కూడేరు: ఉగాది పండుగ నేపథ్యంలో కూడేరు మండలం కొర్రకోడులో గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు పోటాపోటీగా సాగాయి. 14 జతల వృషభాలను పోటీకి రైతులు తీసుకువచ్చారు. బొమ్మనహళ్ మండలం గోవిందవాడ గ్రామ రైతు గురుస్వామి వృషభాలు ప్రథమ స్థానంలో నిలవగా, అదే గ్రామానికి చెందిన రైతు నరసింహులు వృషభాలు ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. మూడో స్థానంలో విడపనకల్లు మండలం పెంచలపాడుకు చెందిన రైతు భీమలింగ వృషభాలు, నాల్గో స్థానంలో బొమ్మనహళ్ మండలం లింగాదహళ్కు చెందిన వృషభాలు, ఐదో స్థానంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ రైతు మస్తానయ్య వృషభాలు, ఆరో స్థానంలో పత్తికొండ మండలం పులికొండ గ్రామ రైతు మాధవరాజులు వృషభాలు, ఏడో స్థానంలో వజ్రకరూరు మండలం ధర్మపురికి చెందిన రైతు అజిత్కుమార్ వృషభాలు, ఎనిమిదో స్థానంలో బొమ్మనహళ్ మండలం ఉద్దేహళ్కు చెందిన బసన్న వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు.


