breaking news
Anantapur Latest News
-
బేకరీల్లో మోసం
రాయదుర్గం టౌన్: నూతన సంవత్సరం సందర్భంగా వినియోగదారులను మోసం చేస్తున్న పలు బేకరీ దుకాణాల నిర్వాహకుల బాగోతాన్ని తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ బట్టబయలు చేశారు. రాయదుర్గం, ఉరవకొండ, విడపనకల్లు, కణేకల్లులో ఏర్పాటు చేసిన పలు బేకరీల్లో గుంతకల్లు లీగల్ మెట్రాలజీ అధికారి శంకర్ బుధవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 100 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ తక్కువ బరువుతో కేక్లను తయారీ చేసి కిలో బరువు ఉన్నట్లుగా విక్రయాలు సాగిస్తున్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో తక్కువ తూకాలతో మోసానికి పాల్పడుతున్న విడపనకల్లులోని మూడు బేకరీ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి రూ.27 వేలు జరిమానా విధించారు. అలాగే ఉరవకొండలో 4 కేసులు నమోదు చేసి రూ.41 వేలు, కణేకల్లులో 2 కేసులు నమోదు చేసి రూ.20 వేలు, రాయదుర్గంలో ఒక కేసు నమోదు చేసి రూ.15 వేలు జరిమానా విధించారు. రాయదుర్గంలో రాత్రి 11 గంటలవుతున్నా తనిఖీలు కొనసాగించడం గమనార్హం. ● లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ తనిఖీలో వెలుగు చూసిన అక్రమాలు ● 10 కేసుల నమోదు -
ఈపీఎఫ్ ఫైళ్లు పెండింగ్ లేకుండా చూడండి : డీఈఓ
అనంతపురం సిటీ: ఉపాధ్యాయుల ఈపీఎఫ్ ఫైళ్లు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఈఓ ప్రసాద్బాబు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో బుధవారం సాయంత్రం ఆయన సమావేశమై మాట్లాడారు. ఇప్పటి వరకు ఈపీఎఫ్కు సంబంధించి అందిన దరఖాస్తులు, ఎన్ని క్లియర్ చేశారు, పెండింగ్లో ఎన్ని ఉన్నాయనే అంశాలపై ఆరా తీశారు. ఏ ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో పెట్టడానికి వీల్లేదని, తక్షణం క్లియర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏడీ శ్రీనివాసులు, సూపరింటెండెంట్ జగదీష్, ఏపీఓ మంజునాథ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చీనీ పంట పరిశీలన కూడేరు: చలి తీవ్రత కారణంగా చీనీలో నల్లి, పేనుబంక, తామరపురుగు, మంగు తెగుళ్లు ఆశించినట్లు నియోజకవర్గ ఉద్యాన అధికారి యామిని తెలిపారు. చీనీలో ఆశించిన తెగుళ్లపై ‘చీనీకి తెగుళ్లు... రైతన్నకు దిగులు’ శీర్షికన గత నెల 24న ‘సాక్షి’లో వెలువడిన కథనంపై ఆమె స్పందించి, బుధవారం కూడేరు మండలంలో పర్యటించి చీనీ తోటలను పరిశీలించారు. నల్లి, ఆకుపచ్చ పురుగు నివారణకు లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదా 1ఎంఎల్ ప్రోపర్గైట్ లేదా 0.8ఎంఎల్ స్పైరోమెసిఫిన్ లేదా 1ఎంఎల్ ఫెన్జాక్వీన్ కలిపి పిచికారీ చేయాలన్నారు. మళ్లీ 20 రోజుల తర్వాత కూడా ఇదే ద్రావకాన్ని మరోసారి పిచికారీ చేస్తే ఆశించిన మేర ఫలితాలు ఉంటాయన్నారు. తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 5ఎస్సీ, 2మిలీస్పైనోసాడ్ 45ఎస్సి 0.4మిలీ లీటర్ నీటిలో కలపి 14 రోజులు వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలన్నారు. పేను బంకు, ఎగిరే పేను నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 17.85ఎస్ఎల్, 0.4 ఎంఎల్ లేదా ధయోమిథఽక్సామ్25డబ్ల్యూజి 0.3జీఎల్ను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. -
‘లా నేస్తం’ అమలు చేయాలి
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా... నేటికీ లా నేస్తం పథకం అమలు చేయకుండా జూనియర్ న్యాయవాదులను ఇబ్బందులకు గురిచేస్తోందని జిల్లా న్యాయవాదులు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సి. హనుమన్న విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమన్న మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన లా నేస్తం పథకాన్ని కొనసాగించడంతో పాటు ప్రోత్సాహకాన్ని రెట్టింపు చేస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీని విస్మరించడం తగదన్నారు. ఇచ్చిన హామీని అమలు చేసి జూనియర్ న్యాయవాదులకు దన్నుగా నిలవాలని కోరారు. వాస్తవానికి లా నేస్తం పథకానికి నయాపైసా నిధులు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు రావడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు బాలాజీనాయక్, ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణప్ప, జూనియర్ న్యాయవాదులు ఎం.దిలీప్కుమార్, పి.లక్ష్మీనారాయణ, జె.శ్రీకాంత్, కె.బాబయ్య పాల్గొన్నారు. హెడ్కానిస్టేబుల్పై సైకో దాడి గుంతకల్లు: స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఉదయం మానసిక స్థితి సరిగా లేని ఓ గుర్తు తెలియని యువకుడు హల్చల్ చేశాడు. చేతిలో కర్ర పట్టుకుని పలువురిపై దాడి చేస్తూ భయాందోళనకు గురి చేశాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న టూ టౌన్ హెడ్కానిస్టేబుల్ బాబా మున్వర్... సైకో చేష్టను గమనించి అడ్డుకోబోవడంతో మరింతగా రెచ్చిపోయి కర్రతో దాడి చేశాడు. దీంతో హెడ్కానిస్టేబుల్ తలకు తీవ్ర రక్తగాయమైంది. గమనించిన స్థానికులు సహనం కోల్పోయి సైకోను చితకబాది ఆస్పత్రికి తరలించారు. గాయపడిన హెడ్కానిస్టేబుల్ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. భయభ్రాంతులకు గురి చేసిన సైకో, గాయపడిన హెచ్సీ మున్వర్ -
ఆలయాల రక్షణలో సర్కారు బాధ్యతారాహిత్యం
● ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం అనంతపురం: రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు చోటు చేసుకుంటున్నా అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ మాజీ సలహాదారు (దేవదాయ) జ్వాలాపురం శ్రీకాంత్ విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి నాడు ద్రాక్షారామంలో ముక్కంటికి జరిగిన అపచారం భక్తులను కలచివేసిందన్నారు. సప్త గోదావరి తీరంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోని కపాలేశ్వరస్వామి శివలింగాన్ని దుండగులు ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. ఈ ఆలయాన్ని 7, 8 శతాబ్దాల మధ్య చాళుక్య భీముడు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోందన్నారు. అంతటి ప్రాచీన శివాలయానికి సైతం చంద్రబాబు పాలనలో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. శివలింగాన్ని ధ్వంసం చేస్తే అధికారులు హుటాహుటిన కొత్త శివలింగాన్ని ప్రతిష్టించి భక్తులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కొత్త శివలింగం ప్రతిష్టాపనను శాస్త్రోక్తంగా నిర్వహించాల్సి ఉండగా, అవేవీ పట్టనట్టుగా ధర్మాన్ని ఆలయ అధికారులు అవమానపరిచారని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న సనాతన ధర్మకర్త, డీసీఎం పవన్కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉండారో చెప్పాలన్నారు. ప్రశ్నిస్తే తన డిప్యూటీ సీఎం పదవి పోతుందన్న భయం పవన్ కళ్యాణ్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత శ్యాంసుందర్ పాల్గొన్నారు. -
సంబరం మాటున సైబర్ ఉచ్చు
ధర్మవరం అర్బన్: నూతన సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరూ వారి ఎస్ఎంఎస్, వాట్సాప్, టెలిగ్రామ్ యాప్లలో వచ్చే లింక్లు, ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ పరిపాటిగా మారింది. అయితే ఇలాంటి చర్యలతో వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతాయనే విషయాన్ని మరవరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని అందే సందేశాల లింక్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ తెరవరాదని సూచిస్తున్నారు. అవసరమైతే నేరుగా బంధుమిత్రులకు ఫోన్ చేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకోవాలని, సందేశాలతో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. గిఫ్ట్ ఓచర్లతో బురిడి... నూతన సంవత్సరం రాకతో ఇదే అదనుగా అమాయకులపై సైబర్ నేరగాళ్లు ఉచ్చు విసిరారు. ఈ క్రమంలో వాట్సాప్లకు న్యూ ఇయర్ విసెస్ చెబుతూ గిఫ్ట్ ఓచర్ గెలుచుకున్నారని వచ్చే లింక్లు, ఏపీకే ఫైళ్లను ఎలాంటి పరిస్థితుల్లోనూ తెరవకుండా ఉండడమే మేలు. పొరపాటున ఆ లింక్లను క్లిక్ చేస్తే వ్యక్తిగత బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ కావడమే కాక, మొబైల్లోని కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వివరాలు మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతాయి. అనంతరం సైబర్ నేరగాళ్లు చేసే బ్లాక్మెయిల్కు తలొగ్గి ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. రెండు రోజులు లింక్లకు దూరం.. న్యూ ఇయర్ అంటూ వాట్సాప్, టెలిగ్రామ్, ఎస్ఎంఎస్లకు వచ్చే లింక్లు, ఏపీకే ఫైళ్లను తెరవకుండా రెండు రోజులు దూరంగా ఉండాలి. ట్రావెల్ గ్యాడ్జెట్స్, గిఫ్ట్ ఓచర్లు, వస్తువులపై 50 శాతం డిస్కౌంట్, ఈ సందేశం నలుగురికి పంపితే రీచార్జ్.. ఇలా రకరకాలుగా సైబర్ నేరగాళ్లు వల పన్ని బ్యాంక్ ఖాతాలను లూటీచేస్తారు. ఇలాంటి తరుణంలో ఈ రెండు రోజులు ఎలాంటి లింక్లు క్లిక్ చేయకుండా ఉండడమే మేలు. అప్రమత్తంగా ఉండాలి నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో వాట్సాప్లకు వచ్చే లింక్లను ఎవరూ క్లిక్ చేయొద్దు. అది సైబర్ నేరగాళ్ల పన్నాగమై ఉండవచ్చు. ఎవరికై నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపాలనుకుంటే నేరుగా ఫోన్ చేసి చెప్పండి. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలి. – హేమంత్కుమార్, డీఎస్పీ, ధర్మవరం నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో ఆర్థిక నేరాలకు ఆస్కారం ఏపీకే ఫైళ్లు... లింక్లతో జాగ్రత్త అంటున్న పోలీసులు -
మానవత్వం మరచి..
రాప్తాడు రూరల్: నూతన సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి అనంతపురం నగర శివారులోని హార్మోన్ సిటీ, కార్బన్ సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ‘శుభారంభం–2026’ ఈవెంట్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. అయినా మృతదేహాన్ని అక్కడే ఉంచుకుని ఈవెంట్ను నిర్వాహకులు కొనసాగిస్తుండడంతో బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే... అనంతపురంలోని వేణుగోపాల్నగర్కు చెందిన షాజహాన్ కుమారుడు షౌకత్ (17) ఇంటర్ చదువుతున్నాడు. పార్ట్టైంగా ఎల్ఈడీ టెక్నీషియన్గా పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో హార్మోన్ సిటీలో ఈవెంట్ నిర్వహణలో ఎల్ఈడీ లైట్లు, స్క్రీన్లు ఏర్పాటుకు తోటి టెక్నీషియన్లతో కలసి షౌకత్ వెళ్లాడు. ఎల్ఈడీలకు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్న క్రమంలో హై ఓల్టేజ్ ప్రసరించి షాక్కు గురై అపస్మారకంగా పడిపోయాడు. ఆ సమయంలో క్షతగాత్రుడి గురించి పట్టించుకోకుండా ఈవెంట్ను నిర్వాహకులు కొనసాగిస్తూ వచ్చారు. సంబరాల్లో ఆటపాటలతో చిందేయసాగారు. చివరకు తోటి టెక్నీషియన్లు షౌకత్ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో షౌకత్ మృతిచెందాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి చేర్చి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని, ఆలస్యంగా తీసుకురావడం వల్ల పరిస్థితి విషమించి షౌకత్ మృతి చెందినట్లుగా వైద్యులు తెలపడంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. మృతదేహంతో ఆందోళన కళ్లెదుట యువకుడు మృతి చెందినా కనీసం పట్టించుకోకుండా నిర్వాహకులు వ్యవహరించిన తీరుపై బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ షౌకత్ మృతదేహంతో ఈవెంట్ వద్ద ఆందోళన చేపట్టారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా.. నిర్వాహకుల్లో స్పందన కరువైంది. విందు భోజనాలతో సందడిలో నిమగ్నమైపోయారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన బంధువులు బారికేడ్లను కూలదోసి ఈవెంట్ ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. వేదికపైకి రాళ్లు రువ్వారు. శాపనార్థాలు పెడుతూ మనిషి ప్రాణానికి విలువ ఇవ్వకుండా డబ్బే ప్రాధాన్యతగా ఈవెంట్ సంబరాల్లో మునిగి తేలుతున్న నిర్వాహకులపై మండిపడ్డారు. భారీగా నిర్వహిస్తున్న ఈవెంట్ వద్ద కనీసం అంబులెన్స్ కాని, ఫైరింజన్ కాని అందుబాటులో పెట్టలేదని, పది నిముషాల ముందు ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే తమ కుమారుడు బతికేవాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో ఈవెంట్ను నిర్వాహకులు కాసేపు ఆపేసి, పోలీసుల సాయం కోరారు. సమాచారంఅందుకున్న అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు, పలువురు సీఐలు, సిబ్బంది అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆందోళనకారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు. అప్పటికీ ఆందోళనకారులు శాంతించకపోవడంతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఈవెంట్ను యథావిధిగా నిర్వాహకులు కొనసాగించారు. మృతుడు షౌకత్ ఘటన అనంతరం ఈవెంట్ను కొనసాగిస్తున్న దృశ్యం కొత్త సంవత్సరం వేడుకల్లో అపశ్రుతి ఏర్పాట్లలో ఎల్ఈడీ టెక్నీషియన్కు విద్యుత్ షాక్ పట్టించుకోకుండా సంబరాల్లో చిందేసిన నిర్వాహకులు ఆలస్యంగా ఆస్పత్రికి తరలించిన సాటి కార్మికులు పరిస్థితి విషమించి యువకుడి మృతి మృతదేహంతో బంధువుల ఆందోళన -
చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటాం
● సింహాచల మాన్యం అన్యాక్రాంతం కానివ్వం ● విశ్వహిందూ పరిషత్తు హెచ్చరిక అనంతపురం కల్చరల్: పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచల ఆలయ మాన్యం భూములను ప్రైవేట్ పరం చేసేందుకు సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబును జిల్లా విశ్వహిందూ పరిషత్తు నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం డీఆర్వో మలోలను వీహెచ్పీ నేతలు కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు తాళంకి రత్నమయ్య, ఉపాధ్యక్షుడు రమణబాబు మాట్లాడుతూ.. సింహాచల భూములను దొడ్డి దారిన తన ఇష్టానుసారంగా పంచేయాలన్న సీఎం చంద్రబాబు కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. తాత్కాలిక ప్రయోజనాలను చూడకుండా జాతి సంరక్షణకు పాటుపడాలని హితవు పలికారు. అలా కాదని దేవదాయ శాఖను బలిపశువును చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. ఎక్కడ దేవుని మాన్యం అన్యాక్రాంతమైనా తీవ్ర ప్రతిఘటనతో అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో వీహెచ్పీ కార్యదర్శి విశ్వనాథరెడ్డి, జిల్లా గోరక్షా ప్రముఖ్ సోమశేఖర్, కిషోర్, హరీష్ పాల్గొన్నారు. -
సైబర్ నేరాలు పెరిగాయ్
● 2025 వార్షిక నేర సమీక్షలో ఎస్పీ జగదీష్ వెల్లడి అనంతపురం సెంట్రల్: జిల్లాలో గతంతో పోలిస్తే 2025 సంవత్సరంలో నేరాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. సైబర్ నేరాలు మాత్రం పెరిగాయని ఎస్పీ జగదీష్ తెలిపారు. బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నేరసమీక్ష వివరాలు వెల్లడించారు. 2024 సంవత్సరంలో 8,841 నేరాలు నమోదైతే...2025లో 6,851 నమోదయ్యాయని తెలిపారు. పోలీసుశాఖ తీసుకున్న చర్యల ఫలితంగా నేరాలు కట్టడి చేయగలిగామని చెప్పారు. గత సంవత్సరం 530 దొంగతనాల కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 527 కేసులు నమోదయ్యాయన్నారు. హత్యలు 2024లో 57 జరిగితే.. 2025లో 42 నమోదయ్యాయన్నారు. ఎక్కువ శాతం చిన్న చిన్న వివాదాలు, లైంగిక, కుటుంబ ఆస్తి తగాదాలతోనే జరిగాయని పేర్కొన్నారు. ఇక హత్యాయత్నాలు 2024లో 66 కాగా, 2025లో 59 నమోదయ్యాయన్నారు. మహిళలపై జరిగే నేరాలు 733 నుంచి 644కు తగ్గాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద 127 కేసులు నమోదయ్యాయన్నారు. రోడ్డు ప్రమాదాలు 2024లో 544 నమోదు కాగా, 2025లో 496 జరిగాయన్నారు. ప్రధానంగా సైబర్ నేరాలు 32 శాతం పెరిగినట్లు వివరించారు. 2025లో సుమారు రూ.11.25 కోట్ల ఆర్థికనష్టం సంభవించిందని తెలిపారు. 1,218 పేకాట కేసులు, 1,35,572 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు, న్యూసెన్స్ కేసులు 13,779 నమోదయ్యాయన్నారు. డయల్ 100కు 25,611 ఫిర్యాదులు అందాయన్నారు. 2025లో పలు కేసులు ఛేదించడం ద్వారా పోలీసు శాఖకు మంచి పేరు వచ్చిందన్నారు. నూతన సంవత్సరంలో టెక్నాలజీ వినియోగించి నేరాలు ఛేదన, డ్రగ్స్ కట్టడి, మహిళలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తామని ఎస్పీ వివరించారు. అనంతరం అత్యుత్తమంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. -
వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలపై అక్కసు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘ఎవరు.. ఆ ఫ్లెక్సీలను అక్కడ ఉంచింది? నేను కార్యక్రమం వెళ్లి వచ్చేలోగా తొలగించాలి’ అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఆదేశించడంతో ఆయన అనుచరులు.. వైఎస్సార్సీపీ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించిన ఘటన బుధవారం అనంతపురం శివారు రుద్రంపేట పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రబాబు కొట్టాలుకు వెళ్లేదారిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఎంపీటీసీ సభ్యురాలు మహబూబ్బీ, ఆమె భర్త వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎంఎస్ఎస్ సాదిక్ ఏర్పాటు చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే దగ్గుపాటి వాటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తొలగించాలనే ఆదేశాలతో అనుచరులు, టీడీపీ కార్యకర్తలు వెంటనే ఫ్రేమ్లు విరగ్గొట్టి, ఫ్లెక్సీలను పీకేశారని సాదిక్ వలి వాపోయారు. ఫ్లెక్సీలు చించినంత మాత్రాన వారికి ఒరిగేదేమీ లేదని, ప్రజలన్నీ గమనిస్తున్నారని అన్నారు. -
ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి
అనంతపురం: కొంగొత్త ఆశలు.. ఆకాంక్షలతో నూతన సంవత్సరం ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో శాంతియుతంగా ఉండాలని కోరారు. సరికొత్త లక్ష్యాలను సాధించడానికి నూతన ఏడాది ప్రేరణ కావాలన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆనంద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సరికొత్త ఆలోచనలతో ప్రణాళిక రూపొందించుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయంలో ఆధునాతన సాంకేతికతను (అగ్రిటెక్) వినియోగించుకుని అధిక దిగుబడులు పొంది ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యవసాయ అధికారి బాధ్యతల స్వీకరణ అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ)గా ఎం.రవి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న డీఏఓ ఉమామహేశ్వరమ్మ బుధవారం సాయంత్రం 5 గంటలకు ఉద్యోగ విరమణ చేస్తూ.. బాధ్యతలను ఎం.రవికి అప్పజెప్పారు. సీనియర్ ఏడీఏగా తాడిపత్రి డివిజన్లో పనిచేస్తున్న ఎం.రవిని ఎఫ్ఏసీ డీఏవోగా నియమిస్తూ 15 రోజుల కిందటే కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు వచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ విరమణ చేసిన డీఏఓకు వీడ్కోలు చెబుతూ నూతన డీఏఓ రవికి ఆ శాఖ ఏడీఏలు, ఏఓలు, కార్యాలయ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి అనంతపురం అర్బన్: ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం ఆయా శాఖల పరిధిలో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ మానిటరింగ్ కమిటీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్లో 17.08 శాతం ఎస్సీలకు, 5.53 శాతం ఎస్టీలకు ఖర్చు చేయాలన్నారు. ఆ వర్గాల వారికి కేటాయించిన లక్ష్యం మేరకు ప్రభుత్వం నుంచి సహాయసహకారాలు సంపూర్ణంగా అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డీఆర్డీఏ పరిధిలో సీ్త్రనిధి కింద రుణాల మంజూరులో, ఉన్నతి, పీఎంఎఫ్ ఎంఈ పథకాల్లో నిర్దేశించిన లక్ష్యాల్లో పురోగతి సాధించాలని సూచించారు. ఉపాధి హామీ కింద ఆ వర్గాలకు లబ్ధి చేకూర్చాలన్నారు. హౌసింగ్, ఏపీఎంఐపీ, వ్యవసాయం, పౌర సరఫరాలు, పురపాలక, తదితర శాఖల పరిధిలో లక్ష్యాలను అధిగమించాలన్నారు. మునిసిపల్ కమిషనర్లతో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, డీటీడబ్ల్యూఓలు సమన్వయం చేసుకుని ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాలన్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో నిర్వహించిన లాస్ట్ ఛాన్స్ (ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్, బీఫార్మసీ ) ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు బుధవారం విడుదల చేశారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచారు. కార్యక్రమంలో సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి. శంకర్ శేఖర్ రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో ఫ్లెక్సీల వార్
అనంతపురం క్రైం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి పబ్లిసిటీ పిచ్చి పరాకాష్టకు చేరింది. తనవి తప్ప ఇంకెవ్వరి ఫ్లెక్సీలూ కనిపించరాదనే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీతో పాటు స్వపక్షంలోని ఇతర టీడీపీ నేతలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా తట్టుకోలేకపోతున్నారు. తనవి మాత్రమే కనిపించాలన్నట్టు నియంతృత్వ పోకడకు పోతున్నారు. తాజాగా రామనగర్లో చోటు చేసుకున్న ఫ్లెక్సీ చించివేత ఘటన రాజకీయంగా దుమారం రేపింది. అంతేకాదు అధికార టీడీపీలో విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకరచౌదరి అభిమాని నటేష్చౌదరి ఫ్లెక్సీ వేయించి.. రామనగర్ 80 అడుగుల రోడ్డులో ఏర్పాటు చేయిస్తుండగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వర్గీయులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీలను చించేశారు. నటేష్చౌదరిని అంతం చేస్తామంటూ బెదిరింపులకు సైతం దిగారు. ‘ఇది మా అడ్డా. ఇక్కడ ఎవ్వరూ ఫ్లెక్సీలు వేయకూడదు’ అంటూ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. పరిస్థితి చేయిదాటుతుండటంతో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఆయన అనుచర వర్గం రంగంలోకి దిగింది. అయితే దగ్గుపాటి వర్గీయులు కూడా వెనక్కు తగ్గలేదు. బాహాబాహీకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చౌదరికి నచ్చజెప్పి పంపించేశారు. కాగా నటేష్ చౌదరి మాత్రం ఫ్లెక్సీ వేసి తీరాల్సిందేనని పట్టుబట్టారు. ‘పార్టీకి మేము పని చేయలేదా? మా ఫ్లెక్సీలు వేసుకోకూడదా?’ అంటూ పోలీసులను నిలదీశారు. అనంతరం ఇరువర్గాల వారికీ సర్దిచెప్పారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి రామనగర్కు చేరుకుని తన వర్గీయులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎవ్వరి ఫ్లెక్సీలూ వేయించవద్దని చెప్పి.. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే దగ్గరుండి చించివేయించి వెళ్లిపోయారని నటేష్చౌదరి ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా అధికార పార్టీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆ సామాజిక వర్గ పెద్దలు స్పందించారు. సమస్యను సద్దుమణిగించేందుకు ‘వైకుంఠం’ నివాసంలో చర్చలు జరిపారు. అయితే తనను టార్గెట్ చేసుకుని, కుటుంబ సభ్యుల జోలికి వస్తే పరిస్థితి మరోలా ఉంటుందని ప్రభాకర్చౌదరి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. నటేష్ చౌదరి ఫ్లెక్సీలను చించేసిన దగ్గుపాటి వర్గీయులు తమ అడ్డాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదంటూ హుకుం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులకు ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయుల బెదిరింపులు -
ముక్కోటి.. తరించిన భక్తకోటి
అనంతపురం లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం వద్ద క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులుఅనంతపురం కల్చరల్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామిని ఉత్తరద్వారంలో భక్తకోటి దర్శించుకుని తరించింది. అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, రాప్తాడు, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోని ప్రముఖ వైష్ణవాలయాలకు తెల్లవారుజామునుంచే భక్తుల రాక మొదలైంది. గోవిందనామ స్మరణతో స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తిపారవశ్యం చెందారు. శ్రీవారి ఆలయంతో పాటు వివిధ దేవాలయాల్లో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల రథోత్సవాలు, గ్రామోత్సవాలు జరిగాయి. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
పరిశ్రమల ఏర్పాటుతో సమగ్రాభివృద్ధి
అనంతపురం అర్బన్: పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పారిశ్రామిక రంగం బలోపేతం చేసేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అన్ని అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఇంజినీరింగ్ పనులు జనవరిలోగా పూర్తిచేయాలని చెప్పారు. ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను గుర్తించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జెడ్ఎంను ఆదేశించారు. ఇండస్ట్రియల్ పాలసీ కింద రెండు యూనిట్లకు విద్యుత్ రాయితీ రూ.29 వేలు, రెండు యూనిట్లకు వడ్డీ రాయితీ రూ.2.37 లక్షలు, ఐదు యూనిట్లకు పెట్టుబడి రాయితీ రూ.2.9 కోట్లు, ఒక యూనిట్కు అమ్మకపు పన్ను రాయితీ రూ.28.85 లక్షలు, ఒక యూనిట్కు స్టాంప్ డ్యూటీ రాయితీ రూ.1.02 లక్షలు మంజూరు చేశారు. ప్లాట్లు రద్దు చేయండి రాయదుర్గం టెక్స్టైల్ పార్కులో యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాని వారికి నోటీసు ద్వారా తెలియజేసి.. వారికి కేటాయించిన ప్లాట్లను రద్దు చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో రాయదుర్గం పరిధిలోని టెక్స్టైల్ పార్కులో గార్మెంట్ యూనిట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాయదుర్గం టెక్స్టైల్ పార్కులో యూనిట్ల నిర్మాణం చేపట్టని 47 మందితో మాట్లాడి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
మళ్లీ యూరియా కొరత
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో రబీకి సంబంధించి యూరియా కొరత మొదలైంది. వరి నాట్లు ప్రారంభం కావడం, వేరుశనగ, మొక్కజొన్న, జొన్నకు యూరియా అవసరం ఉండటంతో డిమాండ్ కనిపిస్తోంది. కానీ వ్యవసాయశాఖ తగినంత యూరియా నిల్వ చేయడంలో విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. ఖరీఫ్లో తీవ్ర సమస్య ఎదురైనప్పటికీ ఆ అనుభవంతో రబీలో మేలుకోకపోవడం గమనార్హం. ఇప్పుడిపుడే జిల్లాలో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. అనంతపురంలో ఉన్న డీసీఎంఎస్కు పరిసర ఐదారు మండలాల నుంచి రైతులు వస్తున్నా.. వారానికి ఒక లారీ మాత్రమే యూరియా పంపిస్తుండంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. బయట ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్నా అవసరం లేని మరికొన్ని ఎరువులు, డ్రిప్ మందులు తీసుకోవాలని షరతు పెడుతుండటంతో దిక్కుతోచడం లేదని గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన రైతు నల్లప్ప, అనంతపురం రూరల్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన రైతు నాగేశ్వరరెడ్డి ‘సాక్షి’ ఎదుట వాపోయారు. సొసైటీలు, రైతు సంఘాలు, ప్రైవేట్, హోల్సేల్ డీలర్ల వద్ద కూడా యూరియా సమస్య ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ రబీలో 27,232 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక రూపొందించారు. గత ఖరీఫ్లో మిగులు యూరియా 3,610 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు చూపించారు. మొత్తం మీద రబీలో ఇప్పటివరకు 20,729 మెట్రిక్ టన్నులు సరఫరా అయినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో అమ్మకాలు పోను ప్రస్తుతం 4,500 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనధికార సమాచారం ప్రకారం ఆన్లైన్లో 4 వేల మెట్రిక్ టన్నులు ఉన్నట్లు చూపిస్తున్నా... భౌతిక నిల్వలు చాలా తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో రైతులకు ప్రస్తుతం యూరియా దొరడం కష్టంగా మారింది. వరి నాట్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. జనవరిలో 15 వేల హెక్టార్లకు పైగా సాగులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. జనవరిలో ఊపందుకోనున్న వరినాట్లు ఖరీఫ్ సమస్య పునరావృతమయ్యే పరిస్థితి -
మొదటి వారంలో కంది కొనుగోళ్లు
అనంతపురం అగ్రికల్చర్: జనవరి మొదటి వారంలో కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటా రూ.8 వేల ప్రకారం ‘నాఫెడ్’ ద్వారా కందుల కొనుగోళ్లు ప్రారంభించున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పి.పెన్నేశ్వరి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఖరీఫ్లో సాగు చేసినట్లు ఈ–క్రాప్లో నమోదు చేసుకున్న రైతుల నుంచి 24,838 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేయాలని లక్ష్యం విధంచుకున్నామన్నారు. ఇప్పటి వరకు 5,759 మంది రైతులు ఆర్ఎస్కేల్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. మిగతా రైతులు సాధ్యమైనంత తొందరగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే జనవరి మొదటి వారంలోపు కొనుగోళ్లు ప్రారంభిస్తామన్నారు. మండలానికి ఒకటి చొప్పున 31 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శ్రుతి మించితే కఠిన చర్యలు అనంతపురం సెంట్రల్: నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం రాత్రి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఆకతాయిల చేష్టలు శ్రుతిమించితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు తనిఖీలు కొనసాగుతాయన్నారు. ఒంటి గంటలోపు కార్యక్రమాలన్నీ ముగించాలని, నిర్ణీత సమయానికి మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని, టపాసులు, డీజేలు నిషేధించినట్లు తెలిపారు. 2026 నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బీటెక్ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో అక్టోబర్ నెలలో నిర్వహించిన బీటెక్ నాలుగో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–20) రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు, సీఈ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ ప్రొఫెసర్ జి.శంకర్ శేఖర్రాజు, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఎం.అంకారావు పాల్గొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలన్నారు. మద్యం ఫుల్లుగా తాగేశారుఅనంతపురం సెంట్రల్: జిల్లాలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. లైసెన్స్ దుకాణాల్లో 29,93,696 ఐఎంఎల్ (36.23శాతం పెరుగుదల) బాక్సులు, 29,13,786 బాక్సుల బీరు (37.37శాతం పెరుగుదల) అమ్మకాలు జరిగాయి. 2025 సంవత్సరంలో మద్యం విక్రయాలు, ఎన్ఫోర్సుమెంట్ చర్యలపై జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి రామమోహన్రెడ్డి ఒక ప్రకటనలో వివరించారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలు అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నాటుసారా స్థావరాలపై 298 దాడులు నిర్వహించి, 258 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 1,650 లీటర్ల సారా సీజ్ చేసి, 27,935 లీటర్ల ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. బెల్టు షాపులపై దాడులు చేసి 735 కేసుల్లో 734 మందిని అరెస్ట్ చేసి, 2848 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. కర్ణాటకకు చెందిన 2,848 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి, 26 వాహనాలను సీజ్ చేశామని వివరించారు. ఏడు గంజాయి కేసుల్లో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, 16.63 కేజీల గంజాయితో పాటు 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మిలటరీ మద్యం విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరిని, అక్రమంగా అమ్ముతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వివిధ కేసుల్లో 970 మందిని బైండోవర్ చేసినట్లు వివరించారు. -
జాతీయస్థాయి ప్రదర్శనలకు ‘అనంత’ ప్రాజెక్టులు
అనంతపురం సిటీ: జాతీయస్థాయిలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంస్థ నిర్వహిస్తున్న శాసీ్త్రయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయని డీఈఓ ప్రసాద్బాబు మంగళవారం తెలిపారు. ఇందుకు సంబంధించి మూడ్రోజులుగా నిర్వహిస్తున్న ఆన్లైన్ ఎంపికలో మొత్తం 234 ప్రాజెక్టులు ప్రదర్శనకు రాగా.. అందులో మన జిల్లాలోని పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు పావని, ప్రణతి రూపొందించి ప్రదర్శించిన సౌరశక్తి ఆధారిత పిచికారీ యంత్రం మొదటి స్థానంలో నిలిచిందని డీఈఓ వివరించారు. గుత్తి ఆదర్శ పాఠశాలకు చెందిన మౌర్య శ్రీకారి, అంజుమ్ పర్వీన్ తయారు చేసిన ‘వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ ఆన్ ది మూవ్’ ప్రాజెక్టు మూడో స్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వంగా ఉందని డీఈఓ పేర్కొన్నారు. నిబంధనల మేరకే పాఠశాలలకు అనుమతి ప్రైవేటు పాఠశాలల రెన్యువల్, రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను విద్యాశాఖ అదనపు డైరెక్టర్ పార్వతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆమె డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, విద్యాశాఖ ఇతర అధికారులతో వెబెక్స్ నిర్వహించారు. అనంతపురం నుంచి డీఈఓ ప్రసాద్బాబు, ఏడీ–1, 2 మునీర్ ఖాన్, శ్రీనివాసులు, డిప్యూడీ డీఈఓ మల్లారెడ్డి, సూపరింటెండెంట్ జగదీష్, ఏపీఓ మంజునాథ్, ఏఎస్ఓ బోయ శ్రీనివాసులు, ఐటీ సెల్ ఇన్చార్జ్ చంద్రశేఖర్రెడ్డి, నోడల్ ఆఫీసర్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలన్నీ కచ్చితంగా రెన్యువల్ అయ్యేలా చూడాలన్నారు. మూడో స్థానం దక్కించుకున్న గుత్తి ఆదర్శ పాఠశాల విద్యార్థినులతో పీజీటీ సాంబశివారెడ్డి మొదటి స్థానంలో నిలిచిన చీమలవాగుపల్లె విద్యార్థినులతో హెడ్మాస్టర్ -
అరాచకం సాగిస్తామంటే కుదరదు
● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ అనంతపురం: రెడ్బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తామంటే కుదరదని టీడీపీ నేతలను వైఎస్సార్సీపీ బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర కార్యదర్శి సి. రమేష్గౌడ్ హెచ్చరించారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, లీగల్ సెల్ నాయకులతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతపురంలోని గుల్జార్పేటతో రోడ్డు విస్తరణలో భాగంగా టీడీపీ జెండా దిమ్మెను తొలగిస్తే.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కుమారుడు దాదును స్టేషన్కు తీసుకెళ్లిన అంశాన్ని ప్రశ్నించేందుకు వెల్లిన పార్టీ ముఖ్య నాయకులపై సీఐలు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. ఒకరేమో కాల్చిపారేస్తాం నా కొడకా అంటే.. ఇంకొకరేమో 200 మందిని దించుతామంటూ బెదిరింపులకు దిగారని గుర్తు చేశారు. ఈ విషయంలోనే తనతో పాటు మరో 23 మంది ముఖ్య నాయకులపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశామని.. ఢిల్లీలోనూనిరసన తెలిపామని కానీ ఏ రోజూ పోలీసులు ఇలా వ్యవహరించింది లేదన్నారు. కేసులు ఎందుకు నమోదు చేశారు.. దాదును ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్నది పోలీసులు చెప్పి ఉంటే అసలు వివాదమే ఉండేది కాదన్నారు. అలా చేయకుండా అసలు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లడమే తప్పు అనే విధంగా వ్యవహరించారన్నారు. టీడీపీ నేతలకు వర్తించని 30 యాక్ట్ వైఎస్సార్సీపీ నేతలకు మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. కనీసం నూతన సంవత్సరం నుంచైనా పోలీసులు పనితీరు మారాలని.. న్యాయం వైపు నిలబడి చట్ట ప్రకారం పని చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు సైతం కేసులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. పొట్టెళ్లను కొడవళ్లతో నరికితేనే ఈ సెక్షన్ ఉపయోగిస్తే.. జాతర్లు జరిగినప్పుడు కూడా అందరిపై కేసులు పెట్టాల్సి ఉంటుందన్నారు. అఖండ –2 సినిమా విడుదల సమయంలో వందల మంది అభిమానుల సమక్షంలో పొట్టేళ్లు కొట్టి.. వాటి తలలతో బాలకృష్ణ కటౌట్కి హారంగా వేశారన్నారు. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్, శ్రీరామ్ను ఊరేగిస్తున్నప్పుడు వందలాది మంది జనం మధ్య పొట్టేళ్ల తలలు నరికారన్నారు. మరి ఆయా ఘటనలపై మీద కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అక్రమ కేసులను ఎదుర్కొంటామని.. అలాగే పోలీసులపై కూడా కేసులు పెట్టి.. కోర్టుకు రప్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగన్న, రాజశేఖర్ యాదవ్, బెస్త వెంకటేశులు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లబ్బే రాఘవ, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి టి. నరేంద్ర, సాకే విక్రం, వెంకటేష్, మోహన్, గణేష్ , జిల్లా యువజన సెక్రెటరీ హిదయ్ తుల్లా, దాదు తదితరులు పాల్గొన్నారు. -
కళ తప్పిన టీటీడీ
ఒకప్పుడు ఎంతో సందడిగా ఉండే అనంతపురంలోని టీటీడీ కల్యాణమంటపం ప్రస్తుతం నిర్వహణ లోపం కారణంగా కళావిహీనంగా మారింది. దీనికి తోడు టీటీడీ ఉత్పత్తుల విక్రయాలు సైతం చేపట్టకపోవడంతో కల్యాణ మంటపం వైభవం మసిబారుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి క్యాలెండర్లు, డైరీల కోసం టీటీడీ కల్యాణమంటపం చుట్టూ శ్రీవారి భక్తులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. అనంతపురం కల్చరల్: ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండడమే కాదు... భక్తి భావాన్ని పెంపొందించేలా టీటీడీ ముద్రించిన క్యాలెండర్లు, డైరీలకు సహజంగానే డిమాండ్ ఎక్కువగానే ఉంది. తిరుమల క్షేత్రంలోని విశేషాలతో కూడిన వీటిని బంధుమిత్రులకు నూతన సంవత్సరం సందర్భంగా అందజేసి శుభాకాంక్షలు చెప్పడమనేది ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ సారి వాటి ఆచూకీ లేకుండా పోవడంతో భక్తులు పొరుగున ఉన్న కర్నూలులోని సీ క్యాంప్లో ఉన్న టీటీడీ కల్యాణ మంటపానికి పరుగు తీయాల్సి వస్తోంది. అనంతలో టీటీడీ కల్యాణ మంటపం నిర్వహణను లీజుకు తీసుకున్న కాంట్రాక్టర్.. టీటీడీ ఉత్పత్తుల విక్రయాలపై ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వైఎస్ జగన్ హయాంలో అనంత ముంగిటకే ప్రసాదం తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఎనో వ్యయ ప్రయాసాలకోర్చి తిరుమలకెళ్లి లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్లి బంధుమిత్రులకు సంబరంగా అందజేస్తుంటారు. అంతటి పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కరోనే విపత్కర సమయంలో ఇంటి ముగింటకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేరువ చేసింది. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ నేపథ్యంలో హిందూ ధర్మప్రచార పరిషత్తు, ధర్మప్రచార మండలి ఆధ్వర్యంలో అప్పట్లో అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.10 లక్షలకు పైగా ప్రసాదాల విక్రయం సాగింది. అలాగే సనాతన ధర్మ ప్రచారానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అప్పటి టీటీడీ పాలక మండలి ఉచితంగా పంపిణీ చేసేలా అనంతపురం జిల్లాకు రెండు లక్షల భగవద్గీత పుస్తకాలను అందజేసింది. నేటికీ వీటి వితరణ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ కల్యాణమంటపంలో శ్రీవారి క్యాలెండర్లు, డైరీల విక్రయాలకు దిక్కు లేకుండా పోయింది. ఎంఎస్ రాజుకు పట్టని టీటీడీ అభివృద్ధి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ బోర్డు సభ్యుడిగా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నియమితులయ్యారు. అయితే మడకశిరలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. భగవద్గీత వల్ల ఒరిగేదేమీ లేదంటూ హిందువుల మనోభావాలు కించపరుస్తూ మాట్లాడడం నేటికీ శ్రీవారి భక్తులు మరవలేక పోతున్నారు. టీటీడీ అభివృద్ధి పట్టని ఎంఎస్ రాజు.. శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను భక్తులకు చేరువ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. టీటీడీ ఉత్పత్తుల కోసం కల్యాణమంటపంలో ఏర్పాటు చేసిన ధార్మిక పుస్తక శాల భవనం తాళం భక్తులను వెక్కిరిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి టీటీడీ ఉత్పత్తుల విక్రయాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మూతపడిన అనంతపురంలోని టీటీడీ ఉత్పత్తుల విక్రయశాల వైఎస్ జగన్ హయాంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు అందజేసిన భగవద్గీత పుస్తకాల బాక్స్లు శ్రీవారి క్యాలెండర్లు, డైరీల కోసం భక్తుల అగచాట్లు కొన్నేళ్లుగా ‘అనంత’లో విక్రయాలు తగ్గిస్తూ వచ్చిన లీజుదారు రెండేళ్లుగా టీటీడీ ఉత్పత్తుల విక్రయాలు బంద్ -
నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
కళ్యాణదుర్గం రూరల్: ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం తూర్పుకోడిపల్లి గ్రామానికి చెందిన రామాంజి, అశ్వని దంపతులు కుమార్తె ఈక్షిత (2) మంగళవారం ఇంటి ఆవరణలో ఆదుకుంటూ సమీపంలోని నీటి తొట్టెలో పడిపోయింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని వెలికి తీసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఈక్షిత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
జీవాల పెంపకం లాభదాయకం
ఉరవకొండ: జీవాల పెంపకం చేపడితే లాభాలు బాగుంటాయని, గొర్రెలు, పొట్టేళ్ల పెంపంకం దృష్టి సారించాలని స్టేక్హోల్డర్స్కు సెర్ఫ్ డైరెక్టర్ పద్మావతి సూచించారు. మీట్ ప్రాసెసింగ్పై మంగళవారం ఉరవకొండలోని వెలుగు కార్యాలయంలో స్టేక్హోల్డర్స్కు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డీఆర్డీఏ పీడీ శైలజ తో కలసి ఆమె మాట్లాడారు. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద జిల్లా లో ఫుడ్ ప్రాసింగ్ యూనిట్లు వంద మంజూరయ్యాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు, పొట్టేళ్లు పెంపకం చేపట్టి ఆర్థిక పురోగతి సాధిస్తున్నారని, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఆర్థిక చేయూతనందించేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పశుసంవర్దక శాఖ ఏడీ పెద్దన్న, వెలుగు ఏసీ శివప్రసాద్, ఏపీఎం శివయ్య పాల్గొన్నారు. గార్మెంట్స్ పరిశ్రమపై ఆసక్తి చూపాలి గార్మెంట్స్ పరిశ్రమ ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలు దక్కుతాయని మహిళా సంఘాల సభ్యులకు సెర్ఫ్ డైరెక్టర్ పద్మావతి సూచించారు. ఉరవకొండలో గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరో ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి టైలరింగ్లో అనుభవమున్న మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ ● 32 ద్విచక్ర వాహనాల స్వాధీనం కళ్యాణదుర్గం రూరల్: అంతర్రాష్ట్ట దొంగలను అరెస్ట్ చేసి 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. ఇటీవల కళ్యాణదుర్గం నియోజవర్గం వ్యాప్తంగా ప్రధాన సర్కిళ్లలో నిలిపిన ద్విచక్ర వాహనలను దుండగులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో కళ్యాణదుర్గంలోని కుందుర్పి రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని మంగళవారం అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న వైనం వెలుగుచూసింది. పట్టుబడిన వారిలో కుందిర్పి మండలం బోదపల్లి గ్రామానికి చెందిన బోయ పాతన్న, అనంతపురంలోని పాపంపేటకు చెందిన బోయ చిన్నబాబు ఉన్నారు. అపహరించిన ద్విచక్ర వాహనాలను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న పాత భవనంలో దాచినట్లుగా వెల్లడించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మొత్తం 32 ద్విచక్ర వాహనాలను స్వాధీన చేసుకుని పీఎస్కు తరలించారు. వీటి విలువ రూ 22.80 లక్షలుగా ఉంటుందని నిర్దారించారు. కాగా, పట్టుబడిన నిందితులు పాత నేరస్తులే. వీరిపై అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోని పావగడలోనూ పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
●బతుకు ప్రయాణం..
వారంతా రోజువారీ కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడదు. ఎక్కడ పని దొరికితే అక్కడికే వెళ్తుంటారు. ఈ క్రమంలో పని ప్రాంతానికి చేరుకోవడానికి ప్రైవేట్ ఆటోలను ఆశ్రయిస్తుంటారు. అయితే పరిమితికి మించి ఆటోలో ప్రయాణించడం.. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారింది. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినా కూలీలతో పాటు ఆటో డ్రైవర్లలోనూ మార్పు రావడం లేదు. మంగళవారం కళ్యాణదుర్గం–బళ్లారి మార్గంలో జాతీయ రహదారిపై ఒక్కో ఆటోలో 25 మంది చొప్పున రెండు ఆటోల్లో 50 మంది కూలీలు ఇలా ప్రమాదకరంగా ప్రయాణిస్తుండడం గమనించిన వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు కోల్పోయినప్పుడు హడావుడి చేసే అధికారులు.. ముందస్తుగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడం లేదనేందుకు ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. –బొమ్మనహాళ్ -
తోపుదుర్తి చందుకు సంబంధం లేదు
మా తాత నుంచి మా నాన్నకు భాగానికి వచ్చిన 3.23 ఎకరాలను తన పేరిట చేయించాలని మా పెద్దనాన్న కుమారుడు, రౌడీ షీటర్ అయిన బండి పరుశురాం బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే సునీత, బాలాజీ అండ చూసుకుని చంపుతానని దౌర్జన్యం చేస్తున్నాడు. గతంలో మాపై దాడులు చేయించడమే కాకుండా ఇంటి స్థలాన్ని కబ్జా చేసి, చేసి జేసీబీతో గుంతలు తవ్వించాడు. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం బి.యాలేరు మీదుగావెళుతున్న తోపుదుర్తి చందును ఆపి వివరిస్తుండగా టీడీపీ నేతలతో కలసి పరుశురాం గొడవ చేశాడు. ఎలాంటి సంబంధం లేని తోపుదుర్తి చందుపై అనవసరంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. – బండి నాగరాజు, బి.యాలేరు -
ఆధిపత్యం కోసం అరాచకాలు
అనంతపురం ఎడ్యుకేషన్: రాప్తాడు నియోజకవర్గంలో ఆదిపత్యం కోసం పరిటాల కుటుంబం అరాచకాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన బి.యాలేరు ఘటన, జగనన్న కాలనీల్లో టీడీపీ నాయకులు ప్లాట్లను కబ్జా చేస్తున్న వైనంపై బాధితులతో కలిసి సోమవారం ఎస్పీ జగదీష్, కలెక్టర్ ఆనంద్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో పరిటాల సునీత దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. బి.యాలేరులో బండి పరుశురాం అనే రౌడీషీటరును రెచ్చగొట్టి తనపై అసత్య ఆరోపణలు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. రాజకీయ ఆశ, వరుసకు తమ్ముడైన బండి నాగరాజు భూమిని లాక్కొని ఇిప్పిస్తామని ఆశ కల్పించి పరుశురాంతో దుర్మార్గపు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తమను ఎత్తుకుని పెంచిన చిట్రా ఓబులేసు, ఇతర కురుబ కులస్తులు ఏళ్ల తరబడి ఆదరించారనే కృతజ్ఞతతో తాము ఏమీ అనలేమనే ధైర్యంతోనే పరుశురాం రెచ్చిపోతున్నాడన్నారు. కుట్రలో భాగమే.. రామగిరి మండలంలో కురుబ మజ్జిగ లింగమయ్యను పరిటాల సునీత తమ్ముడు ధర్మవరపు రమేష్, ఆయన కుమారుడు హత్య చేశారని కురుబలందరూ విశ్వసిస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో బండి పరుశురాంను రెచ్చగెట్టి తమపై ఊసిగొల్పారని, ప్రతి చర్యకు దిగితే దానిని భూతద్ధంలో చూపించాలని పరిటాల కుటుంబం పన్నిన పన్నాగమిదని అన్నారు. ఫ్యాక్షన్లో వందల ఎకరాల భూమిని కోల్పోయామని, అలాంటి ఫ్యాక్షన్ జోలికి ఎవరూ వెళ్లకూడదని తాను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ప్రజాసేవ కోసం రూ. వంద కోట్లు ఖర్చు చేశానని గుర్తు చేశారు. ఎమ్మెల్యేను ప్రజలు సునీత బదులు శనితగా పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో న్యాయవాది పేరూరు నాగిరెడ్డి, రంగంపేట గోపాలరెడ్డి, గంగుల సుధీర్రెడ్డి, మజ్జిగ శంకరయ్య, మదిగుబ్బ వీరాంజనేయులు, ఓబుగారి హరినాథరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు చంద్రకుమార్, నాగార్జున, మారుతీ, వైస్ ఎంపీపీలు కృష్ణారెడ్డి, రాప్తాడు రామాంజనేయులు, అనంతపురం రూరల్, రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, ఆత్మకూరు మండలాల వైఎస్సార్సీపీ కన్వీనర్లు దుగుమర్రి గోవిందరెడ్డి, బండి పవన్, సాకే వెంకటేశు, నాగముని, మీనుగ నాగరాజు, బాలపోతున్న, నాయకులు గొల్లపల్లి విశ్వనాథరెడ్డి, పశుపుల ఆది. జూటూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బండి పరశురాం అనే వ్యక్తిని పావుగా వాడుకుంటున్న పరిటాల కుటుంబం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల కుటుంబ సహకారంతో నన్ను మట్టుబెట్టాలని చూస్తున్న పరశురాం : బండి నాగరాజు బి.యాలేరు ఘటనపై ఎస్పీ, జగనన్న కాలనీల్లో టీడీపీ నాయకుల కబ్జాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి -
‘ప్రణాళిక’ను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి
అనంతపురం సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో ‘వంద రోజుల ప్రత్యేక ప్రణాళిక’ను ఉపాధ్యాయులందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేయాలని డీఈఓ ప్రసాద్బాబు ఆదేశించారు. అనంతపురం రూరల్ పాపంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ప్రత్యేక ప్రణాళిక ఎలా అమలవుతోందో పరిశీలించారు. పదో తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు, స్పెషల్ క్లాస్కు ఎంత మంది హాజరయ్యారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజూ స్లిప్టెస్ట్ నిర్వహిస్తున్నారా లేదా.. వచ్చిన మార్కులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఇప్పటి వరకు పిల్లలకు వచ్చిన మార్కులు, వెనుకబడిన విద్యార్థులపై ఎలాంటి శ్రద్ధ పెట్టాలనే అంశాల గురించి సూచనలు ఇచ్చారు. పోక్సో కేసులో ముద్దాయికి ఐదేళ్ల జైలు పుట్టపర్తి టౌన్/ధర్మవరం రూరల్: ఓ బాలిక ఫొటోలు తీసి అసభ్యంగా ప్రవర్తించిన ముద్దాయికి పోక్సో కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే...ధర్మవరం మండలం గుట్టకిందపల్లి గ్రామానికి చెందిన నరసింహులు మరో గ్రామానికి చెందిన బాలికపై ఈ ఏడాది మే 5వ తేదీన అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు ధర్మవరం రూరల్ పోలీసులకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు సోమవారం కోర్టు ఎదుటకు రాగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. 8 మంది సాక్షులను విచారించిన తర్వాత నేరం రుజువు కావడంతో ముద్దాయికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి చిన్నబాబు తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి ప్రభుత్వం ద్వారా రూ.75 వేల పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ముద్దాయికి శిక్ష పడేలా సాక్షులను సకాలంలో కోర్టు ఎదుట ప్రవేశపెట్టిన సీఐ బొజ్జప్ప, సిబ్బంది శ్రీనివాసులు, రామాంజనేయులును ఎస్పీ సతీష్కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. రాత్రికి రాత్రే భూకబ్జా ● బాధితులు లింగాయత్ కార్పొరేషన్ చైర్పర్సన్ కుటుంబ సభ్యులు అనంతపురం సెంట్రల్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరాక భూకబ్జాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతోంది. కన్ను పడితే చాలు కబ్జా చేసేస్తున్నారు. తాజాగా టీడీపీకే చెందిన ఏపీ వీర శైవ లింగాయత్ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్వప్న కుటుంబ సభ్యులైన విజయకుమారి, రాజశేఖర్లకు చెందిన స్థలానికి రాత్రికి రాత్రే ఎవరో కంచె వేసేశారు. దీంతో ఆమె బాధితులను వెంటబెట్టుకొని సోమవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. నగర శివారు తపోవనంలో 179 సర్వే నంబర్లో నాగప్ప పేరుతో 43 సెంట్ల భూమి ఉందని, తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తోందని బాధితులు తెలిపారు. ఐదుగురు అన్నదమ్ములకు సంబంధించిన వారసులకు ఈ స్థలం భాగపరిష్కారం చేయాల్సి ఉందని వివరించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి స్థలం చుట్టూ కంచె వేశారని వాపోయారు. తమ భూమిని కాపాడాలని ఎస్పీకి విన్నవించారు. మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్ మడకశిర: పరిపాలనా సౌలభ్యం కోసం మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర కేబినెట్ మడకశిర రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన తుది గెజిట్ బుధవారం జారీ కానున్నట్లు తెలిసింది. మడకశిర రెవెన్యూ డివిజన్ పరిధిలోకి మడకశిర, అగళి, రొళ్ల, అమరాపురం, గుడిబండ మండలాలు రానున్నాయి. ప్రస్తుతం ఈ మండలాలన్నీ పెనుకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నాయి. -
సమస్యలతో బేజారు
● పరిష్కారం కాక మళ్లీమళ్లీ వినతులు ● వివిధ సమస్యలపై 467 అర్జీలు ● నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రతి వారం వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. పరిష్కారం కాక ప్రజలు మళ్లీ మళ్లీ కార్యాలయానికి వస్తున్నారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్తో పాటు డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, తిప్పేనాయక్, వ్యవసాధికారి ఉమామహేశ్వరమ్మ ప్రజల నుంచి 467 అర్జీలు స్వీకరించారు. అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి.. సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. వినతుల్లో మచ్చుకు కొన్ని... ● తమ కాలనీలో రోడ్లు, కాలువలు లేక ఇబ్బంది పడుతున్నామని అనంతపురం రూరల్ మండలం రామచంద్ర కాలనీవాసులు రవీంద్ర బాబు తదితరులు విన్నవించారు. ఎన్నిసార్లు విన్నవించినా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ● ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వచ్చేలా చూడాలని గుంతకల్లు మండలం గుంతకల్లు తండాకు చెందిన ఎం.శారద విన్నవించారు. భర్త శివనాయక్ ఈ ఏడాది జూన్ 19న మరణించాడని చెప్పారు. తనకు ఇద్దరు పిల్లలని, తమ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాసులు లేవని తెలిపారు. కూలి పనులు చేసుకుని కష్టంగా జీవనం సాగిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. ● ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులకు రెండేళ్లుగా అందాల్సిన గౌరవ వేతనం విడుదల చేయాలని ఎంపీపీల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీలు నారాయణరెడ్డి, సి.జయలక్ష్మీ, హేమలత కోరారు. ఈ మేరకు వారు సోమవారం కలెక్టర్ ఆనంద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
జనవరి 3 నుంచి అంతర్ కళాశాలల అథ్లెటిక్స్
అనంతపురం సిటీ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ (మహిళలు, పురుషులు) పోటీలు అనంతపురం ఆర్ట్స్ కళాశాల వేదికగా జనవరి 3 నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మశ్రీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులను జనవరి 12 నుంచి 16వ తేదీ వరకూ కర్ణాటకలోని అల్వాస్ ఆయుర్వేదిక్ మెడికల్ కళాశాల, మూదబద్రిలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు పూర్తి వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ శ్రీరామ్ (94933 48808)ను సంప్రదించవచ్చు. మా కాలనీకి రోడ్డు వేయండి● దివ్యాంగుల డిమాండ్ అనంతపురం అర్బన్: తమ కాలనీకి రోడ్డు వేయాలంటూ ప్రభుత్వాన్ని అనంతపురంలోని సంత్ గురు రవిదాస్ కాలనీకి చెందిన దివ్యాంగులు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో–ఆర్డినేటర్ హరినాథరెడ్డి మాట్లాడారు. కాలనీలో 250 ఇళ్లు ఉన్నాయన్నారు. రోడ్డు గుంతల మయం కావడంతో మూడు చక్రాల వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఏళ్లుగా ఎందరో అధికారులకు అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల నుంచి స్పందన కరువైందని మండిపడ్డారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు చేపిస్తామంటూ, గెలిచిన తరువాత తమ కాలనీవైపు కన్నెతి కూడా చూడడం లేదని వాపోయారు. ఆందోళన కారులను డీఆర్వో మలోల కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనకు అర్జీ అందజేసి ప్రస్తుతం మట్టితో గుంతలైన పూడిపించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, సహాయకుడు సుధాకర్, నాయకులు వసంతకుమార్, ఈసీ సభ్యులు శ్రీనివాసులు, నరేంద్ర, రాకేష్, మక్బూల్, దివ్యాంగులు పాల్గొన్నారు. -
పాడి రైతులూ పోటీలకు తరలిరండి : కలెక్టర్
అనంతపురం అర్బన్: రూరల్ మండలం ఆకుతోటపల్లిలో జనవరి 7, 8 తేదీల్లో ‘పాలధార’ పేరుతో నిర్వహిస్తున్న పాల దిగుబడి, దూడల ప్రదర్శన పోటీల్లో పాల్గొనేలా పాడి రైతులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ రూపొందించిన ‘అనంత పాలధార’ పోస్టర్లను కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఆవిష్కరించి, మాట్లాడారు. అధిక పాల ఉత్పత్తి, మేలుజాతి పశుపోషణపై అవగాహన కల్పించేలా విధంగా జిల్లా స్థాయి పాడి రైతుల పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న పశుపోషకులు తమ సమీప రైతు సేవా కేంద్రాలు, పశువైద్య కేంద్రాలను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ప్రేమ్చంద్, డీడీ రమేష్రెడ్డి, ఏడీలు రత్నకుమార్, రామచంద్రారెడ్డి, కేఎల్ శ్రీలక్ష్మి, పశువైద్యాధికారి ఎ.గోల్డ్స్మన్, పాల్గొన్నారు. మూడు విభాగాల్లో పోటీలు అనంతపురం అగ్రికల్చర్: ఆకుతోటలపల్లి వేదికగా జనవరి 7, 8, 9 తేదీల్లో మూడు విభాగాల్లో పాడి రైతులకు పోటీలు ఉంటాయని, ఈ పోటీల్లో పాడిరైతులు పాల్గొనేలా చొరవ తీసుకోవాలని సంబంధిత అధికారులను పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్ ఆదేశించారు. మంచి పాల ఉత్పత్తి సాధిస్తున్న పాడి రైతులను గుర్తించి వారి పాడి పశువులు, లేదా గేదెలను తీసుకుని పోటీల్లో పాల్గొనేలా చొరవ తీసుకోవాలన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయం నుంచి అనంతపురం, ఉరవకొండ డీడీలు, ఏడీలు, అలాగే పశువుల డాక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సంకరజాతి ఆవులు 18 లీటర్లు, దేశీయజాతి ఆవులు 6 లీటర్లు, గేదెలు 8 లీటర్ల విభాగంలోమూడు రకాల పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో గెలుపొందిన మూడు విభాగాల్లోనూ మొదటి, రెండు, మూడో బహుమతి కింద నగదు పురస్కారం ఉంటుందని తెలిపారు. 8న పాల దిగుబడి పోటీలు, 9న లేగ దూడల ప్రదర్శన, ఉచిత గర్భకోశవ్యాధి శిబిరం, 9న హుమతుల ప్రదానోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన పశుసంపద పెంపు లక్ష్యంగా రాయలసీమలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. -
ఈ యంత్రాలు రైతు నేస్తాలు
బొమ్మనహాళ్: వరిగడ్డిని కట్టకట్టే యంత్రాలు రావడంతో రైతులకు గ్రాసం కొరతకు పరిష్కారం లభించింది. ప్రస్తుతం వరికోతకు కూలీలకు బదులుగా రైతులు పెద్దసంఖ్యలో యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటితో వరిగడ్డి రైతులకు అందకుండా పోతోంది. దీంతో పశుగ్రాసం సమస్య వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త వచ్చిన యంత్రం(స్ట్రా బేలర్ ) ఈసమస్యకు చెక్పెడుతోంది. మరోవైపు రైతులకు అదనపు ఆదాయం లభిస్తోంది. ఎండుగడ్డి సేకరణ సులభం స్ట్రా బేలర్ యంత్రం ఎండుగడ్డి సేకరణ సులభమైంది. ట్రాక్టర్ యజమానులు ఈ యంత్రాలను కొనుగోలు చేసి మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 180 వరకు ఈయంత్రాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 53,549 హెక్టార్లలో వరి పంట సాగైంది. ఇప్పటికే దాదాపు 80 శాతం మేర వరి కోతలు పూర్తయ్యాయి. యంత్రాలతో కోసిన గడ్డిని స్ట్రా బేలర్ యంత్రాలతో ఒబ్బిడి చేయడం ప్రారంభించారు. స్ట్రా బేలర్ యంత్రంతో సేకరించే పొలంలో ఎకరాకు దాదాపు 1.5 టన్నుల గడ్డి లభిస్తుంది. ఒక్కో గడ్డి మోపు సుమారు 20 కేజీలు ఉంటుంది. ఇలా ఎకరాకు దాదాపు 75 వరకూ గడ్డి మోపులు లభిస్తాయి. ఒక్కోక్క గడ్డిమోపునకు రూ.35 చొప్పున పలకడంతో ఎకరాకు రూ.2,625 ఆదాయం లభిస్తుంది. గతంలో నిరుపయోగంగా మారిన ఎండుగడ్డిని ఈ స్ట్రా బేలర్ యంత్రంతో ఒబ్బిడి చేసుకుని రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. ఎండుగడ్డి సేకరణకు అందుబాటులోకి వచ్చిన స్ట్రాబేలర్ యంత్రాలు రైతు నేస్తాలుగా మారాయి. దీనివల్ల వారికి ఆదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో మాదిరిగా పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టి విధానాన్ని వదిలేశారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడంతో పాటు పశుగ్రాసం కోరత సమస్య తీరింది. – సాయికుమార్, ఏఓ, బొమ్మనహాళ్ -
చేయని పనులకు బిల్లులు
అనంతపురం: తాడిపత్రి నియోజకవర్గంలో చేయని పనులకు బిల్లులు పెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సోమవారం కలెక్టర్ ఆనంద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్పంచులకు తెలియకుండా పంచాయతీ కార్యదర్శులు, ఈఓ (పీఆర్, ఆర్డీ), ఎంపీడీఓ, కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు కుమ్మకై ్క 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు స్వాహా చేశారన్నారు. తాడిపత్రి మండలం బోడాయపల్లి పంచాయతీలో చేయని పనులు చేసినట్లుగా రికార్డులు సృష్టించి రూ.6 లక్షల బిల్లులు డ్రా చేశారన్నారు. అలాగే ఆలూరు గ్రామ పంచాయతీలో రూ.13 లక్షలు, వెలమకూరులో రూ.6 లక్షలు, గంగాదేవిపల్లిలో రూ.18 లక్షలు, ఊరుచింతలలో రూ.23 లక్షలు, తేరన్నపల్లిలో రూ.లక్ష, ఇగుడూరులో రూ.9 లక్షలు, భోగసముద్రంలో రూ.25 లక్షలు, దిగువపల్లిలో రూ.లక్ష, చల్లవారిపల్లిలో రూ.5 లక్షలు, గన్నెవారిపల్లిలో రూ.30 లక్షల చొప్పున తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా రూ.5 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై జ్యుడీషియల్ విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. వ్యవస్థలన్నీ జేసీ కనుసన్నల్లోనే.. తాడిపత్రిలో వ్యవస్థలన్నింటినీ జేసీ ప్రభాకర్రెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నాడని, ప్రతి అధికారీ ఆయన కనుసన్నల్లోనే పనిచేసేలా హుకుం జారీ చేస్తున్నాడని కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్లో తాడిపత్రిలో పీపీపీ (ప్రభాకర్రెడ్డి, పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్) విధానం తీసుకొస్తారేమోనని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదని, ప్రతిపక్ష నాయకులను కొట్టినా కొట్టించుకుంటామని, కేసులు పెట్టించుకుంటామని అన్నారు. కానీ సామాన్య ప్రజలనైనా కాపాడాలని అధికారులను కోరుతున్నామన్నారు. పరిశీలిస్తాం అని కాలయాపన చేస్తూ వస్తున్నారన్నారు. మరో నాలుగు మట్కా కంపెనీలు పెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోరేమో అంటూ ఎద్దేవా చేశారు. విపరీతంగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టండి కలెక్టర్ను కోరిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి -
పేదల స్థలాల్లో పచ్చ నేతల పాగా
● జగనన్న లే అవుట్లలో పేదల స్థలాలను కబ్జా చేస్తున్న టీడీపీ నేతలు ● గ్రామాల్లో మళ్లీ కక్షలకు ఆజ్యం పోస్తున్న తమ్ముళ్లు ● పట్టించుకోని పోలీసులు, అధికారులు ఆత్మకూరు: అధికారం మాది.. మేం ఏం చేసినా అడ్డు చెప్పేవారు లేరు.. ఏం చేసినా అడిగేవారు రారు అన్న తరహాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో కక్షలకు ఆజ్యం పోస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. 242 మందికి పట్టాలు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలు, కులమతాలతో సంబంధం లేకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల స్థలాలపై టీడీపీ నేతల కన్నుపడింది. పట్టాలు పొందిన వారిని బెదిరిస్తూ స్థలాలను కొట్టేసేందుకు యత్నిస్తున్నారు. ఆత్మకూరు మండలంలోని బి. యాలేరు గ్రామంలో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో 242 ఇంటి పట్టాలను పేదలకు అందజేశారు. అందులో చాలా మంది ఇళ్లను కూడా నిర్మించుకున్నారు. అయితే చాలా మంది స్తోమత లేని వారు పునాదులు వేసుకున్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ సానుభూతి పరులు, నిరుపేదలకు కేటాయించిన స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు. అడ్డువచ్చిన వారిపై దాడులు.. దౌర్జన్యంగా తమ స్థలాలను ఎలా స్వాఽధీనం చేసుకుంటారు అని అడిగిన పాపానికి పేదలపై టీడీపీ నేతలు బహిరంగంగానే దాడులు చేస్తున్నారు. మీ అంతు చూస్తాం ... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి రేగుతోంది. టీడీపీ నేతలు దాడులు చేయడంతో పాటు అక్రమంగా స్థలాలను ఆక్రమిస్తుండటం సరికాదని ప్రజలు మండిపడుతున్నారు. పట్టించుకోని అధికారులు.. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడుతున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. అధికారుల ఆధ్వర్యంలో పట్టాలు తీసుకున్నామని, తమ స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే వారు పట్టించుకోకపోవడం సరికాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాలను మార్చడానికి లేదు గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చినవి డిజిటల్ పట్టాలు. ఆ పట్టాలను రద్దు చయడానికి ఎలాంటి అవకాశం లేదు. రద్దు చేయమని ఎలాంటి నిర్ణయాలు ప్రభుత్వం ఇవ్వలేదు. తమ స్థలాలను కబ్జా చేస్తున్నారని ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదు. – నాగేంద్ర , వీఆర్వో, బి.యాలేరు -
వైభవంగా రంగనాఽథుని కల్యాణం
తాడిపత్రిటౌన్: మండలంలోని ఆలూరు కోన రంగనాథుని ఆలయంలో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత ఆలూరు రంగనాయకుని కల్యాణం వైభవంగా జరిగింది. పట్టువస్త్రాలు, పూలహారాలతో ఉత్సవ విగ్రహాలను అలంకరించి వేదమంత్రాల నడుమ మంగళవాయిద్యాలతో అర్చకులు ఘనంగా కల్యాణాన్ని నిర్వహించారు. స్వామి వారి కల్యాణం తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆలయ పురవీధుల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తర్వాత భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
ప్రకృతి ప్రకోపం.. పాలకుల నిర్లక్ష్యం.. వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపింది. పంట దిగుబడులు తగ్గిపోవడం.. అరకొర పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం.. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడం.. వెరసి అన్నదాతలు సంక్షోభంలో కూరుకుపోయారు. సూపర్సిక్స్ అ
అరటి రైతు ఆక్రందన... చిక్కిపోయిన చీనీ జిల్లా రైతులకు అంతో ఇంతో ఆదుకుంటున్న ఉద్యాన పంటలు ఈసారి దెబ్బతీశాయి. 86 వేల ఎకరాల విస్తీర్ణంలో చీనీ తోటలు ఉండగా.. వాటి ద్వారా 5.20 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడులు వచ్చాయి. టన్ను కనీసం రూ.40 వేలు పలికితే తప్ప గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఈ ఏడాదంతా నాణ్యమైన చీనీ టన్ను రూ.20 వేలకు మించలేదు. మిగతా పంట రూ.10 వేలు, రూ.15 వేల మధ్యనే అమ్ముడుపోవడంతో భారీ నష్టాలు చవిచూశారు. అంచనా ప్రకారం ఈ ఏడాది చీనీ రైతులకు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అరటి ధరలు దారుణంగా పతనమయ్యాయి. గెలలతో ఉన్న తోటలను దున్నేశారు. నిలువునా నిప్పుపెట్టేశారు. నవంబర్ నెలంతా అరటి రైతుల ఆక్రందనలు మిన్నంటినా చంద్రబాబు ప్రభుత్వం చలించలేదు. టన్ను రూ.2 వేలకు మించకపోవడంతో ఒక్క నెలలోనే అరటి రైతులు రూ.200 కోట్లకు పైగా నష్టపోయారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో ఎండిన వేరుశనగ పంటతో రైతు ఆవేదన అనంతపురం అగ్రికల్చర్: జిల్లా రైతులకు 2025 సంవత్సరం నిరాశ మిగిల్చింది. జనవరి 8న కేంద్ర కరువు బృందం పర్యటించింది. 2024లో కరువు మండలాల జాబితాలో కంటితుడుపుగా ప్రకటించిన ఏడు మండలాల్లో కరువు పరిస్థితులు తెలుసుకునే నిమిత్తం ఇంటర్మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ) పర్యటించగా రూ.112.05 కోట్లు అందించి ఆదుకోవాలని అప్పటి కలెక్టర్ వినోద్ కుమార్ విన్నవించారు. కానీ ఇప్పటి వరకు పైసా ఇన్పుట్ సబ్సిడీ అందలేదు. ఆదిలోనే ఇలా మొదలైన కష్టాలు ఏడాది పొడవునా కొనసాగడంతో రైతులు కోలుకోలేకపోయారు. ఖరీఫ్, రబీ అస్తవ్యస్తం.. ఓ వైపు ఏప్రిల్, మేలో అకాల వర్షాలు, మరోవైపు జూన్ నుంచి ఆగస్టు 5 వరకు 55 రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు, ఇంకోవైపు ఆగస్టులో సాధారణం కన్నా రెండింతలు అధికంగా 165.9 మి.మీ భారీ వర్షాలు కురవడంతో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. పడుతూ లేస్తూ ఖరీఫ్లో 3.50 లక్షల హెక్టార్లు, రబీలో లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. అననుకూల వర్షాలతో అరకొరగా పంట దిగుబడులు చేతికొచ్చాయి. పంట పండే పరిస్థితులు లేవని చాలా మంది రైతులు ప్రధానపంట వేరుశనగ వేయడం మానేశారు. దీంతో 65 ఏళ్ల జిల్లా చరిత్రలో వేరుశనగ కేవలం 90 వేల హెక్టార్లకు పరిమితమైంది. అదే సమయంలో కంది పంట 55 వేల హెక్టార్లు అంచనా వేయగా ఏకంగా 1.34 లక్షల హెక్టార్లకు చేరుకుంది. పంట కోత ప్రయోగాల ఫలితాలు విశ్లేషిస్తే ఒక్క పంట కూడా పండలేదు. సగానికి సగం దిగుబడులు తగ్గిపోవడంతో రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. ఇక ఖరీఫ్ సీజన్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో జిల్లాలో ఒక్కటీ లేకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. కనీసం రబీలోనైనా కరువు జాబితాలో ‘అనంత’కు చోటు కల్పిస్తారా లేదా అనేది వేచిచూడాలి. అపార నష్టం మిగిల్చిన అకాల వర్షం.. ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు, ఈదురుగాలులు ముంచెత్తాయి. అవసరం లేని సమయంలో సాధారణం కన్నా మూడింతల వర్షం అధికంగా కురిసింది. దీంతో అపార పంట నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, మామిడి, చీనీ, కూరగాయల పంటలు వేలాది ఎకరాల్లో దెబ్బతినడంతో రూ.120 కోట్ల వరకు పంటనష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. రూ.35.47 కోట్ల ఇన్పుట్సబ్సిడీ వచ్చేలా చర్యలు తీసుకుంటామని మే 8న అప్పటి కలెక్టర్ వినోద్కుమార్ ప్రకటించినా... ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా విడుదల చేయలేదు. ఆగస్టులో భారీ వర్షాలకు వరి, వేరుశనగ, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా... అక్టోబర్, నవంబర్లో మోంథా, దిత్వా తుఫాను వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు పప్పుశనగ, కంది, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని జిల్లా నుంచి నివేదికలు పంపినా ఎటువంటి స్పందనా లేదు. యూరియా కష్టాలు... విత్తన వెతలు ఎన్నడూ లేనివిధంగా ఈసారి రైతులను యూరియా కష్టాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. బస్తా యూరియా కోసం పొలం పనులు మానుకుని రెండు మూడు రోజులు తిరిగేలా చేశారు. ఆర్ఎస్కేలు, సొసైటీలు, ప్రైవేట్ దుకాణాల్లో ‘నో స్టాక్’ బోర్డులు పెట్టడంతో అన్నదాత అవస్థలు వర్ణనాతీంగా మారాయి. జిల్లాకు చేరిన యూరియాలో చాలావరకు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపించాయి. ఇక ఖరీఫ్, రబీలో రాయితీ విత్తన కేటాయింపులు, సబ్సిడీలు కుదించడంతో రైతులు బయట కొనుగోలు చేసి పంటలు సాగు చేశారు. రైతు కుటుంబాలపై చిన్నచూపు.. పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక, పిల్లల పెళ్లిళ్లు, చదువులకు చేసిన అప్పులు తీర్చేమార్గం లేక 82 మంది రైతులు ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబాల పట్ల చంద్రబాబు సర్కారు చిన్నచూపు చూసింది. ఒక్కరికి కూడా ఎక్స్గ్రేషియా చెల్లించలేదు. 2024లో 33 మంది, 2025లో ఇప్పటి వరకు 27 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో 22 మంది రైతులవి ఆత్మహత్యలు కాదంటూ పక్కనపెట్టేశారు. పట్టు, పాడికి ప్రోత్సాహం కరువు.. వ్యవసాయం, ఉద్యానం దెబ్బతిన్నా పట్టు (మల్బరీ), పాడి, పశుపోషణ ద్వారా గట్టెక్కుదామనుకున్న రైతులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయూత ఇవ్వలేకపోయింది. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మల్బరీ రైతులకు పైసా బడ్జెట్ విడుదల చేయకపోవడం గమనార్హం. పాడిని నమ్ముకున్న రైతులకు కూడా ఒక్క పథకమూ అమలు చేయలేదు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన అమూల్ ‘పాలవెల్లువ’ను కూడా మూసేయడంతో ప్రైవేట్ డెయిరీలు పాడి రైతులను దగా చేస్తున్న పరిస్థితి నెలకొంది. పశువుల ఆస్పత్రుల్లో మందుల కొరత కారణంగా పశువైద్యానికి ఇబ్బందిగా మారింది. దెబ్బతీసిన అననుకూల వర్షాలు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా ఊసేలేదు గిట్టుబాటు ధరలు లేక చిత్తయిన చీనీ, అరటి రైతులు కరువు మేఘాలు కమ్ముకున్నా జాబాతాలో లేని ‘అనంత’ అరకొరగా సుఖీభవ.. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలతో సరిపెట్టింది. మొదటి ఏడాది రూ.400 కోట్లకు పైగా సాయం ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. దీంతో రెండో ఏడాది (2025 సంవత్సరం) రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో విధిలేక ‘సుఖీభవ’ అందించారు. అందులో కూడా 20 వేల మందికి పైగా రైతులకు ఇవ్వకుండా కొర్రీలు వేశారు. ఇక వాతావరణ బీమా, ఫసల్బీమా పథకాల గురించి అతీగతీ లేదు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాలకు మంగళం పాడేసిన చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్లో రైతుల నుంచి ప్రీమియం వసూలు చేసింది. ఇక రబీలో బీమా పథకాలు అమలు కాకుండా కట్టిపెట్టేశారు. ఆర్బీకేకు పోవడం మానేశాను వైఎస్ జగన్ హయాంలో రైతుల కోసం ఊరూరా కట్టించిన ఆర్బీకేలను చంద్రబాబు ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు. వ్యవసాయ సేవలను తగ్గించడంతో ఆర్బీకేకు పోవడమే మానేశాం. గతంలో సీజన్ మొదలవగానే రాయితీ విత్తనాలు, అవసరమైన ఎరువులు, యంత్ర పరికరాలు, ఇతర అన్ని రకాల పథకాలు, కార్యక్రమాలు ఆర్బీకే వేదికగానే నిర్వహించేవారు. ఇప్పుడు నామమాత్రం చేయడంతో రైతులకు ఇబ్బందిగా మారింది. వ్యవసాయ పథకాలు లేకపోవడం, పంట నష్ట పరిహారం ఇవ్వకపోవడం వల్ల రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. – వీరభద్రప్ప, రైతు, శెట్టూరురైతులకు తీరని అన్యాయం చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. అన్నదాత సుఖీభవ తప్ప ఏ పథకమూ ఇవ్వడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. అదే జగన్ హయాంలో ఎంతగానో భరోసా లభించింది. రైతు భరోసా కింద ఏటా రూ.13,500 ప్రకారం ఐదేళ్లతో తమకు రూ.67,500 మేర వచ్చింది. వరికి రూ.25 వేలు ఇన్పుట్సబ్సిడీ, ఉచిత పంటల బీమా కింద రూ.1.30 లక్షలు, 2022లో రూ.1.20 లక్షల వరకు పరిహారం జమయ్యింది. – ఎం.పార్వతమ్మ, ఎం.చెన్నారెడ్డి, రైతు దంపతులు, నాగిరెడ్డిపల్లి, అనంతపురం రూరల్. -
ఒత్తిడికి గురి చేస్తే మెరుగైన ఫలితాలు ఎలా సాధ్యం?
అనంతపురం సిటీ: రకరకాల యాప్లు, రోజుకో కొత్త కార్యక్రమంతో విద్యార్థులు, ఉపాధ్యాయులను విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తే మెరుగైన ఫలితాలు ఎలా సాధ్యమవుతాయని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతపురం ఆదిమూర్తినగర్లోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఏపీటీఎఫ్ జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్, రాష్ట్ర పూర్వ కార్యదర్శి నరసింహులు, జిల్లా పూర్వ అధ్యక్షుడు వెంకటేశులు మాట్లాడారు. యాప్ల నమోదు, వంద రోజుల ప్రణాళిక లాంటివి పక్కాగా అమలు చేయాలని ఒత్తిడికి గురి చేయడం తగదన్నారు. పైగా ఇతర శాఖల అధికారులకు తమపై పెత్తనం చెలాయించే అధికారం ఇవ్వడం దుర్మార్గపు ఆలోచనని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాలను పునరాలోచించుకోవాలని, లేకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి సబ్ కమిటీ సభ్యులు తరలివచ్చారు. హోరాహోరీగా క్రికెట్ మ్యాచులుఅనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రికెట్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ఏఎస్ఏ ఉమెన్స్ కప్ టోర్నమెంట్ మ్యాచ్లు హోరాహోరీగా జరిగాయి. ఏఎస్ఏ జట్టుపై సౌతర్న్ స్ట్రైకర్స్ జట్టు 3 వికెట్లతో, కడపపై మయూఖా అకాడమి 4 వికెట్లతో, ఏవీ ఎన్సీఏ జట్టుపై 7 వికెట్ల తేడాతో సంప్రసిద్ధి అకాడమి జట్లు విజయం సాధించాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా సలోని (సంప్రసిద్ధి), షేక్ ముబీన (మయూకా), గీతిక కొడాలి (సౌతర్న్ స్ట్రైకర్స్) నిలిచారు. వారికి జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్రెడ్డి, సీనియర్ మహిళా క్రీడాకారిణిలు లతాదేవి, రాధిక మెమోంటోలను అందజేశారు. జాతీయస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికవజ్రకరూరు: మండల పరిధిలోని చిన్నహోతురు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆర్.భార్గవి జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, పీడీ ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ప్రకాశం జిల్లా పంగలూరులో జరిగిన అండర్ 18 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో భార్గవి ప్రతిభ కనబరచినట్లు చెప్పారు. ఈనెల 31 నుంచి బెంగళూరులో జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీలకు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్.భార్గవిని వారు అభినందించారు. కడుపునొప్పి తాళలేక యువకుడి ఆత్మహత్య యాడికి: కడుపు నొప్పి తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గుడిపాడులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి భార్య మల్లేశ్వరి వివరాలమేరకు... గుడిపాడుకు చెందిన తలారి వెంకటేష్ కుమారుడు శ్రీనివాసులు (35)కు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరానికి చెందిన మల్లేశ్వరితో వివాహమైంది. గనుల్లో లారీడ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు గత ఏడాది నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి తీవ్రం కావడంతో ప్రస్తుతం పనులకు వెళ్లడంలేదు. శనివారం భార్య, ఇద్దరు కుమారులను కొలిమిగుండ్ల మండలం బి.తాడిపత్రిలోని పిన్నమ్మ ఊరికి పంపిన శ్రీనివాసులు ఇంట్లో ఉండిపోయాడు. ఆదివారం ఉదయం ఆరు గంటల వరకూ నిద్రలేకపోవడంతో పక్క ఇంట్లో ఉన్న వెంకటేష్ వాకిలి తెరచి చూశారు. అప్పటికే శ్రీనివాసులు ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ బోలా.. యువకుడి మృతి శింగనమల (నార్పల): నార్పల మండలంలోని పులసలనూతల గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి పల్లె మహేంద్ర (22) మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... పులసలనూతలకు చెందిన పల్లె సూర్యనారాయణ కుమారుడు మహేంద్ర తన ఇంటి పని నిమిత్తం గ్రామ సమీపంలోని మట్టిని తీసుకొస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో మహేంద్ర అక్కడిక్కడే మృతి చెందాడు. మహేంద్రకు రెండు సంవత్సరాల క్రితం వివామైంది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాగర్ తెలిపారు. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడం కోసమే పోలీసుల చేత అక్రమ కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. అధికారం అడ్డుపెట్టుకుని కేసులు పెడుతూ పోతే చూస్తూ ఊరుకోబోమని, చట్టపరంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. టీడీపీ ముస్లిం మైనార్టీ నేత ముక్తియార్ ఆదివారం తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి అనంత వెంకట రామిరెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రజల ఆస్తులకు టీడీపీ నేతల నుంచి రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇంటి గొడవల్లోకి కూడా తలదూర్చి పోలీసులతో పంచాయితీలు చేయిస్తున్నారని విమర్శించారు. ఇంటి పెద్దలు ఎవరైనా చనిపోతే వాళ్ల ఆస్తులపై కన్నేస్తున్నారని విరుచుకుపడ్డారు. నకిలీ జీపీఏలు చేయించుకోవడం, నకిలీ పత్రాలు సృష్టించుకోవడం.. ఏకంగా హక్కుదారులపైనే దౌర్జన్యం చేయడం, అక్రమ కేసులు బనాయించి ఆస్తులు చేజిక్కించుకుంటున్నారన్నారు. నగరంలో అధికార పార్టీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయన్నారు. వీటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి శనివారం గుల్జార్పేటలో టీడీపీ దిమ్మె తొలగింపు సాకుతో వైఎస్సార్సీపీ నాయకుడిని అరెస్ట్ చేశారన్నారు. టూటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులతో సీఐ స్థాయి అధికారి నోటికొచ్చినట్లు మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ఇటీవల జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బర్త్డే వేడుకలను చేసుకుంటే ‘లా అండ్ ఆర్డర్’కు విఘాతం కలిగిందంటూ కేసులు పెట్టారన్నారు. బాలకృష్ణ కటౌట్.. ఫ్లెక్సీలకు జంతువుల తలలు వేలాడదీస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. అధికార పార్టీ వారికి ఒక న్యాయం.. ప్రతిపక్ష పార్టీల వారికి ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ అనంతపురంలో నిర్వహించిన బైక్ ర్యాలీకి వచ్చారని వైఎస్సార్సీపీ నాయకులను స్టేషన్లకు పిలిపించి బైండోవర్ కేసులు పెట్టారన్నారు. వ్యవస్థలను పోలీసులే నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, ఎస్ఈసీ మెంబర్ మీసాల రంగన్న, మేయర్ వసీం సలీం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, దామోదర్రెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మీదేవి, శ్రీనివాసులు, కమల్భూషణ్, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, వక్ప్బోర్డు జిల్లా మాజీ సభ్యులు కమర్తాజ్, జానీ, కొర్రపాడు హుస్సేన్ పీరా, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, సాదిక్, ఇస్మాయిల్, జావీదు, సుబ్బయ్య, తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో ప్రజల ఆస్తులకు రక్షణ కరువు పెరిగిపోతున్న అధికార పార్టీ నేతల అరాచకాలు ప్రజలను డైవర్ట్ చేయడానికే అక్రమ అరెస్టులు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి -
●మంచు కురిసే వేళలో..
శీతాకాలం కావడంతో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం పది గంటలైనా మంచు తెరలు తొలగడం లేదు. తెల్లవారుజామున చలి మరింత వణికిస్తోంది. అయినా ప్రజల దైనందిన పనులు ఆగడం లేదు. చలిలోనే పొలం పనులకు వెళ్తున్న రైతులు, కూలీలు, స్కూళ్లు, కాలేజీలకు బయలుదేరిన విద్యార్థులతో గ్రామీణ రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఆహారాన్వేషణకు సిద్ధమైన పక్షులు, ఇతర జీవరాశులతో ప్రకృతి రమణీయంగా గోచరిస్తోంది. ఆదివారం అనంతపురం–నార్పల మార్గంలో కన్పించిన దృశ్యాలివీ. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
ఐక్యతతోనే కురుబల అభివృద్ధి
అనంతపురం టవర్క్లాక్: ఐక్యతతోనే కురుబల అభివృద్ధి సాధ్యం. కురుబలు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను చదివించి విద్యావంతులు చేయాలని రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక కనక దాస కల్యాణ మంటపంలో ఉమ్మడి అనంతపురం జిల్లాల కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కురుబ కులంలో జేఈ, డీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి ఉద్యోగాలు సాధించిన వారికి ప్రతిభా పురస్కారాలు అందివ్వడంతో పాటు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మేయర్ రాగే పరుశురాం హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కురుబలు ఎంత కష్టం వచ్చినా సరే పిల్లలను చదివించాలని, అందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కురుబ సంక్షేమ సంఘం, ఉద్యోగా సంఘాలను ఆశ్రయించవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ కనపరిచిన పిల్లలకు పురస్కారాలు అందిస్తామమన్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఉద్యోగాలు సాధించిన 104 మందికి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తుప్పటి ఈశ్వరయ్య, ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు, సీపీఐ నాయకుడు జగదీష్, శివబాల, డాక్టర్ మహేష్, బోరంపల్లి ఆంజనేయులు, రుచీస్ హోటల్ వెంకటరమణ, బ్యాళ్ల నాగేంద్ర, కాణపాకం ఆలయం డైరెక్టర్ వసంతమ్మ, కృష్ణమూర్తి, నెమలివరం ఈశ్వరయ్య, విఠల్ గౌడ్ పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చాలి
● సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప డిమాండ్ అనంతపురం అర్బన్: ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారు. వాటిని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నలప్ప డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక గణేనాయక్ భవన్లో నగర కమిటీ సభ్యుడు మసూద్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చారని, అయితే వాటిని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి పక్కా గృహాలు నిర్మిస్తామని చెప్పారన్నారు. అర్హులకు పింఛను, రేషన్ కార్డులతో పాటు 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి పింఛను ఇస్తామని చెప్పినా అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పట్టించుకోలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లను పూర్తి చేసి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాన్నారు. రెండేళ్లు అవుతున్నా ఒక్కరికై నా ఇచ్చారా? అని ప్రశ్నించారు. నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో నగరాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. సమావేశంలో నాయకులు బాలరంగయ్య, వెంకటనారాయణ, ముర్తుజా, ప్రకాష్, ఇర్ఫాన్, గోపాల్, లక్ష్మినరుసమ్మ, అశ్విని, తదితరులు పాల్గొన్నారు. -
‘రామ’ రామ.. ఏమిటీ ‘దుర్గ’తి!
అనంతపురం క్రైం: అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు నగరపాలక సంస్థను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. అధికారుల నుంచి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరినీ గుప్పిట్లో ఉంచుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఎవరైనా వ్యతిరేకిస్తే దూషణలు, దౌర్జన్యాలు, బెదిరింపులతో వారిని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘అనంత’ ముఖ్య ప్రజాప్రతినిధి వద్ద ఉండే ‘పచ్చ’ నేత నగరపాలక సంస్థపై డేగకన్ను వేశాడు. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సంస్థ ఉద్యోగినే పావుగా వాడుకుంటున్న ‘దుర్గ’తి. కీలకమైన ఏ పని అయినా.. ఫైలు అయినా కచ్చితంగా వారి దృష్టికి రావాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తూ అధికారులను, ఉద్యోగులను బెదిరిస్తున్నారని సమాచారం. పాలకవర్గాన్ని ఏ అధికారి కలిసినా.. కార్యాలయ ఆవరణలో చీమ చిటుక్కుమన్నా వెంటనే ‘పచ్చ’నేతకు ఫొటోతో సహా చేరిపోతున్నాయి. చేయాల్సిన పని పక్కనపెట్టి అక్రమాలు.. దందాలకు మధ్యవర్తిగా మారి అధికార పార్టీ నేత సేవలో తరిస్తున్న మహిళా ఉద్యోగిని వ్యవహారం విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల మేయర్ వసీంను ఓ మహిళా ఉద్యోగి సంతకాల కోసం కలిసింది. ఆ రోజు సాయంత్రమే ఫొటోతో సహా అందడంతో సదరు ‘పచ్చ’ నేత కీలక ప్రజాప్రతినిధి కార్యాలయానికి మహిళా ఉద్యోగిని పిలిపించాడు. విధుల్లో భాగంగా మేయర్ను కలిసిన ఫొటోను వారు చూపించడంతో ఆమె కంగుతింది. ఫైలులో సంతకాల కోసం వెళ్లాను గానీ.. వ్యక్తిగతంగా తమకేమి పనుంటుందని ఆమె చెప్పినా పచ్చనేత శాంతించలేదట. ఇంకోసారి పాలకవర్గంలో ఏ ఒక్కరిని కలిసినా అదేరోజు కార్యాలయం వదిలి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించి పంపించాడట. మరో అధికారిణి కార్పొరేటర్ సుశీలమ్మ కుమారుడు చింతకుంట మధును విధినిర్వహణలో భాగంగా కాలనీలో ఓ భవన నిర్మాణం వద్ద నిలబడి మాట్లాడితే.. ఆ తర్వాత ఫొటోలతో సహా పచ్చనేతకు చేరిపోయాయట. అంతే సదరు అధికారిని పిలిపించుకుని ‘ఏం చేస్తున్నారమ్మా.. ఉండాలనుందా.. లేదా?’ అంటూ తీవ్రస్థాయిలో మందలించడంతో ఆమె కన్నీరుపెట్టుకున్నారట. నగరపాలక సంస్థలో పని చేయడమంటే డేంజర్లో ఉన్నట్టేనని భావించిన ఆ అధికారిణి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని తెలిసింది. నగరపాలక సంస్థలో పాగా వేసిన ‘పచ్చ’నేత కన్నా, అతని అనుచర వర్గం పేట్రేగిపోతోంది. అధికారులను ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ‘ఏం మేడమ్.. మేం అధికారంలో ఉండి కూడా మాకు కాకుండా మరొకరికి మీరు పనులు చేయడం ఏంట’ని ప్రశ్నిస్తుండటంతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. పని లేకపోయినా అదే పనిగా కార్యాలయంలోనే గంటల తరబడి తిష్టవేసి అనవసర విషయాలను చర్చిస్తూ తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. నగరపాలక సంస్థపై రహస్య నిఘా ఉద్యోగినే పావుగా మార్చిన టీడీపీ నేత పాలకవర్గాన్ని ఏ అధికారీ కలవకూడదట! కార్యాలయ వ్యవహారాలన్నీ ఫొటోలతో సహా చేరవేత ప్రతి ఫైలూ అటు వెళ్లాల్సిందే.. నగరపాలక సంస్థలో కీలకమైన ప్రతి ఫైలూ ‘అటు తిరిగి’ రావాల్సిందేనని కీలక విభాగాల అధిపతులు అంటున్నారు. వారికి తెలియకుండా ఏ ఫైలు ముందుకు కదిలినా మరుసటి రోజు మూల్యం చెల్లించుకోక తప్పదని వాపోతున్నారు. దీంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో 1920కి పైగా ఫైళ్లు పెండింగ్లో ఉంచారట. రెవెన్యూ విభాగంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారిందని తెలిసింది. ఆస్తి కొనుగోలు చేసిన వారి పేరుమీద గుత్తలు బదిలీ చేయాలన్నా.. అన్నదమ్ముల భాగపరిష్కారాల నేపథ్యంలో మార్పులు చేయాలన్నా ముందుగా అధికారపార్టీకి సమాచారం ఇవ్వాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి. చాలావరకు కొన్ని కాలనీల్లో నివాసం ఉంటున్న ఒంటరి మనుషుల వివరాలు కూడా వీరే అధికారపార్టీ నేతలకు చేరవేసి.. కబ్జాలకు తెగబడేందుకు పూర్తిగా సహకరిస్తున్నట్లు సమాచారం. తాజాగా శారదానగర్ విషయంలో వీరి హస్తం ఉన్నట్లు బయట పడటం చూస్తే.. అధికారపార్టీకి ఏ మేరకు తొత్తులుగా మారిపోయారో అర్థమవుతోంది. పేట్రేగిపోతున్న అనుచర వర్గం -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముక్కోటికి ముస్తాబు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఖాద్రీశుని దర్శనానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఆలయాన్ని ప్రత్యేక పూలతో సుందరంగా అలంకరిస్తున్నారు. శ్రీవారు భక్తులకు మంగళవారం తెల్లవారుజాము 3.30 గంటల నుంచి దర్శనమిస్తారని, సాయంత్రం 5.30 గంటలకు తీరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ‘ధర్మవరం నాట్య కళాకారులు’ ధర్మవరం అర్బన్: ధర్మవరం లలిత నాట్య కళానికేతన్ గురువులు, శిష్య బృందం మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కూచిపూడి కళా వైభవంలో ధర్మవరం లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ, రామ లాలిత్యతో పాటు 25 మంది నాట్య కళాకారులు బృంద నాట్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. ఇప్పటికే నాలుగుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించినట్లు గురువు బాబు బాలాజీ తెలిపారు. అనంతరం కళాకారులకు సర్టిఫికెట్లు, అవార్డులు అందించారు. విద్యుత్ స్తంభం పై నుంచి పడి యువకుడి మృతి కదిరి అర్బన్: విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన పట్నం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాలమేరకు... కదిరి మండలం రాచువారిపల్లితండాకు చెందిన సాయికుమార్నాయక్ (29) విద్యుత్శాఖ కాంట్రాక్టర్ వద్ద కూలి పనులకు వెళ్లేవాడు. పట్నం వద్ద ముదిగుబ్బ మండలానికి సంబంధించి 33 కేవీ లైన్ మార్చే పనులకు వెళ్లాడు. విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘానికి గురై కింద పడినట్లు తెలిపారు. వెంటనే కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే సాయికుమార్నాయక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
ఈవీఎంల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి
అనంతపురం అర్బన్: ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయ ఆవరణలోని గోడౌన్లలో ఈవీఎంలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడౌన్ల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగాలన్నారు. పరిసరాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చూడాలన్నారు. ఆర్డీఓ కేశవనాయుడు, ఎన్నికల డీటీ కనకరాజ్, ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. గునపం పోగొట్టారని గొడవ ● ఇద్దరికి తీవ్రగాయాలు ఉరవకొండ: రేణుమాకుపల్లిలో గునపం కోసం జరిగిన ఘర్షణలో ఇద్దరు గొర్రెల కాపరులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు పెద్ద ఎర్రిస్వామి, లాలుస్వామి, వన్నూర్స్వామి, గోవిందమ్మకు మరో వర్గానికి చెందిన గొర్రెల కాపరులు కుమార్స్వామి, గోపిల మధ్య గునపం పోగట్టారంటూ ఘర్షణ ప్రారంభమైంది. ఘర్షణలో గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వన్నూర్స్వామి కలగజేసుకోవడంతో ఇరువర్గాలు ఒకరి మీద ఒకరు కట్టెలతో దాడి చేసుకున్నాయి. ఇందులో పెద్ద ఎర్రిస్వామి, లాలుస్వామి తల, చేతులకు తీవ్రగాయాలు కావడంతో 108 వాహనంలో వీరిని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరినీ అనంతపురం తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కణేకల్లులో భారీ చోరీ ● 16 తులాల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి, రూ.2 లక్షల నగదు అపహరణ కణేకల్లు: పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు, స్థానికుల కథనం మేరకు స్థానిక ప్రభుత్వాసుపత్రి సమీపంలో తబుష్షుమ్, తన కూతురు, కొడుకుతో కలిసి నివసిస్తోంది. తబుష్షుమ్ చిన్నాన్న మృతి చెందడంతో భర్త, పిల్లలతో కలిసి సోమవారం హైదరాబాద్కు వెళ్లింది. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు శుక్రవారం రాత్రి ఇంటి వెనుక డోర్ నుంచి ఇంట్లో చొరబడిన దుండగులు 16 తులాల బంగారు ఆభరణాలు, 2 కేజీల వెండి, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. శనివారం ఇంటికి వచ్చిన తబుష్షుమ్ చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహళ్ ఎస్ఐ నబీరసూల్ క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రంగంలో దింపి ఆధారాలు సేకరించారు. వెనుక డోర్ నుంచి ఇంట్లో చొరబడి చోరీ చేయడంతో ఈ ఇంటి గురించి బాగా తెలిసిన వారే చోరి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సౌత్ జోన్ పోటీలకు ఎస్కేయూ ఇంజినీరింగ్ విద్యార్థినులు అనంతపురం ఎడ్యుకేషన్: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ (ఉమెన్) పోటీలకు ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈసీఈ బ్రాంచ్ 4వ సంవత్సరం విద్యార్థిని బి.భారతి, మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్.నిషిత సౌత్ జోన్ టోర్నీకి ఎంపికయ్యారు. ఈనెల 29 నుంచి 2026 జనవరి 2 వరకు బెంగళూరు క్రిష్ట్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సౌత్ జోన్ స్థాయి టోర్నీ నిర్వహించనున్నారు. ఎంపికై న విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.రామచంద్ర, స్పోర్ట్స్ ఇన్చార్జ్ కె.శివానంద, ఇతర అధ్యాపకులు అభినందించారు. -
డీసీఎంఎస్ పర్సన్ ఇన్చార్జ్ పదవీకాలం పొడిగింపు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) పర్సన్ ఇన్చార్జ్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఈమేరకు ప్రభుత్వ ఎక్స్ అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పర్సన్ ఇన్చార్జ్గా ఉన్న నెట్టెం వెంకటేశులు పదవీకాలం శనివారంతో ముగిసింది. ఇపుడు మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తరులు ఇచ్చారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జ్ పదవీ కాలాన్ని కూడా ఆరు నెలలు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు ● 45 నిమిషాలైనా రాని 108 వాహనం శింగనమల: శివపురం వద్ద ఎన్హెచ్544–డీపై జరిగిన ప్రమాదంలో తాడిపత్రికి చెందిన దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఆదినారాయణ, లక్ష్మీదేవి బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లికి వెళ్లి, తిరిగి తాడిపత్రికి బైక్పై బయలుదేరారు. శివపురం వద్దకు రాగానే బైక్ డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో భార్య, భర్తలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 కోసం ఫోన్ చేసి 45 నిమిషాలు వేచి చూసినా రాకపోవడంతో రోడ్డు పనులు చేస్తున్న అంబులెన్స్లో అస్పత్రికి తరలించారు. -
బి.యాలేరులో రెచ్చిపోయిన రౌడీషీటర్లు
● వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడిన బండి పరుశురాం తదితరులు ● రౌడీషీటర్లకు పరిటాల కుటుంబం అండ సాక్షి టాస్క్ఫోర్స్: అధికారం మదంతో రౌడీషీటర్లు బండి పరుశురాం, ఈడిగ ఈశ్వరయ్య శనివారం ఆత్మకూరు మండలం బి.యాలేరులో రెచ్చిపోయారు. వివరాలు.. శనివారం వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి బి.యాలేరులో గ్రామస్తులతో మాట్లాడుతుండగా భూసమస్య విషయంలో బండి పరశురాం వాదనకు దిగాడు. అయితే అన్నదమ్ముల సమస్యను మీరే పరిష్కరించుకోవాలంటూ తోపుదుర్తి చందు సర్దిచెప్పేందుకు యత్నించినా రెచ్చిపోయాడు. టీడీపీ నాయకులకు అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు చేశారు. ఈక్రమంలో వారు తిరగబడడంతో రౌడీషీటర్లు తోకముడిచారు. రోజురోజుకూ పెరుగుతున్న దౌర్జన్యాలు టీడీపీ అధికారంలోకి రాగానే బి. యాలేరులో వైఎస్సార్ విగ్రహం చేయిపై దాడి చేశారు. వైఎస్ జగన్, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పేర్లున్నాయన్న అక్కసుతో ఆర్బీకే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళకు జుట్టు కత్తిరించారు. బండి బాలకొండమ్మ, బండి చిన్న అహోబిలంపై నడి బజార్లో రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. జగనన్న కాలనీల్లో రౌడీషీటర్ల టీడీపీ నేతలు పేరు చెప్పుకుని రూ.10 వేలు తీసుకొని ప్లాట్లు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. పరిటాల కుటుంబం అండతోనే రౌడీషీటర్లు బండి పరుశురం, ఈడిగ ఈశ్వరయ్య దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఆస్తి కాజేయాలనే కక్షగట్టాడు : బండి నాగరాజు రౌడీ షీటర్ బండి పరశురాం, వాళ్ల నాన్న బండి ముసలన్న మా పొలాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మా తాత ఓబులేసుకు ఐదుగురు సంతానం. రెండు సర్వే నంబర్లలోని భూమిని వారుసులైన బండి మలరాయుడు, బండి ముసలన్న, బండి పెద్ద అహోబిలం, బండి చిన్న అహోబిలం, బండి శంకరయ్య సమానంగా పంచుకున్నారు. మానాన్న బండి చిన్న అహోబిలం వాటాగా వచ్చిన 3.23 ఎకరాల భూమిని బండి ముసలన్న, ఆయన కొడుకు బండి పరశురాం ఆక్రమించాలని చూస్తున్నారు. నాకు వంశపారంపర్యంగా వచ్చిన భూమినే ఆన్లైన్లో ఎక్కించుకున్నా. ఆ భూమిపై నిజంగా నాకు హక్కు లేకుంటే.. దౌర్జన్యంగా గత ప్రభుత్వంలో ఆన్లైన్లో ఎక్కించుకుని ఉంటే.. మరి ఎమ్మెల్యే పరిటాల సునీత రెండేళ్లుగా ఎందుకు రద్దుపరచలేకపోయారు. చట్టబద్ధంగా ఉన్న ఆ భూమి విషయంలో ఏమీ చేయలేమనే విషయం వారికి తెలుసు. కావాలనే పరిటాల కుటుంబం బండి పరుశురాం ద్వారా తోపుదుర్తి కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయిస్తోంది. పరుశురాం అన్న పిల్లలను ఎన్టీఆర్ స్కూల్లో చదివిస్తున్నాం కనుక.. తాము చెప్పినట్టుగా తోపుదుర్తి కుటుంబంపై అసత్యపు ఆరోపణలు చేయాలంటూ ఉసిగొలుపుతున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడి చేస్తున్న టీడీపీ నేతలు, చందు వాహనం వద్ద పరశురాం హల్చల్ ప్రజలకు భూములిచ్చాం : తోపుదుర్తి చందు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఇంటి స్థలాలు లేని ప్రజలకు సొంత డబ్బుతో భూములు కొని పట్టాలిప్పించాం. భూములు లాక్కునే దుస్థితిలో మా కుటుంబం లేదు. కావాలనే ఎమ్మెల్యే సునీత, ధర్మవరం బాలాజీ బండి పరశురాం అనే వ్యక్తిని రెచ్చగొట్టి సమావేశాల్లో గొడవలు సృష్టించేలా మాట్లాడిస్తూ కక్షలు రేపుతున్నారు. వైఎస్సార్సీపీకి పెరుగుతున్న జనాధరణ, ప్రకాష్రెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న జన బలం చూసి ఎమ్మెల్యే సునీత ఇలాంటి వారిచే తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● 40 తులాల బంగారు, 7 కేజీల వెండి, రూ.లక్ష నగదు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ జగదీష్ అనంతపురం సెంట్రల్: తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అనంతపురం సీసీఎస్, త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 70 లక్షల విలువైన 40 తులాల బంగారు నగలు, రూ.లక్ష నగదు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీసు కాన్ఫరెన్స్హాల్లో ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన యాదవల్లి మంజు, పిచ్చుగుంట్ల రామదాసు బళ్లారితో పాటు గుంటూరు, అనంతపురం జిల్లాలో చైన్ స్నాచింగ్లు, బ్యాగ్ల దొంగతనాలు, తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. అనంతపురం, తాడిపత్రి, గుత్తి, కసాపురం, డి.హీరేహాళ్, బుక్కరాయసముద్రం తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెలుతున్న మహిళల మెడల్లోని బంగారు చైన్లను లాక్కెళ్లారు. బస్సుల్లో ప్రయాణికుల మాదిరిగా జతకలిసి ఆదమరిచి ఉన్న సమయంలో బ్యాగ్లు చోరీ చేశారు. ఇటీవల దొంగలపై నిఘా పెట్టడడంతో బళ్లారి రోడ్డులో నిందితులు ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. మోస్ట్ వాంటెడ్ నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐలు శేషగిరి, జయపాల్రెడ్డి, రామయ్య, ఎస్ఐ రాజశేఖరరెడ్డి, త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్యాదవ్తోపాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
డీఐజీ షిమోషికి పదోన్నతి
అనంతపురం సెంట్రల్: అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషికి పదోన్నతి దక్కింది. 2008 ఐపీఎస్ క్యాడర్కు చెందిన ఆమెకు ఐజీగా పదోన్నతిగా కల్పిస్తూ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బదిలీ, పోస్టింగ్ ఉత్తర్వులు రాలేదు. దీంతో మరికొంత కాలం డీఐజీగానే ఆమె కొనసాగనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రేపు ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. సమస్యపై గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దాని రసీదు తీసుకురావాలన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekosam.ap.gov.in ద్వారా కూడా తెలియజేయవచ్చన్నారు. 10 మంది సిబ్బంది మించితే ఈఎస్ఐ పరిధిలోకే అనంతపురం కార్పొరేషన్: షాపులు, వాణిజ్య సంస్థలు, రెస్టారెంట్లు, లాడ్జీలు, హోటళ్లు, ఫ్యాక్టరీలు, పాఠశాలలు, కళాశాలలు తదితర వ్యాపార సముదాయాలు ఏవైనా పది మందికి మించి సిబ్బంది పనిచేస్తుంటే.. ఆ సంస్థలు కార్మిక రాజ్య బీమా సంస్థ (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ – ఈఎస్ఐసీ) పరిధిలోకి వస్తాయి. ఆయా సంస్థలు వెంటనే శ్రమ సువిధ/ ఎంసీఏ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’ అని అనంతపురం ఈఎస్ఐసీ బ్రాంచ్ మేనేజర్ జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా గతంలో ఉన్న బకాయిల పరిశీలన, జరిమానా లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఉద్యోగులు, సంస్థలు సోషల్ సెక్యూరిటీ, ఉచిత వైద్య సేవలు, బీమా, ప్రమాద భద్రత, తదితర సంక్షేమ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు నగరంలోని ఈఎస్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు షురూ.. ఉరవకొండ: పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లు షురూ అయ్యాయి. రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో వేడుకల నిర్వహణపై సందిగ్ధత నెలకొనడంపై ఈ నెల 26న ‘పెన్నహోబిలంపై నిర్లక్ష్యమేల’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి తిరుపతి దేవదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ స్పందించారు. పెన్నహోబిలంలో ముక్కోటి ఏకాదశి నిర్వహించడానికి జిల్లా దేవదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జునప్రసాద్ను ఇన్చార్జ్ ఫెస్టివల్ ఆఫీసర్గా నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించి, ముక్కోటి ఏకాదశి వేడుకలపై ఆలయ సిబ్బందితో సమీక్షించారు. అనంతరం వేడుకలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. -
మిగులు భూమిగా చూపి..
పచ్చజెండా పాతి.. రాప్తాడురూరల్: కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే కారణంతో ఇద్దరు రైతులపై టీడీపీ నేతలు కక్షగట్టి వారి పొలాలను లాక్కుకునేందుకు యత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండలం పుల్లలరేవు గ్రామానికి చెందిన బోయకులానికి చెందిన ఎస్. గోవిందు కుటుంబం గొందిరెడ్డిపల్లి పొలం 7.76 ఎకరాల గాజుబండ పొరంబోకు భూమిని దాదాపు 40 ఏళ్లుగా సాగుచేసుకుంటోంది. 2001 మార్చిలో ఈ భూమిని అసెస్డ్ వేస్ట్ (ఏడబ్ల్యూ)ల్యాండ్గా కన్వర్షన్ చేయాలంటూ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అప్పటి తహసీల్దార్ ఈమేరకు సిఫార్సు చేస్తూ ఆర్డీఓకు లేఖ రాశారు. అప్పట్లో ఆర్డీఓ ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో 2006లో ఎస్.గోవిందుకు 103–2 (కొత్త సర్వేనంబరు)లో 4.90 ఎకరాలు, 2007లో గోవిందు పెద్ద కుమారుడు ఎస్.పెద్ద ఓబులేసుకు 103–3 సర్వే నంబరులో 2.86 ఎకరాల భూమికి వ్యవసాయ భూమి పట్టాలు మంజూరు చేశారు. గోవిందు చనిపోవడంతో ఆయన పేరుపై ఉన్న 4.90 ఎకరాలను చిన్న కుమారుడు ఎస్.వసంతు పేరుపై పట్టాదారు పాస్తుకంతో పాటు ఆన్లైన్లో ఎక్కించారు. ఆరు బోర్లు వేయడంతోపాటు పైపులైను, డ్రిప్ ఏర్పాటు చేశారు. పంట రుణాలు, ఎల్టీ లోన్లు తీసుకున్నారు. కరెంటు బిల్లులు కడుతున్నారు. చింతచెట్లు, నేరేడు, టెంకాయచెట్ల పెట్టడంతోపాటు అంతర పంటలూ సాగు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే... 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే ‘ఇది పొరంబోకు’ భూమి అంటూ గ్రామంలో ఉన్న కొందరు టీడీపీ నాయకులు పెద్ద ఓబులేసు, వసంతు భూముల్లో టీడీపీ జెండా నాటారు. తర్వాత కొద్దిరోజులకు కొన్ని నేరేడు చెట్లను తొలగించారు. ఆ తర్వాత టెంకాయచెట్లకు నిప్పుపెట్టారు. దీనిపై రాప్తాడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. ఇక మూడోసారి ఏకంగా మొత్తం చెట్లన్నీ తొలగించడంతో పాటు పైపులైను, మోటార్లను తొలగించి అగ్గిపెట్టారు. మరీబరి తెగిస్తుండడంతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కొత్తగా మొక్కలు నాటుకునేందుకు తనవంతు ఆర్థికసాయం అందిస్తానని భరోసా కల్పించారు. గత నెలలో నోటీసు ఇచ్చిన అధికారులు పెద్ద ఓబులేసు, వసంతు పేర్లు ఆన్లైన్లో తొలగించాలంటూ గ్రామానికి చెందిన ఎం.రమేష్, టి.కృష్ణయ్య, యు.జయప్ప, సి.శంకర్, కె.కృష్ణయ్య, సి.నల్లప్ప, సాయినాథ్నాయుడు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో గత నెలలో వారిద్దరికీ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. నోటీసు అందుకున్న బాధితులు జిల్లా, హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారులు, రెవెన్యూ అధికారులకు హైకోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో వారు వెంటనే అధికారులపై ఒత్తిళ్లు చేయించి మరీ ఆన్లైన్ నుంచి రైతుల పేర్లు తీయించేశారు. 7.76 ఎకరాల భూమిని మిగులు భూమిగా చూపిస్తున్నారు. భూమిని కొట్టేసేందుకు కుట్ర మిగులు భూమిగా చూపించిన ఇక్కడ గ్రామంలో ఇళ్లులేని పేదలకు ఇంటిస్థలాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ భూమి గ్రామానికి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఒకవేళ నిజంగా పేదలకు ఇళ్ల స్థలాలకు ఇవ్వాలనుకుంటే ఊరికి అనుకునే 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ ఎంతమందికై నా ఇవ్వొచ్చు. అయినా ఈ భూమినే ఇవ్వాలనుకుంటున్నారంటే వారి ఉద్దేశం ఎంటో అర్థం చేసుకోవచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ కూడా 20–30 ప్లాట్లు ఇచ్చి తక్కిన భూమిన గ్రామంలో ఉన్న కొందరు నాయకులు, మండలంలో కీలకంగా ఉన్న మరో నాయకుడు, ఓ రెవెన్యూ అధికారి భాగాలు పంచుకునేలా ప్రణాళిక రచించినట్లు ప్రచారం సాగుతోంది. సర్వే నంబర్ 103–2, 103–3 గాజుబండ పొరంబోకు భూమిలో 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. ఏడబ్ల్యూ ల్యాండుగా కన్వర్షన్ చేశారు. సాగు పట్టాలు కూడా ఇచ్చారు. పంటలు పెట్టుకుంటున్నాం. రుణాలు పొందాం. కరెంటు మీటర్లు ఉన్నాయి. మేము వైఎస్సార్సీపీ సానుభూతిపరులమనే కక్ష కట్టారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాకు అండగా నిలిచారు. – ఎస్.పెద్ద ఓబులేసు, ఎస్.వసంతు బాధితులు ఎస్.పెద్ద ఓబులేసు, ఎస్.వసంతులకు అండగా నిలుస్తాం. వైఎస్సార్సీపీ అభిమానులనే కక్షతో వారి భూములను లాక్కోవాలని చూస్తున్నారు. ఆ భూమిని కొట్టేసేందుకు పరిటాల కుటుంబం పూనుకుంది. పరిటాల సునీత, ఆమె సోదరుడు ధర్మవరపు మురళీ, స్థానిక నాయకులు, అధికారులు వాటాలుగా పంచుకోవాలని చూస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. – తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం బాధితులకు అండగా నిలుస్తాం పుల్లలరేవులో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల భూమిపై టీడీపీ నేతల కన్ను అధికారంలోకి రాగానే చెట్లు నరికివేత...తర్వాత పొలానికి నిప్పు ఇప్పుడు ఏకంగా ఆన్లైన్ నుంచి పేర్ల తొలగింపు -
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం పెరిగింది. ఈశాన్యం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
యజ్ఞంలా వంద రోజుల ప్రణాళిక అనంతపురం సిటీ: పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ‘వంద రోజుల ప్రణాళిక’ను ఒక యజ్ఞంలా చేపట్టాలని కడప ఆర్జేడీ శామ్యూల్ ఆదేశించారు. శనివారం ఆయన రీజనల్ పరిధిలోని అన్ని జిల్లాల డీఈఓలు, డిప్యూటీ డీఈఓలు, ఏడీలు, సూపరింటెండెంట్లు, ఎంఈఓలతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పెషల్ క్లాసులకు పదో తరగతి విద్యార్థుల హాజరు రోజురోజుకూ తగ్గిపోతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థీ విధిగా ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రోజూ స్లిప్ టెస్టులు పెట్టి.. మార్కులను యాప్లో అప్లోడ్ చేయాల్సిందేనన్నారు. లేకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని హెచ్చరించారు. పాఠశాలల్లో కావలిన వసతుల గురించి యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఎయిడెడ్ స్కూళ్లలో ఎంతమంది పిల్లలు, ఉపాధ్యాయులు ఉన్నారనే విషయం కచ్చితంగా ఉండాలన్నారు. సరైన సమాచారాన్ని ఈ నెల 31లోగా యాప్లో నమోదు చేయాలన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్లకు అన్ని విధాలా సహకరించి సమష్టి కృషితో మంచి ఫలితాలు సాధించేలా ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. ఏడీ శ్రీనివాసరావు, పరీక్షల విభాగం ఏసీ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. రగ్బీ రాష్ట్ర జట్టుకు ఎంపిక అనంతపురం సిటీ: నగర శివారులోని ఏజీఎస్ పాఠశాల మైదానంలో శనివారం నిర్వహించిన రగ్బీ రాష్ట్రస్థాయి జట్టు ఎంపిక ప్రక్రియకు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి 12 మంది బాలికలు, 12 మంది బాలురు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ గట్టు నాగరాజు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన నందిని, సాయిశ్రీ, శ్రావణి, అమృత, గాయత్రి, సుస్మిత, మహాలక్ష్మీ, త్రివేణి, గాయత్రి, వైజయంతి, అలేఖ్య, తేజశ్రీ ఎంపికయ్యారని వివరించారు. బాలుర విభాగంలో డింపుల్ సాయినాథ్, జీవంత్, రేవంత్, రాంచరణ్, నవనీత్, రిషిధర్, చక్రి, హేమసాయి, వరుణ్ సందేశ్, సాయిచరణ్, వినోద్కుమార్, సుభాష్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 29న కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రగ్బీ టోర్నమెంట్ సెక్రటరీ శంకర్ ఆధ్వర్యంలో పీడీలు సుదర్శన్, మురళి, చంద్ర నేతృత్వంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. -
త్రీటౌన్ సీఐ దురుసు ప్రవర్తన
అనంతపురం క్రైం: అనంతపురం పోలీసులు ‘పచ్చ’పాత ధోరణితో వ్యవహరించారు. చిన్న వివాదాన్ని తీవ్ర ఉద్రిక్త స్థాయికి తీసుకెళ్లారు. టూటౌన్ సీఐ శ్రీకాంత్యాదవ్ ఈ వివాదానికి ఆజ్యం పోయగా.. త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఏకంగా నిప్పు రాజేశారు. పెద్దమనిషిగా సమస్యను పరిష్కరించాల్సిన డీఎస్పీ శ్రీనివాసరావు కూడా వచ్చీ రాగానే ఏం జరిగిందన్న విషయాన్ని ఆరా తీయకుండా ‘కొడుకులను ఈడ్చుకెళ్లి లోపలేయండి’ అంటూ దురుసుగా మాట్లాడారు. ఏం జరిగిందంటే... అనంతపురంలోని గుల్జార్పేటలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. టీడీపీకి చెందిన కాంట్రాక్టరే ఈ పనులు చేస్తున్నాడు. ఇళ్ల ముందున్న మెట్లు, అరుగులు తొలగించే పనులు శనివారం సాయంత్రం మొదలుపెట్టారు. ఈ క్రమంలో టీడీపీ పేరు రాసి, జెండా ఏర్పాటు చేసిన చిన్న సిమెంటు దిమ్మె కాలువ తీయడానికి అడ్డుగా ఉండడంతో దాన్ని తొలగించారు. అక్కడే పనులను పర్యవేక్షిస్తున్న గుల్జార్ పేట్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ముంతాజ్బేగం కుమారుడు దాదాపీర్ కావాలనే టీడీపీ దిమ్మెను తొలగింపజేశారని ఆరోపిస్తూ.. ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు కొందరు వీడియో తీసి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టూటౌన్ పోలీసులు ఏకంగా దాదాపీర్పై కేసు నమోదు చేసి, అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచి జైలుకు తరలించాలని భావించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ఫోన్లో సమాచారం చేరవేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి కార్యకర్తలతో కలసి టూటౌన్ పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. నాయకులను, కార్యకర్తలను సీఐ శ్రీకాంత్ యాదవ్ మెయిన్ గేటు వద్దే అడ్డుకోవడంతో అందరూ అక్కడే బైఠాయించారు. పోలీసులు పక్షపాతం చూపుతున్నారు పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను వేధిస్తున్నారని ఆ పార్టీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీంతో పాటు రమేష్గౌడ్, సాకే చంద్ర, చింతా సోమశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ కార్పొరేటర్ కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. గతంలో మైనార్టీ మహిళ ఆత్మహత్యకు సంబంధించి ఫిర్యాదు చేస్తే స్పందించలేదన్నారు. పార్టీ నేత చింతకుంట మధు విషయంలోనూ అలాగే వ్యవహరించారన్నారు. జగనన్న జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలను టీడీపీ వారు కావాలనే కోసేశారని, తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులను చూస్తుంటే సిగ్గేస్తోందన్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన పోలీసులు దౌర్జన్య పరులు, కబ్జాదారులు, సెటిల్మెంట్లు చేస్తున్న వారికి అండగా నిలుస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి, జిల్లా బూత్ కన్వీనర్ ఎద్దుల అమర్నాథ్రెడ్డి, ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసురెడ్డి, రాష్ట్ర మైనార్టీ ప్రధానకార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, కార్పొరేటర్లు ముంతాజ్బేగం, అబ్దుల్ సాలేహా, కమల్భూషణ్, అనిల్కుమార్, రహంతుల్లా, ఇషాక్, శేఖర్బాబు, పార్టీ నాయకులు రాజ్కుమార్, రాధాకృష్ణ, దాదా ఖలందర్, వినీత్, నాగర్జునరెడ్డి, చింతకుంట మధు, మహేశ్వరి, ఓబుళేసు, ఉదయ్కుమార్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులతో దురుసుగా మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ శ్రేణులను నెట్టేస్తున్న పోలీసులు, స్టేషన్ ఆవరణలోకి కూడా రానివ్వకుండా, కనీసం విషయం ఆరా తీయకుండా సీఐ శ్రీకాంత్యాదవ్ గేటు వద్దే అడ్డుకోవడాన్ని వైఎస్సార్సీపీ నేతలు తప్పు బట్టారు. ఇంతలోనే త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ అక్కడికి వచ్చారు. వచ్చీ రాగానే ‘ఏం స్టేషన్ ముందు కూర్చుంటారా? మీరన్న ఇంతమందే వచ్చారు..నేను అనుకుంటే 300 మందినైనా దించి చూపిస్తా’ అంటూ రెచ్చిపోయారు. విషయం చెబుతున్న సీనియర్ నేత అనంత చంద్రారెడ్డి, సాకే చంద్రశేఖర్లను ‘ఏయ్.. ఏం చెయ్యి చూపిస్తావా’ అంటూ ఏక వచనంతో బూతులు తిట్టడం ప్రారంభించారు. దీంతో కార్యకర్తలు సీఐ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. సీఐలు రాజేంద్రనాథ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ మరింత రెచ్చిపోయారు. అదే సమయంలో డీఎస్పీ శ్రీనివాసరావు రంగంలోకి దిగి పెద్దమనిషిలా వ్యవహరిస్తారని చూస్తే ఆయన కూడా వారిబాటలోనే నడిచారు. ‘కొడుకులను లోపలేయండి’ అంటూ మాట్లాడారు. చివరకు జిల్లా ఎస్పీ జగదీష్ జోక్యం చేసుకుని వివాదం మరింత పెద్దది కాకుండా చూశారు. ఆయన ఆదేశాలతో స్టేషన్లోకి నేతలను పిలిచి మాట్లాడి పంపించారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కుమారుడి అక్రమ అరెస్టు పరామర్శించేందుకు వెళ్లిన పార్టీ నేతలను అడ్డుకున్న టూటౌన్ సీఐ శ్రీకాంత్యాదవ్ దీంతో గేటు ముందు బైఠాయించిన నేతలు, కార్యకర్తలు రంగంలోకి త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్.. వచ్చీ రావడంతోనే ‘నా కొడుకులు’ అంటూ దూషణ డీఎస్పీ శ్రీనివాసరావుదీ అదే తీరు -
అతివేగం.. తీసింది ప్రాణం
● ఆటోను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకుల దుర్మరణం ● ముగ్గురికి తీవ్రగాయాలు గుత్తి రూరల్: మండలంలోని ఊబిచెర్ల గ్రామం సమీపంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ఆటోను వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో పెద్దవడుగూరు మండలం మిడుతూరుకు చెందినరెడ్డి పోగుల రాజేష్(32), కొయిలదిన్నె నవీన్(25) మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రాజేష్ నంద్యాల జిల్లా ప్యాపిలిలో, నవీన్ ప్యాపిలి మండలం రోళ్లపాడు గ్రామంలో వివాహం చేసుకున్నారు. అయితే రాజేష్ భార్య కళావతి, నవీన్ భార్య స్వీటీ క్రిస్మస్కు పుట్టినిళ్లకు వెళ్లారు. రాజేష్, నవీన్ వారి భార్యలను పిలుచుకొని ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. అయితే పోదొడ్డి గ్రామ శివారులో హైదరాబాదు నుంచి బెంగళూరు వైపునకు వెళ్తున్న కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న రాజేష్, నవీన్, కళావతి, స్వీటీ, వర్ష తీవ్రంగా గాయపడ్డారు. హైవే అంబులెన్స్ ద్వారా వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజేష్ అసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నవీన్ అనంతపురం తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఆటో రోడ్డు పక్కన వెళ్తుండగా ఎదురుగా వెళ్తున్న లారీని ఎడమ వైపు నుంచి ఓవర్ టేక్ చేయబోయి కారు ఆటోను ఢీకొన్నట్లు బాధితులు తెలిపారు. మృతులు రాజేష్కు భార్య కళావతి, కుమార్తె వర్ష, నవీన్కు భార్య స్వీటీ ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్, కారును పోలీసులు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శోకసంద్రంలో మిడుతూరు పెద్దవడుగూరు : నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన నవీన్(23), రాజేష్(35) మృతి చెందడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన భర్తల మరణాన్ని భార్యలు కళావతి, స్వీటి జీర్ణించుకోలేక పోతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు. మృతులు రాజేష్, నవీన్ -
ఆటో బోల్తా : డ్రైవర్ మృతి
కణేకల్లు: మండలంలోని పూలచెర్ల గ్రామ శివారులో ఆటో బోల్తా పడిన ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు..పూలచెర్ల గ్రామానికి చెందిన వినోద్కుమార్ (20) తన స్నేహితునితో కలిసి పూల్లంపల్లికి బయలుదేరాడు. పూలచెర్ల గ్రామ శివారులో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఘటనలో వినోద్కుమార్ తీవ్రగాయాలయ్యాయి. మరోవ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. స్థానికులు వినోద్కుమార్ను బళ్లారి విమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చేనేత మగ్గాలకు నిప్పు
తాడిపత్రిటౌన్: పెద్దపప్పూరు మండలం నరసాపురం గ్రామంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు చేనేత మగ్గాలకు నిప్పుపెట్టారు. వివరాలు.. నరసాపురం చేనేత సోసైటీ కింద దాదాపు 30 మగ్గాలు ఉన్నాయి. అయితే మగ్గాలు ఉంచిన షెడ్డుకు దుండగులు నిప్పుపెట్టారు. అక్కడే నిద్రిస్తున్న రంగయ్య అనే వ్యక్తి మంటలను గుర్తించి కేకలు వేయగా దుండగులు పారిపోయారు. వెంటనే గ్రామస్తులు వచ్చి మంటలు ఆర్పేశారు. అయితే అప్పటికే రెండు మగ్గాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో రూ.50 వేలు నష్టం వాటిల్లినట్లు సొసైటీ నిర్వాహకుడు రమేష్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. -
శ్రుతిమించిన టీడీపీ నేతల ఆగడాలు
అనంతపురం అర్బన్: అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని, మంత్రి పయ్యావుల కుటుంబం అండతో విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామ పొలంలోని భూమిని ఆక్రమించారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని అడ్వకేట్ హరినాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు కేవీ రమణతో పాటు బాధితులతో కలిసి కలెక్టర్ ఆనంద్ను ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. వేల్పులమడుగు గ్రామ సర్వే నంబరు 141లోని 42.21 ఎకరాల్లో 21.05 ఎకరాలను 2023 జూన్ 24న (3430/2023, 3441/2023) రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా జయకుమార్ కొనుగోలు చేశాడని చెప్పారు. అనంతరం విడపనకల్లు తహసీల్దార్ ధ్రువీకరించి టైటిల్ డీడ్, పట్టాదారు పాసుపుస్తకం, అడంగల్, 1బీ జారీ చేశారని తెలిపారు. భూ యజమానిగా జయకుమార్ అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం ఆ భూమిలో కందిపంట సాగు చేశారని, పంట విత్తిన తరువాత జనార్దనపల్లికి చెందిన ఆర్.జనార్దన్, కృష్ణమూర్తి, సుధాకర్, పాండురంగ, తదితరులు చట్టవిరుద్ధంగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. దీంతో బాధితుడు అనంతపురం అదనపు సీనియర్ సివిల్ జడ్జి ముందు ఓఎస్ నంబరు 117/2025 దాఖలు చేశాడన్నారు. న్యాయస్థానం ఈ ఏడాది ఆగస్టు 13న ‘ఐఏ నంబరు 241/2025) మధ్యంతర నిషేధాన్ని మంజూరు చేసిందన్నారు. అయినా కబ్జాకు యత్నించిన వ్యక్తులు భూ యజమానిని భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. తప్పుడు నివేదికలతో పక్కదారి నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ భూ యజమానిని తన భూమిలోకి ప్రవేశించకుండా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి విడపనకల్లు ఎస్ఐ, ఉరవకొండ సీఐలు అడ్డుకుంటున్నారని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. భూ వివాదంపై తహసీల్దార్ విచారణ చేసి ఈ ఏడాది సెప్టెంబరు 4న ఎండార్స్మెంట్ ఇచ్చారన్నారు. ఆ భూమి జయకుమార్ పేరున ఉందని, రెవెన్యూ శాఖకు జ్యోకం చేసుకునే అధికారం లేదని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తహసీల్దార్ తన నివేదికను తానే మార్పు చేశారన్నారు. ధూప, దీప, నైవేద్యం కోసం భూమిని దానం చేశారని, జనార్దనపల్లికి చెందిన జనార్దన్ ఆ భూమిని సాగు చేస్తున్నారని ఈ నెల 22న తాజాగా నివేదిక సమర్పించారని చెప్పారు. దీంతో బాధిత రైతు హైకోర్టులో రిట్ పిటీషన్ (35899/2025) దాఖలు చేశాడన్నారు. ఈ వివాదం పూర్తిగా సివిల్ స్వభావాన్ని కలిగి ఉందని హైకోర్టు ఉత్తర్వు ద్వారా నిర్ధారించిందని, పోలీసులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించిందని వివరించారు. అయినా ఈ నెల 26న భూ యజమాని, ఆయన మామ లత్తవరం గోవిందు, వ్యవసాయ కార్మికులు పంట కోతకు వెళితే పోలీసులు, రెవెన్యూ అధికారులు మరోసారి అక్రమంగా అడ్డుకున్నారన్నారు. దీంతో 21 ఎకరాల్లోని పంట నాశనం అవడం వల్ల భూ యజమానికి దాదాపు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకాలకు పాల్పడుతున్న టీడీపీకి, పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతున్న పయ్యావుల కేశవ్కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పయ్యావుల అండతోనే భూ ఆక్రమణ కోర్టు ఆర్డరును సైతం లెక్క చేయడం లేదు బాధితులతో కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి -
పడకేసిన పారిశ్రామిక ప్రగతి
అనంతపురం టౌన్: ప్రోత్సాహక రాయితీలు అందకపోవడంతో పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతోంది. పరిశ్రమల విస్తృత ఏర్పాటుతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో ఎంతోమంది యువ పారిశ్రామిక వేత్తలు విస్తృతంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈల)ను ఏర్పాటు చేశారు. అయితే వారికి ప్రభుత్వం రాయితీలు మాత్రం అందడం లేదు. ఏడాదిన్నర కాలంగా పారిశ్రామికవేత్తలకు ఎదురుచూపులు తప్పడం లేదు. పారిశ్రామిక వేత్తలపై చిన్నచూపు జిల్లాలో 2023–27 పారిశ్రామిక పాలసీ కింద రూ.600 కోట్లకు పైగా పెట్టుబడులతో 1,200 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(ఎంఎస్ఎంఈల)ను ఏర్పాటు చేశారు. వీటిద్వారా ప్రత్యక్షంగా మూడు వేల మందికి, పరోక్షంగా మరో 1500 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంత పెద్ద ఎత్తున యూనిట్లు నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పారిశ్రామిక వేత్తలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఏడాదిన్నర కాలంగా రాయితీలు మంజూరు చేయకపోవడంతో పారిశ్రామిక వేత్తలు అవస్థలు పడుతున్నారు. రాయితీల రూపంలో చిన్న పరిశ్రమలకు మాత్రమే రూ.50 కోట్ల మేర మంజూరు చేయాల్సి ఉంది. పెద్ద తరహా పరిశ్రమలు జిల్లాలో 17 ఉన్నాయి. వీటికి సైతం ప్రోత్సహకాలు సకాలంలో అందడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి పరిశ్రమలు (యూనిట్లు) నెలకొల్పిన పారిశ్రామికవేత్తలకు రాయితీలు అందని మాట వాస్తవమే. జిల్లా వ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా రాయితీలు రావాల్సి ఉంది. పరిశ్రమ వివరాలు, యూనిట్ కాస్ట్, ఉపాధి తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ఇక రాయితీలపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అక్కడి నుంచి రాయితీలు మంజూరైతే పారిశ్రామికవేత్తల ఖాతాల్లో నేరుగా జమవుతుంది. – శ్రీనివాసయాదవ్, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల శాఖ పారిశ్రామికవేత్తలకు అందని రాయితీలు 1200 పరిశ్రమలకు రూ.50 కోట్ల మేర బకాయిలు ఏడాదిన్నరగా పారిశ్రామిక వేత్తల ఎదురుచూపు మీనమేషాలు లెక్కిస్తున్న చంద్రబాబు సర్కారు -
వణికిస్తున్న చలి
● అమడగూరులో 9.2, శెట్టూరులో 10.9 డిగ్రీలు అనంతపురం అగ్రికల్చర్: చలి పంజాతో ఉమ్మడి జిల్లా వణుకుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోయాయి. చలి తీవ్రత బాగా పెరిగింది. ఈనెల మొదటి నుంచి చలిగింతలు మొదలై క్రమంగా తారస్థాయికి చేరుకుంది. గురువారం అమడగూరులో 9.2 డిగ్రీలు, శెట్టూరులో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడక్కడా సింగిల్ డిజిట్కు పడిపోవడం విశేషం. మడకశిర, సోమందేపల్లి, తనకల్లు, శెట్టూరు, కుందుర్పి, విడపనకల్లు తదితర మండలాల్లో ఇటీవల 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా 27 నుంచి 32 డిగ్రీల మధ్య నమదవుతుండగా రాత్రిళ్లు 15 డిగ్రీల లోపు కొనసాగుతున్నాయి. దీంతో సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు చలితీవ్రత కనిపిస్తోంది. వేకువజామున పొగమంచు అధికంగానే ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. చలి బాగా పెరగడంతో జనం గజగజ వణుకుతున్నారు. ఓం నమో నారసింహా.... కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురువారం ఓం నమో నరసింహ...నామస్మరణతో మార్మోగింది. కదిరి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలు, కడప, చిత్తూరు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంతం కిక్కిరిసింది. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి ఏర్పాట్ల పరిశీలన ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ ఎన్. సతీష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులతో ఆయన మాట్లాడారు. భక్తులకు క్యూలలో ఎలాంటి అసౌర్యం కలగకుండా చూడాలన్నారు. త్వరితగతిన స్వామి దర్శనమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆయన కదిరి బైపాస్ వద్ద ఈ నెల 27,28 తేదీల్లో జరగనున్న ఇస్తెమా ఏర్పాట్లు కూడా పరిశీలించారు. -
ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పు
అనంతపురం సిటీ: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ఈ విద్యా సంవత్సరం నుంచి సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. సంస్కరణల్లో భాగంగా ఈ విద్యా సంవత్సరం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సిలబస్ మార్చిన సంగతి తెలిసిందే. పరీక్ష విధానంలోనూ నూతన విధానాలకు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. ప్రశ్నపత్రంలో మార్పులు ఇలా.. ● భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించి 85 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రస్తుత విధానంలో 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలతో పేపరు ఇస్తారు. ● గణితం, భౌతిక, రసాయన శాస్త్రం, చరిత్ర, కామర్స్, రాజనీతి శాస్త్రం, ఎకనామిక్స్కు 32 పేజీలు, వృక్ష, జంతుశాస్త్రాలతో పాటు మిగిలిన సబ్జెక్టులకు 24 పేజీలున్న బుక్లెట్ ఇవ్వనున్నారు. ● భౌతిక, రసాయన, జీవ శాస్త్రాల్లో మొత్తం 85 మార్కులకు 29 వస్తే పాస్ అయినట్లే. గణితం వంద మార్కులకే.. గణితం పేపర్ 1990 సంవత్సరంలో 150 మార్కులకు ఉండేది. తరువాత దీనిని గణితం–1ఏ, 1బీగా మారుస్తూ ఒక్కో పేపర్కు 75 మార్కులకు చొప్పున రెండు పేపర్ల విధానాన్ని ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. తాజాగా మొదటి ఏడాది విద్యార్థులకు గణితంలో ఒకే పేపర్ను 100 మార్కులకు నిర్వహించనున్నారు. మార్పులకనుగుణంగా సన్నద్ధం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా విధానంలో వచ్చిన మార్పులపై ఇప్పటికే ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు అవగాహన కల్పించాం. ఇప్పటికే మోడల్ పేపర్లతో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాం. ఎన్సీఈఆర్టీ సిలబస్లో భాగంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. మార్పులకనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం – వెంకటరమణనాయక్, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి, అనంతపురం బైపీసీలో బాటనీ, జువాలజీ కలిపి బయాలజీ ఫిజిక్స్, కెమిసీ్ట్ర సబ్జెక్టులకు మార్కుల పెంపు మ్యాథ్స్ వంద మార్కులు, బయాలజీ 85 మార్కులు -
‘పట్టు’ కోల్పోతున్న అనంత
అనంతపురం అగ్రికల్చర్: మల్బరీ సాగులో ఒక వెలుగు వెలిగిన అనంతపురం జిల్లా ఇప్పుడు డీలా పడిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సాహక రాయితీలు ఇవ్వకపోవడంతో మల్బరీ రైతులు పట్టు కోల్పోతున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అరకొరగా ఇస్తున్న సబ్సిడీలతో రైతులు అతికష్టమ్మీద నెట్టుకొస్తున్నారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఉపాధిహామీ పథకాన్ని కూడా నీరుగార్చడంతో మల్బరీ రైతులకు ఇబ్బందిగా తయారైంది. గతంలో షెడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.3 లక్షల వరకు రాయితీ వర్తింపజేశారు. ఇప్పుడు ఉపాధిని తీసేయడంతో షెడ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. మార్కెట్లో పట్టుగూళ్ల ధరలు కూడా 2021, 2022లో మాదిరిగానే ఇప్పుడూ అవే ధరలు పలుకుతుండటంతో పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో గిట్టుబాటు కావడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా చాలామంది రైతులు రేషం సాగుపై అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో సాగులో ఉన్న పంటను సైతం తొలగిస్తున్నట్లు చెబుతున్నారు. 1000 ఎకరాలకు పడిపోయిన విస్తీర్ణం ఉమ్మడి అనంతపురం జిల్లా 2020, 2021 సంవత్సరాల్లో 45 వేల ఎకరాల మల్బరీ సాగుతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేది. 2022లో జిల్లాల విభజన తర్వాత మల్బరీ అధికంగా ఉన్న మడకశిర, హిందూపురం, పెనుకొండ, కదిరి ప్రాంతాలు శ్రీసత్యసాయి జిల్లాలోకి వెళ్లాయి. అనంతపురం జిల్లాలో మల్బరీ సాగు 5 వేల ఎకరాలకు పరిమితమైంది. అనంతపురం, కళ్యాణదుర్గంలో చిన్నపాటి సీడ్ఫారాలు ఉండగా.. తాడిపత్రిలో ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్ పాక్షికంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. సీడ్ఫారాలు, చాకీ సెంటర్లు, రీలింగ్ యూనిట్లు, మార్కెట్లు తదితర సదుపాయాల విషయంలో శ్రీసత్యసాయి జిల్లాతో పోల్చుకుంటే అనంతపురం జిల్లా నామమాత్రమే. దీనికితోడు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం, రాయితీ పథకాలు లేకపోవడంతో సాగుపై రైతుల్లో ఆసక్తి తగ్గిపోయింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఈ–క్రాప్ నివేదిక పరిశీలిస్తే... మల్బరీ సాగు కేవలం 1,000 ఎకరాల్లో ఉన్నట్లు వెల్లడైంది. ఇంత దారుణంగా పడిపోవడంపై ఆ శాఖ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. కళ్యాణదుర్గం డివిజన్ పరిధి కుందుర్పి, బ్రహ్మసముద్రం మండలాల్లోనే మల్బరీ సాగులో ఉండగా... మిగతా ఉరవకొండ, అనంతపురం, తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లో 5 నుంచి 10 ఎకరాల చొప్పున ఉండటం గమనార్హం. ‘అనంత’పై శీతకన్ను జిల్లా పట్టుపరిశ్రమశాఖపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం శీతకన్ను వేసింది. అంతో ఇంతో రైతులకు సేవలందిస్తున్న నర్సరీ క్షేత్రం కూడా లేకుండా చేసేశారు. జిల్లా కేంద్రంలో 6.80 ఎకరాల్లో హరితవనంగా విస్తరించిన కార్యాలయ ఆవరణలో నాలుగు ఎకరాలు ఫ్లాటెడ్ ప్యాక్టరీ నిర్మాణం కోసం ఇటీవల ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు అప్పగించడంతో నర్సరీ పెంపకానికి ఇబ్బందిగా మారింది. కార్యాలయ భవనాలు దెబ్బతిన్నా రిపేరీకి కూడా నిధులు లేవని ఆ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. సిబ్బంది కొరత కూడా వేధిస్తుండటంతో పట్టు సాగు విస్తీర్ణం పెంపు, రైతులకు సేవలు అందించడంలో విఫలమవుతున్నట్లు చెబుతున్నారు. ఉపాధి పథకం వర్తింపు, బడ్జెట్ కేటాయింపులు, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో చంద్రబాబు ప్రభుత్వం కరుణిస్తే తప్ప ‘అనంత’లో పట్టుకు పూర్వవైభవం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైసా బడ్జెట్ ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి, ప్రోత్సాహం లేక రేషం పంటపై రైతుల అనాసక్తి 1000 ఎకరాల కనిష్ట స్థాయికి పడిపోయిన మల్బరీ పంట -
వైభవంగా సుబ్రహ్మణ్య షష్టి
హిందూపురం: పట్టణంలోని శ్రీనివాస మందిరం రోడ్డు ప్రాంతంలో గురువారం సుబ్రహ్మణ్య షష్టి ఘనంగా జరిగింది. సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెండి ఆభరణాలతో విశేషంగా అలంకరణ చేశారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉన్న నాగుల విగ్రహాలకు మహిళలు పాలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. షష్టి సందర్భంగా మూలవిరాట్ దర్శనానికి భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం రైల్వేరోడ్డులోని రథం వద్ద వేదపండితులు హోమాలు చేసిన అనంతరం ఆలయం నుంచి శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో మేళతాళాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. రథం వద్దకు తీసుకెళ్లి కొలువుదీర్చారు. మహామంగళ హారతి అనంతర ప్రారంభమైన రథోత్సవంలో భక్తజనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథం ముందు ఓ కళాకారుడు జంగమ దేవర వీరభద్ర వేషధారణలో చేసిన నృత్యాలు, వినాస్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అర్చకులు మంజునాథశర్మ, చంద్రమౌళిలు, భక్తులు పాల్గొన్నారు. -
అనూష ఆచూకీ కోసం రంగంలోకి డ్రోన్లు
బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామానికి చెందిన కల్లప్ప తన ఇద్దరు కుమార్తెలను తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)లో తోసేసిన విషయం తెలిసిందే. పెద్దమ్మాయి సింధు(11) మృతదేహం మంగళవారం లభ్యం కాగా, అదే రోజు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నమ్మాయి అనూష కోసం గాలింపు కొనసాగుతోంది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం కర్ణాటకలోని శిరిగేరి, మోకా, నాగేనహాళ్లి తదితర ప్రాంతాల్లో ఎల్లెల్సీపై బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్, పీఎస్ఐ నవీన్, సిబ్బంది డ్రోన్ కెమెరాలను వినియోగించారు. కాలువ వెంబడి గాలింపు కొనసాగుతోంది. అప్పిరెడ్డి హరినాథరెడ్డికి ఆటా ఎక్స్లెన్సీ అవార్డు అనంతపురం కల్చరల్: రాయలసీమ సాంస్కృతిక వేదిక, యోగివేమన ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలకుగాను జిల్లాకు చెందిన రచయిత, వ్యాసకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డికి ఆటా లిటరరీ ఎక్స్లెన్సీ అవార్డు దక్కింది. హైదరాబాదు వేదికగా ఈ నెల 27న రవీంద్రభారతిలో జరిగే ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) వేడుకల ముగింపు ఉత్సవంలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. అనేక ఏళ్లుగా సాగిస్తున్న సాహిత్య పరిశోధన, రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలను వెలుగులోకి తెచ్చే మహా కవిసమ్మేళనాలు, పద్యపోటీలు, సీమ సాహితీ పోటీలు, తెలుగు భాషా వికాస కార్యక్రమాలు, సదస్సుల నిర్వహణ వంటివి ఆయనకు ఆటా పురస్కారం దక్కేలా చేశాయని నిర్వాహకులు చల్లా జయంత్, సతీష్రెడ్డి వెల్లడించారు. ‘అమిగోస్’ సీనరేజీ కాంట్రాక్టు రద్దు ● గనుల శాఖ ఆధ్వర్యంలోనే పర్మిట్ల జారీ ● డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ అనంతపురం టౌన్: సీనరేజీ, రాయల్టీ కాంట్రాక్టుల గడువు ముగియడంతో అమిగోస్ సంస్థ సీనరేజీ కాంట్రాక్టును రద్దు చేసినట్లు భూగర్భ గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదినారాయణ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గనులశాఖ పరిధిలో రోడ్డు మెటల్, గ్రానైట్, క్వాట్జ్, గ్రావెల్, సున్నపురాయి, నాపరాయి తదితర ఖనిజ క్వారీల నుంచి సీనరేజీ, రాయల్టీల వసూళ్ల బాధ్యతను అమిగోస్ అనే ఓ ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చింది. ఈ కాంట్రాక్టు లీజు గడువు ముగియడంతో కాంట్రాక్టును రద్దు చేశారు. దీంతో రాయల్టీ పర్మిట్ల కోసం క్వారీల నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా గనుల శాఖకు దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాల్సి ఉంటుంది. పర్మిట్లు లేకుండా ఖనిజాన్ని రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఈ అంశంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గనులశాఖ విజిలెన్సు బృందాలు విస్తృత తనిఖీలు చేపడతాయని డీడీ ఆదినారాయణ వెల్లడించారు. అక్రమ రవాణా చేస్తే క్వారీలను సీజ్ చేయడంతోపాటు భారీ ఎత్తున జరిమానాలు విధిస్తామన్నారు. -
● పునరుద్ధరిస్తే పూర్వవైభవం
● ప్రభ కోల్పోయిన జెడ్పీ తొలి కార్యాలయం ● 1952లో ఆవిష్కరించిన అప్పటి మద్రాసు సీఎం రాజగోపాలాచారి ● 1959 నుంచి కార్యాలయంలో కార్యకలాపాలు ● పునరుద్ధరిస్తే వినియోగంలోకి భవనం అనంతపురం అర్బన్: జిల్లా పరిషత్ తొలి కార్యాలయంగా దశాబ్దాల పాటు విలువైన సేవలు అందించిన భవనం నేడు నిరాదరణకు గురై పిచ్చి మొక్కల మధ్యన నాటి వైభవానికి ఓ తీపి గుర్తుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోనే ఓ చివర ఈ భవనం నేటికీ చెక్కుచెదరకుండా నాటి వైభవాన్ని చాటుతోంది. కార్యాలయం ఎదురుగా ప్రహరీకి మూతపడిన గేటు దర్శనమిస్తుంది. 1952లో అప్పటి మద్రాసు ప్రభుత్వ ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ఈ భవనాన్ని ఆవిష్కరించారు. 1959లో అప్పటి జిల్లా బోర్డు అధ్యక్షుడు కె.వి.వేమారెడ్డి ఈ భవనం నుంచి పూర్తి కార్యకలాపాలు ప్రారంభించారు. భవనం నిర్మించి 66 ఏళ్లు అవుతున్నా.. రంగు కోల్పోయి అంద విహీనంగా కనిపిస్తోంది తప్ప... ఇప్పటికీ కట్టడం చెక్కుచెదరకుండా నాటి నిర్మాణ పని తీరుకు అద్దం పడుతోంది. పునరుద్ధరిస్తే వినియోగంలోకి జాతి సంపదగా నిలిచిన జిల్లా పరిషత్ తొలి కార్యాలయ భవనాన్ని పరిశీలిస్తే అంతులేని నిరాదరణ.. నిర్వహణ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. కట్టడం నేటికీ ఎంతో పటిష్టంగా ఉందనే విషయాన్ని ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. ఒక మంచి భవనం... అది కూడా మద్రాసు ప్రభుత్వ ముఖ్యమంత్రి సి.రాజగోపాలాచారి ఆవిష్కరించిన దానికి ఒక చరిత్ర ఉందనే విషయాన్ని అధికారులు, పాలకులు గుర్తించలేకపోవడం బాధాకరం. ఎంతో పటిష్టంగా ఉన్న ఈ భవనాన్ని పునరుద్ధరిస్తే భావితరాలకు ఎన్నో నాణ్యమైన సేవలు అందించేందుకు దోహదపడుతుంది. పాలకులు, అధికారులు దృష్టి పెట్టాలి మన జాతి గొప్పది. మన శిల్పం గొప్పది. ఎన్నో అపురూప కట్టడాలను మన శిల్పులే తీర్చిదిద్దారు. వీటి గొప్పతనం మనది అని డంబాలు కొట్టడమే నేర్చుకున్న అధికారులు, పాలకులు.. మన పూర్వ కళాస్వరూపాలను చెక్కు చెదరకుండా కాపాడుకోలేకపోవడం బాధాకరం. జిల్లా పరిషత్ చరిత్రకు సాక్షంగా నిలిచే తొలి జెడ్పీ కార్యాలయానికి మునుపటి ప్రభను తీసుకొచ్చే విషయంపై ఇప్పటికై నా పాలకులు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నారు. -
నేటి నుంచి ఏసీఏ ఉమెన్ కప్ ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ
● వివిధ రాష్ట్రాల నుంచి బరిలో దిగనున్న 8 జట్లు అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రికెట్ స్డేడియం వేదికగా ఏసీఏ ఉమెన్ కప్ ఇన్విటేషన్ క్రికెట్ టీ 20 టోర్నీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అనంతపురం నుంచి రెండు జట్లు, బెంగళూరు యూఎస్ఏ అట్లాంట గర్ల్స్ టీం, విజయవాడ సంప్రసిద్ధి అకాడమీ, ఒంగోలు, కడప, చిత్తూరు జట్లు బరిలో దిగనున్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ నెల 30వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. గురువారం బెంగళూరు అట్లాంట, విజయవాడ సంప్రసిద్ధ, అనంతపురం జట్లు ముమ్మర ప్రాక్టీస్ చేశాయి. ఏదిఏమైనా ఐదే రోజుల పాటు క్రికెట్ ప్రేమికులకు ఈ టోర్నీ కనువిందు చేయనుంది. అందుబాటులోకి మూడు ఎంఎస్ఎంఈ పార్కులు ● ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమర్ అనంతపురం టౌన్: జిల్లాలో మరో మూడు ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి పారిశ్రామిక వేత్తలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ తెలిపారు. వివరాలను గురువారం ఆయన వెల్లడించారు. తాడిపత్రి మండలం ఊరుచింతల, కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం గ్రామాల్లో ఒక్కొక్కటి 50 ఎకరాల్లో, కూడేరులో 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు ఏపీఐఐసీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. అలాగే https://apiic. in వెబ్సైట్ ద్వారానూ దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి ఎంఎస్ఎంఈ పార్క్లో కొన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలని కోరారు. ఎద్దుల బండిని ఢీకొన్న కారు ● దూడ మృతి, రైతుకు తీవ్రగాయాలు గుత్తి రూరల్: మండలంలోని వన్నేదొడ్డి గ్రామ శివారున 44వ జాతీయ రహదారిపై గురువారం ఎద్దుల బండిని కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. వన్నేదొడ్డికి చెందిన రైతు మల్లికార్జున తన పొలంలో వ్యసాయ పనులు ముగించుకుని ఇంటికి ఎద్దుల బండిలో వెళుతూ జాతీయ రహదారి దాటుతుండగా కర్నూలు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ఎద్దుల బండికి వెనక కట్టిన ఆవు దూడ అక్కడికక్కడే మృతి చెందింది. బండి తునాతునకలైంది. తీవ్రంగా గాయపడిన మల్లికార్జునను స్థానికులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. మహిళ ప్రాణాలు కాపాడిన సబ్ స్టేషన్ ఆపరేటర్ బ్రహ్మసముద్రం: మండలంలోని రాయలప్పదొడ్డి గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఆపరేటర్ అప్రమత్తత ఓ మహిళను ప్రాణాపాయం నుంచి తప్పించింది. వివరాల్లోకి వెళితే... రాయలప్పదొడ్డి గ్రామానికి చెందిన త్రివేణి మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతోంది. గురువారం ఉదయం ఆమె పొరబాటున విద్యుత్ సబ్స్టేషన్లోకి ప్రవేశించింది. అక్కడి ట్రాన్స్ఫార్మర్లు, తీగలను పరిశీలిస్తూ ఓ తీగను పట్టుకోబోతుండగా గమనించిన సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ రంజిత్ వెంటనే ఆమెను పక్కకు లాగాడు. విద్యుత్ యార్డు నుంచి ఆమెను పక్కకు పిలుచుకొచ్చి సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. విషయం తెలుసుకుని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు.. మహిళా ప్రాణాలను కాపాడిన రంజింత్ను అభినందించారు. ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ సంబరం ప్రశాంతి నిలయం: దేశ విదేశాలకు చెందిన సత్యసాయి భక్తుల నడుమ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేద పఠనం అనంతరం క్రిస్మస్ క్యారల్స్ ఆలపించారు. శాంతాక్లాజ్లు సందడి చేశారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజుతో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ సభ్యులు క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. -
కేశవా.. ఇటు చూడవా!
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత నియోజకవర్గంలోని పలు గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత రహదారులు పూర్తి అధ్వాన స్థితికి చేరుకున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు.. ‘కేశవా.. ఒక్కసారి ఇటు చూడవా!’ అని వేడుకుంటున్నారు. కాజ్ వే కొట్టుకుపోయిన ప్రాంతాన్ని మట్టితో పూడ్చిన దృశ్యం కోతకు గురి కావడంతో పెద్ద పెద్ద రాళ్లు వేసిన దృశ్యం విడపనకల్లు: మండలంలోని పాల్తూరు నుంచి దర్గాహొన్నూరుకు వెళ్లే రహదారిలో పెద్ద వంక కాజ్వే పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. కాజ్వే మొత్తం అక్కడక్కడ నెర్రెలు చీలి ముక్కలు ముక్కలుగా రాలిపోతోంది. గతంలో కురిసిన వర్షానికి కాజ్వేలో కొంత ప్రాంతం కొట్టుకు పోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామస్తులు ఏకమై మట్టి, రాళ్లతో పూడ్చి రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాలన్నీ అటుగానే ఉరవకొండ నుంచి ఉండబండ, పాల్తూరు మీదుగా బొమ్మనహాళ్ మండలంలోని కలవలితిప్ప, గోవిందవాడ, దర్గా హొన్నూరు, బొల్లనగుడ్డం వరకు ఆర్టీసీ సర్వీసులతో పాటు రోజూ వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు, కార్లు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. పాల్తూరు దాటిన తర్వాత వచ్చే పెద్ద వంక కాజ్ వే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కాజ్ వే మధ్యలో అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. గతంలో కాజ్ వే దుస్థితిని గమనించిన ఆర్టీసీ అధికారులు ఈ మార్గంలో ఆర్టీసీ సర్వీసులను ఏకంగా రద్దు చేసేశారు. ఎప్పుడు కూలుతుందో చెప్పలేని కాజ్ వే మీదుగా ప్రయాణం సాగిస్తూ ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టలేమని ఆ సమయంలో ఉరవకొండ డిపో అధికారులు తేల్చి చెప్పారు. ఇప్పటికై నా మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించి నూతన కాజ్వే నిర్మాణానికి చొరవ తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శిథిలావస్థలో పాల్తూరు పెద్ద వంక కాజ్వే గత వర్షాలకు కొట్టుకుపోయిన వైనం మట్టి, రాళ్లతో పూడ్చి రాకపోకలు సాగిస్తున్న గ్రామీణులు ఎప్పుడు కొట్టుకుపోతుందో తెలియని అయోమయం ఇప్పటికై నా మంత్రి కేశవ్ స్పందించాలంటున్న గ్రామీణ ప్రజలు -
●‘రూటే’ సపరేట్
అనంతపురం అర్బన్: ఆయన డిప్యూటీ కలెక్టర్. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఏమిటి ఆయన ‘స్పెషల్’ అని అనుకుంటున్నారా? అయితే చూడండి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓల మాదిరిగా కాదు... ఆయన రూటే ‘స్పెషల్’. తన వాహనానికి ముందు భాగంలో నంబర్ ప్లేట్ను తొలగించి ‘డిప్యూటీ కలెక్టర్, ఏపీఎస్సీఎస్సీఎల్ డిస్ట్రిక్ట్ మేనేజర్, అనంతపురం’ అనే బోర్డు ఏర్పాటు చేయించారు. అయితే ఇబ్బందేమిటి అంటారా? ఆర్టీఏ నిబంధనల ప్రకారం వాహనానికి ముందు, వెనక తప్పనిసరిగా నంబర్ ప్లేట్ ఉండాలి. ఈ నిబంధనను కలెక్టర్ మొదలు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తప్పని సరిగా గౌరవిస్తూ తమ వాహనాలకు ముందు, వెనుక నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. నిబంధనలు అనుసరించడంలో ముందు వరసలో ఉండాల్సిన ఓ జిల్లా అధికారి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ‘స్పెషల్’ కాదంటారా? -
ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
గర్భిణులే కాదు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లాంటివి లేక బీపీ, షుగర్ బాధితులు పెరుగుతున్నారు. తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణులు తప్పక షుగర్ పరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ అయితే బిడ్డకు సోకకుండా రక్షించుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవచ్చు. గర్భం ధరించినప్పుడు షుగర్ లెవెల్స్ పెరిగినట్లు కనిపించినా ప్రసవం తర్వాత చాలామందిలో మటుమాయం అవుతుంది. ముఖ్యంగా ఆహారపు నియమాలతో పాటు వ్యాయామం చేయాలి. – ఈబీ దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి -
మినీ గోకులాల నిధులు స్వాహా
● క్షేత్రసహాయకుడి అవినీతి బాగోతం ● రూ.13 లక్షల రికవరీకి ఆదేశాలు రాయదుర్గం: డి హీరేహాళ్ మండలం మురడి, గొడిశెలపల్లి, దొడగట్ట, డి.హీరేహాళ్ గ్రామాల్లో మినీ గోకులం బిల్లుల మంజూరులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. 2014–19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో మంజూరైన గోకులం షెడ్లకు సంబంధించి చివరి బిల్లులో 30 శాతం మిగులు నిధులను ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్ఐసీ సర్వర్ మార్పులు, చేర్పుల్లో భాగంగా రైతుల ఖాతాలు ఆన్లైన్లో తొలిగిపోవడంతో డి.హీరేహాళ్ మండలంలోని మురడికి చెందిన క్షేత్ర సహాయకుడు వెండర్ ఖాతా తెరిచి అందులో జమ చేశారు. ఈ క్రమంలో కొందరు అధికారులు కుమ్మకై ఏకంగా రూ.13 లక్షలు దారి మళ్లించారు. ఆలస్యంగా తెలుసుకున్న రైతులు తమ బిల్లులు ఇప్పించాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. దీంతో అవినీతి బాగోతం బహిర్గతమైంది. సగం డబ్బు వాపస్? అవినీతి తెలుసుకున్న ఎంపీడీఓ దాసనాయక్, ఏపీఓ సంజీవ్కుమార్ మురడిలో విచారణ చేపట్టి మురడి, డి.హీరేహాళ్, గొడిశెలపల్లి, దొడగట్ట గ్రామాలకు చెందిన రైతుల డబ్బులు రూ.13 లక్షలు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పంచాయతీ తీర్మానం జరిపి ఆ డబ్బంతా తిరిగి రైతులకు చెల్లించేలా ఒప్పించారు. లేకపోతే క్రిమినల్ కేసు నమోదు చేయించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో పంచుకున్న సొమ్ములో సగం రైతులకు చేర్చారు. మిగిలిన సగం సర్ధుబాటులో ఉన్నారు. కాగా, ఈ అవినీతి బాగోతం లో బాగస్వామ్యులైన వారందరిపై చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా అప్పట్లో 60కు పైగా షెడ్లు నిర్మించారు. కాగా ఏకమొత్తంగా రూ.13 లక్షలను క్షేత్ర సహాయకుడి ఖాతాకు బదిలీ చేయడంతో ఏ రైతుకు ఎంత మొత్తం చెల్లించాలనే విషయంపై కాస్త జాప్యం చోటు చేసుకుందని ఎంపీడీఓ దాసనాయక్ పేర్కొన్నారు. ప్రతి రూపాయి రైతుకు చేర్చాలని ఆదేశించామన్నారు. ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉన్న అధికారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. -
పెన్నహోబిలంపై నిర్లక్ష్యమేల?
ఉరవకొండ/ ఉరవకొండ రూరల్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్లక్ష్యానికి గురవుతోంది. పర్యాటకంగా, ఆధ్యాత్మిక ధామంగా వెలుగొందుతున్న పెన్నహోబిలానికి ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ప్రతి శని వారం భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు పోటెత్తుతుంటారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాజకీయ నేతల జోక్యం పెరిగిపోయింది. అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిళ్లను భరించలేక ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈఓ)గా వచ్చిన వారు విధులు నిర్వహించలేకపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో ఆలయ నిర్వహణ, అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. భక్తులకు తగిన సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నారు. నూతన రథం నిర్మాణానికి ఇంకెన్నాళ్లో..? పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి నూతన రథం నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అడుగులు పడ్డాయి. 400 ఏళ్ల నాటి పురాతన రథం 2022లో కుప్పకూలింది. దీంతో నూతన రథం నిర్మాణానికి 2023 అక్టోబర్లో టెండర్లు ఆహ్వానించారు. 43 అడుగుల రథం నిర్మాణం కోసం రివర్స్ టెండరింగ్ విధానంలో రూ.1.70 కోట్లకు గౌతంరెడ్డి అనే టెండరుదారు నిర్మాణ పనులు దక్కించుకున్నారు. రథం నిర్మాణం కోసం భక్తుల నుంచి రూ.కోటి దాకా విరాళాలు అందాయి. రాష్ట్రంలో కనీవినీ ఎరగని రీతిలో రథం తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇందుకోసం కాంట్రాక్టర్ అత్యంత నాణ్యత కలిగిన నాలుగు చక్రాలను సిద్ధం చేశారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో తదుపరి పనులు ఆగిపోయాయి. తదనంతరం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. రథం నిర్మాణ పనులు త్వరగా పూర్తవుతాయని భావించిన భక్తులకు నిరాశే ఎదురైంది. రెండేళ్లవుతున్నా రథం నిర్మాణం ముందుకు సాగలేదు. రథం నిర్మాణ కాంట్రాక్టు గడువు కూడా మరికొన్ని నెలల్లో ముగియనుంది. ఆ లోపు రథం నిర్మాణం పూర్తవడం ప్రశ్నార్థకంగా మారింది. ముక్కోటి ఏకాదశి వేడుకలపై పెన్నహోబిలం దేవస్థానానికి నాలుగు నెలలుగా కార్యనిర్వహణ అధికారి (ఈఓ) లేరు. దీంతో ఇక్కడ పనిచేసే 10 మంది రెగ్యులర్, మరో 10 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయి. ఆలయంలో స్వామి వారి విలువైన ఆభరణాలకు కూడా భద్రత లేకుండాపోయింది. రెగ్యులర్ ఈఓను నియమించి పాలనను గాడిలో పెట్టాలని భక్తులు కోరుతున్నా రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి. ఆరోజు ఉత్తర ద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అయితే ఇక్కడ ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లు చేసే నాథుడే లేకుండా పోవడం భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఆ రోజు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే అవకాశం కూడా కనపడడం లేదు. పడకేసిన ఆలయ అభివృద్ధి ఆర్థిక మంత్రి ఇలాకాలో ఆలయ పాలన అస్తవ్యస్తం లక్ష్మీనరసింహస్వామి రథం నిర్మాణానికి గ్రహణం రాజకీయ నేతల ఒత్తిళ్లతో సతమతమవుతున్న ఈఓలు ప్రశ్నార్థకంగా ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు ముక్కోటి ఏకాదశి వేడుకల ఏర్పాట్లు చేసేవారేరీ..? అనుమతులు రాగానే చేపడతాం మంత్రి పయ్యావుల కేశవ్ చొరవ చూపి దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశిస్తే రీఎస్టిమేట్తో లక్ష్మీనృసింహుని నూతన రథం నిర్మాణ పనులు చేపడతాం. ఇప్పటికే రథానికి సంబంధించి నాలుగు చక్రాలు పూర్తయ్యాయి. అనుమతులు రాగానే పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. – గౌతంరెడ్డి, కాంట్రాక్టర్, అనంతపురం ‘ఏకాదశి’ ఏర్పాట్లు ఇబ్బందికరమే పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓగా ఎవరిని నియమించినా బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. గుంతకల్లు గ్రూప్ టెంపుల్స్ ఈఓ మఠం మల్లికార్జునకు ఈఓగా ఆర్డర్స్ ఇచ్చినా ఆయన చార్జ్ తీసుకోలేదు. ఈ విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ముక్కోటి ఏకాదశి వేళ ఈఓ లేకుంటే వేడుకలకు ఏర్పాట్లు చేయడం ఇబ్బందికరమే. – మల్లికార్జున ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, దేవదాయ శాఖ, అనంతపురం -
● జెరూసలేము సందడి.. చూద్దాం రండి
గుంతకల్లు: క్రిస్మస్ సందర్భంగా గుంతకల్లులోని మస్తాన్పేట్లో నివాసముంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి హృదయ్మోహన్ ఫెర్నాండెజ్, నిర్మలామేరి దంపతులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని విశదీకరించేలా బొమ్మలను కొలువుదీర్చారు. ఇందు కోసం తన ఇంటి మిద్దైపె ఓ ప్రత్యేక షెడ్ను ఏర్పాటు చేశారు. ఏసు పుట్టిన సమయంలో తోక చుక్క ఆవిర్భవించడం మొదలు... గొర్రెల కాపరుల చుట్టూ పెద్ద వెలుగు రావడం, అప్పటి నజరేతు, బేత్లహము, జెరూసలేము, ఈజిప్టు వాసుల వేషధారణ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సందర్భంగా ఫెర్నాండెజ్ మాట్లాడుతూ... దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఆఫ్రికా, బెంగుళూరు, ముంబయి, చైన్నె, హైదరాబాదు తదితర నగరాల నుంచి బొమ్మలను సేకరించి కొలువు దీర్చినట్లు తెలిపారు. నెల రోజుల పాటు సందర్శకుల కోసం బొమ్మల కొలువును ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. పశువులు మేత తొట్టెలో నిద్రిస్తున్న బాలయేసు, ఏసు పుట్టుకను తెలుసుకుని జెరూసలేము నుంచి బేత్లహము బయలుదేరిన రాజులు -
రాష్ట్రస్థాయి సైన్స్ఫేర్లో మనోళ్ల ప్రతిభ
అనంతపురం సిటీ/యాడికి: జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి సైన్స్ఫెర్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిలో కణేకల్లు మండలం హనకనహాళ్లోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రవళ్లిక, నవాజ్, యాడికి మండలం కోనుప్పులపాడు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని సుహాసిని, ఉరవకొండ కేసీజీహెచ్ఎస్కు చెందిన చంద్రశేఖర్, కోనాపురం హైస్కూల్ విద్యార్థి సాత్విక్ ఉన్నారు. వీరు జనవరి 19 నుంచి 23 వరకు హైదరాబాద్లో జరిగే సౌత్ ఇండియా సైన్స్ఫెయిర్ పోటీల్లో వారివారి ప్రాజెక్ట్లను ప్రదర్శించనున్నారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి, ఇన్చార్జ్ డీఈఓ మల్లారెడ్డి, జిల్లా సైన్స్సెంటర్ అధికారి నరసింహారెడ్డి, కోనుప్పలపాడు ఉపాధ్యాయులు అభినందించారు. జాతీయ స్థాయికి ఎంపికై న ప్రవళ్లిక, నవాజ్ను అభినందిస్తున్న ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి విద్యార్థిని సుహాసినిని అభినందిస్తున్న దృశ్యం -
హెచ్చెల్సీలో వివాహిత మృతదేహం లభ్యం
బొమ్మనహాళ్: హెచ్చెల్సీలో గల్లైంతైన వివాహిత మృతదేహమై లభ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు... డి.హీరేహాళ్కు చెందిన వరలక్ష్మి (27)కి బొమ్మనహాళ్ మండలంలోని మైలాపురం గ్రామానికి చెందిన నవీన్తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. మంగళవారం కర్ణాటకలోని రాంపురం పట్టణానికి దంపతులు ద్విచక్ర వాహనంలో వెళ్లి షాపింగ్ ముగించుకుని రాత్రి 8 గంటల సమయంలో మైలాపురం గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో చెర్లోపల్లి వద్ద హెచ్చెల్సీ బ్రిడ్జిపై బైక్ అదుపుతప్పి కిందకు పడింది. వెనుకన కూర్చొన్న వరలక్ష్మి నేరుగా వెళ్లి కాలువలో పడి నీటి ప్రవాహనికి కొట్టుకుపోయింది. నవీన్ నుంచి సమాచారం అందుకున్న వరలక్ష్మి అన్నదమ్ములు రమేష్, బసవరాజు, తల్లి నాగమ్మ అక్కడకు చేరుకుని కాలువ వెంబడి గాలింపు చేపట్టారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గొడిసెలపల్లి వద్ద నీటిలో తేలియాడుతున్న వరలక్ష్మిని గుర్తించి వెలికి తీసి, వెంటనే బళ్లారిలోని విమ్స్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అన్న రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డి.హీరేహాళ్ ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి తెలిపారు. -
శోకసంద్రంలో నేమకల్లు
● కన్నీళ్లతో సింధు అంత్యక్రియలు ● అనూష కోసం ముమ్మర గాలింపు బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామం శోకసంద్రమైంది. కాలువలో కలిసి పోయిన చిన్నారుల బతుకులు గ్రామాన్ని కలిచివేశాయి. తండ్రి చేతిలోనే ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సింధు (11) అంత్యక్రియలు బుధవారం గ్రామస్తుల కన్నీళ్ల మధ్య సాగింది. మరో బాలిక అనూష కోసం తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)లో గాలింపు కొనసాగుతోంది. గ్రామానికి చెందిన కల్లప్ప తన ఇద్దరు కుమారైలు సింధు (11), అనూష (9)ను ఎల్లెల్సీలో తోసేసిన ఘటనలో సింధు మంగళవారం మధ్యాహ్నం మృతదేహం లభ్యం కావడంతో యావత్ గ్రామం దిగ్భ్రాంతికి లోనైంది. అయితే రెండో అమ్మాయి అనూష ఆచూకీ లభ్యం కాకపోవడం కలవర పెడుతోంది. దిగువ కాలువ వెంబడి కర్ణాటక పరిధిలోని నాగేనహాళ్లి, మోకా, దమ్మురు, తిరిగేరి ప్రాంతాల్లో పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన వెనుక అసలు కారణాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. కుటుంబ కలహాలా? మానసిక సమస్యనా? లేక మరేదైనా ఉందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కల్లప్ప ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను పూర్తిగా కోలుకొని విచారణకు సహకరిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. -
బీఎల్ఓలకు గౌరవ వేతనం పెంపు
అనంతపురం అర్బన్: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బీఎల్ఓల గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన వేతనం ఈ ఏడాది ఆగస్టు నుంచి అమలులోకి రానుంది. జిల్లాలో ప్రస్తుతం 2,226 మంది బీఎల్ఓలు ఉన్నారు. కొత్తగా మరో 330 మందిని నియమించనున్నారు. దీంతో బీఎల్ఓల సంఖ్య 2,556కు చేరుతుంది. 250 మంది సూపర్వైజర్లు ఉన్నారు. ఇప్పటి వరకు బీఎల్ఓలకు ఏడాదికి రూ.6 వేలు, సూపర్వైజర్లకు రూ.12 వేలు, ఇంటింటి తనిఖీలు, శిక్షణకు అదనంగా రూ.1,000 చెల్లించేవారు. ఎన్నికల సంఘం ఆదేశంతో బీఎల్ఓలకు తాజాగా గౌరవ వేతనం ఏడాదికి రూ.12 వేలు, సూపర్వైజర్లకు రూ.18 వేలు, ఓటరు జాబితా సవరణ, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు బీఎల్ఓలకు అదనంగా రూ.2 వేలు చెల్లిస్తారు. ఏడాది పొడవునా పనిచేసిన వారికి పూర్తి గౌరవవేతనం, మధ్యలో చేరిన వారికి, తక్కువ కాలం పనిచేసిన వారికి.. వారు పనిచేసిన కాలానికి చెల్లింపులు ఉంటాయి. తాగునీటి ఎద్దడిపై నిరసన కుందుర్పి: తాగునీటి సమస్య తీర్చాలంటూ బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో కుందుర్పి మండలం మహంతపురం గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. తనను గెలిపిస్తే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఎన్నికల సమయంలో హామీనిచ్చిన అమిలినేని సురేంద్రబాబు.. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం సమస్య పరిష్కారానికి ఎలాంటి చొరవ తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు. నెల రోజులుగా చుక్క నీరు అందకపోవడంతో బిందెడు నీటి కోసం కుందుర్పికి వెళ్లి రూ.10తో కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీఓ మాధవికి వినతిపత్రం అందజేశారు. -
యువకుడి బలవన్మరణం
అనంతపురం సిటీ: స్థానిక ప్రసన్నాయపల్లి రైలు మార్గంలో ఓ గుర్తు తెలియని యువకుడు(25) బుధవారం గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ సమాచారంతో జీఆర్పీ ఎస్ఐ వెంకటేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. నలుపురంగు హాఫ్ చొక్కా, సిమెంట్ కలర్ జీన్స్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని జీజీహెచ్లోని మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94414 45354 కు సమాచారం అందించాలని కోరారు. 40 మందితో జిల్లా టీడీపీ కమిటీ ప్రకటన అనంతపురం టౌన్: జిల్లాలో టీడీపీని బలోపేతం చేసే దిశగా 40 మందితో కూడిన నూతన కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసుల ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి బుధవారం ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా 9 మంది, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శులుగా 9 మంది, జిల్లా అధికార ప్రతినిధులుగా 9మంది, జిల్లా కార్యదర్శులుగా 9మంది, ట్రెజరర్, మీడియా కోర్డినేటర్, సోషల్ మీడియా కోర్టినేటర్, ఆఫీస్ సెక్రెటరీగా ఒక్కొక్కరిని చొప్పున ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ‘ఉమ్మడిశెట్టి అవార్డు’కు కవితల ఆహ్వానం అనంతపురం కల్చరల్: ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు–25’కు గాను కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు అవార్డు వ్యవస్థాపకుడు, సీనియర్ కవి డాక్టర్ రాధేయ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025లో ప్రచురించిన కవితా సంపుటాలను జనవరి 10వ తేదీలోపు ‘డాక్టర్ రాధేయ, చైర్మన్, ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్టు, 13–1–606–1, షిరిడినగర్, రెవెన్యూ కాలనీ, అనంతపురం – 515 001’ చిరునామాకు పంపాలి. ఎంపికై న కవిని నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించనున్నారు. పూర్తి వివరాలకు 99851 71411లో సంప్రదించవచ్చు. -
పత్తి రైతులకు తప్పని తిప్పలు
గుత్తి: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో భారత పత్తి సంస్థ (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు తిప్పలు తప్పడం లేదు. వారంలో కేవలం బుధవారం ఒక్క రోజే పత్తి కొనుగోలు చేపడుతుండడంతో రైతులు తెల్లవారు జామున నాలుగు గంటలకే పత్తి వాహనాలతో బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో చలి తీవ్రత తాళలేక గజగజ వణికి పోతున్నారు. వారంలో కనీసం రెండు రోజులైనా పత్తిని కొనుగోలు చేయాలని రైతులు కోరారు. ‘పరీక్షా పే చర్చకు దరఖాస్తు చేసుకోండి’ అనంతపురం సిటీ: ప్రధానిని ప్రత్యక్షంగా కలుసుకుని నేరుగా మాట్లాడే సువర్ణావకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోందని ఇన్చార్జ్ డీఈఓ పాటిల్ మల్లారెడ్డి, సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ తెలిపారు. ఈ మేరకు బుధవారం వేర్వేరుగా ప్రకటించారు. పరీక్షలపై భయం పోగొట్టి, ఒత్తిడి తగ్గించి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు జాతీయ స్థాయిలో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. తొమ్మిదో విడత జనవరి 2026 లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 6 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అర్హులు. జనవరి 11వ తేదీలోపు https://innov ateindia.mygov.in/ ఆన్లైన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విజేతలకు ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అక్కడే ప్రశంసాపత్రాలు, ఎగ్జామ్ వారియర్స్ కిట్లను బహుమతిగా అందజేస్తారు. రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా గుడి బండయ్య ఉరవకొండ: స్థానిక తొగటవీర క్షత్రియ కల్యాణ మంటపం వేదికగా బుధవారం జిల్లా రేషన్ షాపు డీలర్ల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న డీలర్లు తరలివచ్చారు. జిల్లా అధ్యక్షుడిగా ఉరవకొండ డీలర్ గుడి బండయ్య, ఉపాధ్యక్షుడిగా బోయ రాము (అనంతపురం), ప్రధాన కార్యదర్శిగా భరత్చౌదరి (రాప్తాడు), ఉప కార్యదర్శిగా బసవరాజు (కళ్యాణదుర్గం), కోశాధికారిగా రంగనాయకులు (తాడిపత్రి), డైరెక్టర్లుగా బాలు (గుంతకల్లు), శివ (శింగనమల), వీరన్నగౌడ్ (గుంతకల్లు), సత్య (రాయదుర్గం) ఎన్నికయ్యారు. సెలవులో డీఈఓ అనంతపురం సిటీ: జిల్లా విద్యా శాఖాధికారి ప్రసాద్బాబు బుధవారం నుంచి ఆదివారం వరకు ఐదు రోజుల పాటు ఆయన సెలవులో వెళ్లారు. సోమవారం ఆయన విధులకు హాజరుకానున్న నేపథ్యంలో అప్పటి వరకూ ఇన్చార్జ్ డీఈఓగా గుత్తి డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
వ్యక్తి దుర్మరణం
బెళుగుప్ప: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బోరంపల్లికి చెందిన బొజ్జప్ప (45) బుధవారం యర్రగుడి గ్రామంలో జరిగిన దేవరకు వచ్చి, మొక్కు తీర్చుకున్న అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఎదురుగా ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న ముదిగల్లుకు చెందిన దేవ అనే వ్యక్తి ఢీకొనడంతో రోడ్డుపై పడి బొజ్జప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దేవాను స్థానికులు వెంటనే కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. శ్రామికులకు గిట్టుబాటు కూలి : డ్వామా పీడీ గార్లదిన్నె: ఉపాధి పనుల్లో పాల్గొనే శ్రామికులకు రోజు వారీ కూలి రూ.307 అందేలా చొరవ తీసుకోవాలని క్షేత్ర సహాయకులకు డ్వామా పీడీ సలీంబాషా సూచించారు. గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లి, సంజీవపురం గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి, ఉపాధి హామీ పథకం కింద రైతులు నిర్మించుకున్న పశువుల షెడ్డులు, ఎరువు గుంతలు, సోక్ పిట్ నిర్మాణ పనులు పరిశీలించారు. అనంతరం గార్లదిన్నె ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో సమావేశమై పనుల కల్పన అంశంపై సమీక్షించారు. కార్యక్రమంలో ఈసీ అయూబ్, టీఏ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. చెట్టు మీద నుంచి జారి పడి వ్యక్తి మృతి వజ్రకరూరు: ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడి వజ్రకరూరు మండలం ఎన్ఎన్పీ తండా నివాసి రమావత్ శంకర్నాయక్ (40) మృతి చెందాడు. ఆయనకు భార్య పార్వతి, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో పాటు జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మేకలకు ఆహారం కోసమని ఇంటి వద్ద వేపచెట్టు ఎక్కి ఆకులు కోస్తుండగా అదుపు తప్పి కిందపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే 108 వాహనంలో గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. అక్కడ చికిత్సకు స్పందించక బుధవారం ఉదయం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే పస్తులుండాలా?
● ప్రభుత్వంపై పంచాయతీ కార్మిక నాయకుల ధ్వజం ● కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతపురం అర్బన్: ‘మీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేమంటూ ప్రజాప్రతినిధులు పొగుడుతారు. శాలువా కప్పి సన్మానం చేస్తారు. అయితే ఏమి ప్రయోజనం నెలలుగా వేతనాలు చెల్లించకపోతే తాము గడ్డి తిని బతకాలా?( అంటూ ప్రభుత్వం, అధికారులపై పంచాయతీ పారిశధ్య కార్మికులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతి నెలా చెల్లిస్తున్న వేతనాన్ని రూ.21 వేలుకు పెంచడంతో పాటు బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలంటూ ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి మూకుడులో గడ్డి పెట్టుకుని ధర్నా చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు హెచ్.మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్వీనాయుడు, నాగేంద్రకుమార్, పంచాయతీ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడారు. పంచాయతీ కార్మికులకు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు పంచాయతీలో కార్మికులకు ఎనిమిది నెలల వేతనం బకాయి ఉండడం సిగ్గుచేటన్నారు. రాప్తాడు, రుద్రంపేట, అనంతపురం రూరల్, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, కల్లూరు, కొనకొండ, రాజీవ్కాలనీ, కక్కలపల్లి కాలనీ, తదితర పంచాయతీల్లో కార్మికులకు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన కార్మికులు కుటుంబాన్ని పోషించుకోలేక అప్పుల పాలవుతున్నారన్నారు. పెరిగిన ధరలతో పోలిస్తే వారికి ఇచ్చే వేతనం చాలా తక్కువని, మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న విధంగానే పంచాయతీ కార్మికులకూ రూ.21 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.పంచాయతీ కార్మికులకు పీఎఫ్ అమలు, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం ధర్నా వద్దకు వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడుకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ ఉపాధ్యక్షుడు రామాంజనేయులు, నగర అధ్యక్షుడు వెంకటనారాయణ, కోశాధికారి శ్రీనివాసులు, నాయకులు ఆజామ్ బాషా, నూర్బాషా, వీరాంజనేయులు, మూర్తి, బాలాజీనాయక్, రామకృష్ణ, సంధ్యాబాయి, నల్లప్ప, కుళ్లాయమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
ఉరవకొండ: స్థానిక శివరామిరెడ్డి కాలనీలో నివాసముంటున్న వివాహిత ఆదిలక్ష్మి(39) ఆత్మహత్య చేసుకుంది. 20 ఏళ్ల క్రితం వివాహమైన ఆమెకు భర్త హరిప్రసాద్తో పాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. జీపు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే హరిప్రసాద్ కొంత కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఆదిలక్ష్మి పలుమార్లు పద్ధతి మార్చుకోవాలని భర్తతో చెప్పినా మార్పు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై మృతురాలి తండ్రి ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం పెరిగింది. ఈశాన్యం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
నదిలో స్నానానికి వెళ్లి మృత్యు ఒడికి ● సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇంట తీవ్ర విషాదం ● శబరిమల నుంచి తిరిగివస్తుండగా ఘటన గార్లదిన్నె: అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లి తిరుగుపయనంలో నదీ స్నానానికి వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ నీటమునిగి ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటనతో అతని స్వగ్రామం గార్లదిన్నె మండలం ఎం.కొత్తపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి. ఎం.కొత్తపల్లికి చెందిన మల్లికార్జున, సరళ దంపతుల కుమారుడు నందకుమార్ (27) పుణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 21న బెంగళూరు నుంచి తన స్నేహితులతో కలసి శబరిమలకు వెళ్లి అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాడు. మంగళవారం తిరుగు ప్రయనమయ్యాడు. శబరిమల నుంచి 50 కిలో మీటర్లు దూరం దాటాక నది కనిపించడంతో అక్కడ స్నేహితులతో కలిసి నందకుమార్ స్నానానికి దిగాడు. అయితే లోతు ఎక్కువగా ఉండటంతో నీట మునిగి పైకిరాలేకపోయాడు. తోటి స్నేహితులు విఫలయత్నం చేసిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన వచ్చి గజ ఈతగాళ్లతో నదిలో వెతికించి నందకుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. బుధవారం నందకుమార్ మృతదేహాన్ని స్వగ్రామం ఎం.కొత్తపల్లికి తీసుకురాగా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. -
కంది రైతుల్లో కలవరం
మార్కెట్లో పప్పు ధాన్యాల ధరలు ఆశాజనకంగా ఉండటంతో జిల్లాలో ఎక్కువ మంది రైతులు కంది సాగుపై మొగ్గుచూపారు. అత్యధికంగా ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో సాగైంది. ఇప్పటికే రైతులు పంటలను నూర్పిడి చేసి పొలాలు, మార్కెట్యార్డుల్లో రాశులు పోసుకుని అమ్ముకునేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రాలు ఇప్పుడప్పుడే ఏర్పాటు చేసేలా కనిపించకపోవడంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఉరవకొండ: కందులు అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. దళారులకు తక్కువ ధరకు అమ్ముకోలేక.. ప్రభుత్వం మద్దతు ధరతో కొనేందుకు కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ కంది సాధారణ సాగు విస్తీర్ణం 55,296 హెక్టార్లు అంచనా వేయగా.. ఏకంగా 1.34 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వచ్చింది. అననుకూల వర్షాలతో అక్కడక్కడ మోస్తరుగా దిగుబడులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. హెక్టారుకు 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి లెక్కించినా పది లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి చేతికి వస్తుంది. అయితే మార్కెట్లో కందికి సరైన ధర లేకపోవడంతో రైతులు ప్రభుత్వంపై ఆధారపడ్డారు. ఈ క్రమంలో నాఫెడ్, మార్క్ఫెడ్ అధికారులు కూడా కంది కొనుగోలుకు ఇటీవల ప్రకటన చేశారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలు రూ.8 వేల ప్రకారం కొనుగోలు చేస్తామని, ఆర్ఎస్కేల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. దీంతో ఇప్పటికే 2,500 మంది రైతులు రిజిస్ట్రేషన్లు చేసుకుని అమ్మడానికి ఎదురు చూస్తున్నారు. కొనుగోళ్లు కంటితుడుపేనా..? ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సంక్రాంతి తర్వాతనే ఏర్పాటు కావొచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అది కూడా ఈ ఏడాది 24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. భారీ విస్తీర్ణంలో పంట సాగులో ఉన్నందున పండిన కందులన్నింటినీ కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతలోపు చాలామంది రైతులు అయినకాటికి అమ్మేసుకుంటారని అంచనా వేస్తున్నారు. చివర్లో కంటితుడుపుగా కొనుగోళ్లకు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కూడా ఈ–క్రాప్, ఒక్కో రైతు నుంచి పరిమితంగా కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున కంది సాగు చేసిన రైతులు ఇపుడు అమ్మకాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంబేలెత్తిస్తున్న నిబంధనలు రైతుల నుంచి కందులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పెడుతున్న నిబంధనలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రతి రైతూ ఈ–పంట నమోదు తప్పనిసరిగా చేయించుకుని ఉండాలని, గింజ నాణ్యత ప్రమాణాల్లో తేమ 12 శాతం ఉండాలని స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది రైతుల నుంచి హెక్టారుకు 2 లేదా 3 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడంతో మిగిలిన పంట అమ్ముకోలేక రైతులు అవస్థలు పడ్డారు. నిబంధనలను సడలించి కందులను పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. దళారులే ధర నిర్ణేతలు పంట ఉత్పత్తుల ధర నిర్ణయించడంలో దళారుల పాత్ర కీలకంగా మారింది. బహిరంగ మార్కెట్లో పంటకు మంచి ధర పలుకుతున్నా దళారులు మాత్రం తాము చెప్పిన ధరే మార్కెట్లో నడుస్తోందంటూ రైతులను మభ్యపెడుతున్నారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లి పంట అమ్ముకోవాలంటే ఖర్చులు పెరుగుతాయి. దీన్ని దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. అలాగే 50 కిలోల బస్తాలో ఐదారు కిలోలు ఎక్కువ తీసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. పేర్లు నమోదు చేసుకోండి కంది పంటకు సంబంధించి జనవరి రెండో వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ–పంట నమోదు చేసుకున్న వారు రైతు సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. – పెన్నేశ్వరి, మార్క్ఫెడ్ డీఎం కొనుగోళ్లు ఆలస్యం సంక్రాంతి తరువాతనే కేంద్రాల ఏర్పాటు 24 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకే అనుమతులు ఖరీఫ్లో అంచనాలకు మించి 1.34 లక్షల హెక్టార్లలో సాగు -
బీమా.. గీమా.. నై!
అనంతపురం అగ్రికల్చర్: విపత్తుల కారణంగా పంటలు కోల్పోయిన సమయంలో రైతులకు పంటల బీమా పరిహారం కాసింత ఉపశమనం కలిగిస్తుంది. అలాంటి పంటల బీమా పథకాల అమలు గురించి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అతికించిన పోస్టర్ల ప్రకారం ప్రీమియం చెల్లింపు గడువు డిసెంబర్ 15తోనే ముగిసింది. గడువు ముగిసి ఇప్పటికి పది రోజులవుతున్నా పంటల బీమా అమలు, ప్రీమియం చెల్లింపు గడువు పొడిగింపు గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ఈ నెలాఖరుకు రబీ సీజనే ముగుస్తున్నా వాతావరణ బీమా, ఫసల్బీమా పథకాలు ఉన్నాయా లేదా అనేది అటు వ్యవసాయశాఖ ఇటు ఉద్యానశాఖ, మరోవైపు మంత్రులు, ప్రజాప్రతినిధులు నోరుమెదిపే పరిస్థితి కనిపించడం లేదు. ప్రీమియం కట్టేందుకు చాలా మంది రైతులు సిద్ధంగా ఉన్నా... ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. ● ఈ రబీలో ప్రధానమంత్రి ఫసల్బీమా కింద వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి, పప్పుశెనగకు వర్తింపజేశారు. జనరలీ సెంట్రల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో అమలు కానున్న బీమా పథకంలో వ్యవసాయ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పప్పుశనగ ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఖరారు చేయగా.. అందులో రైతులు తమ వాటా కింద రూ.450 ప్రకారం ప్రీమియం చెల్లించాలి. వేరుశనగకు ఎకరాకు రూ.32 వేలు కాగా, ప్రీమియం రూ.480, జొన్నకు రూ.21 వేలు కాగా, ప్రీమియం రూ.315, మొక్కజొన్నకు రూ.35 వేలు కాగా ప్రీమియం రూ.525 ప్రకారం, వరికి రూ.42 వేలు కాగా ప్రీమియం రూ.630 ప్రకారం చెల్లించాలి. అలాగే టమాటకు బీమా వర్తింపజేసినట్లు ఉద్యానశాఖ చెబుతున్నా.. ప్రీమియం గురించి స్పష్టత ఇవ్వడం లేదు. ప్రీమియం కట్టడానికి వరికి ఈ నెలాఖరు వరకు గడువు ఉండగా, మిగతా పంటలకు ఈనెల 15లోపు గడువు దాటిపోయింది. ఇక ఈ–క్రాప్ ప్రక్రియను కూడా అస్తవ్యస్తం చేశారు. జగన్ హయాంలో ఉచితంగా బీమా.. రబీ పంటల బీమాకు మంగళం! 10 రోజుల కిందటే ముగిసిన ప్రీమియం గడువు బీమా పథకాలపై స్పష్టత ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2019–2024 మధ్య సమయంలో రైతులపై ప్రీమియం భారం మోపకుండా వాతావరణ, ఫసల్బీమా పథకాలు పూర్తిగా ఉచితంగా అమలు చేశారు. ఈ–క్రాప్ ఆధారంగా నిబంధనల మేరకు సకాలంలో బీమా కింద పరిహారం కూడా ఇచ్చి ఆదుకున్నారు. విస్తారంగా వర్షాలు పడ్డాయి. అంతో ఇంతో పంట దిగుబడలు కూడా చేతికివచ్చాయి. కానీ నిబంధనల మేరకు పంటల బీమా కింద అందాల్సిన మొత్తం రైతులకు ఇవ్వడం విశేషం. అలా అనంతపురం జిల్లాకు సంబంధించి నాలుగు సంవత్సరాలు బీమా కింద దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.1,205 కోట్లకు పైగా పరిహారం బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. పంటల బీమా పథకాలకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పంటల బీమా పథకాలు అంటే అలా ఉండాలని గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికారంలోకి రాగానే ఉచిత బీమా పథకాలకు మంగళం పాడేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అసలు పథకాలే లేకుండా ఎసరు పెట్టడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అగ్రిటెక్ స్టార్టప్లను ప్రోత్సహించాలి
అనంతపురం అర్బన్: నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతుల సమస్యకు పరిష్కారం చూపించే అగ్రిటెక్ స్టార్టప్లను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయో హెల్త్, క్రాప్ హెల్త్ మానిటరింగ్, ఫర్టిలైజర్ వినియోగం, మైక్రో ఇన్నోవేషన్ మానిటరింగ్, తదితర స్టార్టప్లు, ఎఫ్పీఓలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ఉద్యాన శాఖ ద్వారా సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. స్టార్టప్ ఆలోచన బాగుంటే రుణాలు ఇప్పించాలని ఎల్డీఎంను ఆదేశించారు. అగ్రిస్టార్టప్లు ఉత్పత్తి చేసే వస్తువులు బాగుంటే వాటిని మార్కెటింగ్ చేయగలిగే కంపెనీలను గుర్తించాలని సూచించారు. రబీలో ఇప్పటి వరకు 60 శాతం పంటలు సాగయ్యాయని వ్యవసాయాధికారి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ రైతు సేవ కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. నేషనల్ బ్యాంబూ మిషన్ కింద కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్చంద్, ఉద్యానశాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, ప్రకృతి వ్యవసాయం డీపీఎం లక్ష్మానాయక్, ఆత్మా పీడీ పద్మలత, ఎల్డీఎం నరేష్రెడ్డి, డీఆర్డీఏ పీడీ శైలజ, మత్స్య శాఖ డీడీ చంద్రశేఖర్రెడ్డి, పట్టుపరిశ్రమ శాఖ అధికారి మెహతాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
క్రీస్తు మార్గం అనుసరణీయం
అనంతపురం కల్చరల్: ప్రపంచ శాంతిని కోరుకునే క్రీస్తు మార్గం అనుసరణీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. జిల్లాలోని క్రైస్తవులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు జననం శాంతికి సంకేతమని.. తన జీవితం, మరణం ద్వారా ఈ లోకానికి సరైన మార్గాన్ని చూపారని తెలిపారు. సమాజంలో చెడును పక్కన పెట్టి మంచిని పెంపొందించాలని, ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడితేనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ క్రిస్మస్ శుభాకాంక్షలు అనంతపురం అర్బన్: జిల్లాలోని క్రైస్తవులకు కలెక్టర్ ఆనంద్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు చూపిన ప్రేమ మార్గం అనుసరణీయమన్నారు. ఆయన కృపాకటాక్షలతో జిల్లా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అనందమయ జీవితం గడపాలని ఆకాంక్షించారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. చెరువులకు నీరివ్వడంలో ఇంత నిర్లక్ష్యమా? ● మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం పుట్లూరు: శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలోని చెరువులకు నీటిని సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా చెరువులకు సకాలంలో నీటిని సరఫరా చేసి, తాగు – సాగు నీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామన్నారు. నాడు చెరువులు నీటితో కళకళలాడేవని, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయిందని తెలిపారు. ప్రతి ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో సుబ్బరాయసాగర్ ద్వారా చెరువులకు నీటిని సరఫరా చేయాల్సి ఉందన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం డిసెంబర్ నెల ముగస్తున్నా ఇప్పటికీ చెరువులకు చుక్కనీరు చేర్చని దుస్థితి నెలకొందన్నారు. వర్షాలు లేక పుట్లూరు మండలంలోని పలు గ్రామాల్లో తాగు, సాగు నీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సుబ్బరాయసాగర్కు పూర్తిస్థాయిలో నీరు చేరినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా షట్టర్లు మరమ్మతుకు గురై నీటిని విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి చెరువులన్నీ నింపాలని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. చిక్క ఒడయార్ సమాఽధి గుర్తింపు పుట్టపర్తిటౌన్: ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద చెరువు అయిన బుక్కపట్నం చెరువును నిర్మించిన చిక్క ఒడయార్ సమాఽధిని స్థానిక ఉపాధ్యాయుడు, చరిత్రకారుడు గోపి బుధవారం బుక్కపట్నం చెరువు వద్ద ఏనుగు తూము సమీపంలో గుర్తించారు. చిక్క ఒడయార్ విజయనగర సామ్రాజ్య రెండో చక్రవర్తి బుక్కరాయల వద్ద ప్రధానిగా పనిచేశారు. ఆయన బుక్కపట్నం చెరువుతో పాటు బుక్కరాయసముద్రం, కణేకల్లు, నాగసముద్రం, కనుముక్కల, మేడాపురం వంటి ఎన్నో చెరువులను నిర్మించినట్లు తెలిపారు. బుక్కపట్నం చెరువు పూర్తయిన తర్వాత వారి కుల దైవం చౌడేశ్వరిదేవి గుడిని కట్ట కింద నిర్మించారు. ఆ తర్వాత ఆయన మరణించగా ఆయన సమాధిని కూడా ఇక్కడే నిర్మించినట్లు గోపి తెలియజేశారు. అలాగే బుక్కపట్నం చెరువు సమీపంలో శ్రీకృష్ణదేవరాయలు తమ్ముడు అచ్యుత రాయల వారి శాసనాలు కూడా గుర్తించామన్నారు. చిక్క ఒడయార్ సమాధి మీద శివలింగాన్ని ప్రతిష్టించిందున బుక్కపట్నం పరిసర గ్రామాల ప్రజలు చుక్కోల రాయునిగా పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
జగన్ ఫ్లెక్సీపై పోలీసుల అత్యుత్సాహం
కూడేరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా కూడేరు మండలం ఉదిరిపికొండలో పార్టీ నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీర్ల మకానం వద్ద ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, పార్టీ జెండాలపై పోలీసులు అత్యుత్సాహం కనబరిచారు. తక్షణమే వాటిని తొలగించాలంటూ తమదైన శైలిలో గ్రామస్తులకు వార్నింగ్ ఇచ్చారు. తమ అభిమాన నేత పుట్టిన రోజు వేడుక జరపుకోవడం కూడా తప్పేనా? అంటూ పోలీసులను గ్రామస్తులు నిలదీయడంతో తమకు పెద్ద సార్ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయని, వాటిని తొలగించుకోవాలని ఆదేశించి వెళ్లిపోయారు. అయితే గ్రామస్తులు వాటిని తొలగించుకుండా ఉంచేయడంతో సోమవారం రాత్రి మరోసారి ఉదిరిపికొండకు చేరుకుని పార్టీ నేతలపై రెచ్చిపోయారు. దీంతో నేతలు ఫ్లెక్సీ తొలగించారు. కానీ, పార్టీ జెండాను కూడా తొలగించాలని పోలీసులు పట్టుబట్టడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం ‘ఏపీకి జగన్ నీడ్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కట్టపై జెండావిష్కరణ చేశామని, ఈ జెండా వల్ల ఇక్కడ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని గ్రామస్తులు అన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేసి ఉంటే తెలపాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ జెండాను తొలగించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ గ్రామంలో రాజకీయ కక్షలు లేవని, ప్రశాంతంగా ఉన్న గ్రామంలో గొడవలకు ఆజ్యం పోసే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. దీంతో స్టేషన్కు వచ్చి పెద్ద సార్తో మాట్లాడాలని కానిస్టేబుళ్లు తెలపడంతో తామేమీ నేరం చేశామని స్టేషన్కు రమ్మంటున్నారని, జెండాను తొలగించేది లేదని తెగిసే చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. -
కేబుల్ అపహరణ
యాడికి: మండలంలోని చందన గ్రామంలో వ్యవసాయ బోరు బావుల్లోని మోటార్లకు అమర్చిన విద్యుత్ కేబుల్ను సోమవారం రాత్రి దుండగులు అపహరించారు. గ్రామానికి చెందిన రైతులు పరమేశ్వర, శివయ్య, ఆది, మోహన గౌడ్ తమకున్న 15 ఎకరాల్లో అరటి, మొక్కజొన్న సాగు చేశారు. ఈ క్రమంలో బోరుబావులకు 80 మీటర్ల పొడవైన విద్యుత్ కేబుల్ను అమర్చారు. మంగళవారం ఉదయం పొలాల వద్దకెళ్లిన రైతులు కేబుల్ కనిపించకపోవడంతో చోరీ అయినట్లుగా నిర్ధారించుకున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10,. నవంబర్ 18న కూడా కేబుల్ను దుండగులు అపహరించుకెళ్లారని, తాజాగా మరోసారి కేబుల్ను ఎత్తుకెళ్లారంటూ రైతులు వాపోయారు. ఘటనపై పోలీసులు స్పందించి కేబుల్ దొంగల అరాచాకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఇసుక ట్రాక్టర్ల సీజ్ పెద్దవడుగూరు: మండలంలోని కొండూరు గ్రామ సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. అందిన సమాచారం మేరకు మంగళవారం తనిఖీలు చేపట్టిన సమయంలో కొందరు అక్రమంగా కొండూరు, వీరన్నపల్లి, చిట్టూరు గ్రామాల పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించి, రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి మండల మేజిస్ట్రేట్ సమక్షంలో హాజరుపరిచినట్లు వివరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పామిడి: ఈ నెల 22న 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో గాయపడి అనంతపురంలోని జీజీహెచ్లో చికిత్స పొందుతున్న పామిడి మండలం పొగరూరు నివాసి సంజీవ (39) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ మేరకు ఎస్ఐ బి.రవిప్రసాద్ తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
అన్నదాతలపై చంద్రబాబు చిన్నచూపు
● రైతు దినోత్సవం నిర్వహించని దుస్థితిలో ప్రభుత్వం అనంతపురం అగ్రికల్చర్: అన్నదాత పట్ల చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. వ్యవసాయమన్నా.. రైతన్నా గిట్టదని మరోసారి బయటపడింది. మంగళవారంజాతీయ రైతు దినోత్సవం జిల్లాలో అధికారికంగా నిర్వహించకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ, పట్టు, పాడి, ఉద్యాన, ఏపీఎంఐపీ, మత్స్య మార్కెటింగ్ తదితర శాఖల ఆధ్వర్యంలో కూడా ఎక్కడా గ్రామాలకు వెళ్లి రైతు దినోత్సవం పేరుతో రైతును గౌరవించకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ సంస్థ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరై సన్మానం అందుకోవడం గమనార్హం. నాడు వాడవాడలా రైతు దినోత్సవం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్తో వ్యవసాయ రంగానికి ఊపిరిపోసి సంక్షోభంలో ఉన్న రైతును సంక్షేమం దిశగా నడిపించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కూడా వ్యవసాయ అనుబంధ రంగాలకు, రైతులకు పెద్ద పీట వేసి ప్రోత్సహించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ హయాంలో వైఎస్సార్ జయంతి జూలై 8న ఏకంగా రైతు దినోత్సవంగా వాడవాడలా నిర్వహిస్తూ వచ్చారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎక్కడా రైతులను పలకరించిన పాపానపోలేదు. యోగాంధ్ర నిర్వహణ, డీఎస్సీ అభ్యర్థులకు పోస్టింగ్లకు, సూపర్సిక్స్–సూపర్హిట్ అంటూ పెట్టిన సభలు, కార్యక్రమాలకు మంచినీళ్ల ప్రాయంగా ప్రజాధనం ఖర్చు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. రైతు పట్ల మరీ ఇంత చిన్నచూపు చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
కసాపురంలో ఆన్లైన్ సేవలు ప్రారంభం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఈఓ మేడేపల్లి విజయరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయశాఖ ఆదేశానుసారం ఆలయంలో స్వామివారి దర్శనం, ప్రసాదాలు, వసతి గదులు, వివిధ ఆర్జిత సేవల ఆన్లైన్ బుకింగ్ కౌంటర్ ప్రారంభించినట్లు తెలిపారు. www.aptemple.com ను సంప్రదించి కసాపురం ఆలయానికి సంబంధించిన సేవలను పొందవచ్చని తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గుంతకల్లు–మార్కాపురం మధ్య త్వరలో కొత్త రైళ్లు గుంతకల్లు: శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనార్థం గుంతకల్లు – మార్కాపురం మధ్య కొత్త ప్యాసింజర్ రైళ్లను తర్వలోనే ప్రవేశపెట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు జంక్షన్ నుంచి ఈ రైలు (57407) రోజూ సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి నంద్యాల జంక్షన్కు రాత్రి 8.20 గంటలకు, మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్కు 11.30 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు. తిరిగి ఈ రైలు మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్ నుంచి (57408) ఉదయం 4.30 గంటలకు బయలుదేరి నంద్యాల జంక్షన్కు ఉదయం 7.20 గంటలకు గుంతకల్లు జంక్షన్కు ఉదయం 10.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైలు మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబోట్ల కృష్ణపురం, కుంభం, తర్లుపాడు మధ్య రాకపోకలు సాగిస్తుందని పేర్కొన్నారు. హిందూపురంలో ఆగనున్న ‘వందే భారత్’ హిందూపురం: వందే భారత్ రైలు హిందూపురం రైల్వేస్టేషన్లో స్టాపింగ్కు రైల్వే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాచిగూడ–యశ్వంత్పుర్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ (20703)కు 27న హిందూపురంలో కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్న జెండా ఊపి ప్రారంభించనున్నారు. తర్వాత నూతనంగా పునరుద్ధరించిన చాకార్లపల్లి రైల్వేస్టేషన్ను కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ప్రారంభించనున్నారు. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు నంబర్ 20703 తెల్లవారుజామున 5.45 కాచిగూడ నుంచి బయలుదేరి హిందూపురానికి మధ్యాహ్నం 12.00కు వస్తుంది. ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.00 గంటలకు యశ్వంత్పూర్ చేరుతుంది. అలాగే తిరిగి వందేభారత్ రైలు యశ్వంత్పూర్లో మధ్యాహ్నం 2.45 బయలుదేరి తిరిగి హిందూపురానికి 3.30 గంటలకు చేరుతుందని అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 11 గంటలకు కాచిగూడకు చేరుతుందన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
● సమగ్రశిక్ష ఏపీసీ శైలజ అనంతపురం సిటీ: క్రీడలతో మానసికోల్లాసం కలిగి విధులు సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని సమగ్రశిక్ష(ఎస్ఎస్ఏ) ఏపీసీ శైలజ అభిప్రాయపడ్డారు. అనంతపురంలోని బాలుర ఉన్నత పాఠశాల (న్యూ టౌన్) మైదానంలో రెండ్రోజులుగా సాగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడా పోటీలు మంగళవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీసీ శైలజ హాజరై, మాట్లాడారు. విధి నిర్వహణలో ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా క్రీడలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. కాగా, చివరి రోజు కళ్యాణదుర్గం, అనంతపురం డివిజన్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 79 పరుగులు చేయగా, కళ్యాణదుర్గం జట్టు 11 ఓవర్లలో 83 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది. 25 పరుగులు చేసిన ప్రవీణ్ (కళ్యాణదుర్గం) ప్లేయర్ ఆఫ్ మ్యాచ్గా ఎంపిక చేశారు. అలాగే త్రోబాల్ పోటీల్లో గుంతకల్లు డివిజన్ జట్టు కళ్యాణదుర్గం, అనంతపురం జట్ల మీద విజయం సాధించి విజేతగా నిలిచింది. గుంతకల్లు డివిజన్లో లక్ష్మి బెస్ట్ ఆఫ్ ప్లేయర్గా నిలిచారు. విజేతలకు ట్రోఫీలు, మెమొంటోలను ఏపీసీ శైలజ అందజేశారు. స్కూల్ గేమ్స్ సెక్రటరీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
గ్రామాలను అభివృద్ధి బాట పట్టిద్దాం
●జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆత్మకూరు: సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని సంబంధిత అధికారులను జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు మండలం ముట్టాల గ్రామంలో ఆయన పర్యటించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ చెత్తను రోడ్లపై వేయరాదని, తడి పొడి చెత్తలను వేరు చేసి పంచాయతీ వాహనాలు వచ్చినప్పుడు అందజేయాలని సూచించారు. మురుగు నీరు రోడ్లపై విడవరాదన్నారు. తాగునీటి నీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన హరిత వనాన్ని పరిశీలించి, అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీనరసింహ, పంచాయతీ కార్యదర్శి మల్లేష్, సిబ్బంది పాల్గొన్నారు. డ్రిప్ లక్ష్యాలు పూర్తి చేయాలి ● ఏపీఎంఐపీ పీఓ వెంకటేశ్వర్లు ఆదేశం అనంతపురం అగ్రికల్చర్: నిర్దేశిత గడువు లోపు 18 వేల హెక్టార్లకు డ్రిప్ పరికరాల సరఫరా వేగవంతం చేయాలని ఏపీఎంఐపీ ప్రాజెక్టు అధికారి (పీఓ) ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి జిల్లా అఽధికారులు, పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ బి.ధనుంజయతో పాటు డ్రిప్ కంపెనీ డీసీఓలు, ఎంఐ ఇంజనీర్లతో వీడియో కాన్పరెన్స్లో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన ప్రతి రైతుకూ డ్రిప్ పరికరాలు అందించాలన్నారు. పరికరాల నాణ్యత విషయంలో రాజీపడకూడదని, పరికరాల పనితీరుపై ట్రయల్రన్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతానికి 12,530 హెక్టార్లకు డ్రిప్ మంజూరు చేసినట్లు పీడీ తెలిపారు. మూడు రోజులుగా దళిత వాడకు అందని తాగునీరు కూడేరు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయం పక్కన ఉన్న దళితవాడ, మరికొన్ని వీధులకు మూడు రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బోరు వేసి మోటర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మోటర్ చెడిపోవడంతో మరమ్మతులు చేయించలేదు. దీంతో ఆయా కాలనీలకు నీరు అందకుండా పోయింది. ఎంపీడీఓ కార్యాలయంలోని టాయిలెట్లకు కూడా నీటి సరఫరా ఆగి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి మోటారుకు మరమ్మతులు చేయించి, నీటి సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. సీ్త్రనిధి రుణాలు సద్వినియోగం చేసుకోండి ● డీఆర్డీఏ పీడీ శైలజ అనంతపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను సీ్త్ర నిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళా స్వయం సంఘాల సభ్యులకు డీఆర్డీఏ పీడీ టి.శైలజ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 35 వేల స్వయం సహాయక సంఘాలకు రూ.289 కోట్లు కేటాయించారు. ఒక్కో గ్రూపునకు రూ.5 లక్షలున్న రుణ పరిమితిని రూ.8 లక్షలకు పెంచారు. దీంతో పాటు అత్యవసరంగా రుణాలు కావాల్సిన సభ్యులకు సైతం రూ.1లక్ష వరకు అందించనున్నారు. దీంతో పాటు జీవనోపాధుల కింద సైతం రుణాలను అందజేయనున్నారు. -
కార్యకర్తలకు తోడుగా ఉంటా..
● మాజీ ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం: నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అన్ని వేళలా తోడుగా ఉంటానని కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య భరోసానిచ్చారు. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆదినారాయణరెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులను సోమవారం అర్ధరాత్రి నుంచి పోలీసుస్టేషన్లోనే కూర్చోబెట్టుకున్న ఘటరపై రంగయ్య తనదైన శైలిలో స్పందించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి బెయిల్పై బయటకు వచ్చే వరకూ రంగయ్య సాగించిన పోరాటం కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. పార్టీ కార్యాలయంలోనే ఉండి ఎప్పటికప్పుడు లీగల్ సెల్ టీం సభ్యులను సమన్వయం చేసుకుని బెయిల్పై నాయకులు, కార్యకర్తలను బయటకు రప్పించారు. అనంతరం వారు పార్టీ కార్యాలయంలో రంగయ్యను కలసి కృతజ్ఞతలు తెలిపడంతో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా లీగల్ సెల్ టీం సభ్యులను రంగయ్య సన్మానించి, మాట్లాడారు. బొమ్మగానిపల్లిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మ దినం సందర్భంగా కార్యక్రమాలను నిర్వహించిన పార్టీ నాయకులపై టీడీపీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, లీగల్ సెల్ నాయకులు ఎర్రిస్వామి, బీటీ రామాంజనేయులు, రామాంజనేయులు, పార్టీ వివిధ మండలాల కన్వీనర్లు సుధీర్, చంద్రశేఖర్ రెడ్డి, గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, హనుమంతరాయుడు, ఎంపీపీలు భీమేష్, చంద్రశేఖర్రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన విద్యార్థి
అనంతపురం సిటీ: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత జిల్లాలోని ఓడీచెరువు గ్రామ ఎస్సీ బాలుర సమీకృత వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న లక్ష్మీనరసింహ(14) రోడ్డు ప్రమాదానికి గురై పది రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. అయితే బాలుడి మృతదేహానికి ఆగమేఘాలపై పోస్టుమార్టం నిర్వహించి, స్వగ్రామానికి తరలించాలంటూ మెడికల్ కళాశాల హెచ్ఓడీ ఒత్తిడి మేరకు అందించిన వైద్య సేవలపై పలు అనుమానాలు రేకెత్తాయి. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడకు చేరుకుని మార్చురీ ఎదుట ఆందోళనకు దిగారు. మరణించిన బాలుడి తండ్రి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం ఎలా చేస్తారని నిలదీశారు. దీంతో మార్చురీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులతో పాటు ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గిరి, ఏఐఎస్బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్ వెంటనే ఆస్పత్రి మార్చురీకి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని గమనించారు. మరణించిన విద్యార్థి తండ్రి పూజారి శివానందతో కలసి మార్చురీ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. మంత్రి సవితతో పాటు మెడికల్ కళాశాలకు చెందిన కీలక అధికారి తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించి విద్యార్థి ప్రాణాలు కాపాడాల్సిన కనీస బాధ్యతను విస్మరించిన మంత్రి సవితను వెంటనే బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. విద్యార్థి మృతికి కారకులైన వార్డెన్, సిబ్బందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని పట్టుబట్టారు. అంత వరకు ఇక్కడి నుంచి మృతదేహాన్ని తరలించే ప్రసక్తే లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత జరిగిన ఘటన దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఇలాకాలో ఈ నెల 14న ప్రమాదానికి గురైన హాస్టల్ విద్యార్థులు వార్డెన్, మరో ముగ్గురి సస్పెన్షన్తో చేతులు దులిపేసుకున్న మంత్రి పది రోజులుగా అనంతపురం జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం విద్యార్థి మృతి ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత -
రచ్చకెక్కిన ‘తమ్ముళ్ల’ కబ్జా
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని శారదానగర్ పరిధిలో నివాసముంటున్న విశ్రాంత అధ్యాపకురాలి ఇంటి కబ్జా వెనుక టీడీపీ నేతలు ఉన్నారంటూ అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ హరిత, ఆమె భర్త జయరాంనాయుడు ఆరోపిస్తూ మంగళవారం సదరు ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. వాస్తవానికి ఆ ఇంటి కబ్జా వెనుక జయరాంనాయుడు ఉన్నాడనే ఆరోపణలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో వారు ధర్నాకు దిగి టీడీపీ నేతలపైనే ఆరోపణలు చేశారు. తమ పార్టీ వారే ఈ ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారని, ఇందులో తమకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఇది చూసిన పలువురు శారదానగర్ లాంటి ఘటనలు చాలాచోట్ల ఉన్నాయని అధికారాన్ని అడ్డుపెట్టుకుని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. కోత మిషన్లో పడి యువకుడి మృతి డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): కోత మిషన్లో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన డి.హీరేహాళ్ మండలం గొడిసెలపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నరాజు (25) గ్రామ సమీపంలోని కంది పొలంలో మిషన్ ద్వారా కోత కొస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారణ అయింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసు యల్లనూరు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల 21 పొట్టేలు నరికిన 8 మందిపై యల్లనూరు పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం యల్లనూరుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు మారుతీ, శివ, మహేష్, పెద్దిరాజు, నరేష్, రాము, పెద్దన్న, రమణను స్టేషన్కు తీసుకువెళ్లారు. సాయంత్రం వరకూ స్టేషన్లో కూర్చోబెట్టి అనంతరం యల్లనూరు ప్రాథమిక కేంద్రంలో వారికి వైద్య పరీక్షల నిర్వహించారు. అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టారు. కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో తాము వేడుకలు చేసుకుంటే ఎవరికేం నష్టం జరిగిందని బాధితులు ప్రశ్నించారు. ఇక వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాధ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగతి విజయ ప్రతాప్రెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి విష్ణునారాయణ, మండల కన్వీనరు శివశంకర్ మండిపడ్డారు. హెచ్చెల్సీలో వివాహిత గల్లంతు బొమ్మనహాళ్: ప్రమాదవశాత్తు హెచ్చెల్సీలో పడి ఓ వివాహిత గల్లంతైంది. పోలీసులు తెలిపిన మేరకు... బొమ్మనహాళ్ మండలం మైలాపురం గ్రామానికి చెందిన దంపతులు వరలక్ష్మి(25), నవీన్ మంగళవారం సాయంత్రం కర్ణాటకలోని రాంపురంలో సంతకు వెళ్లి రాత్రికి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. గ్రామ సమీపంలోని హెచ్చెల్సీ వద్దకు చేరుకోగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడడంతో వెనుక కూర్చొన్న వరలక్ష్మి కాలువలోకి పడి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. కాగా, ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. గల్లంతైన వరలక్ష్మి కోసం బంధువులు, స్ధానికులు, పోలీసులు హెచ్చెల్సీ గాలింపు చర్యలు చేపట్టారు. ‘బీమా సంకల్ప్’ మెగా డ్రైవ్లో అనంతకు మూడోస్థానం అనంతపురం సిటీ: తపాలా శాఖ చేపట్టిన ‘బీమా సంకల్ప్ 2.0’ కార్యక్రమం కింద పీఎల్ఐ/ఆర్పీఎల్ఐ మెగా డ్రైవ్లో అనంతపురం డివిజన్ రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించినట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ కోనేటి అమరనాథ్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. నూతన ప్రీమియం కింద రూ.1.84 కోట్లు సేకరించినట్లు వివరించారు. తక్కువ ప్రీమియం, అధిక బోనస్, మనీ బ్యాక్ సేవింగ్స్ పాలసీలు, పీఎల్ఐ జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డిగ్రీ, డిప్లొమో, ఐటీఐ, ప్రైవేటు ఉద్యోగులను తమ స్కీమ్లు విశేషంగా ఆకర్షించాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ పాలసీలు అత్యంత సురక్షితంగాను, విశ్వసనీయంగా ఉండడంతో పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని తెలిపారు. తమ శాఖలోని అన్ని విభాగాల సిబ్బంది మొదలు అధికారుల వరకు ప్రతి ఒక్కరూ సహకరించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
వైభవంగా గ్రామ దేవర వేడుకలు
బత్తలపల్లి: మండలంలోని జలాలపురంలో గ్రామదేవత పెద్దమ్మతల్లి దేవర వేడుకలు మంగళవారం వైభవంగా మంగళవారం నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి జ్యోతులు, బోనాలు సమర్పించారు. అర్చకులు కుంకుమార్చన, విశేష అలంకరణ చేశారు. గ్రామంలోని అన్ని ఆలయాలకు మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో వెళ్లి టెంకాయలు సమర్పించారు. అనంతరం జంతుబలులు ఇచ్చారు. బంధువులను, స్నేహితులను విందులకు ఆహ్వానించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేత కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నేత హరీష్బాబు తదితరులు పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర నాయకుడు ఓబులపతి, ధర్మవరం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గొల్లపల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమతం ఈశ్వరయ్య, రాష్ట్ర యూత్ విభాగం కార్యదర్శి చల్లా మహేష్నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటి సురేష్కుమార్, మండల మాజీ కన్వీనర్ బగ్గిరి బయపరెడ్డి, సర్పంచు సానే జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించాలి
● వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు గుత్తి: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ 18 నెలల కాలంలో పాస్టర్లకు గౌరవ వేతనం అందకుండా పోయిందని, ఇప్పటికై నా పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లించాలంటూ వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు డిమాండ్ చేశారు. గుత్తిలోని చర్చిలో మంగళవారం ఆయన పాస్టర్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా ప్రతి నెలా పాస్టర్లకు రూ.5 వేల గౌరవ వేతనాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేస్తూ వచ్చారని గుర్తు చేశారు. అంతే కంటే ఎక్కువ ఇస్తానని ఎన్నికల సమయంలో వాగ్ధానం చేసిన చంద్రబాబు... ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. రెండేళ్లు కరోనాలో గడిచి పోయినా కేవలం మూడేళ్లలో సంక్షేమం, అభివృద్ది అంటే ఏమిటో వైఎస్ జగన్ చూపించారన్నారు. ఏకంగా 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొస్తే వాటిని నిర్వహించడం చేతకాక చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడానికి పూనుకోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికై నా పాస్టర్లకు వెంటనే గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు జాకోబ్ , అబ్రహాం, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
యూత్ ఏషియన్ క్రీడాకారునికి అభినందన
అనంతపురం కార్పొరేషన్: దుబాయిలో ఈ నెల 7 నుంచి 14 వరకు జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన నరేష్ సత్తా చాటాడు. టీ44 కేటగిరీ 400 మీటర్ల పరుగు పందెంలో నరేష్ వెండి పతకం సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో నరేష్ను కలెక్టర్ ఆనంద్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ మంజుల, తదితరులు పాల్గొన్నారు. నిర్మాణపనులు వేగవంతం కావాలి అనంతపురం అర్బన్: జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ జాతీయరహదారి శాఖ నూతన ఎన్ఈ జి.సంజీవరాయుడుకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని చాంబర్లో కలెక్టర్ను సంజీవరాయుడు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయరహదారి నిర్మాణ పనుల త్వరిగతగతిన పూర్తిచేయడంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కొత్త పింఛన్లు లేవు ● అర్జీలతో కార్యాలయాలకు రావొద్దు అనంతపురం టౌన్: ఎన్టీఆర్ భరోసా కింద కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర కేటగిరీల వారు పింఛన్ కోసం అర్జీలతో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో డీఆర్డీఏ పీడీ శైలజ మంగళవారం స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రానందున ఎవ్వరూ కలెక్టరేట్, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పింఛన్ వస్తున్న జీవత భాగస్వామి (మగవారు) మరణిస్తే స్పౌజ్ కేటగిరి కింద భార్యకు పింఛన్ను వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. చాలామంది కొత్త పింఛన్ల కోసం సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి అర్జీలు అందజేస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాగానే పత్రికా ప్రకటనలు ఇస్తామని, తెలిపారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే చాలని, జిల్లా కేంద్రానికి వచ్చి అర్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
పాపంపేట భూముల అక్రమాల్లో తొలి వికెట్ డౌన్
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేట శోత్రియం భూముల అక్రమాల వ్యవహారంలో తొలి వికెట్ పడింది. గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్ఓ) గొల్ల రఘుయాదవ్పై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ కొనసాగుతోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈయన ప్రస్తుతం రుద్రంపేట–2 సచివాయలంలో వీఆర్ఓగా పని చేస్తున్నారు. పాపంపేట శోత్రియం భూములకు సంబంధించి 27–ఏ, 27–1, 27–3 సర్వే నంబర్లలో 22.96 ఎకరాలు రాచూరి వెంకట కిరణ్, రాచూరి సుబ్రహ్మణ్యం హక్కులో ఉన్నారంటూ 2024 ఆగస్టు 13న అప్పటి పాపంపేట వీఆర్ఓ గొల్ల రఘుయాదవ్ ధ్రువీకరిస్తూ పత్రాలు జారీ చేశారు. వీటి ఆధారంగా రాచూరి వెంకటకిరణ్, రాచూరి సుబ్రమణ్యం ఇద్దరూ దుర్వినియోగానికి పాల్పడ్డారు. మ్యుటేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా భూముల్లో ఏళ్లతరబడి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికారం లేకపోయినా సంబంధం లేని భూములకు హక్కులు కల్పిస్తూ ధ్రువీకరించారని ఆర్డీఓ విచారణలో తేలింది. నిర్లక్ష్యం, అజాగ్రత్తగా వ్యవహరించిన వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీఓ సిఫార్సు చేశారు. క్రమశిక్షణ చర్యలు ముగిసేదాకా సస్పెన్షన్లోనే ఉంటారు. కలెక్టర్ అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం వదలి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మండల సర్వేయర్ పాత్రా కీలకమే.. ఈ అక్రమాల్లో మండల సర్వేయర్ రఘునాథ్ పాత్ర కూడా కీలకంగా ఉంది. ఏకంగా 175 ఎకరాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. పైగా ఇవన్నీ వ్యవసాయ భూములుగా నిర్ధారిస్తూ ధ్రువీకరణపత్రాలు ఇచ్చారు. భూ సర్వే అధికారుల విచారణలో ఇవన్నీ వెలుగు చూశాయి. పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్కు అందజేశారు. చర్యలు తీసుకోవాలంటూ డైరెక్టరేట్కు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో పూర్వ సర్వేయర్ ప్రతాప్రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ డైరెక్టర్కు నివేదించారు. అతి త్వరలోనే వీరిపైనా చర్యలుంటాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. -
జీపుతో ఢీకొట్టి.. కొడవళ్లతో దాడి చేసి!
గుత్తి రూరల్: మండలంలోని నేమతాబాదు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కొడవళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు తెలిపిన మేరకు.. వ్యక్తిగత పనిపై సుబ్బారెడ్డి సోమవారం రాత్రి గుత్తికి వచ్చాడు. పనిముగించుకుని ద్విచక్రవాహనంపై వెళుతుండగా స్వగ్రామం శివారుకు చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు జీపుతో ఢీకొన్నారు. బైక్ నుంచి ఎగిరి రోడ్డుపై పడిన సుబ్బారెడ్డిపై కర్రలు, ఇనుపరాడ్లు, కొడవళ్లతో దాడి చేసి ఉడాయించారు. రక్తపు మడుగులో పడి ఉన్న సుబ్బారెడ్డిని అటుగా వెళుతున్న స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. కాగా, సుబ్బారెడ్డికి సమీప బంధువులతో కొన్నేళ్లుగా ఆస్తి గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులు దాడి చేసినట్లుగా సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
సహజ వనరులు కొల్లగొడితే ఊరుకోం
● ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు సాగిస్తాం ● మాజీ మంత్రి శైలజానాథ్ బుక్కరాయసముద్రం: సహజ వనరులను కొల్లగొడితే చూస్తూ ఊరుకోబోమని, వాటి పరిరక్షణకు ఎందాకై నా పోరాటం సాగిస్తామని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ పేర్కొన్నారు. సోమవారం బీకేఎస్లోని నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా నశించి, ప్రజల జీవన ప్రమాణాలూ అడుగంటి పోయాయన్నారు. ఎటు చూసినా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై, వారి ఆస్తులపై దాడులు పెరిగి పోయాయని, ఇది మంచి పద్దతి కాదన్నారు. పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు సాగిస్తే రాజకీయం అని పేర్కొనడం సిగ్గు చేటన్నారు. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ దుర్మార్గాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. పుట్లూరు మండలంలో రైతు నాగలింగ మృతిపై ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోవడం బాధాకరమన్నారు. ఆ రోజు హడావుడిగా నాగలింగ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరించిన వారు ఆ బాధిత కుటుంబానికి ఎందు సాయం అందించలేకపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. నార్పలలో నిర్వహించిన రక్తదాన శిభిరంను విజయవంతం చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంతరెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, సర్పంచ్ పార్వతి, శింగనమల, నార్పల మండలాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు పూల ప్రసాద్, ఖాదర్వలి, నాయకులు పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి, నారాయణరెడ్డి, రవి, పవన్, పూల రవి, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శిశుగృహ పోస్టుల భర్తీకి రేపు ఇంటర్వ్యూలు
అనంతపురం సిటీ: స్థానిక బుడ్డప్పనగర్లోని శిశుగృహలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం కింద ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ జిల్లా కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. శిశుగృహలో ఓ చిన్నారి ఆకలిచావుకు గురి కాగా, అందుకు కారణమైన అక్కడి ఎనిమిది ఉద్యోగులను కలెక్టర్ ఆనంద్ శాశ్వతంగా విధుల నుంచి తొలగించిన విషయం విదితమే. మేనేజర్, సోషల్ వర్కర్, ఆయా పోస్టుల భర్తీకి ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కాగా, అర్హత, ఆసక్తి ఉన్న పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 24న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మేనేజర్, సోషల్ వర్కర్ పోస్టుకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నర్సు, చౌకీదార్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి. నైపుణ్యాల మెరుగుతోనే వృత్తిలో రాణింపు బుక్కరాయసముద్రం: నైపుణ్యాలు మెరుగు పరుచుకున్నప్పుడే పోలీసు వృత్తిలో రాణించగలుగుతారని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని ఏపీఎస్పీ 14 బెటాలియన్కు నూతనంగా ఎంపికై న కానిస్టేబుళ్లకు ఎస్పీ జగదీష్ సూచించారు. సోమవారం బీకేఎస్ మండలం జంతలూరు వద్ద ఉన్న ఏపీఎస్పీ 14వ బెటాలియన్లో కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ప్రభుకుమార్, అడిషనల్ కమాండెంట్ కేశవరెడ్డి, డీఎస్పీ శివారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్బాషా, ఎస్సీటీపీసీఎస్ పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. పొడరాళ్లలో టీడీపీ నేతల దౌర్జన్యం బుక్కరాయసముద్రం: మండలంలోని పొడరాళ్ల గ్రామంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంతో రస్తాను అడ్డుకున్నారు. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు సుబ్బరాయుడు, అతని కుమారులు సుబ్రహ్మణ్యం, లింగ, మరో ఇద్దరు కలసి పొలానికి వెళ్లే రస్తాలో ఎవరూ సంచరించకుండా అడ్డుకున్నారు. ఆ రస్తాలో 50 మంది రైతులకు చెందిన పొలాలు ఉన్నాయి. రస్తాను అడ్డుకోవడంతో పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు నాగభూషణ సర్దిచెప్పబోతుండగా ఘర్షణకు దిగి నాగభూషణ కుమార్తె మెడలోని బంగారు నగను లాగి పడేశారు. దీంతో బాఽధిత నాగభూషణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
హోరాహోరీగా టీచర్ల క్రికెట్ టోర్నీ
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రికెట్ మైదానం వేదికగా సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నీ హోరాహోరీగా సాగింది. కళ్యాణదుర్గం, గుంతకల్లు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుంతకల్లు జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 93 పరుగులు చేసింది. అనంతరం కళ్యాణదుర్గం జట్టు 9 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. జట్టులో 39 పరుగులుచేసిన హుస్సేన్ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపిక చేశారు. అంతకుముందు పోటీలను డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాప్తాడు ఎంఈఓ మల్లికార్జున, బ్రహ్మసముద్రం ఎంఈఓ ఓబులపతి, క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి యుగంధర్రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాసులు, గోపాలరెడ్డి, మంజుల, గౌసియా తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 14 అంగన్వాడీ వర్కర్లు, 78 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. మంగళవారం నుంచి జిల్లా కార్యాలయం సహా ఆయా ప్రాంత ప్రాజెక్టు కార్యాలయాల్లో ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు http://ananthapuramu.ap.gov.in వెబ్సైట్ పరిశీలించవచ్చు. క్రమశిక్షణే కీలకం ● కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమంలో డీఐజీ డాక్టర్ షిమోషి అనంతపురం సిటీ: పోలీస్ శాఖ అంటే క్రమశిక్షణకు మారుపేరని, పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని అనంతపురం రేంజ్ డీఐజీ డా.షిమోషి ఆకాంక్షించారు. విశాఖపట్నం, ప్రకాశం, పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయవాడ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన 692 మంది కానిస్టేబుళ్లుగా ఎంపికై న అభ్యర్థులకు అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో సోమవారం నుంచి శిక్షణ తరగతులను డీఐజీ షిమోషి లాంఛనంగా ప్రారంభించారు. కోర్సు డైరెక్టర్ జె.మల్లికార్జున వర్మ, అనంతపురం పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఆర్.వాసుదేవన్, పీటీసీ ఇండోర్ విభాగం డీఎస్పీలు హరినాథరెడ్డి, అల్లాబకాష్, ఎం.సూర్యనారాయణరెడ్డి, ఫీల్డ్ ట్రైనింగ్ డీఎస్పీ వై.రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. ఇళ్ల మధ్యన గంజాయి సాగు ఆత్మకూరు: మండల కేంద్రంలో ఇళ్ల మధ్యన గంజాయి మొక్కలు పెంచుతున్న 69 ఏళ్ల వ్యక్తిని సోమవారం ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సయ్యద్ జాకీర్, సిబ్బంది అరెస్ట్ చేసి, సుమారు ఐదు అడుగుల ఎత్తున పెరిగిన 20 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పెద్దన్నను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక యాడికి: ఎస్జీఎఫ్ అండర్–14 జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు యాడికి జెడ్పీహెచ్ఎస్లోని 8వ తరగతి విద్యార్థి ఎస్.మణికంఠ ఎంపికయ్యాడు. జనవరి 4న ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్ వేదికగా జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి. ప్రతిభ చాటిన మణికంఠను ఆ పాఠశాల హెచ్ఎం సీతారామాంజనేయులు, పీడీలు చంద్రకళ, శివశంకర్, ఉపాధ్యాయులు అభినందించారు. పలువురు పోలీసు అధికారులకు డిస్క్ అవార్డులు అనంతపురం: డీజీపీ కమండెషన్ డిస్క్ అవార్డులు సోమవారం ప్రకటించారు. ఇందులో జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసు అధికారులకు సిల్వర్ (వెండి) డిస్క్ అవార్డు దక్కింది. వీరిలో అనంతపురం ఎస్ఐ షేక్ సైఫుల్లా, డీసీఆర్బీ హెడ్కానిస్టేబుల్ బి. నాగరాజు, ఎస్బీ సీఐ బి.క్రాంతి కుమార్ ఉన్నారు. అలాగే కళ్యాణదుర్గం రూరల్ సీఐ సి.నీలకంఠేశ్వర, పెద్దపప్పూరు ఎస్ఐ వి.అమానుల్లా, అనంతపురం హెడ్కానిస్టేబుల్ డి. భాస్కర్బాబు, జె.జగదీష్బాబు, డీఎస్బీ హెడ్కానిస్టేబుల్ పి.తిప్పేస్వామి, కూడేరు కానిస్టేబుల్ వి.వీర నరసింహరాజు, ఏపీఆర్సీ–83 డీఏఆర్ షేక్ మహమ్మద్ రఫీ, అనంతపురం త్రీ టౌన్ పీఎస్ డబ్ల్యూపీసీ సీహెచ్ ప్రభావతి, శెట్టూరు కానిస్టేబుల్ జి.నాగార్జున, అనంతపురం కానిస్టేబుల్ కె.రాజశేఖర్కు అవార్డులు దక్కాయి. -
మూల్యం చెల్లించక తప్పదు
● కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన వామపక్ష పార్టీల నాయకులు అనంతపురం అర్బన్: ప్రజా వ్యతిరేక పాలనకు మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సీపీఐ, సీపీఐ (ఎంఎల్ – న్యూడెమోక్రసీ), ఎస్ఈయూసీఐ, సీపీఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్ –లిబరేషన్) జిల్లా కార్యదర్శులు పాళ్యం నారాయణస్వామి, ఇండ్ల ప్రభాకర్రెడ్డి, రాఘవేంద్ర, చంద్రశేఖర్, వేమన, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నాగేంద్రకుమార్ మాట్లాడారు. మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టానికి ఏటా నిధులు తగ్గిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేశారన్నారు. తాజాగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కొత్త బిల్లును పార్లమెంట్లో ఆమోదించడం సిగ్గుచేటన్నారు. నూతన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కేశవరెడ్డి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, చిరంజీవి, కుళ్లాయిస్వామి, కృష్ణుడు, మంజూనాథ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. -
వేతన సవరణ చేసేదాకా పోరాడతాం
● డీసీసీబీ ఎదుట ఉమ్మడి జిల్లా పీఏసీఎస్ ఉద్యోగుల ధర్నా ● మద్దతు ప్రకటించిన డీసీసీబీ చైర్మన్, టీడీపీ నేతలు అనంతపురం అగ్రికల్చర్: హెచ్ఆర్ పాలసీ అమలు, వేతన సవరణ తదితర డిమాండ్లు నెరవేరే వరకూ పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల యూనియన్ నాయకులు హెచ్చరించారు. ప్రధాన సమస్యలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై డీసీసీబీ ఉమ్మడి జిల్లా ఉద్యోగులు సోమవారం అనంతపురంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. డీసీసీబీ చైర్పర్సన్ ముంటిమడుగు కేశవరెడ్డి, శింగనమల టీడీపీ ముఖ్య నాయకులు ఆలం నరసానాయుడు, రామలింగారెడ్డి తదితరులు మద్దతు ప్రకటించి, దీక్షా శిబిరంలో కాసేపు కూర్చొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఏసీఎస్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా... చైర్మన్, ఇతర టీడీపీ నేతలు వారించకుండా పరోక్షంగా మద్ధతు ఇచ్చినట్లు సంకేతాలు ఇవ్వడం విశేషం. అనంతరం చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డికి వినతి పత్రం ఇవ్వగా... ప్రభుత్వం, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు సీపీఐ రాష్ట్ర నాయకుడు ఓబుళు, సీఐటీయూ నాగేంద్రకుమార్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్రెడ్డి మద్ధతు ప్రకటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.శ్రీనివాసులు, డి.శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు, హరికృష్ణ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ యూనియన్ ఉమ్మడి జిల్లా నాయకులు పి.హనుమంతరెడ్డి, ఎం.హనుమంతరెడ్డి, ప్రతాపరెడ్డి, దామోదర్, డి.నారాయణ, నగేష్, రామాంజనేయులు, నరేంద్రరెడ్డి, కేసీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న విజయవాడ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా ఉంటుందని నాయకులు ప్రకటించారు. -
క్రీడా స్ఫూర్తిని చాటాలి
● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం: గెలుపు ఓటమిని సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రాంతీయ స్థాయి పాలిటెక్నిక్ కళాశాల క్రీడోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించి, మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 16 కళాశాలల నుంచి మొత్తం 419 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి.జయచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ రామకృష్ణారెడ్డి, మెకానికల్ విభాగాధిపతి యుగంధర్, సివిల్ విభాగాధిపతి వీరేంద్ర బాబు, ఆటోమొబైల్ విభాగాధిపతి చంద్రశేఖర్రెడ్డి, ఈసీఈ విభాగాధిపతి ఓబులేసు, జనరల్ హెడ్ శ్రీనివాసులు, పీఆర్వో కరుణ కుమార్ పాల్గొన్నారు. పెన్నహోబిలం హుండీ లెక్కింపు ఉరవకొండ రూరల్: ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సోమవారం ఆలయ ఇన్చార్జ్ ఏసీ తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 107 రోజులకు గాను శాశ్వత హుండీల ద్వారా నగదు రూపంలో రూ.23.81 లక్షల ఆదాయం సమకూరింది. కానుకల రూపంలో 9.5 గ్రాముల బంగారం, 256 గ్రాముల వెండి వచ్చింది. కార్యక్రమంలో అనంతపురం, బళ్లారికి చెందిన బాలాజీ సేవా సమితి, గుంతకల్లు హనుమాన్ సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నదాత వెతలు ‘అనంత’ం
అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి విపత్తులు.. పాలకుల నిరాదరణ.. అన్నదాతలను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. వ్యయప్రయాసలకోర్చి పంటలు సాగు చేసి చేతికొచ్చే సమయంలో నష్టాలు రావడంతో కోలుకోలేకపోతున్నారు. పరిహారం ద్వారా ఆర్థిక ఉపశమనం కల్పించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. నిరాశా నిస్పృహల మధ్యే మంగళవారం జాతీయ రైతు దినోత్సవం (నేషనల్ ఫార్మర్స్ డే) నిర్వహించుకోనున్నారు. నాడు సంక్షోభం నుంచి సంక్షేమం వైపు.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న (2004 – 2009) సమయంలో వ్యవసాయ రంగం పురోగమనం వైపు పయనించింది. పెద్ద ఎత్తున సబ్సిడీలు అందించడంతో రైతులు కోలుకున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామన్న వైఎస్సార్ ప్రకటనను అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు హేళన చేశారు. విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకునేందుకు కూడా పనికిరావు. పరిహారం ఇస్తూ పోతే దానికోసమైనా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతులకు సబ్సిడీలు వేస్ట్’ అంటూ చులకన చేసి మాట్లాడారు. అయితే వైఎస్సార్ తన ఐదేళ్ల పాలనలో విమర్శలను పటా పంచలు చేసి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం బాట పట్టించారు. ఆ తర్వాత తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లూ (2019–2024) వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. ప్రకృతి కూడా సహకరించడంతో అన్నదాతలు కష్టాల నుంచి కోలుకున్నారు. ఉచిత విద్యుత్, ఉచిత బోర్లు, రైతు భరోసా, ఇన్పుట్సబ్సిడీ, ఇన్సూరెన్స్, సున్నావడ్డీ, పావలావడ్డీ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఎక్స్గ్రేషియా, సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు, విత్తనాలతో పాటు పాలవెల్లువ, యాంత్రీకరణ, ఎంఎస్పీ ద్వారా అమ్మకాలు చేపట్టారు. అడుగడుగునా వెన్నంటి నిలవడంతో రైతులు కష్టాల నుంచి గట్టెక్కారు. నేడు కష్టాల కడలిలో కర్షకులు ఇప్పుడు రైతుల పరిస్థితి తిరిగి మొదటికొచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయంలో నష్టాలబాట పట్టారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కరువయ్యాయి. మరోపక్క ప్రకృతి కూడా సహకరించడం లేదు. అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టితో వ్యవసాయం చిన్నబోయింది. ‘సూపర్ సిక్స్’ అంటూ గొప్పగా చెప్పినా అమలుకు నోచుకోక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అన్నదాతా సుఖీభవను మొదటి సంవత్సరం ఎగ్గొట్టేసి, ఇప్పుడు రెండో ఏడాది చిల్లర విదిల్చారు. సకాలంలో విత్తనాలు ఇవ్వడం లేదు. విత్తన కేటాయింపులు, రాయితీలు కుదించేశారు. యూరియా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా చీనీ, అరటితో పాటు మొక్కజొన్న, పత్తి, కందులకు గిట్టుబాటు లేదు. అరకొరగా పండిన పంట ఉత్పత్తులను కూడా సరిగా అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా భావించే పాడి, పట్టు, పండ్లతోటల రైతులకూ ప్రోత్సాహకాలు కరువయ్యాయి. ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ తాత్సారం ‘వైఎస్సార్–జగన్’ హయాంలో రాయితీలు, ప్రోత్సాహకాలు ఫుల్ -
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
ఆత్మకూరు: హంద్రీ–నీవా కాలువ పక్కన మట్టిపై టీడీపీ నేతల కన్నుపడింది. అంతే అడ్డూ అదుపు లేకుండా మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున దందా సాగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి మీదుగా హంద్రీ–నీవా కాలువ వెళ్లింది. రెండు వారాల కిందట నుంచి టీడీపీకి చెందిన కొందరు హిటాచీ యంత్రాలు పెట్టి హంద్రీ–నీవా కాలువకు ఆనుకుని ఉన్న, సమీపంలోనే ఉన్న గుట్టలో మట్టి తవ్వుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వకాలు చేపట్టి పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తరలించేస్తున్నారు. సారవంతమైన ఈ మట్టిని జిల్లా కేంద్రం అనంతపురం పరిసరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లకు చేరుస్తున్నారు. టిప్పర్ మట్టిని రూ.8వేల చొప్పున అమ్ముకుంటున్నారు. నిబంధనల ప్రకారం మట్టి తరలించాలంటే మైనింగ్, ఇరిగేషన్, రాయల్టీ, రెవెన్యూ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏ శాఖల నుంచి కూడా అనుమతులు తీసుకోనట్లు తెలుస్తోంది. సాధారణంగా అనుమతి లేకుండా ట్రాక్టర్లో మట్టి తరలిస్తేనే సమాచారం అందిన నిమిషాల్లో దాడులు చేసి, వాహనాన్ని స్టేషన్కు తరలిస్తుంటారు. మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టిప్పర్ల రాకపోకలతో రోడ్డు కంకర తేలి గుంతలుపడిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లతో పాటు అధికారులకు ముడుపులు అందడం వల్లే మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హంద్రీ–నీవా కాలువ పక్కన భారీగా తరలిన మట్టికాలువ వెంట వెళ్తున్న టిప్పర్ అనుమతులు ఇవ్వలేదు హంద్రీ–నీవా కాలువ పక్కన ఉన్న మట్టిని తరలించరాదు. అక్కడ తవ్వకాలు చేపట్టేందుకు రెవెన్యూ శాఖ తరఫున ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదు. అసలు కాలువ పక్కన మట్టి తరలించడానికి అనుమతులు ఇచ్చే అధికారం మాకు కూడా లేదు. – లక్ష్మీనాయక్, తహసీల్దార్, ఆత్మకూరు హంద్రీ– నీవా కాలువ మట్టిపై ‘తమ్ముళ్ల’ కన్ను వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం అనుమతులు ఇవ్వలేదంటున్న రెవెన్యూ అధికారులు -
ఐఈఎస్కు ఎంపికై న పెద్దొడ్డి యువకుడు
గుత్తి రూరల్: పెద్దొడ్డి గ్రామానికి చెందిన వంశీధర్రెడ్డి అనే యువకుడు ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్)కు ఎంపికయ్యాడు. భాస్కర్రెడ్డి, వరలక్ష్మి దంపతుల కుమారుడు వంశీధర్రెడ్డి తిరుపతి ఎస్వీ కళాశాలలో బీటెక్, ఐఐటీ ఖరగ్పూర్లో ఎంటెక్ పూర్తి చేశాడు. సివిల్ సర్వీసెస్ సాధించడమే ధ్యేయంగా ఢిల్లీలో కోచింగ్ తీసుకుని పరీక్ష రాశాడు. అయితే ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో వంశీధర్రెడ్డి ఆల్ ఇండియా 102వ ర్యాంకు సాధించి ఐఈఎస్కు ఎంపికయ్యాడు. వంశీధర్రెడ్డికి ఐఏఎస్ సాధించడమే ధ్యేయమని తల్లి వరలక్ష్మి సోమవారం తెలిపారు. వంశీధర్రెడ్డిని గ్రామస్తులు, స్నేహితులు బంధువులు అభినందించారు. -
వర్సిటీ అధికారులే బాధ్యత వహించాలి
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ విద్యార్థిని మాధుర్య మృతి చెందిందని, ఇందుకు యూనివర్సిటీ అధికారులే బాధ్యత వహించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. మాధుర్య కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు సోమవారం పాలక భవనం వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు హేమంత్, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గిరి శాంతరాజు, టీఎన్ఎస్ఎఫ్ యూనివర్సిటీ కార్యదర్శి నాగ తిరుపాల్ మాట్లాడుతూ అస్వస్థతకు గురైన పీజీ విద్యార్థిని మాధుర్యను ఆదివారం ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోవడం దురదృష్టకరమన్నారు. యూనివర్సిటీలో సకాలంలో వైద్యం అందకపోవడంతోనే మృతి చెందిందని, ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్యాంపస్ హెల్త్ సెంటర్ డాక్టర్లు ప్రతినెలా జీతాలు పొందుతున్నా విధులకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. హెల్త్ సెంటర్ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి వెంటనే రెండు కొత్త అంబులెన్స్ లు కొనుగోలు చేయాలన్నారు. మహిళా వసతి గృహాల్లో రాత్రి పూట ఒక డాక్టర్, ఒక నర్సు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థిని మాధుర్య కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. యూనివర్సిటీ పాత అంబులెన్స్ను ఆందోళన వద్దకు తెచ్చి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. 15 రోజుల్లో కొత్త అంబులెన్స్లు తెప్పిస్తామన్నారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఎల్లార్తి చంద్ర, నాగ్రేంద, నాయుడు, సూరి, పవన్, అంజి, నాగరాజు, మల్లి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో వైద్యం అందకే విద్యార్థిని మృతి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి ఎస్కేయూలో విద్యార్థినుల ఆందోళన -
శింగనమల ఎమ్మెల్యే కుటుంబం నుంచి ప్రాణహాని
● ఎస్పీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్త ఆందోళన గార్లదిన్నె: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని దళిత సామాజికవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ భార్యాపిల్లలతో కలిసి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం, శ్రావణిశ్రీ కోసం ప్రత్యేకంగా పనిచేశానని చెప్పారు. తన సేవలను గుర్తించి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించాలని కోరితే పట్టించుకోలేదన్నారు. వేరొకరికి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా తనపై కక్ష కట్టి రేప్ కేసు పెట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగానూ తనను అవమానించారని విలపించారు. ఎమ్మెల్యే శ్రావణిశ్రీ, ఆమె తల్లి బండారు లీలావతి, వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పైగా తనపైనే ఏడు అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే అనుచరులు తనకు ఫోన్ చేసి చంపుతానని బెదిరించారని, ఈ విషయం పోలీసులకు తెలిపినా స్పందించలేదని చెప్పారు. తనకు జరుగుతున్న అన్యాయంపై విజయవాడలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్కు వెళ్లి నాయకులందరినీ కలిసి విన్నవించానన్నారు. జిల్లాలో టీడీపీ పెద్దలకు సమస్యను చెప్పుకునేందుకు వస్తే పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఒంటరివాడిని చేయాలని తనను సపోర్టు చేస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేసే పరిస్థితి కల్పిస్తున్నారన్నారు. గతంలో తనపై రౌడీషీట్, రేపిస్ట్ తదితర కేసులేవీ లేవని, అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్లు ● మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే రూ.100 ఫీజు ● రూ.10 లక్షలు దాటితే రూ.1000 ఫీజు అనంతపురం టౌన్: వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూముల మార్కెట్ విలువ రూ.10లక్షల లోపు ఉంటే రూ.100, మార్కెట్ విలువ రూ.10 లక్షలు దాటితే రూ.1000 స్టాంప్ డ్యూటీ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం వారసత్వంగా ఎలా సంక్రమించింది.. వారసత్వ హక్కులు నిర్ధారించడానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, కుటుంబ పెద్ద మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు భూహక్కు పత్రాలను కచ్చితంగా జత చేయాలన్నారు. అవసరమైతే వ్యవసాయ భూమికి సబ్ డివిజన్ చేయించి సబ్ డివిజన్ పత్రాలను సైతం సమర్పించాలని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే దగ్గరలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ సూచించారు. పర్యాటకాభివృద్ధికి చర్యలు అనంతపురం అర్బన్: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పర్యాటక అభివృద్ధి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిపై దృష్టి సారించాలని చెప్పారు. గుత్తి కోట సమీపంలో కరిడికొండ ఐదు ఎకరాలు, ఎగువపల్లి (గార్లదిన్నె) 10 ఎకరాలు, గజరాంపల్లి (పామిడి) ఒక ఎకరా, భైరవాని తిప్ప ప్రాజెక్టు (గుమ్మఘట్ట) మూడు ఎకరాల స్థలం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని పర్యాటక శాఖ అధికారి జయకుమార్ కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్కియాలజీ మ్యూజియం, పాత జిల్లా జైలు, పీస్ మోమోరియల్ హాలు, జిల్లా సైన్స్ సెంటర్, శిల్పారామానికి ప్రజలు, పిల్లలు ఎప్పుడూ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరిలో గుత్తికోట ఉత్సవాలు గుత్తికోట ఉత్సవాలు 2026 జనవరి 24 నుంచి రెండు రోజుటపాటు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్బాబు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, కమిటీ సభ్యులు సంధ్యామూర్తి, రవికాంత్ రమణ, నాగేశ్వరరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
● పశు శాఖలో రూ.కోటి లూటీ వ్యవహారం అనంతపురం అగ్రికల్చర్: పశు సంవర్ధక శాఖలో వెలుగుచూసిన కుంభకోణంలో బాధ్యులపై చర్యలు మొదలయ్యాయి. ప్రాథమిక విచారణ తర్వాత ఆ శాఖ సీనియర్ అసిస్టెంట్ బి.సుశీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సోమవారం డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఉత్తర్వుల కాపీని ఆ శాఖ మేనేజర్ ద్వారా సీనియర్ అసిస్టెంట్కు అందజేసినట్లు సమాచారం. రూ.కోటికి పైగా అక్రమార్కులు కొల్లగొట్టినట్లు ‘పశుశాఖలో గోల్మాల్’ శీర్షికన గత నెల 12న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అనంతరం ఈ వ్యవహారంలో ఎంత మొత్తం చేతులు మారిందనే విషయంపై వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో నెల రోజులుగా ఆ శాఖ జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి ఆడిట్ బృందం, డైరెక్టరేట్ అధికారులు అంతర్గతంగా ప్రాథమిక విచారణ కొనసాగించారు. బ్యాంకు లావాదేవీలు నిర్వహించిన ఉద్యోగులు, అందుకు అనుమతించిన పనిచేస్తున్న, రిటైర్ అయిన అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పశుసంవర్ధక శాఖకు వివిధ బ్యాంకుల్లో ఉన్న ఖాతాల నుంచి బయటి వ్యక్తుల ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్లు దాదాపు రుజువైనట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఎంత అనేది పూర్తిస్థాయి విచారణలో వెల్లడవుతుందని చెబుతున్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ, కొటక్ మహీంద్ర, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాల నుంచి రూ.1.03 కోట్లు వరకు నిధులు దారి మళ్లినట్లు గుర్తించారు. ఇందులో ఇరువురు కీలకపాత్ర వహించారని గుర్తించినట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా వివిధ బ్యాంకుల్లో ఉన్న పాత అకౌంట్లను జల్లెడ పట్టడం, మరికొన్ని బ్యాంకు ఖాతాల నుంచి నిధులు లేని పాత అకౌంట్లలోకి సొమ్ము మళ్లించి, అక్కడి నుంచి తమ కుటుంబ సభ్యులు, బయటి వ్యక్తుల ఖాతాల్లోకి పంపించినట్లు తేల్చారు. దీనిపై నెల రోజులుగా బాధ్యుల నుంచి వివరాలు సేకరించారు. అయితే సరైన సమాచారం, ఓచర్లు, బిల్లులు, ఇతరత్ర వివరాలు అందించకపోవడంతో చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రస్థాయి విచారణ బృందం రానుందని సమాచారం. సీనియర్ అసిస్టెంట్తో పాటు విశ్రాంత జేడీ, అలాగే మరికొందరిని విచారణకు పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. -
కరెంటోళ్ల జనబాట
● ప్రతి మంగళ, శుక్రవారాల్లో విద్యుత్ లైన్ల పరిశీలన అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ఎస్ఈ శేషాద్రిశేఖర్ తెలిపారు. కార్యక్రమ పోస్టర్లను కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శేషాద్రిశేఖర్ మాట్లాడుతూ ప్రతి మంగళ, శుక్రవారాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది తమ పరిధిలోని గ్రామ, పట్టణ వార్డుల్లో తక్కువ ఎత్తులో ఉన్న స్తంభాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలతోపాటు ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించాలన్నారు. మార్చాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు సంబంధించి నివేదికలు పంపాలన్నారు. కార్యక్రమంపై ఇప్పటికే ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో పాటు ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించి వినియోగదారుల సమస్యలపై సమాధానాలు ఇస్తూ వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. -
అభాగ్యులకు అందని పింఛన్
● కలెక్టర్కు అర్జీల వెల్లువ అనంతపురం అర్బన్: వారంతా అభాగ్యులు. వయోభారంతో కొందరు.. ప్రమాదాల్లో వైకల్యం బారినపడిన మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. సామాజిక భద్రత పింఛన్ ద్వారా ఆర్థిక ఉపశమనం పొందుతామనుకుంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఆ అవకాశం లేకుండా పోతోంది. ఏడాదిన్నర అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం సతమతమవుతున్న అభాగ్యులు పింఛన్ కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహంచిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అర్జీలు ఇచ్చుకున్నారు. కలెక్టర్ ఆనంద్తోపాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, రమేష్రెడ్డి, తిప్పేనాయక్, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ వివిధ సమస్యలపై ప్రజల నుంచి 385 అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో.. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ఈయన పేరు మారుతీప్రకాష్. అనంతపురం శివారులోని చిన్మయనగర్లో నివాసముంటున్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించే ఈయన 2023 సంవత్సరం చివరులో ప్రమాదానికి గురవడంతో కుడికాలు తొడ వరకు తొలగించారు. గత ప్రభుత్వంలో దివ్యాంగ పింఛనుకు దరఖాస్తు చేయగా.. మంజూరు చేస్తున్నట్లు అనుమతి వచ్చింది. ఈలోగా ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మంజూరు కాలేదని మారుతీప్రకాష్ ఆవేదన చెందాడు. ఇప్పటికై నా స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్ సంతోష్నగర్లో నివాసముంటున్న ఈ వృద్ధుని పేరు జమాలుద్దీన్. 2011 నుంచి పింఛను తీసుకుంటున్నాడు. ఏడాది క్రితం పింఛన్ తొలగించారు. ఉన్న ఒక్క కొడుకు గుండెపోటుతో మరణించడంతో కోడులు పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆసరాగా ఉన్న పింఛను ఆగిపోవడంతో చాలా కష్టంగా ఉందని తెలిపాడు. పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కలెక్టర్ను వేడుకున్నానని చెప్పాడు. బుక్కరాయసమద్రంలో నివాసముంటున్న రేష్మా డ్రిప్ పైపుల కటింగ్ పరిశ్రమలో పని చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కుడిచేయి మిషన్లో ఇరుక్కుని ముక్కలైంది. 70 శాతంగా వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. పింఛను కోసం ఏడాదిగా తిరుగుతున్నా మంజూరు కాలేదని ఆవేదన చెందింది. భర్త పెయింటర్ అని, ఆయన సంపాదనంతా తాగుడుకు ఖర్చు చేస్తున్నాడని తెలిపింది. దివ్యాంగ పింఛను మంజూరు చేస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చెప్పింది. -
సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలి
రాయదుర్గం టౌన్: ఎంపీపీ ఎన్నికలో సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలని టీడీపీ శ్రేణులకు రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి హితవు పలికారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల బొమ్మనహాళ్ మండలం ఎంపీపీ రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో ఇన్చార్జ్ ఎంపీపీగా నాగరత్నమ్మను కలెక్టర్ నియమించారని గుర్తు చేశారు. మొత్తం 16 మంది ఎంపీటీసీల్లో 12 మంది వైఎస్సార్సీపీకి చెందిన వారు ఎలాంటి ప్రలోభాలకు గురికావడం లేదని, వారంతా ఐక్యంగానే ఉన్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు ప్రలోభాలకు గురవుతున్నారని, ఎంపీపీ పదవిని టీడీపీ కై వసం చేసుకుంటోందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలకు దిగడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సమష్టి నిర్ణయంతో 12 మందిలో ఒకరిని ఎంపీపీగా త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ అన్ని మండలాల్లో ప్రజల విశ్వాసం గెలుచుకుని వైఎస్సార్సీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు కూడా కాకుండానే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్లో ప్రజల నుంచి పాజిటివ్ అవుట్పుట్ రావడం లేదన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి మధ్య నెలకొన్న వివాదం కేవలం ఓ నాటకమని పేర్కొన్నారు. సమావేశంలో బొమ్మనహాళ్ మండల 12 మంది ఎంపీటీసీలతో పాటు వైఎస్సార్సీపీ కన్వీనర్ రామాంజనేయులు, వైస్ ఎంపీపీ రమేష్, నాయకులు కొత్తూరు తిమ్మప్ప, దేవగిరి హనుమేష్, రామకృష్ణ, వంశీ, రమేష్, వెంకటేశులు, లింగదహాళ్ చిదానంద, కోటేశ్వర్రెడ్డి, సీనియర్ నాయకులు లోకేష్, ఎంసీహెచ్ రాజ్కుమార్, సర్పంచ్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు -
అరటి ఎగుమతి
విదేశాలకు నిలిచిన.. తాడిపత్రి రూరల్: ఈ ఏడాది తాడిపత్రి నుంచి విదేశాలకు అరటి ఎగుమతి చేసే అవకాశాలు కనిపించడం లేదు. తాడిపత్రి రైల్వే స్టేషన్ ద్వారా ఏటా నవంబర్ నుంచి ఏసీ కంటైనర్లతో ముంబయి మీదుగా అరటిని విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది డిసెంబర్ నెల వచ్చినా ఒక్క కంటైనర్ కూడా తాడిపత్రి నుంచి ఎగుమతి కాలేదు. రైల్వే ఆదాయానికి గండి.. అరటి ఎగుమతుల ద్వారా తాడిపత్రి రైల్వే స్టేషన్కు భారీగా ఆదాయం ఉండేది. ప్రతి నెలా ఆరు నుంచి ఎనిమిది సార్లు అరటి గెలలను ముంబయికి రవాణా చేసేవారు. ప్రతి సారి 600 నుంచి 700 టన్నుల కాయలు మొత్తం 36 నుంచి 40 కంటైనర్ల ద్వారా ఎగుమతి అయ్యేవి. తాడిపత్రి నుంచి ముంబయికి ఒకసారి అరటి కాయలను ఎగుమతి చేస్తే రైల్వేకి దాదాపు రూ.17లక్షల అదాయం సమకూరేది. ఈ మూడు నెలల పాటు అరటి ఎగుమతి ద్వారా తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి రూ.3.50 కోట్ల ఆదాయం రైల్వేకు సమకూరేది. అరటికి తగ్గిన డిమాండ్.. తాడిపత్రి ప్రాంతం అరటికి విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఆయా కంపెనీలు రైలు మార్గం ద్వారా ముంబయికి రవాణా చేయడం లేదని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మహారాష్ట్రలో ఎక్కువగా అరటి సాగులోకి రావడంతో పాటు రవాణా ఖర్చులు కూడా కలసి వస్తుండడంతో అక్కడి అరటి కొనుగోలుకు ట్రేడర్లు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఫలితంగా తాడిపత్రి నుంచి అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో తోటల నుంచి కంటైనర్లను తీసుకువచ్చే వాహనాలకు బాడగలు లేకుండా పోయాయి. కంటైనర్లలోకి అరటి బాక్స్లను లోడ్ చేయడం, చెట్ల నుంచి అరటి గెలలను కోయడం, వాటిని రసాయనాల్లో ముంచడం, కాయలను గ్రేడింగ్ చేయడం వంటి పనులు లేక వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. రూ.3.50 కోట్ల రైల్వే ఆదాయానికి గండి గతంలో రైల్వే ఏసీ కంటైనర్ల ద్వారా ఎగుమతి ట్రేడర్లు సంప్రదించలేదు -
మంత్రి ఇలాకాలో నాణ్యతకు తిలోదకాలు
● మూడు నెలలకే శిథిలమైన రహదారి ● నాణ్యత పట్టించుకోని రోడ్లు భవనాల శాఖ ● ఆగమేఘాలపై బిల్లుల చెల్లింపు విడపనకల్లు: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత ఇలాకాలో అభివృద్ధి పనుల్లో నాణ్యత పూర్తిగా లోపించింది. నాణ్యత లేకుండా నిర్మించిన పనులకు ఆగమేఘాలపై బిల్లులు చెల్లించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఫలితంగా రోడ్డు వేసిన మూడు నెలలకే కుంగిపోయి ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయి. రూ.1.50 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం.. విడపనకల్లు మండలం ఉండబండ సరిహద్దు నుంచి ఉరవకొండకు రూ.1.50 కోట్ల నిధులతో కొత్తగా తారు రోడ్డు వేశారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు పర్యవేక్షణ లోపించిన ఈ రహదారిని కేవలం 15 రోజుల్లోనే కాంట్రాక్టర్ ముగించేసి, బిల్లు చేసుకున్నాడు. ఉరవకొండ నుంచి పాల్తూరు మీదుగా ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలే ఎక్కువగా తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఒకటి, రెండు లారీలు సంచరిస్తుంటాయి. రోడ్డు వేసిన మూడు నెలలకే ఎక్కడికక్కడ కుంగిపోయి భారీగా గుంతలు పడ్డాయి. అంతేకాక రోడ్డు శివారు భాగం పూర్తిగా నెర్రెలు చీలాయి. కేవలం కాంట్రాక్టర్ స్వలాభం కోసమే ఈ రోడ్డు వేశారని, తద్వారా రూ.1.50 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని స్థానికులు మండిపడుతున్నారు. -
ఫైనల్ రౌండ్కు తమిళనాడు
అనంతపురం కార్పొరేషన్: కొన్ని రోజులుగా ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ గ్రూప్ జీ మ్యాచ్లు ఆదివారంతో ముగిశాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్ల్లో తమిళనాడు జట్టు 9 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి ఫైనల్ రౌండ్ పోటీలకు జట్టు అర్హత సాధించింది. 6 పాయింట్లతో రెండో స్థానంలో పాండిచ్చేరి, మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఆంధ్ర , చివరి స్థానంలో అండమాన్ నికోబార్ జట్టు నిలిచాయి. చివరి లీగ్లో నెగ్గిన ఆంధ్ర.. చివరి లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 1–0 పాయింట్ల తేడాతో అండమాన్ నికోబార్ జట్టుపై విజయం సాధించింది. జట్టులో అక్ష రెడ్డి అద్భుత గోల్తో ఆంధ్ర విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఎన్నో ఏళ్ల తర్వాత సంతోష్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయం సాధించడం గమనార్హం. మరో మ్యాచ్లో తమిళనాడు జట్టు 3–0 గోల్స్ తేడాతో పాండిచ్చేరిపై విజయం సాధించింది. పుట్బాల్కు ఆదరణ ఎక్కువ.. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పుట్బాల్కు మంచి ఆదరణ ఉందన్నారు. సంతోష్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయం సాధించడం క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపుతుందన్నారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. పుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డేనియల్ ప్రదీప్ మాట్లాడుతూ... ఏపీఎఫ్ఏ అధ్యక్షుడు కోటగిరి నాయకత్వంలో ఏపీలో పుట్బాల్ క్రీడ పుంజుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది ఔత్సాహికులు పుట్బాల్ నేర్చుకుంటున్నారన్నారు. జూనియర్ గర్ల్స్ విభాగంలో ఏపీ జట్టు ఆల్ ఇండియాలో 7వ ర్యాంకు సాధించిందన్నారు. కార్యక్రమంలో పుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, ఏపీఎఫ్ఏ కో ఆర్డినేటర్ రాయచోటి శ్రీనివాసులు, సిబ్బంది కిషోర్, చినరాజప్ప, సిరివెళ్ల శ్రీకాంత్, సాగర్, నాని పాల్గొన్నారు. ముగిసిన సంతోష్ ట్రోఫీ గ్రూప్ జీ మ్యాచ్లు -
సుదూర బస్సు సర్వీసుల బదిలీ
అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు పక్క డిపోలకు మళ్లించారు. అనంతపురం డిపో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా బస్సుల నిర్వహణ భారంగా మారింది. సరైన మెయింటెనెన్స్ లేక బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో జిల్లా కేంద్రం నుంచి సుదూర ప్రాంతాల సర్వీసులను తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుత్తి, గుంతకల్లు డిపోలకు మళ్లించారు. వాస్తవానికి ఆ బస్సులు కూడా జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లాల్సిందే. స్వీయ తప్పిదాలు సరిదిద్దుకోలేని తనం, విధుల నిర్వహణలో సవాళ్లను స్వీకరించలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలోనే కొత్త బస్సులు గత వైఎస్సార్సీపీ హయాంలోనే జిల్లాకు కొత్త బస్సులు వచ్చాయి. దీంతో సుదూర ప్రాంత సర్వీసులకు కొత్త బస్సులను కేటాయించి, ప్రయాణికులకు అప్పట్లో మెరుగైన సేవలు అందిస్తూ వచ్చారు. దీంతో ప్రయాణికులు కూడా ఆర్టీసీని ఆదరించారు. ఫలితంగా ఆర్టీసీ కొంత మేర నష్టాలను పూడ్చుకోగలిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమవుతూ వస్తోంది. రాబడి బాగున్న సర్వీసులన్నీ పక్క డిపోలకు పంపి, ఆయా డిపోలపై అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం ఇది వివాదాలకు కేంద్రీకృతమవుతోంది. రెండు సర్వీసులు బదిలీ.. అనంతపురం నుంచి హైదరాబాదుకు వెళ్లే రెండు సర్వీసులను బదిలీ చేస్తూ ఆర్ఎం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక సర్వీసు గుత్తికి, మరో సర్వీసు తాడిపత్రికి బదిలీ చేశారు. గతంలో చైన్నెకి 4 సర్వీసులుంటే ప్రస్తుతం ఒకటి మాత్రమే నడుస్తోంది. హైదరాబాదుకు 10 సర్వీసులుంటే, ప్రస్తుతం 6 ఉన్నాయి. నెల్లూరుకు 4 ఉండగా ప్రస్తుతం ఒకటి, ఒంగోలుకు రెండు ఉండగా, ఒకటి మాత్రమే నడుస్తున్నాయి. ఇక 14 సర్వీసులున్న బెంగళూరుకు ప్రస్తుతం 9 మాత్రమే నడుస్తున్నాయి. సమస్యకు పరిష్కారం ఇది కాదు.. సుదూర ప్రాంతాలకు జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ సర్వీసులను మళ్లించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యను పరిష్కరించడమంటే పక్కకు తప్పుకోవడం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తప్పిదాలు జరగకుండా చర్యలు చేపట్టాల్సి ఉండగా... ఉన్న సర్వీసులన్నీ రద్దు చేస్తూ పోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా కేంద్రం నుంచి లాంగ్ సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో కనిపించని సర్వీసులు సవాలుగా తీసుకోని డిపో మేనేజర్లు స్వీయ తప్పిదాలను సరిదిద్దుకోలేని ఆర్టీసీ యాజమాన్యం... ఆ భారాన్ని ప్రయాణికులపై రుద్ది చేతులు దులుపుకుంది. ఫలితంగా సుదూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. -
జలం.. ఒడిసిపడితేనే పదిలం
రాయదుర్గం: ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాలకు జీవనాడిగా చెప్పుకునే తుంగభద్రమ్మ ఏటేటా ఉగ్రరూపం దాల్చుతోంది. అంచనాలకు మించి వరదనీరొచ్చి చేరుతోంది. ఆదేస్థాయిలో నీరూ వృథా అవుతోంది. ఎప్పటి నుంచో కార్యాచరణలో ఉండే సమాంతర కాలువను తెరకెక్కిస్తే భవిష్యత్తు తరాలకు మేలు చేకూరుతుంది. జిల్లాలోనూ అపార సాగునీటి వనరులు ఉన్నాయి. కానీ వృథా జలాలను సద్వినియోగం చేసుకోలేని దుస్థితి. తుంగభద్ర జలాశయం నుంచి ఏటా వందల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. దీనిని నివారించే దిశగా దివంగత నేత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేశారు. పలుమార్లు అప్పట్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో ఒక్కసారికూడా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయాన్ని చర్చకు తీసుకురాలేదు. దీంతో ఆశయం నెరవేరక వెక్కిరిస్తోంది. 420 క్యూసెక్కుల ఇన్ఫ్లో.. ఈ ఏడాది జూన్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు తుంగభద్ర జలాశయంలోకి 420.691 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 373.137 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని తాగు, సాగునీటి కోసం తుంగభద్ర బోర్డు 168 టీఎంసీలకు లెక్కించి వాటిని ఏపీ హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీకి 152.698 టీఎంసీలు, కర్ణాటక హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీకి 110.143 టీఎంసీలు, తెలంగాణకు 5.159 టీఎంసీలు కేటాయించింది. ఇప్పటికే కెనాళ్ల ద్వారా 116.091 టీఎంసీలు వినియోగించారు. ఈ లెక్కన గేట్ల ద్వారా 257.046 టీఎంసీల నీళ్లు దిగువన మళ్లీ సముద్రంలో కలిసిపోయాయి. వినియోగం కంటే రెట్టింపు జలాలు వృథా అయ్యాయి. ఏటా ఈ విధానం కొనసాగుతున్నా పాలకుల్లో చలనం కనిపించడం లేదు. బాబు మాటలన్నీ ఉత్తివే.. సీఎం చంద్రబాబు గతేడాది నవంబర్ 30న రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లులో పర్యటించారు. ఉంతకల్లు, నేమకల్లు మధ్య 5 టీఎంసీల సామర్థ్యంతో ఓ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ కార్యాచరణ చేపట్టలేదు. సమాంతర కాలువ ఏర్పాటైతేనే ఇది సాధ్యమవుతుందని ఇంజినీరింగ్ నిపుణులు చెపుతున్నారు. జిల్లాలో బీటీపీ, పీఏబీఆర్ లాంటి జలాశయాలు, మెజార్టీ చెరువులు నింపుకోవచ్చు. కేంద్రం తలిస్తే పూర్తిచేయడం కష్టమేమీకాదు. అయితే ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది. సమాంతర కాలువ చేపట్టాలిఏటా తుంగభద్ర నుంచి వందల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. సమాంతర కాలువ ద్వారా వాటికి అడ్డుకట్టు వేస్తే జిల్లాతో పాటు రాయలసీమ సస్యశ్యామలం కానుంది. అయితే సీఎం చంద్రబాబు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. – మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం ఉంతకల్లు రిజర్వాయర్ ఏదీ?ఉంతకల్లు – నేమకల్లు మధ్య బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని సీఎం చంద్రబాబు గతేడాది హామీ ఇచ్చారు. నేటికీ కార్యాచరణ చేపట్టలేదు. తక్షణమే నిధులు విడుదల చేసి రిజర్వాయర్ పూర్తికి కృషి చేయాలి. – పరమేశ్వర, సర్పంచ్, నేమకల్లు జలం.. అవనికి బలం. ప్రాణకోటికి జీవనాధారం. పంట పొలాలకు ప్రాణాధారం. ఇంతటి విలువైన జలాన్ని ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తేనే కరువు జిల్లా అనంతపురానికి ప్రయోజనకరం. ఈ దిశగా చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించకపోవడంతో వందలాది క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. తుంగభద్ర నీళ్లు సముద్రంపాలు సమాంతర కాలువ ఏర్పాటుతోనే సస్యశ్యామలం -
నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు విన్నవించాలని సూచించారు. అర్జీలను meekosam.ap. gov.in వెబ్సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు. చిన్నారుల ఉజ్వల భవితకు రెండు చుక్కలు అనంతపురం మెడికల్: చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. పల్స్ పోలియోలో భాగంగా ఆదివారం నగరంలోని కోర్డు రోడ్డులో ఉన్న నెహ్రూ స్కూల్లో చిన్నారులకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు కలెక్టర్ ఆనంద్ పోలియో చుక్కల మందు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లాలో 2,84,774 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు చెప్పారు. తొలిరోజు వేయించుకోని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శశిభూషణ్రెడ్డి, ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుండెపోటుతో విద్యార్థిని మృతిరాప్తాడు రూరల్: ఎస్కేయూ విద్యార్థిని కాటెపోగు మాధుర్య (22) గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన కాటెపోగు పాపన్నకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కాగా, చిన్న కుమార్తె మాధుర్య ఎస్కేయూ గోదావరి హాస్టల్లో ఉంటూ క్యాంపస్ కళాశాలలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. ఏడాదిన్నరగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఆమె వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. శనివారం స్వగ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చూపించగా ఓ ఇంజక్షన్ వేశాడు. అనంతరం వర్సిటీకి బయలుదేరి వచ్చింది. ఆదివారం ఉదయం హాస్టల్ గదిలో అపస్మారకంగా పడి ఉండడంతో సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా చర్మవ్యాధికి వైద్యులు సూచించిన మాత్రల డోస్ ఎక్కువైనందున గుండెనొప్పి లేదా, ఫిట్స్తో మృతిచెంది ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
‘కళ్యాణదుర్గంలో రౌడీ రాజ్యం’
అనంతపురం అర్బన్: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రౌడీ రాజ్యం సాగుతోందని సీఐటీయూ జిలా ్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్వీనాయుడు, నాగేంద్రకుమార్ విమర్శించారు. ఎమ్మెల్యే పేరుతో రాజ్యాంగం, కార్మిక చట్టాలు, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఆ సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పని చేస్తున్న 670 మంది కార్మికులకు నెలలుగా వేతనాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే దౌర్జన్యాలు, బెదిరింపులు, పోలీసు ఒత్తిళ్లతో కార్మికులను అణిచివేసే చర్యలు ఊపందుకున్నాయని మండిపడ్డారు. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో రెండు నెలలుగా కార్మికులు రిలేదీక్షలు నిర్వహిస్తున్నా నేటికీ ఎమ్మెల్యే స్పందించ లేదంటే ఇది ఆయన అహంకారానికి, నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా అక్రమాలు, దౌర్జన్యాలను కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఫ్రీహోల్డ్ భూములకు పరిశీలన గ్రహణం
అనంతపురం అర్బన్: చంద్రబాబు పాలనలో అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. డి.పట్టా పొంది 20 ఏళ్లుగా అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేసి సంపూర్ణ హక్కు కల్పించి యజమానుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుని అమలు చేపట్టింది. జిల్లాలో 3.03 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ కల్పించడం ద్వారా 96 వేల మంది రైతులకు లబ్ధిచేకూర్చడమే లక్ష్యంగా ప్రక్రియ చేపట్టింది. అయితే టీడీపీ ప్రభుత్వం రావడంతో ఫ్రీ హోల్డ్ భూములకు పరిశీలనకు గ్రహణం పట్టింది. ఫ్రీహోల్డ్ చేసి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపేసింది. దీంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. భూములను పరిశీలన పేరుతో 18 నెలలుగా నాన్చుతూ వస్తోంది. పరిశీలన ప్రక్రియను 2026 జనవరి 11 వరకు పొడిగించింది. ఇదే క్రమంలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ రిజిస్ట్రేషన్శాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చివరికి అసైనీదారు చనిపోతే వారసులు మ్యుటేషన్ కూడా చేసుకోలేని దుస్థితిని కల్పించింది. తమ కష్టం బయటకు చెప్పుకుంటే అధికార పార్టీవాళ్లు ఎక్కడ ఇబ్బంది పెడతారోనని రైతులు భయపడుతున్నారు. 18 నెలలుగా ఎటూ తేల్చని చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో ఫ్రీహోల్డ్ భూములు 3.03 లక్షల ఎకరాలు రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉత్తర్వుల జారీ -
అప్పు చేసి.. ఐపీ పెట్టి..
బొమ్మనహాళ్: వ్యవసాయానికి పెట్టుబడులు కావాలంటూ తోటి రైతులు, వ్యవసాయ కూలీల వద్ద ఓ వ్యక్తి అప్పు తీసుకుని ఉడాయించిన ఘటనలో బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన మేరకు... దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన రూపనగుడి మనోహర్ తనకున్న 4 ఎకరాల భూమిలో మిరప పంట సాగు చేయడానికి 43 మంది రైతులు, వ్యవసాయ కూలీల నుంచి రూ.40.85 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అనంతరం తన పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమి, సొంత ఇంటిని ఇతరులకు విక్రయించి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తన వద్ద ఎలాంటి ఆస్తులు లేవని, రెండు ఫ్యాంట్లు, రెండు షర్టులు మాత్రమే ఉన్నాయని, అప్పులు తీర్చలేని పరిస్ధితుల్లో ఉన్నానని 43 మంది రైతులు, వ్యవసాయ కూలీలకు ఐపీ నోటీసులు పంపాడు. దీంతో 43 మంది బాధితులు ఆదివారం బొమ్మనహాళ్ పీఎస్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. తన పొలం, ఇంటిని అమ్మి అప్పులు రూ.40.85 లక్షలు తీరుస్తానని నమ్మించి మోసం చేశాడంటూ వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు విన్నవించారు. రూ.40.85 లక్షలతో ఉడాయించిన వ్యక్తి -
పాఠశాలల పని రోజుల్లోనే ‘ప్రణాళిక’ అమలుకు వినతి
అనంతపురం సిటీ: పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళికను పాఠశాలల పని రోజుల్లోనే అమలు చేయాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావుకు ఏపీ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు ఆదివారం వచ్చిన ఆయనను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రారెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ రాధాకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణప్ప, జిల్లా గౌరవాధ్యక్షులు గోపాల్, శివప్రసాద్, హెచ్.రామకృష్ణ, అరుడప్ప తదితరులు కలసి వినతి పత్రాన్ని అందించి, మాట్లాడారు. అనంతరం ఇదే వినతిని డీఈఓ ప్రసాద్బాబుకూ అందజేశారు. వంద రోజుల ప్రణాళిక అమలులో మార్పు చేయకపోతే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒత్తిడికి గురై మంచి ఫలితాలు సాధించలేరన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. -
●జీవనోపాధి మెరుగైంది
వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులతో పాటు కొడుకు కోడలు ఉంటారు. అప్పటిదాకా చిన్నపాటి టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగించేవారు. రోజూ రూ.800 నుంచి రూ.1000 దాకా వ్యాపారం జరిగేది. ఇంకాస్త పెద్దగా పెట్టుకుని వ్యాపారం పెంచుకుందామంటే ఆర్థిక ఇబ్బందులు సహకరించేవి కాదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేదోడు ఆర్థికసాయంతో పాటు, సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ రుణాలతో హోటల్ స్థాయిని పెంచుకుంది. ఆర్థికాభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. ఇప్పుడు రోజువారి వ్యాపారం రూ.5వేలు జరుగుతోంది. కణేకల్లు మండలం కణేకల్ క్రాస్లో హోటల్ నిర్వహిస్తున్న బసవేశ్వర స్వయం సహాయక సంఘం సభ్యురాలు గోవిందమ్మ కుటుంబం సాధించిన విజయం ఇది. – అనంతపురం ఎడ్యుకేషన్/కణేకల్లు: -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పామిడి: పామిడి 44వ నంబర్ జాతీయ రహదారిపై నీలూరుక్రాస్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటచార్ (60), ఆయన భార్య గీతమ్మ (55) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్ఐ రవిప్రసాద్ తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ల్లాపూర్ నుంచి వెంకటేష్ ఆచారి, అతని భార్య, గీత, కుమారుడు విష్ణుభగవాన్, కోడలు అక్షితతో కలిసి ఇటియోస్ కారులో మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి శుక్రవారం అర్ధరాత్రి బయల్దేరారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నీలూరు క్రాస్ వద్దకు రాగానే ఆగి ఉన్న వాహనాన్ని కారు వెనుకవైపు నుంచి ఢీకొనింది. ఈప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులు వెంకటాచారి, ఆయన భార్య గీతమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోడలు అక్షిత (30), ముందు కూర్చున్న కుమారుడు విష్ణుభగవాన్ (32), డ్రైవర్ నరసింహమూర్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రవిప్రసాద్, సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పామిడి సీహెచ్సీకి తరలించారు. గాయపడిన ముగ్గురిని అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. విష్ణుభగవాన్, డ్రైవర్ నరసింహమూర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదస్థలిని పరిశీలించిన ఎస్పీ పామిడి: పామిడిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై నీలూరు క్రాస్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఆయన ఎస్ఐ రవిప్రసాద్, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ముందు నిలిపి ఉన్న, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన శెట్టూరు: అనుంపల్లి సబ్స్టేషన్ వద్ద రైతులు బైఠాయించి, శనివారం నిరసన తెలియజేశారు. అనుంపల్లి రైతులు మాట్లాడుతూ రెండు రోజులుగా త్రీపేస్ విద్యుత్ సరఫరా చేయలేదని, దీంతో నీరులేక పంట పొలాలు ఎండుముఖం పట్టాయన్నారు. సబ్స్టేషన్ పరిధిలోని ఓవర్ లోడ్తో నిత్యం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందన్నారు. విద్యుత్ ఏఈ బాలచంద్ర రైతులతో ఫోన్లో మాట్లాడారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూసుకుంటామని ఏఈ తెలిపారు. నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించండి అనంతపురం మెడికల్: నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించాలని, ఆదివారం ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి మాట్లాడుతూ జిల్లాలో 2,84,774 మంది చిన్నారులున్నారన్నారు. 31 మండలాల పరిధిలోని 51 పీహెచ్సీలు, 25 యూపీహెచ్సీలు, 6 పీపీ యూనిట్లు , 82 యూనిట్లలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఐఓ డాక్టర్ శశిభూషణ్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి ఓబులు, హెచ్ఈఈఓ త్యాగరాజు పాల్గొన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనంతపురం అర్బన్: ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని యువతకు కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం జేఎన్టీయూలోని రతన్టాటా ఇన్నోవేషన్ హబ్లో ‘ పర్యావరణంలో అవకాశాలు’ ఇతివృత్తంతో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ చంద్రమౌళి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్ యాదవ్, జెడ్పీ సీఈఓ శివశంకర్, డీపీఓ నాగరాజునాయుడు, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డి, ఏపీఐఐసీ మేనేజర్లు పాల్గొన్నారు. చిట్టి చేతులు..అద్భుత ప్రయోగాలు అనంతపురం సిటీ: అనంతపురం శివారు పంగల్ రోడ్డు సమీపంలోని రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్లో శనివారం నిర్వహించిన విద్యా వైజ్ఞానిక జిల్లా స్థాయి ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల నుంచి మొత్తం 124 ప్రదర్శనలు వచ్చాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, డీఈఓ కడప ప్రసాద్బాబు, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొత్తం ఏడు గ్రూప్ ప్రాజెక్టులు, రెండు ఉపాధ్యాయ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రదర్శనకు ఎంపికయ్యాయని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులు తమ చిట్టి మెదళ్లకు పదునుపెట్టి, అద్భుత నమూనాలు తయారు చేశారు. పిల్లల వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేశాయి. -
సర్కారు బడి రూపురేఖలు మార్చారు
అనంతపురం సిటీ : ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే పాడుబడిన భవనాలు.. కూలేందుకు సిద్ధంగా ఉన్న పైకప్పులు.. గాలీ వెలుతురు లేని గదులు.. కనీసం సున్నానికి కూడా నోచుకోని గోడలు.. ఒక్కమాటలో చెప్పాలంటే భూత్ బంగ్లాలను తలపించేవి. ఇదంతా గతం. జగనన్న రాకతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. ‘నాడు–నేడు’ అమలుతో రూ.కోట్ల ఖర్చుతో ప్రభుత్వ బడుల రాత మార్చారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా డిజిటల్ బోధన– ఇంగ్లిష్ మీడియం బోధనతో సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దారు. ఊరూరా.. ప్రతి పాఠశాల అమ్మ ఒడిని తలపించేలా ప్రభుత్వ బడిని అన్ని హంగులతో పునర్నిర్మించారు. నాటి పాలన ఓ స్వర్ణయుగమని ఊరూరా కట్టిన బడులే సాక్ష్యంగా నిలిచాయి. జిల్లాలో నాడు–నేడు ఫేజ్–1 కింద రూ.213,73 కోట్లు, ఫేజ్–2 కింద రూ.365.50 కోట్లతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు. -
వ్యవ‘సాయం’.. రైతు సుభిక్షం
●వైఎస్ జగన్ హయాంలో పండుగలా వ్యవసాయం ●అన్నదాతలకు ప్రతి అడుగులోనూ తోడుగా.. అనంతపురం అగ్రికల్చర్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పాలించిన 2019–2024 మధ్య కాలంలో అన్నదాత లోగిళ్లు సంక్షేమంతో వెల్లివిరిసాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలను ఒకే గొడుగు కింద తీసుకువచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్బీకే వ్యవస్థకు నాందిపలికారు. ఏటా క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం రైతుభరోసా–పీఎం కిసాన్, ఇన్పుట్సబ్సిడీ, ఇన్సూరెన్స్, సున్నావడ్డీ అందించారు. ప్రతి నియోజకవర్గంలోనూ నాసిరకం, కల్తీ సరుకులను అరికట్టేందుకు వీలుగా రూ.కోట్లు వెచ్చించి ఆర్బీకేలు, అగ్రి, వెటర్నరీ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు మద్దతు ధరలు దక్కేలా చర్యలు చేపట్టారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అన్నదాతకు అండగా నిలబడ్డాడు. ఇలా వైఎస్ జగన్ హయాంలో వ్యవ‘సాయం’ రైతులకు సుభిక్షంగా మారింది. ఐదేళ్లలో రూ.1,937 కోట్ల ‘భరోసా’ వైఎస్సార్సీపీ హయాంలో పీఎం కిసాన్తో కలిపి రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా రూ.13,500 ప్రకారం అందించారు. ఐదేళ్ల కాలంలో ఒక్కొక్కరికి రూ.67,500 ప్రకారం జిల్లాలో 2.90 లక్షల మంది రైతు కుటుంబాలకు ఏకంగా రూ.1,937 కోట్ల మేర నేరుగా ఖాతాల్లోకి జమ చేశారు. రైతులపై ప్రీమియం భారం మోపకుండా ఐదేళ్లూ ఉచితంగా వాతావరణ బీమా, ఫసల్ బీమా పథకాలు అమలు చేశారు. ఐదేళ్లలో 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1,205 కోట్ల మేర పరిహారం ఇచ్చారు. అలాగే పంట నష్టానికి రూ.377 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ జమ చేశారు. ఆత్మహత్య చేసుకున్న 280 మంది రైతు కుటుంబాల ఖాతాల్లోకి రూ.17.40 కోట్ల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. సున్నా వడ్డీ కింద 3.40 లక్షల మందికి రూ.72 కోట్లు అందించారు. మద్దతు ధర లేని సమయంలో ఎంఎస్పీ ద్వారా రూ.350 కోట్లు విలువ చేసే పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ఇక 1.70 లక్షల వరకు వ్యవసాయ బోర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం రూ.వందల కోట్లు వెచ్చించారు. 40 శాతం రాయితీతో యాంత్రీకరణ పరికరాలు, 40 శాతం రాయితీతో విత్తన వేరుశనగ, విత్తన పప్పుశనగ ఇతరత్ర విత్తనాలు సకాలంలో పంపిణీ చేశారు. అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్పరికరాలు, ఉద్యాన రైతులకు ప్రోత్సాహక రాయితీలు, పాడి రైతులకు మంచి ధర లభించేలా అమూల్ పాలవెల్లువ అమలు చేశారు. ఇలా చెబుతూ పోతే 2019–24 మధ్య కాలంలో ప్రకృతి, పాలకులు సహకరించడంతో వ్యవసాయం సంక్షేమం దిశగా పయనం సాగించింది. -
ఇదేం ‘పచ్చ’పాతం!
● వైఎస్ జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల తొలగింపు ● అధికారులు, టీడీపీ నేతల దాష్టీకం అనంతపురం క్రైం: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని అనంతపురం నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శనివారం టీడీపీ నాయకులు, అధికారులు తొలగించి ‘పచ్చ’ పాతాన్ని చాటారు. జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఒక రోజు ముందే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టవర్క్లాక్ వంతెనకు ఇరువైపులా, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడానికి శనివారం ఉదయమే నగర పాలక సంస్థ సిబ్బంది పూనుకున్నారు. విషయం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఫ్లెక్సీలు తొలగించిన టౌన్ప్లానింగ్ సిబ్బందిని నిలదీశారు. కళ్లముందే అధికార పార్టీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీలు కనిపిస్తున్నా వాటిని ముట్టుకోకుండా.. తమ అధినేత ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. అయితే.. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకే ఫ్లెక్సీలు తొలగించాల్సి వచ్చిందని టౌన్ ప్లానింగ్ సిబ్బంది చెప్పడం చర్చనీయాంశమైంది. 6 గంటలకే ప్రజా ప్రతినిధికి సమాచారం నగరపాలక సంస్థలోని టౌన్ప్లానింగ్ ఉద్యోగి ఒకరు స్థానిక ప్రజా ప్రతినిధికి ఉదయం ఆరు గంటలకే వైఎస్ జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల గురించి సమాచారం చేరవేశారు. దీంతో ఎలాగైనా ఫ్లెక్సీలను తొలగించాలని సదరు ప్రజాప్రతినిధి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ తొలగించేందుకు పూనుకున్నారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న నగరపాలక సంస్థ సిబ్బందిని వైఎస్ జగన్ అభిమానులు, నాయకులు అడ్డుకుంటున్న దృశ్యాలను సైతం వీడియోలు తీసి సదరు ప్రజాప్రతినిధికి పంపినట్లు సమాచారం. శనివారం ఉదయం నగరపాలక సంస్థ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి ఫ్లెక్సీలను తొలగింపజేసీన అధికార పార్టీ నేతలు అంతటితో ఆగలేదు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి నగర పాలక సంస్థ కమిషనర్ అనుమతించారన్న విషయం తెలుసుకున్న టీడీపీకి చెందిన అల్లరి మూకలు రాత్రి 9.30 గంటలకు టవర్క్లాక్ ఫ్లై ఓవర్పై ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఫ్లెక్సీలను తొలగించారు.అనంతపురంలో ఎన్నడూ లేని విధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అధికార పార్టీ నాయకులు వ్యవహరించటాన్ని వైఎస్సార్సీపీ నేతలు తప్పుబట్టారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకల ఫ్లెక్సీలను నగరపాలక సంస్థ జీపులో నుంచి తీసుకుంటున్న వైఎస్సార్సీపీ నాయకులు అనంతపురం రామ్నగర్ 80 ఫీట్ రోడ్డులో ఫ్లెక్సీలను తొలగిస్తున్న నగరపాలక సంస్థ సిబ్బందిని అడ్డుకుంటున్న వైఎస్సార్సీపీ నాయకులు దుష్ట సంప్రదాయానికి తెరతీస్తున్నారు.. నగరంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం నిర్వహించినా.. ప్లెక్సీలు కట్టే సాంప్రదాయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు దుష్ట సాంప్రదాయానికి తెర తీస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో చూస్తేనే .. అధికార పార్టీకి వణుకుపుడుతోంది. ఈ నెల 15న అనంతపురంలో జరిగిన భారీ బైక్ ర్యాలీ, 18న విజయవాడలో జరిగిన కోటి సంతకాల ప్రతుల భారీ ర్యాలీకి అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈనెల 21న తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్న తరుణంలో నగరంలో ప్లెక్సీలు కట్టారు. ప్రజాదరణను జీర్ణించుకోలేక ఫ్లెక్సీలు తొలగించడం సరికాదు. ఫ్లెక్సీలు ఎవరు తొలగించారో.. సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
అనంతపురం
●సుపరిపాలనకు ఆద్యుడు వైఎస్ జగన్ ●నేడు వాడవాడలా జన్మదిన వేడుకలు Iఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అనంతపురం : పాలకుడంటే ప్రజల కష్టనష్టాల్లో తోడుగా ఉండాలి. ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ధైర్యమివ్వాలి. వారి ప్రగతికి బాటలు వేయాలి. కుల, మత, రాజకీయాలకు అతీతంగా మేలు చేయాలి. తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ అండగా నిలిచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి. అలాంటి పారదర్శకత, దార్శనికత కల్గిన అతికొద్దిమంది నాయకుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకరు. ఆయన సీఎంగా అధికారం చేపట్టిన మొదటిసారే సంక్షేమ విప్లవాన్ని సృష్టించారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు. ‘పాలకుడంటే ఇలా ఉండాలి’ అంటూ నిర్వచనంగా నిలిచారు. అధికారం కోల్పోయినా..ప్రతిపక్ష నేతగా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ప్రతి సమస్యపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నేడు జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. జిల్లావ్యాప్తంగా వాడవాడలా బర్త్డే వేడుకలు నిర్వహించడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు సిద్ధమయ్యారు. -
నాడు లాభాలు.. నేడు కన్నీరు
తాడిపత్రిటౌన్: నేను పదేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. 2022 సంవత్సరం కరోనా సమయంలో పంటను అమ్ముకోలేని పరిస్థితి. అలాంటి సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ కిసాన్ రైలు ఏర్పాటు చేయించారు. మా ప్రాంతం నుంచి వేలాది టన్నుల అరటి దిగుబడులను ఢిల్లీ, ముంబాయి వంటి నగరాలకు చేర్చి రైతులు నష్టపోకుండా చూశారు. నేను అప్పట్లో ఎనిమిది ఎకరాల్లో అరటి పంట వేశా. రూ.7 లక్షల వరకు పెట్టుబడులు పెట్టా. కరోనా పరిస్థితుల్లోనూ టన్ను రూ.22 వేలతో అమ్మాను. సంవత్సరం పంట మీద దాదాపు రూ.20 లక్షలు ఆదాయం తీసుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో అన్న కొడుకు వివాహం ఘనంగా చేశాం. నేడు అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఏడు ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నా. నెలన్నర క్రితం పంట చేతికి వచ్చింది. టన్ను కేవలం రూ.2 వేలతో అమ్ముకోవాల్సి వచ్చింది. రూ.4 లక్షల దాకా నష్టపోయా. జగనన్న హయాం అరటి రైతులకు స్వర్ణయుగం లాంటిది. ఆనాటి ధర మళ్లీ ఏనాడూ చూడలేదు. – నాగమునిరెడ్డి, కేశవరాయునిపేట, యాడికి మండలం -
డాక్టర్ కల సాకారం
ఉరవకొండ మండలం రాకెట్ల తండాకు చెందిన శ్రీనివాసులునాయక్, నాగలక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ, కంది తదితర పంటలు సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారు. కుమార్తెలు అనితాబాయి, ఐశ్వర్య రాకెట్లలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్ ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. అనితాబాయికి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. తల్లి ప్రోద్బలంతో 2017లో నీట్లో ఉత్తీర్ణురాలైన అనితాబాయి కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 2018లో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. రెండో సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాగానే ‘ఫీజు రీయింబర్స్మెంట్’ పథకం తల్లిదండ్రుల్లో ఎంతో ధైర్యం నింపాయి. ఫీజు రీయింబర్స్మెంట్తో చక్కగా చదువుకుని అనితాబాయి డాక్టర్ కల సాకారం చేసుకుంది. మరో అమ్మాయి ఐశ్వర్య ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా హార్టికల్చర్ కోర్సు పూర్తి చేసింది. – ఉరవకొండ అనితాబాయి -
సున్నా లేదు.. పావలా అసలే లేదు!
అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. సూపర్సిక్స్ సూపర్హిట్ అంటూ డాంభికాలు ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా చూస్తే వ్యవసాయ, అనుబంధ రంగాలను పూర్తిగా విస్మరించేసింది. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ఏ రూపంలోనూ ఉపశమనం కల్పించే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం రూ.లక్షలోపు పంట రుణాలకు సంబంధించి బడుగు రైతులకు సున్నావడ్డీ వర్తింపు లేదు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి పావలా వడ్డీ ప్రయోజనమూ కల్పించలేదు. అసలు ప్రభుత్వం పంట రుణాలు, సున్నావడ్డీ, పావలావడ్డీ వంటి ఊసే ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు. నాడు వ్యవసాయ రంగానికి పెద్దపీట వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి గత వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. పేద, బడుగు, సన్న, చిన్నకారు రైతులకు బాసటగా నిలిచారు. ఏటా ఖరీఫ్, రబీలో బ్యాంకుల ద్వారా రూ.ఒక లక్ష లోపు పంట రుణాలు (క్రాప్లోన్స్) రెన్యూవల్స్, కొత్త రుణాలు తీసుకున్న పేద రైతులపై వడ్డీ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. అందుకోసం వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల (ఎస్వీపీఆర్) పథకం అమలు చేశారు. ఏటా జిల్లా వ్యాప్తంగా ఏపీజీబీ, ఎస్బీఐ, కెనరా, యూబీఐ, కార్పొరేషన్, డీసీసీబీ... తదితర గ్రామీణ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్, సహకార బ్యాంకుల పరిధిలో పంట రుణాల కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున 5.80 లక్షల మంది వరకు రైతులకు ఏటా రూ.10 వేల కోట్ల వరకు పంట రుణాలు పంపిణీ చేశారు. అందులో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న సన్న చిన్నకారు, బడుగు రైతులు 7,61,502 మందికి ఏకంగా రూ.156 కోట్ల మేర సున్నావడ్డీ నేరుగా ఖాతాల్లోకి జమ చేసింది. అందులో అనంతపురం జిల్లా పరిధిలో 3,39,362 మంది రైతుల ఖాతాల్లోకి రూ.71 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో 4,32,140 మంది రైతుల ఖాతాల్లోకి రూ.75 కోట్ల మేర సున్నా వడ్డీ జమ చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పెద్ద మొత్తంలో పావలావడ్డీ ద్వారా ప్రయోజనం కల్పించారు. రూ.లక్ష లోపు పంట రుణానికి గత ప్రభుత్వం సున్నావడ్డీ వర్తింపు సకాలంలో పంట రుణాలు చెల్లించిన వారికి పావలావడ్డీ చెల్లింపు చంద్రబాబు ప్రభుత్వంలో వడ్డీ వర్తింపు ఊసే లేదు ప్రభుత్వ ప్రకటన కోసం రైతుల ఎదురుచూపు -
‘పచ్చ’ నేతల ఇంట పంచాయతీ ట్రాక్టర్లు
ట్రాక్టర్లు ఎక్కడ..? కంబదూరు మండలంలో మూడు పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను టీడీపీ నేతలు మాయం చేశారు. సర్పంచులను అడిగితే ట్రాక్టర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదని అంటున్నారు. ఇదే విషయాన్ని ఎంపీడీఓ, ఈఓఆర్డీల దృష్టికి తీసుకెళ్తే.. ప్రభుత్వం మంజూరు చేసిన కంపెనీ ట్రాక్టర్ కాకుండా వేరేది పంపారు. అసలు ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్లు ఎక్కడ పోయాయో చూపాలి. – హనుమంతరాయుడు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, కంబదూరు కళ్యాణదుర్గం: గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం మెరుగు కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకం కింద కేటాయించిన ట్రాక్టర్లు పక్కదారిపట్టాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సొంత అవసరాలకు వాటిని దర్జాగా వినియోగించుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పల్లెల్లో చెత్తాచెదారం దిబ్బలుగా పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు 22 ట్రాక్టర్లు స్వచ్ఛభారత్ పథకం కింద మంజూరయ్యాయి. అందులో ఎనిమిది ట్రాక్టర్లు అధికార పార్టీ నేతలు తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ట్రాక్టర్ల మాయంపై పంచాయతీల సర్పంచులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ట్రాక్టర్లను వ్యక్తిగతంగా వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకులతో పాటు ముఖ్య ప్రజాప్రతినిధి కూడా సొంత ఆస్తి అయినట్టు పంచాయతీ ట్రాక్టర్లను వాడుకోవడాన్ని తప్పుబడుతున్నారు. ట్రాక్టర్లు లేక చెత్త పేరుకుపోయి ప్రజారోగ్యం దెబ్బతింటున్నా తమ కేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాక్టర్లు పక్కదారి పట్టాయిలా.. కంబదూరు మండలంలోని కర్తనపర్తి, పాళ్లూరు, రాళ్ల అనంతపురం పంచాయతీలకు మూడు ట్రాక్టర్లు మంజూరయ్యాయి. అయితే ఆ ట్రాక్టర్లు ఆయా పంచాయతీల పరిధిలో కనిపించడం లేదు. ట్రాక్టర్ గురించి రాళ్ల అనంతపురం సర్పంచ్ గతంలో అధికారులకు అర్జీ ఇచ్చారు. స్పందన లేకపోవడంతో మరోసారి అర్జీ ఇవ్వడంతో.. తన పంచాయతీకి కేటాయించిన ‘మహీంద్ర 275’ ట్రాక్టర్కు బదులుగా ఐషర్ కంపెనీ ట్రాక్టర్ను అధికారులు పంపారు. దీంతో సదరు సర్పంచు అనధికారిక ట్రాక్టర్ను వెనక్కిచేశ్చారు. మిగిలిన రెండు పంచాయతీల ట్రాక్టర్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీ పనులకు వినియోగిస్తున్నట్లు సర్పంచులు ఆరోపిస్తున్నారు. ● శెట్టూరు మండలంలో శెట్టూరు, కనుకూరు, లక్ష్మంపల్లి, ములకలేడు, బచ్చేహళ్ళి గ్రామాలకు కొత్త ట్రాక్టర్లు కేటాయించారు. అయితే శెట్టూరులో టీడీపీ సర్పంచ్ ఉరాల కుమార్ పంచాయతీ ట్రాక్టర్ను సొంతానికి వినియోగించుకుంటున్నారు. ● బ్రహ్మసముద్రం మండలంలో బ్రహ్మసముద్రం, పిల్లలపల్లి, సంతే కొండాపురం, భైరవానితిప్ప, పాల వెంకటాపురం గ్రామాలకు మొత్తం ఐదు ట్రాక్టర్లను కేటాయించారు. ఇందులో పిల్లలపల్లిలో మాజీ ఎంపీపీ మంజుల భర్త వన్నూరుస్వామి, పాల వెంకటాపురంలో టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు బంధువు, సంతే కొండాపురంలో సర్పంచ్ మల్లెల వనిత తమ సొంత పనులకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ● కళ్యాణదుర్గం మండలంలో మొత్తం నాలుగు ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ఇందులో కొత్తూరు, పాలవాయి, ముద్దినాయనపల్లిలో గ్రామ పంచాయతీ పనులకు వినియోగించుకుంటుండగా.. గోళ్ల గ్రామ పంచాయితీలో టీడీపీ సర్పంచ్ తన సొంత పనులకు వాడుకుంటున్నారు. ● కుందుర్పి మండలంలో 5 ట్రాక్టర్లు మంజూయ్యాయి. ఎనుములదొడ్డి, జంబుగుంపల, మలయనూరు, కుందుర్పిలో పంచాయతీ అవసరాలకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. బెస్తరపల్లిలో మాత్రం టీడీపీ నాయకులు వాడుకుంటున్నారు. చర్యలు తీసుకుంటాం స్వచ్ఛభారత్ పథకం కింద కేటాయించిన ట్రాక్టర్లు ఆయా పంచాయతీల పరిధిలో ఉండాలి. ఎక్కడైనా సర్పంచులు లేదా ఇతరులు సొంత పనుల కోసం వాడుకున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. అలాంటి ట్రాక్టర్లను పంచాయతీల ఆధీనంలోకి తెస్తాం. పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లను పంచాయతీ అవసరాలకే వాడుకోవాలి. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వాడుతుంటే.. వాటిపై గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, డీఎల్డీఓ పల్లెల్లో పేరుకుపోయిన చెత్తదిబ్బలు ప్రజారోగ్యం దెబ్బతింటున్నా పట్టని వైనం దర్జాగా సొంత పనులకు వినియోగిస్తున్న నేతలు ట్రాక్టర్లు ఏమయ్యాయో కూడా పట్టించుకోని అధికారులు -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం పెరిగింది. ఈశాన్యం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
క్రీడా పోటీల్లో ఉద్రిక్తత● తొలిరోజే రసాభాసగా అంతర్ కళాశాలల మహిళల క్రీడా పోటీలు అనంతపురం సిటీ: అనంతపురం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానం వేదికగా రెండ్రోజుల పాటు సాగే అంతర్ కళాశాలల మహిళా క్రీడా పోటీలు తొలిరోజే (శుక్రవారం) ఉద్రిక్తతకు దారి తీశాయి. నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వివాదానికి ప్రధాన కారణమైంది. వివరాల్లోకి వెళితే... ఎస్కేయూ క్యాంపస్ కళాశాల, ఆర్ట్స్ కళాశాల మధ్య తొలుత ఖోఖో పోటీ మొదలైంది. ఎస్కేయూ క్రీడాకారిణులు ఆడుతున్న సమయంలో అంపైర్లు ఫౌల్ ఇచ్చారు. ఆ సమయంలో వివాదం చెలరేగింది. అక్కడే ఉన్న ఏఐఎస్ఎఫ్, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ ఎస్కేయూ శాఖ నాయకులు జోక్యం చేసుకుని అంపైర్లను నిలదీశారు. స్పోర్ట్స్ అథారిటీ సెక్రటరీ ఆర్ట్స్ కళాశాల జట్టుకు వత్తాసు పలికేలా మాట్లాడడంతో విద్యార్థి సంఘాల నేతలు ప్రతిఘటించారు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంతలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ సమాచారంతో మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అయితే రాత్రి 7.30 గంటలకు చెస్ ఆడుతున్న సమయంలో మరోసారి రగడ మొదలైంది. తమను అనరాని మాటలు అన్నారంటూ పలువురు క్రీడాకారిణులు కన్నీళ్లు పెట్టుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చివరకు ఏడ్చుకుంటూనే అమ్మాయిలు ఇంటిదారి పట్టారు. -
అక్కడా ఓటేస్తాం.. ఇక్కడా ఓటేస్తాం
రాప్తాడు రూరల్: ఓటు హక్కు కల్గిన వ్యక్తికి ఒక రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే నిబంధనలకు విరుద్ధం. చట్టరీత్యా నేరం కూడా. దీన్ని ఉల్లంఘించిన వారికి జైలుశిక్ష కూడా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా రెండు ఓట్లు ఉంటే వారికి ఇష్టమైన ప్రాంతంలో ఒకచోట ఓటు పెట్టుకుని, రెండోచోట ఉన్న ఓటును కచ్చితంగా రద్దు చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఈ కార్యక్రమాన్ని తూతూమంత్రంగా చేపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి వారి ఓట్లు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కొందరు ఫారం–7 దరఖాస్తు చేసుకున్నా.. తమకు అనుకూలమైన ఓట్లు తొలగిపోతాయంటూ నాయకులు ఒత్తిళ్లు చేస్తుండడంతో ఫారం–7 దరఖాస్తులను బోగస్ డిక్లరేషన్ (ఓటుదారుడికి తెలీకుండా) ఇచ్చి వాటిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్ ఓట్లపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లిలో డబుల్ ఓట్లపై వైఎస్సార్సీపీ నాయకులు శుక్రవారం అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జ్లు సనప గోపాల్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా బూత్ కమిటీ ఉపాధ్యక్షుడు నాగమల్లేశ్వరరెడ్డి, పెరవళి జయచంద్రారెడ్డి, గ్రామకమిటీ అధ్యక్షుడు యర్రగుంట సోమశేఖర్రెడ్డి, యువజన విభాగం గ్రామ కమిటీ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డి, బండమీదపల్లి నాయకులు రాప్తాడు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ) రామ్మోహన్, అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడును వేర్వేరుగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండమీదపల్లిలో 153, 154, 155, 156 బూత్లలో దాదాపు 145 మందికి పైగా డబుల్ ఓట్లుగా ఉన్న వాటిని తొలగించాలంటూ ఫారం–7 దరఖాస్తులు అందజేసినా.. అందులో 5 మాత్రమే తొలగించి, తక్కినవి కొనసాగిస్తున్నారన్నారు. అధికార టీడీపీకి చెందిన కొందరు నాయకులు నకిలీ డిక్లరేషన్లు ఇవ్వడం, వాటి ఆధారంగా ఆ ఓట్లను కొనసాగిస్తుండటం చేస్తున్నారని పేర్కొన్నారు. డబుల్ ఓట్లను తొలగించకపోతే ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ ఫొటో చూడండి. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన మనుబోలు గోపాల్చౌదరి కుటుంబం 30 ఏళ్లకు పైగా అనంతపురం నగరంలో స్థిరపడింది. ఈయన కుటుంబానికి నేటికీ స్వగ్రామంలో ఓట్లు ఉన్నాయి. మరోవైపు అనంతపురంలోనూ వీరికి ఓట్లు ఉన్నాయి. మనుబోలు గోపాల్చౌదరి ఎన్డీఎఫ్ 2315786 నంబరులో ఓటరుగా, ఈయన కుమారుడు మనుబోలు మధుసూదన్రావు ఎన్డీఎఫ్ 2315778 ఓటరుగా బండమీదపల్లి ఓటర్ల జాబితాలో ఉన్నారు. అనంతపురంలోనూ మనుబోలు గోపాల్చౌదరి (వైడబ్ల్యూబీ 1038678) ఓటరుగా, ఆయన కుమారుడు మధుసూదన్రావు (వైడబ్ల్యూబీ 3124021) ఓటరుగా ఉన్నారు. అంటే వీరు అటు అనంతపురం, ఇటు బండమీదపల్లిలో ఓట్లు వేస్తూ వస్తున్నారు. వీరే కాదు ఈ ఒక్క పంచాయతీ పరిధిలోనే దాదాపు 250కి పైగా డబుల్ ఓట్లున్నాయి. ఫారం–7పై నామమాత్రంగా విచారణ ఊరిలో లేకున్నా ఓటర్లుగా కొనసాగింపు అధికారులపై ‘అధికార పార్టీ’ నేతల ఒత్తిళ్లు రాప్తాడు మండలం బండమీదపల్లిలోనే వందలాదిగా డబుల్ ఓట్లు -
సబ్సిడీ విత్తన వేరుశనగలో రాళ్లు
బ్రహ్మసముద్రం: రబీ సాగు కోసం ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసిన విత్తన వేరుశనగలో నాణ్యత కొరవడింది. శుక్రవారం మండల కేంద్రం బ్రహ్మసముద్రంలోని రైతు సేవ కేంద్రం (ఆర్ఎస్కే) నుంచి ఓ రైతు సబ్సిడీ విత్తన వేరుశనగ తీసుకున్నాడు. 30 కిలోల బస్తాకు రూ.1,650 చొప్పున వసూలు చేశారు. అయితే ఈ బస్తాలో కిలో వరకు రాళ్లు ఉండటంతో రైతు కంగుతిన్నాడు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇలా పంపిణీ చేస్తే ఎలా అంటూ వాపోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీఐని దూషించిన ఘటనలో నలుగురిపై కేసు ఉరవకొండ: ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది విధులకు ఆటంకం కలిగిస్తూ దూషించిన ఘటనలో బీజేపీకి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జనార్దన్నాయుడు శుక్రవారం తెలిపారు. భూతగాదా విషయంలో ఇటీవల విడపనకల్లు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైందని, దీనిపై విచారణకు రావాలంటూ బీజేపీ నేతలకు సీఐ ఫోన్లో తెలిపారన్నారు. బీజేపీ నాయకులు ఈ నెల 18న ఉరవకొండ పోలీస్ స్టేషన్కు వచ్చి ఒక్కసారిగా సీఐపై చిందులు వేస్తూ తీవ్రంగా దూషించారని పేర్కొన్నారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ఆ నాయకులను వారించినా వినలేదని తెలిపారు. దీనిపై విడపనకల్లు మండలం డోనేకల్లుకు చెందిన బీజేపీ నాయకులు సందిరెడ్డి నారాయణస్వామి, సందిరెడ్డి వెంకటరమణ, నింబగల్లుకు చెందిన జట్టి గోపాల్, మోపిడికి చెందిన దగ్గుపాటి శ్రీరాములుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. నేడు జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన అనంతపురం సిటీ: రాప్తాడు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్లో శనివారం జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ఫేర్) నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు తమ ప్రాజెక్టులతో సంబంధిత గైడ్ ఉపాధ్యాయులతో కలిసి ఉదయం 9 గంటలకల్లా రాప్తాడుకు చేరుకోవాలని సూచించారు. గ్రూప్, వ్యక్తిగత, ఉపాధ్యాయ విభాగంలో జిల్లాస్థాయి సైన్స్ ఫేర్ విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 23వ తేదీన నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్కు హాజరు కావాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ‘దుర్గం’ పోలీసులకు ఏబీసీడీ అవార్డు అనంతపురం/రాయదుర్గం: రాష్ట్రస్థాయి ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డును రాయదుర్గం పోలీసులు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యంత ప్రతిభ కనబరిచే కేసుల వివరాల ఆధారంగా ప్రతి మూడు నెలలకోసారి ‘ఏబీసీడీ’ ప్రకటిస్తారు. ఈ క్రమంలో కంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్లను ఆపరేట్ చేస్తూ ఢిల్లీ కేంద్రంగా భారీగా ఫేక్ అకౌంట్లలోకి నగదు బదలాయించిన గుట్టును రట్టు చేసినందుకు గాను రాయదుర్గం యూపీఎస్, రాయదుర్గం రూరల్, జిల్లా సైబర్ విభాగం పోలీసులకు ఏబీసీడీ అవార్డు దక్కింది. దేశ వ్యాప్తంగా క్రియేట్ చేసిన 13 ఫేక్ అకౌంట్లలోకి డబ్బు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన ఐదుగురు సభ్యులు గల సైబర్ ముఠాను అరెస్ట్ చేసి రూ.41.20 లక్షల నగదు, ఎనిమిది సెల్ఫోన్లు, కారు, 20 ఏటీఎం సిమ్కార్డులు, 15 సిమ్ కార్డులు, 10 చెక్కుబుక్కులు, రెండు రూటర్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం డీజీపీ హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా అవార్డును అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి, ఎస్పీ పి. జగదీష్ అందుకున్నారు. -
వీర జవాన్ సతీమణికి అవార్డు అందజేత
శింగనమల (నార్పల): నార్పలకు చెందిన వీర జవాన్ సుబ్బయ్య సతీమణి గవ్వల లీలావతి.. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విజయవాడలో శుక్రవారం జరిగిన సైనిక్ వెల్ఫేర్ ఫ్లాగ్డే కార్యక్రమంలో ఆమెకు అవార్డును గవర్నర్ అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, ఐఏఎస్ అధికారి వినోద్కుమార్, మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొన్నారు. -
16 మందికి కారుణ్య నియామకాలు
అనంతపురం అర్బన్: కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించడం ద్వారా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కలెక్టర్ ఓ.ఆనంద్ ఆనందం నింపారు. మొత్తం 16 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం జారీ చేసిన ఉత్తర్వులను కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్ఓ మలోల శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. జీఓ మేరకు వీరిని సచివాలయల ఉద్యోగులుగా, ప్రభుత్వ శాఖల్లో అటెండర్లుగా నియమించారు. 22న జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ● వామపక్ష పార్టీ నాయకులు అనంతపురం అర్బన్: ఉపాధి హామీ చట్టాన్ని సవరిస్తూ పేరు మార్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 22న జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వామపక్ష పార్టీల నేతలు వెల్లడించారు. ఈ మేరకు సీపీఐ, సీపీఎం, సీపీఎం (ఎంఎల్ న్యూ డెమోక్రసీ), ఎస్యూసీఐ, సీపీఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్ లిబరేషన్) జిల్లా కార్యదర్శులు పాళ్యం నారాయణస్వామి, ఓ.నల్లప్ప, ఇండ్ల ప్రభాకర్రెడ్డి, రాఘవేంద్ర, చంద్రశేఖర్, వేమన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పని హక్కుగా ఉన్న చట్టాన్ని మార్చి ఒక సాధారణ పథకంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిందని మండిపడ్డారు. పథకానికి నిధులు, పని దినాలు, దినసరి కూలి పెంచి ఉపాధి కూలీల జీవితాల్లో వికాసం తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పథకం అమలును రాష్ట్రాలకు అప్పగిస్తే నీరుగారిపోయే ప్రమాదం ఉందన్నారు. కొత్త ఉపాధి బిల్లుకు వ్యతిరేకంగా 22న చేపట్టిన ఆందోళనలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వ్యక్తి దుర్మరణం గార్లదిన్నె: మండలంలోని తలగాచిపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బుక్కరాయసముద్రం మండలం సిద్ధలాపురం గ్రామానికి చెందిన బండారు ఆదినారాయణ(38) కారు డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వ్యక్తిగత పనిపై పెద్దవడుగూరు మండలం మిడతూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతూ తలగాచిపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి టమాట లోడ్తో మహారాష్ట్రకు వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ప్రొబేషనరీ ఎస్ఐ సురేంద్రబాబు తెలిపారు. -
క్రీస్తు మార్గం అనుసరణీయం
అనంతపురం/ కల్చరల్: లోకానికి వెలుగులు నింపిన క్రీస్తు మార్గం అనుసరణీయమని రాయలసీమ డయాసిస్ ఉపాధ్యక్షుడు రెవరెండ్ బెన్హర్బాబు అన్నారు. వైఎస్సార్సీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అనంతపురంలోని ఏ7 కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ బెన్హర్బాబు తన సందేశంలో క్రీస్తు జీవిత విశేషాలను, దివ్య అనుభవాలను వివరించారు. అంతకు ముందు సామూహిక ప్రార్థనలు చేయించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన వైఎస్ థామస్రెడ్డి మాట్లాడుతూ.. క్రీస్తు జీవిత విశేషాలను పంచుకున్నారు. వైఎస్సార్సీపీ తోనే క్రైస్తవుల అభ్యున్నతి ప్రీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జెడ్పీ చైర్పర్సన్ బోయగిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు, రాష్ట్ర కార్యదర్శి జానీ, నగర అధ్యక్షుడు సతీష్ , ముస్లిం మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, సాకే చంద్రలేఖ, కో–ఆప్షన్ సభ్యుడు మారుతి, రాష్ట్ర మైనార్టీ విభాగం జనరల్ సెక్రెటరీ కాగజ్ఘర్ రిజ్వాన్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం నాయకులు జాన్, థామస్, రాజ్కుమార్, పుట్లూరు ప్రభాకర్, హనుమంతు, పద్మాకరబాబు, ఐజయ్య, అనిల్ మోజెస్, మనేష, ఆనంద్, జహంగీర్, అబ్రహామయ్య, సాల్మన్ రాజ్, జాకోబ్, జానీ, పుల్లయ్య కార్పొరేటర్లు కళావతి, కమల్భూషణ్, హసనీబేగం, రాజి, శ్రీనివాసులు, హసీనాబేగం, అనిల్రెడ్డి, పార్టీ జిల్లా బూత్ కమిటీ చైర్మెన్ ఎద్దుల అమరనాథ రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, సంపంగి రామాంజినేయులు, కాకర్ల శ్రీనివాసరెడ్డితో, పాస్టర్ల సంఘం ప్రతినిధులు రెవ.మోసెస్ అనిల్కుమార్, పాస్టర్లు మనుష్యే, జీఆర్ ఆనంద్ తదితరులు మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ తోనే క్రైస్తవుల అభ్యున్నతి సాధ్యమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పాస్టర్లకు క్రమం తప్పకుండా రూ.5 వేలు వేతనంపడితే.. ప్రభుత్వం మారిన తర్వాత ఆ వేతనం అందకుండా పోయిందన్నారు. రాయలసీమ డయాసిస్ ఉపాధ్యక్షుడు బెన్హర్బాబు సందడిగా సాగిన ప్రీ క్రిస్మస్ వేడుకలు -
గొల్లపల్లికి సంగాలప్ప స్వామి
బత్తలపల్లి: కురుబల ఆరాధ్యదైవం సంగాలప్ప స్వామి నాలుగు దశాబ్దాల తర్వాత శుక్రవారం మండలంలోని యర్రాయపల్లి నుంచి రాప్తాడు మండలం గొల్లపల్లికి చేరాడు. దీంతో గ్రామస్తులంతా ఆనందోత్సాహాలతో స్వామి వారికి స్వాగతం పలికారు. దీంతో స్వామివారి విగ్రహం అప్పగింతకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కురుబ సామాజికవర్గంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న దశాబ్దాల నాటి వివాదానికి తెరపడింది. సుప్రీం కోర్టును ఆశ్రయించి.. కురబల గుడికట్టు దేవుళ్లయిన గొల్లపల్లయ్యస్వామి, సంగాలప్పస్వామి అన్నదమ్ములు. ఏ ఉత్సవం జరిగినా ఇరువురు దేవుళ్లనూ ఊరేగించడం ఆనవాయితీ. అయితే సంగాలప్పస్వామి విగ్రహం విషయంలో యర్రాయపల్లి కమతం వంశస్తులు, గంగలకుంట కపాడం వంశస్తుల మధ్య వివాదం నెలకొంది. స్వామి విగ్రహాన్ని తమ గ్రామంలోనే ఉంచుకుంటామంటూ ఈ రెండు గ్రామాల వారు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే 1999లో ఈ అంశంపై గంగలకుంట కపాడం వంశస్తులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో ఒక్కో ఊరిలో ఆర్నెళ్ల పాటు స్వామివారి ఉత్సవ విగ్రహం ఉండేలా 2005లో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును అమలు చేయకుండా యర్రాయపల్లి కమతం వంశస్తులు హైకోర్టును ఆశ్రయించగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. దీనిపై 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నవంబర్ 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కమతం వంశస్తులు యర్రాయపల్లిలో స్వామివారి ఊరేగింపు చేశారు. అయితే సంగాలప్ప రెండోపూజ గొల్లపల్లయ్య స్వామితో కలిపి చేయడం ఆనవాయితీ కాగా, స్వామి ఉత్సవ విగ్రహాన్ని గొల్లపల్లికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే సుప్రీం తీర్పుపై తాము రివ్యూ పిటీషన్ వేశామని, అంతవరకూ స్వామివారి ఊరేగింపు జరగనివ్వబోమని కపాడం వంశస్తులు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అధికారులు రంగంలోకి దిగారు. శాంతి కమిటీ సమావేశం నిర్వహించి పరిస్థితి చక్కదిద్దారు. గొల్లపల్లిలో ఆనందోత్సహాలు.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తమ గ్రామానికి సంగాలప్ప స్వామి ఉత్సవ విగ్రహం విచ్చేస్తుండటంతో గొల్లపల్లి వాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సాయంత్రం యర్రాయపల్లి గ్రామం నుంచి స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉరేగింపుగా గ్రామం చివర వరకు తీసుకువచ్చారు. అనంతరం ఐచర్ వాహనంలో ఎక్కించి భారీ పోలీసు బందోబస్తు మధ్య గొల్లపల్లికి తరలివెళ్లారు. అక్కడ రాత్రి గొల్లపల్లయ్యస్వామితో కలిసి గ్రామోత్సవం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం సంగాలప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని తిరిగి యర్రాయపల్లికి చేర్చనున్నారు. భారీ బందోబస్తుతో గొల్లపల్లికి తరలింపు సంగాలప్ప స్వామిని శుక్రవారం గొల్లపల్లికి తీసుకువెళ్లే క్రమంలో బత్తలపల్లి మండలం యర్రాయపల్లి గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 20 మంది ఏఎస్ఐలు, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 60 మంది పోలీసులు, మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేఽశారు. మరోవైపు బత్తలపల్లి తహసీల్దార్ స్వర్ణలతతో పాటు మండలంలోని రెవెన్యూ సిబ్బంది అందరూ గ్రామంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెర ధర్మవరం డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు -
ఏఐతో భవిష్యత్తులో గణనీయ మార్పులు
గుంతకల్లు: ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో భవిష్యత్తులో గణనీయమైన మార్పులు వస్తాయని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం స్థానిక శ్రీ శంకరనంద గిరిస్వామి డిగ్రీ కళాశాలలో ఏఐసీటీఈ సహకారంతో డిపార్టుమెంట్ ఆఫ్ కంప్యూటర్స్ సైన్స్ అండ్ అప్లికేషన్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ట్రెండ్స్, చాలెంజస్, ఆపర్చునిటీస్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును శుక్రవారం ప్రారంభించారు. కళాశాల కరస్సాండెంట్ కేసీ హరి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథులుగా వరంగల్ నీట్ కళాశాల ప్రొఫెసర్ ఈ.సురేష్బాబు, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సీడీసీ డీన్ ప్రొఫెసర్ రామగోపాల్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ సురేష్బాబు, కంప్యూటర్ విభాగం అధిపతి డాక్టర్ నటరాజ్, అధ్యాపకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
●దారులపై ధాన్యం.. ప్రమాదాలకు కాదా ఆస్కారం!
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి దక్కేందుకు రైతులు అహర్నిశం శ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఖరీఫ్ సీజన్లో చేతికి అందిన ధాన్యాన్ని కొందరు రైతులు ఆర బోస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా... రోడ్లపై ఆరబోసిన ధాన్యంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంది. జాతీయ రహదారి పక్కగా ఆరబోసిన ధాన్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. రాత్రి సమయాలు, తెల్లవారుజామున ధాన్యం కుప్పలు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్న వారూ ఉన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం సొరకాయలపేట క్రాస్ రోడ్డులో వరిధాన్యం ఆరబెట్టిన పరిస్థితి -
ఎప్పుడు కూలుతాయో?
● దుస్థితిలో హెచ్చెల్సీ బ్రిడ్జీలు ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం కణేకల్లు: హెచ్చెల్సీ బ్రిడ్జీలు శిథిలావస్థకు చేరున్నాయి. ఎప్పుడు కూలతాయో తెలీని పరిస్థితి నెలకొంది. ఈ యేడాది అత్యంత అవసరంగా 10 బ్రిడ్జిలను గుర్తించి పనులు ప్రారంభించినా కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయి. మరో 8 బ్రిడ్జిలు ఆగిపోయాయి. మరో 44 బ్రిడ్జీలు దుస్థితికి చేరుకున్నాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాటిపై రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ఘోరం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొన్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. 60 ఏళ్ల క్రితం నాటివి... హెచ్చెల్సీ కాలువపై 60 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జీలు, అండర్ టన్నల్లు అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. హెచ్చెల్సీ ప్రధాన కాలువ ఆంధ్రా సరిహద్దు 105 కి.మీ వద్ద ప్రారంభమై ఉరవకొండ పరిధిలోని 189 కి.మీ వద్ద ముగిస్తోంది. హెచ్చెల్సీ నిర్మాణ సమయంలో ఆర్అండ్బీ రోడ్డు మధ్యలో బ్రిడ్జీలు, వంకలు, వాగులపై యూటీలు (అండర్ టన్నల్స్) నిర్మించారు. బ్రిడ్జిలు 33, యూటీలు 21, అక్విడెక్ట్లు 5 నిర్మించారు. మీన్లహళ్లి వద్ద ఐదేళ్ల క్రితం బ్రిడ్జి కూలిపోగా... రెండేళ్ల క్రితం కణేకల్లు చెరువు అవుట్ ఫాల్ రెగ్యులేటర్ బ్రిడ్జి వరిధాన్యంతో ఈచర్ వాహనం వస్తున్న సమయంలో కుప్పకూలింది. దీంతో గంగలాపురం, ఆదిగానిపల్లి, రచ్చుమర్రి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలతో ముప్పులు హెచ్చెల్సీ బ్రిడ్జీలపై నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో యూటీ, బ్రిడ్జిల వద్ద ఉన్న రాళ్లు వదులుగా మారి గోడలు బలహీనంగా మారాయి. యూటీలు, అక్విడెక్ట్ల వద్ద తరచూ నీరు లీక్ అవుతుండటంతో హెచ్చెల్సీ అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. యూటీల పక్కనే రాళ్లతో నిర్మించిన ప్రొటక్షన్ వాల్స్ కూడా బలహీనంగా మారాయి. యూటీలు పటిష్టంగా ఉంటనే హెచ్చెల్సీ నీరు రాష్ట్రానికి సకాలంలో తీసుకోరావడానికి వీలవుతోంది. యూటీలకు గండ్లు పడితే నీరు తీసుకోవడం చాలా కష్టమని రైతులు చెబుతున్నారు. బొమ్మనహళ్ మండలంలోని ఉంతకల్లు సమీపంలో 113/507 కిలోమీటర్ వద్ద డిసెంబర్ 7న యూటీకి గండిపడగ్గా... జూలై 28న నాగేపల్లి అక్విడెక్ట్ వద్ద కాలువ గట్టు కోత గురైన విషయం విధితమే. జనవరి నెలాఖరుకు నీరు బంద్ హెచ్చెల్సీకి జనవరి నెలాఖరికి నీటి సరఫరా బంద్ కానున్నాయి. ఈలోపు హెచ్చెల్సీ అధికారులు అత్యవసర బ్రిడ్జిలను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కణేకల్లులోని రామనగర్, మాల్యం, గనిగెర, ఆంధ్రా సరిహద్దు 105 కిలోమీటర్ వద్ద బ్రిడ్జిలు అతి ముఖ్యమైనవి. ప్రమాదాలు జరిగి సమస్యలు తలెత్తక ముందే ఈ బ్రిడ్జిల నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కణేకల్లు మండలం మాల్యం వద్ద దుస్థితిలో హెచ్చెల్సీ బ్రిడ్జి బొమ్మనహాళ్ మండలంలోని ఉంతకల్లు యూటీ వద్ద గండిపడిన దృశ్యం (ఫైల్) ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం బ్రిడ్జిలు, యూటీలు అధ్వాన్నస్థితికి చేరుకొన్న విషయాన్ని హెచ్చెల్సీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయమని ఆదేశించడంతో ఆ పనిలో నిమగ్నమయ్యాం. అత్యవసరమైన బ్రిడ్జిలను గుర్తించాం. నిధులు మంజూరు చేస్తే కొత్త బ్రిడ్జిలు, యూటీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. – దివాకర్రెడ్డి, హెచ్చెల్సీ డీఈఈ -
ఎమ్మెల్యే అమిలినేని తిరుగుబావుటా
కళ్యాణదుర్గం: చంద్రబాబు సర్కార్పై సొంత పార్టీకి చెందిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పారిశుధ్య పరికరాలు పంపిణీ చేసి తన నియోజకవర్గంలో పంపిణీపై చిన్నచూపు చూడటంతో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కి వెళ్లిపోయారు. కళ్యాణదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీలలో పారిశుధ్య పనులకు అవసరమైన పరికరాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. అయితే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కాకుండా కేవలం మండలానికి రెండు గ్రామాలకు చొప్పున మాత్రమే పరికరాలు వచ్చాయని డీఎల్డీఓ నాగేశ్వరరావు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అమిలినేని జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పంపిణీ చేసినప్పుడు తన నియోజకవర్గంలో మాత్రం ఎందుకు ఇలా కొన్ని గ్రామాలకే ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసంతృప్తితో ఉన్నానని, ఇలాంటి కార్యక్రమానికి రాకుండా ఉండాల్సిందన్నారు. కళ్యాణదుర్గానికి జరిగిన అన్యాయంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారులు సైతం కళ్యాణదుర్గం వైపు చూడకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. త్వరలోనే కలెక్టర్తో చర్చిస్తానని, తాను కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్తున్నానని మైకులో ప్రకటించి అర్ధంతరంగా కార్యక్రమం నుంచి వెనుదిరిగిపోయారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అరకొరగా వచ్చిన పంచాయతీ పారిశుధ్య పరికరాలు కార్యక్రమంలో అసహనంతో మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టీడీపీలో కలకలం సొంత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి కళ్యాణదుర్గంపై చిన్నచూపు చూస్తున్నారని మండిపాటు కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయిన టీడీపీ ఎమ్మెల్యే మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రభుత్వం, అధికారులపై అసహనం వ్యక్తం చేసి..కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్తున్నట్లు ప్రకటించడంతో టీడీపీలో కలకలం రేపుతోంది. కార్యక్రమానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సైతం షాక్కు గురయ్యారు. ఇదిలా ఉండగా.. కొంత కాలంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఈ– స్టాంపుల కుంభకోణం, సీనియర్ నేతల మధ్య సమన్వయ లోపం, మద్యం షాపుల టెండర్లు, తదితర పరిణామాల నేపథ్యంలో అమిలినేని ప్రతిష్ట మసకబారింది. ఈ క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి టీడీపీ అధిష్టానం ప్రాధాన్యత తగ్గించిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఏడాదిన్నర కాలంలోనే చంద్రబాబు సర్కారుపై సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబావుటా ఎగురవేసి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
రికార్డుల డిజిటలైజేషన్ ప్రారంభించాం
● కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆనంద్అనంతపురం అర్బన్: ‘జిల్లాలో 22ఏ (నిషేధిత భూముల) అంశం తీవ్రంగా ఉండింది. రెవెన్యూ రికార్డులుగా సరిగ్గా లేవు. దీంతో రికార్డుల డిజిటలైజేషన్ ప్రారంభించాం.’ అని విజయవాడలో జరుగుతున్న ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఓ.ఆనంద్ వివరించారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి రెండోరోజు గురువారం నిర్వహించిన కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వినియోగంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సర్వే నంబర్ లైబ్రెరీని తయారు చేశామన్నారు. రెవెన్యూ ఆఫీస్ టూల్ తయారు చేసి యూజర్లకు అనువుగా మార్చామని తెలియజేశారు. గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల లైబ్రెరీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. -
రాష్ట్ర స్థాయి కౌశల్ క్విజ్ పోటీలకు 12 మంది ఎంపిక
అనంతపురం సిటీ: ఈ నెల 27న తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన మండలి, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కౌశల్ క్విజ్ పోటీలకు జిల్లాక చెందిన 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో కేజీ నిఖిత (జెడ్పీహెచ్ఎస్, దోసలుడికి), ఎన్.నవీన్కుమార్, ఎం.ఓంకార్, తరుణ్ (కల్లిమఠం మున్సిపల్ హైస్కూల్, రాయదుర్గం), పసుపులేటి భార్గవి, పల్లె భవ్యశ్రీ (ఏపీఎంఎస్, తాడిపత్రి), ఎన్.అజయ్ప్రదీప్ (జెడ్పీహెచ్ఎస్, పోర్ట్ గుత్తి), ఎన్.లిఖిత (కేజీబీవీ, శింగనమల), ఎం.కల్పన (కేజీబీవీ, బుక్కరాయసముద్రం), ఎం.కమల్ వలి (ఏపీఎంఎస్, యాడికి), హెచ్.సందీప్ (ఎంపీయూపీఎస్, యలవగలవంక, బెళుగుప్ప మండలం), జరిపిటి అవంతిక (ఎంపీయూపీఎస్, మహమ్మదాబాద్ క్రాస్) ఉన్నారు. వీరిని అభినందిస్తూ అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన సభలో ప్రశంసాపత్రాలను డీఈఓ ప్రసాద్బాబు అందజేసి, మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి గంధమనేని శ్రీనివాసులు, కౌశల్ జిల్లా సమన్వయకర్త ఆనంద భాస్కర్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు వసంతరాణి, రాము, సూరిబాబు పాల్గొన్నారు. -
●మత్తులో సొమ్మ సిల్లి..
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం ఉదయం ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి సొమ్మసిల్లి పోయాడు. స్థానికులు లేపడానికి ప్రయత్నించినా చలనం లేకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ముఖంపై నీళ్లు కొట్టి లేవడానికి శత విధాల ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానికుల సాయంతో అతి కష్టంపై ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెల్లవారుజామునే విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతోందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. గత వారంలో ఇలాంటి ఘటనలు ఆరేడు జరిగాయి. -
మార్పులకనుగుణంగా బోధన సాగించాలి
● ఇంటర్ విద్య ఓఎస్డీ రమేష్ అనంతపురం సిటీ: ఇంటర్మీడియట్ విద్య, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం నూతన సంస్కరణలను తీసుకువచ్చిందని, వీటికి అనుగుణంగా బోధనలో ముందుకు సాగాలని అధ్యాపకులకు ఇంటర్ విద్య ఓఎస్డీ రమేష్ సూచించారు. అనంతపురంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో డీవీఈఓ వెంకటరమణానాయక్ అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆర్ఐఓ సురేష్బాబుతో కలసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 12 ఏళ్ల తరువాత ఇంటర్ విద్యలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్టుగా మార్పు చేశారన్నారు. దీంతో మ్యాథ్స్ పరీక్షల్లో వంద మార్కులకు ఒక్కటే పేపర్ఉంటుందని, కనిష్టంగా 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేయగా, మొదటి సంవత్సరంలో 85 మార్కులకు పరీక్ష ఉంటుందని, అయితే 29 మార్కులు, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాస్ అయినట్లేనని వివరించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కులు చొప్పున ప్రాక్టికల్స్, గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్షలు రాయనున్న వారికి కొత్త మార్పులు వర్తించవన్నారు. కొత్తగా ఎలక్ట్రివ్ సబ్జెక్టు విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం, ఏ గ్రూపు విద్యార్థులనైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసలుబాటు కల్పించిందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రధానాచార్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
తీవ్రంగా నష్టపోతారు
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంకల్పించి.. కొన్నింటిని పూర్తి చేశారు. విద్యా ర్థుల భవిష్యత్తు, పేదలకు అత్యుత్తమ వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పీపీపీని ఉపసంహరించు కోవాలి. – మల్లికార్జుననాయక్, పీజీ విద్యార్థి, ఎస్కేయూ -
ఏసీబీ డీఎస్పీగా ప్రసాద్రెడ్డి బాధ్యతల స్వీకరణ
అనంతపురం సెంట్రల్: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేస్తే అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ ప్రసాద్రెడ్డి సూచించారు. గురువారం నగరంలోని ఏసీబీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీ ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత సేవల కోసం ప్రభుత్వం 1064 టోల్ఫ్రీ, 9440446181 డీఎస్పీ నంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఫిర్యాదుదారులు ధైర్యంగా ముందుకు రావాలని, అప్పుడే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు జయమ్మ, మోహన్ప్రసాద్, హమీద్ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు. -
చంద్రబాబుకు పతనం తప్పదు : సీపీఐ
అనంతపురం అర్బన్: ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న సీఎం చంద్రబాబుకు పతనం తప్పదని సీపీఐ నాయకులు హెచ్చరించారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చంద్రబాబు నోట వచ్చే వరకూ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యకళాశాలలను 100 శాతం ప్రైవేటీకరిస్తూ జీఓ 590ని విడుదల చేశారని, తక్షణమే జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆస్తులను, ఆదాయాన్ని కారొరేట్లకు కట్టబెడుతున్నారని దుమ్మెత్తిపోశారు. ధర్నాలో నాయకులు శ్రీరాములు, రమణ, అల్లీపీరా, రాజేష్యాదవ్, నరేష్, కుళాయిస్వామి, పద్మావతి, చిరంజీవి, కృష్ణుడు, జయలక్ష్మి, యశోదమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం కళ్లు తెరవాలి
ప్రభుత్వ నిధులతో నిర్మించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఫీజులు భారీగా పెరిగి వైద్య విద్య అందుబాటులో ఉండదు. వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు అధికంగా పాల్గొని ప్రభుత్వంపై వ్యతిరేకత చాటారు. ప్రైవేటీకరణపై గవర్నర్ తుదినిర్ణయం తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరవాలి. – రామ్చరణ్, మెడికల్ విద్యార్థి, ఉద్దేహాళ్ -
ఆయకట్టు స్థిరీకరణ ఎన్నడో?
బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ ఆయకట్టు స్థిరీకరణ నేటికీ కలగానే మిగిలింది. ఉమ్మడి జిల్లాలో కరువు కాటకాలను శాశ్వతంగా పారదోలడమే లక్ష్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. 2004–05 మధ్య కాలంలో అత్యల్ప వర్షపాతంతో జిల్లాలో కరువు విలయతాండవం చేసింది. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ రాజశేఖర్రెడ్డి.. తాము అధికారంలోకి వస్తే హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి, జీడిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని పేర్కొన్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. 2005లో రూ.వంద కోట్ల నిధులు కేటాయించి సుమారు 8.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో 1.67 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జీడిపల్లి రిజర్వాయర్ను నిర్మించారు. అదే సమయంలో 2009 నాటికి హంద్రీనీవా ప్రాజెక్ట్కు సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేయించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి ఏడు లిఫ్టుల ద్వారా 2012 నుంచి నిరంతరంగా జీడిపల్లికి కృష్ణా జలాలు వస్తున్నాయి. రిజర్వాయర్ గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకోగానే తూము ద్వారా కొంత, మరువ ద్వారా మరికొంత నీటిని దిగువన ఉన్న పీఏబీఆర్కు వదులుతున్నారు. దశాబ్ద కాలంగా హంద్రీనీవా రెండో దశ కాలువకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టు స్థిరీకరణ జరిగితే సస్యశ్యామలమే నిండు కుండను తలపిస్తున్న జీడిపల్లి రిజర్వాయర్ 2012 నుంచి రిజర్వాయర్కు కృష్ణాజలాల రాక ఆయకట్టు స్థిరీకరణకు దశాబ్ద కాలంగా ఎదురు చూపు జీడిపల్లి రిజర్వాయర్ పరిధిలోని బెళుగుప్ప పరిసర ప్రాంతాల్లోనే 30 వేల ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉంది. అయితే మండలంలో ఒక్క బెళుగుప్ప, శీర్పి చెరువులు మినహా గంగవరం, బ్రాహ్మణపల్లి, శ్రీరంగాపురం, గుండ్లపల్లి, కోనాపురం, నరసాపురం చెరువులకు రిజర్వాయర్ నుంచి నీరు అందించడంతో పాటు ఆయకట్టును సాగులోకి తీసుకువస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. -
చెరువు మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న రైతులు
● ప్రశ్నించిన బాధితులకు బెదిరింపులు ● అధికారుల తీరుపై తోపుదుర్తి చందు మండిపాటు రాప్తాడు రూరల్: అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకుండా రాప్తాడు మండలం హంపాపురం చెరువు నుంచి అక్రమంగా సాగిస్తున్న జీడ (మట్టి) తరలింపును స్థానికులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఓ నాయకుడు కొన్ని రోజులుగా చెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. దీనికి నీటి పారుదల శాఖ అధికారుల నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి కాని ఎలాంటి అనుమతులు పొందలేదు. పైగా గ్రామ పంచాయతీకి రాయల్టీ సైతం చెల్లించకుండా రోజూ పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ రైతులు తిరగబడ్డారు. దీంతో బుధవారం ఉదయం చెరువులోకి గ్రామస్తులు వెళ్లి మట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. ఊరి అవసరాలకు వినియోగించుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, అలాకాకుండా అమ్ముకోవడానికి ఎలా తరలిస్తారని నిలదీశారు. మట్టి తవ్వేందుకు ఉన్న అనుమతులు చూపించాలని అడిగారు. దీంతో మట్టి తరలింపును ఆపేశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మళ్లీ తరలింపులను కొనసాగించారు. సమాచారం అందుకున్న రైతులు సాయంత్రం వెళ్లి చెరువు నుంచి జాతీయరహదారికి వెళ్లే మార్గంలో టిప్పర్లను అడ్డుకుని అక్కడే రోడ్డుమీద అన్లోడ్ చేయించారు. అదే సమయంలో అడ్డుకున్న రైతులకు పోలీసులు ఫోన్ చేసి స్టేషన్కు రావాలంటూ హుకుం జారీ చేశారు. అనంతరం అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో తోటలకు నీరు పెట్టేందుకు వెళుతున్న కొందరు రైతులపై దాడులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గురువారం సంతోష్, సుధాకర్, మోహన్ తదితరులు రాప్తాడు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. తమపై అకారణంగా దాడి చేశారని, విచారించి చట్టపరంగా చర్యలు కోవాలని కోరారు. మట్టిని అమ్ముకుంటుంటే పట్టించుకోరా? సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి గురువారం సాయంత్రం రాప్తాడు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ అధికారితో మాట్లాడారు. బుక్కచెర్లలో అమ్మవారి దేవాలయం కోసం మట్టి తోలుకుంటుంటే కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటికీ జేసీబీ స్టేషన్లోనే ఉందన్నారు. మరి హంపాపురంలో ఎలాంటి అనుమతులు లేకుండా నెలల తరబడి మట్టిని అక్రమంగా తరలిస్తున్నా కనీస చర్యలు ఎందుకు తీసుకోలేక పోతున్నారని నిలదీశారు. పార్టీలకు అతీతంగా రైతులు అడ్డుకున్నారన్నారు. జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు, ఉద్యోగులే సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు గంగుల సుధీర్రెడ్డి, మామిళ్లపల్లి అమర్నాథ్రెడ్డి, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, పార్టీ మండల కన్వీనర్ సాకే వెంకటేష్, రాప్తాడు జయన్న, హంపాపురం కేశవరెడ్డి, మల్లికార్జున, శింగారప్ప, చిరుతల నాగేంద్ర, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ లక్ష్మన్న ఉన్నారు. -
నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టండి
కూడేరు: ‘తెగుళ్ల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. అయితే నకిలీ విత్తనాలు, ఎరువులను అధికారులుగా మీరు, మీ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతున్నారు’ అని సీఎం కార్యాలయ తరఫున వచ్చిన అధికారి పార్వతి, జిల్లా ఉద్యానాధికారి ఉమాదేవిని రైతులు నిలదీశారు. ‘బ్యాడిగి మిరపకు తెగుళ్లు – నివారణ చర్యలు’ అంశంపై గురువారం కూడేరు మండలం ముద్దలాపురంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని వివిధ గ్రామా ల రైతులు హాజరయ్యారు. తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తుండగా పలువురు రైతులు అడ్డుకుని నకిలీ విత్తనాలు, ఎరువులతో తామేలా నష్టపోతున్నది ఏకరవు పెట్టారు. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను సంధించడంతో సమాధానం చెప్పలేక అధికారులు తటపటాయించారు. చివరకు ఈ విషయంపై సీఎం కార్యాలయానికి నివేదిక అందజేస్తామని భరోసానిచ్చారు. అనంతరం మిరపలో ఆశించే తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో మండల ఎంపీఈఓ యాస్మిన్, ఎంపీఈఓలు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.


