అనంతపురంలోని తాడిపత్రి బస్టాండ్లో పండుగ సరుకుల కొనుగోలుదారులతో కిక్కిరిసిన దృశ్యం అరటి, మామిడి ఆకులు, వేపపూత కొంటున్న ప్రజలు
అనంతపురం కల్చరల్ : జిల్లా అంతటా ఉగాది సందడి నెలకొంది. విశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు చెపుతూ ‘పరాభవ’కు స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. సంవత్సరాది తొలి పంటలతో మమేకమై షడ్రుచుల సమ్మేళనంగా పలకరించనుంది. మామిడి, అరటి ఆకులు, వేపపూత, పూలు, పండ్లు, కూరగాయలు, వస్త్ర కొనుగోళ్లతో అనంతపురంలోని దుకాణాలు కిటకిటలాడాయి. పండుగ వేళ ఆలయాలు శోభాయమానంగా ముస్తామయ్యాయి. ప్రత్యేక పూజలు– కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేశారు.


