోళ్ళ సూరి, గొల్ల హనుమంతరాయుడు, నాయకులు రామాంజినేయులు, మల్లాపురం మల్లి, పాతలింగ, భాస్కర్, చరణ్, రామిరెడ్డి, దేవ, పాండు, జానీ, మల్లికార్జున పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమం కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసుల నానాయాగీ ఆర్డీటీ పరిరక్షణ కోసం సంతకాల సేకరణ అని చెప్పినా వినకుండా అడ్డంకులు -
●తల్లడిల్లిన కన్నప్రేమ..
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు రాయదుర్గంటౌన్: రైలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు... రాయదుర్గంలోని ముత్తరాసి ఇందిరమ్మ కాలనీ సమీపంలో నివాసముంటున్న రాముడు గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లి పట్టాలు దాటి వస్తున్న సమయంలో గూడ్స్ రైలు ఢీకొంది. ఘటనలో పట్టాల పక్కకు ఎగిరి పడిన రాముడుకు రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గుర్తించిన స్థానికులు, బంధువులు హుటాహుటిన రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తీసుకెళ్లారు. కాగా, రాముడు బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఓ కుమార్తె ఉంది. గుండెపోటుతో ఏఆర్ ఎస్ఐ మృతి పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తున్న మహేశ్వరరెడ్డి బుధవారం గుండె పోటుతో మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలానికి చెందిన ఆయన 1990లో ఏఆర్ విభాగంలో చేరారు. బుధవారం రాత్రి గుండెపోటుకు గురై కోలుకోలేక మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబసభ్యులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. గురువారం అనంతపురంలోని రుద్రంపేట బైపాస్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆర్ఐ వలి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యకుమార్, అడహక్ కమిటీ సభ్యుడు త్రిలోక్నాథ్, సిబ్బంది షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో మహిళ మృతి కూడేరు: విద్యుత్ షాక్కు గురై ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు... కూడేరు మండలం ఉదిరిపికొండకు చెందిన రామాంజనమ్మ(40)కు ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్ల క్రితమే భర్త ముత్యాలప్ప మృతి చెందాడు. వ్యవసాయ కూలి పనులతో పిల్లలను పోషించుకుంటూ వచ్చింది. ప్రస్తుతం పెద్ద కుమారుడు హరి పదో తరగతి పూర్తి చేసుకుని బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు వేణు 8వ తరగతి చదువుతున్నాడు. ఉగాది సందర్భంగా గురువారం ఉదయం రామాంజనమ్మ స్నానానికని బాత్రూమ్లోకి వెళ్లింది. బకెట్లో నుంచి హీటర్ తీసే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్కు గురైంది. ఎంత సేపటికి తల్లి బాత్రూమ్ నుంచి బయటకు రాకపోవంతో కుమారులు వెళ్లి పిలిచారు. లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తలుపులు బద్ధలుగొట్టి లోపలకు వెళ్లారు. చేతిపై, కడుపుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న తల్లిని గమనించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని పరీక్షించారు. అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించాడంతో కుమారుల వేదనకు అంతు లేకుండా పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఎల్లుట్లలో ఆగిన చెన్నకేశవస్వామి ఉత్సవం పుట్లూరు: మండలంలోని ఎల్లుట్ల గ్రామంలో ఏటా ఉగాది సందర్భంగా నిర్వహించే చెన్నకేశవస్వామి ఊరేగింపు ఈ సారి నిలిచిపోయింది. గురువారం నాడు ఉత్సవాన్ని నిర్వహించాల్సి ఉంది. ఇందు కోసం గ్రామస్తులు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా పల్లకీ మోసే వారితో పాటు డప్పు వాయిద్య కళాకారులకు భోజనం పెట్టే ఆనవాయితీని దేవదాయశాఖ అధికారులు ఆక్షేపించారు. దీంతో వివాదం నెలకొని ఉత్సవం ఆగిపోయింది. చెన్నకేశవస్వామి ఆలయానికి 28 ఎకరాల మాన్యం భూముల ద్వారా ఆదాయం ఉన్నా... దేవదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతోనే సమస్య ఉత్పన్నమైనట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. హోరాహోరీగా ఎడ్ల బండి పోటీలు విడపనకల్లు: ఉగాది సందర్భంగా విడపనకల్లు మండలం హంచన్హాళ్ గ్రామంలో గురువారం నిర్వహించిన ఎడ్ల బండి పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీల్లో దాదాపు 10 జతల ఎద్దులు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో ముస్తూరు లింగన్నకు చెందిన ఎద్దులు, ద్వితీయ స్థానంలో నాగేపల్లి రామచంద్రకు చెందిన ఎద్దులు, తృతీయ స్థానంలో నాగేపల్లి ఆంజనేయులు, నాల్గో స్థానంలో సురేష్, ఐదో స్థానంలో నాగేపల్లి శ్రీకాంత్ ఎద్దులు నిలిచాయి. విజేత ఎద్దుల యజమానుల ను అభినందిస్తూ నగదు పురస్కారాలతో సర్పంచ్ నాగేపల్లి కేశన్న, రాకెట్ల రమేష్, రాకెట్ల వన్నూరుస్వామి, గ్రామస్తులు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు భీంరావు, వన్నూరుస్వామి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆకట్టుకున్న కర్రసాము పోటీలు గార్లదిన్నె: ఉగాది పండుగ సందర్భంగా మండలంలోని పాత కల్లూరులో కర్రసాము, ఇరుసు పైకి ఎత్తే పోటీలు నిర్వహించారు. ఏటా గ్రామంలో యువకులకు గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కర్రసాము, ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. కర్రసాము పోటీల్లో ఆరుగురు పాల్గొనగా వారిలో వెంకటనరసింహ, శ్రీకర్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా వారికి రూ.4 వేలు, రూ.3 వేల నగదు బహుమతి అందజేశారు. ఇరుసు పైకెత్తే పోటీల్లో ఆరుగురు పాల్గొనగా ఉప్పరపల్లి నారాయణ, నాగిరెడ్డిపల్లి రామానంద ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వారికి రూ.6వేలు, రూ.3 వేల నగదు బహుమతి అంద జేశారు. జనం అధిక సంఖ్యలో తరలివచ్చి పోటీలను తిలకించారు. నేడు కొటిపి చౌడేశ్వరీ దేవి రథోత్సవం హిందూపురం: మండలంలోని కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వీరీదేవి అమ్మవారి రథోత్సవం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు గురువారం వెల్లడించారు. ఏటా ఉగాది పండుగ సందర్భంగా మూలవిరాట్కు ప్రత్యేకపూజలు, ప్రాకార ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే మంగళ, శుక్రవారాల్లో రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 20న రథోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను గ్రామస్తులు పూర్తి చేశారు. ఉరవకొండ: తల్లి ప్రేమకు భాష అక్కర్లేదని, పేగు బంధానికి మాటలు అవసరంలేదని ఓ మూగజీవి చాటింది. ప్రమాదంలో గాయపడిన తన బిడ్డను చూసి తల్లడిల్లుతూ కన్నీరు పెట్టిన ఓ గోమాత అందరినీ ఆశ్చర్య పరచింది. తన బిడ్డను ముద్దాడుతూ, కంటతడి పెడుతూ అక్కడే నిలిచిపోయింది. బిడ్డను వదల్లేక పోయింది. లేగదూడ చుట్టూ తిరుగుతూ విలపించిన తీరు చూసిన వారి హృదయాలు ద్రవించి పోయాయి. ఈ ఘటనతో కన్నపేగు బంధం మనుషులకే కాదు, జంతువులకూ అంతే బలంగా ఉంటుందనే విషయం మరోసారి స్పష్టమైంది. మానవ సంబంధాలు స్వార్థంతో నిండిపోతున్న ప్రస్తుత రోజుల్లో మూగజీవి ప్రేమ అచంచలమైనది అనే ఈ హృదయ విదారక దృశ్యం ఉరవకొండలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం స్థానిక ఇందిరా నగర్లో రోడ్డు పక్కన ఉన్న ఓ దూడపై కారు దూసుకెళ్లింది. రెండు కాళ్ల మీద టైర్లు పోవడంతో దూడ తల్లడిల్లి పోయింది. ఈ విషయాన్ని గమనించిన అక్కడికి సమీపంలోనే ఉన్న తల్లి ఆవు వెంటనే పరుగెత్తుకుంటూ దూడను సమీపించి పైకి లేపేందుకు ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా దూడ పైకి లేవలేకపోవడంతో కన్నీరు పెట్టింది. గమనించిన మరికొన్ని ఆవులు సైతం అక్కడకు చేరుకుని దూడను పైకి లేపేందుకు చేసిన ప్రయత్నాలు చూసిన స్థానికులు ఒక్కసారిగా చలించిపోయారు. దూడకు నీళ్లు తాపించే ప్రయత్నం చేశారు. పశువైద్య సిబ్బందిని రప్పించి దూడకు చికిత్స చేయించారు. -
రెండు దశల్లో జన గణన
● మొదటి దశలో గృహ గణన ● ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకూ సేకరణ ● రెండో దశలో జనాభా గణన అనంతపురం అర్బన్: జన గణన (2027)లో భాగంగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. మొదటి దశలో గృహ గణన ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకూ దీన్ని నిర్వహించనున్నారు. తర్వాత రెండో దశలో జనాభా గణన నిర్వహిస్తారు. జన గణన నిర్వహణలో భాగంగా మొదటి విడత గృహ గణనలో సేకరించిన వివరాలను కంప్యూటర్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా నమోదు చేయడంపై ఇప్పటికే 200 మందికి శిక్షణ ఇచ్చారు. ఇదే క్రమంలో మండల, సచివాలయ స్థాయి సిబ్బందికి మొదటి విడత శిక్షణ పూర్తి చేశారు. జన గణన ద్వారా సేకరించే గణాంకాల ఆధారంగా గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయస్థాయిలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన చేస్తారు. గృహ గణనలో... మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ (హెచ్ఎల్ఓ) చేపడతారు. గృహగణన ప్రక్రియను ఏప్రిల్ 1 నుంచి మే 31వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఇళ్లకు సంబంధించి డేటా సేకరిస్తారు. ఇంటి కట్టడం నిర్మాణం మొదలు ప్రతి వివరాన్ని నమోదు చేస్తారు. ● గుర్తించిన గృహానికి ప్రత్యేక సంఖ్య కేటాయిస్తారు. ఇంటిలో నివసించే సభ్యుల వివరాలు నమోదు చేస్తారు. ● గృహ గణనలో భాగంగా మౌలిక సదుపాయాలు, గృహోపకరణాలు నమోదు చేస్తారు. ● ఫొన్లు, ఇంటర్నెట్, వాహనాలు నమోదు చేస్తారు. ● ఇంటి కట్టడం తీరు, ఫ్లోరింగ్, తాగునీటి వినియోగం, మరుదొడ్ల వాడకం నమోదు చేస్తారు. ● విద్యుత్ వినియోగం, నెలవారీ బిల్లు, విద్యుత్తో పనిచేసే పరికరాలు (ఏసీ, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్లు, గీజర్, తదితర వివరాలను నమోదు చేస్తారు. ● సేకరించిన వివరాలను కంప్యూటర్ మెయింటేనెన్స్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎంఎంఎస్) ద్వారా నమోదు చేస్తారు. సెన్సెస్ నిర్వహణకు... జిల్లాస్థాయిలో కలెక్టర్ ప్రధాన సెన్సెస్ అధికారిగా వ్యవహరిస్తారు. అదనపు సెన్సెస్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఉంటారు. జిల్లా సెన్సెస్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి వ్యవహరిస్తారు. నగర పాలక సంస్థ, మునిసిపాలిటీల్లో కమిషనర్లు ముఖ్య సెన్సెస్ అధికారిగా ఉంటారు. మండలస్థాయిలో తహసీల్దార్లు సెన్సెస్ చార్జ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. క్షేత్రస్థాయిలో సెన్సెస్ వివరాలను సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు సేకరిస్తారు. -
ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుక
ప్రశాంతి నిలయం: సత్యసాయి మహాసమాధి చెంత గురువారం ఉగాది వేడుకలు శోభాయమానంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయికుల్వంత్ మందిరాన్ని మామిడి తోరణాలు, వేప చిగుర్లు, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. దేశవిదేశాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభించగా.. డాక్టర్ వేదాంతం రాజగోపాలచక్రవర్తి పంచాంగ శ్రవణం గావించారు. పరాభవ నామ సంవత్సర విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా వేదాంతం రాజగోపాల చక్రవర్తిని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, సభ్యుడు చక్రవర్తి ఘనంగా సత్కరించారు. అనంతరం సంగీత కచేరీతో సత్యసాయి యూత్ సభ్యులు అలరించారు. సాయంత్రం ప్రముఖ సంగీత విద్వాంసురాలు కొల్లూరు వందన బృందం సంగీత కచేరీ ఆకట్టుకుంది. -
●కాలవ.. తాగునీటి కష్టాలు కనవా!
రాయదుర్గం టౌన్: దాదాపు 75 వేలకు పైగా జనాభా ఉన్న రాయదుర్గంలో ఐదు రోజులుగా దాహం కేకలు మిన్నంటుతున్నాయి. మొత్తం 32 వార్డుల్లో బోర్లు పనిచేయడం లేదు. కేవలం రెండు ట్యాంకర్ల ద్వారా మాత్రమే మున్సిపాలిటీ అధికారులు అందజేస్తున్న నీరు ప్రజల అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ట్యాంకర్ల సంఖ్య పెంచి నీటిని సరఫరా చేయడం లాంటి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నా అధికారులు స్పందించడం లేదు. అరకొర నీటితోనే ఉగాది పండుగను జరుపుకున్న ప్రజలు... రానున్న రంజాన్, శ్రీరామనవమి పండుగలు ఎలా చేయాలో అర్థం కాక తలలు బాదుకుంటున్నారు. ప్రజల తాగునీటి కష్టాలు స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పట్టించుకోక పోవడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
●అపరిమిత దాహం.. అమిలినేనికి పట్టని వైనం
కుందుర్పి: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. అపరిమిత దాహంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నెరవేర్చకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ క్రమంలోనే కుందుర్పి మండలం జంబుగుంపల, కదరంపల్లి గ్రామాల్లో 20 రోజులుగా ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటడంతో సమస్య జఠిలమైనట్లు గ్రామస్తులు ఆంజనేయులు, మారెన్న, తిప్పేస్వామి, గోవిందు తదితరులు వాపోయారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అమిలినేని దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుగ ఉండడంతో గురువారం జంబుగుంపల పంచాయతీ అధికారులు రెండు రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా.. అవి ప్రజల అవసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. -
కసాపురంలో ఉగాది ఉత్సవాలు
● భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవం గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామునే నెట్టికంటి ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ముందు భాగంలో పంచాంగ శ్రవణం ఏర్పాటు చేశారు. కసాపురం గ్రామస్తులు మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ వేద పండితులు వారికి పరాభవ నామ సంవత్సర పంచాంగాన్ని చదివి వినిపించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఆలయ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులకు సేవా పురస్కారాలు, మెమొంటోలను అందజేశారు. తర్వాత ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను గరుడ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. పుర వీధుల్లో స్వామివారికి కొబ్బరికాయలు కొడుతూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో గురువారం రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకూ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. -
మంచి సంకల్పంతోనే విజయం
● ఉగాది వేడుకల్లో కలెక్టర్ ఆనంద్ అనంతపురం కల్చరల్: మంచి సంకల్పంతో చేసే పనులతోనే విజయం సాధించగలమని, జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి బాటలో నడిపించేందుకు అందరం శ్రమిద్దామని కలెక్టర్ ఆనంద్ అన్నారు. గురువారం ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పరాభవనామ ఉగాది ఉత్సవాలు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జరిగాయి. కలెక్టర్ ఆనంద్తో పాటు పలు శాఖల అధికారులు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. కవులు జూటూరు తులసీదాసు, సీతారామప్రసాద్, నర్సిరెడ్డి, నాగవేణి, రాఘవేంద్ర తదితరులు కవి సమ్మేళనంలో కవితా గానంతో తెలుగుదనాన్ని చాటారు. విద్యార్థుల భక్తిగీతాలాపన, శాసీ్త్రయ నృత్యాలు, జానపద నాట్యాలు అలరించాయి. వేదపండితులు సీతరామమోహన్ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో వివిధ ఆలయాలకు చెందిన అర్చక పురోహితులు ప్రసాద్, జగన్నాథమయ్య, మడకశిర పద్మనాభ భట్టార్, చాగంటి లక్ష్మణాచార్యులను నగదు బహుమతితో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ బల్లా పల్లవి, నాయి బ్రాహ్మణ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్, రజక సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్లు ఆదినారాయణ, కొండన్న, డీఆర్వో మలోల, ఎస్డీసీ ఆనంద్, టూరిజంశాఖ అధికారి జయకుమార్, ఎండోమెంట్ ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఆన్సెట్ శ్రీనివాసులు, డ్వామా పీడీ సలీం బాషా, డీఆర్డీఏ పీడీ శైలజ, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు అకాల వర్షం దెబ్బ
అనంతపురం అగ్రికల్చర్: అకాల వర్షాలు రైతులను మరింత నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. గాలి వాన బీభత్సానికి కోతకు వచ్చిన అరటి తోటలు నిలువునా కూలాయి. అలాగే తీగజాతి కూరగాయ పంటలు, వరి, మొక్కజొన్న పంటలకు కూడా తీరని నష్టం వాటిల్లింది. రెండు రోజులుగా 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అలాగే అక్కడక్కడా వడగళ్లతో కూడిన వర్షాలు నమోదు కావడంతో భారీగా పంట నష్టం జరిగింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పలు మండలాల్లో గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. నార్పలలో 46.6 మి.మీ, రాప్తాడు 36.2, బుక్కరాయసముద్రం 29, బెళుగుప్ప 28.6, గుంతకల్లు 16.2, పామిడి 15.3, కణేకల్లు 13, ఆత్మకూరు 12.2, గార్లదిన్నె 11.4, యల్లనూరు 11.2 మి.మీ వర్షం కురిసింది. 24 మండలాల పరిధిలో 8.6 మి.మీ సగటున అకాల వర్షం కురిసింది. రెండు రోజుల్లోనే జిల్లా రైతులకు రూ.5 కోట్లకు వరకు పంటనష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ● రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి వద్ద గాలివానకు దాదాపు 150 ఎకరాల్లోని అరటి తోటలు దెబ్బతిన్నాయి. రైతులకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ● కణేకల్లు మండలంలో బుధవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కణేకల్లు క్రాస్, ఆలూరు, గోపులాపురం గ్రామాల్లో అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. ● అకాల వర్షాలతో శింగనమల, నార్పల మండలాల్లో అరటి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కూడేరు: మండలంలో బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు ముద్దలాపురంలో కారు మనిషి అనే రైతుకు చెందిన ఆరు ఎకరాల్లో సాగు చేసిన అరటి పంట, కడదరకుంటలో సరోజమ్మకి చెందిన నాలుగు ఎకరాల్లోని అరటి పంట నేలకొరిగింది. అలాగే చోళసముద్రం, మరుట్ల, గొటుకూరు, జల్లిపల్లి, కలగళ్ల తదితర గ్రామాల్లో కూడా అరటికి నష్టం వాటిల్లింది. అరటి, వరి, మొక్కజొన్న పంటలకు తీరని నష్టం దాదాపు రూ.5 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా -
ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం క్రైం: దివ్యాంగ శక్తి పథకం కింద ఆర్టీసీలో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, ఏపీఐఐసీ చల్లా లక్ష్మీప్రసాద్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్, డీసీసీబీ చైర్మన్ ఎం.కేశవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్చౌదరి, కుమారస్వామి తదితరులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ... 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సదుపాయాన్ని పొందాలంటే బస్సు పాస్ గుర్తింపు కార్డు, సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలన్నారు. అలాగే అర్హులైన సహాయకులకు 50 శాతం రాయితీతో టికెట్లు జారీ చేస్తారన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు, సౌకర్యవంతమైన బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులకు 50 శాతం రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఆర్డీఓ రామ్మోహన్, ఆర్టీసీ ఇన్చార్జ్ ఆర్ఎం శ్రీలక్ష్మి, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, నగరపాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్, దివ్యాంగులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మురడిలో నేటి నుంచి ఉగాది ఉత్సవాలుడి హీరేహాళ్ (రాయదుర్గం): ప్రసిద్దిగాంచిన డి.హీరేహాళ్ మండలం మురడిలోని ఆంజనేయస్వామి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరిగే ఉగాది ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఈఓ నరసింహారెడ్డి, అర్చకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గురువారం విశేష పూజలు, పంచాగ శ్రవణం ఉంటాయి. 20న రాత్రి 7 గంటలకు ముత్యాల పల్లకీ ఉత్సవం, 21న సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, 22న లంకా దహనం కార్యక్రమంతో ఉత్సవాలు ముగించనున్నారు. వ్యక్తిపై కొడవలితో దాడియల్లనూరు: పొలానికి నీళ్లు పెట్టే విషయంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. యల్లనూరుకు చెందిన గురుభాస్కర్, పుటకాల లోకేష్ ఇద్దరూ బావబామ్మర్దులు. బుధవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ సమయంలో గురుభాస్కర్పై పుటకాల గంగయ్య, లోకేష్ వేటకొడవలితో దాడి చేశారు. ఘటనలో గురుభాస్కర్కు తీవ్ర రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. టీచర్ల సీనియార్టీ జాబితా సిద్ధంఅనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో ని ప్రభుత్వ, జెడ్పీ, కార్పొరేషన్, మునిసిపాలిటీ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు (సబ్జెక్టుల వారీగా), ప్రధానోపాధ్యాయుల సీనియార్టీ జాబితాలు సిద్ధమయ్యాయి. ‘టిస్’ ఆధారంగా జాబితాలు రూపొందించి, www. deoananatapur. blogspot. com లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ఈ జాబితాలపై అభ్యంతరాలుంటే ఈ నెల 24 తేదీలోపు (పనిదినాల్లో) డీఈఓ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. అభ్యంతరం వ్యక్తంచేసే ఉపాధ్యాయుడి పూర్తిపేరు, హోదా, మొబైల్ నంబరు, ట్రెజరీ ఐడీ వివరాలతో పాటు సీనియార్టీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలని కోరారు. గడువు మీరిన తర్వాత అందే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అభ్యంతరాలను ఫిర్యాదుల పరిష్కార కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆయా యాజమాన్యాల పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు అప్లోడ్ చేసిన టిస్ వివరాల కాపీని డౌన్లోడ్ చేసుకుని సంబంధిత డీవైఈఓ, ఎంఈఓ, హెచ్ఎంలకు మూడుసెట్లు ధ్రువీకరించి అందజేయాలని డీఈఓ సూచించారు. -
వృద్ధురాలి దుర్మరణం
గార్లదిన్నె: లారీని ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం తరిమెలకు చెందిన హుస్సేన్బీ(64) స్థానికంగానే ఉన్న జెడ్పీహెచ్ఎస్ ఎదుట తోపుడు బండిపై వివిధ రకాల పండ్లను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పండ్లను కొనుగోలు చేసేందుకని బుధవారం తెల్లవారుజామున ఆటోలో అనంతపురంలోని మార్కెట్కు బయలుదేరింది. గార్లదిన్నె మండలం ఎం.కొత్తపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న లారీ డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కకు దింపుతుండగా ఆటో డ్రైవర్ గమనించకుండా నేరుగా వెళ్లి వెనుక నుంచి ఢీకొన్నాడు. ఆటోలో ఉన్న హుస్సేన్బీ అక్కడికక్కడే మృతి చెందింది. ఆటో డ్రైవర్ ముత్యాలు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి అశ్విని మణిదీప్, ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, హుస్సేన్బీకి భర్త, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
హామీలను అమలు చేయాలి
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య డిమాండ్ చేశారు. కౌలు రైతులను ఆదుకోవాలంటూ సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట నాయకులు, రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాటమయ్య మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు నూతన కౌలు చట్టాన్ని తీసుకొస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఇప్పటికై నా నూతన కౌలు చట్టాన్ని తీసుకురావాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాల ప్రయోజనాలు కౌలు రైతులకూ అందించాలని, రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుకు సీసీఆర్సీ కార్డు లేకపోయినా పంచనామా నివేదిక ఆధారంగా బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. కౌలు రైతుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్ఓ ఎ.మలోలను కలిసి నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వీటీ రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, వర్కింగ్ అధ్యక్షుడు రాము, నాయకులు రామాంజనేయులు, హనుమంతరెడ్డి, గోపాల్, ఈశ్వరయ్య, కె.హనుమంతరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య డిమాండ్ -
కేశవా.. దాహం తీరేదెలా?
ఉరవకొండ రూరల్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. రోజుల తరబడి తాగునీరు అందకపోవడంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేసిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే గత 15 రోజులుగా తాగునీటి కోసం నానా తంటాలు పడుతున్న వ్యాసాపురం గ్రామస్తుల కష్టాలు బుధవారం వెలుగు చూశాయి. గ్రామానికి ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్ మరమ్మతులకు లోనవడంతో సమస్య ఉత్పన్నమైందని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మరమ్మతులు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పొలాల్లోని బోరు బావుల నుంచి నీటిని సేకరించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికై నా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి తాగునీటి కష్టాలు తీర్చాలని వ్యాసాపురం గ్రామస్తులు కోరుతున్నారు. -
ఒత్తిళ్లు తాళలేక యువతి ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: స్థానిక గన్నెవారిపల్లికాలనీకి చెందిన నాగసుబ్బరాయుడు కుమార్తె లక్ష్మీప్రసన్న(30) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్ట్ విధానం కింద ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న లక్ష్మీప్రసన్న కొంత కాలంగా మానసిక ఒత్తిళ్లతో సతమవుతోంది. ఈ క్రమంలో రెండు పర్యాయాలు ఆత్మహత్యాయత్నం చేసింది. పెళ్లి చేస్తే ఆమెలో మార్పు వస్తుందని భావించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గత నెల కర్ణాటకలోని కోలార్కు చెందిన విజయ్తో వివాహమైంది. ఇటీవల భర్తతో కలసి పుట్టింటికి వచ్చిన ఆమె బుధవారం కోలార్కు బయలుదేరాల్సి ఉండగా తెల్లవారుజామునే ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఫిర్యాదు మేరకు తాడిపత్రి అప్గ్రేడ్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. క్రికెట్ అంపైర్లకు ముగిసిన శిక్షణఅనంతపురం: జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ అంపైర్లకు ఆర్డీటీ స్టేడియంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం బుధవారం ముగిసింది. ఏప్రిల్లో జరగనున్న ఏసీఏ ప్యానెల్ పరీక్షకు అర్హత సాధించేందుకు వీలుగా పలువురికి శిక్షణ ఇచ్చారు. ముగింపు కార్యక్రమానికి ఏడీసీఏ కోశాధికారి జె.మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. అంపైరింగ్ చట్టాలపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీసీఏ కార్యదర్శి యుగంధర్ రెడ్డి (యోగి), సంయుక్త కార్యదర్శి ఎన్.సర్దార్, కౌన్సిలర్ హెచ్.అన్సార్ ఖాన్, అంప్లెర్ల సంఘం అధ్యక్షుడు జోసెఫ్, ఏడీసీఏ మాజీ కార్యదర్శి కె.మధు ఆచారి, సీనియర్ అంపైర్లు బాల సుబ్రమణియన్, కె.మహేష్, జి. అక్కులన్న తదితరులు పాల్గొన్నారు. కారు ఢీ – ద్విచక్ర వాహనదారుడి మృతికూడేరు: కారు ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం అరవకూరు గ్రామానికి చెందిన సదాశివారెడ్డి (38)కి భార్య భార్గవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న సదాశివారెడ్డి బుధవారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంలో కూడేరుకు వచ్చాడు. స్థానిక పోలీస్స్టేషన్ వైపుగా వెళుతుండగా అదే సమయంలో అనంతపురం నుంచి బళ్లారికి వెళుతున్న కారు ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన సదాశివారెడ్డిని స్థానికులు వెంటనే అంబులెన్స్లో అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాసేపటికి ఆయన మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి అదృశ్యంగుత్తి: స్థానిక ఆర్ఎస్లోని హోరబ్ చర్చి ప్రాంతంలో నివాసముంటున్న రంగాదేవి, రాజేష్ కుమార్ దంపతుల కుమారుడు రోహిత్ కుమార్ కనిపించకుండా పోయాడు. స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రోహిత్కుమార్ను మంగళవారం చిన్నపాటి విషయంలో తల్లిదండ్రులు మందలించారు. దీంతో అదే రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. -
ఉగాది సందడి
అనంతపురంలోని తాడిపత్రి బస్టాండ్లో పండుగ సరుకుల కొనుగోలుదారులతో కిక్కిరిసిన దృశ్యం అరటి, మామిడి ఆకులు, వేపపూత కొంటున్న ప్రజలుఅనంతపురం కల్చరల్ : జిల్లా అంతటా ఉగాది సందడి నెలకొంది. విశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు చెపుతూ ‘పరాభవ’కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. సంవత్సరాది తొలి పంటలతో మమేకమై షడ్రుచుల సమ్మేళనంగా పలకరించనుంది. మామిడి, అరటి ఆకులు, వేపపూత, పూలు, పండ్లు, కూరగాయలు, వస్త్ర కొనుగోళ్లతో అనంతపురంలోని దుకాణాలు కిటకిటలాడాయి. పండుగ వేళ ఆలయాలు శోభాయమానంగా ముస్తామయ్యాయి. ప్రత్యేక పూజలు– కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేశారు. -
ముగిసిన ఇంటర్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ప్రశాంతంగా ముగియడంతో ఇంటర్ బోర్డు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చివరి రోజు ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పరీక్ష జరిగింది. జనరల్ విద్యార్థులు 16,409 మందికి గాను 16,162 మంది హాజరయ్యారు. 247 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనరు, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణనాయక్ నాలుగు కేంద్రాలను పరిశీలించారు. అలాగే డీవీఈఓ ఎస్వీఎస్ గురువయ్యశెట్టి మూడు, కమిటీ సభ్యులు 9, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు 6, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 10 కేంద్రాలను తనిఖీలు చేశారు. రేకుల షెడ్డులో పరీక్షలు.. : అనంతపురం నగర శివారు గుత్తిరోడ్డులోని నలంద జూనియర్ కళాశాల కేంద్రంలో రేకుల షెడ్డులో విద్యార్థులకు పరీక్షలు రాయించడంతో వేడిసెగకు అల్లాడిపోయారు. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం పబ్లిక్ పరీక్షలను ఎట్టి పరిస్థితిలోనూ రేకుల షెడ్లలో నిర్వహించరాదు. పక్కా భవనాల్లోనే నిర్వహించాలి. ఆనందంతో ఊళ్లకు.. : నగరంలో రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ హాస్టళ్లు, ప్రైవేట్ హాస్టళ్లు, అద్దె గదులు, బంధువుల ఇళ్లల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు చివరి రోజు పరీక్ష ముగియగానే లగేజీ సర్దుకుని ఆనందంగా సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆర్టీసీ బస్టాండు కిటకిటలాడింది. -
పిచ్చికుక్క దాడి... 15 మందికి గాయాలు
రాయదుర్గంటౌన్: స్థానిక లక్ష్మీబజార్లోని కణేకల్లు మార్గంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. మంగళవారం మధ్యాహ్నం రుచి హోటల్ వద్ద నుంచి బాలాజీ టీ పాయింట్ వరకూ ఎదురు పడిన దాదాపు 15 మందిపై దాడి చేసి కరిచింది. బాధితుల్లో అందరూ పెద్దవాళ్లే ఉన్నారు. కాళ్లు, చేతులపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. గాయపడిన వారిలో పట్టణానికి చెందిన వారితోపాటు పరిసర గ్రామాల నుంచి వచ్చిన వారున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొంది ఇళ్లకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీంద్రయాదవ్ వెంటనే స్పందించి పిచ్చికుక్కను బంధించేందుకు సిబ్బందిని పంపించారు. గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహం రాప్తాడు రూరల్: రోజురోజుకూ పెంచుతున్న వంట గ్యాస్ ధరలు తగ్గించి, బుకింగ్ చేసి ప్రతి ఒక్కరికీ సకాలంలో సిలిండర్లు సరఫరా చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం రాప్తాడులో మహిళు ఆందోళన చేపట్టారు. ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యిలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమాఖ్య నియోజకవర్గ కార్యదర్శి గౌని శారద మాట్లాడుతూ.. వంటగ్యాస్ మహిళల నిత్య జీవితంలో అత్యంత అవసరమైందన్నారు. గ్యాస్ లేకుండా రోజువారీ జీవనం కష్టమవుతోందన్నారు. సిలిండర్ బుకింగ్ సమయంలో సర్వర్ సమస్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బుకింగ్ చేసిన తర్వాత కూడా సిలిండర్ రావడానికి 3–4 రోజులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డెలివరీ సమయంలో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే గ్యాస్ ధరలను తగ్గించి, సకాలంలో సరఫరా చేయాలని, అదనపు డబ్బు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకులు శేషమ్మ, తులసమ్మ, ప్రశాంతి, రసూల్బీ, సుజాత, ఓబులమ్మ, చిట్టెమ్మ, రమీజా, కుళ్లాయమ్మ, మాధవి, ముత్యాలమ్మ, రేష్మ, రామాంజనమ్మ, భాగ్యమ్మ, ఆచారమ్మ పాల్గొన్నారు. 18 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం పామిడి: మండలంలోని ఎద్దులపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 18 వంట గ్యాస్ సిలిండర్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో గ్రామంలోని బసవరాజు కుమారుడు వీరభద్రప్ప తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 18 గ్యాస్ సిలిండర్లను గుర్తించి, సీజ్ చేశారు. వీరభద్రప్పపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో సీఎస్డీటీ కంబక్క, వీఆర్వో భాగ్య పాల్గొన్నారు. జీజీహెచ్లో ఇరువర్గాల ఘర్షణ అనంతపురం: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మంగళవారం ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని పరస్పరం దాడులు చోటు చేసుకున్నాయి. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన అన్నదమ్ముల మధ్య భూ వివాదం నెలకొనడంతో మంగళవారం అక్కడ దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన అనసూయ గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అప్పటికే అక్కడ ఉన్న మరో వర్గానికి చెందిన వారు ఆమైపె మరోసారి దాడికి పాల్బడ్డారు. ఆ సమయంలో ఇరు వర్గాల వారు రెచ్చిపోయి పరస్పరం చెప్పులతో దాడి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
రైతు కష్టం బుగ్గిపాలు
బొమ్మనహాళ్: మండలంలోని ఉంతకల్లులో దుండగుల అరాచకానికి ఓ రైతు కష్టం బూడిదైంది. ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహూతైంది. స్థానికులు తెలిపిన మేరకు... ఉంతకల్లులోని ఆర్డీటీ కాలనీకి చెందిన రైతు హెచ్.పరశురామ్ తనకున్న 6 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. ఎకరాకు సుమారు 30 క్వింటాళ్ల దిగుబడులు సాధించాడు. కోతల అనంతరం కంకులను పొలంలోనే రాసిగా నిల్వ చేశాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మొక్కజొన్న కంకులన్నీ కాలి బూడిదయ్యాయి. మార్కెట్లో క్వింటా ధర రూ.2 వేలు ఉండటంతో దాదాపు రూ.3.60 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ఘటనపై బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. -
కారు ఢీకొని వృద్ధుడి మృతి
రాప్తాడు రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డికి చెందిన దాసరి రామకృష్ణ (65), నారాయణస్వామి మంగళవారం ద్విచక్ర వాహనంపై 44వ జాతీయ రహదారిపై పామురాయికి వెళుతుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. బైక్పై వెనుక కూర్చొన్న రామకృష్ణ ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గోవా మద్యం బాటిళ్లు స్వాధీనం తాడిపత్రి టౌన్: మండలంలోని చుక్కలూరు వద్ద ఎకై ్సజ్ అధికారులు మంగళవారం చేపట్టిన వాహనాల తనిఖీల్లో గోవా నుంచి మద్యం బాటిళ్లతో వస్తున్న కారు పట్టుబడింది. వాహనాన్ని అధికారులు సీజ్ చేసి, 36 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న యాడికి మండలం రామరాజుపల్లికి చెందిన పైలా కొండారెడ్డి పరారీ కాగా, రఫీ వలి పట్టుబడ్డాడు. పరారీలో వున్న కొండారెడ్డి కోసం గాలిస్తున్న అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు గడ్డం నాయుడు, జయనాథరెడ్డి పాల్గొన్నారు. -
కసాపురంలో రేపటి నుంచి ఉగాది ఉత్సవాలు
● ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో గురువారం నుంచి పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భారీగా తరలి రానున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వేసవి దృష్ట్యా భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు నిరంతర విద్యుత్ సరఫరా, గుంతకల్లు మున్సిపాలిటీ నుంచి తాగునీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్లు, ప్రత్యేక ప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తుల కాలక్షేపం కోసం రోజూ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. 19న గ్రామోత్సవం ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న గ్రామోత్సవం ఉంటుంది. సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువుదీర్చి ఆలయం వద్ద నుంచి శమీ వృక్షం వరకూ ఊరేగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ముఖ మంటపం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పంచాంగ శ్రవణం ఉంటుంది. 20న రథోత్సవం ఈ నెల 20న స్వామి వారి రథోత్సవం ఉంటుంది. ఆలయ ప్రధాన గోపురం ఎదుట రథాంగ హోమం, సంప్రోక్షణ, బలిహరణ తదితర పూజల అనంతరం విశేష పుష్పాలంకరణలో తీర్చిదిద్దిన సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను రథంలో కొలువుదీర్చి పురవీధుల్లో భక్తులు లాగనున్నారు. 21న లంకాదహనం ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21న లంకాదహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటలకు ఒంటె వాహనంపై కొలువుదీరిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఆలయ సమీపంలోని కాశీవిశ్వేశ్వరాలయం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆంజనేయస్వామి చేతుల మీదుగా లంకాదహనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆలయ ఎదుట పోలీస్ ఔట్ పోస్టు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో దాదాపు రెండు గంటల పాటు జరిగే లంకాదహనం కార్యక్రమం ఎంతో కోలాహలంగా సాగుతుంది. -
జగన్ సంకల్పం.. అభివృద్ధికి రాచమార్గం
పామురాయి వద్ద 544డీ జాతీయ రహదారి ప్రవేశ మార్గం శింగనమల సమీపంలో ఫ్లై ఓవర్పై ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు సి.బండమీదపల్లి వద్ద దూసుకెళుతున్న వాహనాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చొరవ కారణంగా 544డీ జాతీయ రహదారి మంజూరై, నిర్మాణ పనులు జోరుగా సాగాయి. అనంతపురం నుంచి హైదరాబాద్ మార్గంలోని 44వ జాతీయ రహదారికి అనుసంధానిస్తూ పామురాయి వద్ద నుంచి విజయవాడ వరకు నాలుగు లైన్ల రహదారి ప్రస్తుతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొన్ని చోట్ల సాగుతున్న పనులు సైతం చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే తాడిపత్రి నుంచి అనంతపురం వరకూ 544డీ జాతీయ రహదారిపై వాహనాలు దూసుకెళుతున్నాయి. నాడు వైఎస్ జగన్ తీసుకున్న చొరవ కారణంగానే ఈ రహదారి అద్భుతంగా తయారైదంటూ వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం:


