breaking news
Srikakulam
-
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: టెక్కలి నుంచి నౌపడ వెళ్లే దారిలో తలగాం సమీపంలో శనివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. టెక్కలి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇజ్జువరం పంచాయతీ రాజగోపాలపురం గ్రామానికి చెందిన ఇజ్జువరపు అప్పన్న(43) శుక్రవారం రాత్రి పలాసలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలక్ష గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నడిచివస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అప్పన్న అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి అనంతరం మార్చురికీ తరలించారు. అప్పన్నకు భార్య పార్వతి, కుమారుడు కార్తీక్, కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ విజయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అరాచకం తప్ప అభివృద్ధి ఏదీ..?
వజ్రపుకొత్తూరు/వజ్రపుకొత్తూరు రూరల్: వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి అజెండాగా పనిచేస్తే ఈ ప్రభుత్వం మాత్రం అరాచకాలు సాగిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. కాశీబుగ్గ పోలీసులు ఆయనను శనివారం సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంపై విషం చిమ్ముతోందని దుయ్యబట్టారు. ఉన్నత చదువులు చదివి వైద్యునిగా సేవలందించి ఈ ప్రాంత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో వైఎస్ జగన్ వెంట అడుగులు వేశానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామన్నారు. కిడ్నీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రూ.700 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టుతో ఇంటింటికీ శుద్ధ జలాలు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. డిగ్రీ కాలేజీ, రోడ్ల విస్తరణ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గతంలో పలాసలో డోకి హరీష్కు న్యాయం జరగాలని అడిగినందుకు కేసు పెట్టారని, బాధితుల తరఫు న పోరాడడం కూడా నేరమేనా అని ప్రశ్నించా రు. ప్రత్యేక హోదా, తిత్లీ పరిహారం, పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని అడిగినందుకు కేసులు పెట్టారని, బాలికపై జరిగిన దాడిని నిలదీసినందుకు, వైఎస్సార్ కిడ్నీ ఆస్పత్రి బోర్డు తొలగిస్తే ప్రశ్నించినందుకు కూడా కేసులు పెట్టడం ప్రభుత్వ నీతి మాలిన చర్య అని అన్నా రు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత మానసికంగా వేధించినా తన కమిట్మెంట్ను మార్చలేరని అన్నారు. ఇటీవల కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వ రస్వామి ఆలయ తొక్కొసలాట ఘటనపై నిలదీసినందుకు మరో కేసు పెడతారేమోనని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నాయా అని నిలదీశారు. వైఎస్ జగన్ పాలనలో జరిగిన శంకుస్థాపనలే మళ్లీ మళ్లీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో పలాసకు ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకు వచ్చారా.. ఏ ప్రాజెక్టు తీసుకు రావాలో ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా అక్రమ అరెస్టులు, అన్యాయాలు చేయడం సరికాదన్నారు. బాలికపై అత్యాచారం చేసిన వారిని వదిలేసి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధించడం ఏమిటని నిలదీశారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తుందని, తాము అభివృద్ధి మీదే దృష్టి పెడతామని అన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర నేతలు పాలిన శ్రీనివాసరావు, రాష్ట్ర ఇంటిలెక్చువల్ నేత ఎం. మన్మధరావు, బోర బుజ్జి, మాజీ ఏఎంసీ చైర్మన్ పీవీ సతీష్, వైఎస్సార్సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదయ్కుమార్, దున్న బాలరాజు, చింత హేమారావు, నియోజకవర్గ విద్యార్థ్ధి విభాగం అధ్యక్షుడు బమ్మిడి సంతోష్కుమార్, వజ్రపుకొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు తిర్రి రాజారావు, పైల అప్పారావు, చింత రాజు, పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీ విద్యార్థినికి వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
శ్రీకాకుళం: రిమ్స్లో చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థి ని చిత్తరపు వందనను వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, నాయకులు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థి వందన మాట్లాడుతూ ప్రిన్సిపాల్ చిత్రహింసలకు గురుచేస్తూ కులం పేరుతో దూషించిందని, వీటిని తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వాపోయింది. విద్యార్థిని తల్లి లక్ష్మి మాట్లాడుతూ తన బిడ్డకు జరిగినా అన్యాయంపై ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాగోలు మాజీ సర్పంచ్ యడ్ల గురుమూర్తి, రాష్ట్ర ఎస్సీ విభాగం సంయుక్త కార్యదర్శి పెయ్యిల లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నీలాపు ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణపై పోరాటం ఉద్ధృతం చేద్దాం
● 12న నియోజకవర్గాల వారీగా ర్యాలీలు ● పోస్టర్ ఆవిష్కరణలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టనున్న ప్రజా పోరాటాన్ని ఉద్ధృతం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు. ఈ నెల 12వ తేదీ బుధవారం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించ తలపెట్టిన భారీ నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ నెల 12న నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం అధికారులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యం, విద్య హక్కుపై జరుగుతున్న ఈ దాడిని వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని, ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపించామన్నారు. పోరాట కార్యాచరణ పోస్టర్ ఆ విష్కరణ అనంతరం ధర్మాన కృష్ణదాస్ పార్టీ ము ఖ్య నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహణపై సమీక్షించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కళింగకుల బీ సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబా బు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు చల్ల శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, యువనేత ధర్మాన రామ్మనోహర్నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, చిట్టి జనార్ధనరావు, ఎంఏ బేగ్, రౌతు శంకరరావు, బోర చిన్నారావు, కొయ్యా న నాగభూషణరావు, యాళ్ల నారాయణమూర్తి, తేజ, వెంకట్, తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య
నందిగాం: తురకలకోట గ్రామ సమీప తోటలో శనివారం ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తురకలకోట గ్రామానికి చెందిన మేఘవరం వెంకటరావు(38) బెంటుగేటు వద్ద పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. యజమాని వద్ద రూ.30వేలు అప్పుగా తీసుకున్నాడు. అనంతరం అక్కడ పని మానేశారు. అప్పు తీర్చలేకపోవడంతో యజమాని వేధింపులు భరించలేక శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడని, చివరకు తోటలో ఉరివేసుకున్నాడ ని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు వెంకటరావు భార్య నీలవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ షేక్ మహ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్సాహంగా ఫెన్సింగ్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: రాజమండ్రి వేదికగా ఈ నెల 11న జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఫెన్సింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలభద్రుని రాజా పిలుపునిచ్చారు. శ్రీకాకుళం టౌన్ హాల్ వేదికగా శనివారం జిల్లా స్థాయిలో సీనియర్స్ ఫెన్సింగ్ పోటీలు నిర్వహించారు. బహుజన నేత డాక్టర్ కంఠ వేణు, పూర్వపు అధ్యక్షుడు వైశ్యరాజు మోహన్ ఇతర అసోసియేషన్ సభ్యులతో కలసి రాజా ఈ పోటీలను ప్రారంభించారు. అనంతరం కోచ్ల పర్యవేక్షణలో బాల, బాలికల ఎంపికలు జరిగాయి. ఎన్.ఐ.ఎస్ కోచ్ జోగిపాటి వంశీ న్యాయ నిర్ణేతగా వ్యవవహరించారు. కార్యక్రమంలో జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు భవానీ, సంపతిరావునాయుడు, పీఈటీ, పీడీలు, కోచ్లు రాహుల్, హేమంత్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా అయ్యప్పస్వామి అంబలం పూజ
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో మాజీ స్పీకర్ తమ్మి నేని సీతారాం నివాసంలో ఆయన కుమారుడు చిరంజీవినాగ్ నేతృత్వంలో శనివారం అయ్యప్పస్వామి అంబలం పూజ ఘనంగా నిర్వహించారు. అరటిచెట్లతో అంబులం ఏర్పాటు చేసి అయ్యప్ప, వివిధ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. పురోహి తులు రాజేష్శర్మ స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. సీతారాం, వాణమ్మ దంపతులు అయ్యప్పస్వామి ఆలయానికి శాశ్వత విరాళంగా రూ.30వేలను యడ్ల రమణయ్యస్వామి, తంబిస్వామిలకు అందజేశారు. సుమారు 300 మంది అయ్యప్ప భక్తులకు భి క్ష ఏర్పాటు చేశారు. 20 మంది గురుస్వాములు, గురుభవానీలకు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కాలింగ కుల అధ్యక్షుడు దుప్పల లక్ష్మణరావు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. -
ఘనంగా భక్త కనకదాసు జయంతి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్త కనసాదాసు 516వ జయంతి వేడుకలు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనకదాసు నరసింహ స్తోత్రం, రామధ్యాయ మంత్రం, మోహన తరంగిని అనే కవిత్వాలను రచించినట్లు వివరించారు. నలచరిత్ర, హరిభక్తిసార, తదితర రచనలను కన్నడంలో రచించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
వెలమ కులాన్ని బీసీ–ఏలోకి మార్చాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): బీసీ–డీలో ఉన్న వెలమ కులస్తులను బీసీ–ఏలోకి మార్చాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి గంగు మన్మధరావు కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర కులస్తులకు రిజర్వేషన్ కల్పించ డం పట్ల తాము వ్యతిరేకం కాదని, తమ కులానికి న్యాయం చేయాలని కోరుతున్నామని చె ప్పారు. విద్య, ఉద్యోగావకాశాలు కూడా తగిన స్థాయిలో రాకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయస్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 బాలుర క్రికెట్ పోటీలకు జిల్లాకు చెందిన తుంగాన జ్యోష్మిత్ ఎంపికయ్యాడు. శ్రీకాకుళం కేంద్రంగా ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ క్రికెట్ పోటీల్లో అత్యుత్తమ ఆటతీరుతో రాణించడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. డిసెంబర్ 5 నుంచి 9 వరకు హర్యానా రాష్ట్రం రోతక్లో జరగనున్న జాతీయస్థాయి స్కూల్గేమ్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. జ్యోష్మిత్ తండ్రి తుంగాన ఆనందరావు ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కాగా, తల్లి సునీత గృహిణి. జ్యోష్మిత్ ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలోని ఆర్సీఎం సెయింట్ జాన్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. -
ప్రథమ చికిత్స
ఆర్టీసీకి కావాలి.. శ్రీకాకుళం–పాతపట్నం ఆర్డీనరీ బస్సులో ఖాళీగా ఉన్న బాక్సు మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సుల్లో 25 రకాల మెడికల్ కిట్లు అందుబాటులో ఉండా లి. యాంటీ సెప్టిక్ క్రీమ్, లిక్విడ్, ప్యా డ్లు, గాయాలపై అంటించేందుకు స్టెరిలైజ్డ్ ఎలాస్టిక్ బాండ్, వాటర్ ప్రూఫ్ బ్యాండేజ్, అయోడిన్, దూది, నొప్పి నివారణ మాత్రలు, చేతి గ్లవ్స్, శానిటైజర్ తదితర మెడికల్ వస్తువులు తప్పనిసరి గా ఉంచాలి. వీటితో పాటు ప్రథమ చికిత్స ఎలా చే యాలో డ్రైవర్, కండక్టర్లకు అవగాహన కల్పించాలి ఆస్పత్రులకు పరుగుతీయాల్సిందే.. జిల్లాలో శ్రీకాకుళం–1, 2 డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపోలు ఉన్నా యి. వీటి పరిధిలో సుమారు 360కు పైగా బస్సులు ఉన్నాయి. ప్రతి రోజూ సుమారు 45 వేలకు పైగా ప్రయాణికు లు రాకపోకలు సాగిస్తున్నారు. ఆయా బస్సు ల్లో ప్రయాణం చేస్తున్నపుడు మార్గం మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. ప్రథమ చికిత్స పెట్టెలు అలంకార ప్రాయంగా మారడంతో వెంటనే సమీప ఆస్పత్రులకు పరుగు లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి బస్సుల్లో పూర్తిస్థాయిలో ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులో ఉంచాల ని ప్రయాణికులు కోరుతున్నారు. -
శ్రీకాకుళం
ఆర్టీసీకి కావాలి ప్రథమ చికిత్స ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు పనిచేయడం లేదు. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. –8లోటెక్కలి రూరల్: మండలంలోని భీంపురం గ్రా మ సమీపంలో ఉన్న బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం వేకువజామున వసతి గృహం నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న వస తి గృహం సిబ్బంది టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగి న పోలీసు బృందం టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఒంటరిగా ఉన్న విద్యార్థిని గుర్తించారు. వసతి గృహం నుంచి బయటకు రావడానికి గల కారణాలపై ప్రశ్నించారు. అయితే ఆమె నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. వందలాది మంది ఉన్న మహిళ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల భద్ర త ప్రశ్నార్థకంగా మారుతోంది. వజ్రపుకొత్తూరు: పూండి– గోవిందపురం ఉన్న త పాఠశాల ఆవరణలో రాష్ట్ర స్థాయి 69వ అథ్లెటిక్స్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్పాస్ట్ నిర్వహించారు. స్థాని క పాఠశాల హెచ్ఎం, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసి యేషన్ కన్వీనర్ కె.హరిబాబు అద్యక్షతన జరిగి న ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మొదటి రోజు నిర్వహించిన 80 మీటర్ల హర్డిల్స్, 100, 400 మీటర్లు పరుగు పందెం, షాట్పుట్, హైజంప్ విభాగా ల్లో అండర్–14 క్రీడాకారులు శ్రీకాకుళం, విజ యనగరం, విశాఖ, ఈస్ట్ , వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి విజయం సాధించారు. శ్రీకాకుళం క్రైమ్ : పొందూరు కేజీబీవీలో ఇంటర్మీడియెట్ చదువుతున్న దళిత విద్యార్థినిని కులం పేరిట అసభ్యంగా మాట్లాడి ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించేలా చేసిన అక్కడి ప్రిన్సిపల్ సీపాన లలితకుమారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అంతేకాక విద్యార్థినిని బెదిరించినందుకు ప్రిన్సిపాల్పైనే కాక జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ) సంపతిరావు శశిభూషణ్పై బెదిరింపుల కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు అధికారైన శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద శనివారం రాత్రి వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 19న విద్యార్థిని ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేక వసతి గృహం భవనంపై నుంచి దూకేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రిన్సిపాల్, ఏపీసీలు బెదిరించడంతో తాను ప్రమాదవశాత్తు పడిపోయానని చెప్పాల్సి వచ్చిందని బాలిక ఇటీవల మీడియా ముందుకు వచ్చి చెప్పింది. దాదాపు 2 నెలలుగా 2 కాళ్లకు 6 ఆపరేషన్లతో రిమ్స్లో చికిత్స పొందుతున్న బాలికకు వారినుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయం జరగకపోవడంతో మీడియా ముఖంగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రెస్మీట్ పెడితే కేసు, పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తే కేసు, ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తే కేసు.. బీసీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రజా వ్యతిరేక పాలనను గట్టిగా ఎండగట్టడమే కాకుండా సమస్యలపై నిలదీస్తున్నందుకు కేసులతో బెదిరించాలని చూస్తోంది. దానిలో భాగంగా గతంలో వచ్చిన ఫిర్యాదులపై నమోదు చేసిన కేసును తిరగ దోడి, తాజాగా మరో కేసు జోడించి ఇబ్బంది పెట్టా లని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పెద్దలపై గట్టిగా మాట్లాడుతున్నారని, పోలీసు అధికారుల వైఖరిని దుయ్యబడుతున్నారని మత్స్యకార సామాజికి వర్గానికి చెందిన అప్పలరాజుపై ఫిర్యాదులు చేయించి, కేసులపై కేసులు మోపాలని ప్లాన్ చేస్తోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా నిలదీస్తు న్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై రోడ్డెక్కి గళమెత్తుతున్నారు. క్యాడర్తో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టి వేధిస్తుంటే నేనున్నానంటూ పోలీస్ స్టేషన్లకు వెళ్లి నిలదీస్తున్నారు. చంద్ర బాబు, లోకేష్, పవన్ కల్యాణ్తో పాటు జిల్లా పోలీ సు అధికారుల తీరుపై మండిపడటాన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. పాలనా వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేలా చేస్తున్న సీదిరి అ ప్పలరాజును ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఇటీవల లోకేష్ జిల్లాకొచ్చిన ఇచ్చిన ఆదేశాలతో ఆ యత్నాలకు మరింత పదును పెట్టింది. దానిలో భాగంగా పాత కేసులు తిరగదోడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రెండు రోజుల కిందట కాశీబుగ్గ వ్యాపారి కిడ్నాప్కు సంబంధించిన విషయమై పోస్టు పెట్టారని శిష్టు గోపి అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తను కవిటిలో రాజకీయంగా ఇచ్చిన ఫిర్యాదుపై అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అక్కడికి వెళ్దామని బయలుదేరే లోపు 2024 అక్టోబర్ 27న నమోదైన కేసును తెరపైకి తెచ్చి, హుటాహుటీన 41నోటీసు ఇచ్చారు. ఆ కేసు నమో దైన రోజున సీదిరి మాట్లాడుతూ ‘మైనర్ బాలికపై దాడి చేసిన వ్యక్తులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేస్తే తప్ప ఇలాంటి ఘటనలు జరగవు. సక్రమంగా చర్యలు తీసుకోకపోవ డం వలన పునరావృతం అవుతున్నాయి. స్టేషన్ లోపల దాడి చేసిన వ్యక్తులపై సాయంత్రం లోగా హత్యాయత్నం కేసు పెట్టాలి. కేసులు పెట్టకపోతే ఇక్కడొక పోలీసు స్టేషన్ ఉందని భావించలేము’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ విషయమై పలాస మండలం కిష్టుపురం గ్రామానికి చెందిన బూర్లె విజయ కృష్ణంరాజు వ్యూహాత్మకంగా ఫిర్యాదు చేయడం, దాని ఆధారంగా అప్పలరాజుపై 352, 353(డీ(బీ), 351(2), 353(2)బీఎన్ఎస్ సెక్షన్ల కింద నమోదు చేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడా కేసును తెరపైకి తెచ్చి శనివారం సీదిరి అప్పలరాజు ఇంటికి పోలీసులు వచ్చి 41 కింద నోటీసు ఇచ్చారు. వెంటనే పోలీసు స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరు కావాలని కోరారు. ఆయన వచ్చేంతవరకు పోలీసులు అక్కడే ఉన్నారు. దీంతో పోలీసు స్టేషన్కు వెళ్లి విచారణలో పాల్గొన్నారు. శనివారం పొద్దు పోయే వరకు విచారణ జరుగుతూనే ఉంది. రాత్రి 9.30 గంటల సమయంలో సీదిరి అప్పలరాజు, శిష్టు గోపి ఇద్దరినీ ఆయా పోలీస్ స్టేషన్ల నుంచి విడిచిపెట్టారు. వజ్రపుకొత్తూరు రూరల్: మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు శనివారం ఉదయం మధ్యా హ్నం విచారణ పేరుతో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు వెళ్లి రాత్రి 8 గంటలు అవుతున్నా ఇంటికి చేరుకోకపోవడంతో అప్పలరాజు సతీమణి సీదిరి శ్రీదేవి కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. స్టేషన్లో ఒక సాధారణ వ్యక్తిని విచారించిన మాదిరిగా రాష్ట్రానికి ఒక మంత్రిగా పనిచేసిన విద్యావంతుడైన వైద్యుడిని స్టేషన్ రిసెప్షన్ వద్ద విచారణ చేస్తుండడాన్ని చూసిన ఆమె కన్నీటి పర్యంతమైంది. బిక్కుబిక్కుమంటూ ఏడ్చుకొని తన వద్దకు వచ్చిన ఆమెను డాక్టర్ సీదిరి అప్పలరాజు ఓదార్చి ధైర్యం చెప్పి, అక్కడి నుంచి పంపించారు. కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన సమయంలో అక్కడకు ముందుగా వెళ్లి, క్షతగాత్రులకు అండగా నిలిచింది సీదిరి అప్పలరాజు మాత్రమే. స్వతహాగా వైద్యుడు కావడంతో సీపీఆర్ తదితర తక్షణ వైద్య సేవలు అందించి కొందరి ప్రాణాలు కాపాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తన సేవలందించారు. దీంతో శభాష్ డాక్టర్ అప్పలరాజు అని ప్రజల నుంచి ప్రశంసలు అందాయి. మీడియాలో వచ్చిన కథనాలతో ప్రపంచ నలుమూలల నుంచి మాధ్యమాల ద్వారా అప్పలరాజు కు ప్రశంసలు వచ్చాయి. దీంతో ఆయన ప్రతిష్ట మరింత పెరిగింది. ఇప్పుడీ సమయంలో ఏదొ క కేసును బయటకి తీసుకొచ్చి హడావుడి చేస్తే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తనకొస్తున్న పేరును తగ్గించొచ్చని ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దానిలో భాగంగా పాత కేసులను తిరగదోడి ఇబ్బందులు పెట్టాలని కార్యాచరణ అమలు చేస్తోంది. -
బాలుడి కోసం కొనసాగుతున్న గాలింపు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి సమీపంలో పాత వంతెన పైనుంచి శుక్రవారం అర్ధరాత్రి నాగావళి నదిలో ఓ బాలుడు దూకేసిన సంగతి తెలిసిందే. గల్లంతైన అలుగోలు సాయి నేతాజి (17) కోసం శనివారం అగ్నిమాపక సహాయాధికా రి శ్రీనుబాబు ఆధ్వర్యంలో రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండో పట్టణ ఎస్ఐ లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాతీపేట శివాలయం వీధిలో నివసిస్తు న్న అలుగోలు ఉమాకోటేశ్వరరావు ఓ యూనివర్సిటీ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కుమారుడు సాయినేతాజీ, కుమార్తె ఉన్నా రు. ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఐటీఐ చదువుతున్న సాయినేతాజీ ఇంటికి ఆలస్యంగా రావడాన్ని తండ్రి గమినిస్తుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 10 గంటలకు బాలుడు రావడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురై క్షణికావేశంలో నదిలోకి దూకేశాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు. -
అండర్–19 రాష్ట్ర క్రికెట్ జట్టుకు చర్విశ్రీ ఎంపిక
శ్రీకాకుళం: అరసవిల్లి రోడ్డులోని శర్వాణి విద్యాల యలో 9వ తరగతి చదువుతున్న తమ్మిరాజు చర్వి శ్రీ అండర్–19 క్రికెట్ రాష్ట్ర జట్టుకు శ్రీకాకుళం జిల్లా తరఫున ఎంపికై ంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి టోర్నమెంట్కు జరిగిన ఈ ఎంపికల్లో జిల్లా నుంచి ఎంపికై న ఏకై క క్రీడాకారిణిగా నిలిచింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో నిర్వహించిన ఎంపిక మ్యాచుల్లో బౌలింగ్, బ్యాటింగ్లో మెరుగైన ప్రతిభ కనబరిచింది. త్వరలో జరగనున్న జాతీయ స్థాయి టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఆడనుంది. ఈ సందర్భంగా శర్వాణి విద్యా సంస్థల వ్యవస్థాపకులు అంధవరపు సూరిబాబు విద్యార్థిని శనివారం అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఆంజనేయులు, హెచ్ఎం కె.రేఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వైభవోపేతంగా సంకటహర చతుర్ధి
లక్షదీపారాధనలో భక్తులు ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనకొత్తూరు: మహసింగి గ్రామంలో వరాహలక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంకగా శనివారం సంకటహర చతుర్ధి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో స్వయంభూ విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, వ్రతాలు, హోమాలు జరిపించారు. కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. సాయంత్రం లక్ష దీపారాధన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త యాలాల శ్రీనివాసరావు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ చింతాడ ప్రసాదరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఈవో వాసుదేవరావు పాల్గొన్నారు. -
ముగిసిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారణ
సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విచారణ ముగిసింది. సుమారు ఏడు గంటల పాటు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో సీదిరి అప్పలరాజును పోలీసులు విచారించారు. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. కూటమి ప్రభుత్వ తప్పిదాలపై గతంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అప్పలరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఏడాది క్రితం కేసు నమోదు చేసి విచారణ కోసం తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల మధ్యలో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. 352,353(D)(b),351(2),353(2) BNS కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పోలీసుల నోటీసులకు స్పందిస్తూ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో విచారణకు అప్పలరాజు హాజరయ్యారు. -
అన్నదమ్ములు ఆదర్శనీయులు
రణస్థలం: లావేరు మండలంలోని కొత్త కుంకాం పంచాయతీలో మచ్చ రామారావు, గోవిందరావు, శంకర్ ముగ్గురు అన్నదమ్ములు కొత్త కుంకాం పాఠశాలకు కిచెన్ గార్డెన్ కోసం 58 సెంట్ల భూమి సాగు నిమిత్తం ఇవ్వడం ఆదర్శనీయమని లావేరు ఎంఈవో మజ్జి మురళీ కృష్ణ అన్నారు. పిల్లల మధ్యాహ్న భోజనానికి ఆకుకూరలు, కాయగూరలు సేంద్రియ పద్ధతుల ద్వారా పండించి స్కూల్కి అందిస్తున్నారు. ముగ్గురు అన్నదమ్ములు తమ పొలాన్ని సాగుకు ఇవ్వడమే కాకుండా సహకరిస్తున్నందుకు ఉపాధ్యాయులు సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు పొట్నూరు శ్రీనివాస్, తమ్మినేని నీలంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తరుగుతున్న తీరం..!
సుదీర్ఘ సముద్ర తీరం కోతకు గురవుతుందంటే అందుకు కారణం సరుగుడు చెట్లు, మడ అడవులు మాయం కావడమే. వీటికి రక్షణగా నిలిచే అటవీశాఖాధికారులు స్పందించి తీర ప్రాంతంలో ఉండే చెట్లును కాపాడాలి. మత్స్యశాఖ వారు తాటి వనాలు, సరుగుడు చెట్లు పెంచేందుకు కృషి చేయాలి. నా చిన్నతనం నుంచి చూస్తున్నా సముద్రం ఈ 20 ఏళ్లలో సుమారు రెండు వందల మీటర్లు ముందుకు వచ్చింది. – చీకటి కృష్ణ, మత్స్యకార యువకుడు, డొంకూరు, ఇచ్ఛాపురం మండలం తీర ప్రాంతంలో ఇసుక దిబ్బలు కోతకు గురికాకుండా తాటి వనాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. స్థానికుల సహకారంతో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సరుగుడు చెట్లు పెంచేందుకు సంబంధిత రైతులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతోంది. – వై.సత్యనారాయణ, డీడీ, మత్స్యశాఖ, శ్రీకాకుళం ఇచ్ఛాపురం రూరల్: ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో ప్రతిఏటా సముద్ర మట్టాలు స్వల్పంగా పెరుగుతున్నాయి. ఫలితంగా సముద్రం క్రమేపీ ముందుకొచ్చి తీరాలు తరిగిపోతున్నాయి. దీంతో ప్రకృతి అందాలు.. అలల సవ్వడలను తిలకించేందుకు వెళ్తున్న పర్యాటకులకు నిరాశ ఎదురవుతోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి నెల్లూరులోని తడా వరకు మత్స్యకార గ్రామాల భూములు నిత్యం కరిగిపోతున్నాయి. తీరం భారీగా కోతకు గురవుతోంది. వాయుగుండాలు, అల్పపీడనాలు, తుఫాన్లు ఏర్పడిన సమయంలో కోత అధికంగా ఉంటోంది. తాజాగా మోంథా తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరం పొడవునా సముద్రం కోతకు గురయ్యింది. ప్రతీ సంవత్సరం తీరంలోని భూమి సుమారు రెండు నుంచి మూడు మీటర్ల మేర కోతకు గురవుతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాయమవుతున్న తోటలు జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల తీర ప్రాంత భూములను గాలులతో, తుఫానులతో రక్షించే సరుగుడు తోటలు క్రమేపీ మయామైపోతున్నాయి. చెట్లు వేళ్లు బయటపడిపోయి నేలపట్టు కోల్పోయిన సరుగుడు చెట్లు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. అంతేకాకుండా అటవీశాఖాధికారుల అలసత్వం మూలంగా కొంతమంది కలప దొంగలు రహస్యంగా మడ అడవులు, సరుగుడు చెట్లను నరికేస్తుండడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. తీర ప్రాంతాల్లో సరుగుడు, తాటి వనాలు ఏర్పాటు చేయడం ద్వారా తీరాన్ని రక్షించుకోవచ్చని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. కానీ కొన్ని తీర ప్రాంతాల్లో ఇసుకాసురులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపడుతుండడం మూలంగా తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఉష్ణ మండల తుఫానులు, రుతు పవనాలు, వరదలు, సముద్ర మట్టం పెరుగుల తదితర కారణాలతో తీరప్రాంతం కోతకు గురవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
విజేతలై తిరిగి రావాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి పోటీల్లో సమష్టిగా రాణించి విజేతలై జిల్లాకు తిరిగిరావాలని సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు సాఫ్ట్బాల్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి వేదికగా ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్–2025 పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల బృందం శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై వెళ్లింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రీడా సామగ్రి, దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు, మెట్ట తిరుపతిరావు, ఎం.ఆనంద్కిరణ్, ఎ.ఢిల్లీశ్వరరావు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, కె.మాధవరావు, జి.శ్రీనివాసరావు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఘనంగా న్యాయసేవా దినోత్సవం
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్లో జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి పి.భాస్కరరావు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు తక్షణ న్యాయం, న్యాయసేవలు అందించడమే జాతీయ లోక్ అదాలత్ ముఖ్య లక్ష్యమన్నారు. ప్రజలకు అవగాహన లేకపోవడం చాలామందికి న్యాయం జరగడం లేదన్నారు. కార్యక్రమంలో స్థానిక న్యాయమూర్తులు 3వ అదనపు జిల్లా జడ్జి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, స్పెషల్ (పోక్సో) న్యాయమూర్తి ఎన్.సునీత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, అడిషనల్ సివిల్ జడ్జి ఆర్.శాంతిశ్రీ, ప్రిన్సిపాల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కె.అనురాగ్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.శివప్రసాద్, కార్యదర్శి పిట్టా దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం అర్బన్: ఏపీ పీటీడీ శ్రీకాకుళం జిల్లా జై భీమ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో ఎస్సీ, ఎస్టీ కమిటీ హాల్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జేవీ రావు, కార్యదర్శిగా ఏఎస్ చలం, వైస్ ప్రెసిడెంట్గా కె.అచ్చయ్య, జాయింట్ సెక్రటరీగా కె.సోములు, అసిస్టెంట్ సెక్రెటరీగా జె.ఉషారాణి, కోశాధికారిగా బీఎల్ నారాయణ, పబ్లిసిటీ సెక్రటరీగా పి.శ్రీను, కార్యవర్గ సభ్యులుగా కేఎం కుమార్, దాలయ్య, పీయూఎం రావు, కేఆర్ రావు, జి.శారద, ఆర్కే రావు, జీఆర్ రావు తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం శ్రీకాకుళం రెండో డిపో మేనేజర్ కేఆర్ఎస్ శర్మను అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో టెక్కలి డిపో సెక్రటరీ జీఎన్ భూషణ్, సీహెచ్ వెంకటరమణ, పీవీ ఆనంద్, జీఎస్ చలం, డి.శివాజీ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహేంద్రతనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి మెళియాపుట్టి, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం తదితర మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పురోగతిపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన దిశానిర్దేశం చేశారు. భూ సేకరణ ఇతర పనులకు సంబంధించిన పాత పెండింగ్ బిల్లులు దాదాపు రూ.16.20 కోట్లు తక్షణమే విడుదల చేయడానికి ప్రతిపాదనలు పంపాలని వంశధార భూసేకరణ విభాగాన్ని ఆదేశించారు. పలాస– పర్లాకిమిడి డైవర్షన్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ దాదాపు పూర్తయిందని, అర్హులైన వారికి చెల్లింపులను వేగవంతం చేయాలన్నారు. ప్యాకేజీలు, డబుల్ స్టోర్డ్ భవనాలు, డబుల్ చెల్లింపులు వంటి సమస్యలపై ఆర్డీవో, టెక్కలి, సంబంధిత తహసీల్దార్లు పూర్తిస్థాయి నివేదికలను త్వరగా సమర్పించాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్.వెంకటేష్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ప్రత్యేక ఉప కలెక్టర్ జయ దేవి, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
10 నుంచి సమ్మేటివ్ పరీక్షలు
నరసన్నపేట: పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు సమ్మేటివ్ ఎసెస్మెంట్– 1 పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 10వ తేదీ నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్లో విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలు 2,955 ఉండగా.. వాటిలో 2,64,804 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరితో పాటు ప్రైవేటు స్కూల్స్కు చెందిన విద్యార్థులు సైతం పరీక్షలు రాస్తారు. ఏ రోజు ప్రశ్నపత్రాలు ఆరోజు ఆయా మండలాల ఎంఈవోల వద్ద నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలను ఆయా మండలాల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేర్చారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు చెందిన విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 6, 7 తరగతులకు చెందిన విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆటో ఢీకొని వ్యక్తికి గాయాలు సారవకోట: మండలంలోని కుమ్మరిగుంట సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ గ్రామానికి చెందిన సారవకోట రమణ గాయపడ్డాడు. రమణ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సారవకోట వైపు నుంచి చల్లవానిపేట వైపు వెళ్తున్న ఆటో వెనుక నుంచి ఢీకొనడంతో గాయాలపాలైయ్యాడు. ఈయనను 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బొడ్డపాడులో అమరవీరుల వారోత్సవాలు
పలాస: మండలంలోని బొడ్డపాడులో అమరవీరుల వారోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సమాజ మార్పుకు కోసం తమ ప్రాణాలను బలిదానం చేసిన అమరులు వేగు చుక్కలై వెలుగొందుతారని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం, గోదావరి లోయ ప్రతిఘటనా పోరాటంలో అమరులైన వీరులను తలుచుకొని నివాళులర్పించారు. అనంతరం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. శ్రీకాకుళం ఉద్యమంలో అమరులైనవారిని ఆదర్శంగా తీసుకొని నేడు అనేక పోరాటాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం జిల్లా నాయకుడు గొరకల బాలకృష్ణ, ఇప్టూ జిల్లా కన్వీనర్ జుత్తు వీరాస్వామి, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు బదకల ఈశ్వరమ్మ, కార్యదర్శి ఎస్.కృష్ణవేణి, జగన్, వంకల పాపయ్య, ఎం.వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
బాలియాత్రకు బాలారిష్టాలు..!
జలుమూరు: ఎంతో ప్రాచీన సాంప్రదాయమైన బాలియాత్ర నిర్వహణకు అడుగులు పడుతున్న తరుణంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. గత మూడు నెలలుగా బాలియాత్రను ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని కోరుతూ నిర్వహణ కమిటీ సభ్యులు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్కు వినతులు ఇచ్చారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలాగే బాలియాత్ర సజావుగా జరిగేందుకు అన్ని అనుమతులు పొందిన తర్వాత ఇప్పుడు నదిలో నీరు ఉందనే కారణంతో దీపోత్సవం నదిలో కాకుండా ప్రత్యామ్నాయంగా చేసుకోవాలని అధికారులు చెప్పడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి నదిలో ఐదు అడుగుల నీరు ఉందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి భక్తుల భద్రత దృష్టా దీపాలు వద్దన్నారు. అయితే దీపాలు పెట్టుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేస్తే సమస్య ఉండదని కమిటీ సభ్యులు చెబుతున్నారు. అలాగే కనీసం నది వద్దకు వెళ్లే దారులు కూడా కనీసం అధికారులు వెడల్పు చేసేందుకు చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. స్టేజీ వద్దనే పార్కింగా..? యాత్రలో భాగంగా ఆలయం వెనుక భాగంలో స్టేజీను ఏర్పాటు చేసుకునేందుకు కమిటీ సభ్యులు నాయకులు, అధికారుల వద్ద తాత్కాలికంగా అనుమతి తీసుకున్నారు. దీంట్లో 40 అడుగుల వెడల్పుతో తెర ఏర్పాటు చేసి ప్రాచీన జానపద కళా నృత్యాలు, తప్పెట గుళ్లు తదితర కార్యక్రమాల నిర్వహణకు సిద్ధం చేసుకున్నారు. అయితే ఇంతలోనే అదేచోట వీఐపీలు 20 వరకు కారులు పార్కింగ్కు ఆ స్థలమే కావాలని, సాంస్కృతిక కార్యక్రమాలు వద్దని పోలీసులు చెప్పడంతో సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేసినట్లు సమాచారం. మరోవైపు ఈనెల 5వ తేదీన బాలియాత్ర ప్రారంభానికి కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి దంపతులు వచ్చి దీ పోత్సవం నిర్వహించారు. ఇది సహించని కూటమి నాయకులు అధికార పార్టీ నాయకులే ప్రారంభం చేయాలని ఆమెను అవమానించారు. దీంతో పవి త్ర కార్యక్రమానికి కూడా రాజకీయ రంగు పులుముతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈనెల 9వ తేదీన శ్రీముఖలింగంలో జరగనున్న బాలియాత్రలో పూర్తిస్థాయి బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. వంశధార నదిలో ప్రవాహం ఎక్కువ ఉన్నందున దీపోత్సవానికి అవకాశం లేదన్నారు. అయితే భక్తుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని సూచించారు. మూవింగ్ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని, నదికి వచ్చి, వెళ్లే మార్గాలు వేర్వేరుగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష సూచించారు. ఈ మేరకు శుక్రవారం శ్రీముఖలింగంలో అధికారులు, ఉత్సవ కమిటీతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అడుగడుగునా అవాంతరాలు రాజకీయ రంగు పులిమేందుకు యత్నాలు..? శ్రీముఖలింగం ప్రధాన దేవాలయం -
స్కూల్ గేమ్స్ క్రికెట్ ఛాంపియన్గా అనంతపురం
● రన్నరప్గా నిలిచిన తూర్పు గోదావరి శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 బాలికల క్రికెట్ ఛాంపియన్ షిప్ టైటిల్ను అనంతపురం కై వసం చేసుకుంది. రన్నరప్గా తూర్పుగోదావరి నిలవగా, విజయనగరం మూడో స్థానంలో, పశ్చిమ గోదావరి నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ/ఇంటర్మీడియట్ విద్య పరిధిలోని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన 69వ ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్ జిల్లాల) స్కూల్ గేమ్స్ బాలికల క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారంతో ముగిసింది. ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో 11 పరుగుల తేడాతో అనంతపురం జట్టు విజయకేతనం ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 69 పరుగులు చేసింది. 70 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన తూర్పుగోదావరి జట్టు 58 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు శుక్రవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఆతిథ్య శ్రీకాకుళం జిల్లా జట్టుపై విజయనగరం, విశాఖపట్నం జిల్లాపై పశ్చిమ గోదావరి జిల్లా జట్లు విజయం సాధించి సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో పశ్చిమ గోదావరిపై విజయం సాధించిన తూర్పు గోదావరి ఫైనల్కు దూసుకువెళ్లింది. అలాగే రెండో సెమిస్లో విజయనగరం జట్టుపై గెలుపొంది అనంతపురం జిల్లా ఫైనల్లోకి ప్రవేశించింది. కాగా మరో కీలకమైన మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో పశ్చిమ గోదావరిపై విజయనగరం జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లకు నిర్వహణ అధికారులుగా ఎం.ఆనంద్ కిరణ్, ఎ.డిల్లేశ్వరరావు, బి.లోకేశ్వరరావు, బి.మల్లేశ్వరరావు, రాజ్కుమార్, రాజబాబులు వ్యవహరించారు. బహుమతులు అందజేత పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు రాష్ట్ర పరిశీలకుడు రాజేష్ గోలా, పీడీ–పీఈటీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ, జిల్లా ఒలింపిక్ సంఘ సలహాదారు పి.సుందరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి బహుమతులు, మెడల్స్ అందజేశారు. ఇదే స్ఫూర్తితో జాతీయ పోటీల్లోను రాణించాలని వారంతా ఆకాంక్షించారు. పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, గ్రిగ్స్ సెక్రటరీ టి.శ్రీనివాసరావు, మెట్ట తిరుపతిరావు, పేడాడ బాబూరావు, పీడీలు, పీఈటీలు, వివిధ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రక్తనమూనాల సేకరణ
గార : జ్వరాలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో శాలిహుండం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినుల రక్తనమూనాలు శుక్రవారం సేకరించారు. 287 మంది విద్యార్థినులకు గాను 36 మంది సెలవులో ఉండగా, మిగిలిన విద్యార్థుల రక్తనమూనాలు సేకరించి శ్రీకాకుళం రిమ్స్కు పంపించారు. ప్రస్తుతం నలుగురు మాత్రమే జ్వరాలతో బాధపడుతున్నారని, ఇంటికి వెళ్లిన వారి సమాచారం రావాల్సి ఉందని గార పీహెచ్సీ వైద్యాధికారులు రమ్య, షాలిని తెలిపారు. కాగా, జ్వరాల సమాచారం తెలుసుకున్న ఎంపీపీ గొండు రఘురామ్, సబ్ డివిజనల్ మలేరియా అధికారి ఎస్.అప్పారావు పాఠశాలను సందర్శించి ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజిని, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, చింతల గడ్డెయ్య, సెక్రటరీ సురేష్ పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న రౌడీలు
● ప్రశాంత సిక్కోలులో భూకబ్జాలు, దందాలు, కిడ్నాప్లు ● బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాల్లోనూ హవా ● చూసీచూడనట్లు వదిలేస్తున్న పోలీసులు శ్రీకాకుళం క్రైమ్: కాశీబుగ్గలో గురువారం వైశ్య కులానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేయడానికి రెండు కార్లలో ఎనిమిది మంది వ్యక్తులు ఆమదాలవలస నుంచి వచ్చారు. ఆర్థిక లావాదేవీలే ఈ వ్యవహారానికి కారణం. కిడ్నాప్ చేయడానికి వచ్చింది ఇద్దరికీ ఏ సంబంధం లేని రౌడీలు.. సెటిల్మెంట్ బ్యాచ్లు.. ● ఇటీవల జిల్లాకేంద్రంలోని బ్యాంకర్స్ కాలనీకి సరుబుజ్జిలి మండలం మూలసవలాపురం గ్రామానికి చెందిన ఓ లేడీ రౌడీషీటర్ బ్యాచ్ రాత్రిపూట ఇంట్లో చొరబడింది. వైశ్యుడైన ఇంటి యజమానిని బెదిరించేందుకు అద్దెకున్న వ్యక్తే ఇలా చేశాడన్నది ఒక ఎత్తయితే.. సెటిల్మెంట్కు వెళ్లిన నగర బ్లాక్ మెయిలింగ్ బ్యాచ్లు లక్షల్లో వారి దగ్గర దోచేయడం మరో ఎత్తు. ● జిల్లాకేంద్రంలోని ఓ షాపులో అద్దెకున్న రాజస్థాన్ వ్యక్తిని ఖాళీ చేయించేందుకు యజమానే స్థానిక రౌడీలను పురమాయించాడు. ● అప్పట్లో బలగ నడిబొడ్డున ఓ వ్యక్తి కారును వెంబడించి ద్విచక్ర వాహనాలతో అడ్డుకోవడమే కాక రాళ్లతో కారు అద్దాలు పగులగొట్టి లోపలి వ్యక్తిని బయటకు లాగి వందల మంది చూస్తుండగా దాడి చేశారు. ప్రజల ఫోన్లే కాదు.. అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో కూడా దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. అదేమీ పెద్ద విషయం కాదన్నట్టు ఇప్పటికీ పోలీసులు ఛార్జిషీటు వేయలేదు. తిరిగి అదే వ్యక్తిపై కేసులు, చార్జిషీట్లు నమోదు చేశారు.. ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఘటనలు ప్రశాంతతకు మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలో నిత్యకృత్యమవుతున్నాయి. శాంతిభద్రతలు నిర్వీర్యం, పోలీసుల నిఘా వైఫల్యం చెందాయనడానికి వారు కడుతున్న కేసులే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రశాంత సిక్కోలులో భూకబ్జాలు, ఆర్థిక లావాదేవీలు, దందాలు, దౌర్జన్యాలు, కిడ్నాప్లు, సుపారీ హత్యలు వంటి సెటిల్మెంట్ వ్యవహారాలే కాక గంజాయి, నకిలీ నోట్లు, బెట్టింగ్, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాల్లోనూ పాత రౌడీషీటర్లు, కొత్త రౌడీలు పేట్రేగిపోతున్నారు. ఎక్కువగా జిల్లాకేంద్రం గాను, కాశీబుగ్గ కేంద్రంగానే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అత్యధిక కేసులు ఉన్నవారు, షీట్ ఉన్న వారే పదే పదే నేరాలకు పాల్పడటం గమనార్హం. పక్షపాతమెందుకో.. జిల్లాలో దాదాపు 589 మంది రౌడీషీటర్లున్నట్లు పోలీసుల సమాచారం. బైండోవర్లు, సస్పెక్ట్షీట్లు, రౌడీషీట్లు, పీడీయాక్టులు పక్షపాత ధోరణిలోనే పోలీసులు కడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు హత్యలు జరిగిన ఫరీదుపేటలో ఒక వర్గం నాయకుడికి పీడీయాక్టు కట్టి మరోవర్గం వారికి విడిచిపెట్టడం, పేకాటలో రూ.లక్షల్లో ఆడేవారిని వదిలేసి టాక్సీస్టాండుల్లో చిల్లరతో దొరికేవారిని బహిరంగంగా శిక్షలు విధించడాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. ● కార్యకర్తను స్టేషన్కు పిలిపించడంతో ఆరా తీసేందుకు వెళ్లిన రాజకీయ నాయకులపైనా, ర్యాలీలు, సమూహాల్లో మహిళా హోంగార్డుపై అనుచిత ప్రవర్తన అంటూ ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. వజ్రపుకొత్తూరు మండలంలో ఇటీవల రెండు వర్గాల తగాదాలో ఓ మహిళ చీర లాగేస్తే మాత్రం ఆ అధికారిపై చర్యలు తీసుకోలేదు. ఎందుకంత ప్రేమో..? వారం వారం రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఒకవేళ నిర్వహించినా రౌడీలు ఒక్కొక్కరుగా వారికి నచ్చిన సమయాల్లో వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. ఎక్కువ శాతం మంది గైర్హాజరే. ఓ రౌడీషీటర్ ఏకంగా తనపై ఉన్న కేసు గురించి ఎస్ఐతో ఎమ్మెల్యే మాట్లాడించేలా చేశాడు. అదే రౌడీషీటర్ కానిస్టేబుల్తోనూ సంభాషణ చేశాడు. కౌన్సిలింగ్కు రాకపోతే ఇంత, సమాచారమిస్తే ఇంత అంటూ రేట్లు కూడా నిర్ధారిస్తుండటంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యంషాపులు, బార్లు, బెల్టు దుకాణాలు, దాబాలు, లాడ్జీలు, బెట్టింగ్, పేకాటల వద్ద కొందరు పోలీసులు చేతివాటం చూపిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే ఓ ఉన్నతాధికారి ఇలాంటి వ్యవహారంలో వీఆర్కు చేరుకోగా, మరో అధికారి సైతం నాలుగైదు కేసుల్లో గట్టిగానే వసూలు చేశారనే విమర్శలు లేకపోలేదు. ఇక వ్యాపార కేంద్రంగా చెప్పుకునే మరో పట్టణంలో సీఐ హవా చెప్పక్కరలేదు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసుల పక్షపాత వైఖరి కారణంగా రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారనేది జగమెరిగిన సత్యం. -
ఎవరొస్తున్నారు..ఎందుకొస్తున్నారు!
● సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ గుబులు ● కొత్త కారు, కొత్త వ్యక్తులు వస్తే భయపడిపోతున్న సిబ్బంది ● శ్రీకాకుళం మినహా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ● జిల్లాలోనూ క్రయ, విక్రయాలపై తీవ్ర ప్రభావం ● లంచాలు తీసుకునే అధికారుల గుండెల్లో రైళ్లు రణస్థలం: రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెండు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం మినహా దాదాపు అన్ని జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వింత వాతావరణం నెలకొంటోంది. కొత్తగా కారు వచ్చినా, తెలియని వ్యక్తులు కనిపించినా చాలు.. ఏసీబీ అధికారులు వస్తున్నారంటూ సిబ్బంది హడలిపోతున్నారు. కొందరైతే భయంతో ఏకంగా ఆకస్మిక సెలవులు పెట్టేస్తున్నారు. కానరాని డాక్యుమెంట్ రైటర్లు.. భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆన్లైన్ చేయాలన్నా, స్లాట్ బుక్ చేయాలన్నా, క్రయ, విక్రయదారుల వేలిముద్రలు వేయాలన్నా, ఆధార్ ఓటీపీ తీసుకోవాలన్నా, ఆపై కొర్రీలుంటే కార్యాలయ సిబ్బందికి మామూళ్లు ముట్టజెప్పాలన్నా అంతా డాక్యుమెంట్ రైటర్లదే హవా. అటువంటి రైటర్లు ఉండే అద్దె భవనాలు, రేకుల షెడ్లు ప్రస్తుతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏసీబీ దాడుల భయంతో క్రయ, విక్రయాల లావాదేవీలపై కొర్రీలు ఉన్నవారు వారం రోజుల పాటు రిజిస్ట్రార్ కార్యాలయాల వైపు రావొద్దని సమాచారం చేరవేస్తున్నారు. కొత్త వ్యక్తులు వస్తే వారిపై ప్రత్యేక నిఘా పెట్టి కదలికలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొందరు రైటర్లు అద్దె భవనాలు ఖాళీ చేసి బయట తిరుగుతున్నారు. ఇష్టారాజ్యంగా వసూళ్లు.. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పుణ్యమా అని కొందరు తమకు అనుకూలమైన రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్లు పెట్టి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎనీవేర్ డాక్యుమెంట్లు వస్తే తమ వద్దనే అట్టిపెట్టుకుని నచ్చినంత సొమ్ము డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిషేధిత భూముల్ని ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. డీ–పట్టా భూములకు పక్కా జిరాయితీ నంబర్ వేసి రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో కొనుగోలుదారులు నష్టపోతున్నారు. గ్రామ కంఠం, వివాహ రిజిస్ట్రేషన్, మార్ట్గేజ్, గృహ నిర్మాణాల తాకట్లు లావాదేవీలపైనా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారు. మాకు సంబంధం లేదు.. ఏసీబీ దాడులకు క్రయ, విక్రయాలకు ఎటువంటి సంబంధం ఉండదు. రిజిస్ట్రేషన్లు అనేవి క్రయ, విక్రయదారుల ఇష్టం ప్రకారం జరుగుతుంటుంది. డాక్యుమెంట్ రైటర్లు ఉండటం లేదనేది మా పరిధిలో ఉండదు. ప్రైవేటు వ్యక్తుల వ్యవహారం మాకు సంబంధం లేని అంశం. – ఎ.నాగలక్ష్మి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ -
12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
నరసన్నపేట : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం తెలిపారు. ముందుగా అనుకున్న 11వ తేదీ బదులుగా 12న ర్యాలీలు నిర్వహించాలని పార్టీ సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రతినిధులకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఏయూలో హెర్బల్ గార్డెన్ ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో పది హెక్టార్లలో సమాజహిత, ఆరోగ్యకరమైన ఔషధ మొక్కలతో కూడిన హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ఔషధ, సుగంధ మొక్కల బోర్డు అధికారులు శుక్రవారం పర్యటించారు. క్యాంపస్లో అనువైన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం సెమినార్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బోర్డు సీఈవో ఏ.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఔషధ మొక్కల పెంపకంతో కాలుష్య రహిత సమాజం సాధ్యమవుతుందన్నారు. గంజాయి వంటి సాగు, వ్యసనాలకు యువతరం దూరంగా ఉండి ప్రయోజనకరమైన మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బోర్డు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి కె.ప్రదీప్కుమార్ మాట్లాడుతూ ఔషధ రంగంలో స్వల్పకాలిక కోర్సులు చదివితే ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వీసీ కె.ఆర్.రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, పూర్వ రిజిస్ట్రార్ పి.సుజాత, అకడమిక్ అఫైర్స్ డీన్ కె.స్వప్నవాహిని, ఆర్అండ్డీ డీన్ ఎన్.లోకేశ్వరి పాల్గొన్నారు. ఉప్పు మడుల్లో పోర్టు రోడ్డు సంతబొమ్మాళి : మూలపేట పోర్టు యాజమాన్యం ఉప్పుమడుల్లో దౌర్జన్యంగా రైల్వేలైన్ కోసం రోడ్డు నిర్మాణం చేపడుతోందంటూ ఎన్.ఎస్.కంపెనీ నిర్వాహకులు, ఉప్పు కార్మికులు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. నౌపడ సాల్ట్రన్ 1956 ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పేరిట 65 ఏళ్లుగా 375.64 ఎకరాల్లో ఈ ప్రాంతంలో ఉప్పు సాగు చేస్తున్నామని, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పరిహారం చెల్లించకుండా ఉప్పుమడులు మీదుగా రైల్వేలైన్ కోసం రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని వారంతా వాపోయారు. పనులు ఆపాలని చెప్పినా పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వేతనాలు అందక పస్తులు టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న భద్రతా సిబ్బంది శుక్రవారం నిరసన చేపట్టారు. కాంట్రాక్టర్ మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
సినీ పరిశ్రమలో సిక్కోలు చంటి
● దర్శకుడిగా లింగాలవలస కుర్రాడు చంటి ● నేడు 200 థియేటరల్లో విడుదల కానున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ రణస్థలం: జిల్లా నుంచి మరో కుర్రాడు తెలు గు సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. లావేరు మండలం లింగాలవలస గ్రామానికి చెందిన లుకలాపు రాహుల్ అలియాస్ చంటి సినీ ఇండస్ట్రీలో దశాబ్దకాలంగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయగా.. తాజాగా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సర్వం సిద్ధమైంది. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 థియేటర్లలో విడుదల కానుంది. కాలేజీ రోజుల నుంచే.. చంటి తల్లిదండ్రులు అప్పలనాయుడు, ఇందిర సాధారణ రైతు కుటుంబీకులు. ప్రాథమిక విద్య అంతా విజయనగరం, శ్రీకాకుళంలోనే పూర్తి చేశాడు. చంటికి సినిమాలంటే ఆసక్తి. ఇంజినీరింగ్ చదువుతుండగానే సినిమా మే కింగ్కు సంబంధించిన అంశాలను తెలుసుకున్నాడు. యూట్యూబ్ చానెల్లో పనిచేసి వెబ్ సిరీస్లకు దర్శకత్వం వహించాడు. అలా సినిమాల్లో పలువురు సినీ దర్శకులతో పరిచయా లు పెంచుకున్నాడు. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత తిరువీర్ హీరోగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకు దర్శకుడిగా మారాడు. -
తుఫాన్ రేషన్ సరిచేశారు
పోలాకి: మోంథా తుఫాన్ బాధి త తీర ప్రాంతాల్లో ప్రభుత్వం ఉచితంగా అందజేసిన రేషన్ సరుకులు లబ్ధిదారులకు అందకుండా సగం పంపిణీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నానికి పోలాకి మండల తీర ప్రాంత గ్రామాల్లో అడ్డుపడింది. గురువారం ‘సాక్షి’లో ‘తుఫాన్ రేషన్లో చేతివాటం..?’ అనే శీర్షికతో ఒక వార్త ప్రచురితమైంది. అధికార పార్టీకి చెందిన రేషన్ డీలర్లు తుఫాన్ సరుకులు సగం పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారని లబ్ధిదారులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సివిల్ సప్లై అధికారులు రంగప్రవేశం చేశారు. పోలాకి తహసీల్దార్ శ్రీనివాసరావు ఆదేశాలతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది కలసి రాజారాంపురం గ్రామంలో డిపోల వద్ద రేషన్ సరుకులను దగ్గరుండి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంచదార, నూనెతోపాటు మొత్తం సరుకులను లబ్ధిదారులకు అందజేశారు. క్షతగాత్రులను పరిశీలించిన కలెక్టర్ శ్రీకాకుళం రూరల్: పలాస–కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 9 మంది చనిపోగా ముగ్గురు క్షతగాత్రు లు రాగోలు జెమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరిని కలెక్టర్ స్వప్నిల్ దిన కర్ పుండ్కర్ గురువారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి సిబ్బంది వివరించారు. -
సాగర తీరం.. కవ్వళ్ల కోలాహలం!
● మత్స్యకారులకు భారీగా చిక్కుతున్న చేపలు ● కోళ్లు, రొయ్యలు, చేపల మేతగా కలవలు ఇచ్ఛాపురం రూరల్: శీతాకాలం వచ్చిందింటే చాలు సముద్రంలో వేటాడే మత్స్యకారులకు కలవలు పంటే. ఈ సీజన్లో అధిక మొత్తంలో కవ్వళ్లు(కలవలు) వలలకు చేరుతాయి. వీటితో పాటు కోనేం, నెత్తళ్లు వంటి చేపలు అధిక ధరలకు అమ్ముడుపోతాయి. ప్రస్తుతం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతమంతా కలవలతో కళకళలాడుతోంది. కలవల్లో రకాలు.. పెద్దగా ఆహారానికి ఉపయోగపడని కలవ చేపలు కోళ్లు, రొయ్యలు, చేపల ఆహారానికి ఉపయోగపడుతున్నాయి. ఈ చేపలను మత్స్యకారులు మూడు రకాలుగా విభజించి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు చేస్తున్నారు. పెద్దగా ఉండే పచ్చి కలవ చేపలను ఆహారానికి ఉపయోగిస్తుంటారు. ఇవి కేజీ రూ.60 వరకు ధర పలుకుతుండగా, గంప చేపలు రూ.600 వరకు కొనుగోలు చేస్తారు. ఈ రకం చేపలు పెద్దగా అమ్మకాలకు గిరాకీ లేకపోవడంతో రెండో రకంగా సేకరించిన కలవ చేపల్ని ఉప్పులో రెండు, మూడు రోజుల పాటు ఊరబెట్టి సముద్ర తీరంలో ఎండబెడతారు. వీటి ధర కేజీ రూ.30 నుంచి రూ.40 వరకు పలుకుతోంది. ఇందులో నల్లని కలవ చేపల్ని మిక్స్ చేసి కోళ్లు, రొయ్యలు, చేపలకు మేతకు ఉపయోగిస్తారు. ఇక మూడో రకంగా ఉప్పులో నానబెట్టకుండా ఎండబెట్టిన చప్పని చేపలు. ఇవి ఏడాది పాటు నిల్వ ఉంచుకొని ఆహారంగా ఉపయోగిస్తారు. వీటి ధర మార్కెట్లో రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇరత ప్రాంతాలకు ఎగుమతి.. జిల్లాలో లభించే ఉప్పు కవ్వళ్లను దళారులు లారీలు, లగేజీ వ్యాన్ల ద్వారా విశాఖపట్నం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్న దిగా మార్కెట్, గంజాం ప్రాంతంలో ఉన్న ఉమా సంత, ముంబై, చైన్నె, కర్ణాటక, కోల్కత్తా వంటి ప్రాంతాలకు టన్నుల కొద్దీ తరలిస్తుంటారు. వర్షాలొస్తే ఇబ్బందే.. ఒక్కోసారి ప్రకృతి ప్రకోపానికి మత్స్యకారులు గురికావాల్సి వస్తోంది. ఇటీవల మోంథా తుఫాన్ ధాటికి డొంకూరులో సుమారు రూ.30లక్షలు విలువ చేసే ఎండు చేపలు వర్షార్పణం అయ్యాయి. దీంతో మత్స్యకారులు భారీగా నష్టపోయారు. సంబంధిత మత్స్యశాఖాధికారులు తూతూమంత్రంగా పరిశీలించి రూ.3లక్షలు విలువైన ఎండు చేపలు వర్షంలో తడిసిపోయాయంటూ జిల్లా ఉన్నతాధికారురులకు నివేదికలు అందించి చేతులు దులుపుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సమయాల్లో చేపల్ని భద్రపరుచుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తామంటూ చెబుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీలు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రమ ఎక్కువ.. పెద్దగా ఆదాయం లేని మత్స్య పంట ఏదైనా ఉందంటే అది కవ్వళ్లుగా చెప్పవచ్చు. తప్పని పరిస్థితుల్లో వలకు దొరికిన చేపల్ని విడిచి పెట్టలేక ఒడ్డుకు తెచ్చి కేజీల ధరల్లో అమ్మకాలు చేస్తుంటాం. అధిక శ్రమకోర్చి ఎండబెట్టి అమ్మకాలు జరుపుతాం. వర్షాల సమయంలో తీరం ఒడ్డునే చేపలు కుళ్లిపోతుంటాయి. – చీకటి ధర్మారావు, మత్స్యకారుడు, డొంకూరు -
విద్యుత్ స్తంభం పడి వ్యక్తి మృతి
నరసన్నపేట: మండలంలోని పారశిల్లి–రెల్లివలస గ్రామాల మధ్య కొత్త విద్యుత్ లైన్ పనులు జరుగుతున్న క్రమంలో గురువారం సాయంత్రం విద్యుత్ స్తంభం పడి ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలో వ్యవసాయ మోటార్లకు ప్రత్యేక లైన్ వేసేందుకు రీవేంప్డ్ డెవలప్మెంట్ సెక్టార్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)లో భాగంగా రెండేళ్లుగా పనులు జరుగుతున్నాయి. గురువారం సాయంత్రం రెల్లివలస వద్ద ట్రాక్టర్ పైనుంచి విద్యుత్ స్తంభం కిందకు దించి పైకి ఎత్తుతున్న క్రమంలో టాక్టర్ పక్కకు ఒరిగిపోవడంతో స్తంభం పడి నడగాంకు చెందిన బానాల రాము(37) మృతి చెందగా, జోగి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి వెల్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేటకు తరలించారు. రాంబాబును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కాగా, రాముకు రెండు నెలల క్రితమే కుమార్తె పుట్టింది. ఆ సంతోషంలో ఉండగానే ప్రమాదం జరగడంతో భార్య ఢిల్లీశ్వరి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నడగాం సర్పంచ్ జల్ల మాధురి, వైఎస్సార్ సీపీ నాయకులు లుకలాపు రవి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. -
అదరగొడుతున్న అమ్మాయిలు
● ఏపీ స్కూల్గేమ్స్ రాష్ట్రస్థాయి బాలికల క్రికెట్ పోటీలు ప్రారంభం ● మరోసారి సత్తాచాటిన ఉత్తరాంధ్ర జిల్లాల జట్లు శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ బాలికల క్రికెట్ పోటీల్లో అమ్మాయిలు ఆదరగొట్టే ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల మహిళల క్రికెట్ ప్రపంచకప్లో ఇండియా జట్టు విజయం సాధించిన స్ఫూర్తితో రెట్టించి ఉత్సాహంతో పోటీల్లో పాల్గొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ/ఇంటర్మీడియెట్ విద్య పరిధిలోని జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 పరిమిత ఓవర్ల క్రికెట్ చాంపియన్షిప్–2025–26 పోటీల్లో ఇప్పటికే బాలుర పోరు ముగిసింది. గురువారం నుంచి బాలికల సమరం మొదలైంది. శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం, శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానం, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల మైదానాల్లో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. సెమీస్లో అడుగుపెట్టిన తూ.గో.,అనంతపురం.. తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి తూర్పుగోదావరి, అనంతపూరం జిల్లా జట్లు సెమీఫైనల్లో ప్రవేశించాయి. తామాడిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ల్లో కృష్ణాజిల్లాపై తూర్పుగోదావరి, వైఎస్సార్ కడప జిల్లాపై అనంతపురం జట్లు గెలుపొంది సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి. మరో రెండు సెమీఫైనల్స్ బెర్త్కోసం నాలుగు జిల్లాలు క్వార్టర్ఫైనల్స్కు చేరుకున్నాయి. విజయనగరం–శ్రీకాకుళం మధ్య, అలాగే విశాఖపట్నం–పశ్చిమగోదావరి మధ్య జరిగే రెండు క్వార్టర్ఫైనల్స్ మ్యాచ్ల్లో విజయం సాధించిన రెండు సెమీఫైనల్కు చేరుకుంటాయి. బాలికల టోర్నమెంట్లో పది జిల్లాలకు చెందిన జట్లు మాత్రమే ప్రాతినిధ్యం వహించాయి. నెల్లూరు, చిత్తూరు, గుంటూరు జిల్లాల జట్లు గైర్హాజరయ్యాయి. వీరిని నాలుగు ఫూల్స్గా విభజించి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిన మ్యాచ్లు నిర్వహించారు. కర్నూలు, ప్రకాశం జిల్లా జట్లు ఓటమిపాలై లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. రాష్ట్ర పరిశీలకులు రాజేష్ గోల, మీట్ కార్యనిర్వాహక కమిటీ ప్రతినిధులు బి.వి.రమణ, ఆర్.స్వాతి, మ్యాచ్ల నిర్వహణ అధికారులు ఎం.వి.రమణ, ఎం.ఆనంద్ కిరణ్, ఏ.ఢిల్లేశ్వరరావు, బి.లోకేశ్వరరావు, బి.మల్లేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. ఇంటర్విద్య డీవీఈఓ ఆర్.సురేష్కుమార్, డీఈఓ ఎ.రవిబాబు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సాయంత్రంతో పోటీలు ముగియనున్నాయి. -
పాదయాత్ర చారిత్రక ఘట్టం
టెక్కలి: రాష్ట్రంలో పేద, సామాన్య వర్గాలు పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకోవడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఓ చారిత్రక ఘట్ట మని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం కోటబొ మ్మాళి మండలం నీలంపేట గ్రామంలో నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ 2017 సంవత్సరం నవంబర్ 6న ఇడుపులపాయలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలను నేరుగా కలిసి వారి కష్టాలను తెలుసుకున్నా రని తెలిపారు. అందుకే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాలు అందించారని తెలిపారు. మళ్లీ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్ను ముఖ్య మంత్రి చేయాలని కృష్ణదాస్ కోరారు. అనంతరం తిలక్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాదిరిగా ఏ నాయకుడు సంక్షేమ పథకాలు ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత ఏడాదిన్నర కాలంలోనే ప్రజలకు పూర్తిగా పరిస్థితి అర్థమైందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, పార్టీ మండల అధ్యక్షుడు సంపతిరావు హేమసుందర్రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, మండల నాయకులు బి.వెంకటరమణ, కె.సంజీవ్, డి.రామకృష్ణారెడ్డి, పేడాడ వెంకట్రావు, ఎస్.జనార్ధన్రెడ్డి, ఎం.సింహాచలం, కె.శ్రీనివాస్రెడ్డి, ఎస్.నారాయణరావు, ఎం.వాసు, లాడి వైకుంఠరావు, పట్నాన శివ, చిన్నయ్య, ఎస్.వినోద్, కె.గణపతి, ఎ.గున్నయ్య, అప్పన్న, ఎం.శాంతారావు, ఎస్.నారాయణరాజు తదితరులు ఉన్నారు. -
పలాసలో వ్యాపారి కిడ్నాప్ కలకలం
● పట్టపగలు బలవంతంగా లాక్కెళ్లిన ఆమదాలవలసకు చెందిన వ్యక్తులు ● విషయం బయటకు తెలియడంతో మధ్యలోనే వదిలేసిన వైనం ● ఆర్థిక వ్యవహారాలే కారణం పలాస: జిల్లాలో కిడ్నాప్ సంస్కృతి విస్తరిస్తోంది. మొన్న నరసన్నపేటలో వ్యాపారి కిడ్నాప్ ఉదంతం మరువక మునుపే గురువారం మరో వ్యాపారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. పలాసకు చెందిన వ్యాపారి (బ్యాంకింగ్ ఫైనాన్స్ సలహాదారుడు) వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజును పట్టపగలే రెండు కార్లలో వచ్చిన ఆమదాలవలస ప్రాంతానికి ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ టీ దుకాణం వద్ద లక్ష్మీనారాయణరాజు టీ తాగుతుండగా కార్లలో వచ్చిన వ్యక్తులు కిడ్నాప్నకు పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది వ్యాపారులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు వెళ్లి సమాచారం అందజేశారు. ఇక్కడ పోలీసులు ఆమదాలవలస పోలీసులకు సమాచారం అందజేయడంతో ప్రాథమికంగా విషయ సేకరణలో భాగంగా.. ఆమదాలవలసకు చెందిన బొడ్డేపల్లి శ్రీనుతో పాటు మరి కొంత మంది కిడ్నాప్కు పాల్పడినట్లు తెలిసింది. క్షణాల్లో విషయం బయటకు రావడంతో కిడ్నాపర్లు లక్ష్మీనారాయణరాజును నరసన్నపేట సమీపంలో విడిచిపెట్టి పారిపోయారు. దీంతో లక్ష్మీనారాయణరాజు నేరుగా కాశీబుగ్గ పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. అప్పటికే అతని భార్య పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రాథమికంగా తెలిసిన వివరాలు ప్రకారం.. కిడ్నాప్కు గురైన లక్ష్మీనారాయణరాజు సొంత ఊరు ఆమదాలవలస. అయితే కొన్నేళ్ల కిందట పలాస వచ్చి స్థిరపడ్డాడు. ఆమదాలవలసలో మరో వ్యాపారి పొట్నూరు వేణుగోపాల్కు లక్ష్మీనారాయణరాజుకు ఆర్థిక పరమైన లావాదేవీల వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కిడ్నాప్ ఆర్థిక పరమైన లావాదేవీల వల్లనే జరిగిందని సమాచారం. ఆమదాలవలసలో వేణుగోపాల్ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విషయమై కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ వద్ద ప్రస్తావించగా వ్యాపారి కిడ్నాప్ విషయమై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. -
జ్వరాలు
శాలిహుండం కేజీబీవీ విద్యార్థినులకు గార: శాలిహుండం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థినులు జ్వరాలతో బాధ పడుతున్నారు. ఎక్కువ మంది జ్వరాలతో ఇబ్బందులు ప డుతున్నా ఉన్నతాధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం సాయంత్రం గార తహసీల్దార్ మునగవలస చక్రవర్తి, ఎంపీడీఓ ఈశర్ల రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో చదువు విషయమై ప్రశ్నలు వేయగా, పలువురు విద్యార్థి నులు దగ్గుతుండటంతో ప్రశ్నించడంతో జ్వరాలు, దగ్గు, జలుబుతో ఉన్నామని తెలియజేశారు. దీంతో అధికారులు ఆశ్చర్యపోయారు. జ్వరంతో బాధపడు తూ క్లాసురూమ్లోనే నేలపై పడుకున్న భీమవరం, పలాసలకు చెందిన ఇద్దరు విద్యార్థినులతో మాట్లాడారు. జ్వరం మిగిలిన విద్యార్థినులకు సోకకుండా ఉండేందుకు వీరిని ప్రత్యేక గదిలో ఉంచాలని సూ చించారు. గత కొన్ని రోజులుగా చాలా మంది బాధపడుతున్నారని, కొంత మంది విద్యార్థినులు ఇంటికి వెళ్లి బాగు చేసుకుంటున్నారని అక్కడ ఉన్న వారు తెలిపారు. ఇవన్నీ సాధారణ జ్వరాలేనని ప్రిన్సిపాల్ రజిని తెలియజేశారు. ముందుగా వండిన ఆహార పదార్థాలు పరిశీలించి సాంబారు చాలా పలుచగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వేడి నీటిని అందరికీ అందించాలని సిబ్బందికి ఆదేశించారు. వైద్య శిబిరాలు జ్వరాలు తగ్గే వరకూ నిర్వహించాలన్నారు. హాజరుపట్టిక ఆధారంగా చూడగా 287 మంది విద్యార్థినుల్లో 39 మంది సెలవు చూపుతుండటంతో జ్వరాలు అధికంగా ఉన్నాయని దీని ద్వారా తెలుస్తోంది. గురువారం ఉదయమే గార పీహెచ్సీ సిబ్బంది వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు రక్త నమూనాలు సేకరించారు. అయితే జ్వరంతో బాధపడుతున్నా ముగ్గురు విద్యార్థినులకు కనీసం మంచాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వారు నేలపైనే బెడ్షీట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. -
రేపు జిల్లా స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సీనియర్స్ పురుషులు, మహిళల ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఈ నెల 8న నిర్వహిస్తున్నట్టు జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బలభద్రుని రాజా గురువారం తెలిపారు. శ్రీకాకుళం టౌన్ హాల్ వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికల ప్రక్రియ ప్రారంభమౌతుందని చెప్పారు. 18 ఏళ్లు పైబడి, గతంలో ఫెన్సింగ్ క్రీడలో పాల్గొని అనుభవం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. క్రీడాకారులకు ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ తప్పనిసరని తెలిపారు. ఆసక్తి ఉన్న, అర్హత గల క్రీడాకారులు పూర్తి వివరాలకు ఎన్ఐఎస్ కోచ్ జోగిపాటి వంశీ(7660874844)ని సంప్రదించాలని కోరారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 11 నుంచి విజయవాడలో జరిగే ఏపీ రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఫెన్సింగ్ చాంపియన్షిప్–2025 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచి పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ నెల 15 నుంచి ఢిల్లీ వేదికగా జరిగే జాతీయ ఫెన్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఫెన్సింగ్ -
ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే... భవనంపై నుంచి దూకేశా
శ్రీకాకుళం క్రైమ్: ‘నేను బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి, రెండు కాళ్లు విరిగి నా చదువు అర్ధంతరంగా ఆగిపోవడానికి ప్రిన్సిపాల్ సీపాన లలిత కారణం’ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కసూ్తర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో రెండు నెలల కిందట ఆత్మహత్యకు ప్రయత్నించిన దళిత విద్యార్థిని తెలిపింది. కులం పేరుతో తనను, తన తల్లిని ప్రిన్సిపాల్ తీవ్రంగా దూషించడం వల్లే చనిపోవాలని ప్రయత్నించానని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్లోని ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థిని గురువారం మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను తెలియజేసింది. ‘మీరు ఎస్సీ వాళ్లు అసహ్యంగా ఉంటారు. మీ ఎస్సీ కాలనీలో నుంచి రావాలంటే చాలా చిరాకుగా ఉంటుంది.ఇప్పుడు మీరు మా హాస్టల్లో జాయిన్ అయ్యారు. మీ పక్కన నిల్చోవాలంటే చాలా అసహ్యం. మీ అమ్మ బ్యాండ్ మేళానికి వెళ్తుంది కదా? నీవు కూడా వెళ్తావా? మీరు ఎందుకింత మురికిగా ఉన్నారు. మీ అమ్మ తప్పుడు మనిషి కదా? నువ్వు అబ్బాయిలా బిహేవ్ చేస్తున్నావు. పీజీటీ మేడమ్స్ ఏమైనా నీకు తప్పుడు పనులు నేర్పిస్తున్నారా?’ అని ఎస్వో(ప్రిని్సపాల్) మేడమ్ తరచూ వేధించేవారు అని విద్యార్థిని ఆవేదన వ్యక్తంచేసింది. అంతేకాకుండా తనపై తన తల్లిపై పలు తప్పుడు వదంతులు వ్యాప్తిచేశారని తెలిపింది. ఏఎన్ఎం, అటెండర్, అకౌంటెంట్ సర్ కూడా వేధించారు.ఇలా తరచూ అసభ్య మాటలతో వేధించడం వల్లే అందరూ పడుకున్నాక బిల్డింగ్పై నుంచి దూకేశానని తెలిపింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న తనవద్దకు ఏపీసీ సర్, ప్రిని్సపాల్ మేడమ్ వచ్చి బెదిరించారని, అందువల్లే అప్పుడు కాలుజారి పడిపోయినట్లు పోలీసులకు తప్పుగా చెప్పానని వివరించింది. రెండు నెలలుగా రిమ్స్లో చికిత్స పొందుతున్నానని, కుడి కాలికి ఆరు ఆపరేషన్లు అయ్యాయని, ఎడమ కాలికి పిండికట్టు కట్టారని, పట్టించుకునే నాథుడే లేరని ఆ విద్యార్థిని వాపోయింది.న్యాయం చేస్తామని తప్పించుకున్నారు: విద్యార్థిని తల్లితన భర్త చనిపోయాక కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తున్నానని బాలిక తల్లి లక్ష్మి తెలిపారు. తన కుమార్తెను ఆరో తరగతి నుంచి కేజీబీవీలోనే చదివించానని చెప్పారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ఉన్న తన కుమార్తె వద్దకు తాను లేని సమయంలో ప్రిన్సిపాల్ లలిత, ఏపీసీ వచ్చి తప్పుగా స్టేట్మెంట్ ఇప్పించారని పేర్కొన్నారు. ఆ రోజు వారిని ప్రశ్నిస్తే న్యాయం చేస్తామని చెప్పి తప్పించుకున్నారని తెలిపారు.ఇప్పటి వరకు వారి నుంచి గానీ, ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి సాయం అందలేదన్నారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై గత నెల 25న శక్తి యాప్లో, పది రోజుల క్రితం పొందూరు పోలీస్స్టేషన్లో, గత నెల 15న నేషనల్ చైల్డ్ పోర్టల్లో ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. -
ఆశ్రమ పాఠశాల సందర్శన
మెళియాపుట్టి: ఇటీవల బందపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా గిరిజన సంఘం కార్యదర్శి నిమ్మక అప్పన్న బుధవారం పాఠశాలను సందర్శించారు. జరిగిన ఘటనపై విద్యార్థులు, సిబ్బందికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా జిల్లాస్థాయి అధికారులు దృష్టి సారించాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశీలించామని ప్రహరీ లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మౌలిక సదుపాయాలు సంతృప్తికరంగా లేవన్నారు. సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపారు. ఆయనతో పాటు అరిక మన్మథరావు, సవర భాస్కరరావు, బి.గవరయ్య తదితరులు ఉన్నారు. -
గంజాయి కేసులో ఇద్దరు విద్యార్థులు అరెస్టు
రణస్థలం: విజయవాడలోని ప్రముఖ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులను జేఆర్పురం పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జేఆర్పురం పోలీస్స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో సీఐ ఎం.అవతారం, ఎస్ఐ చిరంజీవిలు వివరాలు వెల్లడించారు. పైడిభీమవరం భూమాత టౌన్షిప్ వద్ద 22.5 కేజీల గంజాయితో 10 మంది నిందితులను ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన పట్టుకోవడం జరిగిందన్నారు. అరైస్టెన కొప్పెర్ల గ్రామానికి చెందిన ఇనాకోటి ముకుందను విచారించగా.. అతని వద్ద నుంచి యూనివర్సిటీలో చదువుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన షేక్ నఫీజ్, గుంటూరు జిల్లాకు చెందిన కమ్మిశెట్టి వినోధ్ కుమార్లు గంజాయి కొనుగోలు చేస్తుంటారని తెలిసింది. వీళ్లు గంజాయి సేవించి అనంతరం యూనివర్సిటీలో గంజాయికి అలవాటుపడ్డ విద్యార్థులకు అమ్ముంతుంటారని పేర్కొన్నారు. దీంతో విజయవాడ వెళ్లి మూడు రోజులు నిఘా వేసి ఎస్ఐ చిరంజీవి, సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. వీరిని జ్యూడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. -
కూర్మనాథాలయంలో నీటి లీకులపై పరిశీలన
గార: ఆది కూర్మక్షేత్రంలోని రాతికట్టడం నుంచి లక్ష్మీసన్నిధి వద్ద వర్షపు నీరు లీకువుతుండటం వంటి సమస్యలపై రాష్ట్ర పురావస్తు శాఖాధికారి డిప్యూటీ డైరెక్టర్ పి.సురేష్, పలువురు అధికారులు బుధవారం సందర్శించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనంరామనారాయణ రెడ్డి ఈ ఏడాది పర్యటన సమయంలో స్థానిక అర్చకులు, భక్తులు తెలిపిన సమస్యల్లో నీటి లీకులపై చెప్పడంతో అధికారులు పర్యటన చేపట్టారు. రాతికట్టడాలు మరమ్మతులు చేసేందుకు సాధ్యాసాద్యాలపై పరిశీలించారు. రాళ్ల మధ్య ఏర్పడిన ఖాళీలు పూడ్చేందుకు నిపుణులతో చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై నివేదికను అందజేసి పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.నరసింహనాయుడు, సహాయ సంచాలకులు ఎస్.వెంకటరావు, ఏడీ ఇంజినీరింగ్ భాస్కర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తుఫాన్ రేషన్లో చేతివాటం..?
● సగం సరుకులే పంపిణీ చేశారని ఆరోపణ పోలాకి: ఇటీవల మోంథా తుఫాన్కు తీర ప్రాంతంలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన రేషన్ సరుకుల్లో డీలర్లు చేతివాటం చూపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అంపలాం పంచాయతీ నుంచి కొందరు లబ్ధిదారులు పోలాకి తహసీల్దార్కు ఫిర్యాదు చేశా రు. అయితే రేషన్డీలర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావటంతో ఎలాంటి చర్యలు తీసుకోవ టం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు ఒకలా, రేషన్ డీలర్ మరోలా చెబుతున్నారు. సివిల్ సప్లై గోడౌన్ నుంచి సరుకులు వచ్చినప్పుడే డ్యామేజీ కావటంతో సగం సరుకులే పంపిణీ చేశామని డీలర్ చెబుతుంటే, అలాంటిదేమీ తమ దృష్టిలోకి రా లేదని అధికారులు చెబుతున్నారు. పంచదార ఇంకా డిపోలకు చేరలేదని, ఒకటి రెండు రోజు ల్లో పూర్తిగా సరుకుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డీటీ రామకృష్ణ అన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం తుఫాన్ రేషన్ సరుకుల్లో సగ మే పంపిణీ చేసిన విషయంపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. నూనె అరకిలో ఇచ్చి దారిలో బస్తా పడిపోయినట్లు డీలర్ చెప్పి తప్పించుకుంటున్నారు. – కొమర నర్సింహమూర్తి, లబ్ధిదారుడు, రాజారాంపురం -
అధికార యంత్రాంగంపై ధ్వజం
● వాడీవేడిగా జిల్లా సమీక్ష సమావేశం ● అధికారులపై మండిపడిన ప్రజా ప్రతినిధులు శ్రీకాకుళం: జిల్లాలో ప్రభుత్వ శాఖల పనితీరుపై ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, శాసనసభ్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సరైన వివరాలు లేకుండా డీఆర్సీకి ఎలా వస్తున్నారని నిలదీశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. తొలుత వ్యవసాయ శాఖకు సంబంధించిన చర్చ ప్రారంభం కాగా అధికారుల నివేదిక తప్పులు తడకగా ఉందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో రైతుల సంఖ్యలో 46,000 తేడా ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు దీనిపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా దాన్ని సైతం రవికుమార్ అడ్డుకున్నారు. ఇదే విషయమే సుదీర్ఘంగా రెండు గంటలపాటు చర్చ జరిగిన తర్వాత ఇన్చార్జి మంత్రి కలగజేసుకుని ఆపారు. కానీ రవికుమార్ అంగీకరించకుండా సమీక్ష ఇదే సమావేశంలో జరగాలని పట్టుబట్టారు. దీంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకుని రవికుమార్ అడుగుతున్న ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా లేదా అని వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించగా, తాము పొరపాటున నమోదు చేశా మని అంకెలు మాత్రం సరైనవని చెప్పారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ మా ట్లాడుతూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మళ్లీ రవికుమార్ ఎరువుల కొరత విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ఏడాది పొటాషియం తీసుకురాలేదని నిలదీశారు. వ్యవసాయ శాఖాధికారు లే కాకుండా పలు శాఖల అధికారులు నిర్లక్ష్య ధోర ణిలో వ్యవహరిస్తున్నారని రవికుమార్తో పాటు మరికొందరు శాసనసభ్యులు ఆరోపించారు. తు ఫాన్ సందర్భంగా తడిచి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రవికుమార్ కోరగా జిల్లా మంత్రులతో పాటు కేంద్ర మంత్రి సైతం దీనికి అంగీకరించారు. ఏపీఐఐసీపై చర్చలో ఆమదాలవలస చక్కెర కర్మా గారాన్ని తీ సుకుని ఇండస్ట్రియల్ పార్కుగా అభివృద్ధి చేయా లని కోరారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లాకు పరిశ్రమలు వస్తుంటే స్థానికులు అడ్డుకుంటున్నారని సరుబుజ్జిలి మండలంలో థర్మల్, పలాసలో కార్గో ఎయిర్పోర్టు నిర్మాణాలపైనా పోరాడుతున్నారని తెలిపారు. ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించేలా కేంద్రంతో సంప్రదిస్తాన ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పలాసలోని కిడ్నీ సెంటర్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఎమ్మెల్యే శిరీష కోరారు. సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస నాయుడు కలెక్టర్ దినకర్ పుండ్కర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమీక్ష సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాలు ఇచ్చారు. అసంపూర్తి సమాచారంతో సమావేశానికి రావడం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు వివిధ శాఖల అధికారులు తడబడటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సమీక్ష సమావేశాలు ఇకపై రెగ్యులర్గా నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రా మ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెండింగ్ అంశాలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కింజరాపు కుటుంబానికే సూపర్ సిక్స్ నజరానాలు
● మంత్రి అచ్చెన్నాయుడుపై ధ్వజమెత్తిన పేరాడ తిలక్ టెక్కలి: రాష్ట్రంలో కింజరాపు కుటుంబానికి మాత్ర మే సూపర్ సిక్స్ నజరానాలు దక్కాయని, మంత్రి అచ్చెన్నాయుడు ఉన్మాదిగా మారి మాజీ సీఎం వైఎస్ జగన్పై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరా డ తిలక్ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం టెక్క లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడా రు. ఒక్క కింజరాపు కుటుంబంలో కేంద్ర, రాష్ట్ర మంత్రుల పదవులతో పాటు అచ్చెన్నాయుడు సొంత అన్న కొడుకు నిమ్మాడ సర్పంచ్ సురేష్కు ఉత్తమ పంచాయతీ అవార్డు, మరో అన్న ప్రభాకర్కు పదవీ విరమణ మునుపు ప్రమోషన్, ఆ తరువాత విజిలెన్స్ ఓఎస్డీ పదవి, ఇప్పుడు ఏకంగా జిల్లా విజిలెన్స్ ఇన్చార్జి ఎస్పీ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. దీంతో పాటు అచ్చెన్నాయు డు సమీప బంధువు ముద్దాడ రవిచంద్రకు సైతం సీఎంఓలో కీలకమైన బాధ్యతలు కట్టబెట్టారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు, కూటమి ప్రభుత్వానికి మాట్లాడే అర్హత లేదని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో జిల్లాకు రూ.86 కోట్ల ఇన్పుట్ స బ్సిడీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో ఎరువులు, విత్తనాలు ఇచ్చుకోలేని అసమర్థ మంత్రిగా అచ్చెన్న అప్రతిష్ట మూటగట్టుకున్నారని తెలిపారు. మోంథా తుఫాన్లో నష్టాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారని గుర్తు చేశారు. కల్తీ మద్యం కేసులో సాక్ష్యాలతో పట్టుబడిన టీడీపీ నాయకులను అరెస్టు చేయకుండా ఎవరో చెప్పారని వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేష్ను అరెస్టు చేయడం దారుణమన్నారు. యువగళంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో... బహిర్గతం చేయాలని తిలక్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, నాయకులు చింతాడ అప్పన్న, కర్నిక జీవన్, బి.రాజేష్ ఉన్నారు. -
ఇరుకు దారులతో అవస్థలు
● 9న బాలియాత్ర ముగింపు ఉత్సవం ● తెప్పోత్సవానికి అనువుగా లేని నదీ మార్గాలు ● కరకట్ట దాటాలంటే అవస్థలు జలుమూరు: శ్రీముఖలింగంలో ఈ నెల తొమ్మిదిన బాలియాత్ర ముగింపు ఉత్సవం జరగనుంది. దీనిపై పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. నిర్వాహక కమిటీ కూ డా పలు మార్లు సమావేశాలు నిర్వహించి యాత్ర సజావుగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులకు విన్నవించింది. ఇదే సమయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపడుతున్నా రు. ఇంత వరకూ బాగున్నా భక్తులు ప్రధాన దే వాలయం నుంచి వంశధార నదికి వెళ్లే మార్గం తుప్పలు, బురద మధ్యన ఉంది. ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తే భక్తులు నదిలో సులువుగా దీపోత్సవం నిర్వహించుకుంటారు. వేల సంఖ్యలో భక్తులు హాజరు ఎన్నో వందల ఏళ్ల చరిత్ర గల ఈ బాలి యాత్ర శ్రీముఖలింగంలో గత ఏడాదే ఇక్కడ ప్రారంభమైంది. ఈ ఏడాదికి వేల సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహక కమిటీ అంచనా వేస్తోంది. నదిలో దీపోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో వెళ్లే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి నదీ మార్గాలు వెడల్పు చేసి శుభ్రం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఈఓ ఏడు కొండలను వివరణ కోరగా నది మార్గాలు పంచాయతీ నిధు లతో చేయడం జరిగిందని ఇంకా చేయాల్సి వస్తే ఆ శాఖ ద్వారా చేస్తామన్నారు. ఘనంగా బాలియాత్ర ప్రారంభం ప్రాచీన కళింగ రాజ్య సంప్రదాయమైన బాలి యా త్ర కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీముఖలింగంలో ప్రారంభమైంది. ముందుగా స్వామికి ప్రత్యేక పూజలు,అర్చనలు,అభిషేకాలు నిర్వహించి వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. ముగింపు ఉత్సవం ఈ నెల 9న పెద్ద ఎత్తున జరగనున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యులు డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు తెలిపారు. -
మానవత్వం చాటుకున్న ఏఎస్ఐ
ఇచ్ఛాపురం: పట్టణానికి చెందిన ఏఎస్ఐ తెలుకుల రామారావు అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. సుమారు 65 ఏళ్ల డబ్బూరి నారాయణారావు అనే వృద్ధుడు బిక్షాటన చేస్తూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జీవనం సాగించేవాడు. అయితే నాలుగు రోజుల క్రితం ఆయన కాంప్లెక్స్ ఆవరణలో అనారోగ్యానికి గురవ్వడంతో స్థానికులు అతడిని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టౌన్ పోలీస్స్టేషన్ రైటర్ రంజిత్ వివరాలు నమోదు చేశారు. దీంతో కంచిలిలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రామారావు సమాచారం తెలుసుకొని వృద్ధుడి మృతదేహాన్ని అంతిమయాత్ర రథంపై బాహుదానదికి తీసుకెళ్లి హిందూ సాంప్రదాయబద్దంగా కుమార్తె గీత సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ కానిస్టేబుల్గా విధుల్లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 20 ఏళ్లుగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నానని తెలియజేశారు. అలాగే వారికి పెద్దకర్మ చేసి పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తుంటానని పేర్కొన్నారు. ఇప్పటివరకు 65 అనాథ మృతదేహాలకు ఈవిధంగా అంత్యక్రియలను నిర్వహించానని పేర్కొన్నారు. దీంతో ఏఎస్ఐను పలువురు అభినందించారు. -
● కూటమి కుట్రలు తిప్పికొట్టాలి
ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని మాజీ స్పీకర్, వైఎస్సార్ీసీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. హిరమండలం పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ప్రతి ఒక్క సంతకం విద్యార్థుల భవిష్యత్కు మంచి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. – హిరమండలం -
స్కూల్గేమ్స్ అండర్–19 విజేత విశాఖ
● రన్నరప్తో సరిపెట్టుకున్న ఆతిఽథ్య శ్రీకాకుళం ● తృతీయ స్థానంలో పశ్చిమగోదావరి, నాల్గో స్థానంలో చిత్తూరు ● నేటి నుంచి బాలికల క్రికెట్ సమరం శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ స్కూల్గేమ్స్ అండర్–19 బాలుర క్రికెట్ టోర్నీ చాంపియన్గా విశాఖపట్నం నిలిచింది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో ఆతిధ్య శ్రీకాకుళం జట్టును సూపర్ఓవర్లో ఓడించి జయకేతనం ఎగురవేసింది. మూడో స్థానం కోసం జరిగిన మరో కీలక మ్యాచ్లో చిత్తూరును పశ్చిమ గోదావరి జట్టు ఓడించింది. శ్రీకాకుళం జిల్లాలో విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం/ఎచ్చెర్ల/చిలకపాలెం క్రీడామైదానాల వేదికలగా మూడు రోజులపాటు జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 బాలుర చాంపియన్షిప్ పోటీలు బుధవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు, బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమలో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో స్టేట్మీట్ పరిశీలకులు రాజేష్ గోల(కర్నూలు), ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, పీడీ–పీఈటీ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవీ రమణ, ఎం.ఆనంద్కిరణ్, ఎ.డిల్లేశ్వరరావు, బి.లోకేశ్వరరావు, బి.మల్లేశ్వరరావు, జిల్లా ఒలంపిక్ సంఘం సలహాదారు పి.సుందరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, గ్రిగ్స్ సెక్రెటరీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ సాగిందిలా.. స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో బుధవారం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల మధ్య ఫైనల్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విశాఖ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. 75 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కి దిగిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేయడంతో స్కోర్ సమమైంది. ఫలితం తేల్చేందుకు మ్యాచ్ అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జిల్లా జట్టు 7 పరుగులు చేసింది. 8 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం జట్టు మూడు బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది. నేటి నుంచి మహిళా పోరు ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 బాలికల చాంపియన్షిప్–2025–26 పోటీలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మైదానాలతోపాటు అవసరమైతే ఎచ్చెర్లలోని వెంకటేశ్వర, చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలల మైదానాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. -
చిరుధాన్యాల ఉత్పత్తులకు డిమాండ్
ఆమదాలవలస: చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన చిరుధాన్యాల సాగు మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వృత్తి శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. దీంతో శిక్షణ పొందిన రైతులకు కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణలో పాల్గొనేవారు ఉపాధి అవకాశాలను సృష్టించుకునేలా ప్రయత్నించాలని సూచించారు. అనంతరం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతిబసు మాట్లాడుతూ మేజర్ మిల్లెట్స్ సాగు విధానం, వాటికున్న డిమాండ్ను వివరించారు. గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సునీత మాట్లాడుతూ చిరుధాన్యాలు పోషక విలువలు కలిగి ఉంటాయన్నారు. రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కిరణ్ కుమార్, డాక్టర్ జీఎస్ రాయ్ తదితరులు పాల్గొన్నారు. -
కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలి..!
● ఫ్యూచర్ క్రికెటర్లకు శుభవార్త ● 9న జిల్లా అండర్–12 జట్టు ఎంపికలు నెట్స్ వద్ద ప్రాక్టీసులో చిన్నారులు శ్రీకాకుళం న్యూకాలనీ: క్రికెట్లో రాణించాలనుకునే చిన్నారులకు జిల్లా క్రికెట్ సంఘం తీపి కబురు అందించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గత కొన్నేళ్లగా పాఠశాల స్థాయిలో రాణిస్తున్న 12 ఏళ్లలోపు క్రీడాకారులను గుర్తించేందుకు ప్రణాళిక చేసింది. వీరిని ఉన్నతంగా తీర్చిదిద్దుతూ భవిష్యత్ క్రికెటర్లగా మార్చనున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా అంతర్ జిల్లాలు, జోనల్ స్థాయి, రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించి క్రికెటర్లను ప్రోత్సహించాలని నిర్ణయించింది. రంగం సిద్ధం ఫ్యూచర్ క్రికెటర్ల గుర్తింపులో భాగంగా మొదటి అంకానికి రంగం సిద్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లా అండర్–12 బాలుర జట్టు ఎంపికలు ఈనెల 9వ తేదీన జరగనున్నాయి. ఇందుకు జిల్లా క్రికెట్ సంఘం కసరత్తులు చేస్తుంది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఎంపికల ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ ఎంపికల్లో పాల్గొనే బాలురు 2013 సెప్టెంబర్ ఒకటి నుంచి 2015 ఆగస్ట్ 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఎంపికై న జిల్లా జట్టుని త్వరలో జరిగే ఏసీఏ నార్త్జోన్ అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో పాల్గొనే టోర్నీకి పంపించనున్నారు. ప్రాబబుల్స్ ఎంపిక తొలిత ప్రాబబుల్స్ జట్టును తీసి, శిక్షణా శిబిరాలను నిర్వహించి, అనంతరం సెలక్షన్ మ్యాచ్లను నిర్వహించి తుది జట్టును ఖరారు చేయాలని నిర్ణయించారు. కాగా ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్కార్డు, ఫారం–5తో తెలుపు రంగు యూనిఫాంను ధరించి హాజరుకావాలని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ సంయుక్తంగా కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా క్రికెట్ కోశాధికారి శైలానీ (9246631797), సంఘం చీఫ్ కోచ్ కె.సుదర్శన్ (9441115396) నంబర్లను సంప్రదించాలని సూచించారు. క్రికెట్ సాధనలో క్రీడాకారులు -
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కృషి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కృషి చేస్తోందని వివిధ ఉద్యోగ, పౌర సంఘాల ప్రతినిధులు కొనియాడారు. స్థానిక ఎన్జీవో హోమ్లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని సంఘం రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ అధ్యక్షత బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సదాశివుని కృష్ణ, జి.లక్ష్మణరావు, జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక నేతలు బొడ్డేపల్లి ప్రసాదరావు, ఎస్.జోగినాయుడు, జి.షణ్ముఖరావు, డోల శంకరావు, డోల అప్పన్న, సీహెచ్ నాగభూషణ్, టెంక శ్రీను, రౌతు సూర్యనారాయణ, భేరి చిన్నారావు, జి.నర్సింగరావు, గంగు మన్మథరావు, బాసూరు సాయి, డి.నందికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పనులు వేగవంతం చేయాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జల్ జీవన్ మిషన్ పనులపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెండర్ స్థాయిలో ఉన్న వాటిని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉద్దానం ప్రాంతానికి సంబంధించి అటవీ శాఖ వద్ద ఉన్న సమస్య గురించి సంబంధిత డీఈ కలెక్టర్ కు వివరించారు. ప్రతీ ఏఈ పైపుల నిల్వ ఎంత ఉన్నది నోట్ చేయాలన్నారు. రోజు వారీగా పురోగతి చూపించాలన్నారు. ఎచ్చెర్ల మండలంలో సైట్ సమస్య ఉందని కలెక్టర్కు డీఈ చెప్పగా, డీఈలు అందరికీ సైట్ సమస్య ఉంటే ఆ జాబితా ఎస్ఈకి ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పి.శంకర్ బాబు పాల్గొన్నారు. -
పగలు డంపింగ్.. రాత్రి లోడింగ్..!
● యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ● ట్రాక్టర్లతో ఒడిశా తరలిస్తున్న వైనం ● రూ.కోట్లకు పడగలెత్తుతున్న ఇసుకాసురులు కొత్తూరు: కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ ఆయా పార్టీల నేతలకు వరంగా మారింది. పేరుకే ఉచిత ఇసుక పథకం తప్ప వినియోగదారులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ట్రాక్టర్ ఇసుకకు రూ.వేలల్లో చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఉచిత ఇసుక పాలసీ కూటమి నేతల ధనార్జనకు మార్గమైంది. ప్రభుత్వ నిబంధనల మేరకు కూలీల చేత నదిలో ఉన్న ఇసుకకు ట్రాక్టర్కు లోడు చేయించాలి. అయితే అందుకు భిన్నంగా మండలంలోని కడుము కాలనీ, వసప గ్రామాల వద్ద ప్రొక్లెయినర్లతో లోడింగ్ చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు వసప, కడుము గ్రామాల వద్ద వంశధార నుంచి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమార్కులకు ఇసుక వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఇసుక తరలింపుతో రోజుకు రూ.లక్షల్లో ఇసుకాసురులు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నదిలో ప్రొక్లెయినర్లతో ట్రాక్టర్లకు లోడింగ్ చేసి ఒక్కో ట్రాక్టర్కు రూ.500ల నుంచి రూ.1,000ల వరకు వసూలు చేస్తున్నారు. అంధ్రా నుంచి ఒడిశాకు ఇసుక తరలించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వంశధార నది నుంచి పగలంతా ట్రాక్టర్లతో కడుము కాలనీ, గొట్లభద్ర, కిమిడి–వారణాసి రోడ్లకు ఆనుకొని ఇసును డంపింగ్ చేసి ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తున్నారు. అనంతరం ఈ అక్రమ నిల్వలను రాత్రులు టిప్పర్లు, ట్రాక్టర్లతో ఒడిశాకు తరలిస్తున్నారు. అక్రమ ఇసుక వ్యవహారం కొంతమంది కూటమి నేతలు అండదండలతో యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమంగా రవాణా చేసినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ అధికారుల మాటలను అక్రమార్కులు బేఖాతరు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం కడుము, కడుము కాలనీ, వసప గ్రామాల వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వసప వద్ద అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. నదిలో నుంచి ఇసుక తవ్వకాలు జరగకుండా ఉండేందుకు కందకాలు తవ్వడం జరిగింది. ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటాం. – కె.బాలకృష్ణ, తహసీల్దార్, కొత్తూరు మండలం -
Srikakulam: టీచర్పై సస్పెన్షన్ వేటు
శ్రీకాకుళం జిల్లా: బందపల్లి బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహంలో ఉపాధ్యాయిని యవ్వారం సుజాతపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమె విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ అయ్యింది. నిజానికి గత నెలే ఈ వీడియో అధికారులకు చేరింది. కానీ బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో బయటపడి వైరల్ కావడంతో టీచర్ను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీడియోపై టీచర్ను వివరణ కోరడానికి ‘సాక్షి’ సంప్రదిస్తే ఆమె మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఎప్పడు జరిగిందో నాకు తెలియదుఇప్పటివరకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు తెలియవు. సోషల్ మీడియా లో ఫొటో చూశాను అంతే. ఇది ఎప్పుడు జరిగిందో కూడా నాకు తెలియదు పై అధికారులకు తెలియజేశాను. – ఎస్.దేవేంద్రరావు ఎంఈఓ, మెళియాపుట్టివీడియో ఎవరు తీశారో తెలీదు వీడియో బయటకు రావడంతో పీఓ ఆమెకు నెల కిందటే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దానికి ఆమె సమాధానం ఇ చ్చారు. ఏం వివరణ ఇచ్చారో నాకు తెలీదు. టీచర్ను వివరణ కోరగా.. ఆరోగ్యం బాగోక అలా చేశానని తెలిపా రు. – దార ప్రశాంతి కుమారి, ప్రధానోపాధ్యాయురాలు #Srikakulam —A teacher from Bandapalli Girls’ Tribal Ashram School has been suspended after a video showing her talking on the phone while students massaged her legs went viral on social media.The teacher, identified as Sujatha, was captured in the video sitting and speaking… pic.twitter.com/KoaUZikGSm— NewsMeter (@NewsMeter_In) November 4, 2025 rikakulam Teacher Viral Video -
అగ్ని ప్రమాదంలో మూగజీవాలు మృతి
రణస్థలం: పాతర్లపల్లి పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో పాడిరైతు పిన్నింటి అప్పలనాయుడుకు చెందిన పశువుల షెడ్ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో రెండు ఆవులు, నాలుగు దూడలు మృతి చెందాయి. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో షెడ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెక్క దూలాలకు మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న ఆటో, స్కూటీలతో పాటు వాటర్ పైపులకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. అదే షెడ్లో ఉన్న రెండు ఆవులు, నాలుగు దూడలు చనిపోయాయి. విషయం తెలుసుకున్న రణస్థలం అగ్నిమాపక అధికారి డి.హేమసుందర్ సిబ్బందితో వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో సుమారు రూ.5లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు. పాతర్లపల్లి పశువర్థక అధికారి డి.చంద్రశేఖర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు పిన్నింటి సాయికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిహారాన్ని అందేలా కృషి చేస్తానని రైతును ఓదార్చారు.ఆయన వెంట సర్పంచ్ గొర్లె రాధాకృష్ణ, నాయకులు మహంతి పెదరామినాయుడు, వెంకటప్పలనాయుడు, పిన్నింటి శ్రీచరణ్, మహంతి అప్పలనాయుడు, గొర్లె కన్నా, వాళ్లే అప్పలన్న, లంక హరీష్, గొర్లె సత్యం, వలిరెడ్డి సూరిబాబు తదితరులు ఉన్నారు. -
బెల్టు నిర్వాహకులపై బైండోవర్ కేసులు
ఇచ్ఛాపురం రూరల్ : అక్రమంగా నాటుసారా, బెల్టు షాపుల నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ ప్రొహిబిషన్ సీఐ పి.దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం, కవిటి మండలాలకు చెందిన 18 మంది బెల్టుషాపు నిర్వాహకులను, పాత కేసులలోని ముద్దాయిలను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి తహసీల్దార్ ఎన్.వెంకటరావు సమక్షంలో బైండోవర్ నమోదు చేశారు. ఇకపై సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. బెల్టు షాపుల నిర్వహణ, నాటుసారా అమ్మకం చేస్తున్నట్లు తెలిస్తే తమకు 14405 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందజేయలని కోరారు. ఎకై ్సజ్ ఎస్ఐ జీసీహెచ్వి రమణారావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. కార్గో ఎయిర్పోర్టు వద్దు మందస : బిడిమి గ్రామంలోని జుత్తు జగన్నాయికులు భవనంలో పలాస ఆర్డీవో వెంకటేష్ మంగళవారం భూ సర్వే పేరిట గ్రామస్తులతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. బిడిమి రెవెన్యూ గ్రామంలోని పెద్ద బిడిమి, తిమ్మల బిడిమి, కొత్త బిడిమి, శ్రీరామ్నగర్ గ్రామాలకు చెందిన రైతులంతా పాల్గొని తమకు కార్గో ఎయిర్పోర్టు వద్దని ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక కమిటీ సభ్యులైన కొమర వాసు, జోగి అప్పారావు, బత్తిన లక్ష్మణ్లను పోలీసులు నిర్బంధించి.. బిడిమి రెవెన్యూ భూములకు సంబంధం లేని వారిని సమావేశానికి ఎలా అనుమతి ఇచ్చారని వాగ్వాదానికి దిగారు. తక్షణమే కార్గో ఎయిర్ పోర్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ స్పందిస్తూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. నేడు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ దినోత్సవం శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం బుధవారం శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోమ్లో నిర్వహించనున్నట్టు ఎన్ఏజే జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు సత్తారు భాస్కరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కృష్ణ, జి.లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, బాధ్యతలు, చట్టాలు అనే అంశంపై రౌండ్టేబుల్ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ, పాత్రికేయ సంఘాలు, పాత్రికేయ మిత్రులు పాల్గొనాలని కోరారు. 9న శిష్టకరణ శతాబ్ది స్థూపావిష్కరణ శ్రీకాకుళం కల్చరల్ : అఖిల భారత శిష్టకరణ సంఘం స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 9న జలుమూరులో శతాబ్ది స్థూపావిష్కరణ వేడుక నిర్వహిస్తున్నట్లు ఆలిండియా శిష్టకరణ సంఘం అధ్యక్షుడు డబ్బీరు వెంకట కృష్ణారావు మంగళవారం తెలిపారు. 1925లో జలుమూరు వేదికగా జాతీయ స్థాయి శిష్టకరణ సంఘం ఏర్పాటైందన్నారు. నాటి నిరక్షరాస్యత, వెనుకబడిన సమాజాన్ని చైతన్య పరచడంలో శిష్టకరణాల పాత్ర కీలకమన్నారు. అఖిల భారత శిష్టకరణం సంఘం నాయకుల తీర్మాన, ఆహ్వానం మేరకు శిష్టకరణ బంధువులంతా వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
23న జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు
శ్రీకాకుళం: మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతంగా నిర్వహించామని, ఈ నెల 23న జిల్లా స్థాయి పోటీలుంటాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు తెలిపారు. మంగళవారం మండల స్థాయిలో జరిగిన పలు కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ జిల్లాలో 30 మండలాలు, 355 ప్రభుత్వ పాఠశాలలు, 45 ప్రైవేటు పాఠశాలల నుంచి 476 జట్లతో 1428 మంది విద్యార్ధులు, 600 మంది ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం వహించారని వివరించారు. మండల స్థాయి విజేతలు 23న శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. -
తీరంలో అప్రమత్తం
గార: కార్తీక పౌర్ణమితో పాటు శని, ఆదివారాల్లో తీర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని కళింగపట్నం మైరెన్ సీఐ బి.ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం వేకువ జామున 3 గంటల నుంచి మైరెన్ పోలీసులు తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉంటారని, దీపాలు విడిచిపెట్టే సమయం, స్నానాలు పట్ల అధికారుల సూచనలు పాటించాలని కోరారు. నీటిలో ఎక్కువ దూరం లోపలకు వెళ్లకూడదని, తుఫాను ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతం కోతకు గురవ్వడంతో పాటు, కొన్ని చోట్ల గుంతలు ఏర్పడి బయటకు కనిపించకుండా ఉన్నాయని, మనిషి వెళితే దిగబడిపోయే అవకాశాలెక్కువ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్నారుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. మద్యం సేవించడం, గందరగోళం సృష్టించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు తప్పవన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత స్నానాలకు దిగకూడదని, ఎటువంటి సమస్య తలెత్తినా డయల్ 100కు సమాచారమివ్వాలని కోరారు. -
రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో రోడ్ల అభివృద్ధి
శ్రీకాకుళం: రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో రాష్ట్ర పరిధిలో ఉన్న జాతీయ రహదారులు అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారు చేశామని రాష్ట్ర జాతీయ రహదారుల చీఫ్ ఇంజినీర్ వి.రామచంద్ర చెప్పారు. మంగళవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో రాష్ట్రానికి రూ.లక్ష కోట్లు మంజూరు చేశారని, విడతల వారీగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో ఉన్న పాడైన రహదారులను స్వయంగా పరిశీలించేందుకు జిల్లాకు వచ్చినట్లు చెప్పారు. మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేస్తామన్నారు. ఆయనతో పాటు జిల్లా రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షణ ఇంజినీర్ పి.సత్యనారాయణ, ఇతర ఇంజినీర్లు ఉన్నారు. -
సెమీఫైనల్కు దూసుకెళ్లిన శ్రీకాకుళం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ స్కూల్గేమ్స్ స్టేట్మీట్ క్రికెట్ టోర్నీలో ఆతిథ్య శ్రీకాకుళం బాలురు జట్టు సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ఫైనల్స్ మ్యాచ్లో పటిష్టమైన కృష్ణా జిల్లాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీకాకుళం వేదికగా ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 పరిమిత ఓవర్ల క్రికెట్ ఛాంపియన్షిప్–2025–26 పోటీల్లో భాగంగా రెండో రోజు పోటీలు ఆద్యంతం హోరాహోరీగా సాగాయి. లీగ్ కమ్ నాటౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం మైదానంతోపాటు ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల మైదానం, సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ క్రీదామైదానం, చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల క్రీడామైదానం నాలుగు వేదికల్లో మ్యాచ్లను నిర్వహించారు. హోరాహోరిగా పోరు.. రెండవ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో గుంటూరు జిల్లాపై జయభేరి మోగించిన పశ్చిమగోదావరి జట్టు సెమీఫైనల్స్లో అడుగుపెట్టింది. మిగిలిన మరో రెండు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లు వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆట నిలిపివేశారు. చిత్తూరు–తూర్పుగోదావరి జట్ల మద్య జరుగుతున్న మూడవ క్వార్టర్ఫైనల్ మ్యాచ్ రక్తికట్టింది. ఇరుజట్ల స్కోర్లు సమానం కావడంతో సూపర్ఓవర్ నిర్వహించగా.. అందులోను ఇరు జట్ల స్కోర్లు సమానయ్యాయి. రెండో సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహించే సమయానికి లైట్ఫెయిల్ కావడంతో బుధవారం సూపర్ ఓవర్ మ్యాచ్ నిర్వహించనున్నారు. బుధవారంతో బాలుర క్రికెట్ పోటీలు ముగియనున్నాయి. రెండు సెమీఫైనల్స్ మ్యాచ్లు, ఫైనల్ మ్యాచ్, మూడవ స్థానం కోసం మరో మ్యాచ్ కలిపి మొత్తం నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు. గురువారం నుంచి బాలికల పోటీలు మొదలుకానున్నాయని ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, మహిళా సెక్రటరీ ఆర్.స్వాతి తెలిపారు. -
పుణ్యక్షేత్రాల్లో రద్దీ నియంత్రణపై దృష్టి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలోని అన్ని ప్రధాన దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో కార్తీక మాసంతోపాటు మిగిలిన పర్వదినాల్లో భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్తో కలిసి జిల్లా, మండల స్థాయి అధికారులతో వీసీ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. క్యూలైన్లు, భద్రత, ప్రసాదం కౌంటర్లు, పార్కింగ్ నిర్వహణ విషయంలో ఎక్కడా లోటు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీసు యంత్రాంగం, ఆలయ కార్యనిర్వహణ అధికారులు, స్థానిక సంస్థలు సమన్వయంగా పనిచేయాలన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు ప్రక్రియ, పారిశుద్ధ్య నిర్వహణ, శాంతి భద్రతలు, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి, 5500 వాహనాలకు జీపీఎస్ వినియోగం సాధ్యం కానందున, 9 బృందాలను ఏర్పాటు చేసి ట్రాకింగ్ డివైజ్లు ఇన్స్టాల్ చేయాలని సూచించారు. జిల్లాలో 200 ఈ–హబ్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థల సేకరణ చేపట్టాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణ మూర్తి తదితరులు పాల్గొన్నారు -
నేడే ఎందువ కై లాసగిరి ప్రదక్షిణ
జి.సిగడాం: మండలంలోని ఎందువ గ్రామంలో కై లాసిగిరి కొండపై వెలసిన కై లాశేశ్వర క్షేత్రంలో గిరి ప్రదక్షిణకు భారీ పోలీసు బందోస్తు ఏర్పాటు చేశామని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తెలిపారు. మంగళవారం గ్రామంలో కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం ఉదయం 5 గంటల నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. ఉదయం 11 గంటలకు 21 అడుగుల శివపార్వతుల విగ్రహాల ఆవిష్కరణ ఉంటుందన్నారు. సాయంత్రం కై లాసగిరి శిఖరంపై అఖండ జ్యోతి ప్రజ్వలన జరుగుతుందని, వేదపండితులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జె.ఆర్.పురం సీఐ అవతారం, తహసీల్దార్ మహాదేవు సరిత, ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావు, ఎస్ఐ వై.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష ఎందువలో పర్యటించి ఏర్పాట్లపై ఆరా తీశారు. -
సరికొత్త వరివడి
సేద్యంలో.. ● కొత్త రకాలను సాగు చేస్తున్న ఉద్దానం బీల రైతులు ● విరగకాసిన పైర్లతో కళకళ కవిటి : రాష్ట్రంలో రెండో కోనసీమగా గుర్తింపు పొందిన కవిటి ఉద్దానం ప్రాంతంలో కొత్త రకం వరి వంగడాల సాగుతో పలువురు రైతులు ఔరా అనిపించుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణా వరి పరిశోధనా స్థానంలో తయారైన వరి రకాలు, ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో విజయవంతంగా సాగు చేసిన వరి విత్తనాలను ఈ ఏడాది తెప్పించి ఖరీఫ్ సీజన్లో విజయవంతమయ్యారు. ఈ రకాలన్నీ 125 రోజులు, 135 రోజులు, 140–145 రోజుల మధ్యస్త పంట కాలవ్యవధి కలిగినవే. ఇక్కడి రైతులు వీటిని యూట్యూబ్లో చూసి గతంలో సాగుచేసిన రైతుల అనుభవాలతో కూడిన కథనాలు చదివి వారిని ఉద్దానం బీలప్రాంతంలోనూ సాగు చేయడమే కాకుండా విజయవంతం కావడం విశేషం. ఈ ప్రాంతంలో తొలిసారి సాగుచేసిన ఈ వరిపైర్లను చూసేందుకు ఇరుగు పొరుగు రైతులు కూడా వస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికందినప్పటికీ అడవిపందులు, పక్షుల బెడద తీవ్రంగా ఉందని రైతులు చెబుతున్నారు. -
వైభవంగా మహాభజన సమారోహణ
పర్లాకిమిడి: పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా పర్లాకిమిడి శ్రీజగన్నాథ మందిరం ఆవరణలో మంగళవారం సాయంత్రం మహాభజన సమారోహణ కార్యక్రమాన్ని కళా సంస్కృతి సేవా ట్రస్టు, హైటెక్ మెడికల్ కళాశాలల చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి ఆధ్వర్యంలో జరిగినది. తొలుత శ్రీజగన్నాథ స్వామికి జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతి రావు, పురపాలక సంఘం అధ్యక్షురాలు నిర్మలా శెఠి తదితరులు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించగా సమలై నృత్య కళాకారులు, మిరాకిల్ డ్యాన్స్ అకాడమీ, సమలై నృత్య అకాడమీ ఆధ్వర్యంలో డ్యాన్స్ కార్యక్రమాలు ప్రదర్శించి ఆహూతులను ఆకట్టుకున్నారు. అనంతరం కుమారి తపస్వీ కోరో...అలిగిరి నందినీ.. పాటతో డ్యాన్సుతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. భువనేశ్వర్కు చెందిన శ్రీచరణ్ మహాంతి, అంజిలీ మిశ్రా భక్తిగీతాలతో ప్రేక్షకులను తన్మయ పరిచింది. హైటెక్ గ్రూప్ చైర్మన్ తిరుపతి పాణిగ్రాహి వేదికపై కుమారీ తపస్వీకోరోకు రూ.5 వేలు, మెమొంటోతో సత్కరించారు. అలాగే మిరాకిల్ డ్యాన్సు అకాడమీ అధినేత శథపతి, సమలై నృత్య అకాడెమీ నిర్వాహకులు బాలకృష్ణ పాణిగ్రాహికి మెమొంటోలతో సత్కరించారు. -
పోలీసుల అదుపులో ‘మోస్ట్వాంటెడ్ దున్న కృష్ణ’
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకు చెందిన కరడు గట్టిన దొంగ, పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న ‘దున్న కృష్ణ’ శ్రీకాకుళం సీసీఎస్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతన్ని పట్టుకోవడానికి రాష్ట్రంలో అన్ని పీఎస్ల పోలీసులూ ప్రయత్నిస్తున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి దున్న కృష్ణను పట్టుకునే బాధ్యతను సీఐ సూర్యచంద్రమౌళి ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ఆరు నెలలు శ్రమించి.. ఆరు నెలల నుంచి దున్న కృష్ణను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సీసీఎస్ పోలీసులు ఈ ఏడాది విజయదశమికి ముందే కలకత్తాలో దాదాపు పట్టుకునేంత పనిచేశా రు. విపరీతమైన తుఫాన్లు రావడంతో అక్క డి కమ్యూనికేషన్ దెబ్బతిని త్రుటిలో కృష్ణ తప్పించుకున్నాడు. జిల్లా పోలీసులే పట్టుకుంటారన్న ఆశ ఉన్నప్పటికీ ఎక్కడ మిస్ అవుతాడేమో అని ఇటీవల జిల్లా పోలీ స్ కార్యాలయం నుంచి మోస్ట్ వాంటె డ్ క్రిమినల్ పోస్టర్ విడుదల చేశారు. ఐదు బృందాలతో గాలింపు చర్యలు.. సీసీఎస్ పోలీసులు, ఆమదాలవలస జీఆర్పీఎస్ ఎస్ఐతో అక్కడ పట్టుకునేందుకు ఒక టీమ్, శ్రీకాకుళం వన్టౌన్, టూటౌన్ పోలీసులతో రాత్రి నిఘా పెడు తూ మొత్తం ఐదు బృందాలు గాలింపు చేపట్టాయి. కోల్కతాలో కుటుంబం, బంధువు లు ఉండటంతో అక్కడ ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో సీసీఎస్ టీమ్, విజయనగరం బొబ్బిలిలో కదలికలుండటంతో అక్కడో సీసీ ఎస్ టీమ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ సాయంతో వెళ్లారు. చివరికి కోల్కతాకు వెళ్లిన సీసీఎస్ టీమ్కు కృష్ణ పట్టుబడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రికవరీ చేసే పనిలో.. పోలీసులు ఇతని నుంచి బంగారాన్ని రి కవరీ చేయించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. మన జిల్లాలో ఇటీవల 15 నేరాలు చేసినట్లు, విశాఖలో మరో 10కు పైగా నేరాలు చేసినట్లు తెలుస్తోంది. -
అవిసిన గుండెలు.. అలసిన బతుకులు
గుండెలోని కష్టం చెప్పుకుంటే ఎప్పటికి పరిష్కారమవుతుందో తెలీదు. గొంతు తెరిచి ఫిర్యాదు చేస్తే ఎవరు వేధింపులకు పాల్పడతారో అర్థం కాదు. కంటితో చూసిన అక్రమాన్ని ప్రశ్నిస్తే నాయకుడి కోపం నుంచి తప్పించుకునే వీలే లేదు. సగటు సిక్కోలు మనిషి రానురాను నిస్సహాయుడైపోతున్నాడు. చనిపోవడానికి సిద్ధమని ప్రకటించుకుంటే తప్ప సమస్య పరిష్కారం కాదేమో అన్నంతగా బలహీనుడిగా మారుతున్నాడు. గ్రీవెన్స్లో కనిపిస్తున్న పెట్రోల్ బాటిళ్లు ఈ అలసిన బతుకులకు సాక్ష్యాలు. బాధితుల చేతుల్లోని పురుగు మందుల డబ్బాలు అవిసిన గుండెలకు నిదర్శనాలు. -
ఒంటూరులో ట్యాంకర్తో నీటి సరఫరా
కవిటి: ‘చుక్కనీరైనా దొరకదు కదా ఇది ఒంటూరు కథ’ అనే శీర్షికతో ‘సాక్షి’ పత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనంపై గ్రామ పంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. స్థానిక సర్పంచ్ లలితాసాహు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దేవరాజ్ సాహూ ఒంటూరు వెళ్లి ప్రజలకు తాగునీటి అవసరాల నిమిత్తం ట్రాక్టర్తో ఒక ట్యాంక్ నీటిని పంపిణీ చేశారు. గడచిన వారంరోజులుగా పంచాయతీ నుంచి పంపిణీ చేస్తున్నామని దేవరాజ్ సాహు తెలిపారు. ఇది ఒంటూరుకు సరైన పరిష్కారం కాదని ముందు ఊరికి మంచి వాటర్ట్యాంక్, కుళాయి పైప్లైన్, నీటిసరఫరా వంటి చర్యలతో మాత్రమే శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. -
ఇదీ మన నాయకుల ఘనత..
శ్రీకాకుళం పాతబస్టాండ్/ శ్రీకాకుళం క్రైమ్ : ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిస్థితికి అద్దం పడుతోంది. నాయకులు, అధికారులు తమను పట్టించుకోవడం లేదని సామాన్యులు తండోపతండాలుగా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అయితే ఒక్క గ్రీవెన్స్ నాడే కాదు.. ప్రతి రోజూ రౌడీషీటర్లు, ఇతర అసాంఘిక శక్తులపై నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. మరికొందరు బాధితులు తమ సమస్యలు తీరక విసిగి వేసారి పెట్రోల్ బాటిళ్లతో, పురుగుల మందు డబ్బాలతో జిల్లా అధికారుల వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తుండడం, చివరికి ఎండార్స్మెంట్లతో సరిపెట్టేస్తుండటంతో అధికారులపై విమర్శలు వస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మీకోసం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే కార్యక్రమాన్ని పీజీఆర్ఎస్గా మార్చిన కూటమి ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. అధికారులతో పాటు పాలకుల వేధింపులు తాళలేక సామాన్యులు బలైపోతున్న ఘటనలు కూడా జిల్లాలో కనిపిస్తుండడం గమనార్హం. ఇదేనా పరిష్కారం.. ● ఇటీవల నరసన్నపేట మండలంలో ఓ వీఆర్ఓ ఎండార్స్మెంట్పై ఫిర్యాదుదారు సంతకం చేసేసి అర్జీదారు వాట్సాప్కు సమాచారం పెట్టేశారు. ఎండార్స్మెంట్లో తన పేరిట ఉన్న సంతకం చూసి విస్తుపోవడం ఫిర్యాదుదారు వంతైంది. ● జిల్లాలో దాదాపు 4 వేల పింఛన్లు రద్దు చేశారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం పొందిన వారికే మళ్లీ రీ వెరిఫికేషన్ పేరిట నోటీసులు జారీ చేశారు. దీంతో వీరంతా గ్రీవెన్స్కు క్యూ కట్టారు. వీరిలో ఎందరి సమస్యలు పరిష్కరించారో అధికారులకే ఎరుక. ఖాకీల వైఖరిపై.. ● కొత్తూరు మండలం శోభనాపురం గ్రామానికి చెందిన ఓ యువకుడి కుటుంబ సభ్యులు కొత్తూరు ఎస్ఐపై ఎస్పీకి ఫిర్యా దు చేశారు. కొండపై క్వారీయింగ్ విషయంలో ఫిర్యాదు చేస్తే యువకుడిని స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే ఎస్ఐపై గ్రామస్తులు కూడా ఫిర్యాదు చేశారు. ● బహిరంగంగా మద్యం సేవిస్తే జరిమానాలు విధించి కేసులు కట్టే పోలీసులు ఎస్పీ గ్రీవెన్స్కు ఏకంగా మద్యం సేవించి వస్తే ఏమీ చేయలేని దుస్థితి ఎదురవుతోంది. ఇటీవల ఎస్పీ గ్రీవెన్స్లో సరుబుజ్జిలి మండలం మాలసవలాపురం గ్రామానికి చెందిన కొంతమంది మద్యం సేవించి వచ్చి కార్యాలయం కింద గార్డుల విధులకు ఆటంకం కలిగించారు. పాలకుల తీరుకు విసిగిపోతున్న సామాన్యులు అర్జీదారుల ఆర్తనాదాలతో మార్మోగుతున్న గ్రీవెన్స్ పెట్రోల్ బాటిళ్లు, పురుగు మందు డబ్బాలతో హాజరవుతున్న బాధితులు పరిష్కారం కాకుండానే.. టెక్కలి : టెక్కలి మండలం రావివలస సమీపంలో స్టోన్ప్లస్ గ్రానైట్ క్వారీ వల్ల తన పంట పొలం నాశనమవుతోందని గ్రామానికి చెందిన బుడ్డ రాంబాబు కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. క్వారీ వ్యర్థాల వల్ల తన 95 సెంట్ల పొలంలో పంట పోతోందని పేర్కొన్నాడు. అయితే సమస్య పరిష్కారం కాకుండా పరిష్కారం జరిగినట్లు చూపిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ 16న బూర్జ మండలం గుత్తావిల్లికి చెందిన సనపల సురేష్ కారులో వస్తుండగా బలగ మెట్టు వద్ద ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు అడ్డగించి దాడికి తెగబడ్డారు. తమ అక్రమాలు బయటకు చెబుతున్నాడనే కక్షతో అందరూ చూస్తుండగానే దాడికి దిగారు. ఎస్పీ మహేశ్వరరెడ్డికి పలుమార్లు మొర పెట్టుకున్నా, రెండో పట్టణ పోలీసుల వద్దకు కాళ్లరిగేలా తిరిగినా సురేష్పై దాడికి సంబంధించి ఇప్పటికీ చార్జిషీటు వేయలేదు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, అతని అనుచరుల వేధింపులు తాళలేక ఇటీవల పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్, దళిత మహిళైన రేజేటి సౌమ్య శ్రీకాకుళం నగరం తిలక్నగర్లో నివాస గృహంలో బీపీ స్టెరాయిడ్స్ మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఏడాది జూలైలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అనుచరులు రోడ్డు అవినీ తిని ప్రశ్నించినందుకు తనపై హత్యాయత్నానికి దిగారని.. ఎమ్మెల్యే బగ్గుతో తనకు ప్రాణహాని ఉందని శ్రీముఖలింగం ఆలయ అర్చకు డు నాయుడుగారి రాజశేఖర్ ఎస్పీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదుచేశారు. ఢిల్లీలో రాష్ట్రపతి సచివాలయ కార్యాలయానికి, జాతీయమానవ హక్కుల కమిషన్కు సైతం ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది మార్చి 18న తన ప్రాణానికి రక్షణ కల్పించమని సంతబొమ్మాళి మండలం గెద్దలపాడుకు చెందిన ఆశా కార్యకర్త ఎస్.చంద్రమ్మ ఎస్పీని వేడుకున్నారు. తన పోస్టును రూ. 2 లక్షలకు అమ్మేందుకు కొంతమంది సిద్ధపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గార మండలం అంపోలు గాంధీనగర్ వీధికి చెందిన కొల్లి అప్పారావు (45) పదేళ్లుగా దివ్యాంగ పింఛన్ తీసుకుంటున్నాడు. కానీ అతని పింఛన్ తీసేయడంతో భార్య లలితతో కలసి ఎలుకల మందు, ఫినాయిల్, యాసిడ్ కలిపి తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
నిఖిల్ కుటుంబానికి జెడ్పీ చైర్పర్సన్ పరామర్శ
సోంపేట: కాశీబుగ్గ చిన్నతిరుపతి దేవస్థానం వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన నిఖిల్ కుటుంబాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్తో కలిసి మంగళవారం బెంకిలిలో పరామర్శించారు. బాధలో ఉన్న తల్లిదండ్రులకు ఓదార్చారు. అనంతరం సోంపేట పట్టణంలో ఇటీవల మృతి చెందిన దున్న దర్మారావు, మ ల్లపు రెడ్డి గోవిందరాజులు, కొర్లాం పంచాయతీలో మృతి చెందిన బతకల వల్లభరావు కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలియజేశారు. జింకిభద్ర సర్పంచ్ తామాడ పద్మావతి, పార్టీనాయకులు కోట రాజు, బతకల శంకరరావు, పెద్దకోట అనంత్, రౌ తు విశ్వనాదం,ఇండుగు లక్ష్మినారాయణ,తామాడ మోహనరావు,తులసయ్య పాల్గొన్నారు. ఆస్పత్రిలో క్షతగాత్రులకు.. పలాస: కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో తీవ్రగాయాల పాలై పలాస కమ్యూనిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని జిల్లా న్యా య సేవా సంస్థ కార్యదర్శి కె.హరిబాబు మంగళవారం పరామర్శించారు. గాయపడిన వారితో మా ట్లాడారు. వైద్యులు పాపినాయుడుతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు కాశీబుగ్గ ఎస్.ఐ నరిసింహమూర్తి, పోలీసు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
కార్తీకానికికాశీబుగ్గ సెగ
● భక్తులను భయపెట్టిన తొక్కిసలాట దుర్ఘటన ● భద్రత భయంతో ప్రధాన ఆలయాలకు తగ్గిన భక్తులు ● అరసవల్లి తెప్పోత్సవానికి కూడా గత ఏడాది కంటే తక్కువగానే భక్తుల హాజరు ● ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు జలుమూరు మండలంలోని ప్రసిద్ధ శ్రీముఖలింగం ఆలయమిది. ఆలయానికి సాధారణ రోజుల్లోనే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల తాకిడి ఉంటుంది. కార్తీక మాసంలో మరింత ఎక్కువ ఎక్కువ రద్దీ ఉంటుంది. 10వేలకు పైబడి భక్తులు వస్తుంటారు. కానీ, ఈసారి కార్తీక మాసం రెండో సోమ వారం భక్తుల రద్దీ తగ్గింది. మునుపటిలాగా భక్తులు రాలేదు. 5వేల నుంచి 6వేల మధ్య ఉంటుందని అంచనా. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట భయంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని చాలామంది భక్తులు తగ్గినట్టు తెలుస్తోంది.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కార్తీకానికి కాశీబుగ్గ సెగ తగిలింది. జిల్లాలోని దాదాపు అన్ని ఆలయాలకు రెండో కార్తీక సోమవారం భక్తుల రాక తగ్గిపోయింది. శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ ఆలయాల్లో కూడా ఇదే పరి స్థితి చోటు చేసుకుంది. సాధారణంగా కార్తీక మా సం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చుట్టు పక్కల ప్రాంతాలు, జిల్లాలు, ఒడిశా నుంచి ప్రతి ఆలయానికి వేలల్లో వస్తుంటారు. కార్తీక సో మవారాలైతే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. కానీ ఈసారి దాదాపు ప్రతి దేవాలయంలో భక్తు ల తాకిడి తక్కువగా ఉంది. సగానికిపైగా భక్తులు ఆ ఆలయాలకు రాలేదు. గ్రామాల్లోని ఆలయాల పూజలకే పరిమితమైపోయారు. దీనికంతటికీ కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన దుర్ఘటనే కారణంగా తెలుస్తోంది. అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటన భక్తులను భయాందోళనకు గురి చేసింది. అంతదూరం వెళ్లి ఇబ్బంది పడటం కంటే స్థానికంగా ఉన్న దేవాలయాల్లోనే పూజలు చేసుకుంటే సరిపోతుందని భక్తులు భావించారు. ప్రముఖ అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం వద్ద ఆదివారం జరిగిన తెప్పోత్సవానికి భక్తుల సంఖ్య తగ్గింది. గతేడాది ఏడాదితో పోల్చితే ఈసారి సంఖ్య తగ్గినట్టు అంచనా. ముఖ్యంగా శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, బెండి నందికేశ్వర ఆలయం, మహేంద్ర గిరి, బెండి నందికేశ్వర ఆలయం.. ఇలా అన్ని ప్రధాన దేవాలయాలకు భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కాశీబుగ్గ దుర్ఘటనతో పోలీసులు అప్రమత్తమై ఆదివారం, సోమవారం అధిక సంఖ్యలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసిననప్పటికీ భక్తులకు నమ్మకం కలగలేదు. రద్దీని కంట్రోల్ చేయలేరన్న భయం పట్టుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా ఆలయాల్లో జరుగుతున్న ఘటనలు భక్తులను కలిచివేయడమే కాకుండా భయాందోళనకు గురి చేస్తున్నా యి. ఈ ప్రభుత్వం భక్తులకు భద్రత కల్పించలేదని, ఎప్పుడు ఏ సంఘటన చోటు చేసుకుంటుందోనన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. దైవదర్శనాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోందని, రద్దీ దృష్ట్యా ప్రధాన ఆలయాలకు వెళ్లాలంటేనే భయమేస్తోందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు పలుచగా ఉన్న దృశ్యమిది. ఉదయం 10గంటల సమయంలో ఉచిత దర్శనం కూడా వేగంగా జరిగిపోయింది. సాధారణంగా ఈ ఆలయానికి కార్తీక సో మవారాల్లో 15 వేల మంది వరకు వస్తుంటారు. కానీ ఈసారి రెండో సోమవారం 5నుంచి 6వేల వరకు వచ్చారని అంచనా. ఈ ఆలయానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి వస్తారు. ముఖ్యంగా ఒడిశా వాసులు మరింత నమ్మకంగా పూజిస్తారు. కాశీబుగ్గ దుర్ఘటనతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బాగా తగ్గిపోయింది. వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలోని శ్రీ నందేశ్వరాలయానికి భక్తుల రాక ఒక్కసారి తగ్గిపోవడంతో వెలవెలబోయింది. జీవగడ్డ ఒడ్డున ఉండటం, దేవతలు నిర్మించారని ప్రచారం ఉండటం వల్ల ఏటా కార్తీక మాసంలో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. అయితే, ఈ రెండో సోమవా రం భక్తుల తాకిడి కన్పించలేదు. ఉదయం 11గంట ల సమయానికే క్యూలు ఖాళీ అయిపోయాయి. -
● సర్వేకు ససేమిరా..
మందస: మందస మండలం ఉద్దాన ప్రాంతం బిడిమి, లక్ష్మీపురం, భేతాళపురం రెవెన్యూ గ్రామాల్లోకి భూ సర్వే పేరిట వచ్చిన పలాస రెవెన్యూ డివిజనల్ అధికారులతో కార్గో ఎయిర్పోర్టు బాధి త రైతులు సోమవారం వాగ్వాదానికి దిగారు. ఆర్డీఓ జి.వెంకటేష్ బాధిత రైతులతో మాట్లాడుతూ ఎయిర్పోర్టు కొలతల కోసం రాలేదని, రైతుల భూములు సర్వే చేయడానికి వచ్చామని చెప్పారు. కానీ దానికి కూడా జనం ఒప్పుకోలేదు. బాధిత భూముల్లో రీ సర్వే చేయడానికి ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో కార్గోఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, కమిటీ సభ్యులు గుంటు లోకనాథం, దున్న హరికృష్ణ, దున్న సురేష్, నల్ల పరుశురాం, దాసరి మోహన్, బత్తిన ఉమాపతి, బత్తిన దేశయ్య, మడియా రుషి, జుత్తు హేమరాజు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లిలో.. వజ్రపుకొత్తూరు రూరల్: అనకాపల్లి గ్రామంలో సోమవారం సర్వేకు వచ్చిన తహసీల్దార్ సీతారామయ్యను కార్గో ఎయిర్పోర్టు బాధితులు నిలదీశారు. తమ భూముల పేరిట ఉన్న సర్వే నంబర్లతో అడంగల్,1బిల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగితే కనీసం పట్టించుకోలేదని, ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చి సర్వేలు ఎందుకని ప్రశ్నించారు. జనమంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుంటే భూమి లెక్కలు వేయడం సబబు కాదన్నారు. -
అంతర్జాతీయ పోటీలకు సిక్కోలువాసులు
● రికార్డుస్థాయిలో ఏడుగురు ప్రాతినిధ్యం శ్రీకాకుళం న్యూకాలనీ: ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి రికార్డుస్థాయిలో ఏడుగురు ఎంపికయ్యారు. ఈ మెగా స్పోర్ట్స్మీట్ ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు తమిళనాడులోని చైన్నె నగరం వేదికగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు ఎంపికైనవారిలో పాలకొండ అప్పారావు, ఎం.భాగ్యలక్ష్మి, జె.రవి, వి.చిన్నబాబు, ఓ.శ్రీనివాసరావు, ఎం.కామయ్య, ఎల్.ప్రసాదరావు ఉన్నారు. వీరంతా ఇటీవలి జరిగిన జాతీయ పోటీల్లో పతకాలు సాధించడంతో ఏషియన్ మీట్కు ఎంపికయ్యారు. వివిధ వయో విభాగాల్లో రన్స్, జంప్స్, త్రోస్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా నుంచి ఎంపికై న మాస్టర్స్ అథ్లెట్స్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసో సియేషన్ అధ్యక్షుడు బొడ్డేపల్లి నారాయణరావు, ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి చల్లా జగదీష్, చౌదరి పురుషోత్తమనాయుడు, వెటరన్ అథ్లెట్స్, కుటుంబ సభ్యులు అభినందించారు. -
● ఎవరు చేసిన పాపం..?
నవ మాసాలు అమ్మ గర్భంలో భద్రంగా ఉన్న బిడ్డ.. బయటకు వచ్చిన వెంటనే ఇలా కాలువలో తేలియాడింది. ఉమ్మనీటి ఊయలలో నిశ్చింతగా ఉన్న పసికందు ప్రసవానంతరం ఇలా కాలువ నీటిలో ఊపిరి లేకుండా తేలింది. ఎవరి కన్నబిడ్డో.. ఎవరికి ఏ కష్టం వచ్చిందో గానీ అరసవల్లి సమీపంలోని శ్మశానానికి వెళ్లే దారిలోని పెద్ద గెడ్డలో ఓ పసికందు నిర్జీవంగా స్థానికులకు సోమవారం కనిపించింది. సమాచారం తెలుసుకున్న వన్టౌన్ ఎస్ఐ హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్లో మృతదేహాన్ని తీసుకెళ్లారు. – అరసవల్లి -
ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి
● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ టెక్కలి: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన సంఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని, బాధ్యులను పక్కన పెట్టి ఆలయ ధర్మకర్తపై ఆంక్షలు విధించడం సరికాదని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ధ్వజమెత్తారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సంఘటన జరిగిన తర్వాత అధి కార పార్టీ నాయకులు, మంత్రులు హడావుడి చేశారని, కానీ ఏకాదశి నాడు ఆలయంలో రద్దీ ఉంటుందని తెలిసినా పోలీసు బందోబస్తు కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని తెలి పారు. కాశీబుగ్గలో జరిగిన సంఘటన నేప థ్యంలో తాత్కాలికంగా హడావుడి చర్యలు కా కుండా ఆలయాల్లో ప్రత్యేకమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయల చొప్పు న పరిహారం ఇచ్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం విషయంలో పక్షపాతం చూపించారని వెల్లడించారు. గతంలో ఆలయాల్లో జరిగిన సంఘటనల్లో మృత్యవాత పడిన వారికి ఎంత మేరకు సాయం అందజేశారో అంతకు రెట్టింపు పరిహారం ఇవ్వాలని తిలక్ డిమాండ్ చేశారు. 11 నుంచి రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్ పాతపట్నం: రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్ పాతపట్నంలోని గిరిజన సామాజిక మైదానంలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ రమ ణారావు తెలిపారు. సోమవారం పాతపట్నం గిరిజన సామాజిక మైదానంలో రాష్ట్ర వ్యాయా మ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్ బాబు ఆధ్వర్యంలో సాఫ్ట్ టెన్నిస్ కోర్టులను పీడీలు, పీఈటీలు తయారు చేస్తున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గురాడి అప్పన్న, సెక్రటరీ జె.షణ్ముఖరావు, ఎన్ని దీలిప్, లోకేశ్వరరావు, శ్రీనువాసరావు, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘హాస్టళ్లు పరిశుభ్రంగా ఉంచాలి’ పాతపట్నం: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఎస్టీ పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహాన్ని పీఓ సోమవారం పరిశీలించా రు. వసతి గృహంలోని స్టోర్ రూం, వంట గది, విద్యార్థులు గదులను పరిశీలించి, శుభ్రంగా ఉంచాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. విద్యార్థులు వసతి గృహంలో మరుగుదొడ్లు సక్రమంగా లేవని, కిటీకిలకు మెస్లు లేవని, వర్షం వస్తే గదుల్లోకి నీరు చెమ్మ వస్తుందని, పలు సమస్యలను పీఓ తెలియజేశారు. కార్యక్రమంలో డీఈఈ రాజు, వసతిగృహం సిబ్బంది పాల్గొన్నారు. భక్తులపై తేనెటీగల దాడి నరసన్నపేట: మండలం ఉర్లాంలోని బాలత్రిపుర సుందరీశ్వరాలయం వద్ద సోమవారం పూజల కోసం క్యూలో ఉన్న భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఆలయం వద్ద ఉన్న చెట్టుపై తేనె పట్లు ఉన్నాయి. పక్షులు ఎరగడంతో పట్టు కదిలింది. వెంటనే తేనెటీగలు గుంపు లు గుంపులుగా వచ్చి క్యూలో ఉన్న భక్తులపై దాడి చేశాయి. దీంతో అంతా పరుగులు తీశారు. కొందరు చెరువులో దూకారు. మొత్తం 15 మంది గాయపడ్డారు. ఉర్లాంతో పాటు చింతవానిపేట, బడ్డవానిపేట, జగ్గునాయుడుపేట, కుమ్మరిపేటలకు చెందిన భక్తులు తేనెటీగల దాడికి గురయ్యారు. బాగా గాయపడిన వారికి స్థానిక పీహెచ్సీలో చికిత్స అందించారు. -
ఇది ఒంటూరు కథ
● దాహం కేకలు పెడుతున్న ఒంటూరు ● రెండేళ్లుగా పంట లేక ఎండిపోయిన 50 ఎకరాల భూములు ● గత నెల నుంచి జల్జీవన్మిషన్ తాగునీరు కూడా బంద్ కవిటి: రెండేళ్లయ్యింది ఆ యాభై ఎకరాల పొలాల గొంతు తడిచి. నెల రోజులైపోయింది ఆ వంద గడపలకు స్వచ్ఛమైన నీరు అంది. ఒంటూరు దాహం కేకలు పెడుతోంది. ఉప్పునీరు తాగలేక, కన్నీళ్లతో దాహం తీరక, స్వచ్ఛమైన నీటికి నోచుకోక నరకం చూస్తోంది. ఈ గ్రామంలో అందరూ సన్నకారు, చిన్నకారు రైతులే. వారు గత రెండేళ్లుగా ఖరీఫ్ పంట కూడా పండించుకోలేకపోతున్నారు. గ్రామానికి ఒక వైపు సముద్రం మరో వైపు చిన్న బీలబట్టి ఉంటుంది. దీంతో భూగర్భ జలాలు ఉప్పుగా మారిపోయాయి. పంటకు ఈ నీరు పనికి రాదు. తాగేందు కు కూడా వీలుండదు. గత నెల మూడోవారం వర కు జల్జీవన్మిషన్ పథకం నీటితో గొంతు తడుపుకునేవారు. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. కంచిలి మండలం పెద్దశ్రీరాంపురం వద్ద ఇటీ వల జరిగిన పల్లెపండుగ రోడ్డు పనుల పుణ్యమా అని భూ గర్భ పైప్లైన్ దారుణంగా దెబ్బతినడంతో ఊరికి నీరు ఆగిపోయింది. ఈ పైప్లైన్ బాగు చేసేందుకు వెళ్లిన సిబ్బందిని ఆ పల్లె పండుగ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ బెదిరించారు. రోడ్డుకు క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ కాలేదని, ఏదైనా దెబ్బ తింటే తాను నష్టపోతానని ఆయన చెబుతున్నాడు. దీంతో ఆఖరుకు గ్రామస్తులకు తాగునీరు రాకుండా పోయింది. ఇటీవల పంచాయతీ సిబ్బంది నాలుగు ట్యాంకుల నీరు అందించడంతో దాన్నే వారు తాగుతున్నారు. వంటకు నీరు కొన్నాం.. ఇటీవల మా పాప పెళ్లి జరిగింది. పెళ్లి విందు కోసం తాగునీరు, వంటకోసం దాదాపు రూ.10,000 ఖర్చు చేసి నీరు కొనుగోలు చేశాను. ఆధునికత పెరిగిన నేటి రోజుల్లో నీటి కోసం ఇంతఖర్చు చేసిన నాలాంటి దురదృష్టవంతుడు ఇంకా ఎవ్వరూ ఉండరేమో. – జి.దానయ్య,ఒంటూరు స్నానాలకూ ఇబ్బందే మా ఊరు ఎదురుగా సముద్రం, పడమర బీలబట్టిలో ఉప్పునీరు. స్నానం చేయడానికి కూ డా వీల్లేని దయనీయ స్థితిలో గడుపుతున్నాం. ఇటీవల సర్పంచ్ మూడు ట్యాంకుల నీరు తెప్పిస్తే వాటినే వాడుకుంటున్నాం. – పి.గౌరమ్మ, మహిళ, ఒంటూరు రెండేళ్లుగా పంటలేదు నాది ఒంటూరు గ్రామం. ఇక్క డ పంట లేకపోవడంతో హైదరాబాద్ వలస వెళ్లిపోయా డు. అక్కడ ప్రమాదవశాత్తు మరణించాడు. ప్రస్తు తం నాకు ఒక మనవరాలు, కోడలు ఉన్నారు. ఎకరం పొలం ఉంది. కానీ వర్షాధారం కావడంతో రెండేళ్లుగా పంటలేదు. ఇప్పుడు తాగునీరూ దొర కడం లేదు. దేవుడికి కూడా మా మీద దయ లేదు. – కదిరి కామయ్య,ఒంటూరుకలెక్టర్ చర్యలు తీసుకోవాలి కలెక్టర్ చర్యలు తీసుకుంటే గానీ మాకు వేరే దిక్కులేదు. మా ఊరికి ఉన్న ట్యాంక్ కూడా లీకులు అవుతోంది. తేళ్లు, జెర్రిలు ఉండే ఈ ట్యాంక్ నీరే మాకు ఆధారం. దాన్నైనా బాగు చేయాలి. – పి.చందరరావు, ఒంటూరు -
ఎస్పీ గ్రీవెన్స్కు 52 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు స్వీకరణకు 52 అర్జీలు అందాయి. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రజల నుంచి స్వీకరించారు. వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా తక్షణమే తెలియపరచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులు పునరావృతం కాకూడదని, వాటిపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక అందజేయాలన్నారు. -
స్టేట్మీట్ క్రికెట్ పోటీలు ప్రారంభం
● రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 పోటీలకు తరలివచ్చిన క్రీడాకారులు ● పునర్విభజనకు పూర్వపు 13 జిల్లాల నుంచి జట్లు రాక ● బోణీ కొట్టిన ఆతిథ్య శ్రీకాకుళం శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా స్కూల్గేమ్స్ రాష్ట్రస్థాయి అండర్–19 బాలుర క్రికెట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ/ఇంటర్మీడియెట్ విద్య పరిధిలోని జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా మొదటి మూడు రోజులు బాలురుకు, తర్వాత మూడు రోజులు బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నారు. పునర్విభజనకు పూర్వపు 13 జిల్లాల నుంచి బాలురు జట్లు సిక్కోలు చేరుకున్నాయి. శ్రీకాకుళంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో కోడిరామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కళాశాల మైదానాలు చిత్తడిగా మారడంతో ప్రత్యామ్నాయంగా చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల మైదానం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మైదానాల్లో తొలిరోజు పోటీలు నిర్వహించారు. మొదటిరోజు నాలుగు మ్యాచ్లు జరిగాయి. శ్రీకాకుళం బాలురు జట్టు తన మొదటి మ్యాచ్లో ఘన విజయం సాధించి బోణీ చేసింది. పోటీలను ప్రారంభించిన గొండు, గాదె.. కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఆతిథ్యంలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషదాయకమన్నారు. అనంతరం మార్చ్ఫాస్ట్ నిర్వహించారు.త తన్మయ నృత్య అకాడమీ బృందం ప్రదర్శించిన నృత్యప్రదకర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టోర్నీ పరిశీలకులు రాజేష్ గోల (కర్నూలు), ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ రేగ సురేష్కుమార్, స్థానిక జీజేసీ బాలురు కళాశాల ప్రిన్సిపాల్ జి.వెంకటేశ్వరరావు, డీఈఓ ఎ.రవిబాబు, ఉపవిద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.వి.రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకరటమణ, ఒలింపిక్ అసోసియేషన్ సలహాదారు పి.సుందరరావు, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, కె.మాధవరావు, గ్రిగ్స్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఎం.ఆనంద్కిరణ్, మెట్ట తిరుపతిరావు, పాతిన రమేష్కుమార్, ఢిల్లేశ్వరరావు, రాజశేఖర్, రాజగోపాల్, పీడీలు, రిఫరీలు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. శివాని ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో విశాఖపట్నం–పశ్చిమగోదావరి జిల్లాలు తలపడ్డాయి. విశాఖపట్నం 123 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ ప్రకాశం – చిత్తూరు జిల్లాల మధ్య జరగగా.. ప్రకాశం జట్టు గెలుపొందింది. రెండో మ్యాచ్లో ఆతిథ్య శ్రీకాకుళం– వైఎస్సార్ కడప జిల్లాలు తలపడ్డాయి. శ్రీకాకుళం 83 పరుగులు చేయగా, కడప 32 పరుగులకే కుప్పలికూలింది. దీంతో సిక్కోలు బోణీ కొట్టినట్లయ్యింది. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ గ్రౌండ్లో గుంటూరు–కర్నూలు జిల్లా జట్లు తలపడగా, గుంటూరు 19 పరుగులతో విజయం సాధించింది. -
బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆందోళన
బూర్జ: లక్కుపురం కూడలిలో ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయడం లేదంటూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. పాలకొండ– శ్రీకాకుళం రెండు వైపులా వెళ్లే బస్సులు ఆపి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బస్సులు ఆపకపోవడంతో శ్రీకాకుళం, ఆమదాలవలస, పాలకొండ వంటి సుదూర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సకాలంలో చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్కుపురం కూడలికి సుమారు 10 గ్రామాల వారు వస్తారని, బస్సులు ఆపక అవస్థలు పడుతున్నామని వాపోయారు. విషయం తెలుసుకున్న బూర్జ ఎంపీపీ కర్నేన దీప విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎస్సై ఎం.ప్రవళ్లిక సిబ్బందితో చేరుకుని సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. రిమ్స్ ప్రిన్సిపాల్కే సూపరింటెండెంట్ బాధ్యతలు ● అమలు కాని మంత్రి అచ్చెన్న ఆదేశాలు శ్రీకాకుళం : శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎస్.అప్పలనాయుడుకే సర్వజన ఆస్పపత్రి సూపరింటెండెంట్ బాధ్యతలను అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి అదనపు బాధ్యతలను కూడా అప్పగిస్తూ సూపరింటెండెంట్గా నియమించింది. వాస్తవానికి కళాశాలను, ఆస్పత్రిని ఒకే వ్యక్తి పర్యవేక్షించడం కాస్త కష్టమైన పని. ఈ కారణంగానే వేరు వేరు పోస్టులు ఉన్నప్పటికీ ఒకరికే రెండు బాధ్యతలను అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు ఈ విషయంలో కూడా అమలు కాలేదు. ఇటీవల రిమ్స్ను తనిఖీ చేసిన మంత్రి.. ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ లుకలాపు ప్రసన్న కుమార్ను సూపరింటెండెంట్ పోస్ట్కు సిఫార్సు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆ పోస్టు చేపట్టేందుకు ప్రసన్న కుమార్ సుముఖత వ్యక్తం చేయకపోయినప్పటికీ మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఒప్పించారు. ఏ కారణంగానో ఈ ఆదేశాలు అమలు కాలేదు. రిమ్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేయాలని చేసిన ఆదేశాల సైతం అమలు కాకపోవడం గమనార్హం. అయ్యప్ప భక్తులకు కేరళలో అన్నదానం సోంపేట: అయ్యప్పస్వామి మాలధారణ చేస్తున్న తెలుగు భక్తులకు కేరళలో అన్నదానం, ఇతర సౌకర్యాలు కల్పించడమే అఖిలభారత అయ్యప్ప చిన్ముద్రా సేవా ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు రుద్ర కోటేశ్వరరావు తెలిపారు. సోంపేట మండలం లక్కవరంలో అఖిలభారత అయ్యప్ప చిన్ముద్ర ట్రస్ట్, హరిహరపుత్ర చిన్ముద్రా సేవా ట్రస్ట్ లక్కవరం ఆధ్వర్యంలో అయ్యప్పస్వాముల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు అయ్యప్ప భక్తుల కోసం కేరళలో ఈ నెల 16 నుంచి ఉచిత అన్నదానం, అంబులెన్స్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. హరిహరపుత్ర ట్రస్ట్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస మండలాల పరిధిలోని అయ్యప్ప స్వాములు అన్నదానం కోసం 200 బస్తాల బియ్యం, రెండు క్వింటాళ్ల కందిపప్పు, క్వింటా పెసరపప్పు, క్వింటా చింతపండు, నగదు అందజేశారని వివరించారు. సమావేశంలో సుమారు 1200 మంది అయ్యప్పస్వామి భక్తులు పాల్గొన్నారు. బీచ్లో నిబంధనలు పాటించాలి గార : కార్తీక మాస వన భోజనాలు (పిక్నిక్)లో భాగంగా సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే సందర్శకులు విధిగా నిబంధనలు పాటించాలని, భద్రతా సిబ్బందికి సహకరించాలని కళింగపట్నం మైరెన్ స్టేషన్ సీఐ బి.ప్రసాదరావు అన్నారు. సోమవారం మొగదాలపాడు, శ్రీకూర్మం–మత్స్యలేశం, బలరాంపురం, పెద్ద గణగళ్లవానిపేట బీచ్ల్లో పర్యాటకులకు మైరెన్ విశాఖపట్నం రేంజ్ ఇన్చార్జి డీఐజీ గోపినాథ్ జెట్టి ఆదేశాల మేరకు అవగాహన కల్పించారు. మైపాడు బీచ్లో ఆదివారం స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతిచెందారని, అలాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం తాగి సముద్రంలో స్నానాలు చేస్తే మూడురెట్లు నష్టం పెరుగుతుందన్నారు. జీవితం విలువలను తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత కేరింతలు పేరిట సమద్రపు నీటిలో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హితవుపలికారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రపు నీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, తీర ప్రాంత భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు. -
ఆకాశవీధిలో అద్భుత అవకాశాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: విమానయాన రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధికి కల్పించేందుకు గాను ప్రత్యేక శిక్షణ అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్)కళాశాల ప్రాంగణంలో ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు చకచకా సాగుతున్నాయి. నైపుణ్యాలను మెరుగుపర్చేలా.. జిల్లా వాసులు ఏపనైనా ఇష్టంతో కష్టపడిపనిచేసే నైపుణ్యం, నేర్పరితనాన్ని కలిగి ఉన్నారనేది వాస్తవం. ముఖ్యంగా మహిళలు మరింత బాధ్యతాయుతంగా పనులు చేయడంలో దిట్టగా పేరందుకున్నారు. దీంతో జిల్లాలో మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకొని కలెక్టర్ ప్రత్యేక చొరవతో సివిల్ ఏవియేషన్ సహకారంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా నలుమూలల నుంచి చదువుకునే విద్యార్థినులను దృష్టిలో ఉంచుకుని కాలేజీ కేంద్రంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా అభివృద్ధి పనులు జరిపిస్తున్నారు. ఇది కేవలం మహిళలకు మాత్రమే ఉద్దేశించిన ప్రత్యేక శిక్షణ కేంద్రం. ఏడాదికి 240 మందికి శిక్షణ.. ఇక్కడ రెండు నెలల పాటు ఎయిర్లైన్స్ టికెటింగ్ అండ్ రిజర్వేషన్, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ ఆపరేషన్స్(ప్యాసింజర్ అండ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్) వంటి కీలక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కొక్క బ్యాచ్కు 30 మంది చొప్పున, ఒకే విడతలో 60 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా సంవత్సర కాలంలో 240 మందికి నైపుణ్య శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కేంద్రానికి అవసరమైన సాంకేతికపరమైన పరికరాలు, ప్రయోగశాల సామగ్రిని సీఎస్ఆర్ నిధుల నుంచి సంబంధిత సంస్థ వారే సమకూర్చనున్నట్టు అధికారులు చెబుతున్నారు. పనులు పరిశీలించిన కలెక్టర్.. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేస్తున్న ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మహిళలు విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలు పొందేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. సిక్కోలులో ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు ఏటా 240 మంది మహిళలకు శిక్షణ అందించేలా చర్యలు పనులు పరిశీలించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -
మకాం మార్చేస్తాడు!
శ్రీకాకుళం క్రైమ్ : అతడి ఆయుధాలు రెండే రెండు.. ఒకటి వాహనాల పంచర్కు ఉపయోగించే లీవర్, రెండు ఐరన్ రాడ్డు. ఈ రెంటింటితోనే వందలాది ఇళ్లను దోచుకున్నాడు. తెలిసిన భాషలు బోలెడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, బెంగాళీ, ఒడియా, తమిళ్ వంటివన్నీ తెలుసు. కుటుంబమంతా ఎక్కడో కోల్కతాలో ఉంటుంది. ఏ మాత్రం ఖాకీల అలికిడి కనిపించినా అతడికి తెలిసిపోతుంది. మకాం మార్చేస్తాడు. అతడిపై 200 కేసులు ఉన్నాయి. మన జిల్లాలోనే వంద వరకు ఉన్నాయి. అతనే జిల్లాలోని మెళియాపుట్టి మండలం చాపరకు చెందిన దున్న కృష్ణ అలియాస్ రాజు అలియాస్ ప్రీతమ్ కిషన్ సింగ్. గత ఆరు నెలలుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆఖరుకు కృష్ణను పట్టుకుంటే తగిన పారితోషికం అంటూ ప్రజల్లోకి తాజాగా పోస్టర్ విడుదల చేశారు. సాధారణంగా దొంగలంతా ద్విచక్రవాహనాలు, కార్లు, ప్రైవేటు వాహనాలే ఉపయోగిస్తారు. ఇతగాడు మాత్రం బస్సులు, ఆటోలు, ట్రైన్లలో సాధారణ మనిషిలాగానే వస్తాడు. మాస్కులు పెట్టుకోడు. ముసుగు ధరించడు. దర్జాగా ఒకే ఏరియాలో వరుసగా ఐదారు ఇళ్లు ఎంచుకుని దోచేస్తాడు. అది కూడా పోలీసులు వేరే ప్రాంతాలకు బందోబస్తులకు వెళ్లేటప్పుడే. కృష్ణ మీద విజయవాడ, నెల్లూరు, అనకాపల్లి, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి వంటి అనేక ప్రాంతాల్లో కేసులున్నాయి. విజయవాడలో ఓ హెడ్కానిస్టేబుల్ కృష్ణను పట్టుకున్నందుకు ఇండియన్ పోలీస్ మెడల్ అతడిని వరించింది. కాళ్లు విరిగి నడవలేడులే అనుకుంటే.. శ్రీకాకుళం రూరల్ పరిధి విశాఖ–బి కాలనీలో చోరీ కేసులో కృష్ణ దొరికాడు. అదే కేసులో 2024 జనవరిలో బెయిల్ పొందిన కృష్ణ అంపోలు జైలు నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే అనకాపల్లి పోలీసులు అక్కడి చోరీ కేసు విషయమై అరెస్టు చేసేందుకు కాచుకుని ఉండటం గమనించిన కృష్ణ ఎదురుగా ఉన్న పెద్దగోడను దూకి కాళ్లు విరగ్గొట్టుకున్నాడు. పోలీసులు కూడా కాళ్లు విరిగాయి కదా చోరీలు చేయడులే అని అంతా భావించారు. మళ్లీ 2024 సెప్టెంబరు–అక్టోబరు పీరియడ్లో వరస నేరాలు మొదలుపెట్టాడు. జిల్లాకేంద్రంలోని పీఎన్కాలనీ పదోలైన్లో రిటైర్డ్ డీఎస్పీ భార్గవనాయుడుకు సంబంధించిన బంధువుల గెస్ట్హౌస్లో రూ. 6 లక్షలు కాజేశాడు. అదే కాలనీలో ఓ ఉపాధ్యాయ దంపతుల ఇంటిలో 13 తులాల వరకు చోరీ చేశాడు. అక్కడి నుంచి సుమారు 10 చోరీల్లో దాదాపు 80 తులాల నుంచి వంద తులాల బంగారం వరకు దోచేసినట్లు పోలీసువర్గాలు అంటున్నాయి. చివరిసారిగా ఈ నెల 16 రాత్రి కోర్టు పక్కనే ఓ నివాస గృహంలో 10 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు పోలీసుల సమాచారం. విశాఖలో ఫ్లైట్కు వెళ్లే సమయంలో ఎయిర్పోర్ట్ సీసీ ఫుటేజీలో చిక్కాడు. -
కలెక్టర్ గ్రీవెన్స్కు 92 అర్జీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికకు సోమవారం 92 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారులు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తంలో వినతుల్లో రెవెన్యూ 40, మున్సిపల్ కార్పొరేషన్ 11, పంచాయతీరాజ్ 9, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రోవర్టీ 4, ఏపీఈపీడీసీఎల్ 4, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ 6, హౌసింగ్ 2, పౌర సరఫరాల శాఖ 2, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 2, నైపుణ్యాభివృద్ధి 2, మైన్స్ అండ్ జియాలజి, వక్ఫ్ బోర్డు, ఆర్టీసీ తదితర శాఖల ఒక్కొక్కటి చొప్పున అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ● కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి భరోసా కల్పించాలని కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలమల రమణ, పోలాకి ప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.చంద్రరావు, కె.మోహన్రావు వినతిపత్రం అందించారు. ● ఎచ్చెర్ల మండలం ముద్దాడ కొత్తపేట గ్రామాలకు, అనుబంధ గ్రామాలకు లింక్ రోడ్లు వేయాలని స్థానికులు కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో ముద్డాడ, కొత్తపేట, రుప్పపేట, సెగిడిపేట తదితర గ్రామాల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
తైక్వాండో పోటీల్లో ముగ్గురికి స్వర్ణ పతకాలు
ఇచ్ఛాపురం : ఇటీవల ఏలూరు, కడపలో జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడాపోటీలు (ఎస్జీఎఫ్) తైక్వాండో విభాగంలో ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ం సూర్యారావు సోమవారం తెలిపారు. అండర్–17 విభాగంలో ఆశి రెవంత్రెడ్డి, తిప్పన జీవన్రెడ్డి, అండర్–19 విభాగంలో చాట్ల గిరి స్వర్ణ పతకాలు సాధించారని చెప్పారు. వీరు ఈ నెల 7 నుంచి 10 వరకు జమ్మూకశ్మీర్లో జరగనున్న అండర్–19 జాతీయస్థాయి పోటీలకు, ఈ నెల 20 నుంచి 25 వరకు అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రం ఇటానగర్లో అండర్–17 జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, శారద, రంగారావు, ఉపాధ్యాయులు కామరాజు, సూర్యం, జయలక్ష్మి, ఎస్ఎంసీ ప్రతినిధులు ఆశా లతారెడ్డి, శ్రీధర్, గౌరీశంకర్, తైక్వాండో కోచ్ సీహెచ్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. జాతీయ సమైక్యత శిబిరానికి వర్సిటీ విద్యార్థులు ఎచ్చెర్ల : హర్యానాలో జరగనున్న జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొనేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ విద్యార్థులు సోమ వారం పయనమయ్యారు. వివిధ రాష్ట్రాల్లోని సాంస్కృతిక, కళలు, క్రీడలు, అభిరుచులు వంటివి పరస్పరం పంచుకొని దేశ ఐక్యతలో యువతను భాగస్వామ్యం చేయడంలో భాగంగా జాతీయ స్థాయిలో ఈ నెల 4 నుంచి వారం రోజుల పాటు శిబిరం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు వర్సిటీ క్యాంపస్కు చెందిన ఎన్.త్రివేణి, కె.పవన్, జి.రవి, జి.శ్రావణి, ఎస్.సాయిప్రదీప్, ఎస్.భార్గవి, జి.చంద్రశేఖర్, పి.అభిషేక్, ఎస్.అంకిత, ఎం.పవిత్రలు ఎంపికయ్యారు. ఈ బృందానికి ఎన్ఎస్ఎస్ పీవో డాక్టర్ కె.కరుణానిధి నేతృత్వం వహి స్తున్నారు. వీరిని వీసీ రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ డి.వనజ అభినందించారు. -
తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి
● పీజీఆర్ఎస్లో వైఎస్సార్ సీపీ నాయకుల వినతి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవల వచ్చిన మోంథా తుఫాన్ వర్షాల వల్ల జిల్లా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. శ్రీకాకుళం, గార మండలాలు తీర ప్రాంతంలో ఉన్నందున వరి, అరటి వంటి పంటలు నేలమట్టమయ్యాయని, తక్షణమే బాధిత రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ యువ నాయకుడు ధర్మాన రామ్మనోహర్నాయుడు, శ్రీకాకుళం రూరల్ మండల పరిషత్ అధ్యక్షులు అంబటి నిర్మల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ రుప్ప దివ్య శ్రీధర్, గార మండల పరిషత్ అధ్యక్షులు గొండు రఘురాం, జెడ్పీటీసీ మార్పు సుజాత తదితరులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఖరీఫ్ పంట చేతికి అందిన సమయంలో మోంథా తుఫాన్ వచ్చి వరి, అరటి వంటి పంటలను పూర్తిగా నాశనం చేసిందన్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదని, వాస్తవిక నష్టాలను అంచనా వేయలేదని చెప్పారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రాజకీయాలకు అతీతంగా నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో మార్పు పృథ్వీరాజ్, రౌతు శంకరరావు, పీసీ గోపి, శ్రీహరి, ముంజేటి కృష్ణ, రుప్ప అప్పలసూరి, నరేంద్ర, సుగునా రెడ్డి, యు.కృష్ణారావు, శీర సత్యనారాయణ, సర్పంచ్లు, ఎం.పి.టి.సిలు, రైతులు పాల్గొన్నారు. -
శ్రీముఖలింగంలో పటిష్ట బందోబస్తు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి భద్రతకు సుమారు 50 మంది పోలీసులను వినియోగించామని జలుమూరు ఎస్ఐ బి.అశోక్బాబు తెలిపారు. ‘శ్రీముఖలింగంలో భక్తులకు భద్రత ఏదీ..? అన్న శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. నరసన్నపేట సీఐ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం సజావుగా జరిపించామని పేర్కొన్నారు. ప్రధానంగా దక్షిణ ద్వారం వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. -
భూముల రీసర్వేపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: భూముల రీ సర్వేలో భాగంగా జరుగుతున్న జాయింట్ ఎల్పీఎం(ఉమ్మడి సరిహద్దు) సమస్యలను నవంబర్ 25 నాటికల్లా పరిష్కరించాలని సర్వే, ల్యాండ్ రికార్డులు ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు సి.హెచ్.వి.ఎస్.ఎన్.కుమార్ ఆదేశించారు. రెండు రోజులుగా జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన రీసర్వే పనుల నాణ్యత, పురోగతిపై శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోడిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దశల్లోనూ రికార్డులను తనిఖీ చేసి నూరు శాతం కచ్చితత్వం సాధించాలన్నారు. భూ యజమానులకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా క్షేత్రస్థాయిలో సర్వే పనులు నిర్వహించాలన్నారు. మొదటి, రెండవ విడతల్లో మిగిలిన పనులను నిర్ణీత గడువు ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ రెవెన్యూ భూముల సరిహద్దులు నిర్ణయించే పనిని కూడా ఈ నెల 15కల్లా పూర్తి చేయాలన్నారు. -
జవాన్ సేవలకు ప్రశంసలు
ఇచ్ఛాపురం: ఇండియన్ ఆర్మీలో చేరి దేశరక్షణతో పాటు ప్రజాసేవచేయడం వల్ల డిప్యూటీ చీఫ్ ఆర్మీ అధికారి నుంచి ప్రశంసా పత్రాన్ని పట్టణానికి చెందిన ఆర్మీజవాన్ ధర్మాల నూకరాజు అందుకున్నాడు. పట్టణానికి చెందిన ఆర్మీ జవాన్ ధర్మాల నూకరాజు అతని యూనిట్తో పాటు 2023లో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో విధులు నిర్వహించాడు. ఆ ఏడాది అక్టోబర్లో హిమనదీయ సరస్సుకి వచ్చిన వరదల కారణంగా సరస్సు పై నిర్మించిన చుంగ్తాంగ్ డ్యామ్ కొట్టుకు పోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు నిరాశ్రయులయ్యారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్మీయూనిట్ రిస్కీ ఆపరేష్ నిర్వహించి సహాయ సహకారాలు అందించారు. జవాన్లు చేసిన సేవలను గుర్తించిన డిప్యూటీ చీఫ్ ఆప్ ఆర్మీ ఆదివారం ప్రశంసాపత్రాన్ని సీఓ రాహుల్సింగ్ ద్వారా బెంగాల్ ఆర్మీ యూనిట్ వద్ద అందజేసినట్లు జవాన్ తెలిపారు. -
పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
టెక్కలి రూరల్ : పెన్షన్లు లేక ఇటీవల రిటైరైన ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం స్పందించి పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని ఏపీ సీపీఎస్ ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు చల్ల సింహాచలం డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఆదివారం టెక్కలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్ అంధకారంలో ఉందన్నారు. కొన్ని సంఘాలు జీపీఎస్, యూపీఎస్ ప్రపంచంలోనే అత్యున్నతమైనవంటూ ప్రశంసించడం దారుణమన్నారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారుడు బి.బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అంపోలు షణ్ముఖరావు, కృష్ణ, రోహిణేశ్వరరావు, చక్రవర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కవిటి: మండలంలోని జగతి హనుమాన్ జంక్షన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొడివాటి శివాజీ(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు. కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీలో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కవిటి నుంచి సోంపేట రోడ్డులో వెళుతుండగా జగతి గ్రామం మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోవడంతో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వెల్లడయ్యాక పూర్తివివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. శివాజీ స్వగ్రామం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దమానాపురం. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రవివర్మ తెలిపారు. -
రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కులనిర్ములనా పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెలన 16న ‘భారత రాజ్యాంగం – రాజ్యాంగ వ్యవస్థల కాషాయకరణ’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలోని ఆదివారంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సమితి జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాంబాబు, డి.గణేష్, నేతల అప్పారావు, యడ్ల జానకిరావు, బోనెల చిరంజీవి, చంద్రమౌళి, అనిల్, రామారావు, కై లాష్, అప్పన్న, శ్రీను పాల్గొన్నారు. -
పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
శ్రీకాకుళం అర్బన్: కార్తీకమాసం సందర్భంగా పంచారామాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు కోరారు. పంచారామాలకు వెళ్లే ఆర్టీసీ సూపర్లగ్జరీ బస్సును శ్రీకాకుళం బస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీకమాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. సోమవారం పంచారామాలను దర్శించుకుని మరలా మంగళవారం ఉదయం 6గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుతుందని వివరించారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శివాలయాలను దర్శించుకోవచ్చన్నారు. ఈ నెల 9, 16 తేదీల్లో కూడా బస్సులు నడుపుతామన్నారు. ‘ఒక్క ఫోన్ కాల్ తో మీ వద్దకు ఆర్టీసీ బస్సు’ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 99592 25608, 99592 25609 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్ఎం ఎంపీ రావు, అధికారులు రాజు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
భక్తులకు భద్రత ఏదీ..?
శ్రీముఖలింగంలో ..జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో కార్తిక మాసంతోపాటు శివరాత్రి ఉత్సవాలకు వేల సంఖ్యలో స్వామిని దర్శించుకుంటారు. కానీ ఇక్కడ కూడా భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. స్వామిని దర్శించుకున్న భక్తులు బయటకు రావాలంటే దక్షిణ మార్గం ఒక్కటే ఉంది. ఇంత వరకూ బాగున్నా ఇదే మార్గం ద్వారా దేవదాయ శాఖ, పోలీసు, రాజకీయ ప్రముఖలు, ఉన్నతాధికారులు, అర్చక కుటుంబాలు, మీడియా ప్రతినిధులు అలాగే ఇతర చోటామోటా నాయకులను కూడా ఆలయం లోపలకు పంపిస్తారు. స్వామి దర్శనం చేసుకున్నాక ఇదే మార్గం ద్వారా భక్తులు బయటకు రావాలి. దీంతో ఇక్కడ తోపులాటలకు అవకాశం ఉంటుంది. కాశీబుగ్గ ఘటనతో భక్తుల్లో ఆందోళన కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో సుమారు తొమ్మిది మంది భక్తులు మృతి చెందడం, పలువురికి తీవ్రగాయాలు కావడంతో శ్రీముఖలింగం ఒక్కసారి ఉలిక్కిపడింది. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ దేవాలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు, మరమ్మతులు జరగాలన్నా ఆ శాఖ ఉన్నతాధికారులు కేంద్ర కార్యాలయం నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. అయితే ప్రస్తుతం స్వామివారి దర్శనం అనంతరం భక్తులు బయటకు వెళ్లేందుకు మరో మార్గం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. లేదా దక్షిణ ద్వారం నుంచి ఎవరినీ పంపించకుండా చూడాలని కోరుతున్నారు. -
రేపు సిరిమాను చెట్టుకు బొట్టు
అరసవల్లి: అరసవల్లి, కాజీపేట గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాల్లో భాగంగా సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం ఈ నెల 4న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. గ్రామపెద్దల సమక్షంలో ఆలయ కమిటి ప్రతినిధుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు ముర్రాటలతో ఉదయం 7 గంటల నుంచి బయలుదేరి వెలమ వీధిలో వెలిసిన దుర్గమ్మ మట్టి (ఆలయం) వద్ద నుంచి నీలమ్మ గుడి, కాపువీఽధి శ్యామలాంబ గుడి, సింహద్వారం వద్ద ఎర్రిమ్మ గుడి స్థానం వద్ద నుంచి అసిరితల్లి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అక్కడ నుంచి సంబరంగా ముర్రాటలతోనే సిరిమాను చెట్టు ఉన్న పెద్ద తోటకు చేరుకుంటారు. సంప్రదాయం ప్రకారం తొలిముర్రాటను సోను రాములు కుటుంబీకులు సమర్పించనున్నారు. ఉత్సాహంగా కబడ్జీ జట్ల ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సబ్ జూనియర్స్ బాలబాలికల కబడ్డీ ఎంపికలు ముగిశాయి. జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోటీలకు 74 మంది బాలికలు, 129 మంది బాలురు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా తుది జట్లను ఎంపికచేస్తామని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు నక్క కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు తెలిపారు. ఎంపికచేసిన జిల్లా జట్లను ఈ నెల 7 నుంచి 9 వరకు కర్నూలు జిల్లాలో జరగనున్న 35వ ఏపీ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్ – 2025–26లకు పంపించనున్నట్టు జిల్లా కార్యనిర్వాహాక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో కబడ్డీ శిక్షకులు సింహాచలం, ఝాన్సీ, సంఘ కోశాధికారి నాగాల రమేష్, సంఘ ప్రతినిధులు రవికుమార్, తవిటమ్మ, సాగర్, అప్పనమ్మ, వెంకట రమణ, శ్యాం, లక్ష్మీనారాయణ, యోగి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్యుని దేవేరులకు బంగారు పుస్తెలు వితరణ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవేరులైన ఉషా పద్మిని ఛాయాదేవేరులకు బంగారు పుస్తెలను నగరానికి చెందిన పొడుగు వెంకట సూర్యప్రభాకరరావు, వెంకట రాజేష్ఖన్నా, కరుణాకరరావు కుటుంబసభ్యులు విరాళంగా సమర్పించారు. 29 గ్రాముల 820 మిల్లీగ్రాముల బంగారు శతమానాలతో కూడి న మూడు పుస్తెల తాళ్లను ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలకు దాతలు అందజేశారు. కల్యాణ సేవల్లో పుస్తెలను వినియోగించాలని దాతలు కోరారు. అనంతరం ఈవో మాట్లాడుతూ దాతల సహకారం గొప్పదని, రథసప్తమి వంటి విశేష పర్వదినాల్లో పాసులు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో విశ్రాంత తహశీల్దార్ పొడుగు వెంకట శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు. సముద్రంలో బోటు మునక సోంపేట: ఉప్పలాం పంచాయతీ ఎకువూరు సముద్రతీరంలో ఆదివారం మధ్యాహ్నం బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన రెండు బోట్లు సముద్రంలో వేటకు వెళ్లాయి. మత్స్యకారులు వేట ముగించుకుని తిరిగి వస్తుండగా కె.గోపాల్కు చెందిన బోటు తీరానికి వంద మీటర్ల దూరంలో మునిగిపోయింది. మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో సుమారు రూ.6 లక్షల ఆస్తినష్టం జరిగిందని మత్స్యకారులు తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు ‘మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్’లో నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. చెరువులో పడి వ్యక్తి మృతి పాతపట్నం: గొల్లపేట గ్రామానికి చెందిన మెట్టు చిన్నారావు (59) చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగువాడ పంచాయతీ గొల్లపేటకు చెందిన మెట్టు చిన్నారావు బడ్డుమర్రి గోపాలపురంలో బంధువులు మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కృష్ణసాగరం చెరువులో స్నానానికి దిగతుండగా కాలుజారి పడిపోయాడు. ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారావుకు భార్య చిన్నమ్మడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా సతీష్ టెక్కలి: ౖవెఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన కోత సతీష్ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో యువజన విభాగంలో కీలకంగా సేవలు అందజేసిన సతీష్కు మరళా అదే విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. తనపై ఎంతో నమ్మకంతో నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు నేతృత్వంలో బాధ్యతలు అప్పగించారని, పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని సతీష్ పేర్కొన్నారు. పాఠ్య పుస్తక రచనకు ఎంపిక జి.సిగడాం : బూటుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు డాక్టర్ కూర్మాన అరుణకుమారి పాఠ్యపుస్తక రచనకు ఎంపికైనట్లు ఎంఈఓలు అరసాడ రవి, ముళ్లు శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. విజయవాడలో ఈ నెల 3 నుంచి నిర్వహిస్తున్న రచనా ప్రక్రియకు ఈమె హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అరుణకుమారిని ఉపాధ్యాయులు అభినందించారు. -
భక్తిశ్రద్ధలతో పొలికోత ఉత్సవం
గార: క్షీరాబ్ది ద్వాదశి పురస్కరించుకొని శ్రీకూర్మనాథాలయంలో పొలికోత ఉత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం నుంచి శయనబేరం, అమ్మవార్లు పల్లకిపై గ్రామ శివారులోని ప్రత్యేక మంటపం వద్దకు చేరుకున్నాయి. ప్రత్యేక పూజలనంతరం అర్చకులు లక్ష్మణాచార్యులు, కిషోర్బాబు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు సంప్రదాయ పద్ధతిలో వరి కోతలు ప్రారంభించారు. అయితే, మంటపం వద్దకు వెళ్లేందుకు అర్చకులు, భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సరైన దారి లేక బురదలోనే నడిచి వెళ్లాల్సి వచ్చింది. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కై బాడి కుసుమకుమారిరాజు, మంటప నిర్మాణదారు శంభుమహంతి వెంకట అసిరిరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, ద్వాదశి పర్వదినం పురస్కరించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకూర్మనాథాలయం భక్తులతో కిటకిటలాడింది. వైఎస్సార్ సీపీ నాయకుడు యాళ్ల నారాయణమూర్తి రెండు వేల మందికి దద్దోజనం ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మణి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్గేమ్స్ స్టేట్మీట్పై నీలిమబ్బులు
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా జరిగే స్కూల్గేమ్స్ స్టేట్మీట్ క్రికెట్ టోర్నీపై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం మైదానం, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానాల వేదికగా ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 బాలబాలికల క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 3 నుంచి 8 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజులు బాలురుకు, తర్వాత మూడు రోజులు బాలికలకు పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. అయితే మోంథా తుఫాను అనంతరం చిత్తడిగా మారిన మైదానాలను నిర్వహకులు వాయువేగంతో సిద్ధంచేసినా ఆదివారం మరోసారి వరుణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు. సాయంత్రం వర్షం కురవడంతో మైదానాలు చిత్తడిగా మారడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ మైదానాలుగా ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ క్రీడా మైదానం, శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాల మైదానాలను పరిశీలిస్తున్నారు. జిల్లాకు చేరుకుంటున్న క్రీడా జట్లు.. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు జట్లు జిల్లాకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, గుంటూరు, కృష్ణ తదితర జట్లు జిల్లాకు చేరుకున్నాయి. మిగిలిన జట్లు రాత్రికి, సమీపంలోని జట్లు సోమవారం ఉదయానికి చేరుకుంటాయి. క్రీడాకారులకు బలగ మున్సిపల్ హైస్కూల్, ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో బస కల్పిస్తున్నారు. రిఫరీలు, టెక్నికల్ అఫీషియల్స్ సైతం జిల్లాకు చేరుకున్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎస్జీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డీఈఓ ఎ.రవిబాబు నేతృత్వంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య, ఎం.తిరుపతిరావు, ఎం.ఆనంద్కిరణ్, ఢిల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, నిర్మల్కృష్ణ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. కర్నూలుకు చెందిన రాజేష్ గోల పరిశీలకులగా హాజరయ్యారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు కేఆర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. -
ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే
శ్రీకాకుళం అర్బన్: కాశీబుగ్గ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షలు చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద కాశీబుగ్గ ఘటనలో చనిపోయినవారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు. ఇందులో రాజకీయాలు చూడకూడదని, మానవతా దృక్పథంతో ఆలోచించాలని, మీరిచ్చే డబ్బులు లేదా మేమిచ్చే డబ్బులు వల్ల బాధిత కుటుంబాలను ఆదుకోలేమని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నిధుల నుంచి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రధాని కూడా రూ.2లక్షలు ప్రకటించారని, చంద్రబాబు కూడా ప్రకటించిన రూ.15లక్షలకు మరో రూ.10లక్షలు ప్రకటించాలని పార్టీ తరఫున విన్నవిస్తున్నామ ని అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ తదితరులు మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా పాలన సాగిస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో హిందూ దేవాలయాలకు, భక్తులకు భద్రత లేకుండా పోయిందన్నా రు. ఈ కొవ్వొత్తుల ర్యాలీకి ముందుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ బ్యానర్ ఉందని, దీన్ని తీసివేయాలని చెబుతూ శ్రీకాకుళం 2వ పట్టణ సీఐ ఈశ్వరరావు ఆ బ్యానర్ను తీసుకున్నారు. అయితే ధర్మాన కృష్ణదాస్ వచ్చి సీఐతో మాట్లాడినప్పటికీ ఆ బ్యానర్ సీఐ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ బ్యానర్లో ఏం తప్పు ఉందో చూపాలని సీఐను కృష్ణదాస్ నిలదీయగా అటు తర్వాత బ్యానర్ను సీఐ ఇచ్చారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్సార్సీపీ నాయకులు కిల్లి వెంకట సత్యన్నారాయణ, మామిడి శ్రీకాంత్, ఎంవీ పద్మావతి, అంధవరపు సూరిబాబు, గొండు రఘురాం, ఎన్ని ధనుంజయరా వు, ముంజేటి కృష్ణ, బొడ్డేపల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
16 నెలల్లో వరుస దారుణాలు
చంద్రబాబు పాలనలో వరుస దారుణాలు జరుగుతున్నాయని బొత్స గుర్తు చేశారు. చంద్రబాబు దేవుడు పేరు ఎత్తిన ప్రతి సారి ఏదో ఒకటి జరుగుతోందన్నారు. ఆయనకు దేవుడిపై విశ్వాసం లేదన్నారు. లడ్డూ కల్తీ, నెయ్యి కల్తీ వంటివాటిపై లేనిపోని మాటలు ఆడి ఎదుటి వారిపై బురద జల్లితే అనర్థాలు జరుగుతాయన్నారు. పలాస–కాశీబుగ్గలో సంఘటన జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్ద ఉండకుండా భజన పరుల్లా తబలాలు వాయిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల వచ్చిన మోంథా తుఫాన్ను సైతం తరిమేశామంటూ చంద్రబాబును క్రియేట్ చేయడం సిగ్గుచేటన్నారు. పరిపాలన చేతకాకపోతే అఖిలపక్షం నాయకులను కూర్చోబెట్టి మాట్లాడించాలని సూచించారు. ఆలయానికి తాళం పడింది. ఆవరణ అంతా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ప్రాంతమంతా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. బాధిత కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. కన్నీళ్లు ప్రవహిస్తున్న ఆ ఇళ్ల వాకిళ్లకు పరామర్శలు, పరిహారాలు, ఓదార్పులు కాసింత ఊరటనిచ్చాయి. వైఎస్సార్ సీపీతోపాటు పలు పార్టీలకు చెందిన నాయకులు క్షతగాత్రులతో పాటు బాధిత కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆస్పత్రులకు కూడా వెళ్లి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఈ ఘటన వెనుక నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం రూరల్: పలాస–కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమన్నారు. దీనిపై వెంటనే జ్యుడీషియల్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న వారి కి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు ఇచ్చిన ఎక్స్గ్రేషియా రూ.25 లక్షలు వరకూ పెంచాలని డిమాండ్ చేశారు. పార్టీ తరఫున తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు. సంఘటన జరిగిన రోజు సీఎం చంద్ర బాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సబబు కాదని ఆయన అన్నారు. తాను నిమిత్తమాత్రుడినని, ప్రైవేట్ ప్రాపర్టీ ఆలయాలకు తమకు సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. గ్రామాల్లో రామాలయాలు, అమ్మవారి ఆలయాల్లో ఏవైనా ఘటనలు జరిగితే ఇలాగే మాట్లాడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తోందా అని ప్రశ్నించారు. ఓ పత్రికలో ప్రభుత్వ వైఫల్యం అని ప్రస్తావించారని, పెద్ద ఎత్తున భక్తులు వస్తార ని సమాచారం ఉన్నా, ఎందుకు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కలెక్టర్ సైతం బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పార్లమెంటరీ పరిశీలకులు కుంభా రవిబాబు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాస రావు, పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి, విజయనగరం పార్లమెంటరీ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, పార్టీ సామాజిక వర్గాల రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పాలిల శ్రీనివాస్, గొండు కృష్ణ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, జెడ్పీటీసీ టొంపల సీతారాం, పిన్నింటి సాయికుమార్, రాష్ట్ర మేధావుల ఫోరం ప్రతినిధి పిల్లల రామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయ, జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ, మండలాధ్యక్షుడు చిట్టి జనార్దన్రావు, సర్పంచ్ గేదెల శంగల్వరావు, పార్టీ నాయకులు యజ్జల గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
కమిటీ వేశాం
దేవాలయం వద్ద సమాచారం ఇవ్వడానికి ఎవరూ లేరు. ఘటనపై విచారణకు కమిటీ వేశాం. ఆలయ సంప్రోక్షణ జరిగాక మళ్లీ తెరవాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా ప్రతి దేవాలయం వద్ద కూడా భక్తుల సౌకర్యార్థం తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడి ఆలయ నిర్మాణంలో సరైన ఇంజినీర్లు, వేదపండితులు సలహాలు సూచనలు కనిపించలేదు. – ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఎప్పుడూ రెడ్బుక్ ధ్యాసేనా..? రాష్ట్రంలో రెడ్బుక్ రా జ్యాంగం అమలుపై మాత్రమే ధ్యాస ఉన్నట్టుంది. సనాతన ధర్మ పరిరక్షణ చేతకాకపోతే మర్యాదగా తప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం ఆర్టీజీఎస్, చంద్రబాబు తుఫాన్ కట్టడి చర్యలు ఈ సంఘటనలో ఏమయ్యాయి. ఆలయ ధర్మకర్తపై కేసులు కట్టేందుకు ప్రయ త్నించడం కేవలం చేతకానితనం. – కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ప్రభుత్వ వైఫల్యమే కాశీబుగ్గ దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం. చంద్రబాబు నాయుడికి ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై, నాయకుల పైన కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలకు రక్షణ కల్పించడంలో లేదు. కూట మి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే తిరుపతి, సింహాచలం వంటి వాటితో పాటు కాశీబుగ్గలో జరిగిన సంఘటన మూడోది. కమిటీలతో కాలయాపన చేయడం కంటే భక్తులకు రక్షణ కల్పించడంలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తంచేయాలి. – కుంభా రవిబాబు, పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు ఎందరిపై చర్యలు తీసుకున్నారు తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఇప్పటికే ఏడాదిన్నర పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందారు. ఇలాంటి విఫల ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. – ధర్మాన కృష్ణదాసు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు నిర్లక్ష్యమే.. గతంలో చంద్రబాబు ఓవరాక్షన్ వలన పుష్కరాల్లో ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు కాశీబుగ్గలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త ఊరుకునేది లేదు సమగ్ర విచారణ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుంది. తిరుపతి, సింహాచలంలో జరిగిన ఇలాంటి సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దినాలలో ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. – పీవీఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వివరాలు సేకరిస్తున్నాం తొక్కిసలాటకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై అసత్య స మాచారం వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలు చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నాం. – గోపినాథ్ జెట్టి, విశాఖ రేంజి డీఐజీ టెక్కలి: కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో భక్తులు తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ ప్రధాన గేటు నుంచి తోటలో ధర్మకర్త ఇంటి వరకు పోలీసులు మోహరించి పండాను బయటకు వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు. పరి శీలనకు వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులను కూడా అడ్డుకుని తర్వాత వదిలారు. ‘దేవుడికి గుడి కట్టాను. అందరూ రావాలి. పూజలు చే యాలని కోరుకున్నాను. ఇలా జరిగితే నేనేంచేస్తాను. ఇలా జరిగిందని కేసులు కడితే నా మీ ద ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి’ అని ఆలయ ధర్మకర్త హరిముకుంద పండా అన్నారు. -
ఆలయం మళ్లీ తెరుస్తా.. పది కేసులు పెట్టుకోండి: పండా
టెక్కలి: తొక్కిసలాట నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆలయంతో పాటు ధర్మకర్త హరిముకుంద పండా ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆలయ ప్రధాన గేటు నుంచి తోటలో ధర్మకర్త ఇంటివరకు పోలీసులు మోహరించి పండాను బయటకు వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు.ఆలయ సంప్రదాయం ప్రకారం పండా ప్రతిరోజూ ఆలయంలో దీపం పెట్టే ఆనవాయితీ ఉంది. పోలీసులు అడ్డుకోవడంతో ఆలయంలో ఆదివారం దీపం పెట్టే అవకాశం దక్కలేదు. పోలీసులు అతడి ఇంటిని అష్ట దిగ్బంధం చేయగా.. ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంటే.. ఆలయ ధర్మకర్తపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదంటూ ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.10 కేసులు పెట్టుకోండి: పండా‘దేవుడికి గుడి కట్టాను. అందరూ రావాలి. పూజలు చేయాలని కోరుకున్నాను. ఇలా జరిగితే నేనేం చేస్తాను. కేసులు కడితే నా మీద ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి’ అని ఆలయ ధర్మకర్త హరిముకుంద పండా సమాధానమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయాలు పాలవడంపై పండా కన్నీళ్లు పెట్టుకున్నారు. చెడ్డపని చేస్తే అనుమతి కావాలి తప్ప.. మంచి పనికి కాదన్నారు. ‘అమ్మ కోరికతో తాహతుకు మించి డబ్బులు పెట్టి గుడి కట్టాను. అంతా శ్రీనివాసుడే చూసుకుంటాడు. ఇక్కడ పోలీసులు ఎవరూ ఉండొద్దు. వారికి ఇక్కడ ఏం పని అందరూ వెళ్లిపోండి. నేను గుడి తలుపులు తీస్తాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. -
రోదన ఆగేనా..?
మార్చురీ వద్ద నిఖిల్ తండ్రి రోదన (ఫైల్)కాశీబుగ్గ చినతిరుపతి దుర్ఘటనలో బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్(12) మృతి చెందాడు. నిఖిల్ తల్లి అను ఆది వారానికి ఇంకా స్పృహలోకి రాలేదు. నిఖిల్కు చిన్నతనం నుంచే భక్తి ఎక్కు వ. ఆరేళ్లుగా బాలుడు కార్తీక సంకీర్తనల్లో పాల్గొంటున్నాడు. శనివారం వేకువ జామున కూడా గ్రామంలోని భక్తులందరితో కలిసి నమఃశివాయ సంకీర్తన చేశాడు. అనంతరం జింకిభద్ర గ్రామంలో ప్రైవేటుకు వెళ్లి టీచర్ను అడిగి వేగంగా వచ్చాడు. కానీ గుడిలో జరిగిన దుర్ఘటనలో చిక్కుకుని చనిపోయాడు. ఆలయంలోనూ ఘటనకు ముందు స్టీలు గ్రిల్ మీద బాలుడు కూర్చుని ఉండగా దిగురా అని తల్లి చెబుతూనే ఉంది. అంతలోనే తొక్కిసలాట జరగడం, బాబు పడిపోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. బాబుతో పాటు తల్లి కూడా స్పృహ తప్పి పడి పోయింది. పది నిమిషాల్లో మేలుకొని చూ సేసరికి కొద్దిగా దూరంలో బా బు పడి ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్దామని కనిపించిన వారి కాళ్లు పట్టి బతిమలాడింది. కా నీ అక్కడ ఎవరి బాధలో వారు ఉన్నారు. అక్కడే బాలుడు ఊ పిరి వదిలేశాడు. ఊరు ఇంకా బాలుడినే తలచుకుంటోంది. –సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళంపొద్దు పొడిచింది.. వాకిలి వరకు వచ్చిన వెలుగు ఆ ఇంటి చీకటిని దాటలేకపోయింది.. కంటి నిండా కన్నీరు.. ఇంటి నిండా నిశ్శబ్దం ఏకాదశి విషాదం మిగిల్చిన ఆనవాళ్లు ఇవి.. చిన్నప్పటి నుంచి బిడ్డను మోసిన ఆ తండ్రి భుజం నేడు వాలిపోయింది.. కన్నపేగు చేతిని తడిమి తడిమి చూసిన తల్లి కడకొంగు కన్నీటితో బరువెక్కింది.. వాడు ఇక అమ్మా అని పిలవడు.. నాన్నా అని అరవడు.. దేవుడి దర్శనానికి వెళ్తే మిగిలిన చేదుకు నిదర్శనాలివి.. దేవుడిని చూసి తరిద్దామనుకున్నారు.. శ్రీవారి సేవలో మురిసిపోదామని తలిచారు.. కంటికి ఎదురుగా కన్నపేగు శవాన్ని చూడలేక తల్లడిల్లిపోయారు.. పుణ్యం కోసం వెళ్తే కలిగిన శోకమిది.. ఎందుకీ పుణ్యం ఇంత భారమైంది? ఎందుకీ దర్శనం ఇంత దూరమైంది? దైవం ఎదురుగా నిలబడితే.. మృత్యువు కౌగిలించుకుంది కారణం ఏమై ఉంటుందో కాలమే చెప్పాల్సి ఉంది. -
ఐక్యతతోనే హక్కుల సాధన
శ్రీకాకుళం: బీసీ ఉద్యోగుల ఐక్యత.. రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు గుత్తుల వీరబ్రహ్మం, పక్కి భూషణరావు చెప్పారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో జిల్లా బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. రాష్ట్ర కమిటీ ప్రతినిధి పి.రామచంద్రరా వుఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భం వీరబ్రహ్మం మాట్లాడుతూ డిసెంబర్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భారీసదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు ఐదు లక్షల మంది బీసీ, ఓబీసీ ఉద్యోగు లు ఉన్నారని.. వీరి సంక్షేమానికి పెద్దపీట వేయా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ చింతాడ రాజశేఖరరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ వై.పోలినాయుడు, ప్రధాన కార్యదర్శిగా బల గ మల్లేశ్వరరావులను ఎన్నుకున్నారు. మిగిలిన వారి ని వారం రోజుల్లో ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి పంపిస్తామని జిల్లా బీసీ ఉద్యోగ సంఘాల నేత డాక్టర్ దువ్వు చక్రపాణి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఉద్యోగ సంఘాల నేతలు వై.శంకరరావు, పి. బాలభాస్కరరావు, వి.కామేశ్వరరావు, జె.రామకృష్ణరావు, ఇ.ఎ.ప్రదీప్కుమార్ పాల్గొన్నారు.నూతన కమిటీ ప్రతినిధులను రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు శాసపు జోగినాయుడు అభినందించారు. -
ఉత్తమ ప్రతిభ కనబరచాలి
ఎచ్చెర్ల : క్రీడల్లో మరింతగా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్టీయూకేటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ ఆకాంక్షించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎస్.జి.ఎఫ్ సెలక్షన్లో పాల్గొని ఎంపికై ఈ నెల 3 నుంచి 6 వరకూ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్లో అండర్–19 శ్రీకాకుళం జిల్లా జట్టు తరఫున ట్రిపుల్ ఐటీ విద్యార్థి సాయిగణేష్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని డైరెక్టర్ ఆదివారం అభినందించారు. కార్యక్రమంలో ఏవో ముని రామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, ఇన్చార్జి సాగర్, టి.దిలీప్కుమార్, కృష్ణంరాజు పాల్గొన్నారు. -
ముగిసిన స్కూల్గేమ్స్ జూడో ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ జూడో ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా జూడో అసోసియేషన్ సౌజన్యంతో జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో జరిగిన ఈ ఎంపికలకు 100 మంది బాలబాలికలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు మాట్లాడుతే పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణ, కఠోర సాధన అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్రపోటీల్లో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా పీఈటీ సంఘ నాయకుడు, జూడో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ మాట్లాడుతూ గత ఏడాది స్కూల్గేమ్స్ జూడో పోటీల్లో పతకాలు పంట పండించారని.. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో రాణించి పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. కాకినాడ వేదికగా అండర్–17 రాష్ట్రపోటీలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో జూడో కోచ్ పీఎస్ మణికుమార్, సంఘ ప్రతినిధులు మెట్ట తిరుపతిరావు, పాతిన రమేష్కుమార్, బి.నిర్మల్కృష్ణ, పురుషోత్తం, అనితశ్రీ, పీడీలు, డీఎస్ఏ కోచ్లు పాల్గొన్నారు. -
అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే!
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయంలో ప్రభుత్వ వైఫల్యంతోనే భక్తుల తొక్కిసలాట జరిగి భక్తులు మరణించారని.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని శాసనమండలి లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కన్నబాబు, పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారాలకు.. రాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న దుర్ఘటనలకు ఎలాంటి పొంతన కనిపించడంలేదని వారు ఆరోపించారు. భక్తుల తొక్కిసలాట సంఘటనపై ఆదివారం మాజీమంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులంతా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీరితో పాటు జెడ్పీ చైర్మన్లు మజ్జి శ్రీనివాస్, పిరియా విజయ, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, కొర్ల భారతి, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, ఇతర అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన సంఘటనపై ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టంచేయాలి. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. అందుకే దేవుడికి కోపం వస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతో ఈ ఘోరం జరిగింది. ఘటనను పక్కదారి పట్టించేందుకు ప్రైవేట్ ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పునైనా పరిహారం అందజేయాలి. కాశీబుగ్గ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఓ ప్రధాన పత్రికలో పోలీసుల వైఫల్యం అంటూ రాశారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ముందస్తుగా సమాచారం ఉన్నా ఎందుకు బందోబస్తును ఏర్పాటు చేయలేదు – బొత్స సత్యనారాయణ, శాసనమండలి ప్రతిపక్ష నేత రూల్బుక్పై శ్రద్ధ లేదా?దేవాలయాల పరిరక్షణ గాలికొదిలేశారు. రెడ్బుక్ రాజ్యాంగం తప్ప రూల్బుక్పై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టిసారించడంలేదు. నిర్లక్ష్యం, వైఫల్యాలతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన సంఘటనలో ఆలయ ధర్మకర్తపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించడం ప్రభుత్వ చేతకానితనం. చంద్రబాబు తుపాను కట్టడి చర్యలు ఏమయ్యాయి? సనాతన ధర్మ పరిరక్షణ చేతకాకపోతే తప్పుకోవాలి. కల్తీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి, జనార్ధన్ను ఎందుకు అరెస్టుచేయడంలేదు. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్పై ఎలాగోలా కేసు కట్టాలనే తాపత్రయం కనిపిస్తోంది. కేవలం ఆలయం సంఘటనను డైవర్ట్ చేయడానికే అరెస్టులు చేస్తున్నారు. – కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ భక్తులకు భద్రత కల్పించలేకపోతున్నారు..కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంతో పాటు జంట పట్టణాల్లో పోలీసుల మోహరింపు, కట్టడి చర్యలు చూస్తుంటే ఇదే శ్రద్ధ ముందే తీసుకుని ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదనిపిస్తోంది. గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఇలాంటి విఫల ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. – ధర్మాన కృష్ణదాసు, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పాలన గాలికొదిలేశారు..రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు, పాలన గాలికొదిలేశారనడానికి కాశీబుగ్గ తొక్కిసలాటే ఉదాహరణ. తిరుపతి సంఘటనలో కూటమి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదు. కనీసం సింహాచలం సంఘటనతో కూడా చలనం కలగలేదు. గతంలో చంద్రబాబు ఓవరాక్షన్తో పుష్కరాల్లో ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు కాశీబుగ్గలో ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. – తమ్మినేని సీతారాం, వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్తఎందరిపై కేసు కట్టారు?కాశీబుగ్గలో జరిగిన సంఘటనలో ప్రభుత్వం తప్పించుకునే ధోరణి కనిపిస్తోంది. ఆలయ ధర్మకర్త పండాను అరెస్టుచేయాలని చూస్తున్నారు. అయితే, గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో అక్కడ ధర్మకర్తల్లో ఎంతమందిని అరెస్టుచేశారో చెప్పాలి. – సీదిరి అప్పలరాజు, మాజీమంత్రి -
కాశీబుగ్గ ఆలయ ఘటనపై... న్యాయ విచారణ జరిపించాలి
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరసామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు చనిపోవడం దురదృష్టకరం. మృతిచెందిన వారికి వైఎస్సార్సీపీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అప్పుడే వాస్తవాలు బయటకొస్తాయి’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది. కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో మరణించినవారికి సంతాపం తెలియజేస్తూ ఆదివారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించింది. ‘ఏదైనా దుర్ఘటన జరిగిన తర్వాత సానుభూతి తెలియజేయడం, లేదంటే ఖండించడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఇది మూడో దుర్ఘటన. తిరుపతి, సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గతో కలిసి మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి.’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ‘తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలం ఘటనలో ఏడుగురు భక్తులు చనిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అదే విషయాన్ని మేం ప్రశ్నిస్తే.. రాజకీయం చేస్తున్నామంటూ మా మీద బురదజల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాశీబుగ్గ దేవాలయం ఏప్రిల్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి భక్తులు దర్శనానికి వస్తున్నారు. ప్రతి శనివారం 1,500 నుంచి 2,000 మంది భక్తులు వస్తున్నారు. కార్తీక ఏకాదశి కాబట్టి నిన్న(శనివారం) భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కానీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆలయ నిర్వాహకులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఆలయ నిర్వాహకుడు మాత్రం ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా స్పందించలేదు. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాశీబుగ్గ ఘటనకు ముఖ్యమంతి, మంత్రులు, అధికారులు... ఎవరు బాధ్యత వహిస్తారు’ అని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ప్రైవేటు పేరుతో పలాయనం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోతే కూటమి ప్రభుత్వం ‘అది ప్రైవేట్ గుడి’ అంటూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే.. అలాంటి ప్రైవేట్ ఆలయాల్లో సైతం గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భక్తుల భద్రతకు పట్టిష్ట చర్యలు చేపట్టిందని దేవదాయ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేవలం పది నెలల వ్యవధిలో తిరుపతి.. సింహాచలం.. వరుస దుర్ఘటనల అనంతరం తాజాగా కాశీబుగ్గ విషాదం. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, భద్రతా చర్యల విషయంలో తన వైఫల్యాన్ని పూర్తిగా కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుండడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతి తొక్కిసలాటప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరున్న తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో క్యూలైన్లో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం. ముక్కోటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని తెలిసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో సర్కారు లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. సింహాచలం దుర్ఘటనపై ‘సమగ్ర నివేదిక’ ఊసేలేదుసింహాచలం శ్రీవరహ లక్ష్మీనరసింహ ఆలయంలో చందనోత్సవం సందర్భంగా 2025 ఏప్రిల్ 30న మెట్ల మార్గంలో క్యూలైన్లో వెళుతున్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందిన దుర్ఘటనకు సంబంధించి బాధ్యులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. తిరుపతి ఘటన తర్వాత కేవలం నాలుగు నెలల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యత తీసుకోలేదు. దుర్ఘటన జరిగిన రోజున ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించి, 72 గంటల్లో ప్రాథమిక నివేదిక, 30 రోజుల్లో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 72 గంటల్లో కమిటీ అందజేసిన ప్రాథమిక నివేదిక మేరకు ప్రభుత్వం ‘తూ తూ మంత్రం చర్యలతో’ సరిపెట్టిందని విమర్శలు అప్పుడే వెల్లువెత్తాయి. ఇక ఇప్పటికి ఆరు నెలలు గడిచినప్పటికీ, దుర్ఘటనపై 30 రోజుల్లో సమర్పించాల్సిన సమగ్ర నివేదిక అంశం ఊసే లేకుండా పోయిందని దేవదాయ శాఖలో చర్చ జరుగుతోంది. ముందు ఎక్కడాలేని హడావుడి.. ఆపై గప్చుప్!సింహాచలం చందనోత్సవం కార్యక్రమాల పర్యవేక్షణ విషయంలో ప్రభుత్వం ముందస్తుగా చేసిన హడావుడి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు మంత్రుల కమిటీ రెండు నెలల పాటు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి.. గతంలో ఎప్పుడూలేని తీరుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తామే ప్రతి పనిని క్షుణంగా పరిశీలించామని ప్రకటించింది. దుర్ఘటనకు 15 రోజుల ముందు ఏప్రిల్ 16వ తేదీన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ ఇన్చార్జి డోలా బాల వీరాంజనేయలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చందనోత్సవ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 30న దుర్ఘటన జరిగిన తర్వాత మంత్రుల కమిటీ సభ్యులెవరూ బాధ్యత తీసుకోకపోవడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ పెద్దలు సైతం తమ మంత్రివర్గ సహచరులను ఈ ఘటనలో బాధ్యులు చేయకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. విచారణ కమిటీ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా కమిటీ 72 గంటల్లో నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా చిరు ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం.. అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిపోయాయన్న విమర్శలు వచ్చాయి.ప్రైవేటు దేవాలయాలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధఅప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దేవదాయ శాఖ అధికారులతో 2021 సెప్టెంబరు 27వ తేదీన నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవదాయ శాఖ వద్ద నమోదు కాకుండా కొంత మంది (ప్రైవేట్) ట్రస్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ఆలయాల్లో భద్రతకు పలు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తుతం అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటే ప్రైవేట్ ట్రస్టీల ఆధ్వర్యంలో నడిచే గుళ్లలో భద్రతకు సంబంధించి ఆయా యాజమాన్యాలకు అప్పటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సంబంధిత ఆలయాల్లో కూడా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల మాదిరే సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆయా ప్రైవేట్ ట్రస్టీలకు దేవదాయశాఖ నోటీసులు జారీ చేయాలని అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి స్వయంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అప్పటి సీఎం అధ్యక్షతన జరిగిన దేవదాయ శాఖ సమీక్ష వివరాలను 2021 అక్టోబరు 8 మినిట్ రూపంలో అప్పటి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ రాష్ట్ర స్థాయిలో హోం శాఖతో పాటు రెవెన్యూ, ఇతర శాఖాధిపతులకు సైతం మెమో ద్వారా తెలియజేశారు. అప్పటి సీఎం జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయ శాఖ పరిధిలో ఉన్న పలు ఆలయాలతోపాటు పలు ప్రైవేట్ ట్రస్టీల ఆధ్వర్యంలో నడిచే దాదాపు 9,500 ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు హోం, రెవెన్యూ శాఖలు చర్యలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ ప్రభుత్వం పట్టిష్ట భద్రత చర్యలను కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. -
ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: బొత్స
సాక్షి, శ్రీకాకుళం: కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరమని.. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని.. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి.. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’’ అని బొత్స నిలదీశారు.‘‘చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు?.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు?. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాత్రులం అంటే కుదరదు.. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు ఇవ్వాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సీదిరిసీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది. మహిళలే అధికంగా చనిపోయారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య సహాయం అందించాం.. ఈరోజు వైఎస్సార్సీపీ నేతలు అందరం కలిసి బాధితులను పరామర్శించాం. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాం.. రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?: కన్నబాబుకురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కాశీబుగ్గ ఘటన కలిచివేసింది.. క్షతగాత్రులంతా నిరుపేదలు. నిమితమాత్రులమంటూ బాబు వైరాగ్యం ప్రదర్శిస్తున్నాడు. ప్రైవేట్ ఆలయం అని మాట్లాడుతున్నారు. ఆసుపత్రులను ప్రైవేటుకు ఇచ్చినట్టు.. ఆలయాలను కూడా ప్రైవేటుకు ఇస్తున్నామని చెప్పండి. సినిమా హీరోయిన్ వస్తే రోప్ పార్టీ వేసి భద్రత ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు భద్రత ఇవ్వలేదు. ఆలయాల్లో భద్రత కోసం ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందా.? రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?. ఇది ప్రైవేట్ ఆలయం అంటున్నారు.. తిరుపతి, సింహాచలంలో జరిగిన ఘటన మాటెంటి..? కాశీబుగ్గలో జరిగింది ప్రైవేట్ ఘటన కాదు.. ప్రభుత్వం బాధ్యత వహించాలి. కష్టం అంటే జగన్ ముందుంటారు. -
కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో YSRCP బృందం పర్యటించింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సంఘటన స్థలాన్ని పార్టీ బృందం పరిశీలించింది.ముందుగా.. తొక్కిసలాట బాధితులను పార్టీ నేతలు పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్యంపై వైఎస్సార్సీపీ నేతలు ఆరా తీశారు. వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సహా పలు నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, నాయకులు ఉన్నారు.కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం: బొత్స సత్యనారాయణ కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? లేదా..?. సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాతృలం అంటే కుదరదు. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాం’’ అని బొత్స పేర్కొన్నారు. -
అసంతృప్తితో బీజం.. ఉత్తరాంధ్ర చిన్నతిరుపతిగా ఖ్యాతి
పలాస: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అసంతృప్తితో బీజం పడింది. ఈ గ్రామానికి చెందిన హరిముకుందాపండా చాలా ఏళ్ల కిందట తిరుమల దర్శనానికి వెళ్లారు. దర్శనం సరిగా కాకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు. తనకు మిగిలిన అసంతృప్తి ఇంకెవరికీ కలగకూడదని భావించాడు. వీరిది ఒడిశా రాజకుటుంబం. హరిముకుందా తపనను గుర్తించిన ఆయన తల్లి హరివిష్ణుప్రియపండా సొంతంగా మనమే ఆలయం కట్టుకుంటే సరిపోతుందని ప్రోత్సహించింది. తల్లి మాటతో హరిముకుందా ఆలయ నిర్మాణానికి ఉపక్రమించారు.తిరుమల వేంకటేశ్వరస్వామిని పోలిన ఏకశిలా విగ్రహాన్ని తిరుమలలోనే తయారు చేయించి తీసుకొచ్చి ప్రతిష్టించారు. ఆలయాన్ని సుందరంగా నిర్మించారు. ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రారంభించారు. ప్రతి శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు భారీగా తరలివస్తుండడంతో అనతికాలంలోనే ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియాలోనూ ఆలయ వీడియోలు వైరల్ అయి ట్రెండింగ్ అయ్యాయి. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా ఖ్యాతికెక్కింది. ప్రతీ శనివారం వేలల్లో భక్తులు వస్తుంటారని పర్వ దినాల్లో 10 వేల నుంచి 15వేల మంది వరకు వస్తుంటారని అంచనా. ఈ శనివారం ఏకాదశి కావడంతో 25వేల మందివరకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. మంత్రి ఆనం, మంత్రుల వితండ వాదన ఇంతటి ప్రాచుర్యం పొందిన ఆలయం గురించి తమకు తెలియదని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించడం అందరినీ విస్తుగొలుపుతోంది. ఇతర మంత్రులు, టీడీపీ నేతలూ ఇది ప్రైవేటు ఆలయం అని, అక్కడ తొక్కిసలాట జరిగితే ప్రభుత్వానికి ఏం సంబంధమని వితండ వాదన చేయడంపై అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు. ఈ ఆలయం తమ దృష్టిలో లేదని, ప్రభుత్వం వద్ద ఎక్కడా సమాచారం లేదని అబద్ధాలు వల్లె వేస్తున్నారు. బందోబస్తు కావాలని నిర్వాహకుడు అడగలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యమే మా వాళ్ల ప్రాణాలు బలిగొంది
ప్రభుత్వమే మా వాళ్ల ప్రాణాలు బలిగొందని కాశీబుగ్గ తొక్కిసలాట బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు తీరిగ్గా వచ్చారని, భద్రతా చర్యలు అసలే లేవని విమర్శించారు. కూటమి సర్కారు తీరుపై ఆక్రోశించారు.నా భార్య మరణానికి ప్రభుత్వ వైఫల్యమే కారణంస్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. నా భార్య మరణానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. ఆలయం వద్ద ఒక్క పోలీసూ లేరు. సరైన బందోబస్తు నిర్వహించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇది ముమ్మాటికీ అధికార యంత్రాంగం లోపమే. ఇంత నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారు. అలాగే ఆలయ ధర్మకర్తలు కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. మా కుటుంబానికి తీరని దుఖం మిగిలింది. నేను ఒంటరినయ్యాను. – మృతురాలు అమ్ములు భర్త రాజారావు, సూర్యకుండ కాలనీ, పలాససర్కారు నిర్లక్ష్యం వల్లే అమ్మ బలైందిదైవ దర్శనానికి వెళ్లిన మా అమ్మ ప్రాణం పోయింది. ఆరోగ్యంగా వెళ్లిన అమ్మ విగత జీవిగా బయటకొచ్చింది. ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యత. వేలాది మంది భక్తులు వస్తున్నారని తెలిసి కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. సర్కారు నిర్లక్ష్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఎంత నష్ట పరిహారం ఇస్తే ఏం ప్రయోజనం. మా అమ్మ తిరిగి వస్తుందా.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.– రాజేశ్వరి కుమారుడు వైకుంఠరావు, బెల్లుపటియా, మందస మండలంరక్షణ ఏర్పాట్లు లేవుగుడి దగ్గర ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవు. అంతమంది జనాలు వచ్చే గుడికి పోలీసులు కాపలా ఉండాలి. కానీ అక్కడ పోలీసులు లేరు. అన్నీ అయిపోయాక పోలీసులు కాశీబుగ్గంతా నిండిపోయారు. – రాపాక గవరయ్య, పిట్టల సరియా, మృతురాలు రాపాక విజయ బావసర్కారు పర్యవేక్షణేదీ? కార్తీక ఏకాదశి మంచిరోజని దేవుడి దర్శనం కోసం కాశీబుగ్గలోని చిన్న తిరుపతి వెళ్లాం. ఒక్కసారిగా తోపులాట జరగడంతో పడిపోయాం. మా వదిన మురిపింటి నీలమ్మపై జనాలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆమె కింద పడిపోయి నా కళ్ల ముందే చనిపోయింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. – దుక్క తవిటమ్మ, దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు మండలం ఘోరానికి కారణం ప్రభుత్వమే నిఖిల్ను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఒంటరి చేసి వదిలివెళ్లిపోయాడు. మా కంటిదీపం ఆరిపోయినట్లయ్యింది. ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం జరిగింది. – లొట్ల పార్వతి, నిఖిల్ పెద్దమ్మ సరైన చర్యల్లేవుతిరుపతి వెళ్లలేక దగ్గరలో ఉన్న కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాను. ప్రభుత్వం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. పోలీసులు కూడా లేకపోవడం వల్ల మహాఘోరం జరిగింది. తొక్కిసలాట ఘటనలో మా పిన్ని మృతి చెందింది. – కొర్రాయి అప్పయ్య, మృతురాలు యశోద అక్క కుమారుడు, శివరాంపురంఇంత నిర్లక్ష్యమా? కళ్లముందే ముగ్గురు మృతిదర్శనం చేసుకొని బయటకు వచ్చే తలుపులు తీయడంతో ఒక్కసారిగా లోపలకి వెళ్లేవారు, బయటకు వచ్చేవారు తోసుకోవడంతో కింద పడిపోయాం. మా మీద మరి కొంత మంది పడిపోయారు. నా కిందనే పడిన ముగ్గురు ఆడవాళ్లు చనిపోయారు. కొద్ది సేపు అయి ఉంటే నేను కూడా చనిపోయే దాన్ని. – కూర్మాపు హిమ, ప్రత్యక్ష సాక్షి, నందిగాంఇలాంటి కష్టం పగవాళ్లకూ రాకూడదు నేను నా భార్య దర్శనానికి వెళ్లాం. తోపులాటలో నా భార్య కిందపడిపోయింది. మరో ఐదుగురు ఒకరిపై ఒకరు పడ్డారు. ఆ క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. ఎలాగో నా భార్యను కాపాడుకోగలిగాను. ఇలాంటి కష్టం పగవాళ్లకు కూడా రాకూడదు. – దుంప రుషికేశ్వరరావు, సీతారాంపురం, వజ్రపుకొత్తూరు మండలం ఒక్క పోలీసూ లేరు మాది వజ్రపుకొత్తూరు మండలం శివరాంపురం గ్రామం. మా బంధువులతోపాటు మరో 10 మంది దర్శనం కోసం వచ్చాం. దర్శనానికి వెళ్తుండగా మెట్ల వద్ద తోపులాట జరిగింది. 30 నిమిషాలకుపైగా ఆలయంలో ఇరుక్కుపోయాం. అనేక మంది మహిళలు కింద పడిపోయారు. తొక్కిసలాట సమయంలో ఒక్క పోలీసూ లేరు. – దుబ్బ బోడెయ్య, షణ్ముఖరావు అంబులెన్సులూ సమయానికి రాలేదు మాది నందిగాం మండలం శివరాంపురం గ్రామం. ఏకాదశి రోజు టెక్కలిలోని విష్ణుమూర్తి గుడికి వెళ్లాల్సి ఉంది. ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చునంటూ పలాస–కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి మా ఊరి వారితో కలిసి నా భార్య వెళ్లింది. దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడింది. జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అంబులెన్సులూ సమయానికి రాలేదు. – బోరసింగు కామేష్, నందిగాం ముప్పావు గంట ఊపిరాడలేదు.. సర్కారుదే పాపంతొక్కిసలాటలో రెయిలింగ్ నుంచి మెట్ల పక్కన జారిపోయి కిందపడిపోయాను. నా మీద పది నుంచి పదిహేను మంది పడిపోయారు. ముప్పావు గంట వరకు పడిపోయిన నన్ను ఎవరూ బయటకు తీయలేదు. ఊపిరాడక పోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నాను. తొక్కిసలాటలో నా కాళ్లు బెణికిపోయి, నడవలేని పరిస్థితి నెలకొంది. సరైన భద్రత చర్యలు తీసుకోని సర్కారుదే ఈ పాపం. – రోణంకి రమాదేవి, క్షతగాత్రురాలు, తేలినీలాపురం, టెక్కలి మండలం సహాయ చర్యల గురించి పట్టించుకోలేదుఉదయం 10 గంటలకు ఆలయానికి వెళ్లిన మేము 11.30 గంటలకు దర్శనం పూర్తిచేసుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా తలుపులు తెరవడంతో, బయట నుంచి వచి్చన భక్తులు లోపలికి వెల్లువలా పరుగులు తీశారు. దీంతో ఒకవైపు స్టీలు రెయిలింగ్ ఊడిపోయింది. దీంతో జనం మధ్య తొక్కిసలాట జరిగింది. నాకు తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యల గురించి సర్కారు పట్టించుకోలేదు. – గున్న చిట్టెమ్మ, గణేష్ కాలనీ, నందిగాం గ్రామం తలుపు తీయడంతో తోపులాట దేవుడిని దర్శించుకుని బయటకు వచ్చే తోవలో ఉన్న గేటు వేసేశారు. తలుపు తీయకపోవడం వల్ల జనాలు పెరిగిపోయారు. తర్వాత ఒక్కసారిగా తలుపు తీయడంతో తోపులాట జరిగింది. కింద పడిపోయిన వారు చనిపోయారు. – కొర్రాయి శీలమ్మ, శివరాంపురం, సంఘటన ప్రత్యక్ష సాక్షి ఆస్పత్రికి తీసుకెళ్లే నాథుడే లేడుమా దర్శనం అయిపోయింది. బయటకు వస్తుండగా క్యూ ఆగిపోయింది. 10 నిమిషాలు అయ్యాక తోపులాట జరిగింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు మహిళలు కింద పడిపోయారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేవారెవరూ కానరాలేదు. – చెలియ మోహిణి సరియాపల్లి, మందస మండలం ఘటన జరిగిన తర్వాతైనా స్పందించలేదుమేము దర్శనానికి వెళ్లేటప్పుడు అంతా సజావుగా ఉంది. 10 గంటల సమయంలో రద్దీ బాగా పెరిగింది. ఆలయం లోపల ఉన్నాం. దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా తొక్కిసలాట జరిగింది. నాతో పాటు వచ్చిన పైల సీతమ్మ, నర్సమ్మలకు గాయాలయ్యాయి. ఘటన జరిగిన తర్వాతైనా సర్కారు స్పందించలేదు. – పైల జయమ్మ, ధర్మవరం, ఇచ్ఛాపురం మండలంభద్రత సర్కారు బాధ్యత కాదా?మేము దర్శనం చేసుకొని వస్తున్నాం. గేటు వేసి ఉంది. ముందుకు వెళ్లేందుకు అవకాశం లేక మెట్లపై నిలబడ్డాం. వెనుక నుంచి అరుపులు వినిపించాయి. దీంతో ముందున్న తలుపులు తెరిచారు. ఒక్క సారి అందరం ముందుకు వెళ్లాం. అప్పుడే తొక్కిసలాట జరిగింది. ఎలాగో తప్పించుకొని బయటపడ్డాం. ఇది సర్కారు పాపమే. భద్రత సర్కారు బాధ్యత కాదా?– పిట్ట జగన్నాయకులు, ధర్మవరం ప్రభుత్వం వల్ల రెండుకాళ్లూ పోయాయ్ కార్తీక ఏకాదశి నాడు భక్తిభావంతో వేంకటేశ్వరస్వామి గుడికి వచ్చాను. ఇక్కడ సరైన బందోబస్తు లేకపోవడంతో తొక్కిసలాటలో రెండు కాళ్లూ పోగొట్టుకొన్నాను. మా కుటుంబానికి తీవ్ర నష్టం ఏర్పడింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. – చెలియా కాంతమ్మ, సరియాపల్లి, మందస మండలం -
దేవుడా!.. చంద్రబాబు పొలిటికల్ పాలన
2015లో చంద్రబాబు ప్రచార కండూతితో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట.. 29 మంది మృతివిచారణ నివేదికను తొక్కిపెట్టిన నాటి టీడీపీ ప్రభుత్వంఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుమల ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూలైన్లో తొక్కిసలాట. ఆరుగురు సామాన్య భక్తులు మృతి.ఏప్రిల్ 30న సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చందనోత్సవం సమయంలో క్యూలైన్ పక్కన ఉన్న గోడ కూలి గాల్లో కలిసిన ఏడుగురు భక్తుల ప్రాణాలు.నవంబరు 1న కార్తీక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయలో తొక్కిసలాట.. 9 మంది భక్తుల దుర్మరణం.సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పొలిటికల్ పాలన తేవడంతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి... దేవాలయాలకు వెళ్లే భక్తుల ప్రాణాలకు భరోసా కరువైంది! కేవలం పది నెలల కాలంలో మూడు ఆలయాలలో మూడు ఘోర దుర్ఘటనలు. ఒక ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం మేల్కొని ఉంటే, అన్ని గుడుల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టి ఉంటే దారుణాలు జరిగేవి కాదన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. వరుస దుర్ఘటనల్లో భక్తులు దుర్మరణం చెందుతున్నా, పోయేది సామాన్యుల ప్రాణాలే కదా అన్నట్లు చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందనే వాదన వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ పాపాలు సామాన్యుల పాలిట శాపాలుగా మారుతున్నాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇన్ని విషాదాలు జరుగుతున్నా అమెరికా కంటే గొప్ప టెక్నాలజీ తెచ్చానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తుపానునే కంట్రోల్ చేశానని, సంక్షోభాలను నివారించడంలో చాలా అనుభవజ్ఞుడినని చెప్పుకొంటూ సీఎం ప్రచార ఆర్భాటంతో కాలం వెలిబుచ్చుతున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరిగి భక్తులు చనిపోతున్నా నిరోధించేందుకు చేపడుతున్న చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని, కనీసం మంచినీళ్లు కూడా సమకూర్చలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.29 మందిని బలిగొన్న బాబు ప్రచార కండూతి» చంద్రబాబు ప్రచార కండూతి 2015 గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29మంది భక్తుల దుర్మరణానికి కారణమైంది. రాజమహేంద్రవరం ఘాట్ వద్ద వేలాది భక్తుల సమక్షంలో సీఎంగా బాబు కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం చేసేలా వీడియో తీయాలని భావించారు. ముందు రోజే ఘాట్ గేట్లు మూసి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పడిగాపులు కాసేలా చేశారు. చంద్రబాబు రాగానే గేట్లు తెరిచారు. భక్తులు ఒక్కసారిగా స్నానాలకు రావడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయిన విషయం ఇప్పుడు మళ్లీ చర్చనీయంగా మారింది. దీనిపై బాబు కనీసం నైతిక బాధ్యత తీసుకోలేదు. పైగా పుష్కరాల దుర్ఘటనపై విచారణ కమిషన్ నివేదికను తీవ్ర జాప్యం చేశారు. చివరికి ఎవరి బాధ్యత లేదని తేల్చారు.» ఇక 2017లో కార్తీక మాసం సందర్భంగా నవంబరు 12న విజయవాడ ఇబ్రహీంపట్నం పవ్రిత సంగమం వద్ద కృష్ణా నదిలో పర్యాటకుల బోటు బోల్తాపడి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. » 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉండే 30పైగా ఆలయాలను కూల్చివేశారు.» తిరుమలలో 1472లో నిర్మితమైన వేయి కాళ్ల మండపాన్ని 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూల్చివేశారు. » చంద్రబాబు హయాంలోనే... విజయవాడ దుర్గ గుడిలో క్షుద్ర పూజలు జరిగాయంటూ పెద్ద దుమారం చెలరేగింది. ఇంకోవైపు, చంద్రబాబు గతంలో సీఎంగా కొనసాగిన సమయంలో భక్తులు అయ్యప్ప మాలధారణ కారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయంటూ ఎగతాళిగా మాట్లాడారు.కూటమి పాలనలో అపచారాలు ఎన్నో...» తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో ఈ ఏడాది జనవరి 8న తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు దుర్మరణం చెందారు. 40 మంది తీవ్రంగా గాయపడడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోయింది. » తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో జనవరి 13న షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. » ఈఏడాది ఫిబ్రవరి 18న శ్రీవారి ఆలయ మహాద్వారం ఎదుట టీటీడీ ఉద్యోగి, పాలకమండలి సభ్యుడికి మధ్య వివాదం చోటుచేసుకుంది. మార్చిలో నల్లమల అటవీ ప్రాంతంలోని పవిత్ర కాశినాయన క్షేత్రంలో అన్నదాన భవనం, సత్రాలు, గోశాలను కూల్చివేశారు. » ఏప్రిల్లో శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారంలో వెలిశారని భక్తులు విశ్వసించే శ్రీ కూర్మంలో పెద్దసంఖ్యలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి.»300 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేట బాల శశిశేఖర ఆలయంలో ఈ ఏడాది మే 18న కొందరు వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు. -
దేవుడా.. మరో ఘోరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి నెట్వర్క్: మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు.. నిన్న సింహాచలంలో గోడ కూలి ఏడుగురు.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఘటనకు ప్రధాన కారణం అని స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయానికి కార్తీక ఏకాదశి రోజున వేలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా బందోబస్తు ఇవ్వలేదు. ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్తే అక్కడ వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తారు. ఈ క్రమంలో దర్శనానికి వెళ్లే వారు.. దర్శనం చేసుకుని బయటకు వచ్చే వాళ్లతో ప్రవేశ మార్గం (రాకపోకలకు ఒకే మెట్ల మార్గం) కిక్కిరిసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో ఉదయం 11.45 గంటల సమయంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. తీవ్ర గందరగోళం ఏర్పడింది. కేకలు.. ఆర్తనాదాలు.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. ప్రాణ భయంతో మిగితా వారు కింద పడిన వారిని తొక్కుకుంటూ బయటకు వెళ్లడానికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో భక్తుల ఒత్తిడి కారణంగా కుడి వైపు రెయిలింగ్ ఒరిగిపోయింది. దీంతో క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. దీంతో కింద పడిపోయిన వారిలో ఊపిరి ఆడక తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరికొంత మంది మెట్లపై నుంచి కిందకు దూకి గాయపడ్డారు. కింద పడిపోయిన తర్వాత వృద్ధులు, పిల్లలు లేచేందుకు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని.. ‘అమ్మా.. అయ్యా.. ఊపిరి అందడం లేదు.. మీకు దండం పెడతా.. చచ్చిపోతున్నా.. ఎవరైనా కాపాడాలంటూ..’ ప్రాధేయపడి అడుగుతున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితే లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశం క్షమార్హం కాని ప్రభుత్వ నిర్లక్ష్యంఈ ఆలయానికి కొంత కాలంగా ప్రతి శనివారం వేలాది మంది భక్తులు వస్తారనే విషయం అందరికీ తెలుసు. పైగా శనివారం కార్తీక ఏకాదశి. ఈ దృష్ట్యా భక్తులు మరింతగా తరలి వస్తారని ఎవరూ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా పర్వదినాల్లో, కార్తీక మాసంలో ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకునేలా దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పడానికి ఈ ఘోర ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చినా పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. పైన ఉన్న ఆలయంలో మామూలుగా 2000 మంది భక్తులు ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఘటన జరిగే సమయానికి అంతకు రెండు మూడు రెట్లలో భక్తులు ఉన్నారు. వారంతా ఒక్కసారిగా కిందకు రావడానికి ప్రయత్నించడంతో మెట్లపై తోపులాట చోటు చేసుకుంది. వారు కిందకు రాకుండా నియంత్రించి ఉంటే ఇంతగా ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని, ఇలా జరగడానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని భక్తులు మండిపడుతున్నారు. మార్చురీ వద్ద పోలీసులతో వాగ్వాదం చేస్తున్న మృతుల బంధువులు తొలుత స్పందించిన వైఎస్సార్సీపీ నేతలువిషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి సీదిరి పలువురికి సీపీఆర్ చేశారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష సంఘటనా స్థలానికి చేరుకోగా, కొంత సమయం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు వచ్చారు. అనంతరం మృతదేహాలను తరలించే చర్యలు చేపట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి పోలీస్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆలయం, ఆస్పత్రితో పాటు పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు, క్షతగాత్రుల కేకలతో ఆస్పత్రి దద్దరిల్లింది. డీఐజీ గోపినాథ్ జెట్టి ఆస్పత్రి వద్దకు చేరుకుని పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ తదితరులు ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి మంత్రి లోకేశ్ వచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు మృతులు, క్షతగాత్రుల బంధువులు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీషను నిలదీశారు. ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదట!ఏకాదశి కావడంతో 20 వేల నుంచి 25 వేల మంది ఒక్కసారిగా వచ్చారని అంచనా. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. రహదారిపై 10–20 మంది నిరసన తెలపడానికి వస్తే.. వెంటనే ఆంక్షల పేరిట పెద్ద సంఖ్యలో పోలీసులు వాలి పోవడం చూస్తుంటాం. అలాంటిది ఏకాదశి రోజున వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులు తరలి వచ్చారని తెలిసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం దారుణం అని భక్తులు మండిపడుతున్నారు. ఘటన జరిగిన తర్వాత వందల సంఖ్యలో పోలీసులను పెట్టి లాభమేమిటని ప్రజలు నిలదీస్తున్నారు. 20 మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. క్షతగాత్రులను తరలించేందుకైనా.. మృతదేహాలను పక్కకు తీసేందుకైనా ప్రభుత్వ యంత్రాంగమెవరూ చాలా సేపటి వరకు అక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఘటన తర్వాత భక్తుల సంఖ్యపై వేర్వేరు ప్రకటనలు చేశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దాదాపు 20 వేల మందికిపైగా భక్తులు వచ్చారని చెబుతున్నారు. అసలు ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదని చెప్పుకొచ్చారు. ఇలా గందరగోళ ప్రకటనలు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగా, మృతుల బంధువులు, క్షతగాత్రులకు ఏదైనా సాయం కావాలంటే 08942–240557 నంబర్కు సంప్రదించాలని అధికారులు తెలిపారు. పోలీసు దిగ్బంధంలో సీహెచ్సీ ఈ దుర్ఘటనలో మరణించినవారి మృతదేహాలను ఉంచిన కాశీబుగ్గ కమ్యూనిటీ హాస్పిటల్(సీహెచ్సీ) వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మృతుల బంధువులు అక్కడ ఆందోళన చేయకుండా చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన చేస్తుండగా పోలీసులు బలవంతంగా తరలించారు.మృతుల వివరాలు1. ఏదూరి చిన్నమ్మి (50), రామేశ్వరం, టెక్కలి మండలం2. రాపాక విజయ (48), పిట్టలసరియా, టెక్కలి మండలం3. మురుపింటి నీలమ్మ (60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు మండలం4. దువ్వు రాజేశ్వరి (60), బెల్లుపటియా, మందస మండలం5. లొట్ల నిఖిల్ (13), బెంకిలి, సోంపేట మండలం6. డొక్కర అమ్ములమ్మ (54) పలాస–కాశీబుగ్గ7. చిన్ని యశోదమ్మ (56), శివరాంపురం, నందిగాం మండలం8. బోర బృంద (62), మందస9. రూప (52) గుడ్డిభద్ర, మందస మండలంతల్లికి కడుపుశోకంసోంపేట: కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనలో బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్(12) మృతిచెందడంతో అతని తల్లి అనుకు తీరని కడుపుశోకం మిగిలింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. నిఖిల్కు చిన్నతనం నుంచే వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. జింకిబద్ర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. దీపావళి నుంచి బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో గోవిందుని నగర సంకీర్తనల్లో పాల్గొంటున్నాడు. ఆరేళ్లుగా కార్తీక సంకీర్తనల్లో పాలుపంచుకుంటున్నాడు. శనివారం వేకువజామున గ్రామంలోని శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం అనంతరం భక్తులతో కలిసి సంకీర్తన చేశాడు. ఉదయం 9 గంటలకు అమ్మ అనుతోపాటు, అక్క, మరికొందరితో కలిసి కాశీబుగ్గ వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పలాస ప్రభుత్వాస్పత్రి వద్ద అపస్మారకస్థితికి వెళ్లింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నిఖిల్ తండ్రి పాపారావు సోంపేట లోకనాథేశ్వర కలాసీ సంఘంలో కలాసీగా పనిచేస్తున్నారు.మృతులంతా సామాన్యులే⇒ సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన బాలుడు నిఖిల్ తండ్రి పాపారావు కలాసీగా పని చేస్తున్నాడు. ⇒ టెక్కలి మండలం పిట్టలసరియా గ్రామానికి చెందిన రాపాక విజయ వ్యవసాయ కూలీ. ఈమె భర్త చిన్నారావు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు.⇒ టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన యేదూరి చిన్నమ్మి భర్త గణపతిరావు మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.⇒ వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేట గ్రామానికి చెందిన మురిపింటి నీలమ్మ గృహిణి. భర్త కన్నయ్య మృతి చెందడంతో కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం బెల్లుపటియా గ్రామానికి చెందిన దువ్వు రాజేశ్వరి వ్యవసాయ కూలీ. ⇒ నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన చిన్ని యశోదమ్మ వృద్ధురాలు. కుటుంబం వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. ఈమె ఇంటి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రూపది నిరుపేద కుటుంబ. ⇒ మందస గ్రామానికి చెందిన బోర బృందావతి భవన నిర్మాణ కార్మికురాలు.⇒ పలాస గ్రామానికి చెందిన డొక్కరి అమ్ములమ్మ సామాన్య గృహిణి. ఇప్పుడు ఏం చే ద్దామని వచ్చారు?మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే శిరీషపై బాధితుల మండిపాటు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఇప్పుడు మీరు ఎందుకొచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? చీమ చిటుక్కుమంటే తెలుసుకునే మీరు ఇక్కడికి ఇంత మంది భక్తులు వచ్చారని ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయారు? ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా.. ఇక్కడ కనీసం ఒక్క పోలీసు అయినా లేరు. పట్టించుకునే వారే లేరు. వేలాది మంది భక్తులు వస్తే ఇలా చేస్తారా? ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా సేపటి వరకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు.. కనీసం వైద్యులు, అంబులెన్స్ అయినా పంపలేదు. అచ్చెన్నాయుడు, శిరీషలను ప్రశ్నిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు మీ తీరు ఏం బాగోలేదు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులు, గాయపడ్డ వారు, ఇతర భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అనంతరం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శిరీష ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడే మృతదేహాల వద్ద రోదిస్తున్న వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లగా మంత్రిని చూసి బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగిందని గట్టిగా నిలదీశారు. బాధితులు వేసే ప్రశ్నలకు మంత్రి, ఎమ్మెల్యే సమాధానం చెప్పలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయారు.ఆపద్బాంధవుడు సీదిరి అప్పలరాజుపలువురి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రివజ్రపుకొత్తూరు రూరల్: ఆలయంలో జరిగిన తోపులాట ఘటనలో గాయపడిన వారికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అత్యవసర సేవలు అందించారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన స్వతహాగా వైద్యుడు కావడంతో తొక్కిసలాటలో ఊపిరి తీసుకోలేకపోతున్న వారిని, స్పృహ తప్పిన వారిని గుర్తించి సీపీఆర్ చేశారు. వృత్తి ధర్మం పాటిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. తోపులాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళలకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలపడంతో పాటు, అంబులెన్స్ను రప్పించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పలరాజు స్ఫూర్తితో పక్కనున్న వారు సైతం గాయపడ్డ వారికి సేవలందించారు. -
కాశీబుగ్గ తొక్కిసలాటపై మంత్రి లోకేష్ పొంతన లేని మాటలు
శ్రీకాకుళం : జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈరోజు(శనివారం) ఏకాదశి పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భర్తులు రావడంతో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అయితే శనివారం సాయంత్రం మంత్రి లోకేష్.. తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ దేవాలయాన్ని సందర్శించారు.దీనిలో భాగంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట అంశానికి సంబంధించి పొంతనలేని మాటలు మాట్లాడారు. ప్రతీ శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా, పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా లేదన్నారు. భక్తుల రద్దీకి ఉచిత బస్సు కూడా కారణమని లోకేష్ చెప్పిన సమాధానం వింతగా ఉంది. ఉదయం ఆరు గంటలకే భక్తులు అక్కడికి చేరుకున్నా సమాచారం లేదని దాటవేత సమాధానం చెప్పారు లోకేష్. ఒక ఊరి నుంచి వంద మంది వస్తే తెలుస్తుంది కానీ.. ఒక ఊరి నుంచి పది మంది చొప్పున వస్తే ఎలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించారు. ఇలా లోకేష్ మాటల్లో తడబాటు కనబడింది. ధర్మకర్త వీడియో వెలుగులోకి.. సర్కారు వైఫల్యమే కారణంపోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది కూటమి పెద్దలు చెప్పే వాదన తప్పు అని ధర్మకర్త పాండా మాటల్లోనే తేలిపోయింది. పోలీసులకు నిన్ననే సమాచారం ఇచ్చామని ధర్మకర్త పాండా చెప్పిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ధర్మకర్త స్థానంలో ఉన్న పాండా సమాచారం ఇచ్చినా సర్కారు తగిన భద్రత కల్పించకపోవడం గమనార్హం. ముందస్తు సమాచారం లేదంటూ మంత్రులు, అధికారుల ప్రకటించగా, సమాచారం ఇవ్వలేదా అని పాండాను మీడియా ప్రశ్నించింది. ‘ఈరోజు కాదు.. నిన్నే పోలీసులకు చెప్పా’ అని పాండా చెప్పారు. దీనికి సంబంధించిన ఆ వీడియో బయటకి రావడంతో సర్కారు వైఫల్యం బట్టబయలైంది. దాంతో తర్వాత ధర్మకర్త పాండాతో సమాచారం ఇవ్వలేదని, ఇంతమంది భక్తులు వస్తారని అనుకోలేదంటూ అధికారులు చెప్పించడంతో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందనడానికి ఉదాహరణ. -
కాశీబుగ్గ తొక్కిసలాట.. పలాస ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: పలాస ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి, ధర్మాన ప్రసాదరావును ఆసుపత్రి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు పోలీసులు నిరాకరించారు.ఆసుపత్రి ప్రాంగణం ఖాళీ చేయాలని ఆదేశించిన పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను బయటకు పంపించివేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలాస ఆసుపత్రి వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు బైఠాయించారు.కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాటలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ‘‘25 వేల మందికి పైగా భక్తులు వస్తే ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. దేవాలయం ప్రైవేటా? ప్రభుత్వానిదా అన్నది ప్రశ్నకాదు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రధానం’’ అని ధర్మాన పేర్కొన్నారు. -
కాశీబుగ్గ తొక్కిసలాట: మృతులు వీరే..
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాపాక విజయ(48)-టెక్కిలి, రామేశ్వరానికి చెందిన ఏదూరి చిన్మమ్మి(50)-రామేశ్వరం, మురిపించి నీలమ్మ(60)-దుక్కవానిపేట, దువ్వు రాజేశ్వరి(60)-చెలుపటియా, యశోదమ్మ(56) శివరాంపురం, రూప(గుడిభద్ర), డోక్కర అమ్ము(పలాస), నిఖిల్(13)-బెంకిలి, బృందావతి(62)-మందసగా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
కాశీబుగ్గ ఆలయంలో అడుగడుగునా భద్రతా లోపాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోయినా కానీ అధికారులు పట్టించుకోలేదు. కొన్ని వారాలుగా భక్తుల సంఖ్య పెరుగుతున్నా ఒక్కసారి కూడా ఆలయ వర్గాలతో పోలీసులు సమీక్ష చేయలేదు. విఐపీలు దర్శనానికి వస్తున్నా కానీ భద్రతా లోపాలను అధికారులు గుర్తించలేదు.దేవాలయం నిర్మాణంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల క్యూ లైన్లు, వేచి వుండే షెడ్లో ఫ్యాన్లు, వెంటిలేటర్ ఫ్యాన్లు కనిపింయలేదు. ఉక్కపోతతో ఊపిరి ఆడక అవస్థలు పడి భక్తులు స్పృహ కోల్పోయారు. -
తొక్కిసలాట: మంత్రి అచ్చెన్నాయుడిని నిలదీసిన భక్తులు
సాక్షి, శ్రీకాకుళం: మంత్రి అచ్చెన్నాయుడిని మహిళా భక్తులు నిలదీశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకాదశి కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా రావడంతో తోపులాట జరిగింది. రెయింలింగ్ ఉండిపోవడంతో భక్తులు కింద పడ్డారు. 10 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారని.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతి ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాలనుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’’ ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రచారమే ప్రాణం తీసింది.. కాశీబుగ్గ ఆలయ వివరాలు..
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా పది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు తెలిసింది. ప్రమాదం తర్వాత ఆలయం గుర్తించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 12 ఎకరాల్లో ఆలయం..కాశీబుగ్గ పదనాపురం నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరిముకుంద్ పండా ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయం ఐదు ఎకరాల్లో ఉంది. సుమారు రూ.20 కోట్లతో దీనిని నిర్మించారు. కాగా, తనకు తిరుమల వెళ్లిన సమయంలో దర్శనం కాకపోవడంతోనే ఇక్కడ ఆలయం నిర్మించినట్టు తెలిసింది. ఇక, కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్దిలోకి వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేశారు.గుడి నిర్మించిన హరి ముకుంద పాండా25వేల మంది భక్తులు.. దీంతో, ఆలయానికి ప్రతీరోజు దాదాపు 1000 మంది వరకు భక్తులు వస్తున్నారు. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు. ఆలయ సామర్థ్యం దాదాపు రెండు వేల నుంచి మూడు వేలుగా ఉందని పలువురు చెబుతున్నారు. అయితే, ఈరోజు ఏకాదశి నేపథ్యంలో ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు సమాచారం. కాగా, భక్తుల రద్దీని పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం, ఆలయ కమిటీ అంచనా వేయలేదు. ఆలయ కమిటీ సొంతగా భద్రతను సైతం ఏర్పాటు చేయలేదు. వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పటికీ పోలీసు సిబ్బంది రాలేదు. గంట సమయం దాటినా ఘటనా స్థలానికి 108 అంబులెన్స్ చేరుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాశీబుగ్గ క్షతగాత్రులకు సీదిరి వైద్యం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో ఘటన స్థలానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే వైఎస్సార్సీపీ బృందం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఓ ప్రకటనలో..‘కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం. ఈ దుర్ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. భక్తుల ప్రాణనష్టానికి కారణమైన పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట’ అని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ..‘కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతీ ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’ అని విమర్శలు చేశారు. -
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో(Srikakulam Stampade) విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kashibugga Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో పది మందికి గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.అయితే, ఓ భక్తుడు.. తనకు తిరుమలలో దర్శనం కాలేదని సొంతంగా ఆలయాన్ని నిర్మించాడు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం ఉంది. దీంతో, ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిలా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. చిన్న తిరుపతిగా పేరు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏకాదశి సందర్బంగా ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది.. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో, అధికారుల నిర్లక్క్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది ఉదాసీనతే ప్రమాదానికి ముఖ్య కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. మృతులు వీరే..ఇదురి చిన్నమ్మి(50),రామేశ్వరం, టెక్కలిరాపాక విజయ(48), టెక్కలిమురిపింటి నీలమ్మ(60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరుదువ్వు రాజేశ్వరి(60), బెలుపటియ, మందసచిన్ని యశోదమ్మ(56), శివరాంపురం, రూప, గుడిభద్రలొట్ల నిఖిల్(13), బెంకిలి, సోంపేటడొక్కర అమ్ముడమ్మ, పలాసబృందావతి(62), మందస కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతికాశీబుగ్గ తొక్కిసలా ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. మృతులకు రెండు లక్షలు, గాయాల పాలై వారికి 50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. -
‘మెస్ చార్జీలు పెంచాలి’
పలాస: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ చార్జీలను పెంచాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి ఎం.వినోద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పలాసలోని పీడీఎస్యూ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచలేదని, నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం పెరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీ లు కూడా ప్రభుత్వం పెంచాలని కోరారు. హైస్కూల్ విద్యార్థులకు రూ.1400లు, కళాశాల విద్యార్థులకు రూ.1600లు మెస్ చార్జీలు పెంచాలని కోరారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్టళ్లలో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని, అస్వస్థతకు గురువుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి సరైన వైద్యం అందివ్వాలని కోరారు. -
హామీలన్నీ డాబేనా..?
●బాబూ..● కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు జిల్లాకొచ్చి ఏడాది పూర్తి ● ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం ● అదే రోజున జిల్లా కేంద్రంలో సమీక్ష ● తొలి పర్యటనలోఅనేక హామీలు ● ఏడాదైనా అమలుకు నోచుకోని పరిస్థితులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదని మరోసారి తేటతెల్లమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారి జిల్లాకు వచ్చి ఏడాదైంది. గత ఏడాది నవంబర్ ఒకటో తేదీన ఇచ్ఛాపురం మండ లం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. సినీ ఫక్కీలో యాక్షన్, ట్రిక్లతో హడావుడి చేశారు. వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎన్నో హామీలు ఇచ్చారు. అంతటితో ఆగలేదు. జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ మరికొన్ని హామీలు ఇచ్చారు. ఏడాదైనా అవి అమలు కాలేదు. ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామ ని చెబుతూ పథకాన్ని ఈదుపురంలో ప్రారంభించారు. గ్యాస్ భారం తగ్గుతుందని, మహిళలకు కట్టెల కష్టాలు తీరుతాయని తెగ చెప్పారు. ఏటా తెలుపురేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు తప్పనిసరిగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉచిత సిలిండర్లకు ముందుగా డబ్బులు చెల్లిస్తే, 48 గంటల్లో లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు నగదు చెల్లించడం జరుగుతుందన్నారు. త్వరలో లబ్ధిదారుడు గ్యాస్ బుక్ చేసిన వెంటనే ప్రభుత్వమే గ్యాస్ కంపెనీకి ఆ డబ్బును జమచేస్తుందని, అప్పుడు డబ్బు చెల్లించకుండా నేరుగా సిలిండర్ను తీసుకోవచ్చన్నారు. కానీ ఆ హామీ చంద్రబాబు మాటలకే పరిమితమైంది. పథకం అమలు సమయంలో ఒక సిలిండర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వాల్సిన మిగతా రెండు సిలిండర్లు ఇంతవరకు ఇవ్వలేదు. వినియోగదారులు డబ్బులు చెల్లించుకోవడం తప్ప ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు జమ కావడం లేదు. బెల్టుషాపులు పెడితే సహించేది లేదని బెల్టు తీస్తానని హెచ్చరించారు. అధిక ధరలకు అమ్మినా, బెల్టు షాపులు పెట్టినా సంబంధిత షాపునకు మొదటిసారి భారీ జరిమానా వేస్తామని, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మా హయాంలో నాసిరకం మద్యం ఉండదని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక ఇస్తున్న ఏకై క ప్రభుత్వమని చెప్పుకున్నారు. చంద్రబాబు చెప్పినాక జిల్లాలో బెల్ట్షాపులు మరింత పెరిగిపోయాయి. సిండికేట్గా ఏర్పడిన టీడీపీ నాయకుల ప్రోత్సాహంతోనే బెల్ట్షాపులు నడుస్తున్నాయి. బెల్ట్షాపులే కాదు లీజు షాపులకు పర్మిట్ రూమ్లు కూడా ఇచ్చి మద్యం విక్రయాలకు మరింత ప్రోత్సాహం అందించారు. ఇక, ఉచిత ఇసుక కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జిల్లాలో ఉచిత ఇసుక మాటే లేదు. టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక ర్యాంపులు నిర్వహించి, ఏ స్థాయిలో దోచుకుంటున్నారో జిల్లా ప్రజలంతా చూస్తున్నారు. వర్షాకాలంలో నదుల్లో వరదలొస్తున్నా కూడా ఇసుక అక్రమ తవ్వకాలు ఆపడం లేదంటే ఉచిత ఇసుక పాలసీ ఏ రకంగా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్య హామీల సంగతులివి.. బాహుదాలో గ్రోయిన్స్ తదితర మరమ్మతు పనులు కోసం, అరకబద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇంతవరకు మంజూరు చేయలేదు. బెంతొరియాల పేరుతో స్థానికత ధ్రువపత్రాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికీ ఇవ్వడం లేదు. కానీ,ఈ హామీ పేరుతో ఎమ్మెల్యే రెండు సార్లు సన్మానాలు మాత్రం చేయించుకున్నారు. ఉద్దానంలో కొబ్బరి పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పేదలకు పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు ఇస్తామన్నారు. ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. రెండింటిలో ఏదీ జరగడం లేదు. అరసవల్లి సూర్య దేవాలయం అభివృద్ధికి రూ.100కోట్ల ప్రాజెక్టు మంజూరు చేస్తానన్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. పలాస కిడ్నీ కేంద్రానికి రూ.60కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు. చేసిందేమీ లేదు. ముఖ్య హామీల సంగతులివి.. బాహుదాలో గ్రోయిన్స్ తదితర మరమ్మతు పనులు కోసం, అరకబద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇంతవరకు మంజూరు చేయలేదు. బెంతొరియాల పేరుతో స్థానికత ఽధ్రువపత్రాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికీ ఇవ్వడం లేదు. కానీ,ఈ హామీ పేరుతో ఎమ్మెల్యే రెండు సార్లు సన్మానాలు మాత్రం చేయించుకున్నారు. ఉద్దానంలో కొబ్బరి పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పేదలకు పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు ఇస్తామన్నారు. ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. రెండింటిలో ఏదీ జరగడం లేదు. అరసవల్లి సూర్య దేవాలయం అభివృద్ధికి రూ.100కోట్ల ప్రాజెక్టు మంజూరు చేస్తాను. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. పలాస కిడ్నీ కేంద్రానికి రూ.60కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు. చేసిందేమీ లేదు. -
అర్ధరాత్రి అంగన్వాడీ భవనం కూల్చివేత
● కొంచాడలో ఘటన ● పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు పొందూరు: మండలంలోని కొంచాడ గ్రామంలోని అంగన్వాడీ భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి కూల్చేశారు. అంతేకాకుండా భవనం ఉన్న ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. గురువారం సాయంత్రం వరకు కనిపించిన అంగన్వాడీ కేంద్రం శుక్రవారం ఉదయానికి అక్కడ లేకపోవడంతో అంతా అవాక్కయ్యారు. బిల్డింగ్ కూ ల్చేసిన తర్వాత శిథిలాలు కూడా కనిపించకుండా తరలించుకుపోయారు. ఎవరు చేశారో..? ఎందుకు చేశారో..? తెలియని పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులంతా ఆందోళన చెందారు. గ్రామంలోని సర్వే నంబర్ 45లో 22, ఎల్పీఎం నంబర్ 953లో అంగన్వాడీ కేంద్రం ఉంది. దశాబ్దాలుగా వినియోగంలో ఉంది. ఈ కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో 2023లో గ్రామంలోని ప్రైవేటు ఇంటిలోకి కేంద్రాన్ని మార్చారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగించాలని ఐసీడీఎస్ అధికారులు ఉన్నతాధికారులకు అర్జీ పెట్టుకున్నారు. సంబంధించిన నివేదికలను అందించా రు. అక్కడే నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతలో రాత్రికి రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, వీఆర్ఓ ప్రకాశరావులు కూల్చివేసిన అంగన్వాడీ కేంద్రం ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నేడు కల్యాణం.. రేపు తెప్పోత్సవం
● ఆదిత్యాలయంలో రెండు రోజుల పాటు స్వర్ణాలంకరణలో స్వామి దర్శనం ● ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ప్రకటించిన ఈఓ ప్రసాద్ అరసవల్లి: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినోత్సవాల సందర్భంగా నేటి నుంచి రెండు రోజుల పాటు ఆదిత్యాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం అనివెట్టి మండపంలో శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీసూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవాన్ని జరుపనున్నామని, అలాగే ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ఇంద్రపుష్కరిణిలో ఆదిత్యుని ఉత్సవమూర్తులను హంసవాహనంలో ఉంచి విహరించే ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా భక్తుల దర్శనాలకు వీలుగా ప్రత్యే క ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అలాగే శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు మూలవిరాట్టుకు పూర్తిగా స్వర్ణాలంకరణ చేస్తున్నామని, ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పా టు చేస్తున్నామన్నారు. ప్రతి భక్తుడూ స్వర్ణాదిత్యుడిని దగ్గర నుంచే దర్శించుకునేలా చర్యలు చేపడుతున్నట్లుగా ఈఓ ప్రకటించారు. ఈ రెండు రోజుల ఉత్సవాల నిర్వహణకు సంబంధిత శాఖాధికారుల సహకారాన్ని కోరినట్లుగా వివరించారు. -
శ్వేతపుష్కరిణిలో రసాయనాలు
● కూర్మనాథాలయంలో అపవిత్రమైన సంఘటన గార: పవిత్ర శ్రీకూర్మనాథాలయంలోని శ్వేతపుష్కరిణిలో చేపల కోసం రసాయనాలు కలుపుతుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ శ్వేత పుష్కరిణిలో లక్ష్మీదేవి విగ్రహం లభ్యమైందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ పుష్కరిణిలో దక్షిణం వైపు పిండప్రదానాలు జరుగుతుంటాయి. గతంలో పనిచేసిన ఈఓ, 2024 లో మూడేళ్లు చేపల పెంపకానికి స్థానిక కండ్రపేట మత్స్యకార సొసైటీకి ఏడాదికి రూ.75 వేలు ఆలయానికి చెల్లించాలని, పుష్కరిణిలోని నాచు తొలగించడం వంటి నిబంధనలతో లీజుకిచ్చారు. వీటిలో చేపల పెరుగుదల సహజంగా జరగాల్సి ఉన్నా, వీటిని కాపాడుకునేందుకు రసాయనాలు కలుపుతుండటం చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో థర్మాకోల్ షీట్ల ద్వారా ఇద్దరు వ్యక్తులు పుష్కరిణి నీటిలో రసాయనాలు కలుపుతున్న ఫొటోలు వైరలవుతున్నాయి. కేవలం పసుపు, సున్నం మాత్రమే వేస్తున్నామని లీజుదారులు చెబుతున్నా, రాత్రి వేళలో కలుపుతుండటంతో అనుమానాలు కలుగజేస్తోంది. అదేవిధంగా చేపలు పెరుగుదల కోసం బ్రాయిలర్ కోడి చెత్తను కూడా వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన పుష్కరిణి నీటిని రసాయనాలు, వ్యర్థాలతో పాడు చేస్తున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ కె.నరసింహనాయుడు వద్ద ప్రస్తావించగా ఈ విషయం తన దృష్టికి శుక్రవారం వచ్చిందని, వెంటనే లీజుదారులు, అందుబాటులో ఉన్న పాలకమండలి సభ్యులతో సమావేశం జరిపామన్నారు. ఇకపై ఇలాంటి ఘటన లు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. -
పొంగిన గుమ్మా గెడ్డ
● 300 ఎకరాల్లో నీటిలోనే వరి పంట పాతపట్నం: వరి పంట ఆశాజనకంగా ఉన్న తరుణంలో వచ్చిన మోంథా తుఫాన్ రైతుల ఆశలు అడియాసలు చేసింది. శుక్రవారం నాటికి గుమ్మా గెడ్డ, పోగడవెల్లి గెడ్డ పరివాహక ప్రాంతాల్లో పంట పొలాల్లోకి చేరిన వరద నీటిని మళ్లించడానికి రైతు లు ఆపసోపాలు పడుతున్నారు. వ్యవసాయశాఖ ఏఓ కె.సింహాచలం నేతృత్వంలో వ్యవసాయశాఖ సిబ్బంది పంట పొలాలను పరిశీలించి, రైతులకు సలహాలు, సూచనలు అందజేయడమే కాకుండా పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పాతపట్నం మండలంలో గుమ్మా గెడ్డ ప్రాంతంలో సుమారు 300 ఎకరాల్లో వరి పంట నీటిలోనే ఉందని, వరి పంట నష్టానికి గురైనట్లు వ్యవసాయాశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి నేను మూడు ఎకరాల వరి పంట వేశాను. ఇటీవల తుఫాన్ కారణంగా వరి పంట రెండు రోజులుగా నీటిలోనే ఉండిపోయింది. నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – తూలుగు ప్రవీణ్, రైతు, తిడ్డిమి గ్రామం, పాతపట్నం మండలం -
ఇప్పుడు జప్తు నోటీసులా..?
రోడ్డున పడేసి..● అరసవల్లి ఆలయం ముందు దుకాణదారుల ఆవేదన ● కరెంట్ మీటర్లు తొలగించి ఇప్పుడు బకాయి నోటీసులు ఇవ్వడంపై విస్మయం అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నా యి. కూటమి ప్రభుత్వం వచ్చాక తాత్కాలిక ఉద్యోగులు, దుకాణదారులు వంటి వారు నిత్యం నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఆలయానికి రూ.వంద కోట్ల ప్రాజెక్టు వచ్చేస్తోందంటూ హడావుడి చేసి ఈ ఏడాది జనవరిలోనే ఆలయం ముందున్న 11 దుకాణాలను నేలమట్టం చేసేశారు. సంక్రాంతి వరకు ఆగమన్నా ఆగలేదు. రథసప్తమి రాష్ట్ర పండుగ సంబరాలంటూ దుకాణదారుల కడుపు కొట్టారు. సరే దేవుడే ఉన్నాడంటూ వాళ్లంతా తోపుడు బళ్లపై ఆలయం ముందే ప్రసాదాలను, కొబ్బరికాయలను విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతలో విద్యుత్ శాఖ నుంచి బకాయి నోటీసులంటూ తాజాగా శుక్రవారం వారికి నోటీసులు రావడంతో వారిలో ఆందోళన పెల్లుబికింది. కూల్చేసిన దుకాణాలకు బకాయిల బిల్లులేంటని విస్తుపోయారు. ఆస్తులను జప్తు చేస్తారట..! అరసవల్లి ఆలయానికి ఎదురుగా ఆలయానికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్లో మొత్తం 11 షాపులు ఉండేవి. ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా చేపట్టిన కూల్చివేతల పుణ్య మా అని జనవరి నుంచే వ్యాపారాలు లేక కుదేలయ్యారు. దుకాణాలు కూల్చేసిన సమయంలోనే విద్యుత్ మీటర్లను కూడా ఆయా శాఖ సిబ్బంది తొలగించేశారు. దీంతో అప్పటివరకు విద్యుత్ వినియోగానికి చెందిన విద్యుత్ బిల్లులను చెల్లించేశా రు. అయితే తాజాగా జనవరి నుంచి నేటి వరకు విద్యుత్ బిల్లులను చెల్లించాలంటూ 11 మందికి వేలాది రూపాయల బకాయిలున్నాయంటూ నోటీసులు జారీ అయ్యాయి. రానున్న ఏడు రోజుల్లో బకాయిలను చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేస్తామని, అవసరమైతే వారి పేర్ల మీద ఉన్న మిగిలిన విద్యుత్ కనెక్షన్లను కూడా నిలుపుదల చేస్తా మంటూ హెచ్చరికల నోటీసులను విద్యుత్ శాఖ జారీ చేసింది. వాస్తవానికి జనవరి నుంచి ఆ తొలగించిన విద్యుత్ మీటర్లు వినియోగంలో లేవు. కానీ ఇప్పటివరకు బిల్లులను చెల్లించాలని నోటీసులు జారీ చేయడంపై దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీకాకుళం
పెట్టింది తిను..టెక్కలి జిల్లా ఆస్పత్రిలో మెనూ అమలు కావడం లేదు. అధికారులు పర్యవేక్షించడం లేదు. –8లో● వేడుకగా ఏక్తా దివస్ పోలీసు అమరవీరుల స్మారకోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం రాత్రి ‘రాష్ట్రీ య ఏక్తాదివస్’ వేడుకగా జరిగింది. ఏటా అక్టోబరు 21 నుంచి 31 వరకు జరిగే ఈ స్మారకోత్సవాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నాడు ముగిస్తారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ముందుగా విద్యార్థినీ విద్యార్థులకు, జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్ల నుంచి వ్యాసరచన, డిబేట్లలో పాల్గొన్న పోలీసులకు బహు మతులు, ప్రశంసాపత్రా లు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి, ప్రేరణగా నిలవాలని, గతంలో పోలీసులు ఫోర్స్ చూపించేవారని, ఇప్పుడు సర్వీస్ చూపిస్తున్నారన్నారు. ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగాలు దేశభక్తి వైపు అందరినీ నడిపిస్తున్నాయని, చనిపోయిన పోలీ సుల కుటుంబాలకు అండగా నిలవడం, పోలీసు సేవల గురించి ప్రజలకు తెలియజెప్పడమే ఈ స్మారకోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డే అండ్నైట్ కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి అమరవీరులకు సంఘీభావం తెలిపారు. – శ్రీకాకుళం క్రైమ్ శనివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2025ఉక్కు మనిషికి నివాళులర్పిస్తూ ఊరూవాడా ఏక్తా దివస్ జరుపుకున్నాయి. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కొత్తూరు నాలుగు రోడ్ల కూడలిలో విద్యార్థులు ఇలా నివాళులర్పించారు. – కొత్తూరు -
ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలం అప్పగింత
పొందూరు: ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటూ విశాఖపట్నంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తమ్మినైన అప్పలనాయుడు తన స్వస్థలం పొందూరు మండలంలోని తాడివలస గ్రామంలోని తన సొంత స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు దానం చేశారు. గ్రామంలో 1.5 సెంట్లలో ఉన్న తన పెంకుటింటిని గ్రామ పంచాయతీ కార్యాలయానికి దానపట్టా కింద రిజిస్ట్రేషన్ చేసి పంచాయతీ కార్యదర్శి రామరాజీవ్కు పత్రాలను అందజేశారు. మరో చోట 5 సెంట్ల స్థలాన్ని బీసీ వసతి గృహ నిర్మాణం చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలను ఆ శాఖ అధికారి బి.అనురాధకు అందించారు. ఈయన గతంలో తాడివలస జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు రూ. 4 లక్షలతో భోజనశాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న రామమందిరం చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఆయన దాతృత్వానికి సర్పంచ్ మణెమ్మ కృతజ్ఞతలు తెలిపారు. నందిగాం: మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు నష్టపోయిన వరి పంట వివరాలను సేకరించి నష్టాలను అంచనా వేస్తున్నా మని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.త్రినాథస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని దిమిలాడ, రాంపురం గ్రామాల్లో ఆయన ఆచా ర్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ పీవీ సత్యనారాయణతో కలిసి పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిలో పంట ఉండిపోవడం, మొలకలు వచ్చిన పంటను రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ నష్టపోయిన పంటలను అంచనా వేస్తున్నామని, నష్టం వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. అలాగే నీటిలో మునిగిన పంటను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరించారు. ఆయన వెంట అనకాపల్లి రీసెర్చ్ డైరెక్టర్ సీహెచ్ ముకుందరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఉన్నారు. ‘మీ మూలధనం.. మీ హక్కు’ పోస్టర్ ఆవిష్కరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభా గం ఆధ్వర్యంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి ‘మీ మూలధనం.. మీ హక్కు’ ప్రత్యేక ప్రచార కార్యక్రమం పోస్టర్ను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు, పీడీ డీఆర్డీఏ కిరణ్ కుమార్, బీసీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డ్వామా పీడీ సుధాకర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ పైడి రాజా పాల్గొన్నారు. జిల్లాలో డెఫ్ రూపంలో ఉన్న రూ.87.13 కోట్ల ప్రజాధనం వారికే చెందడం, తద్వారా జిల్లాలో మొత్తం 4,21,944 ఈ తరహా ఖాతాలు కలిగిన లబ్ధిదారులకు మేలు చేకూరేలా చేయడం, అలానే బీమా సంస్థల్లో ఉన్న ఇలాంటి నిద్ర ఖాతాలను వారికి అందేలా చేయడం దీని ఉద్దేశమని లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. -
‘చంద్రబాబే పెద్ద మోసకారి’
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సరుబుజ్జిలి: గడిచిన ఎన్నికల్లో ఎలాగైనా పదవి ద క్కించుకోవాలని చంద్రబాబు ఇష్టానుసారం హామీ లు ఇచ్చారని, పదవిలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. మండలంలోని సరుబుజ్జిలి గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటిసంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఽకృష్ణదాస్ మాట్లాడుతూ రాజధాని పేరుతో భూము లను కార్పొరేట్ శక్తులకు ధారబోసి కోట్లాది రూపాయలు దోపిడీ చేసేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి దాచుకోవడం, దోచుకోవడానికే ఎక్కువ సమ యం కేటాయిస్తోందని విమర్శించారు. పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేస్తున్న దగాకోరు పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిని పక్కనపెట్టి థర్మల్ పేరుతో బూడిద, శాండ్, ల్యాండ్, లిక్కర్ వ్యాపారాల కోసం అధిక సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సురవరపు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గం పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర రైతు విభాగం నేత కె.శేఖర్, సరుబుజ్జిలి, బూర్జ మండలాల పార్టీ కన్వీనర్లు బెవర మల్లేశ్వరరావు, ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి సర్పంచ్ బొడ్డేపల్లి చాందిని వెంకటసూర్య, పార్టీ ఉపాధ్యక్షుడు కింజరాపు సురేష్, పున్నపురెడ్డి తవిటినాయుడు, బొడ్డేపల్లి హరి, అత్తులూరి రవికాంత్, కొవిలాపు చంద్రశేఖర్, రావాడ రవికుమార్, ఇల్లాకుల సూర్యప్రకాశరావు, యడ్ల ఈశ్వరరావు, పుచ్చరాజారావు పాల్గొన్నారు. -
మూడు పూరిళ్లు దగ్ధం
రణస్థలం: లావేరు మండలం బుడుమూరులో శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతైనట్లు రణస్థలం అగ్నిమాపక అధికారి డి.హేమసుందరరావు తెలిపారు. సమాచారం అందగానే సిబ్బందితో వెళ్లి మంటలు అదుపుచేశారు. ముంత శ్రీరాము, ముంత గోపి, ముంత పైడిరాజులకు చెందిన మూడు పూరిళ్లు కాలిపోయాయి. సుమారు రూ.18 లక్షలు వరకు నష్టం వాటిల్లింది. 8తులాల బంగారం, ఇంటి సామగ్రి, పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్, రేషన్ కార్డులు కాలిబూడిదయ్యాయి. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు వంట సామగ్రి, టార్పాలిన్లు, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్కాస్ ప్రతినిధులు కె.సత్యనారాయణ, పి.చైతన్యకుమార్, పి.సుజాత, పి.చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి పంచాయతీ నర్శింగపల్లి సమీప తోటలో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు పెద్దబమ్మిడి పంచాయతీ నిమ్మాడ జంక్షన్ వద్ద కాలనీకి చెందిన బలివాడ మోహన్(45)గా గుర్తించారు. ఈయన కొద్ది సంవత్సరాలుగా భార్యాపిల్లలతో కలిసి శ్రీకాకుళంలో కొత్త రోడ్డులో కిరాణా షాపు నడుపుతున్నాడు. గురువారం నిమ్మాడలోని తన అన్నయ్య తిరుపతి ఇంటికి వచ్చాడు. వదినకు డబ్బులు, తాడు అడగ్గా.. లేదని సమాధానం చెప్పడంతో జలుమూరు మండలం కొండకామేశ్వరిపేటలోని చెల్లి జ్యోతి ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం నర్శింగపల్లి గ్రామ సమీప తోట వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీ కూలీలు మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య హేమలత, కుమార్తె ఉన్నారు. మోహన్ మృతికి గల కారణాలు తెలియాలేదు. కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్టింది తిను..అదే మెనూ!
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ఇష్టారాజ్యంగా డైట్ ● అధికారుల పర్యవేక్షణ లోపం.. రోగులకు శాపంటెక్కలి రూరల్ : ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన్ పరిషత్ టెక్కలి జిల్లా ఆస్పత్రిలో రోగులకు నిత్యం పెట్టే భోజనాలకు సంబంధించి మెనూ సక్రమంగా పాటించడం లేదని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అంతా తమ ఇష్టమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ప్రతి రోజు ఉప్మా పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఎవరైనా అడిగితే నచ్చితే తినండి లేదంటే బయటకు వెళ్లి తెచ్చుకోండి అంటూ దురుసుగా సమాధానం చెబుతున్నారని పలువురు వాపోతున్నారు. మార్కెట్లో ఏది తక్కువ రేటుకు దొరికితే అదే కూరగాయలు తీసుకొచ్చి మెనూకు విరుద్ధంగా వండి పెడుతున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ప్రతిరోజు రెండు పూటలా గుడ్లు పెట్టాలని చార్టులో పేర్కొన్నా.. ఒక్కపూటే గుడ్డు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందొచ్చిన వారికే భోజనం.. ఆస్పత్రిలో ప్రతిరోజూ సుమారు 30 మంది రోగులకు భోజనాలు పెట్టాల్సి ఉంది. అయితే 20 మందికి మాత్రమే వండుతున్నారని, ఎవరు ముందు ఉంటే వారికే భోజనాలు పెట్టి మిగిలిన వారికి లేవనే సమాధానం చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రసూతి విభాగంలో ఉండే బాలింతలకు పూర్తిస్థాయిలో భోజనాలు పెట్టకపోవడంతో వారి బంధువులు ప్రశ్నించారు. ముందు వచ్చిన వారికే భోజనాలు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. గట్టిగా ప్రశ్నించడంతో చివరకు మళ్లీ వండి పెట్టారు. పర్యవేక్షణ కరువు.. నిత్యం రోగులకు పెట్టే భోజనాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్, హెడ్ సిస్టర్స్ల పర్యవేక్షణ లేకుండాపోతోంది. అందుకే డైట్ నిర్వాహకులు వారికి నచ్చినట్లు వండుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెనూలో రోజుకో రకం వండి పెట్టాలని ఉన్న అవి రాతలుగానే మిగిలిపోతున్నాయి. వండిన వంటలు కూడా రుచిగా ఉండటం లేదని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మెనూ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు వాపోతున్నారు. ఆస్పత్రిలో ప్రతి రోజు ఉదయం టిఫిన్గా ఉప్మా పెడుతున్నారు. రోజుకొక రకం అందించాలని చార్టులో ఉన్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. అరకొరగా భోజనం అందించడంతో అర్ధాకలితోనే ఉండాల్సిన పరిస్థితి. – టి.మాణిక్యం, రోగి సహాయకులు, తర్లిపేట ఆస్పత్రి మెనూ ప్రకారం వంటకాలు చేయాల్సి ఉన్నా డైట్ సిబ్బంది అనుసరించడం లేదు. నిత్యం వండి పెట్టే భోజనాలు ఎలా ఉన్నాయనే దానిపై సంబంధిత సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. – కన్నా బెహరా, ఇన్పేషెంట్, ఆకాశలక్కవరం ఆసుపత్రిలో రోగులకు డైట్ సక్రమంగా అమలు కావడం లేదనే విషయం మా దృష్టికి రాలేదు. ఇకపై ఆ తప్పు జరుగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతి రోజు పరిశీలించి మెనూ ప్రకారం భోజనాలు పెట్టేవిలా చర్యలు తీసుకుంటాం. – బొడ్డేపల్లి సూర్యారావు, టెక్కలి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
బాబోయ్ దొంగలు!
● వరుస చోరీలతో రెచ్చిపోతున్న దుండగులు ● ముఖ్య కూడళ్లలో పనిచేయని సీసీ కెమెరాలు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. క్లూస్, సాంకేతిక ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రాపర్టీ నేరాలను అరికడుతున్నామన్న ఎస్పీ చెబుతున్నా జిల్లా పోలీసులకు వరుస చోరీలతో గజదొంగలు సవాల్ విసురుతున్నారు. ఫింగర్ ప్రింట్, సీసీఎస్, టాస్క్ఫోర్సు, జిల్లాలో కొన్ని స్టేషన్ల అధికారులు మాత్రమే సాంకేతికంగాను, ఇతర ఆధారాలతోనూ కేసులు ఛేదిస్తున్నారు. అయినప్పటికీ చాలావరకు కేసులు పెండింగ్లో ఉండిపోవడాన్ని ఎస్పీ ప్రస్తావిస్తున్నారు. సమీక్ష సమావేశాల్లో ట్రాక్రికార్డు బాగాలేని అధికారులను గట్టిగానే హెచ్చరిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఏవీ సీసీ కెమెరాలు..? దొంగలని పట్టడంలో అత్యంత కీలకమైన సీసీ ఫుటేజీ కెమెరాలు జిల్లావ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్నవి కూడా పూర్తిగా మరమ్మతులైనవే. దాదాపు 1500 సీసీ కెమెరాలు కావాల్సివున్నా.. 900 మాత్రమే ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని కోర్టు వెనుక చినబొందిళీపురం, పీఎన్కాలనీ, బ్యాంకర్స్ కాలనీ, ఇందిరానగర్, న్యూకాలనీల్లో ఎటువంటి క్రైమ్ జరిగినా ఆ కేసు సంవత్సరాలు పట్టే రీతిలో ఉన్నాయి. పీఎన్కాలనీ పదోలైన్లో ఉపాధ్యాయుల ఇంట్లో గతేడాది అక్టోబరులో చోరికి గురైన 13 తులాలు ఈ కోవకే వస్తాయి. అక్కడికి కొద్ది దూరంలోనే మరో ఇంట్లో రూ. 6 లక్షలు చోరీకి గురయ్యాయి. అక్టోబరులో చోరీ జరిగితే జనవరిలో సీసీఫుటేజీలో చోరీ చేసిన వ్యక్తి కనపడ్డాడు. కాశీబుగ్గ, నరసన్నపేట, టెక్కలి, కంచిలి, సోంపేట వంటి ప్రాంతాలదీ ఇదే పరిస్థితి. సీఎస్ఆర్, పోలీసింగ్ ఫండ్సే కాక ప్రజలే దాతలై ఇస్తే సీసీ కెమెరాలు మొత్తానికి పెట్టొచ్చులే అన్నచందంగా అటు కూటమి ప్రభుత్వం, ఇటు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ ఏమన్నారంటే.. ఇటీవల జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రాపర్టీ నేరాలపై గట్టిగానే హెచ్చరించారు. పెండింగ్ కేసులపై ఆ పరిధి పోలీస్స్టేషన్లే కాక అందరినీ భాగస్వామ్యులుగా చేస్తూ ప్రత్యేక బృందాలుగా విడిపోయి కేసులను ఛేదించాలని ఆదేశించారు. నేరస్థుల కదలికలపై పూర్తి నిఘా పెట్టాలని, రాత్రి పూట బీట్ వ్యవస్థ మెరుగవ్వాలని, చెక్పోస్టుల్లో ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఈ ఏడాది జులైలో కంచిలిలో రిటైర్డ్ లెక్చరర్ ఇంట్లో 25 తులాలు, కిలో వెండి ఆభరణాలు కొట్టేసిన వారిలో ఓ హిజ్రాతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లకు చెందిన మరో నలుగురున్నారు. 12.3 తులాలే రికవరీ కాగా హిజ్రా పట్టుబడింది. వీరందరిపై లెక్కకు మించి కేసులున్నాయి. గార మండలం మత్స్యలేశం–కళింగపట్నం పోర్టు వరస ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు కాకినాడ వాసులు ఇటీవలే 186 గ్రాముల బంగారం, 283 గ్రాముల వెండితో పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరిపై 25కి పైగా కేసులు, ఒకరిపై హత్యాయత్నం కేసుంది. ఇదే నెల 10న వివిధ జిల్లాలకు చెందిన ట్రాన్స్జెండర్లు నరసన్నపేటలో పలు ఛైన్స్నాచింగ్లకు పాల్పడ్డారు. సాలూరు, విశాఖలకు చెందిన నేరగాళ్లు రూ. లక్షల విలువైన బుల్లెట్ల చోరీకి పాల్పడ్డారు. తాజాగా కాశీబుగ్గలోని నాలుగు మెడికల్ షాపుల్లో దాదాపు రూ. 6 లక్షల వరకు నగదు చోరీ చేశారు. సారవకోట మండలం బుడితిలో ఓ వృద్ధురాలిపై దాడి చేసి బంగారాన్ని కాజేశారు. ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దున్న కృష్ణ. దాదాపు 200కు పైగా చోరీలు చేశాడు. కాళ్లు విరిగి నడవలేడనుకున్నవాడే గత ఆరుమాసాలుగా పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ కొరకరాని కొయ్యగా మారాడు. -
చోరీ కేసు నిందితులు అరెస్టు
సారవకోట: మండలంలోని బుడితి గ్రామంలో నక్క చెల్లెమ్మ(78) అనే వృద్ధురాలిపై అక్టోబర్ 27న రాత్రి జరిగిన దాడి, దొంగతనం కేసును సారవకోట పోలీసులు ఛేదించారు. శుక్రవారం సారవకోట పోలీసుస్టేషన్లో నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. చీడిపూడి గ్రామానికి చెందిన రావాడ దేవీప్రసాద్(19), జలుమూరు మండలం నామాలపేటకు చెందిన తియ్యాల గోపి(19) చెడు వ్యసనాలకు బానిసయ్యారు. ఈ క్రమంలో దేవీప్రసాద్ అక్టోబర్ 27న రాత్రి ఒంటరిగా ఉన్న నక్క చెల్లెమ్మ ఇంట్లో చొరబడి ఆమె ముక్కు, చెవిలో ఉన్న అరతులం బంగారం దొంగిలించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఇనుప చువ్వతో మెడపై గాయపర్చాడు. బయట నుంచి ఎవ్వరూ రాకుండా గోపి కాపాలా కాశాడు. చోరీ చేసిన బంగారంతో ఇద్దరు పరారయ్యారు. గాయపడిన చెల్లెమ్మను మరుసటిరోజు స్థానికులు గమనించి బుడితి సీహెచ్సీలో చేర్పించి చికిత్స చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ అనిల్కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం బొంతు జంక్షన్లో వీరిద్దరూ ఉన్నారని సమాచారం రావడంతో వెళ్లి పట్టుకున్నారు. ఇద్దరిపైనా చోరీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్ఐ, సిబ్బందిని సీఐ అభినందించారు. -
నేడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని శనివారం విజయవంతం చేయాలని శ్రీకాకుళం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం ఫలితంగా ఏర్పడినదే ఆంధ్ర రాష్ట్రమని, అమరజీవిని స్మరించుకుంటూ పాతబస్టాండ్ కూడలిలో ఉదయం 10.30 గంటలకు జరిగే కార్యక్రమానికి పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తదితరు హాజరవ్వనున్నట్లు తెలిపారు. ప్రొవిజినల్ మెరిట్లిస్ట్ సిద్ధం శ్రీకాకుళం: శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల సర్వజన ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును సిద్ధం చేసినట్లు ప్రిన్సిపాల్ శుక్రవారం తెలిపారు. వెబ్సైట్లో నవంబర్ 4 వరకు జాబితా అందుబాటులో ఉంటుందని, అభ్యంతరాలు ఉంటే అదే తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. అనంతరం తుది మెరిట్ జాబితా వెల్లడిస్తామని పేర్కొన్నారు. స్కిల్హబ్ సెంటర్లో ఉచిత శిక్షణ ఎచ్చెర్ల: ఎచ్చెర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఐటీఐ స్కిల్హబ్ సెంటర్లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు శుక్రవారం తెలిపారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ మాన్యూవల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన 18 నుంచి 30 ఏళ్లలోపు యువకులు అర్హులని తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్తో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా ధ్రువపత్రాలతో నవంబర్ 10లోపు స్కిల్హబ్ సెంటర్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7989177887 నంబర్కు సంప్రదించాలని కోరారు. రూ.33 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ విభాగం విద్యార్థి ఎం.వి.వి.కె.రాఘవన్ ప్రఖ్యాత సర్వీస్ నౌ ఐటీ కంపెనీలో రూ.33.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికై నట్లు కాలేజీ డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాఘవన్ను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.సంతోష్కుమార్, సీఎస్డీ డీన్ టి.నరేష్, ప్లేస్మెంట్ డీన్ ఎం.సంతోష్కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హెచ్ఓడీ శ్రీకాంత్ పాల్గొన్నారు. రేపు బీసీ ఉద్యోగుల సమావేశం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): బీసీ/ఓబీసీ ఎంప్లాయిస్ అసోషియేషన్ సమావేశం ఈ నెల 2న శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించనున్నట్లు సంఘ నాయకులు శుక్రవారం తెలిపారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం, పి.భూషణరావు, స్టేట్ జనరల్ సెక్రటరీ వై.శంకరరావు, స్టేట్ ట్రజరర్ కొణతాల గణేష్, జిల్లా అధ్యక్షుడు అనకాపల్లి, బి.వి.వరప్రసాద్, ఎన్నికల అధికారి పి.రామచంద్రరావు హాజరవుతారని పేర్కొన్నారు. బీసీ /ఓబీసీ ఉద్యోగులంతా హాజరుకావాలని కోరారు. -
హెవీ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్: డ్రైవింగ్లో నైపుణ్యాన్ని సాధించాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో హెవీ డ్రైవింగ్ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా హెవీ లైసెన్సు పొందేందుకు లైట్ మోటారు వెహికిల్ లైసెన్స్ కలిగిన ఎస్సీ అభ్యర్థులు నుంచి ఇటీవల దరఖాస్తులు కోరగా 32 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో పది మందిని శిక్షణకు ఎంపిక చేసినట్లు వివరించారు. 32 రోజుల శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెవీ లైసెన్సుతో డ్రైవింగ్లో ఉపాధి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆర్.గడ్డెమ్మ, డీపీటీఓ సీహెచ్ అప్పలనారాయణ, ఆర్టీసీ డిపో– 1 డీఎం అమరసింహుడు, పీఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పోలీసుల రక్తదానం
శ్రీకాకుళం క్రైమ్ : పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, ఒత్తిడితో కూడుకున్నవని, ఆరోగ్యంపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. పోలీసు అమరవీరుల స్మారకోత్సవంలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ మెగా ఉచిత వైద్యం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా ఎస్పీ వివిధ వైద్య పరీక్షలు చేయించుకుని స్వయంగా రక్తదానం చేసి సిబ్బందిలో స్ఫూర్తి నింపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం ఒక మానవతా సేవ అని, మన రక్తం వేరొకరిని రక్షిస్తుందని, ఏడాదికి ఒకసారైనా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. పోలీసు సిబ్బందికి మెడికవర్ ఆస్పత్రి సౌజన్యంతో వైద్యబృందం ద్వారా రక్తపోటు, షుగర్, కంటి పరీక్షలు, సాధారణ ఆరో గ్య పరీక్షలు నిర్వహించారు. రెడ్క్రాస్, జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమం జరిగింది. అనంతరం వారికి ప్రశంసాపత్రాలు అందించారు. అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు. కూలిన ఇళ్లుకవిటి: మండలంలోని ఆర్.భైరిపురంలో మోంఽథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు బాగా తడిసిముద్దయిన ఇంటి గోడ కూలింది. గ్రామానికి చెందిన బొర్ర సుందరరావు ఇంటికి తూర్పు భాగంలో ఉన్న గోడ గురువారం ఉదయం కూలింది. నరసన్నపేట: మండలం ఉర్లాం పశువైద్య కేంద్ర భవనానికి చెందిన గోడ వర్షాలకు కూలింది. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న ఈ పశువైద్య కేంద్ర భవనం గోడ కూలడంతో సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం గోడ కూలిందని సిబ్బంది తెలిపారు. హిరమండలం: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎల్ఎన్పేట రోటరీనగర్లో ఇల్లు కూలిపోయింది. కలగ అచ్చయ్య అనే వృద్ధుడి ఇంటి గోడ వర్షాలకు నానిపోయింది. బుధవారం రాత్రి పెద్ద శబ్దాలతో గోడ కూలడంతో అచ్చయ్య భయంతో ఇంటి నుంచి పరుగులు తీశారు. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. -
‘కార్గో ఎయిర్పోర్టు’ వద్దంటే వద్దు
పలాస: మందస మండలంలో ప్రభుత్వం తలపెట్టిన కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను రద్దు చేయాలి, బలవంతపు భూసేకరణ ఆపాలని వామపక్ష ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు కాశీబుగ్గలోని ఒక కల్యాణ మండపంలో గురువారం కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, సీపీఐ ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, పోరా ట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ కార్గో ఎయిర్ పోర్టు ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరారు. అలాగే నవంబరు 18న పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓ వైపు తుఫాన్లో జనం బిక్కుబిక్కు మంటూ ఉంటే భూ సర్వే కోసం ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాలు ఆశించి ఇది కట్టాలనుకుంటున్నారో ప్రజలు తెలుసుకుంటున్నారని, మీ ఆటలు ఇక్కడ సాగ వని హెచ్చరించారు. జీడి కొబ్బరి రైతులకు గి ట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె.మోహనరావు, తెప్పల ఆజయ్కుమార్, మద్దిల రామారావు, ఎన్.గణపతి, కె.శ్రీనివాసరావు, పుచ్చ దు ర్యోధనరావు, బత్తిన లక్ష్మణరావు, గుంటు లోకనాథం, గుంటు రామస్వామి పాల్గొన్నారు. -
అపరాలకు దెబ్బ
కొత్తూరు: మోంథా తుఫాన్ వల్ల మినుము, పెసర వంటి పంటలకు అపార నష్టం వాటిల్లింది. జిల్లాలోని కొత్తూరు, హిరమండలం, లావేరు, ఎచ్చెర్ల, బూర్జ, సరుబుజ్జిలి మండలాలతో పాటు పలు మండలాల్లో ఉన్న మెట్టు ప్రాంతాల్లో సుమారు 230 హెక్టార్లలో మినుము, పెసర, కంది వంటి అపరాలను రైతులు సాగు చేస్తున్నారు. మరో 10 నుంచి 15 రోజుల్లో చేతికి అందుతుంది అనుకున్న పంట తుఫాన్కు నాశనమైంది. పరిశీలిస్తాం తుఫాన్ వల్ల నష్టపోయిన అపరాల పంటలను పరిశీలన చేస్తాం. మండల వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో గ్రామ వ్యవసాయ సహయకులు పంటలు పరిశీలించి నమోదు చేస్తారు. – కె.త్రినాథ స్వామి, జేడీ, జిల్లా వ్యవసాయ శాఖ, శ్రీకాకుళం -
చేజారింది పంటంతా..!
● అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చిన తుఫాన్ ● పడిపోయిన పంటను చూసిన లబోదిబోమంటున్న రైతులు ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలుమూడు రోజులుగా కురిసిన వర్షాలకు నీటిలో మునిగిన పంట పొలాలివి. ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామానికి చెందినవి. దాదాపు 800 ఎకరాలు నీట మునిగాయి. పొలా లు కాస్త చెరువులా తయారయ్యాయి. చేతికొ చ్చిన పంట పూర్తిగా నీట మునగడంతో గింజలు ఉండే పరిస్థితి లేదు. వరి దుబ్బులే మిగులుతాయి. ఇదీ ఇక్కడి రైతుల దయనీయ పరిస్థితి. చేతికందిన పంట ధ్వంసం మాకు 80 సెంట్లు భూమి ఉంది. ఈ పొలంలో పండిన పంటే మాకు ఏడాది పొడవునా జీవనాధారం. పండిన ధాన్యాన్ని కొంత మేరకు నిల్వ చేసుకుని మిగిలిన ధాన్యం ఖర్చుల నిమిత్తం విక్రయిస్తుంటాను. మూడు నెలలు నుంచి అన్ని రకాలుగా పంటను కాపాడుకుంటూ వచ్చాను. ఎన్ను బాగా వేసింది. దిగుబడి బాగుంటుంది అనుకుంటున్న సమయంలో తుఫాన్ వచ్చి ముంచేసింది. 30 బస్తాలు పండుతాయనుకుంటే 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పంటను చూడటానికి అధికారులు ఎవరూ రాలేదు. నష్టం గుర్తించాలి. – మజ్జి గంటడు, సారవకోట పెట్టుబడి నీటిపాలు పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయి, మాకు కన్నీరే మిగిలింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందుతున్న సమయంలో నేల కొరిగి నీటి పాలైంది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆర్ధికంగా నష్టపోతాం. మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాం. – నేలకొరిగిన పంటను చూపిస్తున్న పొందల రామారావు, దిమిలాడ, నందిగాం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మోంథా రైతు కంట కన్నీరు తెప్పించింది. చేతికి అందిన పంట నీటి పాలైతే.. కష్టమంతా కళ్ల ముందే మునిగిపోతుంటే.. నాలుగు నెలల కష్టం ఒక్క వర్షానికే నాశనమైపోయిన దృశ్యాలు చూస్తుంటే ఆ రైతుల గుండె తరుక్కుపోతోంది. వేల రూపాయలు పెట్టుబడి, ఆరు గాలం కష్టపడి పండించిన పంట ఒక్క రోజులో నేలమట్టమైతే అన్నదాతలకు గుండె ఆగిపోయినంత పనవుతోంది. ఇప్పుడు జిల్లాలో రైతుల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. పండిన పంట నీట మునగడంతో కర్షకులు కన్నీరుమున్నీరవుతున్నారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. వారి ఆశలపై నీళ్లు జల్లాయి. భారీ వర్షాలు అన్నదాతలకు పిడుగుపాటుగా మారాయి. చేతికి వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కళ్ల ముందు పంట నాశనం కావడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఆపదలో ఉన్న తమను ఆదుకోవాలని, కనీసం పెట్టిన పెట్టుబడైనా సాయం చేయాలని, మానవత్వంతో కూడిన ఆపన్నహస్తం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఒక్క వరి పంటే కాదు.. మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన పంటలు కూడా వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 9వేల ఎకరాల వరి, 87.5ఎకరాలు పత్తి, 62.5ఎకరాలు మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చు. చాలా గ్రామాల్లో, చాలా రైతుల పొలాల వద్దకు అధికారులు ఇంకా రాలేదని, తమ నష్టాన్ని గుర్తించలేదని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే జిల్లాలో 20వేల ఎకరాల వరకు పంటకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. వందలాది ఎకరాల్లో పంట నీట మునగగా, చాలా చోట్ల కంకులు నేలకొరిగాయి. ఉద్యానవన పంటలైతే చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నిబంధనల పేరుతో లెక్కలోకి తీసుకోకపోవడంతో చాలా మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. -
ఏదీ ఉచిత రేషన్..
● తుఫాన్ బాధితులకు అందని రేషన్ ● ప్రభుత్వ హామీ ప్రకటనకే పరిమితం ఇచ్ఛాపురం రూరల్: మోంథా తుఫాన్ బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బాధిత మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం, సాధారణ కుటుంబాలకు 25 కిలోల బి య్యం, ఒక కిలో కంది పప్పు, లీటర్ మంచి నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెరను తక్షణం తుఫాన్ ప్రాంతంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు ఆదే శాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నేటికి మూడు రోజులవుతున్నా తమకు ఎలాంటి సరుకులు అందలేదని బాధిత కుటుంబా లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇచ్ఛాపురం మండలంలో తుఫాన్ ప్రభావిత పంచాయతీ బూర్జపాడులో మత్స్యకారులకు చెందిన 541 రేషన్ కార్డులు, 1048 ఇతరుల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని బాధితులకు నిత్యావసర సరకులు ఇస్తున్నట్లు గురువారం ప్రకటించడంతో కార్డుదారులు రేషన్ దుకాణాలకు ఆశగా వెళ్లారు. కానీ ప్రస్తుతానికి నవంబర్కు సంబంధించి బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నామని, ఉచిత సరుకులపై తమకు ఎలాంటి ఆదేశాలు, సరుకులు రెండూ రాలేదని డీలర్లు తెలిపారు. దీంతో బాధితులకు నిరాశ తప్పలేదు. గురువారం సాయంత్రం నవంబర్ నెలకు సంబంధించి నిత్యావసర సరుకులు ఇస్తుండగా, ఈ–పాస్ మిషన్లో ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి 50 కేజీల బియ్యం, పప్పు, నూనె, ఉల్లి, బంగాళాదుంపలు ఇస్తున్నట్లు మెసేజ్ రావడంతో రేషన్ డీలర్లు అవాక్కయ్యారు. ఇంకా తమకు రాని ఉచిత సరుకులను ఎలా ఇవ్వాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. దీంతో 70 శాతం మంది కార్డుదారులకు నవంబర్ నెలకు సంబంధించి సరుకులు అందజేయకుండా రేషన్ దుకాణాలకు తాళాలు వేసేశారు. జీఓ వచ్చింది గానీ... సరుకులు రాలేదు తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో ఉన్న మత్స్యకారులకు 50 కిలోల బియ్యం, ఇతరులకు పాతిక కిలోల బియ్యంతో పాటు కిలో చొప్పున పప్పు, నూనె, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఇవ్వాలని సివిల్ సప్లై కమిషనర్ నుంచి జీఓ వచ్చింది. అయితే మాకు సరుకులు మాత్రం రాకపోవడంతో ఇవ్వలేకపోయాం. ఇచ్ఛాపురం మండలం బూర్జపా డు పంచాయతీలో 1,589 కార్డుదారులు ఉండగా, కవిటి మండలానికి సంబంధించి తుఫాన్ ప్రభావిత మత్స్యకార కార్డుదారుల జాబితను మత్స్యశాఖాధికారులు ఇంతవరకు అందివ్వలేదు. సరుకులు వచ్చి న వెంటనే బాధితులకు ఉచితంగా అందిస్తాం. – కె.సంతోష్, సివిల్ సప్లై డీటీ, ఇచ్ఛాపురం మండలం మత్స్యకారులకు ఫ్రీ అన్నారు తుఫాన్ కారణంగా మత్స్యకారులకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు ఇస్తున్నట్లు మాకు తెలిసి డీలర్ వద్దకు వెళ్తే... మా కార్డుకు పాతిక కిలో బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే ఇచ్చారు. గత వారం రోజులుగా చేపల వేట లేకపోవడంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి. అవసరం ఉన్నప్పుడు ఉచిత సరుకులు ఇచ్చి ఉంటే బాగుండేది. – చింతకాయల పున్నమ్మ, కార్డుదారురాలు, డొంకూరు -
ప్రచారంలో పీక్
● తుఫాన్ సహాయక చర్యల్లో వీక్..సాక్షి, అమరావతి/నరసన్నపేట: మోంథా తుఫాన్ సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కానీ ప్రచార ఆర్భాటంలో మాత్రం హంగా మా చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రీజనల్ కో– ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేతలంతా తమ ప్రాంతాల పరిస్థితిని వివరించారు. రైతులను పట్టించుకునే దిక్కే లేదు.. మోంథా తుఫాన్పై సాయం కంటే ప్రచారమే అధికంగా ఉంది. తుఫాన్ వల్ల వరి మాత్రం బాగా దెబ్బతింది. మా దగ్గర 80 శాతం పంట నష్టం జరిగింది. ప్రభావిత ప్రాంతాల్లో నాయకులందరం అందుబాటులో ఉండి తిరిగాం. రైతుల తర్వాత తీవ్రంగా నష్టపోయింది మత్స్యకారులు. తెప్పలు, బోట్లు దెబ్బతిన్నాయి. కాకినాడ రూరల్లో ఒక మత్స్యకార యువకుడు చనిపోయాడు. వారికి జరిగిన నష్టం ప్రజలకు కనిపించదు. ప్రచారం పీక్. సహాయ కార్యక్రమాలు వీక్గా ఉంది. ఉచిత పంటల బీమాలో ప్రీమియం ఒక్కో జిల్లాలో ఒక విధంగా ఉంది. దీని వల్ల రైతులపై చాలా భారం పడుతోంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో, రైతులపై ఇన్స్యూరెన్స్ ప్రీమియం భారం ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడానికి, నష్టం చాలా తక్కువ చూపుతున్నారు. ఇంకా మార్కెటింగ్ శాఖ పనితీరు మరీ భయానక స్థితిలో ఉంది. ఏ సీజన్కి ఆ సీజన్లో మనం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతుల్ని ఆదుకుంటే, ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అమలు కావడం లేదు. నిన్న ప్రాథమిక అంచనాలు చూస్తే ఆర్ అండ్ బీ రోడ్లు 297 రోడ్లు మీద నుంచి వరద నీరు ప్రవహించి రూ.1424 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కానీ పంటలు మాత్రం రూ. 300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పుకుంటున్నారు. ఇంత భారీ వర్షాలకు రోడ్లే కొట్టుకుపోతే పంటలు ఆగుతాయా? – కురసాల కన్నబాబు, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ రైతులంతా మనల్నే తలచుకుంటున్నారు జిల్లాలో 10 మండలాల్లో పంట నష్టం జరిగింది. 53 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం చూపింది. 30 శిబిరాలు పెట్టామని 800 మందిని తరలించామని చెబుతున్నారు. ఇప్పుడు రైతులంతా మనల్ని తల్చుకుంటున్నారు. మన హయాంలో జరిగిన మేలు గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు వైఎస్ జగన్ లాంటి నాయకుడు మనకు అవసరమని చర్చించుకుంటున్నా రు. కష్టాలు వచ్చినప్పుడే సరైన నాయకత్వం గుర్తుకు వస్తుంది. ఈ ప్రభుత్వంలో రైతులు ఏమీ ఆశించడం లేదు. – ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేతల ధ్వజం తుఫాన్ సహాయక పనుల్లో కనిపించని మంత్రులు వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్సార్సీపీ నేతల వెల్లడి -
వర్షార్పణం
టన్నుల ఎండు చేపలు ● లక్షల్లో నష్టం వాటిల్లిందని మత్స్యకారుల ఆవేదన 30 ప్రభుత్వం ఆదుకోవాలి సముద్రం వేటనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. తుఫా న్లు, గాలి వానలు వచ్చిన స మయంలో వారం, పది రోజు లపాటు ఎలాంటి భృతిలేకుండా కుటుంబా లతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి మాది. ఎన్నో ఆశలతో ఎండలో ఆరబెట్టిన ఎండు చేపలు పూర్తిగా తడిసిపోయాయి. అవి అమ్మకానికి పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – కోడ కృపారావు, బాధిత మత్స్యకారుడు, డొంకూరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం తుఫాన్కు కురిసిన వర్షాలకు ఎండు చేపలు తడిసిపోయినట్లు గుర్తించాం. ఇప్పటికే బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. సుమారు రూ.3లక్షలకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశాం. – సలాడి ముసలనాయుడు, ఎఫ్డీఓ, ఇచ్ఛాపురం మండలంఇచ్ఛాపురం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాన్ ప్రభావం తీర ప్రాంత మత్స్యకారులపై పడింది. ఈ తుఫాన్తో కురిసిన వర్షాలకు, గాలివానలతో డొంకూరు సాగర తీర ప్రాంతంలో ఎండబెట్టిన కవ్వళ్లు, నెత్తళ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. గ్రామంలో 60 మంది మత్స్యకారులకు చెందిన 30 టన్నుల ఎండు చేపలు పాడవడంతో మత్స్యకారులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. వారం రోజుల కష్టంతో ఎండబెట్టిన చేపలు కేవలం గంటల వర్షంతో పాడైపోవడంతో బాధితులు నిరాశకు గురయ్యారు. తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటికీ చేపలను సురక్షిత ప్రదేశాలకు తరలించే సమయం దొరకలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండు చేపలకు గిరాకీ ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు సముద్రంలో లభించే కవ్వళ్లు, నెత్తళ్ల చేపలను మత్స్యకారులు కొందరు ఎండబెట్టి అమ్మకాలు చేస్తే, మరికొంత మంది ఉప్పు జాడీలో ఉంచి వాటిని మళ్లీ ఎండలో ఆరబెట్టి అమ్మకాలు చేస్తుంటారు. వీటి ధర కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుంది. వీటిని కోల్కతా, ముంబై, మద్రాస్, భువనేశ్వర్, కటక్, హైదరాబాద్, విజయవాడ, గోదావరి, బెంగళూరు వంటి ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ ఎండు చేపల్ని దా ణాగా మార్చి కోళ్లు, చేపలకు మేతగా మార్చేందుకు వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది మోంథా తుఫాన్ తమ బతులకును ముంచేసిందని బాధిత మత్స్యకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
వాడీవేడిగా నేర సమీక్ష
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. ఇటీవల జరుగుతున్న వరుస ఉదంతాలు, ప్రాపర్టీ నేరాలు, స్టేషన్లలో అధికారుల వ్యవహార శైలిపై ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీలు, స్టేషన్పరంగా జరుగుతున్న కొన్ని వ్యవహారాలపై సీఐ, ఎస్ఐలను గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. సోంపేటలో టపాకుల వ్యవహారంపైనా సీఐ, ఇద్దరు ఎస్ఐలు, మరికొందరి పాత్రపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది. మహిళలు తగాదా ల్లో ఉండేటప్పుడు తప్పనిసరిగా మహిళా పోలీసుల నే వినియోగించాలని వజ్రపుకొత్తూరు ఎస్ఐకు సూచించారు. మోస్ట్వాంటెడ్ క్రిమినల్ దున్న కృష్ణ ను పట్టుకోవాలని, ఈనెల 16న జిల్లా కోర్టు సమీ పంలోనే చోరీ చేసినా పట్టుకోకపోవడాన్ని గుర్తు చేశారు. చెక్పోస్టుల్లో గంజాయి, ఇసుక, ఇతర అక్ర మ రవాణాలను వదిలే పోలీసులపై ఇప్పటికే నిఘా ఉందన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘాపెట్టి అల్లర్లు చెలరేగకుండా చూడాలన్నారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలపై గ్రామాల్లో, విద్యాసంస్థల్లో అవగాహన పర్చాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ లు పాల్గొన్నారు. -
క్రైమ్కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి కొత్తూరు: గొట్లభద్ర గ్రామం వద్ద కిమిడి–వారణాసి రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కురిగాం పీహెచ్సీ పరిధిలో ని వెల్నెస్ సెంటర్లో ఆర్సీహెచ్ ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఆర్.మాలతిబాయి (52) మృతి చెందారు. ఈమె ఒడిశా రాష్ట్రం కాశీనగర్ నుంచి కడుము వెల్నెస్ సెంటర్కు విధులు నిర్వహించేందుకు స్కూటీపై వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి భర్త శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ కె.కోటేశ్వరరావు కేసు నమోదు చేశా రు. మాలతిబాయికి భర్త, కుమారుడు ఉన్నారు. కురిగాం పీహెచ్సీ వైద్యాధికారి పెద్దిన ప్రసన్నకు మార్, ఏవో బుజ్జిబాబు ఆస్పత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారుడు మృతి సంతబొమ్మాళి: నౌపడ పంచాయతీ సీతానగ రం గ్రామానికి చెందిన బచ్చల భీమారావు (55) అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి గురువారం మృతి చెందాడు. గ్రామంలో ముస ళ్లఖానా సమీపంలో చేపల వేట కోసం నీటి ప్రవాహానికి అడ్డంగా వల ఏర్పాటు చేశారు. కొంత సమయం తర్వాత వలను తీసే ప్రయ త్నం చేశారు. ఈ క్రమంలో భీమారావు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందా డు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నౌపడ ఎస్సై నారాయణస్వామి తెలిపారు. భీమారావుకు భార్య, పిల్లలు ఉన్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం పలాస : కంబిరిగాం వరహాల గెడ్డలో ఇటీవల గల్లంతైన దానగొర గ్రామానికి సవర లావన్న (35) మృతదేహం గురువారం బ్రాహ్మణతర్లా వంతెన వద్ద లభ్యమయింది. ఇనుప పైపులైనుకు అడ్డుకొని మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి విషయాన్ని కాశీబుగ్గ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన బంధువులు వరద నీటిలో దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లావన్న స్వగ్రామం మెళియాపుట్టి మండలం దాసుపురం. దానగొర గ్రామానికి చెందిన అన్నమ్మతో వివాహం జరగడంతో ఇక్కడే ఉంటున్నాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంగన్వాడీ కార్యకర్తకు అస్వస్థత
టెక్కలి: కోటబొమ్మాళి మండలం కొత్తపేట–2 అంగన్వాడీ కార్యకర్త దాట్ల నీలవేణి గురువారం అస్వస్థతకు గురై కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిలో చేరారు. పీఓ హైమావతి వేధింపులు తట్టుకోలేక అస్వస్థతకు గురైనట్లు ఆమె వాపోయారు. మేలో తనను విధుల నుంచి తొలగించారని, హైకోర్టును ఆశ్రయించడంతో అక్టోబర్లో విధుల్లోకి తీసుకున్నా రని చెప్పారు. గతంలో హైకోర్టులో వేసిన కేసుకు సంబంధిం విత్డ్రా అవుతున్నట్లు గురువారం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో లెటర్ అందజేయాలంటూ పీఓ ఫోన్ చేసి గట్టిగా మాట్లాడారని నీలవేణి పేర్కొన్నారు. ఇదే విషయమై కొద్ది రోజులుగా వేధిస్తున్నారని.. నీవు ఎలా విధులు నిర్వర్తిస్తావో చూస్తానంటూ బెదిరించారంటూ బాధితురాలు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సంఘ నాయకులు హనుమంతు ఈశ్వరరావు, దుంపల సుధ, తోటి కార్యకర్తలంతా ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఈ విషయమై కోటబొమ్మాళి ఐసీడీఎస్ పీఓ హైమావతి వద్ద ప్రస్తావించగా.. లెటర్ అందజేయాలని చెప్పాం తప్ప ఎటువంటి వేధింపులు చేయలేదని పేర్కొన్నారు. -
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి మంజూరు
శ్రీకాకుళం క్రైమ్ : ఈ ఏడాది జూన్లో టెక్కలి వద్ద రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ పి. జగదీశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా మంజూరైంది. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద కల్పించిన వ్యక్తిగత బీమా పాలసీ జగదీశ్వరరా వు చేసినందునే ఇంత పెద్ద మొత్తంలో బీమా మంజూరైంది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి హెడ్కానిస్టేబుల్ కుటుంబాన్ని గురువారం పిలిపించి రూ.కోటి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీసు తమ ఖాతాలను పోలీస్ శాలరీ ప్యాకేజీకి అనుసంధానం చేసుకోవాలన్నారు. విధుల్లో ఉంటూ ప్రమాదవశాత్తు మరణించే పోలీసులు తమ కుటుంబాలకు అందించే అత్యంత ఆర్థిక చేయూత ఈ బీమా అని ఎస్పీ పేర్కొన్నారు. సంతబొమ్మాళి : చిన్నతుంగాం పంచాయతీ కృష్ణచంద్రాపురంలో ఓ బాలిక గర్భం దాల్చింది. టెక్కలి జిల్లాప్రభుత్వ ఆసుపత్రికి బాలిక చికిత్స నిమిత్తం రాగా విషయం గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో బాలిక, యువకుడు పక్కపక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. యువకుడు కొన్ని నెలలుగా ప్రేమపేరుతో దగ్గరవ్వడంతో బాలిక గర్భాన్ని దాల్చింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో గ్రామపెద్దల సమక్షంలో అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. బాలిక గర్భం తొలగించేందుకు టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావడంతో విషయం బహిర్గతమైంది. పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం చేరవేశారు. మెళియాపుట్టి: మెళియాపుట్టి పోలీస్స్టేషన్లో ఏఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న బగాది అప్పన్న(57) గురువా రం విధి నిర్వహణలో ఉంటూనే మృతి చెందారు. తోటిపోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం మధ్యా హ్నం ఒడిశాకు చెందిన ఓ మంత్రి పర్యటనకు రావడంతో బోర్డర్లో విధులు నిర్వహించారు. డ్యూటీ ముగిసిన అనంతరం చాపరలో ఆయన నివాసం ఉంటున్న ఇంటికి చేరుకున్నా రు. అప్పటికే కుటుంబసభ్యులు శ్రీకాకుళం షాపింగ్కు వెళ్లిపోవడంతో. అప్పన్న ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఇంతలో తోటి ఏఎస్సై రమణ.. అప్పన్నకు ఫోన్చేసి కుటుంబసభ్యులు ఎవరూలేరు కదా భోజనానికి వచ్చేస్తావా? అని అడిగారు. డాక్టర్ తీసుకురా అని బదులివ్వడంతో ఆర్ఎంపీని తీసుకెళ్లి చూసేసరికి ఆయాస పడుతుండటంతో చాపర పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి 108 ద్వారా టెక్కలి ఆస్పత్రికి తీసుకె ళ్తుండగా మర్రిపాడు–సి గ్రామ సమీపంలోనే మృతిచెందారు. అప్పన్న స్వగ్రామం ఎచ్చెర్ల, భార్య వరలక్ష్మికుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామం ఎచ్చెర్లకు తరలించారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: బయో మెడికల్ వ్యర్థా ల నిర్వహణ శాసీ్త్రయంగా జరగాలని, ఆస్పత్రు ల యాజమాన్యాలు నిబంధనలు విధిగా పాటించాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆస్పత్రుల వ్యర్థాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు, క్లినిక్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు కాలుష్యనియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనల ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈఈ బి.కరుణశ్రీ, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత, ఈఈఏ కళ్యాణ్ బాబు పాల్గొన్నారు. ఉత్సాహంగా టెన్నీకాయిట్ ఎంపికలు పలాస: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం అండర్–18 జిల్లా టెన్నీకాయిట్ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. బాలుర జట్టులో బి.సిద్దార్ధ, బి.ఉదయ్కిరణ్, కె.ప్రవీణ్కు మార్, టి.వెంకటేష్, స్టాండ్ బైగా కె.జస్వంత్.. బాలికల విభాగంలో పి.శ్రావణి పాత్రో, ఎన్.దివ్య, వై.వరలక్ష్మి, బి.నందిని ఎంపికై నట్లు రాష్ట్ర టెన్నీకాయిట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.తవిటయ్య తెలిపా రు. కార్యక్రమంలో జిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లా సంతోష్కుమార్, కార్యదర్శి పి.కృష్ణారావు, ఉపాధ్యాయులు చక్రపాణి ప్రధానో, ఎ.ఆనందరావు, బి.శంకరరావు, ఆర్.శ్రీనివాసరా వు, న్యాయనిర్ణేతలు బి.తిరుమల, ఎం.దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
● ఆర్మీ జవానుకు కన్నీటి వీడ్కోలు
ఇండియన్ ఆర్మీ 18–ఇంజినీర్ రెజిమెంట్కు చెందిన నాయక్ వెంపటాపు రాజు ఇటీవల మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలు గురువారం స్వగ్రామం భైరిలో సైనిక లాంఛనాల నడుమ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మాజీ సైనికు లు పాల్గొని నివాళులర్పించారు. ఎమ్మెల్యే గొండు శంకర్, ఆర్డీఓ సాయిప్రత్యూష, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఎ.శైలజ, సువ్వారి ఈశ్వరరావు, జిల్లా ఎక్స్సర్వీస్మెన్ ఫెడరేషన్ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరరావు,జనరల్ సెక్రటరీ పి. మురళీధరరావు, ఎస్.రామకృష్ణ, ఎం.సింహాచలం, డి.వాసుదేవరావు, బోర రాంబాబు, జి. రామారావు తదితరులు నివాళులర్పించారు. –శ్రీకాకుళం రూరల్ -
పకడ్బందీగా లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గర్భస్థ పిండ లింగ నిర్ధార ణ నిరోధక చట్టం అమలులో నిర్లక్ష్యం సహించేది లేదని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అధికారులు, వైద్య సిబ్బందిని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సమావేశంలో అడిగిన కీలక గణాంకాలు సమర్పించకపోవడంపై డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్.ఎన్.పేట పీహెచ్ సీలో గర్భస్రావాల శాతం 11, సారవకోట, బొంతు పీహెచ్సీల్లో 10 శాతంగా నమోదైందని, జాతీయ సగటు కంటే ఇక్కడ అధికంగా ఉన్నందున ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేయాలని, స్కానింగ్ కేంద్రాల తనిఖీలు కఠినతరం చేయాలని ఆదేశించా రు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్కుమార్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ అనిత, కమిటీ కన్వీనర్ శ్రీకాంత్, డీఐఓ రామదాస్, డీసీహెచ్ఎస్ కళ్యాణ్ బాబు, రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథరావు, సామాజిక కార్యకర్త, ఎం.వెంకటస్వామి, డాక్టర్ దానేటి శ్రీధర్, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రతినిధి ప్రసాదరావు పాల్గొన్నారు. -
టీచర్లకు టెట్ టెన్షన్
నరసన్నపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) టెన్షన్ నెలకొంది. సర్వీసులో కొనసాగుతున్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత కావాల్సిందే నని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యూకేషన్ కూడా టెట్ తప్పనిసరి అని పేర్కొంది. ఈ దశలో ప్రభుత్వం ఈ నెల 23న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గాలు గరంగరంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారంతా ఈ వయసులో ఇదేం బాధ బాబూ.. అంటూ తలలు పట్టుకుంటున్నారు. 2010 నుంచి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిందని, అంతకుముందు నుంచి ఉన్న టీచర్లకు టెట్ను తప్పనిసరి చేయడమేంటని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లు లోపు పదవీ విరమణ పొందనున్న వారికి టెట్ నుంచి మినహాయింపు నిచ్చారు. అయి తే ఈ ఐదేళ్లలో పదోన్నతి కావాలంటే మాత్రం టెట్ రాయకతప్పదని అదికారులు అంటున్నారు. దీంతో ఉపాద్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14300 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 2011 తరువాత నియమితులైన వారు సుమారు 3 వేల మంది ఉన్నారు. వీరందరూ టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారే. ఐదేళ్ల లోపు పదవీ విరమణ పొందనున్న వారు వెయ్యి మంది వరకూ ఉన్నట్లు సమాచారం. వీరు మినహా మిగిలి న ఉపాధ్యాయులంతా విధిగా టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అదికారులు చెబుతున్నారు. ఎస్జీటీలు ముందుగా టెట్ పేపర్–1 రాయాల్సి ఉంది. పదోన్నతి కావాల నుకునే వారు పేపర్–2 రాయాలి. స్కూల్ అసిస్టెంట్లు పేపరు –2 తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయవర్గాల అభ్యంతరం.. టెట్కు సంబంధించి నవంబర్ 23 వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్లో సూచించింది. కాగా టెట్ను తప్పనిసరి చేయడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. టీటీసీ, బీఈడీ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఉద్యోగాలకు ఎంపికయ్యామని, ఏళ్ల తరబడి విధుల్లో ఉన్నామని, ఇప్పుడు తమకు పరీక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రభుత్వం అంటోందని, అలాగైతే విద్యా హక్కు చట్టం అమలుపై సుప్రీం కోర్టు అనేక ఉత్తర్వులు ఇచ్చిందని, అవన్నీ ఎందుకు అమలు చేయడం లేద ని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 2010 ముందు ఉద్యోగంలో చేరిన వారికి టెట్ నుంచి మినహయింపు ఇవ్వాలి. నేను 1995లో విధుల్లో చేరాను. 30 సంవత్సరా ల సర్వీసు పూర్తయింది. ఇప్పుడు పరీక్షలు పాస్ కావాలంటే ఎలా? ఇది మమ్మల్ని అవమానించడం కిందకే వస్తుంది. అప్పట్లో నేను టీటీ సీ పూర్తి చేసి డీఎస్సీ ద్వారా ఎంపికై సెకండరీ గ్రేడ్ టీచర్గా జాయినయ్యాను. ప్రభుత్వం సు ప్రీంకోర్టులో పిటిషన్ వేసి మాలాంటి ఉపాధ్యాయులకు పరీక్ష నుంచి మినహాయింపు తేవాలి. – నడిమింటి అప్పలనాయుడు, సత్యవరం స్కూల్ హెచ్ఎం టెట్ వ్యవహరంపై ప్రభు త్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. అపీలు పిటిషన్ వేయాలి. పొరుగు రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. టెట్ రాయడం బోధనా సమయం తగ్గించడమే తప్ప మరే ప్రయోజనం లేదు. సంఘ పరంగా కోర్టుకు వెళ్లాం. ప్రభుత్వం పునరాలోచించాలి. శుక్రవారం అన్ని జిల్లాల్లో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రాలు ఇస్తున్నాం. – బమ్మిడి శ్రీరామమూర్తి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి 30 ఏళ్లకు పైగా సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు సై తం ఇప్పుడు టెట్ పరీక్షలు పెట్టడం దారుణం. కోర్టు ఆదేశాలుల పేరుతో 2010 ముందు జాయిన్ అయిన ఉపాధ్యాయు లు అందరికీ టెట్ పరీక్ష తప్పనిసరి చేయడం శోచనీయం. నాకు 28 ఏళ్లు సర్వీసు పూర్తి అయింది. ఇప్పుడు పరీక్షలంటే ఎలా..? – బి.కేశవరావు, ఏపీటీఎఫ్ (1938) మండల అధ్యక్షుడు


