నేత్రపర్వంగా నెట్టికంటుడి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా నెట్టికంటుడి రథోత్సవం

Mar 21 2026 5:08 AM | Updated on Mar 21 2026 5:08 AM

గుంతకల్లు రూరల్‌: ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ పురవీధులు పోటెత్తాయి. ఆంజనేయ రక్షమాం.. పవన పుత్ర పాహిమాం అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం పొందారు. శుక్రవారం వేకువజామునే నెట్టికంటి ఆంజనేయస్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పుష్పాలతో అలకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం ఎదుట రథాన్ని నిలిపి రథాంగహోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేసి ఆలయ పురవీధుల్లో భక్తులు లాగారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మరూరు జయరాం కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement