breaking news
Srikakulam
-
125 వంసతాల సంబరం : పూర్వ విద్యార్థుల ఘనత
ఆ బడి రాజుల పాలన చూసింది. స్వాతంత్య్ర సంగ్రామ నినాదాలు విన్నది. భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చిన సందర్భానికి సాక్షిగా నిలిచింది. ప్రజాస్వామ్య యుగంలో తొలిసారి ఓటరుగా మారిన మందస వాసులకు వేదికనిచ్చింది. ఇన్నేళ్ల ప్రస్థానంలో వేలాది మంది మేధావులకు పురుడు పోసింది. 125 ఏళ్లుగా విజ్ఞాన కాంతులు వెదజల్లుతూనే ఉంది. మందసలోని శ్రీరాజా శ్రీనివాస మెమోరియల్ జెడ్పీ ఉన్నత పాఠశాల వైభవమిది. మందస రాజుల సుందర స్వప్నంగా ప్రారంభమైన పాఠశాల పూర్వ విద్యార్థుల సంకల్ప బలంతో పూర్వ వైభవం సాధించింది. మందస: మందసలోని ఎస్ఆర్ఎస్ఎం జెడ్పీ ఉన్న త పాఠశాల 125 ఏళ్ల వేడుకకు ముస్తాబవుతోంది. జమీందారుల పాలనలో పురుడు పోసుకున్న ఈ బడి ఈనాటికీ పచ్చగా విరాజిల్లుతోంది. 1901 మే 16న ఆనాటి గంజాం కలెక్టర్ హెచ్డీ టేలర్, మందస జమీందారు వాసుదేవ రాజమణిదేవ్ ఈ పాఠశాలకు పునాది వేశారు. నాటి శిలాఫలకం నేటికీ ఈ బడిలో భద్రంగా ఉంది. వాసుదేవ రాజమణిదేవ్ తర్వాత శ్రీనివాస రాజమణి దేవ్ పాలన సాగించా రు. ఆయన 30 ఏళ్ల పాటు ఈ బడిని బ్రిటిష్ పరం కాకుండా కాపాడారు. 1930లో ఆయన చనిపోయాక.. 1932 సెపె్టంబర్ 21న స్కూల్ను ప్రభుత్వ పాఠశాలగా గుర్తించి శ్రీ రాజా స్కూలును శ్రీ రాజా శ్రీనివాస రాజమణిదేవ్ మెమోరియల్ బోర్డు హైసూ్కల్గా మార్చారు. నాటి గంజాం జిల్లాలో ఇది రెండో హైస్కూల్ కావడం విశేషం. ఎన్నెన్నో అనుభవాలు.. వందేళ్లకుపైబడిన ప్రస్థానంలో మందస హౌస్కూల్ ఎన్నో అనుభవాలు మిగిల్చింది. ప్రధానంగా ఈ పాఠశాల ముందరి భవనం ఓ జ్ఞాపికగా మారింది. వందలాది తుఫాన్లను తట్టుకుని ఈ భవనం నిలబడింది. రాజులు కట్టించిన భవంతుల్లో ఇది మాత్ర మే మిగిలింది. ఇక్కడ చదువుకున్న వారు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. మండల వ్యాప్తంగా దశాబ్దాల పాటు ఈ పాఠశాల పెద్ద దిక్కుగా ఉండేది. బడి వదిలితే సాయంత్రం పూట మందస పట్టణమంతా కళకళలాడేది. పూర్వ విద్యార్థుల ఔదార్యం కాలక్రమేణా పెంకులు ఊడిపోయిన దశలో ఐకానిక్ భవనం అందవిహీనంగా మారడం పూర్వ విద్యార్థులను కలిచివేసింది. ఎంతో వైభవం కలిగిన ఈ భవనాన్ని ఆ దశలో చూసి విద్యార్థుల గుండెలు చివుక్కుమన్నాయి. అంతే.. అంతా కలిశారు. ప్రభుత్వ సాయం కోరకుండా, అధికారుల కోసం ఎదురు చూడకుండా ఎవరికి తోచినంత డబ్బు వారు విరాళాల రూపంలో పోగు చేసుకున్నారు. బ్యాచ్ల వారీ గా పోటీ పడి మరీ స్కూలు కోసం పూర్వ విద్యార్థులు విరాళాలు ఇచ్చారు. ఎక్కడెక్కడి వారో వా ట్సాప్ వేదికగా ఒక్కటయ్యారు. దాదాపు రూ.27 లక్షలు సేకరించి ఐకానిక్ భవనానికి మళ్లీ కొత్త ఊపిరి పోశారు. అ‘పూర్వ’ సమ్మేళనానికి సై.. భవన పునరి్నర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 19, 20 తేదీల్లో భవనాన్ని పునఃప్రారంభిస్తూ 125 ఏళ్ల వేడుక సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆహ్వాన పత్రాలు కూడా పంపిణీ చేయడం మొదలుపెట్టామని నిర్వాహకులు తెలిపారు. ఉన్నత పాఠశా ల భవనాన్ని 19వ తేదీ ఉదయం 10 గంటలకు పునఃప్రారంభిస్తామని, మరుసటి రోజు ఆదివారం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామన్నారు. -
చంద్రబాబు మోసాలను ఎండగడదాం
●హామీలపై నిలదీయాలి.. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలపై కచ్చితంగా నిలదీయాలి. ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం కేసు లు పెడుతోంది. రైతులను కూడా అరాచక శక్తులుగా చూపిస్తోంది. వైఎస్ జగన్పై లేనిపోని ఆంక్షలు పెడుతోంది. 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్సార్ సీపీని తోలు తీస్తాం.. తాట తీస్తాం అంటే ఊరుకునేది లేదు. – కుంభా రవిబాబు, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు ●ప్రశ్నిస్తే కేసులు, దాడులు హామీలపై ప్రశ్నిస్తుంటే అన్యాయంగా కేసులు పెట్టి దాడులు చేస్తున్నా రు. చివరకు కూటమి నాయకుల కక్ష సాధింపు చర్యలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజీనామాలు చేస్తున్నారు. జిల్లాలో నాగావళి, వంశధార నదుల్లో ఇసుక దోపిడీ జరుగుతోంది. – తమ్మినేని సీతారాం, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త ●కార్యకర్తలే రారాజులు రానున్న జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలే రారాజులు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా.. టీడీపీని ఎ ప్పుడు తరిమికొడదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 40 ఏళ్ల టీడీపీ పాలనలో సాధ్యం కానిది కేవలం ఒకే ఒక్క పర్యాయంలో వైఎస్ జగన్ చేసి చూపించారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి టెక్కలి: అధికారం కోసం సాధ్యం కాని హామీలు ఇవ్వడం, అధికారం దక్కాక మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సూపర్ సిక్స్ పేరుతో 143 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు ఏమీ అమలు చేయలేదని, ఆ మోసాలను గ్రామస్థాయి లో వివరించాలని ఆయన, పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ నర్తు రామారావు తదితరులు పిలుపునిచ్చారు. శని వారం టెక్కలిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బా బు ష్యూరిటీ...మోసం గ్యారెంటీ’ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయిలో సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలిచ్చినపుడు రాష్ట్ర ఆదాయం సరిచూసుకోలేదా అని ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో మూలపేట పోర్టు, ఉద్దానం ప్రాంతానికి సురక్షితమైన నీరు, కిడ్నీ స మస్యలకు ఆస్పత్రి రూపంలో పరిష్కారం చూపిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తురామారావు, పార్టీ కాళింగ కుల విభాగ రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, జెడ్పీటీసీలు దువ్వాడ వాణి, పాల వసంత్రెడ్డి, పేరాడ భార్గవి, దుబ్బ వెంకట్రావు, ఎంపీపీలు ఆట్ల సరోజనమ్మ, నడుపూరు శ్రీరామ్ముర్తి తదితరులు పాల్గొన్నారు. పిలుపునిచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ టెక్కలి వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కూటమి పాలనపై ధ్వజమెత్తిన నేతలు -
ఇదేనా బాధ్యత..!
ఏదీ భద్రత ఏదీ ప్రమాదాల నివారణ.. నిరంతర నిఘా.. హైవే రోడ్లపై ఇసుక, కంకర, ఊక, ఆయిల్ మరే ఇతర లోడులైనా ఒరిగిపడిపోయినప్పుడు వాటిని తక్షణమే క్లియర్ చేయాల్సిన బాధ్యత కన్సష్నర్లది (రోడ్డు కాంట్రాక్టర్లది). ఒకవేళ వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యి ఆగినా, ప్రమాదాలకు గురై ఎక్కువ సేపు నిలిచినా చుట్టూరా రేడియం స్టిక్కర్లు అంటించాలి. ఆ ప్రదేశంలో సూచీ బారికేడ్లు పెట్టాలి. కన్సస్నర్లు బాధ్యత విస్మరిస్తే ఇలాంటి ఒకట్రెండు నిర్లక్ష్యాలను చూసి ఎన్హెచ్ఐ వారు రెండు నోటీసులు జారీ చేస్తారు. అప్పటికీ మించితే వారిని తొలగిస్తారు. పబ్లిక్ ఏం చేయాలి.. రోడ్లపై ఇటువంటి దృశ్యాలు కనిపించినప్పుడు 1033 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. ఎచ్చెర్ల / శ్రీకాకుళం క్రైమ్: రహదారి భద్రత మనందరి బాధ్యత. చక్కటి నినాదం. కానీ భద్రత పాటిస్తున్నదెవరు? అంత బాధ్యతగా మెలుగుతున్నదెవరు. పై వాక్యాలకు నిదర్శనం ఈ చిత్రం. ఎచ్చెర్ల మండలంలోని కొయ్యరాళ్లు జంక్షన్లో సర్వీస్ రోడ్లోకి ఎంటరయ్యే ప్రదేశం ఇది. చూడండి ఎంత ఇసుక రోడ్డు మీద ఒలిగిపోయిందో.. ఈ ఇసుక కారణంగా గురువారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు చాలా మంది వాహనాలు ఇక్కడ అదుపుతప్పి స్కిడ్ అయ్యాయి కూడా. ఇసుకను తరలించే వాహనదారులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. రహదారి బాధ్యతను పర్యవేక్షించాల్సిన అధికారులు కంట పడలేదో.. పడినా ఫిర్యాదు రాలేదు కదా అని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారో.. వాహనదారులకు మాత్రం చుక్కలు కనబడ్డాయి. ప్రమాదాలకు ఆస్కారమైన.. వాహనాల రాకపోకలు అధికంగా సాగే జాతీయ రహదారిపై నిరంతరం సేవలందించే హైవే పెట్రోల్ సిబ్బంది దృష్టి కూడా ఈ ప్రాంతంపై పడలేదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10, రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటూ ప్రమాదాల కట్టడికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పే వీరెవరి కంటినీ శుక్రవారం ఉదయం నుంచి ఈ ఇసుక రేణువు తాకలేదు. ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఇసుక వాహనాల నిర్వాహకులు వాహనాల నుంచి ఇసుక జారిపోతున్నా పట్టించుకోని వైనం జాతీయ రహదారిపై ఎక్కడ పడితే అక్కడే ఇసుక మేటలు ప్రమాదాలకు ఆలవాలంగా మారిన హైవే కటింగ్ పాయింట్లు చిత్రం చెప్పిన కథ -
పచ్చని ఉద్దానంలో విధ్వంసం తగదు
వజ్రపుకొత్తూరు రూరల్/మందస : పచ్చని చెట్లతో కోనసీమను తలపిస్తూ జిల్లాకు వరంగా ఉన్న ఉద్దాన ప్రాంతాన్ని కార్గో ఎయిర్ పోర్టు పేరుతో విధ్వంసం చేయడం తగదని వామపక్ష నాయకులు అన్నారు. జీడి, కొబ్బరిపంటలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఉద్దాన రైతులను నిరాశ్రయులను చేయడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడును ప్రశ్నించారు. ఉద్దాన ప్రాంత బాధిత గ్రామాల్లో శనివారం రైతులతో కలిసి కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా వామపక్షాల నాయకులు చైతన్య ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షులు కొమర వాసు, జోగి అప్పారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి భూములను నమ్ముకున్న జీవనోపాధి సాగిస్తున్న ప్రజలను అభివృద్ది పేరుతో పొట్ట కొట్టడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొంత కాలంగా గ్రామస్తులు ఉద్యమాలు చేస్తున్నా కనీసం పట్టించుకోకుండా సర్వేలు చేపట్టడం దారుణమని మండిపడ్డారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం లాంటి నగరాలకు అనుసంధానంగా కార్గో ఎయిర్ పోర్టులు ఉన్నాయని, దేశంలో ఎక్కడా ప్రత్యేక కార్గో ఎయిర్ పోర్టు లేదని గుర్తు చేశారు. పచ్చని ఉద్దానాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం మానుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్గో ఎయిర్ పోర్టు పోరాట కమిటీ నాయకులు కోనారి మోహన్రావు, బత్తిని లక్ష్మణ్, పోతనపల్లి కుసుమ, ఎన్.గణపతి, తెప్పల అజయ్కుమార్, పత్రి దానేష్, డి.హరికృష్ణ, కె.రమేష్, జోగి కోదండరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
280 మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ
జి.సిగడాం: మండలంలో అర్హత ఉన్న ప్రతి రైతుకు రాయితీపై ఎరువులు పంపిణీ చేస్తున్నామని జి.సిగడాం మండల వ్యవసాయాధికారి బెండి బాబ్జీ తెలిపారు. ఈ నెల 11న ‘బారులు తీరితేనే’ ఎరువులు, ఈ నెల 12న ‘ఎరువూ కరువే’ అనే శీర్షికలతో సాక్షిలో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించారు. మండలానికి 280 మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించారు. వీటిని పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేసినట్లు ఏఓ తెలిపారు. ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడికి గాయాలు పాతపట్నం : పాతపట్నం మండల కేంద్రంలోని ఆల్ఆంధ్ర రోడ్డు సమీపంలో మొబైల్ షాపు ఎదురుగా శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం ఆల్ఆంధ్ర రోడ్డు సమీపంలోని మొబైల్ షాపు ఎదురుగా పాతపట్నం కొత్త దేవాంగుల వీధికి చెందిన వృద్ధుడు కొసమాన మోహనరావు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్పందించి పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. వైద్యుడు శేషుబాబు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి పంపించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారారు. వృద్ధుడి కుమారుడు కొసమాన మల్లేశ్వరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్ఐ జి.సింహాచలం తెలిపారు. వృద్ధురాలి ఆత్మహత్య ఎచ్చెర్ల : ఎస్.ఎస్.ఆర్.పురం గ్రామానికి చెందిన నారాయణమ్మ (75) అనే వృద్ధురాలు చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఏడాది కాలంగా పక్షవాతంతో బాధపడుతున్న ఈమె గ్రామంలోనే చిన్న కుమార్తె దుర్గ ఇంటి వద్ద ఉంటోంది. ఈ నెల 10న ఉదయం ఆమె అపస్మారక స్థితిలో ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పక్కనే చీమల మందు గిన్నె కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు వృద్ధురాలిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కుమారుడు లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 18న కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష శ్రీకాకుళం అర్బన్: అర్హత ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, లోకేష్, చంద్రబాబు, పవన్కల్యాణ్ తమ మాట నిలబెట్టుకొని మెమో 57ను అమలు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మెమో 57 సాధన సమితి సమావేశంలో జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి అన్నారు. శ్రీకాకుళంలోని ఎన్జీఓ కార్యాలయంలో జరిగిన మెమో 57 సాధన సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ప్రతి బాధితుడు తమ తమ ఇంటిలోనే గృహ దీక్షను చేపట్టాలని, అలాగే ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన దీక్షను 2003 డీఎస్సీ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా బాధిత ఉద్యోగులు కలెక్టరేట్కు అధిక సంఖ్యలో హాజరై పాతపింఛన్ సాధనలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమావేశంలో జిల్లా కో కన్వీనర్లు అంబటి లక్ష్మణరావు, అట్టడ తిరుమలేశ్వరరావు, కోర్ కమిటీ సభ్యులు గురుగుబెల్లి భాస్కరరావు, నంబూరి కృష్ణారావు, ఇప్పిలి సురేష్కుమార్, దుంపల అనిల్బాబు, కె.రామకృష్ణ, ఇ.రమణ, ఫల్గుణరావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్వీ జ్యూయలర్స్ జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2024 పేరిట రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్ మాట్లాడుతూ ఆరు విభాగాల్లో పోటీలు జరుగుతాయని, విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్కుమార్, జిల్లా బాడ్మింటన్ సీఈఓ సంపతిరావు సూరిబాబు తదితరులు మాట్లాడుతు టోర్నీ నిర్వహణకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.రమణ, దాతలు కిరణ్కుమార్, ఊన్న కిరణ్కుమార్, గెంజి భీమారావు, కిమ్స్ సీఓఓ డాక్టర్ రవిసంతోష్, సోలార్ ఎనర్జీ నరసన్నపేట కె.రమణ, శీర రమణ, బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు గురుగుబెల్లి ప్రసాద్, ఎంఈ రత్నాజీ, మెండ శాంతికుమార్, సంతోష్కుమార్, ఎల్.రవి, గురుగుబెల్లి రవి, శరత్, మోహన్సాయి, రిఫరీలు, పీడీలు, సీనియర్ క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పోటెత్తిన క్రీడాకారులు.. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. సుమారు 400 మంది బాలబాలికలు, సీనియర్ క్రీడాకారులు హాజరై ప్రతిభ చాటారు. అండర్–11, 13, 15, 17, 19 బాలబాలికలకు, అలాగే సీ్త్ర, పురుషులు(సీనియర్స్) విభాగాల్లో సింగిల్స్, డబుల్స్లలో పోటీలు జరుగుతున్నాయి. తొలిరోజు రాత్రి 10 గంటల వరకు పోటీలు జరిగాయి. ఆదివారం సాయంత్రంతో పోటీలు ముగుస్తాయని అంతర్జాతీయ క్వాలిఫైడ్ రిఫరీ, టోర్నీ చీఫ్ రిఫరీ సంపతిరావు సూరిబాబు తెలిపారు. -
శ్రీకాకుళం
బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభంజిల్లా కేంద్రంలో బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభమైంది. 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. –8లోనిద్దరోతోందా..? ఉద్దానంలో విధ్వంసం వద్దు కార్గో ఎయిర్పోర్టుపై ఉద్దానంలో నిరసన గళం వినిపిస్తోంది. ఉద్దానంలో విధ్వంసం వద్దంటున్నారు. –8లోఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025● టీడీపీ హయాంలోనే ఫరీదుపేటలో హత్యలు ● ఇప్పటివరకు జరిగిన నాలుగు హత్యలు చంద్రబాబు పాలనలోనే ● టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రెచ్చిపోతున్న రౌడీ మూకలు ● సునాయాసంగా ప్రత్యర్థులను హతమారుస్తున్న పరిస్థితి ● పోలీసు పికెట్ ఉన్నా హత్య జరగడంతో మరింత అనుమానాలు ● పోలీసులు ఉదాసీనతే హత్యకు కారణమని బాధిత కుటుంబీకుల ఆరోపణ జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం వెల్లడించారు. ప్రతి రైతు తమకు కావాల్సిన ఎరువులు తీసుకోవచ్చన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు ప్రభుత్వం 50% ప్రైవేటు వర్తకులు 50% సొసైటీలు లేదా రైతు సేవా కేంద్రాలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో యూరియా 10583 ఎంటీఎస్, డీఏపీ 6402 ఎంటీఎస్, పోటాష్ 922 ఎంటీఎస్, కాంప్లెక్స్ 3084 ఎంటీఎస్, సూపర్ పాస్పేట్ 842 ఎంటీఎస్ సరఫరా చేశామన్నారు. ఇందులో రైతు సేవా కేంద్రాలకు 50 శాతం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. జూలై 5 నాటికి జి.సిగడాం మండలంలోని రైతు సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వర కు యూరియా 239 ఎంటీఎస్, డీఏపీ 80.0 ఎంటీఎస్, మండల వ్యవసాయ అధికారి ప్రతిపాదనలు మేరకు మొత్తం 319.76 ఎంటీఎస్ సరఫరా చేశామని, ఈ వారంలో యూరియా 140.0 ఎంటీఎస్ సరఫరా చేయడానికి మార్క్ఫెడ్ ద్వారా ప్రతిపాదనలు చేశామని పేర్కొన్నారు. కావాల్సిన ఎరువుల విషయమై రాష్ట్ర కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించామని, జిల్లాలో ఎలాంటి ఎరువుల కొరత లేదని తెలియజేశారు. గుడి చెంతనే మద్యం షాపు నరసన్నపేట: మండలంలోని ఉర్లాంలో వేంకటేశ్వరాలయం, అంగన్వాడీ కేంద్రాల చెంతనే మద్యం షాపు పెట్టడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మరో చోటకు మార్చాలని కోరుతున్నారు. ఆలయానికి వంద మీటర్ల లోపునే మద్యం షాపు ఉందని స్థానికులు అంటున్నారు. అలాగే అక్కడే అంగన్వాడీ కేంద్రం ఉందని చెబుతున్నారు. ఎకై ్సజ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మరో చోటకు మద్యం షాపును మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎకై ్సజ్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నియామక పరీక్షలో భవానీకి రెండో ర్యాంకు మందస: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ నియామక పరీక్షలో మందస మండలం పిడిమందస గ్రామానికి చెందిన సేనాప తి భవాని రాష్ట్రస్థాయి మహిళల కేటగిరీలో రెండో ర్యాంకు సాధించింది. భవానీ ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అభ్యసించారు. మహిళల విభాగంలో 154 మార్కులతో ఈ ర్యాంకు సాధించింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని ఫరీదుపేటపై చెరిగిపోని రక్తపు మరకలు పడుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఇక్కడ హత్యలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. హత్యలు జరిగాక సీన్ ఆఫ్ అఫెన్స్కు వచ్చి హడావుడి చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. గ్రామంలో జరిగిన నాలుగు హత్యలు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినవే కావడం గమనార్హం. టార్గెట్ ప్రకారం ప్రత్యర్థులను కిరాతకంగా చంపేస్తున్నారు. చంద్రన్న పాలనలో హత్యలు.. 2001 జూన్ 21న చంద్రబా బు అధికారంలో ఉండగా వైస్ ఎంపీపీగా పనిచేసిన కోటిపాత్రుని పోలినాయు డు హత్యకు గురయ్యారు. దీనికి ప్రతీకార హత్య కూడా 2002 ఆగస్టులో జరిగింది. మొదలవలస రాంబాబును చంపేశారు. పార్టీల విషయం పక్కన పెడితే హత్యా రాజకీయాలకు ఫరీదుపేట వేదికై ంది. ఆ తర్వాత కొన్ని ఘటనలు జరిగినా హత్యల వరకు వెళ్లలేదు. మళ్లీ తాజాగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక హత్యల పరంపర మొదలైంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో అంటే గత ఏడాది ఆగస్టులో వైఎస్సార్సీపీ కి చెందిన కూన ప్రసాద్ను టీడీపీ మూకలు హత్య చేశాయి. తాజాగా వైఎస్సార్సీపీకి చెందిన సత్తారు గోపిని మళ్లీ టీడీపీ వాళ్లే పట్ట పగలు దాడి చేసి చంపేశారు. ఈ హత్యలన్నీ దాదాపు టీడీపీ హయాంలోనే జరిగాయి. నిఘా వైఫల్యమేనా..? టీడీపీ పాలనలో నిఘా వైఫల్యమో? వ్యవస్థను పోలీసుల గుప్పెట్లో పెట్టుకోవడమో తెలీదు గాని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఫరీదుపేటలో హత్యలు జరుగుతున్నాయి. తాజాగా సత్తారు గోపి హత్యకు దారితీసే పరిస్థితులపైన ఆరోపణలు ఉన్నాయి. కూన ప్రసాద్ హత్య కేసులో తొమ్మిది మంది వరకు ఉన్నా నలుగుర్ని మాత్రమే నిందితు లుగా చూపించి, మిగతా వారికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేలా పోలీసులు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని సత్తారు గోపి కుటుంబీకులే నేరుగా ఆరోపిస్తున్నారు. ఆ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందితులను విడిచిపెట్టడం వల్లే ఈ హత్య జరిగిందని, వారే గోపిని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసు అధికారు లను సైతం మృతదేహం వద్దకు రాకుండా అడ్డుకు న్నారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. చివరి కీ ఎచ్చెర్ల ఎస్ఐ తీరుపై నేరుగా మండిపడ్డారు. తక్షణమే ఆయన్ని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. పోలీసు పికెట్ ఉన్నా... గత ఏడాది ఆగస్టులో కూన ప్రసాద్ హత్య తర్వాత ఫరీదుపేటలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతోనే పికెట్ పెట్టారు. అయినప్పటికీ మరో హత్య జరిగిందంటే ఏమనుకోవాలో తెలియని పరిస్థితి నెలకుంది. అసలు నిఘా వ్యవస్థ ఏమైంది? సమస్యాత్మక గ్రామంపై పర్యవేక్షణ కొరవడిందా? లేదంటే ఎవరైనా ప్రభావితం చేశారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మంత్రి లోకేష్ శ్రీకాకుళం క్రైమ్/ఎచ్చెర్ల : జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ కార్యకర్త సత్తారు గోపి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురికావడంతో ఎస్పీ కేవీ మహే శ్వరరెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి దాదాపు 300 మందితో పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేశారు. శ్రీకాకుళం, కాశీబుగ్గ డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, వీవీ అప్పారావులే కాక సీఐ లు, ఎస్ఐలు, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచి, పోలీస్ కమాండోలు, ఏఆర్ సిబ్బందితో ఫరీదుపే ట ఇళ్ల గడపలు నిండిపోయాయి. దాదాపు ఊరి నుంచి జాతీయ రహదారి వరకు అడుగడుగునా పోలీసులు కనిపించారు. 12 మందిపై ఎఫ్ఐఆర్.. అదుపులో నలుగురు..? మృతుడు గోపి కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మంది కీలక నిందితులను, మరో నలుగురు అనుమానితులను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారని, ఇప్పటికే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఓ నిర్మానుష్య ప్రాంతంలో హత్య జర గడం, అక్కడ ఓ చెట్టుపై సీసీ కెమెరాలున్నా వారం రోజుల కిందటే పాడు చేయడం, హత్య జరిగిన రోజు అవి పనిచేయకపోవడం వంటివి అనుమానా లను బలపరుస్తున్నాయి. శనివారం ఉదయం రిమ్స్లో సత్తారు గోపి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి 11.30 గంటలకు గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసుల సమక్షంలోనే అంత్యక్రియలు జరిగాయి. న్యూస్రీల్రెడ్బుక్ రాజ్యాంగమే దీనికి కారణమా అన్న అనుమానాలు తలెత్తక మానలేదు. నిఘా వైఫల్యానికి ఇదొక నిలువెత్తు సాక్ష్యంగా చెప్పవచ్చు. ప్రస్తుత ఎంపీపీ మొదలవలస చిరంజీవిని హతమార్చడానికి గత ప్రభుత్వం సమయంలో కొందరు ప్రయత్నిస్తే, నిఘా వ్యవస్థ పట్టిష్టంగా ఉండటంతో ఆ సమయంలో కుట్రదారులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడు నిఘా ఏమైందో పక్కన పెడితే పోలీసు పికెట్ ఉండి కూడా హత్య జరగడం విస్మయం కలిగిస్తోంది. శాంతిభద్రతలపై కాకుండా కక్షపూరిత రాజకీయాలపై దృష్టి పెట్టడం, పోలీసులను సైతం సక్రమంగా పనిచేయక పోనివ్వకపోవడం వల్లనే హత్యలకు అవకాశం ఏర్పడిందన్న వాదనలు ఉన్నాయి. కూన ప్రసాద్ హత్య జరిగినప్పుడే పోలీసు ఉన్నతాఽధికారులు కఠినంగా వ్యవహరిద్దామని భావించినా అధికారంలో ఉన్న పెద్దలు అడ్డు తగిలారు. దాని పర్యవసానమే తాజా హత్య అని ఆరోపణలు ఉన్నాయి. శాంతియుతంగా ఉండాలి.. 1951లో డబుల్ మర్డర్తో ఈ గ్రామంలో తగాదాలు ప్రారంభమయ్యాయి. గౌరీదేవి ఉత్సవాల్లో గొడవ వచ్చింది. మొదట్లో రెండు గ్రూపులు గ్రామానికి నాయకత్వం వహించేవారు. గ్రూపులుగా ఎప్పుడూ కొట్టుకోరు. అదను చూసి సింగిల్గా ప్రత్యర్థి వస్తే దాడికి ఎగబడతారు. గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలి. – ఎం.అవతారం, సీఐ, జె.ఆర్.పురం -
బాలింతల మరణాలపై వైద్యబృందం ఆరా
సారవకోట: మండలంలోని బుడితి సీహెచ్సీని శనివారం జిల్లా వైద్యుల బృందం పరిశీలించింది. ఈ ఆస్పత్రిలో చేసిన ప్రసూ తి ఆపరేషన్ల కారణంగా ఇటీవల జలుమూరు మండలం పాగోడు, యలమంచిలి గ్రామాలకు చెందిన ఇద్దరు బాలింతలు మృతి చెందారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్, డీసీహెచ్ఎస్, కలెక్టర్ ఆదేశాల మేరకు టెక్కలి జిల్లా ఆస్పత్రి నుంచి డాక్టర్ ప్రసూనాంబ, డాక్టర్ ప్రతిభా చైతన్య, డాక్టర్ ప్రకాశ్ వర్మ, డాక్టర్ శ్రీనుబాబు, డాక్టర్ కాళీ చరణ్లతో కూడిన కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మృతులు ఎప్పటి నుంచి ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు, ఆపరేషన్ చేసిన సమయంలో వారి ఆరోగ్య పరిస్థితి, తదితర వివరాలను ఆపరేషన్ చేసిన వైద్యురాలు శోభారాణి, ఇతర వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేధిక అందించనున్నట్లు వారు తెలిపారు. -
ముఖలింగేశ్వరుని సన్నిధిలో తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ
జలుమూరు: ప్రసిద్ధి శైవక్షేత్రం శ్రీముఖలింగంలో మధుకేశ్వరుడిని తమిళనాడు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ టి.ఎన్ వెంకటేష్ శనివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయ చరిత్రను వివరించారు. ఈదుపురంలో పోలీసు పహారా ఇచ్ఛాపురం రూరల్: ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో వైఎస్సార్సీపీ కార్యకర్త సత్తారు గోపి దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. జూన్ 17న గ్రామంలో ఇరువర్గాల మధ్య జరిగిన కొట్లాట, రెండు రోజుల క్రితం కూటమి నాయకుడు విడుదల చేసిన వివాదాస్పద వాయిస్ రికార్డు దృష్ట్యా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తగా ఏఎస్ఐ శంకరరావు, ముగ్గురు కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కరువు భత్యం చెల్లించాలి శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సప్పటి మల్లేసు, పంచాది గోవిందరాజులు, సహాధ్యక్షుడు నెమలిపురి విష్ణుమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2023 జులై నుంచి ఇప్పటివరకు నాలుగు విడతలుగా బకాయిలు పడ్డ డీఏలన్నీ కలిపి 16.38 శాతం చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. ఇసుక వాహనాల అడ్డగింత బూర్జ : ఇసుక వాహనాల రాకపోకలతో దుమ్ము ధూళి చెలరేగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బూర్జ మండలం చీడివలస గ్రామస్తులు శనివారం పలు లారీలను అడ్డుకున్నారు. కాఖండ్యాం, తమరాం ఇసుక ర్యాంపుల నుంచి రాత్రీపగలు తేడా లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీలను అడ్డుకోవడంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి పంపించారు. జాబ్మేళాకు విశేష స్పందన శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. జీఎంఆర్ ఏఈఆర్ఓ ఆధ్వర్యంలో వివిధ ఎయిర్పోర్టుల్లో ఫైర్ ఫైటర్స్ పోస్టుల భర్తీకి ఈ డ్రైవ్ నిర్వహించారు. ఇంటర్ ఉత్తీర్ణులైన 18 నుంచి 24 ఏళ్ల యువత జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. 1600 మీటర్ల పరుగు, బరువు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వివరాలు తర్వాత వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు. రైస్ మిల్లులో విజిలెన్స్ తనిఖీలు కొత్తూరు: కడుము గ్రామంలో అరసా ట్రేడర్స్ రైస్ మిల్లులో శనివారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ బి.సింహాచలం, ఎస్ఐ టి.రామారావు, సీఎస్డీటీ భీమారావులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల 50 కిలోల బరువు గల 700 పీడీఎస్ బియ్యం బస్తాలను పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలస చెక్పోస్టు విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ను విచారణ చేయగా.. కొత్తూరు మండలంలో టీడీపీ నేత, కడుము ఎంపీటీసీకి చెందిన అరసా రైస్ మిల్లు నుంచి బియ్యం తీసుకొస్తున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో జిల్లా విజిలెన్స్ అధికారులు మిల్లులో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వీఆర్వో చిన్న లోకేష్ పాల్గొన్నారు. కాగా, కొత్తూరు, తదితర మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని చిల్లర వర్తకుల ద్వారా కొనుగోలు చేసి పాచిపెంట మీదుగా ఒడిశా రాష్ట్రానికి తరలిస్తున్నట్లు సమాచారం. -
గోపి కుటుంబానికి అండగా ఉంటాం
● మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఎచ్చెర్ల: ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తోందని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఫరీదుపేట గ్రామంలో హత్యకు గురైన సత్తారు గోపి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్తో కలిసి ఆయన శనివారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ టీడీపీ నాయకులు గోపిని దారుణంగా హత్య చేశారని, ఇంతకు ముందు ఆయన కారు డ్రైవర్ను హత్య చేశారని, అప్పుడు ప్రధాన కారకులను కేసు నుంచి తప్పించారని అన్నారు. పో లీసు పికెటింగ్ ఉన్నా హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. గోపి కుటుంబానికి అండగా ఉంటామ న్నారు. భార్యాభర్తల తగువు మధ్యలో వ్యక్తిని హత్య చేయడం రాజకీయమని అన్నారు. ఎచ్చెర్ల ఎస్ఐ దీనికి పూర్తిగా సహకరించారని ఆరోపించా రు. ఆయన సమక్షంలో భార్యాభర్తల గొడవకు సంబంధించి 41 నోటీసులు ఇవ్వడానికి 20 మంది పోలీసులు రావడం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడి విషయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీ సుకెళ్లామని తెలిపారు. హత్యకు ప్రధాన కారకులు బయట కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. దీనిపై ఎస్పీ సమగ్ర దర్యాప్తును నిర్వహించి దోషులను వెంటనే శిక్షించాలని అన్నా రు. చనిపోయిన గోపి అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, బాబుకు కాలు విరిగిందని, పాప ఇంట ర్ చదువుతోందని, ఆ కుటుంబం వీధిన పడిందని అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బోరసాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, జెడ్పీటీసీలు మీసాల సీతంనాయుడు, పిన్నింటి సాయికుమార్, నీలమప్పడు, శీరపు, శ్రీరామూర్తి, గోవిందరెడ్డి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీవన్నీ ప్రగతి వేషాలు
● ఈ ప్రాంత బాగుకోసం ఎందాకై నా పోరాటం చేస్తా ● శ్రీకాకుళం వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం రూరల్: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను టీడీపీ దశాబ్దాలుగా మోసం చేస్తోందని, ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసంలో శనివారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. చంద్రబాబునాయుడు ఏడాది పాలనలో కనీసం జిల్లాకు రూ.వెయ్యి కోట్లు కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. అంతా కూటమి ప్రభుత్వం అంటున్నారు గానీ ఇది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడలేకపోతున్నారని, బీజేపీ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తోందని అన్నారు. సోషల్ మీడియాను వాడుకుందాం.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి కార్యకర్తలే తీసుకెళ్లాలని, సోషల్ మీడియాను ఓ ఆయుధంలా వాడుకోవాలని సూచించారు. మన దాహార్తిని తీర్చి పంటలకు నీరిచ్చే వంశధార ప్రాజెక్టు పూర్తవ్వడానికి యా భై ఏళ్లు పట్టిందన్నారు. ఆఫ్షోర్, తోటపల్లి, నారాయణపురం వంటి ప్రధాన ప్రాజెక్టులకు నిధులు ఇచ్చింది దివంగత నేత వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. మన పాలకులకు ఈ ప్రాంతంపై పట్టింపు లేదు అనేందుకు అనే క ఉదాహరణలు ఉన్నాయన్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయబోనని, ప్రభుత్వ విధానాలపై మాత్రమే మాట్లాడతానని ధర్మాన అన్నారు. పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్కై నా, అసెంబ్లీకై నా పోటిచేస్తానని తెలిపారు. తన బదులుగా మరొ కరికి నాయకత్వం ఇస్తే వారికి మద్దతుగా ప్రోత్సహిస్తానన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదాం.. తాను పార్టీ మారతానని ఒకే ఏడాదిలో ఎన్నో పుకా ర్లు వచ్చాయన్నారు. కానీ అవన్నీ నిజం కావన్నారు. తన సైన్యాన్ని వదిలి వాళ్లతో మాట్లాడకుండా రా జకీయ రంగంలో యుద్ధం ఎలా చేయగలనంటూ ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి బాకాలు ఊదే పత్రికలను చదవద్దని, నిరాధార కథనాలను ప్రసారం చేసే చానెల్స్ చూడవద్దన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా సోషల్ మీడియా వేదికగా ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలన్నా రు. ప్రతి నియోజకవర్గంలో వేయిమందిని సోషల్ మీడియాలో భాగం చేస్తే ఎన్నికల నాటికి లక్షమందికి చేరువ అవుతారన్నారు. ఆ రోజు సచివాలయ వ్యవస్థను నిష్పక్షపాతంగా ఏర్పాటు చేశామని, ఈ రోజు బదిలీల పేరిట అధికార పార్టీ నేతలకు ముడుపులు ఇస్తేనే పని జరుగుతోందన్నారు. టీడీపీ గురించి వలంటీర్లను ఎన్నికల ముందే హెచ్చరించామని, ఇప్పుడు తాము చెప్పినట్టే జరుగుతోందన్నారు. వైఎస్ జగన్ మరింత బలపడితే ఈ కూటమిలో ఉన్న నాయకులే రేపు మనతో కలిసి వస్తారన్నారు. మీరంతా కలిసి పనిచేసి గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. టీడీపీ మేనిఫెస్టో ఏమిటన్నది క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలిసిపోతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మన లక్ష్యమని తెలిపారు. సభాధ్యక్షుడు చిట్టి జనార్దనరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు ఎమ్మెల్సీ కుంభా రవిబా బు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ కళింగ వైశ్య, తూర్పు కాపు కుల విభాగాల రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, యువనేత ధర్మాన రామ్మనోహర్నాయుడు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి.స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. -
కాశీబుగ్గలో ఎస్పీ గ్రీవెన్స్
కాశీబుగ్గ:కాశీబుగ్గ పోలీస్స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సివిల్, కుటుంబ కలహాలు, ఆస్తి, కొట్లాట, మిస్సింగ్, చీటింగ్ తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించారు. శాకంబరిగా సంతోషిమాత శ్రీకాకుళం కల్చరల్ : పాత శ్రీకాకుళంలో సంతోషిమాత అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు మోదుకూరి కిరణ్శర్మ ఆధ్వర్యంలోఅమ్మవారికి వివిధ కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకున్నారు. రోడ్డు తడుస్తోంది.. ఊరి గొంతు ఎండుతోంది! ఇచ్ఛాపురం రూరల్: డొంకూరు గొంతు ఎండుతోంది. ఈ గ్రామస్తులకు అందిస్తున్న తాగునీరు రోడ్డు పాలు కావడంతో ఊరి వారు దాహం కేకలు పెడుతున్నారు. సుమారు నాలుగు వేల జనాభా ఉన్న ఈ గ్రామానికి ఉద్దానం తాగునీరు అందేది అంతంత మాత్రమే. అయితే స్థానిక వంతెన వద్ద పైప్ లీకేజీ కావడంతో మంచి నీరు వృధాగా పోతుండటంతో మహిళలు లీకేజీ నీటిని నింపుకునేందుకు ఆరాటపడుతున్నారు. నీరు లేక తమ గొంతెండుతుంటే, గత కొన్ని రోజులుగా పైప్ లీకేజీ అవుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల తొలగింపు జి.సిగడాం: జి.సిగడాం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆట మైదానంలో ఎట్టకేలకు ఆక్రమణలు తొలగించారు. తహసీల్దార్ మహాదేవు సరిత కృషితో ఎస్ఐ వై.మధుసూదనరావు నేతృత్వంలో గడ్డికుప్పలు, కర్రలు, వివిధ రకాల సామగ్రిని తొలగించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమి తమదంటూ ఆక్రమించారు. ఈ విషయమై ఎస్ఎఫ్ఐ నాయకులు, సభ్యులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు అధికారులకు వినతిపత్రాలు అందించారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా సర్వే చేసి ఆటస్థలాన్ని కళాశాలకు అప్పగించారు. ఎట్టకేలకు సమస్య పరిష్కారం కావడంతో తహసీల్దార్ను పలువురు అభినందించారు. -
గ్యాస్ లీకై ఇద్దరికి గాయాలు
ఆమదాలవలస: పురపాలక సంఘ పరిధిలోని మెట్టక్కివలస పదో వార్డు వాంబే కాలనీలో గ్యాస్ లీకై ఇద్దరు గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వాంబే కాలనీకి చెందిన గుంటుకు సరస్వతి టిఫిన్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంట్లో టిఫిన్ తయారు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎదురు ఇంట్లో నివసిస్తున్న కోలా మాధవరావు ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా ఆయన కూడా గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.70 వేల నష్టం జరిగినట్లు సమాచారం. ఎస్సై ఎస్.బాలరాజు సైతం ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. గ్యాస్ సిబ్బంది పరిశీలించి బాధితురాలితో మాట్లాడారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బూరగాంలో కలకలం టెక్కలి : బూరగాం గ్రామంలో శుక్రవారం కలకలం రేగింది. ఓ ఇంటికి నిత్యం కొంతమంది యువతీ యువకులు వస్తూ పోతుంటారని, ఓ మహిళ చీకటి వ్యవహారం నిర్వహిస్తోందంటూ స్థానికులు ఇంటికి ఇరువైపులా తాళాలు వేసి నిర్బంధించారు. సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ కేశవరావు, సిబ్బంది గ్రామానికి చేరుకుని మహిళతో పాటు ఇంట్లో నిర్బంధించిన ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, గ్రామస్తులు నిర్బంధించిన వారంతా తనకు తెలిసినవారేనని ఆ మహిళ చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆదిత్యాలయంలో విజిలెన్స్ విచారణ
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రూ.లక్షల్లో అక్రమాలు చేసినట్లుగా అందిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం విజిలెన్స్ సిబ్బంది విచారణ చేపట్టారు. విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఆదేశాల మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు పలువురి నుంచి వాంగ్మూలాలను స్వీకరించారు. దాదాపుగా రూ.2 కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు సమాచారం. భక్తుల దర్శనాల ఏర్పాట్లు, సౌకర్యాలు, ఆలయంలో వివిధ రకాల అభివృద్ధి పనుల పేరిట రూ.లక్షల్లో అక్రమంగా చెక్కులను జారీ చేస్తూ.. ఆలయ నిధులను దారుణంగా తినేశారని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. రెగ్యులర్ ఉద్యోగులే టార్గెట్గా.. విశాఖపట్నంలో గ్రేడ్–2 ఈవోగా రిటైర్డ్ అయిన జగన్మోహనరావుతో పాటు ఆలయ రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ కావ్యశ్రీల ప్రమేయంతో రెగ్యులర్ ఉద్యోగుల పేరిట అక్రమంగా చెక్కులు జారీ అయ్యాయని గుర్తించారు. ఎర్రయ్య అనే అటెండర్కు తెలియకుండా ఆయన పేరుతో రూ.5 లక్షల విలువైన చెక్కులు, మరో రెగ్యులర్ రికార్డు అసిస్టెంట్ శిమ్మ మల్లేశ్వరరావు పేరిట 19 చెక్కులు, అటెండర్ శ్రీనివాసరావు పేరుతో సుమారు 4 చెక్కులు, స్వీపర్ నీలయ్య పేరుతో 2 చెక్కులతో పాటు ఆలయంలో సిమ్మెంట్ పనులు చేసే మేస్త్రి కునుకు రాము అనే వ్యక్తి పేరిట ఏకంగా 9 చెక్కులు, దినసరి పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న బుజ్జి పేరిట మరో 4 చెక్కుల వరకు జారీ చేసేశారు. ఆయా రెగ్యులర్ ఉద్యోగుల సంతకాలు కూడా ఫోర్జరీవిగా పేర్కొంటున్నారు. దీంతో పాటు ఆలయంలో విద్యుత్తో పాటు పలు రకాల పనులను కాంట్రాక్ట్ విధానంలో చేస్తున్న క్లాస్–1 కాంట్రాక్టర్ ఉంగటి పాపారావు వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. మిగిలిన చెక్కులన్నీ ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారుల పేరుతో జారీ చేశారు. వివాదాస్పదంగా వాంగ్మూలాల స్వీకరణ.. విజిలెన్స్ అధికార సిబ్బంది.. తమ జిల్లా కార్యాలయంలో వాంగ్మూలాలను స్వీకరించకుండా ఆలయ కార్యాలయంలో కూర్చుని వాంగ్మూలాలను దగ్గరుండి రాయించడం వివాదాస్పదమయ్యింది. అక్రమాలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ముందున కూర్చోబెట్టుకుంటే వాస్తవాలను ఎలా చెప్పగలమని కొందరు దినసరి వేతనదారులు ఆక్షేపించారు. ఇప్పటికై నా విజిలెన్స్ ఉన్నతాధికారులు తమదైన శైలిలో విచారించి ఆలయంలో అక్రమాల నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు. -
● ప్రజల్లోకి కూటమి వైఫల్యాలు
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ.. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి సంబంధించి పోలాకి రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం నరసన్నపేట నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తదితరులు పాల్గొన్నారు. – నరసన్నపేట -
● ఇక్కడో పాక ఉండాలే..!
ఈ చిత్రంలో చదును చేసిన స్థలంలో మొన్నటి వరకు పాక ఉండేది. కొత్తూరు మండలం వసప గ్రామంలో ఈ నెల 5వ తేదీ రాత్రి ఇదేచోట ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడిపిన శంకరరావు అనే వ్యక్తి మిన్నారావు అనే యువకుడిని హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతలో ఏం జరిగిందో గానీ గురువారం రాత్రి పూరిపాక కాలిపోయింది. ఆ ఆనవాళ్లు కూడా లేకుండా యంత్రాలతో చదును చేసేశారు. పోలీసు దర్యాప్తు దశలో ఉండగా పాకను ఎవరు కాల్చారు?ఎందుకు చదును చేశారనే విషయం తెలియడం లేదు. ఈ విషయమై దర్యాప్తు చేపట్టాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. – కొత్తూరు -
గండం గడిచింది!
ఎచ్చెర్ల: నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ప్రాణభయంతో విలవిల్లాడిపోయారు. సాయం కోసం మైరెన్, పోలీసులను ఆశ్రయించినా స్పందన లేకపోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. ఈ సమయంలో మరో బోటు రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన ఎచ్చెర్ల మండలం కొయ్యాం సముద్ర తీరానికి సుమారు 45 మైళ్ల దూరంలో చోటుచేసుకుంది. బాధిత మత్స్యకారులు, బోటు యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లాకు చెందిన పది మంది మత్స్యకారులు ఈ నెల 9న ఉదయం 5 గంటలకు సముద్రంలో వేటకోసం బయల్దేరారు. ఎచ్చెర్ల మండలంకొయ్యాంకు 45 మైళ్ల దూరంలో ఉండగా బోటు చెక్క పక్కకు ఒరిగిపోవడంతో లోపలికి నీరు ప్రవేశించింది. కొద్దికొద్దిగా బోటు మునిగిపోయే సూచనలు కనిపించాయి. దీంతో బోటులో ఉన్న వారు వారి యాజమాని వాసపల్లి ధనారాజ్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన మైరెన్ సిబ్బంది, పోలీసులకు, వేరే బోటు నిర్వాహకులకు ఫోన్లు చేసినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో మరో బోటు రావడంతో వారిని సాయం అడిగారు. వారు తొలుత సహకరించకపోవడంతో వలకు అడ్డుగా బోటును నిలబెట్టడంతో సాయం చేసేందుకు అంగీకరించారు. పది మంది మత్స్యకారులు ఆ బోటులోకి వెళ్లిపోయారు. 10వ తేదీ మొత్తం ఆ బోటు లోనే గడిపారు. 11వ తేదీ ఉదయం కొయ్యాం తీరానికి చేరుకున్నారు. అప్పటికే యజమాని వచ్చి ఆటోలో మత్స్యకారులను విశాఖకు తీసుకెళ్లిపోయారు. ఈ ఘటనలో సుమారు 90 లక్షల విలువైన బోటు మునిగిపోయిందని యజమాని తెలిపారు. చనిపోతే వస్తామన్నారు.. అంతకుముందు బోటు యాజమాని వాసపల్లి ధనరాజ్ మాట్లాడుతూ సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సాయం అందించాలని మైరెన్ సిబ్బందికి తెలియజేశాం. ఎవరూ స్పందించలేదు. అనంతరం ఎచ్చెర్ల పోలీసులకు ఫోన్ చేస్తే ఎవరైనా చనిపోతే అప్పుడు వస్తామని బదులిచ్చారని, సముద్రంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోకపోవడం అన్యాయమని అన్నారు. నడిసంద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు బోటులో నీరు చేరడంతో దిక్కుతోచని పరిస్థితి మైరెన్, పోలీసులకు తెలియజేసినా కానరాని స్పందన మరో బోటు రావడంతో సురక్షితంగా ఒడ్డుకు.. -
పర్యాటక స్థూపంగా పైలాన్
ఇచ్ఛాపురం రూరల్: ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన పైలాన్ను పర్యాటక స్థూపంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా 2017లో లొద్దపుట్టిలో విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం పైలాన్ శిథిలావస్థకు చేరుకోవడంతో శుక్రవారం ఎమ్మెల్సీ నర్తు రామారావు తన సొంత నిధులతో మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాదయాత్రకు చిహ్నంగా ఉండే పైలాన్ను ప్రతీ వైఎస్సార్సీపీ కార్యకర్త మదిలో చిరస్థాయిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు కారంగి త్రినాథ్, ఆశి దాలయ్యరెడ్డి, పిలక సంతు, ఉప్పాడ రాజారెడ్డి, నైనా తేజా, తులసీ, తిప్పన ధనుంజయరెడ్డి పాల్గొన్నారు. -
● 600 ఎకరాల వరి.. నీరు లేక తడారి
పచ్చటి పొలాలు కళ్ల ముందే తడారి ఎడారిలా మారిపోతున్నాయి. వంశధార అధికారుల నిర్వాకంతో దాదాపు 600 ఎకరాల పొలాలకు నీరు అందడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. మండలంలోని కొండవలస గ్రామంలో సైలా డ చెరువు ఆయకట్టు కింద సుమారు 600 ఎకరాలు రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం, గార మండలాల రాజకీయ నేతల నుంచి అధికారులకు ఒత్తి ళ్లు రావడంతో వంశధార కుడి కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. కానీ విడుదల చేసిన కొద్ది గంటల్లోనే నీరు నిలిపివేశారు. పూడిక తీత పనులు పూర్తి కాకపోవడంతో ఆపేశామని చెబుతు న్నారు. దీంతో రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా ఎండి పోతున్న తమ పొలాల వద్ద నిరసనలు తెలిపారు. ఈ సమయంలో సాగునీటిని అందించకపోతే తమ పొలాలు ఎందుకూ పనికిరావ ని ఆందోళన వ్యక్తం చేశారు. వంశధార కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. – సరుబుజ్జిలి -
● బడి కోసం రోడ్డెక్కిన కృష్ణాపురం
పురపాలక సంఘం పరిధిలోని రెండో వార్డు కృష్ణాపురం ప్రధాన రహదారి పక్కన ఉన్న మున్సిప ల్ ప్రైమరీ పాఠశాలను తరలించవద్దంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు శుక్రవారం రోడ్డెక్కా రు. శుక్రవారం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసన తెలుపుతూ ప్రైమరీ పాఠశాలను ఫౌండేషన్ స్కూల్గా మార్పు చేయవద్దంటూ అధికారులను వేడుకున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాఠశాలను తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటిౖకైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ విద్యా సంవత్సరానికి మున్సిపల్ ప్రైమరీ పాఠశాల గానే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. – ఆమదాలవలస -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల: రోడ్డు పనులు పరిశీలించి వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. మూకుమ్మడిగా దాడిచేసిన అధికార టీడీపీ కార్యకర్తలు.. ఆయనను అంతమొందించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. ఫరీదుపేటకు చెందిన సత్తారు గోపి వైఎస్సార్సీపీ కార్యకర్త. ఊరి కూడలి ఎన్హెచ్–16 సమీపంలోని కొయిరాలమెట్ట వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో ఉంది. శుక్రవారం మధ్యాహ్నం చిన్నాన్న సత్తారు కోటేశ్వరరావుతో కలిసి గోపి ఆ రహదారి పనులను పరిశీలించి ఇంటికి భోజనానికి బైక్ (ఏపీ30పి6845)పై బయల్దేరారు. ఇంతలో కొయిరాలమెట్ట వద్ద దారికాచిన ఎనిమిది మంది కర్రలతో దాడికి దిగారు. గోపి వారికి చిక్కగా... బైక్పై వెనుక కూర్చున్న కోటేశ్వరరావు పరిస్థితి గ్రహించి పారిపోయాడు. అప్పటికే కర్రలతో గోపి తలపై బాదిన దుండగులు ఆయనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశారు. ఈ దాడిలో మారణాయుధాలు కూడా వాడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపి ఎంపీపీ మొదలవలస చిరంజీవికి ప్రధాన అనుచరుడు. భర్త హత్య విషయం తెలిసి గోపి భార్య పుణ్యవతి కుప్పకూలారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. గోపికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. టీడీపీ వారే చంపారు...ఫరీదుపేట గ్రామ టీడీపీ నాయకులే గోపి హత్యకు ఒడిగట్టారని ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులకు సైతం ఇదే విషయం తెలిపారు. రాజకీయంగా కక్ష కట్టిన టీడీపీ నేతలు... కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో రెండో హత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్ను టీడీపీ మద్దతుదారులు హత్య చేశారు.హత్యను తప్పుదారి పట్టించే కుట్ర..హత్య విషయం తెలిసి పోలీసులు, గోపి కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్రోచ్ రోడ్డు వద్ద ఒక కర్ర, వెనుక నిర్మానుష్య ప్రదేశంలో రక్తపు మడుగులో గోపి మృతదేహం పక్కన లావుపాటి కర్ర ఉండటం గమనార్హం. నిరుడు కూన ప్రసాద్నూ ఇదే తరహాలో టీడీపీ వర్గీయులు హతమార్చారు. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయకుండా వదిలేశారని.. వారివల్లే గోపి హత్య జరిగిందని వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కుటుంబసభ్యులు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు అరగంట పాటు హైవేను దిగ్బంధించారు. పూర్తిగా రాజకీయ కారణాలు ఉండగా.. భార్యాభర్తల తగాదా కేసులో భాగంగా అంటూ కేసు తీవ్రత తగ్గిస్తూ, టీడీపీవారిని తప్పించేలా పోలీసులు వ్యవహరించారని గోపి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. డీఎస్పీ వివేకానంద సైతం ఇలానే మాట్లాడుతున్నారని తెలిపారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలి నుంచి వెళ్లిపోయారు. డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ అవతారం, సబ్ డివిజన్ పోలీసులంతా వచ్చినా ఆందోళనకారుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయారు. దీంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి రావాల్సి వచ్చింది. గోపి హత్య నిందితులైన టీడీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. కిందకు లాగేసి.. దుర్భాషలాడుతూ..తొమ్మిదిమంది టీడీపీ వాళ్లు వచ్చి బైక్పై వెళ్తున్న గోపిని, నన్ను లాగేశారు. తీవ్రంగా తిడుతూ నా ఫోన్ను తీసేసుకున్నారు. చంపేస్తారనే భయంతో పారిపోయా. గ్రామస్థులకు సమాచారం ఇవ్వడానికి వెళ్లా. మారణాయుధాలతో గోపిని చంపేశారు. – గోపి చిన్నాన్న కోటేశ్వరరావు -
శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఫరీద్ పేట సమీపంలోని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై వైఎస్సార్సీపీ కార్యకర్త సత్తారు గోపీని కర్రలు, రాళ్లతో కొట్టి దుండగులు హత్య చేశారు.పట్టపగలు నడిరోడ్డుపై హత్య జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. టీడీపీ గుండాలే హత్య చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సత్తారు గోపీ వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాగా, ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే అదే గ్రామంలో కూన ప్రసాద్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను దండగులు హత్య చేశారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి పరిశీలించారు. -
సంద్రం అడుగున ఐరన్ లాకర్! తెరిచి చూస్తే..
నరసన్నపేట/జలుమూరు: వంశధార నదిలో నరసన్నపేట మండలం చోడవరం గ్రామానికి చెందిన ఇద్దరు జాలర్లకు ఇటీవల దొరికిన ఐరన్ లాకర్ కథ ఎట్టకేలకు జలుమూరు పోలీసు స్టేషన్కు చేరింది. ఈ లాకర్ వ్యవహారంపై శ్రీకాకుళం టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం చేరడంతో వారు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నరసన్నపేట మండలం చోడవరం గ్రామానికి చెందిన ఇద్దరు జాలర్లు శైలాడ బుచ్చయ్య, మడ్డి రామకృష్ణలు 15 రోజుల క్రితం వంశధారలో చేపల వేటకు వెళ్లగా వారికి ఒక ఐరన్ లాకర్ దొరికింది. లాకర్ బురద పట్టి ఉండడంతో వీరు తెరవలేక గారకు చెందిన ఒక పాత ఇనుప సామాన్ల వ్యాపారికి రూ.2 వేలకు విక్రయించారు. ఆయన లాకర్ను తెరిపించి చూడగా వెండి వస్తువులు, బురద పట్టిన కొంత డబ్బు బయట పడ్డాయి. ఈ సమాచారం రెవెన్యూ యంత్రాంగం దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోలేదు. కొద్ది రోజులకు పోలీసులకు విషయం తెలిసింది. దీంతో శ్రీకా కుళం టాస్క్ఫోర్సు పోలీసులు దీనిపై దృష్టి సారించి కూపీ లాగారు.చోరీకి గురైన లాకర్తో సంబంధంజలుమూరు మండలం సురవరం గ్రామానికి చెందిన సురవరపు శివప్రసాద్ ఇంట్లో చోరీకి గురైన ఐరన్ లాకర్కు దీనికి సంబంధం ఉన్నట్లు గుర్తించారు. 2024 జులై 21వ తేదీన తమ ఇంట్లో చోరీ జ రిగినట్లు శివప్రసాద్ అప్పట్లో జలుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఇద్దరు జాలర్లను పోలీసులు స్టేషన్కు తరలించి వివరాలు సేకరించి, వారి ద్వారా ఐరన్ లాకర్, దాంట్లో ఉన్న వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమా రు రెండు కేజీల వెండి వస్తువులు, రెండు లక్షల డబ్బు ఉన్నట్లు సమాచారం. దీనిపై నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా చోడవరంలో దొరికిన ఐరన్ లాకరుకు, సురవరపు జగదీశ్వరరావు ఇంట్లో చోరీకి గురైన లాకరుకు సంబంధం ఉందన్నారు. అయితే జాలర్లు నిందితులు కాదని, అందువల్ల వారిని విడిచి పెట్టామన్నారు. ఈ కేసు తదుపరి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
17న చలో విజయవాడ
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జూలై 17న విజయవాడలో జరిగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశాన్ని విజయవంతం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని యాదవ సంక్షేమ సంఘం కార్యాలయంలో బుధవారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ బీసీలంతా ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించగలమన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అమీరుల్లా బేగ్, గద్దిబోయిన కృష్ణయాదవ్, త్రినాథ రెడ్డి, కిల్లాన శ్రీనివాస్, తుళ్లూరు, లక్షణరావు, పంచిరెడ్డి కృష్ణారావు, మెహర్, మురపాల రామారావు, గాంధీ, రౌతు మోహన్రావు, రంగాజీ దేవ్, కలగ గోపాల్ యాదవ్, గుత్తి చిన్నరావు, కళా వెంకటరావు, కాయితీ వెంకటరమణ, కలగ లక్ష్మణరావు, వంజరాపు రాజులు, అ.రాజేష్, తంగి యర్రమ్మ, దుర్గప్రసాద్, శిమ్మ సూర్యం పాల్గొన్నారు. -
మాట తప్పిన నాయకులను నిలదీద్దాం..!
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పిన కూటమి నాయకులను నిలదీద్దామని వైఎస్సార్సీపీ నాయకులు పిలుపునిచ్చారు. జిల్లాలోని పలాస, ఆమదాలవలస నియోజకవర్గాల్లో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశాలను బుధవారం నిర్వహించారు. దీనిలో భాగంగా బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ క్యూ ఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు కుంభా రవిబాబు, మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి, పార్టీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు, పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్టీ తూర్పు కాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. – ఆమదాలవలస/కాశీబుగ్గ -
బరితెగించిన ఆక్రమణదారులు
సంతబొమ్మాళి: మండలంలోని పోతునాయుడుపేట గ్రామంలో ఆక్రమణదారులు బరితెగించారు. సాగునీటి కాలువ, రోడ్డుకు మధ్య ఉన్న సుమారు 30 సెంట్లు స్థలం కబ్జా చేశారు. ఆక్రమించిన స్థలంలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వేసిన తాగునీటి బోరును పీకేసి ఆనవాలు లేకుండా చేశారు. దీంతో తాగునీటికి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఆక్రమణదారులను గ్రామస్తులు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడడంతో భయపడి ఫిర్యాదు కూడా చేయలేదు. దీంతో పాటు రోడ్డుకు అనుకొని ఉన్న బెర్ముతో పాటు సాగునీటి కాలువ గట్టును కూడా ఆక్రమించి మట్టిని వేసి కబ్జా చేశారు. ఆక్రమించిన స్థలంలో విద్యుత్ స్తంభాలు ఉండడంతో అవి కూడా తొలగించమని సంబంధిత కాంట్రాక్టర్తో ఆక్రమణదారులు గొడవపడిన సంఘటనలు ఉన్నాయి. ఆక్రమించిన స్థలంలోని 11 సెంట్లును వేరొక వ్యక్తికి ఆక్రమణదారులు అమ్మి తప్పుడు సర్వే నంబర్తో రిజిస్టేషన్ చేయించారని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తహసీల్దార్ హేమసుందర్ను దీనిపై వివరాలు అడుగగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
పస్తులు ఉండలేక
అన్నం తినలేక.. ● మధ్యాహ్న భోజనంలో పురుగులు ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ● పట్టించుకోని అధికారులు కంచిలి: మండలంలోని కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వండుతున్న అన్నంలో పురుగులు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ సన్నబియ్యంతో వండిన అన్నంలో కొద్ది రోజులుగా పురుగులు వస్తుండడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కూరగాయల అన్నం, ఉడకబెట్టిన కోడిగుడ్డు, బంగాళ దుంపలు కూర, వేరుశనగ చిక్కిను వడ్డించారు. అయితే కూరగాయల అన్నంలో కొందరు విద్యార్థులకు పురుగులు దర్శనమిచ్చాయి. ఇక్కడ కొద్దిరోజులుగా ఇదేవిధంగా అన్నంలో తెల్లటి పురుగులు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. రెండో‘సారీ’ ఇటీవల ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి వెంకటేశ్వర పాణిగ్రాహి బియ్యాన్ని తనిఖీ చేసి, మొదటి బ్యాచ్లో సరఫరా చేసిన రెండు ప్యాకెట్ల పాత నిల్వ ఉన్న బియ్యాన్ని వెనక్కి తీసుకెళ్లారు. అయితే రెండో బ్యాచ్లో మళ్లీ సరఫరా చేసిన బియ్యంలో కూడా తెలుపు, నలుపు రంగుల్లో పురుగులు వస్తున్నాయని వంట చేస్తున్న ఏజెన్సీ మహిళలు తెలిపారు. దీనిపై పాఠశాల హెచ్ఎంకు సమాచారం ఇవ్వడంతో ఆయన స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రతిరోజు విద్యార్థులకు పెడుతున్న అన్నంలో పురుగులు వస్తుండడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తున్నాం గత కొద్దిరోజులుగా సన్నబియ్యం సరఫరా చేసిన వాటిలో పురుగులు వస్తున్నాయి. ఈ విషయంపై విద్యార్థులు, పాఠశాల వంట ఏజెన్సీవారి నుంచి ఫిర్యాదులు అందడంతో స్వయంగా పరిశీలించాను. దీంతో బియ్యాన్ని చేటలతో శుభ్రంచేసి వండమని సూచించాను. అయినప్పటికీ తెలుపు రంగు పురుగులు వండిన తర్వాత బయటపడుతున్నాయి. బియ్యాన్ని మార్చాల్సిందిగా తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తున్నాం. – ఎన్.చాణక్య, హెచ్ఎం, కంచిలి జెడ్పీహెచ్ స్కూల్ అన్నం తినలేకపోతున్నాను ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఈ అన్నం తినలేకపోతున్నాను. తింటుంటే ముద్ద దిగడం లేదు. ఆకలికి తట్టుకోలేక తినక తప్పడం లేదు. – పి.గంగాధర్, ఆరో తరగతి విద్యార్థి కూరగాయల అన్నంలో పురుగు బుధవారం పాఠశాల మధ్యాహ్న భోజనం మెనూలో వడ్డించిన కూరగాయల అన్నంలో నల్లటి పురుగులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో ప్రతిరోజూ ఇదేవిధంగా పురుగులు వస్తున్నాయి. దీంతో సరిగా అన్నం తినలేకపోతున్నాం. – ఎల్.చందు, ఆరో తరగతి విద్యార్థి -
అయ్యో అన్నదాత..!
అయ్యో.. అన్నదాత..!ఇచ్ఛాపురం రూరల్: ‘ఖరీఫ్ నాటికి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. రైతుల వినతి మేరకు మూలకు చేరిన ఈదుపురం ఎత్తిపోతల పథకాన్ని రూ.9 కోట్లతో పునరుద్ధరిస్తాం’ అని గతేడాది నవంబర్ 1వ తేదీన ఈదుపురం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఇవి. ఈ మాటలు చెప్పి నేటికి 8 నెలలు కావస్తున్నా ఎత్తిపోతల పథకం కోసం ఇప్పటివరకు నయా పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో సీఎం హామీపై ఆశలు పెట్టుకున్న అన్నదాతకు అవస్థలు తప్పడం లేదు. 1,200 ఎకరాలకు సాగునీరు ఇచ్ఛాపురం మండలం కొఠారీ, పూర్ణాటకం, పత్రిపుట్టుగ, ధర్మపురం గ్రామాలతో పాటు కవిటి మండలంలోని భైరిపురం, వింధ్యగిరి, రాజపురం, లండారిపుట్టుగ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉండే 1200 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే ఏకై క ఎత్తిపోతల పథకం జైకిసాన్ ఎత్తిపోతల పథకం. ఈదుపురం బాహుదా నది పక్కన 2004లో నిర్మించారు. కేవలం వర్షాధారంపై పండించే ఈ ప్రాంత రైతులకు జైకిసాన్ ఎత్తిపోతల పథకం వరంగా మారింది. రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు సక్రమంగా పంటలను పండించుకునేవారు. అయితే 2009లో కురిసిన భారీ వర్షాలకు బాహుదా నది ఉప్పొంగడంతో ఎత్తిపోతల పథకం నీట మునిగింది. దీంతో యంత్రాలు పాడైపోయాయి. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయడంతో మరో ఐదేళ్ల పాటు రైతులకు సాగునీటి ఇబ్బందులు తీరాయి. 2018 అక్టోబర్లో వచ్చిన తిత్లీ తుఫాన్కు బాహుదా వరద నీటిలో ఎత్తిపోతల పథకం 15 రోజుల పాటు ఉండిపోవడంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటు ఎత్తిపోతల పథకానికి సంబంధించి యంత్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అప్పటినుంచి ఏడేళ్లుగా 1200 ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో అక్కడి రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీతో ఈ ఏడాది ఖరీఫ్ కష్టాల నుంచి గట్టెక్కుతాం అనుకున్న రైతులకు అడియాసలే మిగిలాయి. రూ.9 కోట్లతో ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం తెస్తామన్న ఆయన హామీ నీటిమూటగా మిగిలిపోయింది. చుక్క నీరు లేదు ఈదుపురం ఎత్తిపోతల పథకానికి ఆనుకొని ఉన్న భూములకు చుక్క సాగునీరు లేకుండా పోయింది. దీంతో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో నాకు రెండు ఎకరాల పంట పొలం ఉంది. గతంలో ఎత్తిపోతల పథకం ద్వారా రబీ, ఖరీఫ్ సీజన్లలో సాగునీరు అందడం మూలంగా ఆనందంగా పంటలు పండించుకునేవాళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం సత్వరమే పథకాన్ని పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. – సంధాన పూర్ణచంద్రుడు, డి.గొనపపుట్టుగ, కవిటి సీఎం హామీ ఏమైంది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీకే పత్తా లేకుండా పోయింది. రూ.9 కోట్లతో జైకిసాన్ ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధించడం జరుగుతుందని ఆయన చెప్పడంతో వందలాది మంది రైతులు సంతోషించారు. ఈయన హామీకి నేటికి ఎనిమిది నెలలు కావస్తోంది. 2016లో కొఠారీ ఉమ్మడి చెరువు వద్ద పైపులైన్ ధ్వసం కావడంతో శివారు ప్రాంతాలకు సాగునీరు అందకుండా పోయింది. రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని పథకానికి జీవం పోస్తే మంచి జరుగుతుంది. – దుక్క ధనలక్ష్మి, సర్పంచ్, కొఠారీ, ఇచ్ఛాపురం పత్తా లేకుండా పోయిన సీఎం చంద్రబాబు హామీ మూలకు చేరిన ఈదుపురం ఎత్తిపోతల పథకం మొదలైన ఖరీఫ్ కష్టాలు -
చీకట్లో వైద్యారోగ్య శాఖ కార్యాలయం
● వారం రోజులుగా సింగిల్ ఫేజ్ విద్యుత్తో ఉద్యోగుల అవస్థలు అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం అంధకారంలో ఉంది. నాలుగు అంతస్తుల్లో వివిధ హోదాల్లో వైద్యాధికారుల ఛాంబర్లు పనిచేస్తుండగా.. ఏకంగా వారం రోజులు నుంచి ఎక్కడా పూర్తిస్థాయిలో విద్యుత్ సప్లయ్ లేకుండాపోయింది. దీంతో వైద్య శాఖలో కీలక ఫైళ్లు పెండింగ్లో ఉండాల్సి వస్తోంది. విద్యుత్ పూర్తిస్థాయి సప్లయ్ లేకపోవడంతో సింగిల్ ఫేజ్ అవస్థలు ఉద్యోగులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. నిత్యం వందలాది మంది రాకపోకలతో హడావుడిగా ఉండాల్సిన కార్యాలయంలో కంప్యూటర్లు పని చేయ్యక నిత్యం ఉన్నతాధికారులకు పంపాల్సిన నివేదికలు కూడా పెండింగ్లో పడ్డాయి. కొందరు కంప్యూటర్ ఆపరేటర్ల సొంత ల్యాప్ట్యాప్ల ద్వారా కొంత మేరకు ఎమర్జెన్సీ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతానికి సింగిల్ ఫేజ్ వలన కొన్ని స్విచ్ బోర్డులు మాత్రమే పని చేస్తుండడంతో అక్కడికి డెస్క్టాప్ కంప్యూటర్లను తీసుకుని వెళ్లి ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి వస్తుంది. అయినప్పటికీ విద్యుత్ అవస్థలపై సంబంధిత విద్యుత్ శాఖకు ఇంతవరకు ఎవరూ ఫిర్యాదులు చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొందరు ఉద్యోగులు మార్నింగ్ హాజరు వేసుకుని ఎంచక్కా సొంత పనుల్లో బిజీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు కార్యాలయంలో విధులు చేపట్టకుండా బయటే తిరుగుతున్నట్లు సమాచారం. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, జిల్లా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డీసీహెచ్ఎస్ అఽధికారి కూడా ఇదే భవనంలో ఉంటున్నప్పటికీ.. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికై నా పూర్తిస్థాయి విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు. -
విధులు చెబుతారు.. నిధులు ఇవ్వరు
శ్రీకాకుళం న్యూకాలనీ: సర్కారు రికార్డుల పిచ్చి టీచర్లకు తలనొప్పిగా మారింది. కనీస నిధులు ఇవ్వకుండా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్(పీటీఎం) పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడి సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. గిన్నిస్బుక్లో రికార్డుల కోసం అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులను నానా అవస్థలకు గురి చేస్తున్నారు. పీటీఎం కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను పిలిచి విద్యార్థుల ప్రగతిని వివరించడం.. వారికి అక్కడే మధ్యాహ్న భోజనం, క్రీడల నిర్వహణ, సమావేశం, అతిథులు ప్రసంగాలు.. ఇలా ఉదయం 9 గంటల నుంచే వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం పాఠశాలల్లో 17 రకాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిల మేరకు కొన్ని కుదించారు. ఆహ్వాన పత్రికలు, వేదికల ఏర్పాట్లు, బహుమతుల ప్రదానం, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించడం.. ఇలా వివిధ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ బాధ్యతంతా ఉపాధ్యాయులపైనే పడుతోంది. బోధనకు దూరంగా టీచర్లు.. నిన్న యోగాంధ్ర.. నేడు పేరెంట్స్ మీట్ అంటూ టీచర్లను సమావేశాలకు, సన్నాహాలకు పరిమితం చేస్తుండడంతో వారు బోధనకు దూరమవుతున్నారు. తాజాగా రెండు వారాల నుంచి తల్లిదండ్రుల సమావేశామంటూ నానా హంగామా చేస్తున్నారు. హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డుల పేరిట చాంతడంత డేటాను పూరిస్తున్నారు. దీంతో విద్యాబోధన రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంలా తయారైంది. దీనికి తోడు తమ ప్రచార యావ, రికార్డుల కోసం ఉపాధి హామీ పథకం వేతనదారులను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు సంరక్షకులుగా వారిని వినియోగించుకుని ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. అంతా ‘లీప్’ యాప్లోనే.. తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా సమావేశం జరిగిన వెంటనే 30 సెకన్ల వీడియో, మూడు ఫొటోలను లీప్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. విద్యార్థులతో మొక్కలు నాటించడం.. దాన్ని లీప్ యాప్లో నమోదు చేయించడం, ప్రతి మూడు నెలలకు ఆ మొక్క ఫొటోలను అప్లోడ్ చేయించడం ఇదంతా ఉపాధ్యాయుల పనే. దీనిపై టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతిచమురు వదులుతోంది.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వీఐపీలు, అతిథులు, పూర్వపు విద్యార్థులు, దాతలు ఇలా అనేక మందిని పేరెంట్ టీచర్స్ మీటింగ్కు ఆహ్వానిస్తున్నారు. వీరిందరికీ భోజనాలు, స్నాక్స్ తో పాటు ఇతరత్రా ఏర్పాట్లకు కనీసం రూ.70వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. పాఠశాల గ్రాంట్ కింద కనీస నిధు లు విదల్చకుండా అందులో 20 శాతం వాడుకోండని ఆదేశాలివ్వడంపై హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు మండిపడుతున్నారు. స్థానికంగా ఉండే టీచర్లు, లెక్చరర్లు గత్యంతరం వారే తలా కొంత డబ్బులు వేసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమ పనితీరుకు ‘సాక్ష్యం’పై గుర్రు.. పేరెంట్ టీచర్స్ సమావేశాల పర్యవేక్షణకు ఒక్కో పాఠశాల, కళాశాలలకు ఇతర శాఖల నుంచి ఒక ఉద్యోగిని కేటాయించారు. వీరు కార్యక్రమ నిర్వహణకు సాక్షిగా ఉంటారని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో, స్థానికంగా ఉండే ఉద్యోగులు(ఐడీ నంబర్తో), పెద్దలను(ఆధార్ నంబర్తో) నియమించుకోవచ్చని సర్దుబాటు ఉత్తర్వులు ఇచ్చింది. పరీక్షలు లేని ప్రోగ్రెస్ కార్డులు ఎందుకు..? ఈ ఏడాది ఇప్పటి వరకు ఎలాంటి పరీక్షలు జరగలేదు. ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డులు ఎందుకో అర్థం కావడం లేదు. ఊరికే సమావేశం తప్ప ప్రయోజనం లేదు. – తమ్మినేని చందనరావు, ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రికార్డుల కోసం మీటింగులు తగదు.. గిన్నిస్బుక్లో రికార్డుల కోసం రాష్ట్రప్రభుత్వం పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 ను నిర్వహిస్తుండటం బాధాకరం. పూర్తిస్థాయిలో నిధులు కేటాయింపు చేయలేదు. టీచర్లే తలా చేయి వేసి నిర్వహిస్తున్నారు. –బి.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్(1938) జిల్లా ప్రధాన కార్యదర్శి -
సమస్యలు తీర్చే వరకు గ్రామాన్ని వీడేది లేదు
సంతబొమ్మాళి: తమ సమస్యలు తీర్చే వరకు గ్రా మాన్ని విడిచివెళ్లే ప్రసక్తి లేదని మూలపేట గ్రామస్తులు టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తికి తేల్చి చెప్పారు. పోర్టు పునరావాస గ్రామమైన మూలపేట గ్రామస్తులతో మంగళవారం ఆర్డీఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్వాసితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ముందుగా భూములు ఇచ్చిన వారికి ఎకరాకు రూ.25లక్షలు చెల్లించారని, భూములు ఇవ్వనివారికి రూ. 25 లక్షలతో పాటు ఎకరాకు అదనంగా రూ. 12,50,000 లు చెల్లించారని, అందరికీ సమన్యాయం చేయాలని కోరారు. తమ గ్రామంలో కనీసం ఉపాధి పనులు కూడా కల్పించ డం లేదని వాపోయారు. పోర్టు యాజమాన్యం నిర్మించిన బ్రిడ్జిని వారే తొలగించారని, నౌపడ వెళ్లే రహదారిలో ఉన్న పాత బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో పదిమందికి పైగా గర్భిణులు ఉన్నారని, వైద్యం కోసం బయటకు వెళ్లాలంటే రహదారి అ ధ్వానంగా ఉందని తెలిపారు. సమావేశం అనంతరం ఆర్డీవో గ్రామంలో ఇంటింటా తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో తహసీల్దార్ హేమచంద్రరావు, ఎంపీడీఓ జయంత్ ప్రసాద్, టెక్కలి సీఐ శ్రీనివాసరావు, నౌపడ, సంతబొమ్మాళి ఎస్ఐలు నారాయణస్వామి, సింహాచలం వివిధ శాఖల అధికారులు ఉన్నారు. ఆర్డీవోకు తేల్చి చెప్పిన మూలపేట గ్రామస్తులు -
ఆమదాలవలస మండలానికి చేరిన కిట్లు
శ్రీకాకుళం: ఆమదాలవలస మండలంలోని పాఠశాలలకు మంగళవారం కిట్లు, యూనిఫారాలు సరఫరా అయ్యాయి. ‘రాష్ట్ర అధికారులకు సమాచారం ఇవ్వరా..?’ పేరిట ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. మంగళవారం జిల్లాకు వచ్చిన యూనిఫారాల కిట్లను ఆమదాలవలస మండలానికి పంపించారు. అయితే మెగా టీచర్ పేరెంట్స్ మీటింగ్ డే నాటికి వీటిని కుట్టడం కుదరదని టీచర్లు తేల్చి చెప్పేశారు. ఇంకా ఐదు మండలాలకు కిట్లు, యూనిఫారాలు రావాల్సి ఉండడంతో ఏపీసీకి ఆ బాధ్యతలను అప్పగించారు. జిల్లాలోని చాలా పాఠశాలల్లో అదనంగా ఉన్న కిట్లు, యూనిఫారాలు సేకరించి సరఫరా కాని మండలాలకు పంపించాలని ఆదేశించారు. విద్యాసంస్థల వద్ద నిషేధిత ఉత్పత్తులు అమ్మితే చర్యలు శ్రీకాకుళం క్రైమ్ : విద్యాసంస్థల పరిసరాల్లో నిషేధిత గంజాయి, పొగాకు ఉత్పత్తులు క్రయవిక్రయాల జరిపితే కఠిన చర్యలు తీసుకుంటా మని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా డీజీపీ హరీష్గుప్తా ఆదేశాల మేరకు ఎస్పీ మంగళవారం ప్రకటన జారీ చేశారు. దీనిలో భాగంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్స్టేషన్లు పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది, ఈగల్ టీం, రెవెన్యూ, ఇతర శాఖల సమన్వయంతో పాఠశాలలు, కళాశాలలకు వందమీటర్ల దూ రంలో ఉన్న పాన్ కిరాణా దుకాణాల్లో సిగరె ట్లు, ఖైనీ, గుట్కా, గంజాయి తదితర ఉత్పత్తులు అమ్మరాదని, ఐదురోజుల పాటు డ్రైవ్ లో భాగంగా పోలీసుల తనిఖీలు ఉంటాయన్నారు. మొదటి దశలో తనిఖీల్లో దొరికితే జరిమానాలుంటాయని, తర్వాత దశలో కేసులు కడతామన్నారు. కనీసం ఐదు ఇళ్లకు వెళ్లండి: కలెక్టర్శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఈ నెల 10న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. బుధ వారం ఉదయం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కనీసం ఐదు ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను ఈ సభకు ఆహ్వానం పలకాలని అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం జా యింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఇదే సమయంలో జిల్లా పర్యటనలో ఉన్న కలెక్టర్ కారులో నుంచి వీసీలో మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్పై ఆశయాలను ఒక పేరాలో రాసి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ప్రతి బుధవారం నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పేరుతో పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఉపాధి హామీ పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, కంపోస్ట్ గుంతలు, నీటిని చేర్చే గుంతల పనులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. విద్యుత్ అంతరాయాలు లేకుండా చర్యలు అరసవల్లి: జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ అందించే లా చర్యలు చేపట్టాలని ఈపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వనజ అధికారులను ఆదేశించారు. ఈమేరకు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఆమె జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనులను పరిశీలించారు. అంతకుముందు పలు విద్యుత్ అభివృద్ధి పనులను పరిశీలించి నాణ్యతాపరంగా పలు సూచనలు చేశారు. జిల్లాలో పనుల ప్రగతిని జిల్లా సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆమెకు వివరించారు. అంతకుముందు ఆమె జిల్లా విద్యుత్ స్టోర్స్ను పరిశీలించారు. అలాగే కిల్లిపాలెంలో జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనులను ఆమె స్వ యంగా పర్యవేక్షించారు. చిలకపాలెంలోని రెండు 33 కేవీ ఫీడర్లను పరిశీలించి మెరుగైన చర్యలకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో సీజీ ఎం ప్రసాద్, ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు, టెక్నికల్ ఈఈ సురేష్కుమార్, డిప్యూటీ ఈఈ వెంకటేశ్వరరావు, స్టోర్స్ ఏడీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడు అరెస్టు
కొత్తూరు: మండలంలోని వసప గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో మంగళవారం హాజరు పరిచినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు. నిందితుడు శంకరరావు నిర్వహిస్తున్న పాస్ట్ఫుడ్ సెంటర్కు మృతుడు మిన్నారావు పకోడి, బజ్జీలు కొనుగోలు చేసేందుకు ప్రతిరోజూ వెళ్తుంటాడు. దీనిలో భాగంగా మృతుడు మిన్నారావు ఈనెల 5వ తేదీ రాత్రి శంకరావు పాస్ట్ఫుడ్ సెంటర్కు వెళ్లి పకోడి కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇద్దరు మధ్యం వివాదం జరిగింది. మిన్నారావు గతంలో బాకీ డబ్బులు ఇవ్వకపోవడంతో బాకీ విషయంలో ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది. కొట్లాటలో మిన్నారావు తలపై సుత్తితో తల వెనుకభాగంలో కొట్టడంతో పాటు చాకుతో పీకను కోసి చంపినట్లు సీఐ ఎండీ అమీర్ అలీ పాల్గొన్నారు -
పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు
బూర్జ: మండలంలోని పాలవలస జెడ్పీహెచ్ స్కూల్, అల్లెన ప్రాథమికోన్నత పాఠశాలల్లో డీఈవో డాక్టర్ తిరుమల చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా పాలవలస జెడ్పీ హైస్కూల్ పరిశీలించారు. విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరుపై ఎంఈవోలు ఎన్.శ్యామసుందరరావు, బి.ధనుంజయరావులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యాబోధన ఏవిధంగా ఉందో విద్యార్థులకు ప్రశ్నలు అడిగి తెలసుకున్నారు. అల్లెన పాఠశాలలో విద్యార్థులు పాలవలస పాఠశాలలో మెర్జి చేయడంతో తల్లిదండ్రులు పంపించే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. అయితే 100 మంది విద్యార్థులు ఉంటే గానీ యూపీ స్కూల్ కొనసాగించలేమని డీఈవో పేర్కొన్నారు. ఆయనతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. హోంగార్డు కుటుంబానికి చేయూత శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసుశాఖలో హోంగార్డుగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు పి.జగన్నాథంకు జిల్లా హోంగార్డుల యూనిట్ ఒక్కరోజు వేతనం రూ.4.09 లక్షలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి చేతులమీదుగా అందజేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జగన్నాథంకు చెక్ అందించారు. మా భూములు తీసుకోవద్దు నరసన్నపేట: ఎంఎస్ఎంఈవో పార్క్ నిమిత్తం తమ భూములు తీసుకోవడానికి ప్రభుత్వం చూస్తోందని, తమ భూములు తీసుకోవద్దని మండలంలోని జమ్ము గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు బమ్మిడి రామారావు, తలసముద్రం రాజారావు, తాడి మొఖలింగంలతో పాటు పలువురు రైతులు రెవెన్యూ అధికారులకు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. 40 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం తమ జీవానాధారానికి భూములను ఇచ్చిందని, ఇప్పుడు ఇండస్ట్రీయల్ పార్క్ పేరిట తాము సాగు చేసి పంటలు పండించుకుంటున్న భూములు తీసుకోవడానికి అధికారులు చూస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ఇది ఏమాత్రం తగదని పేర్కొన్నారు. ఆర్ఐ సాయిరాంతో పాటు వీఆర్వో, సర్వేయర్లు వచ్చి సోమవారం కొలతలు వేశారన్నారు. తమ భూముల వైపు అధికారులు రావద్దని కోరారు. ‘ముప్పై ఏళ్లు టీడీపీలో కష్టపడ్డా.. గుర్తింపేదీ..?’ రణస్థలం: తాను ముప్పై ఏళ్లు టీడీపీలో కష్టపడ్డానని అయినా గుర్తింపు ఇవ్వలేదని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ముక్కు ఆదినారాయణ అన్నారు. మండలంలోని రావాడ పంచాయతీలో తన ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశానని, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశానని చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గ మార్కెట్ చైర్మెన్ ఎస్సీ రిజర్వేషన్ అయిందని, అన్ని అర్హతలుండి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే తనను నామినేట్ చేయకుండా వేరేవాళ్లకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. దీనికి నిరసనగా తాను పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తానని, అలాగే టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని తెలిపారు. విజిలెన్స్ దాడులు రణస్థలం: మండల కేంద్రంలోని రామతీర్థాలు రహదారిలో జే.ఆర్.పురంలో ఉన్న ఎరువుల దుకాణంపై విజిలెన్స్, వ్యవసాయ అధికారులు మంగళవారం దాడులు చేపట్టారు. దీనిలో భాగంగా స్టాక్ రిజిస్టర్తో ఎరువుల భౌతిక నిల్వలను పోల్చితే వ్యత్యాసాలు కనిపించాయి. అలాగే అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ఎరువులను స్వాధీనం చేసుకొని, దుకాణం డీలర్పై 6ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రామారావు, కానిస్టేబుల్ ఈశ్వర్, మండల వ్యవసాయ ఏవో డి.విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
క్షోభంలో క్షేమం..!
● ఏడాదిగా వసతి గృహాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం ● అరకొర వసతులతో కాలం వెళ్లదీత ● తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య ● పట్టించుకోని అధికారులు సంక్షేమ వసతి గృహాధికారులు ఎక్కడా అందుబాటులో నివాసం ఉండే పరిస్థితి లేదు. ఒకొక్క వార్డెన్కి రెండు, మూడు వసతి గృహాల ఇన్చార్జిల బాధ్యతలు ఉంటున్నాయి. ఇవి కూడా కనీసం 30 కిలోమీటర్ల దూరంలో ఇస్తున్నారు. సాధారణంగా ఇన్చార్జిగా దగ్గరలో ఉన్న వసతి వార్డెన్కు బాధ్యతలు ఇవ్వాల్సి ఉన్నా, ప్రస్తుతం బీసీ సంక్షేమంలో ఇందుకు భిన్నంగా ఉంది. దూరప్రాంతాల్లో ఉన్నవారికి బాధ్యతలు ఇస్తున్నారు. దీంతో వసతి గృహ నిర్వహణ కిందిస్థాయి సిబ్బంది, అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై విడిచి పెడుతున్నారు. మరోవైపు ఏడాదిగా వసతి గృహాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. అధికారులు కార్యాలయానికే పరిమితం కావడం, వ్యక్తిగత లాభాపేక్ష చూసుకుంటుండడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. అలాగే వైఎస్సార్సీపీ హయాంలో వసతి గృహాల ఆధునికీకరణ పనులు చేపట్టి ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు కృషి చేయగా, నేడు భవనాలకు పడుతున్న బూజును కూడా శుభ్రం చేయడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని వసతి గృహాలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఏడాదిగా సంక్షేమ శాఖ వసతి గృహాలు, అక్కడ చదువుతున్న విద్యార్థులను పట్టించుకోవడం లేదు. దీంతో సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. జిల్లాలో బీసీ వసతి గృహాలు ప్రీ మెట్రిక్ స్థాయిలో 63 ఉన్నాయి. వీటిలో వసతులు లేవు. కొన్ని అద్దె భవనాల్లో ఉండగా, వాటి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఇక ఎస్సీ వసతి గృహాలు ప్రీ మెట్రిక్లో సుమారుగా అన్ని ప్రభుత్వ భవనాలే అయినప్పటికీ, అక్కడ కూడా అరకొర వసతులతోనే కాలం గడుపుతున్నారు. మెనూ అమలు ఎక్కడ..? సంక్షేమ వసతి గృహ అధికారులు విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెనూ అమలు చేయడం లేదు. దీనిపై కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తే వారికి అడ్డగోలు సమాధానాలు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులు సకాలంలో మంజూరు చేయడం లేదని చెప్పడం, లేకుంటే ఎదుదాడికి దిగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మెనూ అమలులో ఉంది. ప్రతి ఏటా మారుతున్న మెనూ అమలు చేయాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు ఇటీవల పురుగులు పట్టిన బియ్యం అందజేస్తుండడంతో వసతి గృహం పేరు చెబితేనే విద్యార్థులు భయపడుతున్నారు. క్షోభంలో క్షేమం..! కొరవడిన పర్యవేక్షణ శ్రీకాకుళం బాలుర ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు భోజనం పెడుతున్న దృశ్యం (ఫైల్)తగ్గుతున్న విద్యార్థులు బీసీ, ఎస్సీ వసతి గృహల్లో విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది ఘననీయంగా తగ్గింది. వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెట్రిక్ పరిధిలో జిల్లాలో 53 బాలురు, 10 బాలికల బీసీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 2024–25 విద్యా సంవత్సరంలో బాలురు 4,019 మంది, బాలికలు 1,070 మంది కలిపి మొత్తం 5,086 మంది ఉండేవారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరంలో బాలురు 3,269 మంది, బాలికలు 894 మంది కలిపి మొత్తం 4,163 మంది ఉన్నారు. అంటే ఒక ఏడాది కాలంలో 923 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదేవిధంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 17 బాలురు, 14 బాలికల ఎస్సీ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 2024–25 విద్యా సంవత్సరంలో బాలురు 1,352 మంది, బాలికలు1,438 మంది కలిపి మొత్తం 2,790 మంది విద్యార్థులు ఉండేవారు. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో బాలురు 1,122 మంది, బాలికలు 1,110 మంది కలిపి మొత్తం 2,232 మంది ఉన్నారు. అంటే ఒక ఏడాది కాలంలో 558 మంది తగ్గారు. -
10 కేజీల గంజాయి స్వాధీనం
● ఇద్దరు వ్యక్తులు అరెస్టు నరసన్నపేట: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న 10 కేజీల గంజాయిని నరసన్నపేట పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు బసంత మహాపాత్రో, సిద్దాంత స్వైన్లను అరెస్టు చేసినట్లు నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్తో కలిసి ఆయన తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎప్పటిలాగే మడపాం టోల్ గేట్ వద్ద నరసన్నపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ తదితరులు మంగళవారం ఉదయం వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో సోదాలు చేయగా వీరి వద్ద గంజాయి గుర్తించామన్నారు. వీరిద్దరూ ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా రంభ పోలీసుస్టేషన్ పరిధిలోని కొండాలి గ్రామం నుంచి అక్రమంగా గంజాయిని బెంగళూరు తరలిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీంతో గంజాయిని సీజ్చేసి, కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. గంజాయి రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి అమ్మకాలు, రావాణాకు సంబంధించి సమాచారం తెలిస్తే తెలియజేయాలని కోరారు. -
కంచిలిలో భారీ చోరీ
కంచిలి: మండల కేంద్రం కంచిలిలో భారీ చోరీ జరిగింది. మెయిన్రోడ్డులో నివాసముంటున్న విశ్రాంత లెక్చరర్ సింహాద్రి ప్రధాన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. బీరువాలో భద్రపరిచిన 24.5 తులాల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితుడు చెప్పిన వివరాల మేరకు.. తమ పెద్ద కుమారుడు జర్మనీ నుంచి ఇండియాకు వచ్చి, విశాఖపట్నంలో తమ వియ్యంకుడు ఇంట్లో ఉండడంతో వారిని కలవడానికి శనివారం ఉదయం భార్యతో కలిసి వెళ్లారు. తిరిగి ఆదివారం సాయంత్రం కంచిలిలో తన నివాసానికి చేరుకున్నారు. వారు ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్తో పాటు ముందున్న గ్రిల్ తెరిచి ఉన్నాయి. ఇనుప గ్రిల్ డోర్కు తాళం వేసి ఉన్న భాగాన్ని కట్చేసి, మెయిన్డోర్ లాక్ను తెరిచి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన 24.5 తులాల బంగారు ఆభరణాలను, ఒక కిలో వెండి ఆభరణాలను దొంగిలించినట్లు తెలుసుకొని షాక్కు గురయ్యారు. అమెరికాలో చదువుకుంటున్న చిన్న కుమారుడు విదేశీ చదువు కోసం చేసిన బ్యాంకు రుణాన్ని తీర్చడానికి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను సిద్ధం చేసి ఒక చోట భద్రపర్చగా, అవి చోరీకి గురైనట్లు వాపోయాడు. ఆలస్యంగా ఫిర్యాదు అయితే ఆదివారం సాయంత్రం విశాఖపట్నం నుంచి కంచిలి వచ్చిన వీరు తమ ఇంట్లో జరిగిన చోరీపై నిర్ఘాంతపోయారు. ఏం చేయాలో తెలియక పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. చివరికి కంచిలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో స్థానిక ఎస్ఐ పి.పారినాయుడు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ కేసును సోంపేట సీఐ బి.మంగరాజు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు పరిశీలించారు. సంఘటన స్థలంలో గుర్తులు, ఆధారాలను సేకరించడానికి శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్ వచ్చింది. 24.5 తులాల బంగారు ఆభరణాలు, ఒక కిలో వెండి మాయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనం ఆలస్యంగా వెలుగులోకి ఘటన -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
గార: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి కె.హరిబాబు అన్నారు. మంగళవారం అంపోలు వద్దనున్న జిల్లా జైలును ఆయన సందర్శించి న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. సమాజంలో మంచి గుర్తింపు వచ్చేలా ప్రవర్తన ఉండాలని సూచించారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. న్యాయవాదిని నియమించుకోలేని ఆర్థిక స్థోమత లేని ముద్దాయిలకు ఉచిత న్యాయవాదిని నియమించడం జరుగుతుందన్నారు. ముద్దాయిల అభ్యర్థనతో కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యం సదుపాయాలను, బ్యారెక్లు, లైబ్రరీ, వంట గదులను పరిశీలించారు. ఆయన వెంట ఇన్చార్జి సూపరిటెండెంట్ జి.మధుబాబు, జైలర్ దివాకరనాయుడు, పి.అంజనీకుమార్ సిబ్బంది పాల్గొన్నారు. -
నిధులు ఇవ్వరు
విధులు చెబుతారు.. మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ● మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కోసం ప్రభుత్వం హడావుడి ● వారం రోజులుగా బోధనకు దూరంగా టీచర్లు ● ప్రభుత్వ నిర్వాకంతో చేతి చమురు వదిలించుకుంటున్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు ● ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కార్యక్రమానికి రూ. లక్ష వరకు ఖర్చు ● రికార్డుల కోసం పాకులాట అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వీఐపీలు, అతిథులు, పూర్వపు విద్యార్థులు, దాతలు ఇలా అనేక మందిని పేరెంట్ టీచర్స్ మీటింగ్కు ఆహ్వానిస్తున్నారు. వీరిందరికీ భోజనాలు, స్నాక్స్ తో పాటు ఇతరత్రా ఏర్పాట్లకు కనీసం రూ.70వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతున్నట్టు ప్రచారం సాగుతోంది. పాఠశాల గ్రాంట్ కింద కనీస నిధు లు విదల్చకుండా అందులో 20 శాతం వాడుకోండని ఆదేశాలివ్వడంపై హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు మండిపడుతున్నారు. స్థానికంగా ఉండే టీచర్లు, లెక్చరర్లు గత్యంతరం వారే తలా కొంత డబ్బులు వేసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: సర్కారు రికార్డుల పిచ్చి టీచర్లకు తలనొప్పిగా మారింది. కనీస నిధులు ఇవ్వకుండా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్(పీటీఎం) పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడి సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. గిన్నిస్బుక్లో రికార్డుల కోసం అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులను నానా అవస్థలకు గురి చేస్తున్నారు. 3182 విద్యాసంస్థల్లో పేరెంట్స్ మీట్.. జిల్లాలో మొత్తం 3017 పాఠశాలు ఉండగా, వీటిలో ప్రైవేటు పాఠశాలలు 389 ఉన్నాయి. అలాగే మొత్తం 165 జూనియర్ కళాశాలు ఉండగా, వీటిలో ప్రైవేటు కళాశాలలు 71 ఉన్నాయి. ఒకటి నుంచి ఇంటర్ వరకు 3.04లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పీటీఎం కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులను పిలిచి విద్యార్థుల ప్రగతిని వివరించడం.. వారికి అక్కడే మధ్యాహ్న భోజనం, క్రీడల నిర్వహణ, సమావేశం, అతిథులు ప్రసంగాలు.. ఇలా ఉదయం 9 గంటల నుంచే వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం పాఠశాలల్లో 17 రకాల కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిల మేరకు కొన్ని కుదించారు. ఆహ్వాన పత్రికలు, వేదికల ఏర్పాట్లు, బహుమతుల ప్రదానం, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించడం.. ఇలా వివిధ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ బాధ్యతంతా ఉపాధ్యాయులపైనే పడుతోంది. బోధనకు దూరంగా టీచర్లు.. నిన్న యోగాంధ్ర.. నేడు పేరెంట్స్ మీట్ అంటూ టీచర్లను సమావేశాలకు, సన్నాహాలకు పరిమితం చేస్తుండడంతో వారు బోధనకు దూరమవుతున్నారు. తాజాగా రెండు వారాల నుంచి తల్లిదండ్రుల సమావేశామంటూ నానా హంగామా చేస్తున్నారు. హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డుల పేరిట చాంతడంత డేటాను పూరిస్తున్నారు. దీంతో విద్యాబోధన రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంలా తయారైంది. దీనికి తోడు తమ ప్రచార యావ, రికార్డుల కోసం ఉపాధి హామీ పథకం వేతనదారులను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులకు సంరక్షకులుగా వారిని వినియోగించుకుని ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. అంతా ‘లీప్’ యాప్లోనే.. తల్లిదండ్రుల సమావేశం సందర్భంగా సమావేశం జరిగిన వెంటనే 30 సెకన్ల వీడియో, మూడు ఫొటోలను లీప్ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. విద్యార్థులతో మొక్కలు నాటించడం.. దాన్ని లీప్ యాప్లో నమోదు చేయించడం, ప్రతి మూడు నెలలకు ఆ మొక్క ఫొటోలను అప్లోడ్ చేయించడం ఇదంతా ఉపాధ్యాయుల పనే. దీనిపై టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పనితీరుకు ‘సాక్ష్యం’పై గుర్రు.. పేరెంట్ టీచర్స్ సమావేశాల పర్యవేక్షణకు ఒక్కో పాఠశాల, కళాశాలలకు ఇతర శాఖల నుంచి ఒక ఉద్యోగిని కేటాయించారు. వీరు కార్యక్రమ నిర్వహణకు సాక్షిగా ఉంటారని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో, స్థానికంగా ఉండే ఉద్యోగులు(ఐడీ నంబర్తో), పెద్దలను(ఆధార్ నంబర్తో) నియమించుకోవచ్చని సర్దుబాటు ఉత్తర్వులు ఇచ్చింది. చేతిచమురు వదులుతోంది.. -
దారి పొడవునా ఇసుక నిల్వలు
నరసన్నపేట: మండలంలో వంశధార నది పొడవునా ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారు. ఇసుక నిల్వలు పెద్ద ఎత్తున నదీ పరిసర గ్రామాల్లో వేశారు. వర్షాకాలంలో నదిలో నీరు వస్తే అమ్మకాలు చేసుకునేందుకు వీలుగా ఎక్కడికక్కడ ఇసుక పోగులు కొన్ని వేల క్యూబిక్ మీటర్లు వేశారు. బుచ్చిపేట వద్ద అధికారికంగా డంపింగ్ యార్డు నిర్వహిస్తుండగా దాన్ని తలదన్నే విధంగా లారీ, ట్రాక్టర్ ఓన్లు కూడా ఇసుక పోగులు దాడి పొడవునా వేశారు. మడపాం నుంచి బుచ్చిపేటకు వెళ్లే మార్గంలో అడుగడుగునా ఇసుక నిల్వలు ఉన్నాయి. అలాగే లుకలాం, అంబోజీపేట, చేనులవలస, గోపాలపెంట తదితర గ్రామాల్లో కూడా ఇసుక నిల్వలు ఉన్నాయి. ఉచితంగా నది నుంచి తవ్వి అధిక ధరలకు అమ్ముకునేందుకు ఈ విధంగా పోగులు వేసినట్లు తెలుస్తోంది. బుచ్చిపేట రోడ్డుకు ఆనుకుని జీడి తోటల్లో కూడా అధికంగా నిల్వలు ఉన్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)లో అర్జీదారుల నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఒక సమయంలో అర్జీలు ఇచ్చేందుకు ఫిర్యాదుదారులు గుమిగూడడంతో కలెక్టర్ చొరవ తీసుకొని, ఆయనే స్వయంగా వెళ్లి వారిని క్యూలో పెట్టారు. అర్జీదారులు గుంపులుగా రావడం వలన వారు చెప్పే విషయం తెలియడం లేదని, అందరూ సంయమనం పాటించాలని కోరారు. దీనిలో భాగంగా రెవెన్యూ, పంచాయతీ రాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, డీసీహెచ్ఎస్, ఏపీఈపీడీసీఎల్, గృహ నిర్మాణ శాఖ, సర్వే అండ్ లాండ్ రికార్డులు, వ్యవసాయం, దేవదాయ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల సమస్యలపై 60 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో ఎల్ఎన్ వి.శ్రీధర్ రాజ తదితరులు ఉన్నారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొన్ని వినతులు పరిశీలిస్తే... ● పాతపట్నం మండలం యాగంటి అప్పన్నమ్మ వారసులు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల కూడా రాసి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. తనకు తన ఆస్తిని అమ్ముకోనే విధంగా, తన ఆరోగ్యం బాగులేనందున వైద్యం చేయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ● ఎయిడ్స్ కంట్రోల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు గతంలో తొలగించబడిన నాగభూషణరావుని తిరిగి విధుల్లోకి తీసుకోవద్దని కోరారు. ● ఎచ్చెర్ల మండలం బడివానిపేట గ్రామ పంచాయతీ జాలారి కొయ్యాం, బడివానిపేట గ్రామ పంచాయతీల్లో గల సర్వే నంబర్లు 341, 342, 430, 431, 437లోని భూముల్లో సాగులో ఉన్నవారికి పట్టాలు మంజూరు చేయాలని మత్స్యకారులు కోరారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మీకోసంలో 60 అర్జీల స్వీకరణ -
ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వరా..?
● సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీపై రాష్ట్ర అధికారుల ఆగ్రహం శ్రీకాకుళం: జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు రాష్ట్రస్థాయికి చెందిన ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారాన్ని అందించడం లేదని ఎస్పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఏపీసీలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు దీనిలో భాగంగా ఈనెల 10వ తేదీన జరగనున్న తల్లిదండ్రుల సమావేశానికి సంబంధించిన విషయాలపై చర్చించారు. అయితే శ్రీకాకుళం జిల్లాలోని ఆరు మండలాలకు యూనిఫాంలు, బూట్లు రాలేదని ఏపీసీ చెప్పగా, ఇప్పటివరకు రాష్ట్రస్థాయికి ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా పేరెంట్స్ డే జరగాల్సి ఉన్నా ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. సమావేశం రోజు తల్లిదండ్రులు ఆరోపిస్తే రాష్ట్ర అధికారులు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, అయినా తనకేమీ పట్టనట్లు వ్యవహరించడమేంటని ఏపీసీని నిలదీసినట్లు బోగట్ట. చివరి స్థానంలో శ్రీకాకుళం రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా చట్టచివర స్థానమైన 26లో ఉంటుందని ఎస్పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఐదు సెక్టోరియల్ పోస్టులు రెండు నెలలకు పైబడి ఖాళీగా ఉంటే నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సెక్టోరియల్ అధికారులు లేకుండా పర్యవేక్షణ ఎలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్కొక్కరినీ రాజకీయ నాయకుల వద్దకు తీసుకు వెళ్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇటువంటి విధానాలు మానుకొని తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే సీఎంవో పోస్టుకు ఒక హెచ్ఎంను సిఫార్సు లేఖతో రాష్ట్రస్థాయికి పంపించడంతోనే ఎస్పీడీ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సదరు హెచ్ఎం ఏపీసీ బంధువుల గ్రామంలో ఉండడం వలన ఆయనను సీఎంవోగా నియమించేందుకు ఏపీసీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని ఇప్పటికే ఆగ్రహంతో ఉండగా, జిల్లాలోని ఆరు మండలాలకు కిట్లు రాలేదని సమావేశంలో చెప్పడంతో మరింత ఆగ్రహానికి కారణమైనట్లు తెలియవచ్చింది. ఈ విషయాలను ఏపీసీ శశిభూషణ్ వద్ద సాక్షి ప్రస్తావించగా తానే ఆరు మండలాలకు యూనిఫాంలు, బూట్లు రాలేదని ఎప్పుడు పంపిస్తారని అడిగానని చెప్పారు. తనపై ఎవరూ ఆగ్రహం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. సీఎంవోగా నియమితుడైన హెచ్ఎం తన బంధువు కాదని స్పష్టం చేశారు. 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలు మొదటి, రెండవ సంవత్సరాలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు విద్యకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సమావేశంలో తెలియజేసుకోవచ్చన్నారు. ఏక్ పేడ్ మాకీ నామ్ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ నుంచి మొక్కలు సరఫరా చేస్తామని, విద్యాలయాల ఆవరణలో నాటాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజనం కూడా కలిసి చేయాలన్నారు. శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీకి అవార్డు శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు వచ్చినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. మన జిల్లాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైలు ఢీకొని వృద్ధుడు మృతి నరసన్నపేట: మండలంలోని ఉర్లాం రైల్వేస్టేషన్ వద్ద కుమ్మరిపేటకు చెందిన దువ్వారపు మల్లేసు (70) రైలు ఢీకొని మృతి చెందాడు. సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఆమదాలవలస రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
చైన్స్నాచర్లు అరెస్టు
మెళియాపుట్టి: పలు కేసుల్లో నిందితులైన ఇద్దరు వ్యక్తులను మెళియాపుట్టి పోలీసులు జోడూరు గ్రామం వద్ద అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో పాతపట్నం సీఐ రామారావు, ఎస్ఐ రమేష్ బాబు సోమవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇటీవల మండలంలో శేఖరాపురం గ్రామంలోని పంట పొలాల్లో నక్క శకుంతలమ్మ అనే మహిళ మెడలోని పుస్తెల తాడులో సగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తెంపుకొని పారిపోయారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సోమవారం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపూర్కు చెందిన బాలకృష్ణ సాహు, సుజీత్కుమార్ పాడిలు మెళియాపుట్టి వస్తుండగా గమనించిన పోలీసులు జోడూరు వద్ద అనుమానంతో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వీరు ఇదివరకే పలు దొంగతనాల్లో అరైస్టెనట్లు గుర్తించడంతో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వీరు జూన్ 29వ తేదీన బరంపురంలో ద్విచక్ర వాహనాన్ని దొంగలించడంతో పాటు శేఖరాపురం గ్రామంలోని నక్క శకుంతలమ్మ పుస్తెల తాడు తెంపినట్లు వివరాలు రాబట్టారు. అలాగే 2024 జనవరిలో మండలంలోని జగన్నాథపురంలో వట్టికుల్ల రాజేశ్వరి మెడలోని తులమున్నర బంగారాన్ని సైతం అపహరించుకుపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో వారు దొంగిలించిన బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు. -
బొరిగివలసలో విషాదం
నరసన్నపేట: మండలంలోని బొరిగివలసలో విషాదం అలుముకుంది. అనకాపల్లి జిల్లాలో తలుపులమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు గ్రామస్తులతో కలిసి వెళ్లిన రాజాపు గురన్న (64) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కశింకోట మండలం భయ్యవరం వద్ద వాహనం నిలిపి జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా మరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొంది. దీంతో గురన్న అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఇచ్ఛాపురం వద్ద పోలీసులు గుర్తించారు. సోమవారం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా గురన్నకు భార్య వడ్డేమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలకు వివాహాలు కాగా, మృతుడు తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురన్న మృతికి పొందర కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజాపు అప్పన్న, బొరిగివలస ఎంపీటీసీ బుగ్గ జగదీశ్వరి, వైఎస్సార్సీపీ నాయకుడు బగ్గు రమణయ్యలు సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యాచకుడి దుర్మరణం ఇచ్ఛాపురం: రోడ్డు ప్రమాదంలో యాచకుడు మృతి చెందాడని పట్టణ పోలీసులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జాతీయ రహదారి–16పై చిత్తూరు నుంచి బరంపురం నగరానికి టమాటా లోడ్తో లారీ వెళ్తోంది. అదే సమయంలో బెల్లుపడ టోల్ప్లాజా సమీపంలో సాహు అనే యాచకుడు రోడ్పై నడుచుకుని వెళ్తుండగా అతడిని తప్పించబోయి లారీ ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో యాచకుడు మృతి చెందగా, లారీ డ్రైవర్ కూడా గాయాలపాలయ్యాడు. వీఆర్వో నర్తు కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా నిరసన
మందస: కార్గో ఎయిర్పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాట కమిటీ కన్వీనర్ కొమర వాసు ఆధ్వర్యంలో సోమవారం రాంపురం సచివాలయం ఎదుట నిరసన తెలియజేశారు. రాంపురం, మీల గంగువాడ, తెలగ గంగువాడ బాధిత రైతులు మాట్లాడుతు తరాతరాలుగా తాము ఈ భూములపై పంటలు పండించి వాటిపై జీవిస్తున్నామని, ఇక్కడ అవసరం లేని ఎయిర్ పోర్టు వంటి నిర్మాణాలు చేపడితే దానికి వ్యతిరేకంగా ఎంత దూరమైనా వెళ్తామన్నారు. తమ ఉద్యమానికి స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, కేంద్ర పౌర విమాన శాఖమంత్రి రామ్మోహన్నాయుడు సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిత్త గున్నయ్య, పొట్టి ఎర్రయ్య, మర్ల జనార్ధన్, దున్న రామారావు, సురేష్, నూకలమ్మ గున్నమ్మ బాధిత రైతులు, మహిళలు యువకులు పాల్గొన్నారు. -
పరుగులు
పురుగుల బియ్యంపైసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో చదువుతున్న పిల్లల కోసం అందించిన పురుగుల బియ్యంపై అధికారుల్లో కదలిక వచ్చింది. ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. పిల్లలకు పెట్టే భోజనంలో పురుగులా అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 10వ తేదీన అట్టహాసంగా నిర్వహించబోతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ డేలో ఇదొక పెద్ద ఇష్యూ అవుతుందని యంత్రాంగం అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన పురుగుల బియ్యం సమస్యను పరిష్కరించడానికి శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా ఎంఎల్ఎస్ పాయింట్కు ఒకరు చొప్పున టెక్నికల్ అసిస్టెంట్లను కేటాయించి, వారు పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎక్కడైతే పురుగులు కనిపిస్తాయో అక్కడ బియ్యం బ్యాగులను రీప్లేస్ చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి... మెగా పేరెంట్స్ టీచర్స్ డేను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దానికోసం పెద్ద ఎత్తు న ఏర్పాట్లు చేయాలని, రికార్డు సృష్టించాలని అధి కారులను ఆదేశించింది. మొన్నటివరకు యోగా డే కోసం ఎలాగైతే యంత్రాంగమంతా రాత్రి పగలనకుండా కష్టపడిందో ఇప్పుడదే విధంగా మెగా పేరెంట్స్ టీచర్స్ డే కోసం కష్టపడుతోంది. ఎలాగైనా రికార్డు సృష్టించాలని ఆరాటపడుతోంది. ఈ సమయంలో పాఠశాలలకు ప్రభుత్వం అందజేసిన సన్నని బియ్యంలో ఎక్కడికక్కడ పురుగులు కనిపిస్తుండటం ఇబ్బందికరంగా మారింది. భోజనాలను పిల్లలు కూడా పడేస్తుండడంతో ఉపాధ్యాయులు సైతం గగ్గోలు పెట్టడమే కాకుండా ఫిర్యాదులు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ‘సాక్షి’ కథనాలతో చర్చ.. పురుగుల బియ్యంపై ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు రావడంతో ప్రజల్లో కూడా చర్చకు దారితీసింది. రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. ఉపాధ్యాయు లే కాదు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ వైఖ రిని దునుమాడుతున్నారు. ఏకంగా అధికారుల గ్రూపుల్లోనే వీడియోలు, ఫొటోలతో సహా పెడుతున్నారు. ఇవన్నీ కథనాల రూపంలో వచ్చినప్పటికీ తొలుత పౌరసరఫరాల అధికారులు తేలిక గా తీసుకున్నారు. వాస్తవం కాదని కొట్టి పారేశారు. ఫిర్యాదుల వెల్లువ అయితే పురుగుల బియ్యంపై జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు రావడంతో పాటు ‘సాక్షి’ లో వచ్చిన తప్పంతా బడిదేనంట.. మరోవైపు పురుగుల బియ్యం తప్పిదాన్ని ఉపాధ్యాయులపై పౌరసరఫరాల సంస్థ అధికారులు నెట్టేశారు. తప్పు అంతా పాఠశాలలదే తప్ప తమది కాదని తేల్చేశారు. ప్రభుత్వ పాఠశాలలుకు సరఫరా చేసిన బియ్యం బ్యాగులను జాగ్రత్తగా ఉంచకపోవడం వల్లనే పురుగులు వచ్చాయంటూ తప్పించుకుంటున్నారు. సరైన ప్రదేశంలో దాచకపోవడం వల్ల, గాలి చొరబడని సంచుల్లో నిల్వ చేయడం వలన పురుగులు వచ్చాయని పరోక్షంగా ఉపాధ్యాయులను తప్పు పట్టారు. ఇప్పుడిది వివాదస్పదంగా మారింది. బ్యాగు ఇచ్చిందే పౌరసరఫరాల సంస్థ అయితే దాంట్లో ఉపాధ్యాయులకు, పాఠశాలలకు ఏం సంబంధమో వారికే తెలియాలి. కేవలం ఉపాధ్యాయులు, పాఠశాలలను బలి చేసేందుకు ఇలా మాట మార్చేస్తున్నారు. కథనాలు యంత్రాంగాన్ని ఆలోచనలో పడేశాయి. మెగా పేరెంట్స్ టీచర్స్ డే ముందు సమస్యగా మారుతుందని యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించక తప్పలేదు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కాస్త సీరియస్గా తీసుకున్నారు. తక్షణమే ఎంఎల్ ఎస్ పాయింట్ల వారీగా తనిఖీలు చేయాలని, పాఠశాలలకు వెళ్లి బియ్యం బ్యాగులను పరిశీలించాలని టెక్నికల్ అసిస్టెంట్లను ఆదేశించారు. జిల్లాలో 14ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, 14మంది టెక్నికల్ అసిస్టెంట్లను నియమించారు. వారికి పాఠశాలలకు సంబంధించిన సమాచారం, ప్రధానోపాధ్యాయుల వివరాలు అందించాలని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిలకు ఆదేశించారు. దీంతో టెక్నికల్ అసిస్టెంట్లు రంగంలోకి దిగారు. తనిఖీలు చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. సోమవారం పలుచోట్ల జరిగిన తనిఖీల్లో కూడా పురుగులు కనిపించాయి. కొన్నిచోట్ల మాత్రం జాగ్రత్త పడి మసిపూసే కార్యక్రమం చేయడంతో అంతా ఓకే అనిపించేశారు. పురుగులు రావడానికి పాఠశాలలదే తప్పు అని చెబుతూ పౌరసరఫరాల సంస్థ జారీ చేసిన రిజాయిండర్ అధికారుల ముందే.. ఇచ్ఛాపురం టౌన్: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం బియ్యంలో పురుగులను టెక్నికల్ బృందం సోమవారం గుర్తించింది. జిల్లాలో మధ్యాహ్న భోజనపథకం బియ్యంలో పురుగులు ఉండటంతో జిల్లా అధికారుల ఆదేశాలపై ఎంఎల్ఎస్ ఇన్చార్జి బి.కిశోర్, పరిశీలకులు రేణుక, సీఎస్డీటీ సంతోష్లు పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన పథకం బియ్యాన్ని పరిశీలించారు. బియ్యంలో పురుగులు ఉండటంతో బియ్యం నిల్వ చేసే గదిలోకి వెళ్లి పరిశీలించారు. పాత బియ్యంలో పురుగులు ఉండడంతో కొత్త బియ్యం కూడా పాడయ్యాయని తెలిపారు. ‘సాక్షి’లో వరుస కథనాలతో అధికారుల్లో చలనం మెగా పేరెంట్స్ టీచర్స్ డేలో ఇష్యూ అవుతుందని అప్రమత్తం తనిఖీలపై కీలక ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్ తనిఖీల్లో కొన్నిచోట్ల బయటపడ్డ పురుగులు పాఠశాలలదే తప్పు అంటూ పౌరసరఫరాల సంస్థ అధికారుల వింత స్పందన -
రౌడీ షీటర్ కుంగ్ ఫు శేఖర్తో వాసు జరిపిన ఫోన్ సంభాషణ ఇది.
కుంగ్ ఫు శేఖర్: చేశావా.. చల్ల వాసు: హా చేశాను.. వచ్చేమను అదేటి అవ్వదు లే.. సాయంత్రం వచ్చిమను అంటున్నాడు.. కుంగ్ ఫు శేఖర్ : ఆ... చల్ల వాసు : ఆయన సాయంత్రం వచ్చీమన్నారు. నీకు ఏమీ చేయడట. కానీ తరవాత మాత్రం జాగ్రత్తగా ఉండమన్నాడు. కుంగ్ ఫు శేఖర్ : హ.. హ.. హ.. చల్ల వాసు : స్టేషన్ బెయిల్ ఇస్తామన్నారు.. కుంగ్ ఫు శేఖర్ : ఇప్పుడు పంపనా.. చల్ల వాసు : ఇప్పుడు వద్దు. సాయంత్రం రమ్మన్నాడు. నేను కూడా ఊరులో లేను. వైజాగ్లో ఉన్నాను. సాయంత్రం వస్తా కుంగ్ ఫు శేఖర్ : అలాగ కాదె.. చల్ల వాసు : ఆ సెక్షన్లో ఆ క్లాజ్ లన్నీ చెప్పాను నేను పోలీసులకు. మీకు ఎందుకు నేను చేసి పెడతాను కదా అన్నాడు. తర్వాత జా గ్రత్తగా ఉండమను. ఎక్కడా బయటపడవద్దు అని అన్నాడు.. ఏమైనా అ టెండ్ అవుతాడు అని అంటే .. ఇప్పుడు వద్దు సాయంత్రం వచ్చిన తర్వాత నేను చెప్తాను అప్పుడు ఉంచు అని చెప్పాడు. కుంగ్ ఫు శేఖర్ : అయితే నువ్వు ఈవెనింగ్ ఊరు లోకి వచ్చేస్తావా అన్నా.. చల్ల వాసు : ఇప్పుడు వచ్చేస్తా బయలుదేరి. కుంగ్ ఫు శేఖర్ : అయితే నువ్వు వచ్చిన తర్వాత వెళ్దామా.. చల్ల వాసు : హా వెళ్దాం.. కుంగ్ ఫు శేఖర్ : ఇద్దరం కలిసి వెళ్దామా.. చల్ల వాసు : హా వెళ్దాం.. సరే -
వైఎస్సార్ జయంతి ఘనంగా నిర్వహించాలి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గలగలా పారుతూ వంశధార ఆయనను గుర్తు చేస్తూ ఉంటుంది. వేలాదిమందిని రక్షిస్తూ రిమ్స్ ఆ పేరును తలచుకుంటూనే ఉంటుంది. కరకట్టల కింద ఉన్న ఊళ్లు ఆయన రూపాన్ని తలచుకుంటూనే ఉంటాయి. బీఆర్ఏయూ పరిసరాలు ఆయన వదిలిన గురుతులను గుర్తు చేస్తూనే ఉంటాయి. సిక్కోలులో అడుగడుగునా వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలు ఉన్నాయి. జిల్లాలో మొదలైన ప్రతి కీలక ప్రాజెక్టు ఆయన చలవే. సిక్కోలు నుదుటిపై ఉన్న వెనుకబడిన జిల్లా అన్న ముద్ర చెరపడానికి వైఎస్సార్ చేసిన యజ్ఞం ఓ మధుర జ్ఞాపకంగా సిక్కోలు గుండె గదిలో చిరస్మరణీయంగా ఉంటుంది. నేడు మహానేత వైఎస్సార్ జయంతి. వైఎస్సార్ జ్ఞాపకాల్లో కొన్ని.. ● చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే విశాఖపట్నానికి పరుగులు తీసే శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రిమ్స్ను కానుకగా ఇచ్చారు. 300 పడకల జిల్లా కేంద్ర ఆసుపత్రిని 500 పడకలుగా మార్చారు. ● ఎచ్చెర్లలో 2008 జూలై 25న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ ఏర్పాటు చేశారు. ● జిల్లాలో 2.50లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశారు. ● 2005మే నెలలో వంశధార స్టేజ్ 2, ఫేజ్2 ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 20 మండలాల్లో 2.55లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు తలపెట్టారు. ● జిల్లాలోని హిరమండలం వద్ద సుమారు 10వేల ఎకరాల్లో 19టీఎంసీల నీటి నిల్వకోసం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ● తోటపల్లి ఫేజ్–2 పనుల ఘనత ఆయనకే దక్కుతుంది. ● సాగునీరు, పలాస పట్టణానికి తాగునీటి సమ స్య పరిష్కారం కోసం రూ.123.25 కోట్లతో ఆఫ్షోర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ● వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులకు శ్రీకారం చుట్టారు. ● 12,500 ఎకరాలకు సాగునీటి కోసం మడ్డువలస ప్రాజెక్టు స్టేజ్–1 పనులను రూ.57.87 కోట్లతో చేపట్టారు. ● రూ. 300కోట్లతో కరకట్టల నిర్మాణాలకు సంకల్పించారు. ● సీతంపేట ఏజెన్సీలో 14వేల ఎకరాల్లో 5వేల మంది గిరిజన రైతులకు పట్టాలు ఇచ్చారు. ● పేదలకు స్థలమిచ్చి గూడు నిర్మించిన మొట్టమొదటి సీఎం వైఎస్సారే. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1,80,817 ఇళ్లు మంజూరు చేసి అందులో 1,63,140 ఇళ్లను పూర్తిచేశారు. ● నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న సంకల్పంతో 2007లో ప్రారంభించిన ఆరోగ్యశ్రీతో వేలాది మందికి జీవం పోశారు. 108 అంబులెన్స్లు, 104 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ● పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ చదు వులు అందించాలనే ఉద్దేశ్యంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు.ఈ పథకం ద్వారా లబ్థిపొందిన వారిలో బీసీ విద్యార్థులే మన జిల్లాలో 72వేలమందికి పైగా ఉన్నారు. నరసన్నపేట: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని మంగవారం పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన చేశారు. అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో జయంతి వేడుకలు చేయాలని, సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పార్టీ ప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. జిల్లాలో అడుగడుగునా రాజన్న జ్ఞాపకాలు నాటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే జిల్లా ప్రగతికి సోపానాలు నేడు వైఎస్సార్ జయంతి -
ఓ పోలీసు కానిస్టేబుల్తో కుంగ్ ఫు శేఖర్ జరిపిన ఫోన్ సంభాషణ ఇలా
పోలీసు: ఎఫ్ఐఆర్ ఇండెక్స్ అని ఒకటి ఉంటాది. అది ఎవరికీ ఇవ్వకుండా ఎస్ఐ గారు దాచేస్తారట. కుంగ్ ఫు శేఖర్ : హ హ.. పోలీసు: ఇంకో దాంట్లో ఫెయిర్ చేయాలి. అది చెయ్యొ ద్దని చెప్పారట కుంగ్ ఫు శేఖర్ : అంటే.. పోలీసు : యాక్చువల్గా రెండు రికార్డులు మెయింటైన్ చేయాలి. కానీ ఎస్ఐ గారు అందులో ఫెయిర్ చేయొద్దు అని చెప్పారు. నేను చెప్పినప్పుడు చేయండి అని చెప్పారట. కుంగ్ ఫు శేఖర్ : ఎవరు..? ఎస్ఐ గారా..? పోలీసు : మొత్తానికి సార్ వద్దని అన్నారట. కుంగ్ ఫు శేఖర్ : అంటే కేసు పెట్టట్లేదా అన్న.. వద్దని అన్నారా.. పోలీసు : పెట్టకపోవడం కాదు. అది పెట్టిందే కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. నేను చెప్పినప్పుడు చేద్దురు అని చెప్పారట. కుంగ్ ఫు శేఖర్ : వినండి .. వినండి.. నేను ఎంక్వయిరీ చేశాను. క్లాస్ 5 నాన్బెయిల్బుల్, నేనేటి చేశానంటే ఎమ్మెల్యేగారికి ఫోన్ చేశాను. ఎమ్మెల్యేగారు వెంటనే ఫోన్ చేశారు డైరెక్టుగా ఎస్ఐ గారికి. నేను లైవ్లో ఉండగానే చేశారు. అదేటీ లేదండి. నేను స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తాను, కానీ జా గ్రత్తగా ఉండమనండి అని అన్నాడట. చల్ల వాసుకి అలాగే చెప్పారు. ఎమ్మెల్యే గారు, నేను పక్కనున్నప్పుడే మాట్లాడారు. ఏటంటావ్.. నమ్మొచ్చు అంటావా? పోలీసు : నేను ఒక్కసారి అడుగుతాను. దానికి 41 పోజిబులిటీ ఉందా లేదా అన్నది .. కుంగ్ ఫు శేఖర్ : దానికై తే 41పాజిబిలిటీ లేదు. కానీ ఎస్ఐ అయితే ఇస్తానంటున్నాడు. పోలీసు : ఎస్హెచ్ఓకై తే పవర్స్ ఉంటాయబ్బా. నేను నీకు ఎప్పుడో చెప్పాను. కుంగ్ ఫు శేఖర్ : అదే నాకు డౌట్ వచ్చి మీకు అడిగాను. ఎందుకంటే అతను మన దగ్గర అబద్ధం ఆడవచ్చు. కానీ ఎమ్మెల్యే దగ్గర, చల్ల వాసు దగ్గర అబద్ధం ఆడరు కదా.. నేను 41 ఇచ్చేస్తానులే. ఎస్పీ గారు అయితే ఇది పెట్టారు కానీ అబ్బాయి ఏం చేయలేదు కదా నేను చూసుకుంటానులే అన్నాడట ఎస్ఐ. పోలీసు : అయితే ఒకటి చేయొచ్చు,. ఇందులో ఇద్దరు, ముగ్గురు ముద్దాయిలు అనుకో.. నువ్వు మూడోవాడు అనుకో.. నీకు 41 ఇచ్చే యొచ్చు. నాకు తెలిసి ఇన్వెస్టిగేషన్లో తీసేస్తాడేమో నీ పేరు. నేను అదే అనుకుంటున్నాను. కుంగ్ ఫు శేఖర్ : అదే మాట సేమ్ నువ్వు అన్నట్లే చెప్పాడు అన్న లోక్ అదాలత్లోనూ, ఎందులోనో తీసేస్తారు అని.. పోలీసు : ఇన్వెస్టిగేషన్ లో ఎలాగంటే.. శేఖర్ అనే వ్యక్తి ఉండటం వాస్త వమే. కానీ ఆయన ఉన్నప్పుడు జరిగిన సిచ్చువేషన్ ఇది. వెళ్లిపోయిన తర్వాత జరి గింది ఇది.. అని పెడతారు. దానివల్ల ఏటవుతుందంటే మిగతావారికి ఆ సెక్షన్లు వర్తిస్తాయి. నీకు వర్తించవు. అలాగా నీకు ఇన్వెస్టిగేషన్లో తీయడానికి అవుతది. కుంగ్ ఫు శేఖర్ : అయితే ఇప్పుడు నాకు స్టేషన్ బెయిల్ ఇచ్చీవచ్చా అన్నా.. 41 పాజిబుల్ అవుతాదా.. పోలీసు : నీకు ఒకటి చెప్తాను విను. నీకు ఎప్పుడు రమ్మంటే స్టేషన్కి అప్పుడు ఫోన్ చేయిపించుకుని వెళ్లిపో. కుంగ్ ఫు శేఖర్ : ఈరోజు సాయంత్రం రమ్మని చెప్పారట వాసుతోని. వాసు వైజాగ్లో ఉన్నాడు. నేనేటి చెప్పానంటే వాసుకి.. నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం స్టేషన్కి అని చె ప్పాను. ఎమ్మెల్యేది, వాసుది ఒక్కసారి విను. విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తది. పోలీసు : ఏది ఏమైనా నువ్వు స్టేషన్కి వెళ్లేటప్పుడు ఒకసారి ఎస్ఐకి ఫోన్ చేయించు ఎమ్మెల్యేతోనే. కుంగ్ ఫు శేఖర్: ఎందుకన్నా చల్లా వాసునే పట్టుకు ని వెళ్తాను స్టేషన్కి.. పోలీసు : వాసా.. ఎవరు?? కుంగ్ ఫు శేఖర్: వాసు.. అన్నయ్య, మినిస్టర్ గారి బావమరిది. వాళ్ల సిస్టర్నే అచ్చెన్నాయుడు గారు పెళ్లి చేసుకున్నారు. ఎమ్మెల్యే రైట్హ్యాండ్ చల్లా వాసే కదా అన్న. అతనే ఉంటాడు అన్నిటిలోని. ఈ ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. అందుకే ఆయన్నే పట్టుకెళ్లి పోతు న్న. వస్తాడు మనకు బాగా పరిచయమే కదా. చల్ల వాసు చాలా పెద్ద స్థాయి వ్యక్తన్నా.. మొన్న నేను స్టేషన్కి వెళ్లినప్పుడు కూడా ఎస్ఐ గారు నాకు ఏం చెప్పారంటే.. నేను హెల్ప్ చేసిన విషయం వాసు అన్నయ్యకు చెప్పు, వాసు అన్నయ్య నాకు బాగా క్లోజ్, కొంచెం నువ్వు చెప్పు నీకు నేను ఎలా చూశానో అనేది అని ఆయన అన్నాడు. అన్నయ్య ఈ రోజు సాయంత్రం వాసుని స్టేషన్కి తీసుకుని బెయిల్ తీసుకుంటాను అన్నయ్య.. ఉంటాను. -
బియ్యంలో పురుగుల గుర్తింపు
నందిగాం: జిల్లా సివిల్ సప్లై క్వాలిటీ అధికారి సంతోష్కుమార్ మండలంలోని పలు పాఠ శాలలను సందర్శించారు. నందిగాం, నర్సిపురం, లఖిదాసుపురం పాఠశాలలను ఆయన సోమవారం సందర్శించి బియ్యంలో సుంకు పురుగులు, తెలుపు రంగులో సన్నని పురుగులు ఉన్నట్లు గుర్తించారు. బియ్యం గోదాము తనిఖీ బూర్జ: మండలంలో గల సింగన్నపాలేం గ్రామ పంచాయతీ నామాల లక్ష్మీపురం గ్రామం పరిధిలో గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అనుబంధ సంస్థ ద్వారా నడుపుతున్న శ్రీసాయి హరి పద్మ లాజిస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్ ఇన్వెస్టర్ గోదామును జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం పరిశీలించారు. గోదాములో నిల్వ ఉన్న రైస్, రికార్డులు పరిశీలించారు. పది రోజుల కిందట సరఫరా చేసిన బియ్యంలో ఎలాంటి లోపాలు లేవని తెలిపా రు. నామాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన చిక్కాల రంగబాబు అనే దివ్యాంగుడు తన ఇంటికి రేషన్ అందించాలని జేసీకి విన్నవించారు. నేడు మెగా రక్తదాన శిబిరం శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు దుర్గాపృథ్వీరాజ్ తెలిపారు. అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో యువజన విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంతోపాటు పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వైఎస్సార్ అభిమానులు, పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శ్రీకాకుళంలో రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్బ్యాంకు కమ్యూనిటీ హాల్లో శిబిరం నిర్వహిస్తామన్నారు. -
బ్లాక్ మెయిల్ దందా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో ఒక రౌడీ షీటర్కు ఎమ్మెల్యే, మరో టీడీపీ నాయకుడు అండగా ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. రూరల్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టు కాకుండా 41 నోటీసు ఇచ్చి వదిలేసేలా ఎమ్మెల్యే సహకరించారు. ఫోన్లోనే తతంగమంతా నడిపారు. అటు రౌడీషీటర్ను హోల్డ్లో పెట్టి ఎమ్మెల్యే పోలీసులతో మాట్లాడారు. తన మని షి అని, ఎలాగైనా ఆయన్ని అరెస్టు చేయకుండా చూడాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అవసరమైతే డీఎస్పీతో కూడా మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఇదంతా ఫోన్లో రికార్డు అయింది. రౌడీ షీటర్తో ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు, మరో కానిస్టేబుల్ మాట్లాడిన మాటలు ఆడియో క్లిప్పింగ్ ద్వా రా బయటకు వచ్చాయి. ఇప్పుడా ఆడియో క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసు ఇది.. రాగోలు జెమ్స్లో పనిచేస్తున్న వెంకటేష్ పై అక్కడే పని చేస్తున్న ఓ మహిళ తనను ప్రేమించి, శారీరకంగా వాడుకుని పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో నగరంలో పీఎన్ కాలనీ సమీపంలో ఉంటున్న రౌడీషీట్ ఉన్న పైల చంద్రశేఖర్ అలియాస్ కుంగ్ఫు శేఖర్ జోక్యం చేసుకుని ఆ యువకుడిని, అతడి తండ్రి గోవిందరావును పిలిచి వార్నింగ్ ఇచ్చారు. రూ.లక్షా 50వేలు ఇవ్వాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టి బుక్ చేయిస్తానని బెదిరించాడు. అందుకు ఆ యువకుడు, తండ్రి అంగీకరించలేదు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మరోసారి కుంగ్ ఫు శేఖర్ ఫోన్ చేసి బెదిరించాడు. వ్యవహారం సీరియస్గా ఉందని, తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని భయపెట్టాడు. చేసేది లేక వెంకటేష్, అతని తల్లి, మరో దగ్గరి బంధువు వచ్చి కుంగ్ ఫు శేఖర్కు రూ.లక్షా 50వేలు ఇచ్చారు. కుంగ్ ఫు శేఖర్తో పాటు వచ్చిన బొట్ట శంకర్ అనే మరో రౌడీషీటర్ కూడా రూ. 20వేలు అడిగితే ఇచ్చారు. అంతా తీసుకున్నాక కూడా మళ్లీ మరికొంత సొమ్ము కావాలని ఫోన్లో డిమాండ్ చేశారు. బెదిరింపులకు సైతం దిగారు. దీన్ని తట్టుకోలేక యువకుడు వెంకటేష్ తండ్రి గోవిందరావు శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 308(2), 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కుంగ్ ఫు శేఖర్, బొట్ట శంకర్పైన గత నెల 16న కేసు కూడా నమోదైంది. ఈ కేసులో ఎక్కడ తనను అరెస్టు చేస్తారనే భయంతో ఎలాగైనా అరెస్టు కాకుండా 41నోటీసుతో బయటపడాలని ఒక ఎమ్మెల్యేతోను, ఒక టీడీపీ నాయకుడు వాసుతోను, ఒక కానిస్టేబుల్తోను కుంగ్ ఫు శేఖర్ తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. ఆ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వాసు కూడా సహకరించారు. స్టేషన్ అధికారులతో మాట్లాడి, అరెస్టు లేకుండా 41నోటీసుతో వదిలేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒక రౌడీషీటర్కు ఎమ్మెల్యే అండగా ఉండటమేంటి? ఆయన సన్నిహితుడిగా చెప్పుకునే వాసు కూడా సహకరించడమేంటని? పోలీసులు కూడా అందుకు తగ్గట్టుగా వ్యవహరించడమేంటని చర్చనీయాంశమైంది. తండ్రీ కొడుకులను డబ్బులు కోసం బెదిరించిన కేసులో రౌడీషీటర్పై కేసు నమోదు అరెస్టు కాకుండా 41 నోటీసుతో వదిలేసేలా చూడాలని ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడిని ఆశ్రయించిన రౌడీ షీటర్ 41 నోటీసు ఇచ్చి వదిలేయాలని పోలీసులకు ఎమ్మెల్యే ఆదేశం ఇవన్నీ రికార్డు చేసిన రౌడీషీటర్ కుంగు ఫు శేఖర్ బయటకు వచ్చిన ఆడియో క్లిప్పింగ్ -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు దుర్మరణం
రణస్థలం: పిషిని పంచాయతీ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పైడిభీమవరం పంచాయతీ లొడగలపేట గ్రామానికి చెందిన నొడగల తవుడు(70) అనారోగ్యం, మతిస్థిమితం కారణంగా తరచూ బయటే తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడి శరీరం గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జుగా మారింది. కొన్ని గంటల తర్వాత తువ్వాలు, లుంగీ, చెప్పులను బట్టి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.కుమారుడు తాతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవే సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో వాహనం గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది. -
వివాహితను కబళించిన కిడ్నీ మహమ్మారి
వజ్రపుకొత్తూరు: ఒంకులూరు గ్రామానికి చెందిన వివాహిత దుమ్ము లక్ష్మీదేవి(39) ఆదివారం కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈమె కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. నెల రోజులుగా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు పొందుతోంది. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడం, మందులు వాడేందుకు పేదరికం అడ్డురావడంతో మధ్యలోనే తనువు చాలించింది. లక్ష్మీదేవి భర్త రాజు వ్యవసాయ కూలీ. వీరికి ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె ఉంది. గ్రామస్తులు, బంధువుల సహకారంతో గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు. -
మోక్షమెప్పుడో
డిగ్రీ ప్రవేశాలకు త్వరలో స్పష్టత.. డిగ్రీ ప్రైవేశాలపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాం. నోటిఫికేషన్ వస్తుంది. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ప్రవేశాలు జరుగుతాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవేశాలు ఉంటాయి. – డాక్టర్ కణితి శ్రీరాములు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాతపట్నం, శ్రీకాకుళం పురుషులు (ఎఫ్ఏసీ) అడ్మిషన్లపై ప్రభావం.. డిగ్రీ ప్రైవేశాలపై ప్రభుత్వం అనేక కసరత్తులు చేసింది. కాస్త ఆలస్యమైనమాట వాస్తవమే. ఈ ప్రభావం అడ్మిషన్లపై పడవచ్చు. నోటిఫికేషన్ జాప్యం కావడంతో ప్రైవేటు కళాశాలలవైపు విద్యార్థులు ఆకర్షితులయ్యే అవకాశం లేకపోలేదు. నోటిఫికేషన్ రెండు రోజుల్లో రావొచ్చు. – డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మూడు నెలలుగా నిరీక్షణ ఇంటర్ ఎంపీసీలో 923 మార్కులు వచ్చాయి. ఇంజినీరింగ్పై ఆసక్తిలేదు. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఎంపీసీఎస్ చదవాలని అనుకుంటున్నాను. ఇంటర్ ఫలితాలు వచ్చి మూడు నెలల కావొస్తుంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ రాకపోవడం దారుణం. – ఎస్.పుష్పలత, విద్యార్థిని, శ్రీకాకుళం ఇదీ పరిస్థితి.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 103 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 15 ప్రభుత్వ, 88 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 28 వేల సీట్లు ఉన్నాయి. కొన్నేళ్ల కిందట జిల్లా నుంచి 20 వేల వరకు సీట్లు నిండేవి. గత ఏడాది ఈ సంఖ్య పది వేలకు పడిపోయింది. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వ కళాశాలల్లో సైతం గతంలో పోలిస్తే ఆర్ట్స్, కామర్స్ గ్రూపుల్లో ప్రవేశాలు తగ్గిపోయాయి. దీంతో కొన్ని సబ్జెక్టుల కాంబినేషన్ కోర్సులను మూసివేశారు. ప్రధానంగా బీఎస్సీ ఎంపీసీ, కంప్యూటర్స్ కోర్సులకు డిమాండ్ ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాల, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం వంటి కళాశాలకు డిమాండ్ ఉంది. ప్రైవేట్ కళాశాలలు తీసుకుంటే శ్రీకాకుళం నగరం, రూరల్, రాజాం, నరసన్నపేట, టెక్కలి వంటి ప్రాంతాల్లో 20 కళాశాలల్లో సీట్లకు డిమాండ్ ఉంది. ఇంజినీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉండటంతో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అమలు చేయడంతో విద్యార్థులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా డిగ్రీలో ప్రవేశాల సంఖ్య తగ్గుతోంది. శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై మూడు నెలలు గడిచాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు సైతం విడుదలై నెల రోజులైంది. అయినా డిగ్రీ ప్రవేశాలకు మాత్రం మోక్షం కలగడం లేదు. కూటమి ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడంతో ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలలో ఉన్నత విద్యాశాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. గత ఏడాది ఇలాగే ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టడంతో ప్రభుత్వ కళాశాలల్లో వందలాది సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది అంతకుమించిన దుస్థితి తలెత్తుతుండటంతో కళాశాలల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు డిగ్రీలో చేరాలనుకుంటున్న విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. కొంతమంది ప్రైవేటు కోర్సుల బాట పడుతున్నారు. ఆన్లైనా.. ఆఫ్లైనా ? ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలను గతంలో కళాశాల యూనిట్గా నిర్వహించేవారు. ఎంపిక చేసిన కళాశాలల్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకుని, సీటు లభించిన కళాశాలలో చేరే వారు. ఇంటర్మీడియెట్ మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించేవారు. 2020 నుంచి ఆన్లైన్ విధానంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం యూనిట్గా విద్యార్థులు వెబ్బేస్డ్ కౌన్సెలింగ్లో ఆప్షన్లు ఇచ్చుకునేవారు. మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు లభించేవి. ప్రైవేట్ కళాశాలలో 70 శాతం కన్వీనర్, 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలు నిర్వహిస్తారు. మేనేజ్మెంట్ సీట్లకు ప్రభుత్వ రాయితీలైన ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు వంటివి వర్తించవు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ యాజమాన్యాలు పాతవిధానమైన ఆఫ్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించాలా? ఆఫ్లైన్లో నిర్వహించాలా? అన్న అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈ జాప్యం డిగ్రీ ప్రవేశాలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ నిర్వాకంతో రెండేళ్లగా డిగ్రీ ప్రవేశాలు తగ్గుముఖం పడుతున్నాయనేది గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ వద్ద ఫైల్ కొన్ని రోజుల తరబడి పెండింగ్లో ఉందన్న ప్రచారం జరుగుతోంది. లోకేష్ మిగిలిన శాఖలపై పెత్తనం చలాయిస్తుండటంతో.. తన విద్యాశాఖపై కనీసం దృష్టి పెట్టలేకపోతున్నారన్న విమర్శలకు డిగ్రీ ప్రెవేశాల ఉదంతమని విద్యార్థి సంఘాల ప్రతినిదులు ఆరోపిస్తున్నారు. ఇంటర్ ఫలితాలు విడుదలై మూడు నెలలు కనీసం దరఖాస్తులు చేసుకోవడానికి సైతం షెడ్యూల్ విడుదల చేయని వైనం విద్యార్థుల భవితవ్యంతో ఆటలాడుకుంటున్న కూటమి సర్కారు -
యువకుడు దారుణ హత్య
కొత్తూరు: బాకీ విషయమై తలెత్తిన వివాదం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఈ విషాద ఘటన కొత్తూరు మండలం వసప గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసప గ్రామంలో మలగాన శంకర్ అనే వ్యక్తి ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఇతనికి అదే గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు(19) అనే యువకుడు బాకీ ఉన్నాడు. ఎప్పుడు వీరిద్దరూ కలిసిన బాకీ విషయమై గొడవ జరిగేది. తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని శంకర్ తరచూ బెదిరించేవాడు. ఈ క్రమంలో మిన్నారావు శనివారం రాత్రి పకోడీ కొనేందుకు శంకర్ షాపు వద్దకు వెళ్లాడు. ఇంతవరకు ఉన్న బాకీ తీర్చాలని శంకర్ అడగడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో శంకర్ షాపులో ఉన్న సుత్తితో మిన్నారావు తలపై బలంగా కొట్టాడు. దీంతో మిన్నారావు కిందపడిపోయాడు. కొనఊపిరితో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా చాకుతో గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని షాపు ఎదురుగా ఉన్న పీహెచ్ రోడ్డు పక్కన పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆదివారం వేకువజామున రోడ్డు పక్కన మిన్నారావు మృతదేహం కనిపించడంతో అటువైపు వైపు వెళ్లిన స్థానికులు గుర్తించి మృతుడి లుకలాపు బుడ్డు, లక్ష్మిలకు తెలియజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా కనిపించడంతో విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న సీఐ చింతాడ ప్రసాదరావు, ఎస్ఐ ఎండీ ఆమీర్ ఆలీ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి బుడ్డు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆమీర్ ఆలీ తెలిపారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో ఈ హత్య జరిగి ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, మిన్నారావు రోజువారీ కూలీ పనులు చేస్తుండేవాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అందివచ్చిన కొడుకు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలను, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ (1938) జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా అధ్యక్షుడు బి.రవి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో పలువురు వక్తులు మాట్లాడారు. నాడు–నేడుతో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తిచేయాలని కోరారు. పేరెంట్ టీచర్ మీటింగ్ల పేరిట బడుల్లో విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. గిన్నిస్రికార్డుల కోసం ఆరాటమే తప్ప విద్యాభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా పూర్వ అధ్యక్షులు టి.చలపతిరావు, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, బాలాజీరావు, ఆర్.వి.అనంతాచార్యులు, బి.నవీన్, కృష్ణారావు, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జిపై ట్రోలింగ్ తగదు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ట్రోలింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీకాకుళం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థలో భాగమైన ఉన్నత న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నా ట్రోలింగ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.వ్యక్తి కంటే వ్యవస్థలే ముఖ్యమని, అటువంటి వారిని అవమానిస్తే, న్యాయవ్యవస్థను అవమాన పరిచినట్లేనని పేర్కొన్నారు. ట్రోల్ చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించించాలని కోరారు. ఉత్సాహంగా చెస్ ఎంపిక పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో రాణించి జిల్లాకు పేరుతీసుకురావాలని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్ ఆకాంక్షించారు. జిల్లాస్థాయి అండర్–15 చెస్ ఎంపిక పోటీలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొని ఎత్తుకు పైఎత్తులేశారు. బాలుర విభాగంలో డొంకాడ కార్తికేయ ప్రథమ, బొల్ల యశ్వంత్ ద్వితీయ, ఎన్కేపీ నిహల్ తృతీయ, పొన్నాడ వేదిష్ నాలుగో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో మెట్ట తీక్షణ, బొల్ల శృతి, జామి వినమ్ర, రిత్విక తొలి నాలుగు స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 12, 13 తేదీలలో విశాఖపట్నంలో జరిగేరాష్ట్ర స్థాయి అండర్– 15 చెస్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఆల్ ఇండియా చెస్సేన్ స్కూల్స్ కమిటీ సభ్యులు సనపల భీమారావు పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘ కార్యదర్శి జామి రమేష్, సంయుక్త కార్యదర్శి వై.ఎస్.వి.కుమార్, కోచ్ అభినవ్, అసోసియేషన్ సభ్యులు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్య నందిగాం: రాంపురం పంచాయతీ జయపురం గ్రామానికి చెందిన రాంపురం రత్నాలు(54) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రత్నాలుకు కంటి సమస్యతో బాధపడుతోంది. భర్త మహేష్ విశాఖపట్నం ఎల్వీ ప్రసాద్ ఆసుసత్రికి తీసుకువెళ్లి అన్ని పరీక్షలు చేయించినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్థాపం చెందిన శనివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. భర్త మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ కన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో తొలి ఏకాదశి సందడి
అరసవల్లి: ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందడి కనిపించింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయన ఏకాదశి)గా జరుపుకుంటున్న క్రమంలో ఆదివారం అరసవల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూలవిరాట్టుకు ప్రత్యేకంగా తులసీదళాలు, ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు సర్వదర్శనాలకు అనుమతించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పలువురు సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. అంతరాలయంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు చేయించారు. కాగా, అన్నప్రసాద వితరణలో అధికారుల చర్యలపై భక్తులు బాహాటంగానే విమర్శించారు. తలనీలాల టిక్కెట్లు ధరల కంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారంటూ భక్తులు ఫిర్యాదులు చేశారు. వైభవంగా ఆదిత్యుని కళ్యాణం.. సూర్యనారాయణ స్వామి వారి కల్యాణ సేవ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఉషా పద్మిని ఛాయా దేవేరులతో సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను కల్యాణమూర్తులుగా అలంకరించి అనివెట్టి మండపంలో కొలువుదీర్చారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ, వేదపండితుల బృందం కల్యాణం జరిపించారు. -
జీడీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్(జీడీఎస్) యూనియన్, శ్రీకాకుళం డివిజన్ ద్వై వార్షిక మహాసభలు నిర్వహించారు. రాష్ట్ర నాయకులు, డివిజనల్ అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ మహాసభలలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం రెండేళ్ల కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు, రాష్ట్ర నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఎస్.కె.జమాల్ బాషా, వై.స్పర్జన్ రాజు, మాజీ రాష్ట్ర కార్యదర్శి వై.మర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యవర్గమిదే.. జీడీఎస్ అధ్యక్ష కార్యదర్శులుగా బి.అప్పారావు, ఎన్.నందికేశ్వరరావు, కోశాధికారిగా పి.రామకోటేశ్వరరావు, ఇతర కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
హరికథకు పునరుజ్జీవం
శ్రీకాకుళం కల్చరల్: హరికథకు పునరుజ్జీవనం చేస్తున్న సుమిత్రా కళాసమితి సేవలు అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో పులఖండం శ్రీనివాసరావు స్మారకంగా హరికథా నవరత్నల ప్రదర్శనలు మొదటి రోజు ఆదివారం ప్రారంభమయ్యాయి. గుంటూరుకు చెందిన తిరువళ్లూరి దివ్య శివ భాగవతారిణిని ‘సుందరకాండ’ కథను చక్కగా వినిపించగా, వయొలిన్పై మావుడూరి సత్యనారాయణ, వాయునందరావు, మృదంగంపై మావుడూరు సూర్యప్రసాదశర్మ వాద్య సహకారం అందించారు. ముందుగా కళామందిరం ఆవరణలో ఉన్న హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపనిషన్మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్, గౌరవాధ్యక్షుడు కొంచాడ సోమేశ్వరరావు మాట్లాడుతూ చిన్నవయసులోనే హరికథను నేర్చుకొని చెప్పడం గొప్పవిషయమన్నారు. కార్యక్రమంలో సుమిత్రా కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పిలి శంకరశర్మ, గుత్తు చిన్నారావు, మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, నక్క శంకరరావు, నీరజా సుబ్రహ్మణ్యం, బంకుపల్లి రమేష్శర్మ, పూసర్ల నగేష్, కొంక్యాన మురళీధర్, వి.వి.ఆర్ మూర్తి, ఎం.రాజు, ఎం.వరలక్ష్మీ, పూజ, ఉషారాణి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లను బోధనకే పరిమితం చేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ : ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని రైతుబజారు కూడలిలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షులు కొమ్ము అప్పలరాజుతో కలిసి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. యోగా దినోత్సవం, మెగా పేరెంట్స్ వంటివి గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా రావాల్సిన బకాయిలు చెల్లించకుండా అనవసరమైన కార్యక్రమాలతో బోధనకు ఆటంకం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. పెండింగ్ డీఏలు, బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా ఇన్చార్జిలు గురుగుబెల్లి రాజశేఖర్, ఎన్నిప్రసాద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సంఘ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు తల్లికి వందనం, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఎఫ్.ఆర్.ఎస్ రద్దు చేయాలన్నారు. 42 రోజుల సమ్మె సందర్భంగా వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నేటికి అమలు చేయలేదన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, సీఐటీయూ మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న చేపట్టనున్న అఖిలభారత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ, నాయకులు పి.లతాదేవి, కె.సుజాత, జె.కామేశ్వరి, కె.లక్ష్మి, ఎస్.ఆదిలక్ష్మి, జ్యోతి, మాధవి, అప్పలనర్సమ్మ, సునీత తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం తీరువా..?
శ్రీకాకుళంయువకుడు దారుణ హత్యకొత్తూరు మండలం వసపలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. –8లోసోమవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2025టెక్కలి: అన్నదాతను ఎన్ని విధాలుగా వేధించాలో కూటమి సర్కారు అన్ని విధాలుగా వేధిస్తోంది. తాము అధికారంలోకి వస్తే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రూ.20వేలు ఇస్తామని ఎన్నికల మునుపు చంద్రబాబు హామీ ఇచ్చారు. పాలన రెండో ఏడాదికి చేరుకున్నా ఒక్క సారి కూడా ఈ సాయం అందజేయలేదు. రైతులకు పెట్టుబడి సాయం అందజేయకపోగా మరోవైపు నీటి తీరువా పన్ను చెల్లించాలని రైతుల నెత్తిన కొత్త భారం వేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ఆరంభమై రైతులంతా పెట్టుబడుల కోసం తిరుగుతూ వ్యవ సాయ పనులకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నీటి తీరువా వసూళ్ల కోసం అధికారులు ఆదేశాలు జారీ చేయడంపై రైతులు మండిపడుతున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు వద్దకే సంక్షేమ పథకాలు అందజేశారని, ఇలా రైతులను పన్నుల పేరు తో ఇబ్బందులకు గురి చేయలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. వాస్తవంగా రైతులకు 140 రోజు ల పాటు పూర్తి స్థాయిలో సాగునీటితో పాటు కాలువల మరమ్మతులు చేసినపుడే నీటి తీరువా వసూలు చేయాలని, అలా కాని పరిస్థితుల్లో ఎలాంటి వసూలు చేయకూడదని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. నీటి తీరువా కట్టాల్సిందే.. జిల్లా వ్యాప్తంగా రైతులు నీటి తీరువా పన్ను కట్టాల్సిందేనంటూ రూ. 24,21,69,367 టార్గెట్ను అధికారులు ఫిక్స్ చేశారు. ఈ లక్ష్యం చేరుకునేందుకు అధికారులు రైతులను ఇబ్బంది పెట్టక తప్పని పరిస్థితి దాపురించింది. రైతులను ప్రభు త్వం ఆదుకోకపోగా వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలా పన్నుల వసూలుకు ఆదేశాలు ఇవ్వడం మంచిది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిస్తు వసూలు చేయాలనుకుంటే డిసెంబర్ చివరి నుంచి జనవరి మధ్యన టార్గెట్లు పెట్టుకోవాలి తప్ప ఆరంభంలో వసూలు చేయడమేమిటని నిలదీస్తున్నారు. డివిజన్ శ్రీకాకుళం టెక్కలి పలాస మొత్తం ఖాతాలు 3,14,101 2,17,191 1,78,469డిమాండ్(రూ.ల్లో) 15,57,70,103 5,44,48,504 3,19,50,760 న్యూస్రీల్జిల్లాలో డివిజన్ల వారీగా నీటి తీరువా వసూళ్ల టార్గెట్ ఇలా... తీరువా వసూళ్లు అన్యాయం రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేయలే దు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు పెట్టుబడుల కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయాల్లో నీటి తీరువా వసూ లు చేయడం అన్యాయం. వాస్తవంగా సాగునీటి కాలువల నుంచి సుమారు 140 రోజుల పాటు పుష్కలంగా సాగునీరు అందజేస్తే తప్ప నీటి తీరు వా వసూలు చేయకూడదు. ఇక్కడ ఆ పరిస్థితి లేకపోయినప్పటికీ వసూళ్లకు టార్గెట్లు పెడుతున్నా రు. వసూలు చేయాలనుకుంటే రైతులకు పూర్తి స్థాయిలో సాగు నీటి సదుపాయం కల్పించాలి. – పోలాకి ప్రసాదరావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వసూళ్లు మానుకోవాలి గత ప్రభుత్వంలో రైతులకు ఇంటి ముంగిటకే అన్ని రకాల రైతు సంక్షేమ పథకాలు అందాయి. ఈ కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పెట్టుబడి సాయం ఇవ్వకపోగా నీటి తీరువా వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి పన్నులు వసూళ్లు చేయలేదు. ప్రస్తుతం ఖరీఫ్ పనులకు అవసరమైన పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. – జె.యర్రన్నరెడ్డి, రైతు, బూరగాం, టెక్కలి మండలం. సాగులో పెట్టుబడుల సమయాల్లో నీటి తీరువా వసూళ్లు పెట్టుబడి సాయం అందజేయకపోగా నీటి తీరువా వసూళ్లకు ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా రూ.24,21,69,367 వసూళ్లకు టార్గెట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు, రైతు సంఘాల నాయకులు -
రైలు ఢీకొని 13 పశువులు మృతి
పాతపట్నం: మండలంలోని హరిద్వారం గ్రామానికి చెందిన ఏడుగురు పాడి రైతులకు చెందిన 13 పశు వులు ఆదివారం రైలు ఢీకొని మృతి చెందగా, మరో నాలుగు పశువులకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 12 గంటల ప్రాంతంలో హరిద్వారం గ్రామానికి చెందిన పశువులను అదే గ్రామానికి చెందిన గోగ్గి లక్ష్మినారాయణ మేతకు తీసుకుపోయారు. హరిద్వారం, బొమ్మిక గ్రామాల మధ్య రైల్వేట్రాక్ను పశువులు దాటుతుండగా పూరి నుంచి గుణుపూర్ (ప్రత్యేక రైలు) రైలు ఢీకొని 13 పశువులు మృతి చెందాయని, మరో ఐదు పశువులకు తీవ్రగాయాల య్యాయని పాడి రైతులు తెలిపారు. హరిద్వారానికి చెందిన లోకలాపు ఆదినారాయణకు చెందిన ఆరు, బోదుడు సోములకు చెందిన రెండు, గొగ్గి శిమ్మయ్య, కలగ రమేష్, బొమ్మాళి అప్పలరాజు, ఎన్ని పాపా రావు, బొడ సింగిరిడికు చెందిన ఒక పశువు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి పశుసంవర్ధశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని పాడి రైతులు కోరారు. -
తహసీల్దార్ కార్యాలయంలోనికి వర్షపు నీరు
సారవకోట: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏ మాత్రం వాన కురిసినా నీరు కార్యాలయం లోపలకు వచ్చేస్తోంది. శని, ఆదివారాల్లో చిన్నపాటి వర్షం కురవడంతో కార్యాలయపు కంప్యూటర్ గదిలోకి నీరు చేరడంతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు లోపలకు రావడంతో ముఖ్యమైన కంప్యూటర్ పరికరాలు, పత్రాలు తడిసి పోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ‘వీఆర్ఏలతో వెట్టిచాకిరీ తగదు’ ఆమదాలవలస: పార్ట్టైమ్ పేరుతో వీఆర్ఏలతో వెట్టిచాకిరీ చేయించడం ప్రభుత్వానికి తగదని రాష్ట్ర వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు షేక్ బందిగీకిసాహెబ్ అన్నారు. వీఆర్ఏల సంఘం శ్రీకాకుళం ఏడో జిల్లా మహాసభ ఆమ దాలవలసలో టి.త్రినాథరావు అధ్యక్షతన ఆది వారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఫుల్ టైం విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తోందని తెలిపారు. ఇక్కడ కూడా పే స్కేల్ అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9 దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 46 కార్మిక చట్టాలను కేంద్రం కాలరాస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను పారాటాలతోనే తిప్పి కొట్టాలని పిలు పునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా అల్లు సత్యనారాయణ, అధ్యక్షుడిగా టి.త్రినాథరావు, ఉపాధ్యక్షుడిగా ఎన్.సీతప్పుడు తదితరులను ఎన్నుకున్నారు. జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ సేవల్ని దేశప్రజలు ఎన్నడూ మరిచిపోలేరని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా అరసవల్లి కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప ప్రధానిగా అనేక సంస్కరణలు చేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడ్డారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు పొన్నాడ రుషి, రాష్ట్ర కళింగ కోమటి మాజీ అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, పట్టణ అధ్యక్షు డు సాధు వైకుంఠరావు, సంఘ సంస్కర్త మంత్రి వెంకటస్వామి, రాష్ట్ర పెన్షనర్స్ అండ్ ఎంప్లాయిస్ జనరల్ సెక్రటరీ బుక్కూరు ఉమామహేశ్వరరావు, డాక్టర్ సెల్ మాజీ ఆధ్యక్షుడు శ్రీనివాస్ పట్నాయక్, అరసవల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ జలగడుగల శ్రీనివాసరావు, పట్టణ విభాగం కార్యవర్గ సభ్యుడు అర్జి ఈశ్వరరావు, శోభన్, త్రినాథ, కడియం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణమందస: కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా మందస మండలం రాంపురంలో గ్రామ కమి టీ అధ్యక్షుడు దున్న రామారావు నేతృత్వంలో ఆదివారం లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా రైతు మాట్లాడుతు ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఎయిర్ పోర్టు నిర్మాణం తగదన్నారు. రాజకీయాలకు అతీతంగా భూములను మాత్రం ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. -
టెక్కలిలో కల్తీ సిగరెట్ల కలకలం
టెక్కలి: సిగరెట్లు తాగడమే ఆరోగ్యానికి హానికరమైతే.. అందులో కల్తీ సిగరెట్లును విచ్చలవిడిగా విక్రయిస్తూ ధూమపానప్రియుల ఆరోగ్యాన్ని మరింత హరింపజేస్తున్నారు. డివిజన్ కేంద్రమైన టెక్కలితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్తీ సిగరెట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఒడిషా ప్రాంతం నుంచి టెక్కలి మీదుగా శ్రీకాకుళం, విశాఖ తదితర ప్రాంతానికి వీటిని తరలిస్తున్నారు. ముఖ్యంగా అధిక ధర కలిగిన కొన్ని రకాల సిగరెట్లును పోలిన విధంగా కల్తీ సిగరెట్ ప్యాకెట్లను దిగుమతి చేస్తున్నారు. కొన్ని రకాల ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన వాహనాలు, బస్సుల్లో నేరుగా తరలిస్తూ పట్టణ, గ్రామాల్లోని పాన్షాపులకు విక్రయిస్తున్నారు. ఒరిజినల్ను పోలిన విధంగా కల్తీ సిగరెట్లు ఉండడంతో, వాస్తవ ధరలకే వాటిని కొనుగోలు చేసుకుని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల టెక్కలిలో కొన్ని రకాల కంపెనీలకు చెందిన ప్రతినిధులు విస్తృతంగా దాడులు చేసి కల్తీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయినప్పటికీ పట్టణంలో గతంలో అక్రమంగా గుట్కాలను సరఫరా చేసే కొంతమంది వ్యక్తులు ఇష్టారాజ్యంగా కల్తీ సిగరెట్లు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. -
పురుగులిలా.. బియ్యం వండేదెలా?
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి అందిస్తున్న బియ్యంలో పురుగులు కనిపిస్తుండటంతో ఇటు ఉపాధ్యాయులు, అటు నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. పురుగుల బియ్యంతో వండలేక, చిన్నారులకు పస్తులు ఉంచలేక సతమతమవుతున్నారు. కూటమి ప్రభుత్వం సన్నబియ్యం పేరిట పురుగుల బియ్యం పంపిణీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం సారవకోట మండలంలోని సారవకోట, ధర్మలక్ష్మిపురం, మొదలికొత్తూరు, చిన్నకిట్టాలపాడు తదితర పాఠశాలల్లో బియ్యంలో పురుగులు బయటపడ్డారు. కొత్తూరు మండలంతో పాటు జిల్లావ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లో పురుగులు ఉన్నట్లు ‘సాక్షి’ శనివారం వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. – సారవకోట/కొత్తూరు కొత్తూరు: ఎస్సీ బాలుర వసతి గృహానికి అందించిన బియ్యంలో పురుగులు -
విద్యుత్ చార్జీలను తగ్గించాలి
అరసవల్లి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై చార్జీల పేరుతో మోపుతున్న భారాన్ని వెంటనే తగ్గించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయం వద్ద అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా, నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ధరలను పెంచబోమని మాటిచ్చి ఇప్పుడు దఫదఫాలుగా పెంచుతూ పోతోందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ నిర్ణయాలను ఉససంహరించుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదిత్యుని సన్నిధిలో ఈపీడీసీఎల్ డైరెక్టర్ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి.సూర్యప్రకాష్ శనివారం దర్శించుకున్నారు. జిల్లా సర్కిల్ విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తితో పాటు ఆలయ అధికారులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అర్చకులు మాధవ్శర్మ, ఆలయ అధికార సిబ్బంది బిఎస్.చక్రవర్తి తదితరులు ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావు, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, డీ–1 ఏఈ సురేష్కుమార్, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘ అధ్యక్షుడు ఉంగటి పాపారావు పాల్గొన్నారు. విశ్రాంత ట్రెజరీ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా తవిటన్న శ్రీకాకుళం పాతబస్టాండ్: పదవీ విరమణ పొందిన ట్రెజరీ ఉద్యోగులు శనివారం సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత వచ్చే ఇబ్బందులు, సంక్షేమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు టీఆర్ఈడబ్ల్యూఏ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రెజరీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా అంకడాల తవిటన్న, ఉపాధ్యక్షుడిగా భీష్మాచార్యులు, కార్యదర్శిగా రామకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా ఎ.కోటేశ్వరరావు, కోశాధికారిగా ఆర్ఎస్ పట్నాయక్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా చీఫ్ ట్రెజరీ ఆఫీసర్ రామచంద్రయ్య, డిప్యూటీ ట్రెజరీ ఆఫీసర్ వెంకటరావు పాల్గొన్నారు. నేడు జిల్లా అండర్–15 చెస్ ఎంపిక పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అండర్–15 బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయని జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్, కార్యదర్శి జామి రమేష్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని నానుబాలవీధిలోని చెస్ శిక్షణా కేంద్రంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికై న వారిని త్వరలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఎంపికల్లో పాల్గొనాలని, పూర్తి వివరాలకు 99125 59735 నంబర్ను సంప్రదించాలని కోరారు. ఏపీచెస్.ఓఆర్జీ వెబ్పోర్టల్లో వివరాలను నమోదుచేసుకోవచ్చని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బొడ్డేపల్లి రమేష్కుమార్ ఆమదాలవలస: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఆమదాలవలస పట్టణానికి చెందిన బొడ్డేపల్లి రమేష్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈయన 2013 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు రమేష్కుమార్కు అభినందనలు తెలిపారు. ఆప్కో వస్త్రాలపై రాయితీ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కో షోరూంలలో ఆషాఢ మాసం సందర్భంగా అన్ని రకాల చేనేత వస్త్రాలపై 30 శాతం, ఎంపిక చేసిన వస్త్రాలపై 50 నుంచి 70 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు డివిజనల్ మార్కెటింగ్ అధికారి అనుపమదాస్ శనివారం తెలిపారు. ధర్మవరం, మాధవరం, వెంకటగి, ఉప్పాడ, బందరు, రాజమండ్రి, మంగళగిరి చీరలు, బెడ్షీట్స్, లుంగీలు, టవల్స్ అందు బాటులో ఉన్నాయని వివరించారు. ఆప్కోహేండ్లూమ్స్.కామ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆన్లైన్ స్టోర్స్లోనూ ఆప్కో వస్త్రాలు లభి స్తాయని తెలిపారు. వస్త్రాలు కొనుగోలు చేసి చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని కోరారు. -
నేడు నష్టాల్లో!
నరసన్నపేట : మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చి దిద్ది వారి కుటుంబాలను ఆర్థికాభివృద్ధి వైపు పయనింపజేసేందుకు వైఎస్సార్ సీపీ పాలనలో ఏర్పాటైన మహిళా మార్టులు కూటమి ప్రభుత్వం వచ్చాక కుదేలయ్యాయి. జిల్లాలోనే అత్యధిక వ్యాపారం చేసిన నరసన్నపేటలోని మహిళా మార్టు ప్రస్తుతం మూతపడింది. గత 15 రోజులుగా షాపు తెరవడం లేదు. 2022 డిసెంబర్ 14న సెర్ప్, డీఆర్డీఏ అధికారులు ప్రతిష్టాత్మకంగా ఇక్కడ మార్టును ప్రారంభించారు. మంచి వ్యాపారం చేపట్టి రాష్ట్రంలోనే నరసన్నపేట మార్టు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పటి వరకూ రూ.5 కోట్లు పైగా టర్నోవర్ సాధించింది. పది మంది వరకూ మహిళలు ఇందులో పనిచేసేవారు. కూటమి వచ్చాక తిరోగమనం.. నిత్యం లక్షలాది రూపాయం వ్యాపారం చేస్తూ ఆదర్శంగా ఉన్న నరసన్నపేట మహిళా మార్ట్ను కూటమి ప్రభుత్వం వచ్చాక నీరుగార్చారు. డీఆర్డీఏ అధికారులు కూడా దీనిపై దృష్టి తగ్గించారు. దీంతో ఏడాది కాలంలో మార్టు తిరోగమనంలో నడిచింది. గతంలో రోజూ రూ.40 వేల నుంచి లక్ష రూపాయలు పైబడి వ్యాపారం జరిగేది. దీంతో పాటు మహిళా సంఘాల ఆద్వర్యంలో తయారయ్యే ఉత్పత్తుల విక్రయాలు కూడా ఇక్కడ జరిగేవి. తద్వారా ప్రజలకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకే అందేవి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్టు కావడంతో ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. ఇలాంటి మార్టును మూసేయడం పట్ల స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. షేర్ ధనం ఎక్కడ? నరసన్నపేట మండలంలో 1998 మహిళా సంఘాలు ఉండగా దీంట్లో 24,512 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 22,500 మంది నుంచి మహిళా మార్టు కోసం రూ.110 చొప్పున వసూలు చేశారు. వీరందరికీ షేర్ ధనం రూపంలో భాగసామ్యం కల్పించారు. ప్రస్తుతం ఈ షేర్ ధనం కూడా మాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ డబ్బు ఏమైందని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తమ వద్ద వసూలు చేసిన షేర్ ధనం మొత్తం తిరిగి చెల్లించాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలుదారులతో మార్ట్ కౌంటర్(ఫైల్ ) లాభాల్లోనే అప్పగించాం.. బాగా వ్యాపారం చేశాం. ప్రభుత్వం మారేటప్పటికి లాభాల్లోనే ఉండేది. స్వయం శక్తి సంఘాలకు ఇచ్చేందుకు రూ.3 లక్షలు పక్కన పెట్టాం. సరుకులు కూడా అధికంగా ఉండేవి. దీనిని కొనసాగించాలి. – చింతు శ్రీదేవి, మాజీ ఎంఎంఎస్ అధ్యక్షురాలు, నరసన్నపేట పునఃప్రారంభిస్తాం.. మహిళా మార్ట్ భవనం కొంత మరమ్మతులు చేపట్టాలి. తర్వాత పునఃప్రారంభించాలని పీడీ అంటున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి సరుకులు ప్యాక్ చేసి ఉంచాం. – అప్పలరామయ్య, ఏపీఎం, నరసన్నపేట -
కనికరించాలి మీరు!
సారూ..● ఇప్పటికే అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు సతమతం ● తమ బాధలు పట్టించుకోవాలని ‘అధికారి’కి విన్నపం శ్రీకాకుళం క్రైమ్ : అంతుబట్టని ‘అధికారి’ వ్యూహం పేరిట శుక్రవారం ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనం జిల్లాలో హాట్టాపిక్గా మారింది. జిల్లావ్యాప్తంగా ఇటీవల బదిలీలైన పోలీసుల్లో అన్యాయంగా దూరంగా వెళ్లిపోయి బాధపడినవారంతా తమ గోడు కనీసం పత్రికలోనైనా వచ్చినందుకు సంతోషపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం జిల్లాలో అంతా తానై వ్యవహరించిన ఆ అధికారి దగ్గరుండి మరీ బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కూటమి పాలకుల కక్ష, ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతున్నామని, కనీసం తమ విభాగానికి చెందిన ఆ ‘అధికారి’ అయినా తమ కష్టసుఖాలు అర్ధం చేసుకుంటే చాలని వేడుకుంటున్నారు. కాస్త ఉపశమనం.. రాజకీయ సిఫార్సులు పట్టించుకోలేదని, నిజాయితీగా, పారదర్శకంగా చేశారని, తప్పు చేసిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టించారని ‘అధికారి’ని ఆకాశానికెత్తినవారు కొందరైతే.. తమకు అన్యాయం జరిగిందని, ఆరోగ్యం, వయసు దృష్టిలో పెట్టుకోకుండా ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారిని సైతం దూరంగా బదిలీ చేశారని, పోనీ పనిష్మెంట్ల పేరిట పంపించేశారంటే అదీ కాదని బాధపడినవారూ ఉన్నారు. ముందుగా బదిలీ అయిన 221 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లలో ఇలా బాధపడినవారు అధికం. అధికారి అర్థం చేసుకున్నారో ఏమో గానీ శుక్రవారం జరిగిన 97 మంది పీసీలు, హెచ్సీల తుది విడత బదిలీల్లో సమీపం పోలీస్స్టేషన్లలోనే వేసి వారికి కాస్త ఉపశమనం కల్పించారు. మహిళా పోలీసులది మరోబాధ.. తాజాగా బదిలీ అయిన సచివాలయ మహిళా పోలీసులు కూడా తమ గోడును వారి వాట్సాప్ గ్రూపుల్లో పంచుకుంటున్నారు. తమ కుటుంబం, పిల్లలు, ఆరోగ్య సమస్యలనైనా దృష్టిలో పెట్టుకుని పక్కనున్న సచివాలయాల్లో గానీ, ఒకటి రెండు మండలాలు దాటైనా బదిలీ చేసుంటే బాగుండేదని అనుకుంటున్నారు. 50 కిలోమీటర్ల దాటైతే రోడ్లపై ఉరుకుల పరుగులతో స్కూటీలపై వెళ్లి ఎక్కడ ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి వస్తుందోనని భయపడుతున్నారు. మరికొందరైతే మహిళా పోలీసులు అవసరం లేని చోట బదిలీ కావడంతో వీరిని భవిష్యత్తులో పోలీసు శాఖలోనే ఏదైనా విభాగంలో విధుల్లోకి తీసుకుంటారా.. లేదో తెలియని పరిస్థితి. శుక్రవారం ఇలాంటి వారంతా పోలీసుల గ్రీవెన్సులో మొరపెట్టుకునేందుకు వెళ్లారు. ఆర్డర్లు వచ్చాక చూడొచ్చులే.. రాలేదు కదా.. కొన్నిరోజులు చేశాక తెలుస్తుందిలే.. అంటూ అక్కడి కార్యాలయ సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. శనివారం వీరి బదిలీల లిస్టు జిల్లా కలెక్టర్ ఆమోదానికి వెళ్లిందని జిల్లా పోలీసు కార్యాలయ సమాచారం. ‘వీఆర్’లకు మోక్షం కలిగేనా? దాదాపు కూటమి పాలన వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ ముద్రతో పాటు వివిధ కారణాలతో వీఆర్లో ఉన్న సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసులు ఎక్కడా పోస్టింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ కక్షతో కొందరు కూటమి నాయకులు రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా ముందుగానే వారి పేర్లున్న లిస్టు పైనున్న ఉన్నతాధికారులకు ఇచ్చేశారని అనుకున్నా.. ఏ రాజకీయ నాయకునికి తలొగ్గరని పేరున్న ఇక్కడ అధికారి కనికరం చూపిస్తే రెగ్యులర్ విధుల్లో తాము చేరడం పెద్ద కష్టమేమీ కాదని వీరు భావిస్తున్నారు. ఆ విధంగానైనా మోక్షం లభిస్తుందో లేదో చూడాలిమరి. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో మూడు వేల మందికి పదోన్నతులు కల్పించాలని, కొత్తగా 10 వేల మందికి నియామకాలు(రిక్రూట్మెంట్) చేపట్టాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.నానాజీ, జిల్లా అధ్యక్షుడు జి.త్రినాథరావు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ కార్యాలయ ఆవరణలో ఈయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించాలని, పాతపద్ధతిలోనే వైద్య సదుపాయాలు కల్పించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని, 1/19 సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారిని ఆప్కాస్లో చేర్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు జి.బి.రావు, ఎస్.వి.రమణ, కె.బాబూరావు, పి.వి.ఆర్.ఎల్.లలితకుమారి, జి.బి.మూర్తి, బి.రామకృష్ణ, కె.జి.రావు, వై.కె.కుమార్, ఆర్.వి.రావు, ఎ.ఎస్.చలం, బి.సుజాత, పి.ఎస్.కుమార్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు టి.ముత్యాలరావు, కిరణ్, నవీన్, అనిల్ పాల్గొన్నారు. -
నారాయణరావు నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న పడాల నారాయణరావు(84) అనారోగ్యంతో మృతి చెందారు. మరణానంతరం ఆయన నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుమారులు పి.శ్రీనివాస్, పి.శ్రీకాంత్, కుమార్తె పి.శ్రీదేవిలు విషయం రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేశారు. డాక్టర్ కె.సుధీర్ పర్యవేక్షణలో మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి పి.సుజాత, పి.చిన్నికృష్ణల ద్వారా కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించారు. దాత కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్తో పాటు కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరుకు సంప్రదించాలని కోరారు. అలరించిన గజల్స్ గానలహరి శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం రంగస్థల కళాకారుల నెలవారీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో 309వ నెలవారి కార్యక్రమం బాపూజీ కళామందిర్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన గజల్ కళాకారుడు వాసుదేవాచారి సినారె గజల్స్ను చక్కగా గానం చేశారు. ముందుగా కార్యనిర్వాహక అధ్యక్షులు పన్నాల నర్సింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన సభలో రిటైర్డ్ సెట్శ్రీ సీఈవో బి.వి.ప్రసాదరావు, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావులు మాట్లాడుతూ ప్రతినెలా పేద కళాకారులను ప్రోత్సహించడం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో కళాకారుల సమాఖ్య సభ్యులు బి.రామచంద్రదేవ్, కంచరాన అప్పారావు, అగతమూడి సింహాచలం, ఇంజరాపు రమణారావు, పైడి సత్యవతి, బండారు రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులోకి సీఎన్జీ సేవలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: కంప్రెస్టు నేచర్ గ్యాస్ (సీఎన్జి)ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో నిర్వహిస్తున్న పౌర సరఫరాల సంస్థ పెట్రోల్ బంకులో సీఎన్జీ స్టేషన్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎన్జీ వల్ల కాలుష్యం తగ్గుతుందన్నారు. కిలో రూ.91కే లభిస్తుందన్నారు. బంకు వద్ద 450 కేజీల నిల్వ ఉంటుందని వివరించారు. టెక్కలి వద్ద సైతం సీఎన్జీ ఏర్పాటు చేయాలని ఇండియన్ ఆయిల్ కంపెనీ యాజమాన్యానికి మంత్రి కోరారు. ఇప్పటికే అనుమతులు తీసుకున్నట్లు ఆర్డీఓ కష్ణమూర్తి చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, ట్రైనీ కలెక్టర్ పథ్వీరాజ్ కుమార్, రీజనల్ హెడ్ డి.సుధాకరరావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పురుగుల బియ్యం.. విషమే నయం
శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం కోసం పురుగుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వీటిని తినలేక విద్యార్థులు, ఆ బియ్యంతో భోజనం తయారుచేసి పెట్టలేక ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ విద్యార్థుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందజేస్తే.. అంతకంటే మంచివైన సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.మంచి బియ్యం కాదు కదా.. కనీసం పిల్లలు తినగలిగే బియ్యంతో కూడా భోజనం పెట్టడం లేదు. పురుగులతో ఉన్న ముక్కిపోయిన బియ్యాన్ని ప్రభుత్వం వండి పెడుతోంది. విద్యార్థులు ఆ భోజనం తినలేక ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం భోజనం పథకం పేరుతో శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం బస్తాలను తెరిచిచూస్తే పురుగులు కన్పిస్తుండటమే కాకుండా బియ్యం మొత్తం ముక్కు వాసన వస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళంఅసలు సన్నబియ్యమేనా? జిల్లాలోని 2,676 ప్రభుత్వ పాఠశాలలు.. 131 సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వసతి గృహాల కోసం జూలై నెలకు 12,087 బ్యాగులతో 301.95 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేశారు. పాఠశాలలకు 379 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశారు. సన్నబియ్యమని చెప్పి అందజేశారు. వాటిని తెరిచి చూస్తే చీమలతో పాటు పురుగులు బయటకు వస్తున్నాయి. అన్ని బస్తాల్లోని బియ్యం ముక్కు వాసన వస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన సన్నబియ్యం గుట్టురట్టు అవుతోంది. బియ్యం చూసిన ప్రతి ఒక్కరూ ఇవి సన్నబియ్యం కాదని, పాలిషింగ్ చేసి పంపించిన నాసిరకం బియ్యమని చెబుతున్నారు. విద్యార్థుల భోజనం కోసమని గుంటూరు జిల్లా తెనాలి నుంచి సన్నబియ్యం తీసుకొచి్చనట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.ఆ బియ్యాన్ని సింగన్నపాలెంలో మధ్యాహ్న భోజనం పథకం పేరుతో సంచుల్లో నింపి క్యూఆర్ కోడ్ కూడా వేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏదో మోసం జరిగినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి సన్నబియ్యం వస్తే వాటిని పక్కదారి పట్టించి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన పెద్దల మిల్లుల్లో నిల్వ ఉన్న నాసిరకం బియ్యాన్ని మధ్యాహ్నం భోజనం పథకం సంచుల్లో ప్యాక్చేసి పాఠశాలలకు, హాస్టల్స్కు పంపించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన పెద్దల గోడౌన్లలో నిల్వ ఉన్న బియ్యానికి మూడు పాలిష్లు పెట్టి సన్నబియ్యంగా తోసేస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. చర్యలేవీ.. సరఫరా అవుతున్న నాసిరకం బియ్యంపై పాఠశాలలు, వసతి గృహాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పురుగులున్న బియ్యం ఫొటోలు, వీడియోలు తీసి అధికారులకు పంపిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కూడా పాఠశాలల నుంచి నివేదికలు రప్పించుకుని పురుగులు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ఇంత జరిగినా కిమ్మనకుండా ఉండిపోతున్నారే తప్ప ఏం జరిగిందనే దానిపై విచారణ చేయడం లేదు. -
12,13 తేదీల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2025 పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెట్ట అశోక్కుమార్ తెలిపారు. సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు కేఎస్ మదీనా శైలానీ అధ్యక్షతన స్థానిక శాంతినగర్కాలనీలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అశోక్కుమార్ మాట్లాడుతూ సుమారు రూ.2లక్షల నిధులతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. టైటిల్ స్పాన్షర్గా శ్రీకాకుళం జీఎన్వీ జ్యూయలర్స్ సంస్థ ఎండీ ఊన్న నాగరాజు, కో–స్పాన్షర్గా సోలార్ ఎనర్జీ నరసన్నపేట ప్రొప్రైటర్ రైతు షాలిని, సింహాద్రి కనస్ట్రక్షన్స్ ఎండీ జి.భీమారావు క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను, హైదరాబాద్ మ్యాచ్ పాయింట్ అకాడమీ ఎండీ ముప్పాల వేణు మెమెంటోలు అందిస్తున్నట్లు వెల్లడించారు. అండర్–11, అండర్–13, అండర్–15, అండర్–17, అండర్–19 బాలబాలికలు, సీ్త్ర, పురుషులు(సీనియర్స్) విభాగాల్లో పోటీలు జరగనున్నాయని వివరించారు. విజేతలను రాష్ట్రపోటీలకు పంపించనున్నట్టు బ్యాడ్మింటన్ జిల్లా సీఈఓ సంపతిరావు సూరిబాబు తెలిపారు. 94402 55255, 83285 14385 నంబర్లను సంప్రదించి వివరాలు నమోదుచేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జీఎన్వీజే శ్రీకాకుళం బీఎం పాండవ ధర్మా, బ్యాడ్మింటన్ సంఘ ప్రతినిధులు గోర అనిల్కుమార్, గురుబెల్లి ప్రసాద్, మెండ శాంతికుమార్, ఎంఈ రత్నాజీ, కంచరాన వైకుంటరావు, మనోహర్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో మేక పిల్లలు మృతి
టెక్కలి రూరల్: కోట బొమ్మాళి మండలం దుప్పిలపాడు గ్రామంలో గురువారం రాత్రి వీధి కుక్కలు దాడిచేసి సుమారు 10 మేక పిల్లలను చంపేశాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. దుప్పిలపాడు గ్రామానికి చెందిన సబ్బి లక్ష్మణరావు, బి.సింగి కి చెందిన 13 మేకపిల్లలను ఒక పాకలో ఉంచారు. గురువారం రాత్రి గ్రామంలో తిరిగే వీధి కుక్కలు ఆ మేక పిల్లలపై దాడికి పాల్పడ్డాయి. దీంతో ఆ మందలోని 10 మేకపిల్లలు అక్కడికక్కడే మృతిచెందాయి. మిగిలిన మూడు మేకపిల్లలు తీవ్ర గాయాలకు గురైనట్లు బాధితులు తెలిపారు. మృతిచెందిన మేక పిల్లల విలువ సుమారు రూ.80వేలు వరకు ఉంటుందని బాధితులు వాపోతున్నారు. రెండు కేజీల గంజాయితో వ్యక్తి అరెస్టు ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి చైన్నెకు 2.150 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని ఇచ్ఛాపురం పట్టణ పోలీసులు పట్టుకున్నట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గంజాం జిల్లా దిగపొహండి బ్లాక్ బోనమాలి గ్రామానికి చెందిన ఖిరాసింధునాయక్ తప్తపాణీ ప్రాంతంలో శరత్ అనే వ్యక్తి వద్ద రూ.5వేలకు గంజాయి కొనుగోలు చేశాడు. చైన్నెలో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుబడ్డాడు. ఇతని వద్ద నుంచి 2.150 కేజీల గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో పట్టణ ఎస్సై ముకుందరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు తనిఖీలు
శ్రీకాకుళం క్రైమ్: నేరాల నియంత్రణ, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టే చర్యల్లో భాగంగా శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు శుక్రవారం నగరంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ ఈశ్వరరావు సిబ్బందితో కలిసి చౌదరి సత్యనారాయణ కాలనీలో తనిఖీలు చేశారు. గంజాయి, మద్యం, నాటుసారా, నిషేధిత పదార్థాలు, అక్రమ నిల్వలపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రణస్థలం: నేర నియంత్రణ, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు అరికట్టే చర్యలలో భాగంగా జె.ఆర్.పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో కార్చెన్ సెర్చ్ నిర్వహించినట్లు జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో జే.ఆర్.పురం, లావేరు, జి.సిగడాం ఎస్సైలు ఎస్.చిరంజీవి, లక్ష్మణరావు, మధుసూదనరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పనుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మొక్కలు నాటి సంరక్షణ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ డ్వామా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పనులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ అండ్ బీ, పంచాయతీ రహదారుల వెంట మొక్కలు నాటి వాటికి సంరక్షణ చేయాలన్నారు. టెక్కలిలో జంగిల్ క్లియరెన్స్ చేసి మొక్కలు నాటినట్లు మండలాల్లో కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి మొక్కలు నాటాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు, ఉద్యానవన శాఖకు సంబంధించిన సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. చేపల వేట విరామ సమయంలో మత్స్యకారులకు జాబ్ జారీ చేసిందీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీడీ బి.సుధాకర్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎవరికి నిర్ణయించిన పనులు వారు సత్వరమే నిర్వహించి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ బి.సుధాకర్, ఏపీడీలు పి.రాధ, శైలజ, శ్రీనివాసరెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి బి. లవరాజు, ఫీల్డ్ ఆఫీసర్లు, డ్వామా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
పోడు పంటలకు ముప్పు
టెక్కలి: ఇష్టారాజ్యంగా సాగుతున్న కంకర తవ్వకాలతో పోడు పంటలకు ముప్పు వాటిల్లుతోంది. టెక్కలి మండలం గూడెం గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండపై కొన్నాళ్లుగా విచ్చలవిడిగా కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో తమ జీవనాధారమైన పోడు పంటలు నాశనమవుతున్నాయని సవర సీతాపురం గ్రామానికి చెందిన గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామానికి చెందిన గిరిజనులకు ఇదే కొండపై పోడు వ్యవసాయానికి సంబంధించి పట్టాలు అందజేశారు. దీంతో వారంతా జీడి, మామిడి పంటలు వేసుకున్నారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరుగుతున్న సమయంలో కొందరు అక్రమార్కులు కొండపై విచ్చలవిడిగా కంకర తవ్వకాలు చేపడుతున్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతుండటంతో పంట మొక్కలు నాశనమవుతున్నాయని, తమకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని గిరిజన రైతులు వాపోతున్నారు. పోర్టు పేరిట.. మూలపేట పోర్టుకు కంకర తరలింపు పేరుతో గూడేం కొండను పూర్తిగా మైదానంగా మార్చేశారు. నందిగాం మండలం సొంటినూరు రెవెన్యూ పరిధిలో ఉన్న ఇదే కొండపై గతంలో వన్యప్రాణులు సంచరిస్తూ ఉండేవి. ఇదే ప్రాంతం నుంచి గతంలో దుప్పిలు, జింకలు, కొండ గొర్రెలు, నెమళ్లు దారి తప్పి సమీప గ్రామాలకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి కొండపై చేస్తున్న కంకర తవ్వకాలతో ఒక వైపు గిరిజన రైతులకు, మరో వైపు వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు. నాశనం చేస్తున్నారు... గూడెం కొండపై గతంలో మాకు పోడు వ్యవసాయానికి పట్టాలు ఇచ్చారు. దీనిపై జీడి, మామిడి పంటలు సాగు చేస్తున్నాం. ఇప్పుడు కంకర తవ్వకాలు చేస్తుండటంతో మొక్కలు నాశనమైపోతున్నాయి. మా పంటలకు ఇబ్బంది లేకుండా చూడాలి. – చందనగిరి కృష్ణారావు, గిరిజన రైతు, సవర సీతాపురం, టెక్కలి మండలం పోడు పంటలే దిక్కు.. మా గ్రామస్తులకు కొండపై ఉన్న పోడు పంటలే దిక్కు. అటువంటి పంటలను నాశనం చేసే విధంగా కంకర తవ్వుతున్నారు. దీనిపై ఐటీడీఏ అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నాం. – ఐ.రజని, సవర సీతాపురం, టెక్కలి మండలం గూడెం కొండపై విచ్చలవిడిగా కంకర తవ్వకాలు పోడుపంటలు నాశనం కావడంతో గిరిజన రైతుల ఆందోళన ఇదే కొండపై వన్యప్రాణుల ఆనవాళ్లు -
నిధుల్లేవు.. అభివృద్ధి ఎలా..?
ఇచ్ఛాపురం రూరల్: పంచాయతీలను అభివృద్ధి చేద్దామంటే ఇప్పటి వరకు మంజూరు చేయాల్సిన 15వ ఆర్థిక సంఘ నిధులు మంజూరు చేయలేదు, ఇక అభివృద్ధి చేయమంటే ఎలా అంటూ మండల సర్పంచ్లు ఎంపీడీఓను నిలదీశారు. శుక్రవారం ఎంపీపీ బోర పుష్ప ఆధ్వర్యంలో మండలంలోని 21 పంచాయతీలకు చెందిన సర్పంచ్లు ఎంపీడీఓ కె.రామారావుకు వినతి పత్రం అందజేశారు. పంచాయతీలోని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయడానికి, వీధి దీపాలు వేసేందుకు, కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ వేసేందుకు పంచాయతీలో ‘జీరో’ నిధులు కావడంతో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. తల్లికి తలకొరివి పెట్టిన తనయ వజ్రపుకొత్తూరు: పాత టెక్కలిలో శుక్రవారం తల్లికి తలకొరివి పెట్టిన హృదయ విదారక ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుగ్గిలాపు భాగ్యలక్ష్మీ (60) కొంత కాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. భర్త 30 ఏళ్ల కిందటే మృతిచెందగా.. కుమార్తెలు సంతోషికుమారి, నాగమణిలకు వివాహాలు జరిగాయి. తల్లి అనారోగ్యానికి గురైనప్పటి నుంచి పెద్ద కుమార్తె సంతోషికుమారి పాత టెక్కలి వచ్చి తల్లి బాగోగులు చూసుకుంటోంది. భాగ్యలక్ష్మి ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం మృతిచెందింది. దీంతో కుమార్తె సంతోషికుమారి అన్నీ తానై తల్లికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. చోరీ కేసుల్లో నిందితుడు అరెస్టు నరసన్నపేట: జలుమూరు మండలం రాణ, రామకృష్ణాపురం గ్రామాల్లో జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ రెండు కేసుల్లోనూ నిందితుడు ఒకరేనని సీఐ ఎం.శ్రీనివాసరావు శుక్రవారం నరసన్నపేట సర్కిల్ స్టేషన్ వద్ద విలేకరులకు వెల్లడించారు. జలుమూరు మండలం యాళ్లపేటకు చెందిన మడ్డు మాధవరావు 2023 మార్చి 6న రాణ గ్రామం మెయిన్ వీధిలో తాళం వేసి ఉన్న కొంగరాపు పుణ్యవతి ఇంట్లో చొరబడ్డాడు. స్క్రూ డ్రైవర్ సహాయంతో బీరువా తెరిచి రెండు తులాల బంగారు గొలుసు, తులమున్నర పుస్తెలతాడు చోరీకి పాల్పడ్డాడు. 2024 ఆగస్టు 27న రామకృష్ణాపురంలో తాళం వేసి ఉన్న మరో ఇంటిలో బీరువా తెరిచి చిన్న పిల్లల బంగారు చైన్లు , చెవి బుట్టలుతో పాటు మొత్తం మూడు తులాల ఆభరణాలు చోరీ చేశాడు. ఈ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా శుక్రవారం ఉదయం తిలారు రైల్వే స్టేషన్ వద్ద అనునానాస్పదంగా మాధవరావు కనిపించడంతో పట్టుకున్నారు. విచారణ చేయగా నేరాన్ని అంగీకరించాడు. ఇతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. ఇంటర్ వరకూ చదువుకున్న మాధవరావు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సమావేశంలో జలుమూరు ఎస్ఐ అశోక్బాబు పాల్గొన్నారు. -
స్కూల్ ఆటో బోల్తా
నరసన్నపేట: దేశవానిపేట సమీపంలో పోలాకికి వెళ్లే దారిలో ఆర్అండ్బీ రహదారిపై స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో టైర్పంక్చర్ కావడంతో అదుపు తప్పి పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈదులవలస మోడల్ స్కూల్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో శ్యామ్చరణ్(ఇందిరానగర్), కె.కామేశ్వరి(పిరువాడ), జి.గుణశ్రీ (రాళ్ల గోదాయవలస), సీహెచ్ కుసుమ కావ్య(పిరువాడ), వి.జాగృతి(జమ్ము), వై.గీతా శ్రీ (పిరువాడ) గాయపడగా.. నలుగురు విద్యార్థులు సురక్షితంగా బయట పడ్డారు. శ్యామ్చరణ్కు తీవ్ర గాయాలు కావడంతో నరసన్నపేట ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పైడి ప్రవీణ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ తెలిపారు. ఆరుగురు విద్యార్థులకు గాయాలు ఈదులవలస మోడల్ స్కూల్కు వెళ్తుండగా ఘటన -
ఉద్దానంలో కొబ్బరి తోటల పరిశీలన
వజ్రపుకొత్తూరు: పూండి ఉద్దానం ప్రాంతంలో కొబ్బరితోటలను శుక్రవారం జాతీయ కొబ్బరి అభివృద్ధి సంస్థ(కోయంబత్తూరు) డైరెక్టర్ ఇ.అరవేజ్, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.జయకుమార్, ఎస్.కుమార్వేలు(కొచ్చిన్) పరిశీలించారు. పల్లివూరు, రెయ్యిపాడు, అమలపాడు గ్రామాల్లో కొబ్బరి పునరుద్దధరణ పథకం, ఎల్ఓడీపీల అమలును పరిశీలించి రైతులకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆర్.రామ్మోహన్రావు, అసిస్టెంట్ డైరెక్టర్ కె.చిట్టిబాబు, మండల ఉద్యానవన శాఖ అధికారులు కె.సునీత, సీహెచ్.శంకర్దాసు, రైతులు పాల్గొన్నారు. ‘ఆదిత్య’కు రూ.15 లక్షలు మంజూరు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో వినూత్న ఆలోచనలకు వేదికగా ఉన్న ఇంక్యూబేషన్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.15 లక్షలు మంజూరు చేసినట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఆటోమేటెడ్ బ్యాటరీ చార్జింగ్ సిస్టమ్ ఫర్ ఈ–వెహికల్స్ అనే ఆలోచనను తక్కువ ఖర్చుతో రూపకల్పన చేయడానికి ఈ నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు రత్నాల అలేఖ్య, సాధు ఉమా చంద్రసాయి, ఊన ప్రవళ్లిక, కొండాల దిలీప్కుమార్, ఎ.జ్యోత్స్న, ఎం.నిరంజన్ తదితర విద్యార్థులంతా అధ్యాపకులు జి.సతీష్కుమార్, పల్లి శ్రీహరి, డి.విష్ణుమూర్తి తదితరుల ఆధ్వర్యంలో ప్రాజెక్టుకు రూపకల్పన చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ట్రిపుల్ఈ హెచ్ఓడీ విజయకుమార్, ఈసీఈ హెచ్ఓడీ అశోక్, మెకానికల్ హెచ్ఓడీ పి.శ్రీహరి విద్యార్థులను అభినందించారు. అధిక దిగుబడి వల్లే ధరల తగ్గుదల టెక్కలి: చిత్తూరు జిల్లాలో 6.5 మెట్రిక్ టన్నుల మేర తోతా మామిడి పంట పంట దిగుబడి రావడంతో ధరలు తగ్గాయని, అయినా ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం టెక్కలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద రైతుల కోసం రూ.89 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది వరి అధికంగా దిగుబడి వచ్చిందని రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లో వారి ఖాతాలకు డబ్బులు జమ చేశామని మంత్రి తెలిపారు. అనంతరం టెక్కలి చిన్నబజారులో ఆధునీకరించిన ఫిష్ మార్కెట్ను మంత్రి ప్రారంభించారు. టెక్కలి ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి సస్పెన్షన్ శ్రీకాకుళం పాతబస్టాండ్: రేషన్ డీలర్లకు సకాలంలో సరుకులు చేరవేయలేదన్న కారణంతో టెక్కలి ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి పి. నానిబాబును జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ శుక్రవారం సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో టెక్కలి సీఎల్డీటీ కె.అనిల్ పాత్రోకు తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం ఉందని, వారిని కాకుండా అన్యాయంగా ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిని బలి చేశారని రెవెన్యూ, సివిల్ సప్లయ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు నెలలుగా సరుకులు ఆలస్యంగా రేషన్ డిపోలకు చేరుతున్నాయని, స్టేజ్–1, స్టేజ్–2 వాహనాలు సరిగా సేవలు అందించడం లేదని నానిబాబు పలుమార్లు కార్పొరేషన్ డీఎంకు తెలియజేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని, ఆయన నిర్లక్ష్యం నానిబాబుకు శాపంగా మారిందని పలువురు సిబ్బంది అంటున్నారు. వైన్షాపు వద్ద గుర్తు తెలియని మృతదేహం శ్రీకాకుళం రూరల్: సింగుపురం పరిసర ప్రాంతంలోని ఓ వైన్షాపు వద్ద శుక్రవారం రాత్రి గుర్తు తెలియని మృతదేహం లభ్యమయ్యింది. ఈ వ్యక్తి రెండు రోజులుగా ఇదే ప్రాంతంలో తాగుతూ తిరిగే వాడని స్థానికులు చెబుతున్నారు. సుమారు 35 ఏళ్లు వయసు కలిగి నలుపు టీషర్ట్, జీన్ఫ్యాంట్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు శ్రీకాకుళం రూరల్ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు. -
లండన్ గడ్డపై ఉద్దానం కీర్తిపతాక
కవిటి: ప్రఖ్యాత లండన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్(ఎంఐఎం) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా సాధించిన జిల్లా తొలి యువతిగా కవిటి మండలం బల్లిపుట్టుగకు చెందిన పిరియా జాగృతి రికార్డు సాధించింది. శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ల కుమార్తె జాగృతి. ఈ ఏడాది దక్షిణాసియాలో భారతదేశం నుంచి లండన్ బిజినెస్ స్కూల్లో పీజీ కోర్సుకు 18 మంది అర్హత సాధించగా అందులో జాగృతి ఒకరు. బెంగళూరులో బీబీఏ పూర్తిచేశారు. యూఎస్ బేస్డ్ గోల్డ్మెన్ శాక్స్లో ఉద్యోగంలో చేరి రెండేళ్ల్లు పనిచేశారు. అనంతరం పారిస్కు చెందిన హెచ్ఈసీ సంస్థలో మూడునెలల సమ్మర్క్రాష్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం లండన్ బిజినెస్ స్కూల్లో ప్రవేశానికి జరిగిన ప్రవేశపరీక్షలో జీఆర్ఈలో అత్యుత్తమ శ్రేణి ఫలితాన్ని సాధించారు. ఈ మేరకు నిర్వహించిన కాంగ్రగేషన్ సెర్మోనీలో జాగృతికి సర్టిఫికెట్ ప్రదానంచేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి తల్లి విజయ కూడా పాల్గొన్నారు. లండన్ బిజినెస్ స్కూల్లో పీజీ పట్టా పొందిన పిరియా జాగృతి -
ఒత్తిళ్లతో నిలిచిన టెండర్లు
గురుకులాలకు సరుకులు.. ● సరుకుకు రూ.330కు కోట్ చేసిన టెండరుదారులు ● రూ.805కు కోట్ చేసిన డీసీఎంఎస్ ● నిబంధనలకు విరుద్ధంగా డీసీఎంఎస్కే అప్పగించేందుకు కుట్ర ● మంత్రి ఫోన్కు తలొగ్గి కాలయాపన చేస్తున్న అధికారులు! నల ప్రకారం ఎక్కువ కోట్ చేసిన డీసీఎంఎస్కు ఎట్టి పరిస్థితుల్లోనూ టెండరు ఖరారు చేయకూడదు. ఓవైపు నిబంధనలు, మరోవైపు మంత్రి స్థాయి నుంచి ఒత్తిళ్లు వెరసి ఏం చేయాలో తోచక అధికారులు టెండర్ను వాయిదా వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కువ కోట్ చేసిన డీసీఎంఎస్కు టెండర్లు అప్పగిస్తే ఉద్యమం తప్పదని టెండరుదారులు హెచ్చరిస్తున్నారు. రులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలకు విరుద్ధం.. సరుకులకు సంబంధించి డీసీఎంఎస్ చాలా ఎక్కువ మొత్తానికి కోట్ చేసింది. ప్రైవేటు టెండరుదారులు ఓ సరుకుకు రూ.330 కోట్ చేయగా, అదే సరుకుకు డీసీఎంఎస్ ద్వారా రూ.805 కోట్ చేశారు. ఒక సరుకు విషయంలోనే సుమారు రూ.525 వ్యత్యాసం ఉండటం గమనార్హం. నిబంధ -
అంతుపట్టని ‘అధికారి’ వ్యూహం
● అయోమయంగా సచివాలయ మహిళా పోలీసుల బదిలీలు ● ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లాలంటూ హుకుం! ● బదిలీల్లో రాష్ట్రం మొత్తం ఒక తీరు.. సిక్కోలులో మరో తీరు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాల మహిళా పోలీసుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదమవుతోంది. అంతుబట్టని ‘అధికారి’ వ్యూహంతో కౌన్సెలింగ్ అవ్వని మహిళా పోలీసులు ఉక్కిరిబిక్కిరవుతుండగా.. అయినవారు ఉసూరుమంటూ అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. మొన్నటికి మొన్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐల బదిలీల్లో కూడా ఇలాంటి విమర్శలే సదరు అధికారి ఎదుర్కొన్నారు. జంబ్లింగ్ పద్ధతి పేరిట చేస్తున్న ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అన్ని జిల్లాల్లో ఒక తీరులా.. శ్రీకాకుళం జిల్లాలో మరోలా జరుగుతోంది. ఎస్, నో క్యాటగిరీలుగా విభజించిన ఈ ప్రక్రియ కొందరికి నాలుగైదు మండలాల అవతలకు బదిలీ చేయగా.. మరికొందరికి పక్కపక్కన ఉన్న మండలాల్లోనే బదిలీ చేయడంతో అధికారి తీరు ఒకరికి మోదం.. మరొకరికి ఖేదంలా అనిపిస్తోంది. జిల్లాలో 930 గ్రామ సచివాలయాలు, 95 వార్డు సచివాలయాలకు గాను గురువారం రాత్రి దాదాపు 880 మంది మహిళా పోలీసులకు మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా.. గతంలో ఆరోగ్య పరిస్థితి, ఇతర కారణాలతో నచ్చిన చోట పోస్టింగ్లకు రిక్వెస్టులుగా పెట్టుకోవడం, ఎంతకాలం చేశారన్న దాని ఆధారంగా కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసేది. ఇప్పుడు మాత్రం ‘ఎస్, నో’ అనే ఆప్షన్లు పెట్టారు. ఎస్ ఆప్షన్లో మూడు క్యాటగిరీలు ఉంటాయి.. 2500 మంది ఆ సచివాలయంలో జనాభా ఉంటే ఏ క్యాటగిరీ, ఆపై ఎక్కువ ఉంటే బీ, సీ క్యాటగిరీలుగా విభజించారు. నో ఆప్షన్ ప్రకారం ఆచోట భవిష్యత్తులో మహిళా పోలీసు ఉండరని అర్ధం. దీని ప్రకారం రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా, ర్యాంకుల వారీగా ఆ మండలంలో వేరే చోట గానీ, పక్క మండలంలో కానీ బదిలీ అవ్వాలి. దానికి విరుద్ధంగా బుధవారం జరిగే కౌన్సిలింగ్లో 1 సంఖ్య నుంచి 120 సంఖ్య వరకు టాపర్స్లో ఉన్నవారిని సైతం -
విత్తన సమస్యలు తలెత్తకూడదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రైతులకు సత్వరమే విత్తనాలు పంపిణీ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. రైతులకు విత్తనాల సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వరి విత్తనాలు పంపిణీపై ఆరా తీయగా.. ఖరీఫ్లో 33,622 క్వింటాళ్ల వరి విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ జేడీ త్రినాథస్వామి వెల్లడించారు. 1520 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. యూరియా, డీఏపీ, తదితర ఎరువులు 69.05 మెట్రిక్ టన్నులు అవసరం ఉందని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో యూరియా, డీఏపీ వంటి ఎరువులు 13,495 మెట్రిక్ టన్నులు రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో మూడు సీహెచ్సీ గ్రూపులకు 80 శాతం సబ్సిడీపై డ్రోన్లు సరఫరా చేసినట్లు తెలిపారు. ఏపీఎంఐపీ ఉప సంచాలకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలాల వారీగా పంటల వివరాలను వివరించారు. పశుసంవర్ధక శాఖ జేడీ కె.రాజగోపాల్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ చురుగ్గా జరుగుతోందని చెప్పారు. మత్స్య శాఖ ఉప సంచాలకుడు సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 15,584 మందికి మత్స్యకార సేవ పథకం వర్తింపజేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సాహ యోజన కింద ఇప్పటికే 13 కో ఆపరేటివ్ సొసైటీలు అప్రూవల్ అయినట్లు వివరించారు సముద్రంలో నాచు పెంచడం అనేది జిల్లాలో ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద చేపడుతున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్గా నిర్వహించడానికి భావనపాడు, బారువ ప్రాంతాలను గుర్తించామని, ఒక్కోచోట 30 మందికి జూలై 4 నుంచి 9 వరకు శిక్షణ ఇస్తామని డీడీ వివరించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, వివిధ శాఖల తదితరులు పాల్గొన్నారు. ఎరువులు సిద్ధం చేసుకోవాలి వ్యవసాయ, అనుబంధ శాఖల సమీక్షలో కలెక్టర్ -
వంతెన గోడను ఢీకొట్టిన వ్యాన్
● రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన అరటి గెలలు టెక్కలి రూరల్: బొప్పాయిపురం సమీపంలో జాతీ య రహదారిపై గురువారం వేకువజామున జరిగి న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాన్ వంతెన గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాల తో బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. రావులపాలెం నుంచి ఒడిశా వైపు అరటి గెలల లోడుతో వెళ్తున్న వ్యాన్ టెక్కలి సమీపంలో బొప్పాయిపురం వద్దకు వచ్చేసరికి ఇరుకు వంతెన ఉండటంతో గమనించక వంతెను గోడను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్ శాంతన్ శెట్టికి స్వల్ప గాయాలు కాగా.. వ్యాన్ రెండు భాగాలుగా విడిపోవడంతో అరటిగెలలు రోడ్డుపై పడిపోయా యి. సమాచారం అందుకున్న హైవే సిబ్బంది ఘట నా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని టెక్కలి జిల్లా ఆస్పకి తరలించారు. అనంతరం ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. -
బ్యాగులు కట్ చేసి.. పొదుపు సొమ్ము దోచేసి..
రణస్థలం: కొచ్చెర్ల పంచాయతీకి చెందిన ఇద్దరు మహిళల నుంచి లక్ష రూపాయల నగదును గుర్తు తెలియని ముగ్గురు మహిళలు దోచుకున్నారు. జె.ఆర్.పురం పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొచ్చెర్ల గ్రామంలో శ్రీశ్రీనివాస పొదుపు సంఘానికి చెందిన 10 మంది సభ్యులు గురువారం జె.ఆర్.పురం మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్కు వచ్చారు. రూ.20లక్షలు పొదుపు సొమ్ము విత్డ్రా చేశారు. ఒక్కొక్కరు రూ.2లక్షల చొప్పున బ్యాంకులోనే పంచుకున్నారు. బయటకు వచ్చాక వారిలో ముగ్గురు సభ్యులు బ్యాంకు సమీపంలోనే ఉన్న వస్త్ర దుకాణంలోకి వెళ్లారు. అప్పటికే వారితో సఖ్యతగా మెలిగిన గుర్తు తెలియని ముగ్గురు మహిళలు అదే దుస్తుల దుకాణంలో వెళ్లి డ్వాక్రా మహిళల బ్యాగులు చాకచక్యంగా కోసేశారు. వీరిలో బస్వ గురమ్మ, లంకపల్లి మాధురి బ్యాగుల్లో రూ.50వేలు చొప్పున లక్ష రూపాయలు దోచుకున్నారు. మరొకరి బ్యాగ్ కట్ చేసినా నగదు తీయడం సాధ్యంకాలేదు. అనంతరం చోరీ చేసిన మహిళలు బయటకు జారుకున్నారు. కొంతసేపటి తర్వాత చోరీ జరిగిన విషయం తెలుసుకుని బాధిత మహిళలు ఆందోళనకు గురై పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి జె.ఆర్.పురం పోలీసులు చేరుకుని సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. కాగా, గతంలో ఇదే వీధిలో కనకదుర్గా జ్యూయలర్స్లో వెండిని ఇలానే ముగ్గురు మహిళలు దోచుకున్నారు. మరోసారి ఇప్పుడు చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
ఎయిర్పోర్టు వద్దు.. పచ్చని భూములే ముద్దు
మందస: తమకు ఎయిర్పోర్టు వద్దని, పచ్చని భూములే ముద్దు అని మందస మండలం టి.గంగువాడ గ్రామస్తులు తేల్చిచెప్పారు. గ్రామానికి చెందిన చిత్త గున్నయ్య ఆధ్వర్యంలో బాధిత రైతులు కమిటీ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజులుగా గ్రామానికి కొందరు అధికారులు వచ్చి సర్వే పేరిట వచ్చి కొలతలు వేయడానికి మిషన్లు తీసుకురావడం బాధాకరమన్నారు. తమ భూములపై ఏ హక్కుతో కొలతలు వేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శిరీష స్పందించి తమ భూములను పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో దాసరి మోహన్రావు, జోగి మోహన్రావు, రామారావు, పుక్కల్ల నారాయణ, బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. -
●తక్కువ కోట్ చేసిన వారికే ఇవ్వాలి
నేను ప్రతి సంవత్సరం టెండర్ లో పాల్గొంటున్నాను. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఒక సరుకుకు మేం రూ.330 కోట్ చేస్తే అదే సరుకుకు డీసీఎంఎస్ సంస్థ రూ.805కు కోట్ చేసింది. నిబంధనల ప్రకా రం వారికి ఇవ్వడానికి అవకాశం లేదు, అయినా అధికారులు ఒత్తిళ్లకు తలొగ్గి కాలయాపన చేస్తున్నా రు. ఎక్కువ కోడ్ చేసిన సంస్థకు టెండర్ ఇస్తే రూ. లక్షల్లో అవినీతి జరుగుతుంది. నిబంధనల ప్రకా రం టెండర్లను ప్రకటించకపోతే 40 మంది టెండర్దారులు కలిసి ఉద్యమాలు చేస్తాం. – సువ్వారి వేణుగోపాలరావు, టెండర్దారుడు -
బలగవీధిలో ఇల్లు దగ్ధం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని బోడెమ్మకోవెల సమీపంలో బలగవీధిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించి రూ.1.70 లక్షలు ఆస్తినష్టం సంభవించినట్లు జిల్లా అగ్నిమాపక సహాయాధికారి కె.శ్రీనుబాబు వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. గార మండలం కొర్లాం గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న కుప్పిలి రామామణి బలగవీధిలో పెంకుటిల్లులో కుమారుడు లోకేష్తో కలిసి కొంతకాలంగా నివసిస్తున్నారు. లోకేష్ విశాఖలోని ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే గురువారం ఉదయం విధుల నిమిత్తం రామామణి కొర్లాం వెళ్లింది. దేవుని గుడిలో ఉన్న దీపం ప్రమిద మంచంపై పడి మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురై ఆర్పేందుకు యత్నించారు. ఈలోగా ఫైర్ సిబ్బంది జీవీకే నాయుడు, ఎస్ ప్రసాద్, ఎం.శ్రీనివాస్, డి.శ్రీనివాస్, పి.జగన్నాథరావు, వై.పాపారావులు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో సామాన్లు కాలిపోయాయి. -
కూటమి మోసాలు వివరిద్దాం..
వైఎస్సార్ సీపీ పాలనలో రెండేళ్లు కరోనాతో నష్టపోయినా మూడేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. జిల్లాలో కీలక ప్రాజెక్టులకు వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుడితే ఆయన తనయుడు వైఎస్ జగన్ పూర్తి చేశారు. వెనుకబడ్డ జిల్లాను అభివృద్ధి చేయడానికి మూలపేట పోర్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం మొదలుపెట్టారు. కూటమి అబద్ధాలు, అక్రమాలు, మోసాలు అందరికి తెలిజేయాల్సిన అవసరం ఉందన్నారు. – ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ● -
ఒకటి చంద్రన్న దగా, రెండోది చంద్రన్న పగ
వంద అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమని సామెత. అలా లక్ష అబద్ధాలాడైనా ముఖ్యమంత్రి కావాలన్నది చంద్రబాబు సొంత సామెత. వైఎస్ జగన్ రూపొందించిన పథకాలు అమలు చేయడం తప్ప చంద్రబాబు ఒక్క కొత్త పథకాన్ని అమలు చేయలేదు. రెడ్బుక్కు ఎవరూ భయపడరు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో మొదలుపెట్టక ముందే డైవర్షన్ పాలిటిక్స్ మొదలయ్యాయి. జగన్ రోడ్డు మీదకు వస్తానంటేనే భయపడిపోతున్నారు. నెల్లూరులో హెలిప్యాడ్కు పర్మి షన్ ఇవ్వకుండా అడ్డుకోవడం అన్యాయం. రాష్ట్రంలో రెండే పథకాలు అమలవుతున్నాయి ఒకటి చంద్రన్న దగా, రెండోది చంద్రన్న పగ. – కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ● -
జీడి రైతు గగ్గోలు
కారుచౌకగా జీడి పిక్కల కొనుగోలు పలాస: ఉద్దానం ప్రాంత ప్రజల జీవనాధారమైన జీడి పిక్కలను పలాస జీడి వ్యాపారులు కారుచౌకగా కొనుగోలు చేస్తున్నారు. 80 కిలోల జీడి పిక్కల బస్తా ధర ప్రస్తుతం తప్పని పరిస్థితుల్లో రైతులు రూ.12,500లకు అమ్ముకుంటున్నారు. ఇటీవలే ఉద్దానం ప్రాంతంలోని మామిడిపల్లి, బొడ్డపాడు, మాకన్నపల్లి తదితర గ్రామాల్లో పలాస జీడి వ్యాపారులు జీడి పిక్కలను కొనుగోలు చేశారు. అయితే నేరుగా జీడి వ్యాపారులు మాత్రం ఈ పిక్కలను కొనుగోలు చేయడం లేదు. గ్రామాల్లో ఉన్న చోటా నాయకులు దళారులుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో జీడి వ్యాపారులు తరఫున పిక్కలను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది ఇదే నెలలో రైతులు బస్తా జీడి పిక్కలను ఆయా గ్రామాల్లో రూ.13,500లకు విక్రయించారు. ఈ ఏడాది ఇంకా జీడి పిక్కలధరలు పెరుగుతాయని ఆశించారు. అయితే దీన్ని పసి గట్టిన జీడి వ్యాపారులు తమ జీడి పప్పునకు డిమాండ్ లేదని, జీడి పప్పు నిల్వలు ఉండి పోయాయని తదితర కారణాలతో పలాసలో జీడి పరిశ్రమలను జూన్ 1 నుంచి నిరవధికంగా బంద్ చేశారు. దీంతో జీడి కార్మికులు రోడ్డున పడ్డారు. రైతులు తమ జీడి తోటల్లో సేకరించిన జీడి పిక్కలను ఇళ్లలో భద్రపరిచారు. పిక్కలను అమ్ముకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు. జీడి రైతాంగ కమిటీ నాయకులు ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. జీడి కార్మికులు కూడా తమకు పనికల్పించాలని నిరాహార దీక్షలు చేశారు. అయినా పరిశ్రమదారులు మాత్రం దేన్ని పట్టించుకోలేదు. ఇటీవల కొద్ది రోజుల కిందట జీడి పరిశ్రమలు తెరిచారు. దీంతో గ్రామాల్లోకి ఎప్పటి లాగే జీడి వ్యాపారులు జీడి పిక్కలను కొనుగోలు చేయడానికి వస్తున్నారు. అయితే వారు నేరుగా జీడి రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదు. గ్రామాల్లో ఉన్న దళారులను పట్టుకొని వారి చేత పిక్కలను కొనుగోలు చేయిస్తున్నారు. ఈ దళారుల్లో అధికారపార్టీ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. అన్ని వర్గాల వారు దీనిపై ప్రేక్షక పాత్ర వహించడం విశేషం. మొత్తానికి జీడి పరిశ్రమల బంద్ పేరుతో వ్యాపారులు చేసి కార్యక్రమాలు వారికి అనుకూల ఫలితాలు చేకూర్చుతున్నాయి. మేనెలలో జీడి పిక్కలను అమ్ముకోవలసిన రైతులకు ఇప్పుడు ఈ పరిస్థితులు మింగుడు పడటం లేదు. జీడి పిక్కలు బాగా ఎండిపోవడం వల్ల తరుగు ఏర్పడింది. కనీసం బస్తా పిక్కల దగ్గర కనీసం 5కిలోల తరుగు వచ్చింది. అంతే కాకుండా ధర కూడా బాగా తగ్గిపోయింది. మే నెలలో బస్తా పిక్కల ధర రూ.13500లు ఉండగా ప్రస్తుతం తప్పని పరిస్థితిలో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పాలక పార్టీ నాయకులు పట్టించుకోక పోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తా పిక్కల ధర రూ.12,500 గత ఏడాది ఇదే నెలలో రూ.13,500 -
పేరుకే సన్న బియ్యం.. నిండా పురుగులే
నరసన్నపేట: పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కోసం పంపిణీ చేస్తున్న బియ్యం నిండా పురుగులు, నూకలు ఉంటున్నాయి. గురువారం స్థానిక జిల్లా పరిషత్( బోర్డు) ఉన్నత పాఠశాల, మోడల్ ప్రైమరీ స్కూల్స్లో బియ్యంను పరిశీలించగా పురుగులు కనిపించాయి. ఈ సందర్భంగా వంట ఏజెన్సీ ప్రతినిధులు కాంతమ్మ ,రుప్ప శాంతలు మాట్లాడుతూ బియ్యంలో పురుగులు ఉంటున్నాయని, అలాగే నూకల శాతం కూడా అధికంగా ఉందని తెలిపారు. ముక్కు వాసన వస్తున్నాయని అన్నారు. ఒకటికి రెండు మార్లు పరిశుభ్రం చేశాక వండుతున్నట్లు తెలిపారు. పాఠశాల బియ్యం వెనక్కి.. టెక్కలి రూరల్: మండలంలోని చాకిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యాన్ని ఇటీవల పౌరసరఫరాల శాఖ నుంచి పంపిణీ చేశారు. అందులో ఒక బ్యాగ్ పూర్తిగా పాడైపోయి పురుగులు పట్టి, బియ్యం మొత్తం ఉండలు కట్టి ఉండటంతో దాన్ని గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు ఆ బియ్యా న్ని రెండు రోజులు కిందట వెనక్కి పంపించి దానిస్థానంలో మరో బియ్యం బ్యాగ్ తీసుకున్నారు. నెలవంకలో..కవిటి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదపిల్లల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యం నాసిరకంగా మారింది. మండలంలోని నెలవంక ప్రాథమిక పాఠశాలలో ‘సాక్షి’ చేసిన పరిశీలనలో బియ్యం నాసిరకంగా ఉన్నట్లు తేలింది. అట్టకట్టిన బియ్యాన్ని వండలేక వాటిని ఏం చేయాలో అర్థం కాక వంట ఏజెన్సీ మహిళలు సతమతమయ్యారు. రెండు బస్తాల్లో ఈ తరహా బియ్యం వారికి కనిపించింది. -
మోసగించారు
ఐదు కోట్ల మంది ఆంధ్రులను బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ అనే కార్యక్రమంతో మోసగించారు. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ఏడాది పాలనలో యువతకు రూ.38,400 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద 5,85,082మందికి రూ.10,717కోట్లు, నిరుద్యోగ భృతి కింద రూ.7800కోట్లు, తల్లికి వందనం పేరిట రూ.13,111కోట్లు, దీపం పథకం కింద రూ.4900 కోట్లు బకాయి పడ్డారు. రాష్ట్రానికి జగన్ పాలన అవసరం. – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కేంద్ర మంత్రి ఏం చేశారు..? జిల్లాలో మూడుసార్లు ఎంపీగా ఎన్నికై న రామ్మోహన్ నాయుడు ఈ జిల్లాకు తీసుకువచ్చిన ప్రాజెక్టులు ఏంటి? యుద్ధం వస్తే మొదటగా ఎఫెక్ట్ అయ్యేది విమా నయాన రంగం. ఆపరేషన్ సిందూర్ అవుతుంటే.. మే 15న పాతపట్నంలో రూ. 15లక్షలతో సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం ఎంత హాస్యాస్పదం. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి ● -
శ్రీకాకుళం
7●ప్రజలకు కూటమి ఇచ్చిన బాండును చూపిస్తున్న బొత్స సత్యనారాయణకూటమి ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో ‘రీకాల్ చంద్రబాబు మేని ఫెస్టో’ కార్యక్రమం రూపొందించలేదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసి.. ప్రజల పక్షాన నిలబడేందుకే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. – శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణఇచ్చిన హామీలు అమలు చేయకుంటే మెడలు వంచి ప్రశ్నిస్తాం. మీ బెదిరింపులకు భయపడేదే లేదు. శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025శ్రీకాకుళం నగరంలో జరిగిన వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో క్యూఆర్కోడ్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ● హామీలు అమలుచేయని మోసగాళ్లు చంద్రబాబు, పవన్: శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ● ఏపీలో చంద్రన్న దగ...పగ అనే పథకాలు అమలవుతున్నాయ్: కురసాల కన్నబాబు ● బాబు ఏడాది పాలనలో కోట్లాది రూపాయిల బకాయి: కుంభా రవిబాబు ● వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ధ్వజమెత్తిన నేతలు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అధికార దాహంతో దారిన కనబడిన వారందరితో చేతులు కలిపి, అధికారం చేతికి వచ్చాక ఇచ్చిన మాట మర్చిపోయిన మోసగాళ్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి ప్రజల పక్షాన నిలబడేందుకు ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం రూపొందించామని ఆయన తెలిపారు. అధికార పక్ష బెదిరింపులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు బెదిరిపోరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. తాము ఈవీఎంల ద్వారా ఓడిపోయామో, ఏ విధంగా ఓడిపోయామో ఆ దేవుడికే తెలుసని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు హొటల్లో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ పేరిట కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు.. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరిట ఇంటింటి ప్రచార కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. జిల్లా వ్యాప్తంగా 5 వారాల పాటు జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి, అనంతరం ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వాల మోసాల్ని వివరించేందుకు కార్యాచరణ రూపొందించి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ వైఎస్ జగన్ పరామర్శలకు వెళ్తున్నా బురద జల్లుతున్నారని విమర్శించారు. జిల్లాలోని మూలపేట పోర్టును చంద్రబాబే ప్రారంభించారని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు చెప్పడం సిగ్గు చేటన్నారు. సమావేశంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, తూర్పుకాపు, కాళింగ, కళింగవైశ్య కులాల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పాలిన శ్రావణి మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్, జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, గ్రీవెన్స్సెల్ అధ్యక్షుడు రౌతు శంకరరావు, ఎస్సీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ముత్తా విజయ్కుమార్, పిలక రాజ్యలక్ష్మి, కరిమి రాజేశ్వరరావు, గొండు కృష్ణమూర్తి, మూకళ్ల సుగుణ, పిన్నింటి సాయి, ఎన్ని ధనుంజయరావు, చిట్టి జనార్ధనరావు, సనపల నారాయణరావు, తంగుడు నాగేశ్వరరావు, బల్లాడ హేమమాలిని, జనార్ధనరావు, సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, బొడ్డేపల్లి పద్మజ, సాధు వైకుంఠరావు, గుంట జ్యోతి, గద్దిబోయిన కృష్ణయాదవ్, కోట గోవిందరావు, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు. న్యూస్రీల్మద్యం ఏరులై పారుతోంది.. రాష్ట్రంలో మంచినీళ్లు దొర క్కపోయినా గ్రామగ్రామాన మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో 119 మంది ఐపీఎస్లకి పోస్టింగులు లేవు. కొందరిని సస్పెండ్ చేయడం మరీ దారుణం. నిన్న కాక మొన్న ఒక ఐపీఎస్ అధికారి రాజీనామా చేసి ఢిల్లీ వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీ నాయకులు చాలా మందిని అరెస్టు చేసి వారికి బెయిల్ ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. చంద్రబాబు సంపద సృష్టించడానికే అప్పులు చేస్తున్నామని చెప్పడం విడ్డూరం. – తమ్మినేని సీతారాం, పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త -
సాఫీగా రెండో రోజు అడ్మిషన్ల ప్రక్రియ
ఎచ్చెర్ల: ఆర్టీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లకు 2025–26 సంవత్సరానికి జరుగుతున్న అడ్మిషన్లలో భాగంగా నూజివీడు ఎస్ఏజీ ఆడిటోరియంలో రెండోరోజు గురువారం అడ్మిషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 547 మంది విద్యార్థులకు కాల్ లెటర్లు పంపించారు. విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశా రు. మొత్తం అడ్మిషన్ల ప్రక్రియను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, ప్రవేశాల కన్వీనర్ అచార్య సండ్ర అమరేంద్రకుమార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘అన్యాయంగా విధుల నుంచి తొలగించారు’ సరుబుజ్జిలి: అధికార పక్ష నేతలకు అనుకూలంగా వ్యవహరించలేదనే నెపంతో అన్యాయంగా విధుల నుంచి తొలగించారని సింధువాడ ప్రాథమిక పాఠశాల మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు ఊటపల్లి చిన్నమ్మడు వాపోయారు. ఈ మేరకు గురువారం పాఠశాల ఆవరణలో నిరసన తెలిపారు. సుమారు 25 ఏళ్లు గా మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖ అధికారులు తన సంతకాన్ని తెల్లకాగితంపై తీసుకొని తనను మోసగించి అడ్డదారుల్లో విధుల నుంచి తొలగించారని తెలిపారు. ఇదే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నానని, అధికారులు న్యాయం చేయాలని కోరారు. సేవలు సంతృప్తి కలిగించాలి: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల సంతృప్తే ప్రభుత్వ పాలనకు ప్రామాణికమని, అందుకే ప్రతి శాఖ కూడా ప్రజల అభిప్రాయాలను నిక్షిప్తంగా గుర్తించి, సేవలను మరింత మెరుగుపరిచే దిశగా పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయం నుంచి గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ జిల్లా నుంచి ఆయా శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం సూర్య ఘర్, స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర, బంగారు కుటుంబం వంటి కార్యక్రమాల అమలు, ప్రజల్లో సానుకూల ధోరణి పెంపొందించడంపై ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖ ప్రజలకు సేవలందించే విధానం ఆత్మవిశ్వాసంతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. కుదిరిన జీడి కార్మికుల వేతనాల ఒప్పందం మందస: జీడి కార్మికుల వేతనాల ఒప్పందం గురువారం జరిగింది. గత ఏడాది మే నేలలో జరగాల్సిన వేతనాల ఒప్పందం చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి 41 రోజుల పాటు పని ఇవ్వకుండా కార్మికులకు ఇబ్బందులకు గురి చేసింది. సీఐటీయూ ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు జరిగాయి. చివరికి యాజమాన్యం, కార్మికులకు మధ్య వేతనాల ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. గతంలో ఇస్తున్న వేతనాలపై కిలోకు 2.50 పెంచుతూ రెండేళ్లకు ఒప్పందం జరిగింది. చరణ్ అదరగొట్టాడు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన అట్టాడ చరణ్ భారత వాలీబాల్ ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. బెంగళూరు వేదిక గా ఎన్ఎస్ఎస్సీ అకాడమీలో జరగనున్న శిక్షణ శిబిరాల్లో పాల్గొనే ఇండియన్ ప్రాబబు ల్స్ జాబితాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రామనాథ్ చౌదరి విడుదల చేశారు. ఈ యువ క్రీడాకారుడు పలా స మండలం అంతరకుడ్డ గ్రామం ప్రస్తుతం విఽశాఖపట్నంలోని సాయ్ స్పోర్ట్స్ స్కూల్/హాస్టల్లో ఇంటర్ చదువుతున్నాడు. -
బాధ్యత పట్టని ఏపీ ప్రభుత్వం!
శ్రీకాకుళం జిల్లా జి.శిగడం మండలం పాలకడియం గ్రామానికి చెందిన వెంకటేశ్ సిగాచీ పరిశ్రమలో సీనియర్ కెమిస్ట్. మూడురోజుల కిందట జరిగిన పేలుడు ఘటనలో అతడు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే రోజులు గడుస్తున్నా తన కొడుకు మృతదేహాన్ని అప్పగించని పరిస్థితి. దీంతో మృతుని తండ్రి చిన్నారావు ఆవేదనకు అంతులేదు. హెల్ప్డెస్క్ వద్ద, మార్చురీ వద్ద తమ బిడ్డ మృతదేహం కోసం పడరాని కష్టాలు పడుతున్నాడు.సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ పరిశ్రమ దుర్ఘటనలో మరణించిన, క్షతగాత్రులైన బిహార్, ఒడిశా కుటుంబాలకు సహాయం చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారుల బృందాలను పంపింది. కానీ ∙ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ తరహా చొరవ చూపడం లేదు. ఈ దుర్ఘటనలో 8 మంది ఏపీ వాసులు మృత్యువాత పడ్డారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు దగ్గరుండి తమ రాష్ట్రాల బాధిత కుటుంబాలకు సహాయమందిస్తుంటే ఏపీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క అధికారి కూడా అటువైపు తొంగిచూడలేదు. దీనిపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రోజుల తరబడి నిరీక్షణఏపీకి చెందిన మృతుల్లో విజయనగరం, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, తూర్పుగోదావరి తదితర జిల్లాలకు చెందిన వారున్నారు. అయితే గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతదేహాల అప్పగింత ప్రహసనంగా మారింది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహాలు ఇంకా అందక ఆయా కుటుంబాలు పాశమైలారం పారిశ్రామిక వాడలో నరకయాతన అనుభవిస్తున్నారు. తమ వారిని కోల్పోయిన దుఖం కంటే.. కడసారి చూపు కోసం వారు పడుతున్న బాధ వర్ణణాతీతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద బాధిత కుటుంబాలు కన్నీరు ఇంకిన కళ్లతో వేచి చూస్తున్నాయి. బిహార్, ఒడిశా రాష్ట్రాల మాదిరిగా తమకు సహాయం అందించేందుకు తమ అధికారులెవరూ రాలేదని వాపోతున్నాయి. -
సంస్కారహీనుడు అచ్చెన్నాయుడు
టెక్కలి: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, వలసలు నివారించాలనే ఉద్దేశంతో మూలపేట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన సంస్కారహీనుడు మంత్రి అచ్చెన్నాయుడని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలిలోని అయోధ్యపురం సమీపంలో ఉన్న పోర్టురోడ్డులో మీడియా సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలనలో జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, కిడ్నీ ఆస్పత్రి, ఉద్దానానికి తాగునీరు అందించిన వ్యక్తిని, వెయ్యి అడుగుల గోతులో పాతేస్తానని బుర్ర తక్కువ వ్యాఖ్యలు చేస్తావా అని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడిని, అతని కుటుంబ సభ్యులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఈ జిల్లా ప్రజలు, నియోజకవర్గానికి చెందిన ప్రజల కోసం ఆ కుటుంబం ఒక్క అభివృద్ధి పనైనా చేసిందా అని ప్రశ్నించారు. దశాబ్ధాలుగా ఈ ప్రాంతంలో రాజకీయ పబ్బం గడుపుతున్న కింజరాపు కుటుంబం చేయలేని అభివృద్ధిని తమ నాయకుడు చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో 80 శాతం పనులు గత వైఎస్సార్సీపీ హయాంలో సుమారు 80 శాతం పోర్టు పనులు పూర్తయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటాలు కుదరకపోవడంతో కొన్ని నెలల పాటు పోర్టు పనులు నిలిపివేశారని తిలక్ దుయ్యబట్టారు. మరలా కింజరాపు కుటుంబం సొంత ప్రయోజనాలకు కమీషన్లు కుదరడంతో పోర్టు పరిశీలన పేరుతో పర్యటనలు చేయడం సిగ్గు చేటుగా లేదా అని నిలదీశారు. పోర్టు అప్రోచ్ రోడ్డులో రైతుల అభిప్రాయాలు తెలుసుకోకుండా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. దొంగనోట్లు మాఫియాతో జత కడుతూ టెక్కలి నియోజకవర్గంలో రౌడీ షీటర్లను పక్కన పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తి అచ్చెన్నాయుడని ఆరోపించారు. అచ్చెన్నాయుడు చేస్తున్న అరాచకాలకు వత్తాసు పలుకుతున్న కొంతమంది అధికారులు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే భవిష్యత్లో బాధపడాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ హెచ్.వెంకటేశ్వర్రావు, వైస్ ఎంపీపీ పి.రమేష్, బన్నువాడ సర్పంచ్ పి.మోహన్రావు, నాయకులు సత్తారు సత్యం, ఎం.గణపతిరావు, టి.పాల్గుణరావు, జె.జయరాం, పి.రమణబాబు, కె.జీవన్, బి.రాజేష్, ఎం.రమేష్, పి.శ్యామలరావు, ఆర్.మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిలీ నోట్లు మాఫియాతో ఆయనకు సంబంధాలు మండిపడిన పేరాడ తిలక్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రణస్థలం: మండలంలోని అర్జునవలస పంచాయతీ గడిజాలపేట గ్రామ సమీపంలోని రామతీర్ధాలు రహదారిపై బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. జేఆర్పురం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని సంచాం గ్రామానికి చెందిన దాకమర్రి వంశీ(21), తన స్నేహితుడు పవన్తో కలిసి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గిడిజాలపేట దగ్గర మలుపు వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో తీవ్రగాయాలు పాలైన వంశీని తొలుత రణస్థలం సీహెచ్సీకి తరలించారు. అనంతరం అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వెనుక కూర్చొని ఉన్న పవన్ చిన్న, చిన్న గాయాలతో బయటపడ్డారు. మృతుడి తండ్రి దాకమర్రి అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జేఆర్పురం ఎస్ఐ చిరంజీవి తెలిపారు. -
పిల్లల బియ్యం పక్కదారి..?
● రెండో విడతలోనే నీరుగారిన లక్ష్యం ● పాఠశాలలకు నాసిరకం బియ్యం పంపిణీ ● తనిఖీల్లో వెలుగు చూసిన వైనం ● సన్నబియ్యం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు శ్రీకాకుళం పాతబస్టాండ్: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు తదితర ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో చదువుతున్న పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. అయితే ఈ పథకం ప్రారంభమైన ఒక్క నెలలోనే నీరుగారుతోంది. నాణ్యమైన సన్న బియ్యం స్థానంలో నాసిరకం పురుగులతో కూడిన బియ్యాన్ని సివిల్ సప్లయ్ అధికారులు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా కవిటి మండలంలో ఈ బియ్యంపై జరిగిన తనిఖీల్లో ఈ పురుగుల బియ్యం బాగోతం బయిటపడింది. ఈ బియ్యాన్ని జిల్లా సివిల్ సప్లయ్ శాఖ ద్వారా ఎంఎల్ఎస్ పాయింట్స్, అక్కడ నుంచి పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలు ఇలా ఆయా పాఠశాలలకు అందజేస్తారు. కేవలం పాఠశాలలకు సంబంధించి నెలకు 15,468 ప్యాకెట్లు (ఒక ప్యాకెట్ 25 కిలోలు వంతున) అందజేస్తున్నారు. ఇవి కాకుండా ఇతర సంస్థలు కేజీబీవీ, గురుకులాలు వంటి వాటికి కూడా ఇదేస్థాయిలో బియ్యం బ్యాగ్లు అందిస్తున్నారు. అయితే వీటిలో జిల్లా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారుల అవినీతి వలన పురుగుల బియ్యంను అందజేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులకు ఫిర్యాదులు ఈ బియ్యం సరఫరా చేయడం జూన్ నెలలో ప్రారంభించారు. అయితే రెండో విడతలో పాఠశాలలకు సరఫరా అయిన బియ్యం చాలా వరకు నాసిరకంగా, పురుగులు ఉన్నాయని పాఠశాలల హెచ్ఎంలు విద్యాశాఖ, సివిల్ సప్లయ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులు జిల్లాస్థాయిలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారికి చేరినా చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల ప్రారంభంలో సన్నబియ్యం నెల్లూరు, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి సరఫరా జరిగాయి. తొలి విడతలో నాణ్యమైన బియ్యం వచ్చాయి. అందువలన దీనిలో మార్పులు జరగకుండా క్యూఆర్ కోడ్ టాగింగ్ విధానం ఏర్పాటు చేశారు. అయితే రెండో విడతలోనూ ఇతర జిల్లాల నుంచి నాణ్యమైన బియ్యమే వచ్చినా, జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు లోకల్ బియ్యానికి క్యూ ఆర్ కోడ్ ట్యాగులు వేసి పాఠశాలలకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. దీనివలన రెండో విడతలో వచ్చిన నాణ్యమైన సన్నబియ్యం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ సిబ్బంది వైఫల్యం పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలకు అందించే బియ్యాన్ని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు తనిఖీలు చేయాలి. వాటి నాణ్యతను పరిశీలించి, అనుమతులు ఇవ్వాలి. అయితే ఈ విభాగం జిల్లా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారి నియంత్రణలో ఉంటుంది. కానీ క్వాలిటీ కంట్రోల్ అధికారి వ్యవస్థ ఈ కార్యాలయంలో నిర్వీర్యం చేయడంతో ఎటువంటి తనిఖీలు జరగడం లేదని ఈ బియ్యం సరఫరా ద్వారా తేటతెల్లమవుతోంది. వీరు కూడా ఈ బియ్యాన్ని సరఫరా చేసే మిల్లర్లతో కుమ్మకై , అవినీతికి పాల్పడి నాసిరకం బియ్యానికి అనుమతులు ఇస్తున్నారని తెలుస్తోంది. మధ్యాహ్న భోజన బియ్యంలో పురుగులు పురుగులు ఉన్నట్లు గుర్తింపు విద్యార్థుల ఎండీఎం బియ్యంపై ఎంఎల్ఎస్ పాయింట్లు, పాఠశాలల్లో విరివిగా తనిఖీలు చేయాలని ఇటీవల జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో తహసీల్దార్లు, ఇతర అధికారులు తనిఖీలు చేపట్టారు. తాజాగా కవిటి మండలంలోని ఎంఎల్ఎస్ పాయింట్లో 25 కిలోల నాణ్యమైన సన్నబియ్యం ప్యాకెట్లను తనిఖీ చేస్తుండగా, అందులో తెల్లచీమ, పురుగులు ఉన్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పురుగుల బియ్యం బాగోతం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారుల నిర్వాహకం వెలుగు చూసింది. కవిటి: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న బియ్యంలో పురుగులు ఉన్నట్లు తహసీల్దార్ బి.మురళీమోహనరావు గుర్తించారు. తొలుత ఈ విషయాన్ని విద్యార్థులు విలేకరులకు తెలియజేయగా.. వారు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బుధవారం పాఠశాలలో వంట చేస్తున్న సమయంలో వెళ్లి తనిఖీలు చేశారు. పురుగులు ఉండడం వాస్తవమేనని నిర్ధారణకు వచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్కు వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేశారు. దీనిపై జేసీ స్పందిస్తూ సంబంధిత అధికారులు, బాధ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పురుగుల బియ్యం మార్చి నాణ్యమైన స్టాక్ విడుదల చేయాలని ఆదేశించారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు
హిరమండలం: అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. మండలంలో కల్లట గ్రామంలోని ఒక ప్రైవేటు కల్యాణ మండపంలో టెక్కలి డివిజన్లోని తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు, హెచ్డీటీలు ఆర్ఎస్డీటీలు, మండల సర్వేయర్లు, వీఆర్వోలతో రెవెన్యూ అంశాలపై సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ప్రజా సమస్యల పరిష్కార వినతులు, నిషేదిత భూముల వివరాలు, ఇళ్ల స్థలాల రీ వెరిఫికేషన్ తదితర రెవెన్యూ అంశాల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పలు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులు సరైన సమాచారం చెప్పకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్లో వినతుల పరిష్కారంపై మండల గ్రీవెన్స్ మానిటరింగ్ అధికారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతిరోజూ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రైతులకు అవగాహన కల్పించాలి రీ సర్వేలో ల్యాండ్ ఎల్పీఎం(ల్యాండ్పాస్ మ్యాప్) గుర్తించి అవగాహన కల్పించాలన్నారు. రైతులు భూహద్దులు నిర్ణయించుకుని ఎల్పీఎంలు చేసుకోవడం వలన రైతు సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వర్తిస్తాయన్నారు. దీనిపై గ్రామ, మండల సర్వేయర్లకు స్పష్టమైన సూచనలు చేశారు. ఏపీ సేవా, మీసేవాలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ అంశాల సత్వర పరిష్కారానికి క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ సహాయక కలెక్టర్ డి.పృథ్వీరాజ్కుమార్, జిల్లా భూసర్వే, రికార్డుల నిర్వహణ అధికారి కె.రమేష్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డివిజన్ స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -
న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేయాలి
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లా కేంద్రంలో ఉన్న 15 న్యాయస్థానాల్లో పలు న్యాయమూర్తి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి భర్తీకి చర్యలు తీసుకోవాలని బార్ సర్వసభ్య సమావేశం తీర్మానించింది. బుధవారం కోర్టు పాత బార్ కార్యాలయంలో జిల్లా బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు తంగీ శివప్రసాదరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు మూడు నెలల ఆదాయ, వ్యయాలు మరియు మూడు నెలల ప్రాగ్రెస్ను సభ్యులకు వివరించారు. అసోసియేషన్ సమస్యలపై చర్చించి తీర్మానం చేశారు. ముఖ్యంగా జిల్లాకోర్టు ప్రాంగణంలో ఖాళీగా ఉన్న మూడు కోర్టుల మేజిస్ట్రేట్ల నియామకం చేపట్టాలన్నారు. సమావేశంలో స్టేట్ బార్ మెంబర్ జి.వాసుదేవరావు, కార్యవర్గ సభ్యులు ఇప్పిలి సీతరాజు, భవానీ ప్రసాద్, కొమ్ము రమణమూర్తి, వనజాక్షి, శంకర్ సీనియర్లు, బీసీ న్యాయవాద సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగూరు ఉమామహేశ్వరరావు, పూర్వ భారీ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, న్యాయవాదులు అన్నెపు సత్యనారాయణ, పీవీ రమణరావు, పీవీ రమణ దయాల్, నాగభూషణం, విజయ్ కుమార్, సుభాష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ● తీర్మానించిన బార్ సర్వసభ్య సమావేశం -
ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ
వజ్రపుకొత్తూరు రూరల్: ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉద్దానంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్గో ఎయిర్పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా లక్ష సంతకాల సేకరణకు సిద్ధమైనట్లు కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ, ప్రజాసంఘాల నాయకులు, బాధిత రైతులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మండలంలోని చీపురపల్లి పంచాయతీ పరిధి అనకాపల్లిలో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనసీమను తలపించే పచ్చని ఉద్దాన ప్రాంతాన్ని, తీరప్రాంతాన్ని ధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్టు వద్దన్నారు. తమ అభిప్రాయాలను పలువిధాలుగా ప్రభుత్వానికి చెప్తున్నా తమ గోడు వినిపించుకోకుండా ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో తమ బతుకులను రోడ్డున పడేయాలని కంకణం కట్టుకుందని విమర్శించారు. కార్యక్రమంలో ఎయిర్పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొరమ వాసు, నాయకులు జె.అప్పారావు, దున్న హరి, కె.తులసీదాస్, లోకనాథం, రాజు, దమయంతి, జి.లోకనాథం, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉండగా బుధవారం ఉదయం కొంతమంది వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి భారీ యంత్రాలతో సర్వే పేరిట ఈ ప్రాంతానికి వచ్చారు. ఇది గమనించిన బాధితులు చేరుకొని వాహనాలను నిలుపుదల చేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోర్టు వద్దు.. మా ప్రాంతం ముద్దు అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మందసలో... ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఈనెల 5వ తేదీన ఉదయం 9 గంటలకు ఒంకులురు గ్రామ కమ్యూనిటీ భవనంలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మిస్తే ఈ ప్రాంతానికి తీవ్రనష్టం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బత్తిన లక్ష్మణరావు, దున్న హరికృష్ణ, కొండ తులసీదాస్, లోకనాథం, భాస్కరరావు, సుంకర రాజు తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): లేబర్ కోడ్లు రద్దు, పని గంటలు పెంపు, సుప్రీంతీర్పు ప్రకారం జీతాలు ఇవ్వాలని కోరుతూ జూలై 9వ తేదీన జరగనున్న సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు టి.తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.అప్పలరాజు, మున్సిపల్ ఇంజినీరింగ్ జిల్లా కార్యదర్శి ఆర్.సతీష్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం వద్ద కరపత్రాలు గురువారం ఆవిష్కరించారు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం దుర్మార్గమన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా, అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కార్మికులకు సంక్షేమ పథకాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వై.శ్యామలరావు, సరస్వతీ, కరుణ, జి.లక్ష్మి, పార్థసారధి, జె.గురుమూర్తి, రసూల్, చంటి తదితరులు పాల్గొన్నారు. -
మా ఊరు బడి.. మాకు కావాలి
ఆమదాలవలస: మండలంలోని గాజుల కొల్లివలస పాఠశాలను ఆర్ఆర్ కాలనీలో విలీనం చేయడం ప్రభుత్వానికి తగదని విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ మేరకు పాఠశాల వద్ద బుధవారం నిరసన చేపట్టారు. 30 మంది విద్యార్థులున్న పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాల తరలించే ప్రయత్నం మానుకోవాలని లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే వారం రోజులుగా విద్యార్థులకు హాజరు కూడా వేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించకుంటే దశలవారీగా దీక్షలు చేసి నిరాహార దీక్ష చేపట్టేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు మొండేటి కూర్మారావు, విద్యార్థుల తల్లిదండ్రులు సవలపురపు కృష్ణ, శ్రీనుగోక రమేష్, పాలకొండ శంకర్, నవిరి రమణ, నీలవేణి, శంకర్, సంగమేశ్వర్, సవలాపురపు శాంతి కుమారి, రాజు, పైడి లక్ష్మి, నవిరి రాజు, రాణి, గొర్రెల సంధ్య, దుప్పలపూడి రజిని తదితరులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్ల జీవితాలతో ఆటలా?
అసెంబ్లీలో ప్రస్తావించినా.. ఇచ్ఛాపురం నియోజకవర్గ కేంద్రంలో వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ జరిగేదని, దాన్ని శ్రీకాకుళం తరలించడంతో ఆటో కార్మికులు అవస్థలు పడుతున్నారని, వెంటనే ఇచ్ఛాపురంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు అనుమతులు ఇవ్వాలంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ప్రస్తావించినప్పటికీ తమకు ఇంత వరకు న్యాయం జరగలేదని ఆటో కార్మికులు బహిరంగంగా విమర్శించారు. అటు పాలకులు, ఇటు అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, కార్యదర్శి ఎస్.లక్ష్మీనారాయణ, ఇచ్ఛాపురం ఆటో యూనియన్ అధ్యక్షుడు ఉలాసి యర్రయ్యరెడ్డి, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం రూరల్ : కూటమి ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఇచ్ఛాపురంలో ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి రావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలకు చెందిన సుమారు రెండు వేల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు లొద్దపుట్టి ధనరాజుల తులసమ్మ ఆలయం వద్ద నుంచి ఇచ్ఛాపురం ప్రాంతీయ రవాణా అథారిటి(ఆర్టీఓ) కార్యాలయం వద్దకు వాహనాలతో ర్యాలీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా సీఐటీయు ప్రతినిధులు, ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ గతంలో వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఇచ్ఛాపురంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద అధికారులు జారీ చేసేవారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆటోల ఫిట్నెస్ కోసం 130 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రమ్ముంటున్నారని, దీంతో రెండు వైపులా 260 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రవాణా శాఖ ఆదేశాలు ప్రకారం ఆటో 60 కిలో మీటర్ల మేరకు మాత్రమే ప్రయాణించాలన్న నిబంధనలు ఉండగా.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సుదూర ప్రాంతం ప్రయాణించడం ద్వారా ఒక్కో ఆటో కార్మికుడికి రెండు వేల రూపాయల వరకు ఖర్చవుతుందని వాపోయారు. ఇప్పటికే ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం శ్రీకాకుళం వెళ్లిన ఇద్దరు ఆటో కార్మికులు మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం వెళ్లాలా? ఇచ్ఛాపురంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన ఆటో, క్యాబ్ డ్రైవర్లు సీఐటీయు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ -
హామీల అమలులో సర్కారు తీరిదీ..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయకపోగా అప్పటివరకు ప్రజలకు అందుతున్న సేవలు, పథకాలను అటకెక్కించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాత్రమే కాకుండా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు, కూన రవికుమార్, గొండు శంకర్, నడుకుదిటి ఈశ్వరరావు తదితరులు సూపర్ సిక్స్తో పాటు వ్యక్తిగత హామీలిచ్చారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ అమలు చేయలేదు. ఎన్నికలు అయిపోయాక అబ్బే.. తాము అసలు అలాంటి హామీలే ఇవ్వలేదన్నట్టుగా గజినీని మించిపోయేలా నటించేస్తున్నారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అయితే వీరిని సోషల్ మీడియా మరిచిపోవడం లేదు. ప్రతీ హామీని గుర్తు చేస్తోంది. అయినప్పటికీ మభ్యపెట్టడం, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంతోనే కాలం గడిపేస్తున్నారు. తాజాగా ఏడాది పాలనలో ఏదో ఉద్ధరించేశామన్నట్టు ‘సుపరిపాలన – తొలి అడుగు’ అంటూ కట్టుకథలు ఎన్నైనా చెప్పవచ్చని నిస్సిగ్గుగా ప్రజలకు వద్దకు వెళ్తున్నారు. కూటమి నాయకులు ఇచ్చిన కొన్ని హామీలను పరిశీలిస్తే... -
ఒక్క అడుగు పడితే ఒట్టు...
● పాతపట్నంలె 50 పడకల సీహెచ్సీ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అమలు చేస్తామని హామీ అమలు చేయలేదు. ● పాతపట్నంలో మహిళా కళాశాల, సాంకేతిక కళాశాల(పాలిటెక్నికల్ కళాశాల) ఏర్పాటు కాలేదు. ● బూరగాం వద్ద మహేంద్ర తనయా నదిపై వంతెన నిర్మాణం చేపట్టలేదు. ● హిరమండలం మండలం కల్లట–జిల్లెడుపేట గ్రామాల మధ్య మహేంద్ర తనయా నదిపై వంతెన నిర్మాణం అమలు కాలేదు. ● ఐటీడీఏ ఏర్పాటు కాలేదు. ● కొత్తూరులో డిగ్రీ కళాశాల, రైతు బజారు, మహిళా కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకాలేదు. ● నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదు. -
నేడు వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. అరసవల్లి రోడ్డు లోని హోటల్ సన్రైజ్లో గురువారం మధ్యా హ్నం 3గంటలకు మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన సమావేశం జరగనుందని పేర్కొన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ స్పీకర్, శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పార్టీ కో–ఆర్డినేటర్ తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు హాజరుకానున్నారని తెలిపారు. సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో గల సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ డీసీసీబీ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 10,001 గారెలతో అభిషేకం కాశీబుగ్గ: కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో బంకేశ్వరమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామికి బుధవారం 10,001 గారెలతో అభిషేకం చేశారు.పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గొట్టా బ్యారేజీ నీరు విడుదల హిరమండలం : ఖరీఫ్లో శివారు ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి గొట్టా బ్యారేజీ నుంచి ఎడమ ప్రధాన కాలువలోకి నీరు విడుదల చేశారు. అనంతరం గొట్టా బ్యారేజీ నీటి నిల్వ, ఔట్ ఫ్లో, ఇన్ ఫ్లో ప్రవాహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వంశధార అధికారులు మాట్లాడుతూ బ్యారేజీలో ప్రస్తుతం 38.1 మీటర్ల నీటిమట్టం ఉందన్నారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, వంశధార ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్లు ఎ.రవీంద్ర, ఒ.ఆనందరావు, వంశధార ఎస్ఈ స్వర్ణకుమార్ పాల్గొన్నారు. సీజీఎల్ పరీక్షల దరఖాస్తుకు తుది గడువు రేపే శ్రీకాకుళం పాతబస్టాండ్: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)–2025 సంవత్సరానికి సంబంధించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారంతో గడువు ముగియనుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ ‘బి’, ‘సి’ పోస్టులు 14582 ఖాళీలు ఉండగా, ఆగస్ట్ 13 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 4వ తేదీ రాత్రి 11 గంటలు కాగా, ఫీజు చెల్లింపునకు గడువు జూలై 5వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఉందని వివరించారు. జూలై 9 నుంచి 11 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉందని తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్, పోస్టల్ అసిస్టెంట్, ఆడిటర్ వంటి 37 రకాల ఉద్యోగాలు భర్తీ కానున్నాయని చెప్పారు. -
హామీలు ఘనం... అమలు శూన్యం
● కోడిరామ్మూరి స్టేడియం నిర్మాణం పూర్తి కాలేదు. ● శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలకు ఎటువంటి అడుగులు పడలేదు. ● మత్స్యకారుల కోసం మినీ జెట్టీల ప్రతిపాదనలే జరగలేదు. ● నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలుకాలేదు. కూల్చివేతలు, పాతపనులపై మెరుగులు దిద్దడం తప్ప చేసిందేమీ లేదు. ● నగరంలో రోడ్లు అభివృద్ధి పేరిట గుంతలు కప్పి డబ్బులు వృథా చేశారు. అవన్నీ మళ్లీ గుంతలుగా మారాయి. ● పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తామన్నా.. ఆ ఊసేలేదు. -
ఏదీ అభివృద్ధీ..
● టెక్కలిలో వైద్య కళాశాల ఊసే లేదు. ● వంశధార ప్రధాన కాలువకు సిమెంటు లైనింగ్ పనులు చేయలేదు. ● శివారు ప్రాంతానికి సాగునీరు అందించలేదు. ● ఎత్తిపోతల పథకాలు నిర్మించి వంశధార నీరు చేరని ప్రాంతాలకు నీరందిస్తామన్నారు. అందించలేదు. ● నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించలేదు. ● జిల్లా కేంద్రానికి దీటుగా టెక్కలిని అభివృద్ధి చేస్తామన్నా.. ఎక్కడా చేయలేదు. ● పర్యాటకాభివృద్ధికి భావనపాడు నుంచి విశాఖ వరకు సాగర కారిడార్ హామీ నెరవేరలేదు. ● ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్ ఏర్పాటుకు అతీగతి లేదు. ‘పేట’లో కానరాని పురోగతి.. ● బొంతు ఎత్తిపోతల పథకం పూర్తి చేయలేదు. ● మడపాం ఎత్తిపోతల పథకం ఊసేలేదు. ● వంశధార కాలువల అభివృద్ధికి కనీసం అడుగులు పడలేదు. ● ప్రతి ఇంటికీ తాగునీరు ఎక్కడా అందించలేదు. ● నరసన్నపేట సామాజిక ఆసుపత్రి ఆధునీకరణ జరగలేదు. ● వనితమండలం వంతెన నిర్మాణం జోలికే పోలేదు. ● శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్టును వినియోగంలోకి తేలేదు. ● స్టేడియం పనుల్లో పురోగతి లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. ● పలాసలో రైతు బజారు ఏర్పాటు కాలేదు. ఇండోర్ స్టేడియం కోసం ఒక్క అడుగు కూడా పడలేదు. ● కేటీరోడ్డు, కాశీబుగ్గ రైల్వే గేటు ఫ్లై ఓవర్ వంతెన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ● కిడ్నీ సమస్యలపై పరిశోధనలకు ఊతమిస్తామన్నారు. ఉన్న ఆసుపత్రిపై నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ● జీడికి మద్దతు ధర ఇవ్వలేదు కదా ఉన్న ధరలు పడిపోతున్న పరిస్థితి. ● పేదలకు మూడు సెంట్లు స్థలం ఒక్కరికీ ఇవ్వలేదు. అతీగతీ లేదు... ● నారాయణపురం ఆనటకట్ట అభివృద్ధి ఊసే లేదు. ● నాగావళి–వంశధార నదుల అనుసంధానం ఎక్కడికక్కడే ఉంది. ● బలసలరేవు వంతెన నిర్మాణానికి అతీగతీ లేదు. ● రైతు కూలీలకు కార్పొరేషన్ ఊసేలేదు. ● ఉద్యోగం చేసే మహిళలకు హాస్టల్ వసతి ప్రతిపాదనకే నోచుకోలేదు. టెక్కలి -
చంద్రబాబు హామీలు నీటి మూటలు
● పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఎ, ప్రభు త్వ మహిళా డిగ్రీ కళాశాల,అగ్నిమాపక కేంద్రం, 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. ● ఆమదాలవలస నియోజకవర్గంలో పురుషోత్తపురం వద్ద వంశధార నదిపై, ముద్దాడపేట వద్ద నాగావళి నదిపై వంతెన పనులు, నారాయణపు రం ఆనకట్ట ఆధునీకరణ పనులు పూర్తి చేస్తాం. వంశధార ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తాం. ● నియోజకవర్గానికొక ఇంజినీరింగ్ కళాశాల. పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు. కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు. జీడి పిక్కల 80 కిలోల బస్తా మద్దతు ధర రూ.16 వేలు చేస్తాం. ఆఫ్షోర్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వంశధార కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేస్తాం. పలాసలో రైతు బజారు ఏర్పాటు. ఇవేవీ అమలుకాలేదు. ● వంశధార, నాగావళి నదులను అనుసంధానం, నరసన్నపేట పరిధిలో ఎత్తిపోతల పథకం పూర్తి, వంశధార– బాహుదా నదుల అనుసంధానం చేస్తామన్నా.. ఆ ఊసేలేదు. ● పలాసలో డిఫెన్స్ కోచింగ్ సెంటర్, టెక్కలిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాం. బుడగట్లపాలెంలో మత్స్యకార జెట్టీ నిర్మాణం చేస్తాం. పలాస–కాశీబుగ్గలో రైల్వే ఫ్లై ఓవర్ వంతెన పూర్తిచేస్తాం. కళింగ వైశ్యులను ఓబీసీలో చేర్చుతాం. వీటిలో ఒక్కటంటే ఒక్కటీ అమలు కాలేదు. -
అనుసంధానమా.. అదెక్కడ
● గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలమిస్తామన్నా ఒక్కరికీ ఇవ్వలేదు. ● వంశధార జలాలు ఇచ్ఛాపురం వరకు మళ్లించే ప్రాజెక్టు పూర్తి కాలేదు. ● ఇంటింటికీ తాగునీరు.. అతీగతి లేదు. ● బాహుదా, మహేంద్రతనయ నదులపై సాగునీటి ప్రాజెక్టులను ఆధునీకరణ ప్రతిపాదనలే కన్పించడం లేదు. ● గంగాసాగరం జలాశయం పనులు అడుగు కూడా ముందుకు పడలేదు. ● రూర్బన్ నిర్మాణాలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. ● బెంతొరియా సమస్యలపై ముఖం చాటేస్తున్నారు. -
ఎక్కడి పనులు అక్కడే..
● బుడగట్లపాలెంలో పిషింగ్ హార్బర్, జెట్టీ నిర్మాణం పూర్తి చేయకపోగా గత ప్రభుత్వంలో ప్రారంభించిన పిషింగ్ హార్బర్ పనులను నిలిపివేశారు. ● తోటపల్లి కాలువ ద్వారా పూర్తిస్థాయిలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. ● మడ్డువలస కాలువ, నారాయణపురం కాలువ పనులు పూర్తి కాలేదు. ● బుడుమేరు చెరువును మినీ రిజర్వాయర్గా చేస్తామన్న ఊసేలేదు. ● మత్స్యకారుల వలసలు నివారించే ప్రయత్నమే జరగడం లేదు. ● స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదు. ● ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదు. -
కూటమి పాలనలో భ్రష్టుపట్టిన వైద్య రంగం: సీదిరి అప్పలరాజు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష పాసై, ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్యను పూర్తి చేసి.. నిబంధనలు ప్రకారం ఇంటర్నషిప్ కూడా కంప్లీట్ చేసి.. దాదాపు ఏడాది కావస్తున్నా వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి పీఆర్ చేయకపోవడాన్ని సీదిరి అప్పలరాజు తప్పు పట్టారు.రాష్ట్రంలో తగినన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు లేకపోవడం.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య ఖరీదు కావడం వల్లే చాలా మంది విదేశాల్లో మెడిసిన్ విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. అనంతరం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష కూడా క్లియర్ చేసి... ఆ తర్వాత ఏడాది ఇంటర్నెషిప్ పూర్తి చేసుకున్నా వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యారన్న సాకుతో రిజిష్ట్రేషన్ నిరాకరస్తున్నారని... మన దేశంతో పాటు ప్రపంచమంతా కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకే హాజరయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు.తమకు న్యాయం చేయాలని వారు ధర్నాకు దిగితే... వారి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారించాల్సిన ప్రభుత్వం... నేరస్ధులు తరహాలో వారిని అత్యంత దుర్మార్గంగా కొట్టి పోలీసు స్టేషన్కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని.. హక్కులు కోసం ఎవరూ గొంతెత్తి మాట్లేడే వీలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్స్ డే రోజునే తమ న్యాయపరమైన డిమాండ్ కోసం ఆందోళన చేస్తుంటే వైద్య విద్యార్థులను కూడా జైల్లో పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.తెలంగాణాలో జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ పెంచాలని ఉదయం ఆందోళనకు దిగితే సాయంత్రానికి అక్కడ ప్రభుత్వం వారి సమస్యను పరిష్కరించిందని గుర్తు చేసారు. గతంలో కూడా చంద్రబాబు ఎంబీబీఎస్ పూర్తైన తర్వాత ఐదేళ్ల గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు చేయాలని నిబంధన పెట్టారని.. చంద్రబాబుకు వైద్య విద్యార్ధులను వేధించడం అలవాటేనని మండిపడ్డారు.తన నాలుగు దఫాలు పాలనలో చంద్రబాబు కనీసం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని తేల్చి చెప్పారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కేవలం తన ఐదేళ్ల పాలనలోనే నాలుగు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో నిర్మించి రాష్ట్రానికి గొప్ప మేలు చేశారని కొనియాడారు. వైయస్ రాజశేఖరరెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అప్పుడు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రయత్నం చేయలేదని.. కేవలం ప్రయివేటు మెడికల్ కాలేజీల నిర్మాణానికే మొగ్గు చూపారని స్పష్టం చేశారు.పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేసి వాటి పనులు మొదలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డాక్టర్ అప్పలరాజు తేల్చి చెప్పారు. విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను 2023-24 లో ప్రారంభించి 750 సీట్లు అదనంగా సాధించారన్నారు.చంద్రబాబు సీఏం అయ్యేనాటికి 2024-25 సంవత్సరం నాటికి మరో ఐదు కాలేజీల్లో అరవై శాతం పనులు పూర్తయితే... వాటిని మొదలు పెట్టకుండా... మాకు మెడికల్ సీట్లు వద్దంటూ లెటర్ పెట్టిన దుర్మార్గమైన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల నిర్మాణాలను నిలిపివేయడం దారుణమని.. 17 మెడికల్ కాలేజీల కోసం రూ. 8,500 కోట్లు అవసరం కాగా.. జగన్మోహన్ రెడ్డి హయాంలో సుమారుగా రూ. 2300 కోట్లు ఖర్చు పెడితే.. మరో రూ. 6.500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం కోసం రూ. 80 వేల కోట్లు అప్పు చేస్తున్న ప్రభుత్వం.. పేదలకు మెరుగైన నాణ్యమైన వైద్యం అందించడానికి ముందుకు రాకపోవడం... వైద్య రంగం పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.పక్క రాష్ట్రాల్లో వీరితో పాటు చదువుకున్న వైద్య విద్యార్దులకు రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ఏపీలో ఎందుకు చేయడం లేదని నిలదీశారు. న్యాయం చేయమని అడిగితే వైద్యులపైకూడా పోలీసులతో దాడులు చేయించడం అత్యంత విచారకరమన్నారు. ప్రభుత్వం కచ్చితంగా తన నిర్ణయాన్ని మార్చుకోని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే వైద్యరంగంలో సమూలు మార్పులు వచ్చి ఉండేవని.. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ సహా వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైందని తేల్చి చెప్పారు.ఈ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్ధితి లేదన్నారు. రూ.లక్షా అరవై ఐదువేల కోట్లు అప్పు చేసి ఎవరి సంక్షేమం చేశారని నిలదీశారు. తక్షణమే వైద్య విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించడంతోపాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
బదిలీల్లో నిబంధనలకు తూట్లు
శ్రీకాకుళం: జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రక్రియ జరుగుతుండటంతో సిబ్బంది ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలో బదిలీ ప్రక్రియ ప్రారంభి అవుతుందని ప్రకటించడంతో వారంతా డీఎంహెచ్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. 605 మందికి ఈ బదిలీలు చేపట్టాల్సి ఉంది. జూన్ 28నే బదిలీలు జరగాల్సి ఉన్నా సీనియారిటీ జాబితా తదితర అంశాలలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రక్రియను సోమవారం నాటికి వాయిదా వేశారు. జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో జరుగుతున్న నియమకాలు, బదిలీలపై తరచూ ఆరోపణలు వస్తుండం, మీడియాలో కథనాలు ప్రచురిచతం కావడంతో ఈసారి ఎవరికీ తెలియకూడదని యోచించారో ఇంకేమైనా కారణముందో తెలియదు గానీ కౌన్సెలింగ్ అర్థరాత్రి చేపట్టారు. ఉదయం నుంచి పడిగాపులు కాసిన హెల్త్ సెక్రటరీలు సోమవారం రాత్రి 8 గంటల వరకు వేచిచూడల్సి వచ్చింది. అప్పుడు ప్రారంభమైన బదిలీల ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటల వరకు కొనసాగింది. అమలుకాని నిబంధనలు.. వాస్తవానికి నియామకాలు, బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ రాత్రి వేళ జరపకూడదన్న నిబంధనలు ఉన్నా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ఏమాత్రం పట్టించుకోలేదు. హెల్త్ సెక్రటరీలకు వారి సొంత గ్రామాల్లో నియమించకూడదని, పట్టణ, నగర ప్రాంతాల్లో పనిచేసిన వారికి అదే ప్రాంతంలో వేరొక సచివాలయానికి బదిలీ చేయాలని, మండల సచివాలయాల్లో పనిచేసిన వారికి అదే మండలంలో వేరోక సచివాలయానికి బదిలీ చేయాలని ఆదేశించినా అమలు కాలేదు. నగరంలో పనిచేసిన కొందరిని వేరొక మండలంలో నియమించగా, మండలంలో పనిచేసిన కొందరిని నగరంలో నియమించారు. ఇది కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం. నగరంతో పాటు శ్రీకాకుళం రూరల్ మండలంలోని కొన్ని స్థానాలను బ్లాక్ చేయగా హెల్త్ సెక్రటరీలు గంటకు పైగా ఆందోళన చేయడంతో వాటిని ఖాళీగా చూపించారు. అయితే వాటిని అడిగిన వారికి కాకుండా అధికారులు అనుకున్నవారికే కేటాయించడం గమనార్హం. ఇందుకు ఉదాహరణకు ఆదివారపుపేట సచివాలయం చెప్పవచ్చు. ఈ స్థానాన్ని సీనియారిటీ జాబితాలో 100 లోపు క్రమ సంఖ్యలో ఉన్నవారు అడిగినప్పుడు ఖాళీ లేదని చెప్పిన అధికారులు క్రమ సంఖ్య 300 దాటిన తరువాత ఉన్న ఓ అభ్యర్థికి కేటాయించడమే నిదర్శనం. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కొందరు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇష్టారాజ్యంగా వార్డు హెల్త్ సెక్రటరీల ట్రాన్స్ఫర్లు అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు ప్రక్రియ నగరంలో ఉన్నవారికి స్థానికంగా పోస్టింగ్ ఇవ్వని వైనం రాత్రిపూట ఆందోళనకు దిగిన ఉద్యోగులు -
శాకంబరిగా విశాలక్షి
పొందూరులోని కోదండ రామస్వామి ఆలయంలో కొలువైన విశాలాక్షి అమ్మవారికి గుప్త నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా మంగళవారం అర్చకులు జగ్గుబాబు వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. – పొందూరు మోత ఆరంభం రేషన్ మోత ఆరంభమైంది. మొదటి తేదీ కావడంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద క్యూ కట్టారు. శ్రీకాకుళం గుడివీధి వద్ద ఇలా బస్తాలు మోసుకువెళ్తూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
స్థానికులకు ఇదేం శిక్షణ!
● టైలరింగ్ శిక్షణలో జిల్లా ట్రైనర్లకు చోటు కల్పించని వైనం ● విజయవాడకు చెందిన సంస్థలకే శిక్షణా అనుమతులు ● న్యాయం చేయాలని కలెక్టర్ గ్రీవెన్స్కు ఫిర్యాదు శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఈబీసీ, కాపు సామాజికవర్గాల మహిళలకు అందిస్తున్న టైలరింగ్ శిక్షణ ప్రారంభం నుంచే విమర్శలకు గురవుతోంది. అభ్యర్థుల ఎంపిక, శిక్షణ తీరు, సంస్థల ఎంపికలో ఆదిలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అభ్యర్థులకు శిక్షణ అందించే సంస్థలు స్థానికులకు కాకుండా విజయవాడకు చెందిన మూడు సంస్థలకు కట్టబెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో నైపుణ్యవంతులైన ట్రైనర్లను కాదని ఎక్కడో విజయవాడకు చెందిన సంస్థల నిర్వాహకులతో ట్రైనింగ్ ఇప్పించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ విషయమై కలెక్టర్ గ్రీవెన్స్లో సైతం ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇదీ పరిస్థితి.. బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ వర్గాలకు చెందిన 21 నుంచి 50 ఏళ్ల మధ్య గల మహిళలకు టైలరింగ్ శిక్షణ అందజేస్తున్నారు. రోజుకు రెండు షిఫ్టులో శిక్షణ అందిస్తున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు బ్యాచ్లకు శిక్షణ అందజేస్తున్నారు. శిక్షణ ఫేస్ యాప్ ద్వారా హాజరు వేయిస్తున్నారు. ఇదంతా విజయవాడ సెంట్రల్ కార్యాలయం నుంచే ఆపరేటింగ్ జరుగుతుంది. అభ్యర్థులకు 75 శాతం హాజరును తప్పనిసరి చేశారు. వీరికి మాత్రమే శిక్షణ అనంతరం కుట్టుమిషన్, సామగ్రి అందజేశారు. కలెక్టర్కు ఫిర్యాదు.. సాధారణంగా జిల్లాలో ఇచ్చే శిక్షణ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను స్థానికంగా ఉండే సంస్థలకే ఇస్తుంటారు. దీనివల్ల సంస్థలకు ఆర్థిక ఆసరా కలగటంతో పాటు నాణ్యమైన శిక్షణ అందించే అవకాశం ఉంటుంది. అయితే తాజా టైలరింగ్ శిక్షణలో కేంద్రాల మంజూరు పూర్తిగా రాజకీయపక్షంగా జరగడంతో స్థానికులకు అవకాశం కల్పించలేదు. దీంతో పలువురు కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాల నిర్వాహకులు ఇటీవల పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసుకున్నారు. జిల్లాలో పది వరకు కుట్టు శిక్షణ కేంద్రాలు ఉన్నాయని, వారికి ఉపాధి కల్పించాలని శ్రీకాకుళం నగరానికి చెందిన గాయిత్రీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు ఉమామహేశ్వరి ఫిర్యాదు చేశారు. అయోమయ శిక్షణ.. జిల్లాలో 29 శిక్షణా కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో చేరేందుకు 2800 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరికి అంతంతమాత్రంగానే శిక్షణ అందుతోంది. శిక్షణ తూతూమంత్రంగా పూర్తిచేసి అక్రమాలకు పాల్పడేలా వ్యూహరచన జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిక్షణ కేంద్రంలో మిషన్లు నాసిరకమైనవి సరఫరా చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుట్టుకు కావాల్సిన క్లాత్, ఇతర సామగ్రీ సరఫరా చేయడం లేదు. బయోమెట్రిక్ హాజరులోనూ అక్రమాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఆ మూడు సంస్థలకే.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ శిక్షణకు విజయవాడకు చెందిన శాప్, కార్డు, శ్రీ టెక్నాలజీ సంస్థలే అందిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా శిక్షణకు కావాల్సిన అర్హతలున్న సంస్థలకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం లేకుండాపోయింది. శిక్షణ ఇవ్వడం ద్వారా వచ్చే ప్రతిఫలం స్థానికులకు కాకుండా ఎక్కడో విజయవాడలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేలా ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మహిళకు మూడు నెలల్లో 360 గంటలు పాటు శిక్షణ అందించాలి. శత శాతం శిక్షణలు తీసుకున్న అభ్యర్థికి శిక్షణ ఇచ్చేందుకు రూ.28000 చొప్పున ప్రభుత్వం శిక్షణ సంస్థకు జమచేస్తుంది. -
శభాష్ అరుణకుమారి!
ఇచ్ఛాపురం రూరల్: ప్రభుత్వ ఉద్యోగులైతే చాలు.. తమ పిల్లల కోసం లక్షల రూపాయలు వెచ్చించి కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్న ఈ రోజుల్లో ఇద్దరు పిల్లల్ని సర్కారు బడిలో చదివించడం గొప్ప విశేషమని డీఈఓ సదాశివుని తిరుమల చైతన్య అన్నారు. మంగళవారం ఇచ్ఛాపురం మండలం ముచ్ఛింద్ర ప్రాథమిక పాఠశాల ప్రార్థనా సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, వారి సామర్థ్యాలను పరీక్షించారు. పాఠశాల ఉపాధ్యాయురాలు బి. అరుణకుమారి తన ఇద్దరు పిల్లల్ని అదే పాఠశాలలో చదివిస్తున్నట్లు తెలుసుకున్న అభినందించారు. ఉపాధ్యాయులంతా తమ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చదివిస్తే సర్కారు బడులపై, బోధనపై విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత నమ్మకం కలుగుతుందని చెప్పారు. ఆయన వెంట మండల విద్యాశాఖాధికారి కురమాన అప్పారావు ఉన్నారు. బీపీఈడీ, డీపీఈడీ పరీక్షలు ప్రారంభం ఎచ్చెర్ల: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వర్శిటీలో వ్యాయామ విద్యా కోర్సులైన బీపీఈడీ, డీపీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహిస్తున్న ఈ పరీక్షలు ఈ నెల 4 వరకు జరగనున్నాయి. మొదటిరోజు పరీక్షకు 359 మంది విద్యార్థులకు గాను 11 మంది గైర్హాజరయ్యారు. వర్శిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ స్వప్నవాహిణి పర్యవేక్షిస్తుండగా పరీక్షా కేంద్రాలను రెక్టార్ బి.అడ్డయ్య పరిశీలించారు. సాగుహక్కు పత్రాలు పంపించడం తగదుబూర్జ: అన్నంపేట గ్రామ పరిధిలో ఎన్నో ఏళ్లుగా దళితులు, బలహీనవర్గాలు సాగుచేస్తున్న భూములకు సంబంధించి మంగపల్లి సూర్యప్రకాశరావు అనే వ్యక్తి ఆ భూములపై తనకే హక్కు ఉందంటూ ఇప్పుడు సాగు హక్కు పత్రాలు పంపించడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగరాపు సింహాచలం అన్నారు. మంగళవారం అన్నంపేటలో సాగుదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్ మూడులో 75 ఏళ్లుగా బలహీన వర్గాలకు చెందిన 30 కుటుంబాల వారు 25 ఎకరాల భూములను వరకట్టి బాగు చేసి సాగు చేస్తున్నారని చెప్పారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో రెవెన్యూ అధికారుల సహకారంతో ఇప్పుడు హక్కు పత్రాలు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సాగులో ఉన్న వ్యక్తులకే భూముల చెందాలన్నారు. కార్యక్రమంలో దంత శ్రీరాములు, లుకలాపు అప్పలనాయుడు, ఎం.కిరణ్, సూరమ్మ, గౌరమ్మ, డి.లక్ష్మి, ఎస్.అప్పారావు, గణపతి, సూర్యనారాయణ, పి.రవి తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు రణస్థలం: కోష్ఠ సమీపంలో రాధాకృష్ణ మందిరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రణస్థలం మండలం వి.ఎన్.పురం పంచాయతీ మిందిపేటకు చెందిన మింది ఆదినారాయణ శ్రీకాకుళం వైపు బైక్పై వస్తూ రాధాకృష్ణ మందిరం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న టాటా లగేజి వ్యాన్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడు 20 నిమిషాల పాటు రక్తపు మడుగులోనే కొట్టుమిట్టాడు. అనంతరం 108 అంబులెన్సు రావడంతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైనికుడే నిజమైన దేశభక్తుడు
ఇచ్ఛాపురం రూరల్: దేశ రక్షణ వ్యవస్థలో పగలు, రాత్రి తేడా లేకుండా కంటిపై కునుకు లేకుండా దేశాన్ని కాపాడే సైనికుడే గొప్ప దేశభక్తుడని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. ఇచ్ఛాపురం మండలం టి.బరంపురం గ్రామానికి చెందిన తిప్పన పురుషోత్తంరెడ్డి 28 ఏళ్ల పాటు ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన నేపథ్యంలో మంగళవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నేటి యువతీ, యువకులు పురుషోత్తంరెడ్డి వంటి సైనికులను ఆదర్శంగా తీసుకొని దేశసేవకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, కంచిలి ఎంపీపీలు బోర పుష్ప, పైలా దేవదాసురెడ్డి, సర్పంచ్ కారంగి త్రినాథ్, ఒడిశా పాత్రపురం బ్లాక్ చైర్మన్ ఏదురు మోహనరావు, మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, మహతీ సాంస్కృతిక సేవా సంఘం అధ్యక్షుడు రంగాల జానకిరామ్, కళాకారులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యలు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: తాగునీరు, భూమస్యలను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కారిగూడ పంచాయతీ దొందమానుగూడ గ్రామ గిరిజనులు పలువురు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావును కలిసి వినతపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు మంగళవారం స్థానికంగా ఉన్న చైర్మన్ ఇంటికి వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు. మంచినీటి సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామస్థాయిలో భూ సమస్యలపై చైర్మన్తో చర్చించారు. పైనాపిల్, కొండచీపుళ్లు, చిరుధాన్యాలు వంటి పంటలకు గిట్టుబాబు ధర లేక నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చైర్మన్ సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. చైర్మన్ను కలిసిన వారిలో సవర సింహాచలం, హడ్డుబంగి శేషమ్మ ఉన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్కు గిరిజనుల వినతి -
ఉద్యోగ, రైతు వ్యతిరేక ప్రభుత్వమిది
వైఎస్ జగన్ను కలిసిన యువజన నేతలు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) :వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి. స్వరూప్, జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీలు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోయువజన విభాగ సమావేశంలో కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలపై, అన్యాయంపై గళమెత్తాల్సిన అవసరం ఉందన్నారు. వీరితో పాటు శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గ అధ్యక్షులందరూ పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యం
కంచిలి : పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనే ధ్యేయంగా బోధన సాగించాలని జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య అన్నారు. కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల జెడ్పీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ స్పెషలాఫీసర్లు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలని, ట్రాన్సిషన్ 100 శాతం జరగాలని, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు సకాలంలో నమోదుకావాలని సూచించారు. సమావేశంలో నాలుగు మండలాల ఎంఈఓలు అప్పారావు, శివరాంప్రసాద్, చిట్టిబాబు, జోరాడు, కృష్ణంరాజు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. అనంతరం పురుషోత్తపురం, ఎస్.ఆర్.సి.పురం ప్రాథమిక పాఠశాలల్ని డీఈఓ తనిఖీ చేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించారు. మోడల్ ప్రైమరీ స్కూల్ స్థాయిలో రోల్ పెంచినందుకు మౌలిక వసతుల కల్పనలో తనవంతు సహాయం చేస్తానని, ఒక ఉపాధ్యాయుడ్ని కేటాయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హెచ్ఎం ఎస్.శారద, ఉపాధ్యాయులు నల్లాన రవి, సీఆర్ఎంటీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన పి.నాగభూషణరావుకు ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు ఇచ్చిన బాండు ఇది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంయుక్తంగా సంతకాలు కూడా చేశారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ఇచ్చిన బాండులో నాగభూషణరావుకు ఆడబిడ్డ నిధి కింద రూ.18వేలు, తల్లికి వందనం కింద తన ఇద్దరు పిల్లలకు గాను రూ.30వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు చొప్పున సంవత్సరం మొత్తానికి రూ.68వేలు, ఐదేళ్లకు గాను రూ. 3లక్షల 40వేలు ఇస్తానని ఆ బాండులో రాసిచ్చారు. కానీ నాగభూషణరావుకు తొలి ఏడాది(2024–25)లో నయాపైసా ఇవ్వలేదు. తల్లికి వందనం కింద తన ఇద్దరు పిల్లలకు రావాల్సిన రూ. 30వేలు కూడా కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టేసింది. న్యూస్రీల్ -
‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ చేపట్టబోయే ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం గురువారం శ్రీకాకుళం నగరంలో అరసవల్లి రోడ్డులోని సన్రైజ్ హోటల్ వద్ద జరగనుందని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరు తూ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయ కులతో సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ సభ విజయవంతం చేయడమే మనందరి లక్ష్యమని అన్నారు. కార్యక్రమానికి జిల్లాలోగల అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పార్టీ ముఖ్య నాయకులు హాజరవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్యకుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, గ్రీవెన్స్సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఆరంగి మురళి, చిట్టి జనార్ధన, ఎన్ని ధనుంజయరావు, వైవీ శ్రీధర్, చింతు రామారావు, అంబటి శ్రీనివాసరావు, బొబ్బది ఈశ్వరరావు, పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
● మా బడిని కాపాడండి
బూర్జ: మండలంలో గల వైకుంఠపురం గ్రామ ప్రాథమిక పాఠశాలను వేరే పాఠశాలకు తరలించవద్దని గ్రామ సర్పంచ్ బొడ్డేపల్లి వెంకట సత్యంతో పాటు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. 3, 4, 5 తరగతులను ఉప్పినివలస గ్రామంలో గల ప్రైమరీ మోడల్ స్కూల్కు తరలించారని వారు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హైవే క్రాసింగ్, కెనాల్ క్రాసింగ్ కారణాల వల్ల నిలుపుదల చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాఠశాలను తరలించే ప్రయత్నం చేస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాల హెచ్ఎం విధుల్లో ఉండగానే నిరసన చేపట్టారు. వైకుంఠపుర పంచాయతీతోపాటు గ్రామాలు బొడ్డపాడు, గిరిజన గ్రామం అల్లెపల్లి గూడ ఉన్నాయన్నారు. శ్రీకాకుళం–పాలకొండ ప్రధాన రహ దారి దాటి పాఠశాలకు విద్యార్థులు ఎలా వెళ్తార ని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్ విద్యాకమిటీ చైర్పర్సన్ టి.హైమావతి ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. -
నేడు వంశధార నీరు విడుదల
హిరమండలం: జిల్లాలో ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వంశధార గొట్టాబ్యారేజీ నీటి విడుదలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా గొట్టా బ్యారేజీ నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా బుధవారం నీటి విడుదలకు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, వంశధార ఉన్నతధికారుల చేతులమీదుగా నీటిని విడుదల చేయనున్నట్లు గొట్టా బ్యారేజీ డీఈఈ బి.సరస్వతి మంగళవారం తెలిపారు. వర్షాలు ఆశాజనకంగా లేకున్నా బ్యారేజీలో కొంతవరకు నీటిని నిల్వ చేశామని, ఖరీఫ్ అవసరాలకు తగినట్టు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్యారేజీలో 38.01 మీటర్ల నీటిమట్టం ఉంది. ఎయిర్ పోర్టు పేరుతో గ్రామాలకు రావద్దు వజ్రపుకొత్తూరు రూరల్: కార్గో ఎయిర్ పోర్టు పేరుతో సర్వేలకు తమ గ్రామాలకు రావద్దంటూ బాధితులు నినాదాలు చేశారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా కార్గో ఎయిర్ పోర్టు కోసం భూ సేకరణ పేరుతో గ్రామానికి వచ్చిన సర్వే బృందాలను మంగళవారం చీపురుపల్లి శివారు ప్రాంతంలో బాధితులు అడ్డుకున్నారు. గత కొంత కాలంగా కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వామపక్ష నాయకులు, రైతులు, ప్రజా సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణి తో ఎయిర్ పోర్టు నిర్మాణానికి ముందుకు వెళ్లడం సరికాదని అన్నారు. పచ్చని ఉద్దానం నాశనం చేసేందుకు తాము సిద్ధంగా లేమని తమ పంటలను, ప్రాంతాన్ని కాపాడుకుంటామని అన్నారు. జగన్మోహినిగా.. శ్రీకాకుళం కల్చరల్: జగన్నాథ స్వామి రథయాత్రలో భాగంగా ఇల్లీసుపురం కూడలిలో గల జగన్నాథ స్వామిని మంగళవారం జగన్మోహిని అవతారంలో అలంకరించారు. సుభద్ర, బలభద్రలతో పాటుగా జగన్నాథ స్వామిని అలంకరించగా, భక్తులు అధికసంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. కూర్మనాథుని హుండీ కానుకల ఆదాయం రూ.14,16,732 గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయ హుండీ కానుకల ద్వారా రూ.14,16,732 ఆదాయం వచ్చిందని ఈఓ కె.నరసింహనాయుడు తెలిపారు. మంగళవారం ఆలయ బేడా మంటపం వద్ద పర్యవేక్షణాధికారి కె.నాగేశ్వరరావు సమక్షంలో ఆలయ హుండీలతో పాటు సమీప పాతాళ సిద్ధేశ్వరస్వామి ఆలయ హుండీలను తెరిచి లెక్కించారు. 98 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు సీహెచ్. సీతారామనృసింహాచార్యులు, అర్చకులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. -
● జ్వరాల వలస!
గ్రామంలో వైద్యసేవలను అందిస్తున్న దృశ్యం ● టీడీవలసలో ప్రతి ఇంటా జ్వరాలు జి.సిగడాం: మండలంలోని టంకాల దిగ్గువలస గ్రామానికి జ్వరం వచ్చింది. గ్రామంలో ఏ ఇంట చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. పది రోజుల నుంచి వంద మందికిపైగా జ్వరాల బారిన పడ్డారు. జ్వరంతో పాటు కాళ్ల పొంగులు, దురదలు కూడా కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. డాక్టర్ బుడుమూరు యశ్వంత్, పేకల సుమబిందు, స్థానిక ఏఎన్ఎం చిన్ని, ఎంఎల్హెచ్పీ దివ్యరాజేశ్వరితోపాటు సిబ్బందితో వైద్యసేవలను అందిస్తున్నారు. ప్రజలు తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతానికి జ్వర పీడితుల సంఖ్య తగ్గుతోందని వైద్యాధికారి యశ్వంత్ తెలిపారు. డెంగీ, మలేరియా కేసులు లేవని పేర్కొన్నారు. పది మంది మాత్రమే జ్వర పీడితులు ఉన్నారని, మిగిలిన వారు కోలుకున్నారని వెల్లడించారు. -
నేటి నుంచి ఇంటింటికీ రానున్న ప్రజాప్రతినిధులు
భయపడుతున్న ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో జనం ఎక్కడ నిలదీస్తారోనని కూటమి నేతలు కూడా భయపడుతున్నారు. ముఖ్యమంత్రేమో ఇంటింటికీ వెళ్లి చేసింది చెప్పుకోవాలని చెబుతుంటే, అసలు చేసిందేముందని ప్రజాప్రతినిధులు అభద్రతాభావంలో పడ్డారు. మరోవైపు ఎక్కడికక్కడ ఇసుక, లిక్కర్, రోడ్లు, సాగునీటి కాలువల అవకతవకలు, అక్రమాలు జరుగుతుండటంతో బహిరంగంగా ప్రశ్నిస్తారేమో, గుట్టు రట్టు చేస్తారేమో, బాగోతమంతా బయటపెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. కొత్తవి లేవు.. ఉన్నవాటికి కోత అధికారంలోకి వచ్చిన వెంటనే 50 ఏళ్లకే మహిళలకు పింఛన్ మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాలో 3,07,537 మంది అర్హులు ఉన్నారు. కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లు దాదాపు 12 వేల వరకు ఏడాది కాలంలో తీసేశారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘చంద్రబాబు.. పవన్ కల్యాణ్ అనే మేము మన రాష్ట్ర ప్రజలు మా సమష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ–జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీలోని వాగ్దానాలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం’ ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి ఇచ్చిన బాండ్లలో కూటమి నాయకులు చెప్పిన మాటలివి. ఓట్లు వేసి గెలిపించాక ఈ బాసను పూర్తిగా మర్చిపోయారు. పైగా ఏడాదిలో అన్నీ చేసేశామని చెప్పుకుంటూ నేటి నుంచి ఇంటింటికీ తిరగనున్నారు. జనం కూడా బాండ్ పేపర్లు పట్టుకుని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. తొలి అడుగులోనే ప్రశ్నించకపోతే మిగతా అడుగులు కూడా తప్పుగా పడతాయని జనం భావిస్తున్నారు. దగా కాదా? ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాది సంక్షేమ పథకాలకు పంగనామం పెట్టారు. రెండో ఏడాది తల్లికి వందనం పేరుతో కొందరికి మాత్రమే ఇచ్చి, దాంట్లో కూడా కోత పెట్టి మమ అనిపించారు. స్థానిక సమస్యలు మొదలు మేనిఫెస్టోలోని హామీల వరకు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టకపోగా గత ప్రభుత్వంలో మొదలు పెట్టిన, దాదాపు పూర్తి కావచ్చిన పనులను సైతం గాలికొదిలేశారు. దీంతో నాయకులకు నిలదీతల భయం పట్టుకుంది. వెన్నుపోటే కదా.. వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ పథకాలు బంగారంలా అమలవుతుంటే.. రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుందని భయపెట్టారు. వారు మాత్రం అవే హామీలు ఇచ్చి ఎన్నికలకు వెళ్లారు. సంపద సృష్టిస్తామని డాంబికాలు పలికి.. ఇప్పుడు సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పాలంటూ నాలుక మడతేస్తున్నారు. ఎన్నికల ముందు 143 హామీలిచ్చి పట్టుమని ఐదు కూడా అమలు చేయకుండా జనాలకు వెన్నుపోటు పొడిచారు. అన్నదాత సుఖీభవ ఏదీ..? చంద్రబాబు చెప్పిన పెట్టుబడి సాయం కోసం రైతులు కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతన్నలకు రూ. 20వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశారు. గత ఏడాది జిల్లాలో 3,14,212 మందికి సంబంధించి రూ.628.42కోట్లు మేర ఎగ్గొట్టారు. ఈ ఏడాదికి ఇంకా అతీగతి లేదు. వాయిదాల ప్రయాణం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఉచిత బస్సు ప్రయాణంపై ప్రకటన లేదు. తేదీలు మార్చుకుంటూ పోతున్నారు. కొందరికే వందనం తల్లికి వందనం పథకం గత ఏడాదికి సంబంధించి పూర్తిగా ఎగ్గొట్టేశారు. రెండో సంవత్సరం ప్రారంభమయ్యాక రూ.15వేలు కాదు రూ.13వేలు అని మాట మార్చేశారు. ఎంతమందికి ఇచ్చారో జిల్లా యూనిట్గా లెక్కే చెప్పడం లేదు. సవాలక్ష కార ణాలు చూపుతూ ఆపేశారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య అధికారికంగా ప్రకటించడం లేదు. అరకొర గ్యాస్ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించారు. కానీ ఒకే సిలిండర్తో చేతులు దులుపుకున్నారు. రెండో సిలిండర్ డబ్బులు ఎంతమందికి పడ్డాయో వివరాలు చెప్పలేని స్థితిలో ఉన్నారు. ఆడబిడ్డకు అన్యాయం 19 నుంచి 60ఏళ్ల లోపు మహిళలకు నెలకి రూ.1500 ఇస్తామని చెప్పారు. ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రూ.1500 చొప్పున అందజేస్తామని చెప్పారు. జిల్లాలో ఈ పథకం కింద 7,59,692 మంది అర్హులై ఉన్నారు. వీరంతా తమకు రూ.1500 ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక సంవత్సరానికి సంబంధించి రూ. 113.95కోట్ల మేర కోల్పోయారు. విద్యార్థులకు ఫీజు కష్టాలు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. వసతి దీవెన, విద్యా దీవెన అందించలేదు. జిల్లాలో 45,657మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.107 కోట్ల వరకు ప్రభుత్వం బకాయిలు పడి ఉంది. వసతి దీవెన సంగతి దేవుడెరుగు. పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన పి.రమణరావుకు ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు అందజేసిన బాండు ఇది. ఆడబిడ్డ నిధి కింద రూ.18వేలు, తల్లికి వందనం కింద రూ.15వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు చొప్పున సంవత్సరానికి రూ.53వేలు, ఐదేళ్లకు గాను రూ.2లక్షల 65వేలు ఇస్తామని బాండులో రాసిచ్చారు. 2024–25లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. భృతి ఎక్కడ..? ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగం వచ్చే వరకు నెలకి రూ.3వేల భృతి ఇస్తాం అంటూ ప్రకటించిన చంద్రబాబు అండ్ కో ఆ ఊసే మర్చిపోయారు. ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. 7,28,210 మందికి రూ. 218.46కోట్ల మేర ఇవ్వకుండా మొండి చేయి చూపారు. రెండో ఏడాది కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా వలంటీర్లు, ఎండీయూ ఆపరేట ర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం ఆయా లు, వైద్య శాఖలో తాత్కాలిక ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితర చిరుద్యోగులను తీసేశారు. కూటమి నేతల్లో ఆందోళన తొలి అడుగు పేరుతో ప్రజల్ని కలవనున్న నేతలు చేసింది చెప్పాలంటున్న చంద్రబాబు చేసిందేముందంటున్న నాయకులు ఏడాది దాటినా అమలుకు నోచుకోని హామీలు ముందుకు సాగని అభివృద్ధి పనులు -
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
పలాస: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీదారుల వినతులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్పప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఉప ఖజానా కార్యాలయంలో ప్రజా సమస్యల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 120 వినతులు స్వీకరించారు. దీనిలో ముఖ్యంగా పింఛన్లు, భూ సమస్యలు, రోడ్లు, డీ–పట్టా భూములు, మంచినీరు, గృహ నిర్మాణాలు, సదరం, రేషన్కార్డులు వంటి సమస్యలపై ఫిర్యాదులు ఉన్నాయి. వైద్యులను నియమించాలి కాశీబుగ్గలో గత ప్రభుత్వంలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించాలని ఉద్దానం ఆరోగ్య పరిరక్షణ కమిటీ ప్రతినిధులు విన్నవించారు. ప్రతిరోజూ ఉద్దానం ప్రాంతం నుంచి రోజుకు కనీసం 60 మందికి తగ్గకుండా డయాలసిస్ చేయించుకోవడానికి వస్తున్నారని, అందుకే డయాలసిస్ యూనిట్లను పెంచాలని విన్నవించారు. అలాగే సీరం క్రియేటిన్ 3 దాటిన వారికి కనీసం రూ.5 వేలు ఫించను ఇవ్వాలని, ఆస్పత్రిలో రోగులకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలని కోరారు. అదేవిధంగా తమకు సంబంధించిన జిరాయితీ భూమిని పలాస పెద్దవీధికి చెందిన టీడీపీ కౌన్సిలర్ భర్త కృష్ణనాయక్, అతని బంధువులు పొందర త్రిలోచన, పొందర బలరాం, పొందర ప్రభాపాత్రో తదితరులు ఆక్రమించుకోవడానికి చూస్తున్నారని పలాసలోని ఉదయపురం గ్రామానికి చెందిన రాజాం ఆదమ్మ, ఆమె కుమారులు గణపతి, సురేష్, రవి, గిరి, మురళి తదితరులు వినతిపత్రం అందజేశారు. ఉద్దానం ప్రాంత జీడి పిక్కలకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని జీడి రైతాంగ కమిటీ ప్రతినిధులు కోరారు. నందిగాం మండలం కణితూరు శ్మశానవాటికకు విద్యుత్ లైన్ ఏర్పాటు విషయంలో టీడీపీ నాయకులు రాజకీయం చేస్తూ పనులు అడ్డుకుంటున్నారని ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జెడ్పీ సీఈవో ఎల్.శ్రీధర్రాజు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్కుమార్, డ్వామా పీడీ సుధాకర్, పలాస ఆర్డీవో జి.వెంకటేష్, డీఎంఅండ్హెచ్వో కల్యాణబాబు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవిత, పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ ఎన్.రామారావు, పలాస తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల పరిష్కారానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి సంబంధిత అర్జీదారుని వద్దకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి మాట్లాడి వారికి నాణ్యమైన సమాచారం అందజేయాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీఈపీడీసీఎల్, సర్వే, భూగర్భ గనులు, ఇరిగేషన్, తదితర శాఖల సమస్యలపై 217 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్పప్నిల్ దినకర్ పుండ్కర్ పలాసలోని పీజీఆర్ఎస్లో 120 వినతుల స్వీకరణ -
బాబును బతికించండి
ఇచ్ఛాపురం రూరల్: ఆ బాబు వయసు పది నెలలు. నవ్వితే నిండు చందమామలా ముద్దుగా ఉంటాడు. తండ్రి పెయింటింగ్ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉన్నట్టుండి ఈ బాలుడికి అనారోగ్యం చేసింది. చూస్తుండగానే అది ప్రాణాంతకంగా మారిపోయింది. ఇప్పుడు బాబు బతకాలంటే రూ.20 లక్షలు ఖర్చు పెట్టి శస్త్ర చికిత్స చేయించాలి. పెయింటింగ్ పనికి వెళ్తే గానీ కుటుంబం కడుపు నిండని పరిస్థితుల్లో అంత డబ్బు తీసుకురావడం ఆ తల్లిదండ్రులకు తలకుమించిన భారమవుతోంది. బాబును బతికించుకోవడానికి వారు దాతల సాయం కోరుతున్నారు. ఇచ్ఛాపురం మండలం తిప్పనపుట్టుగ గ్రా మానికి చెందిన మజ్జి పురుషోత్తం, శాంతిలకు ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండో సంతానం రియా న్. మూడు నెలలు కిందట బాబుకు హై ఫీవర్ రావడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించారు. బ్లడ్ ఇన్ఫెక్షన్తో పాటు ఫిట్స్ రావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో విశాఖ పట్నంలో చేర్పించారు. 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన వైద్యులు పసివాడి మెదడులో ద్రవం చేరడంతో ‘హైడ్రో సెఫెలెస్ ఇన్ఫెక్షన్’కు గురయ్యాడని, శస్త్ర చికిత్స చేయాలంటూ చెప్పడంతో ఆరోగ్యశ్రీ ద్వా రా తొలిసారి ఆపరేషన్ చేశారు. అప్పటికే లక్ష రూ పాయల వరకు ఖర్చయింది. రెండు నెలలు తర్వా త బాబు తల రోజురోజుకూ పెరగడంతో మళ్లీ విశాఖ ఆస్పత్రిలో చేర్పించగా వెంటనే తిరుపతి స్విమ్స్కు లేదా హైదరాబాద్కు తీసుకువెళ్లాలంటూ వైద్యులు సూచించారు. తిరుపతిలో పరీక్షించిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేయాలని, అందుకు సుమారు రూ.20 లక్షలు వరకు ఖర్చవుతుందని చెప్పడంతో తల్లిదండ్రులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే ఎస్జీఎఫ్ సంస్థ, కాళీమాత సేవా సమితి, పూర్వ విద్యార్థులు కలసి రూ.50వేలు వరకు ఆర్థిక సాయం అందించడంతో తిరుపతి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సా యం చేయదలచుకున్న వారు 6304051247 నంబర్ను సంప్రదించాలని కోరుతున్నారు. కన్నపేగు కోసం తల్లిదండ్రుల అభ్యర్థన హైడ్రో సెఫెలెస్ ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్న చిన్నారి శస్త్ర చికిత్సకు రూ.20లక్షలు అవసరమవుతున్న వైనం దాతల సాయం కోరుతున్న తల్లిదండ్రులు -
గుర్తు తెలియని వృద్ధుడు మృతి
కంచిలి: మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ ప్రాంగణంలో గుర్తు తెలియని 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. రైల్వేస్టేషన్లో 2, 3 ఫ్లాట్ఫారంల మధ్యలో వృద్ధుని మృతదేహాన్ని జీఆర్పీ పోలీసులు సోమవారం గుర్తించారు. మృతుడు పసుపు రంగు చొక్కా, దానిపైన నీలం రంగు గీతలు ఉన్నాయి. నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ప్రాథమిక పరిశీలనలో సహజ మరణంగా జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. మృతుడిని గుర్తించేందుకు పలాస గవర్నమెంట్ రైల్వే పోలీస్స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ షరీఫ్ కేసు నమోదు చేశారు. సమాచారం తెలిస్తే 94406 27567 నంబర్కు తెలియజేయాలని కోరారు. -
వెల్ఫేర్ అసిస్టెంట్ల బదిలీలకు ముగిసిన కౌన్సెలింగ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్లకు సోమవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ను శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదన్ పర్యవేక్షణలో నిర్వహించా రు. సిఫార్సు లేఖలతోనే బదిలీలన్నీ జరగడం గమనార్హం. ఈ బదిలీల్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు అవకాశం కల్పించగా, మొదట విభిన్న ప్రతిభావంతులు, స్పౌజ్ కేటగిరీకి చెందిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించా రు. అభ్యర్థుల నుంచి ఇప్పటికే తీసుకున్న ఆప్షన్లు, ఖాళీల ఆధారంగా సీనియారిటీ పద్ధతిలో ఎంపికలు చేస్తామని తెలిపారు. అంతే కా కుండా మీకు ఫలానాచోట నియామకం కల్పిస్తామని హామీ ఇవ్వకుండానే, ఆప్షన్లు తీసుకొని పంపించేశారు. ఈ బదిలీలపై వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి జిల్లా మొత్తం 350 మందికి బదిలీల కౌన్సెలింగ్ చేపట్టినట్లు డీడీ తెలిపారు. హొన్నాళి పాఠశాల సందర్శన మందస: జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.తిరు మల చైతన్య సోమవారం మందస మండలం హొన్నాళి ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి బడిని పరిరక్షించాలని, 6, 7, 8 తరగతుల పిల్లలు సుమారు 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్క బడికి వెళ్లడం కష్టమవుతుందని వివరించారు. యూటీఎఫ్ నాయకులు కూడా డీఈఓను కలిసి ఈ మేరకు విన్నవించారు. గోవుల అక్రమ రవాణాపై కేసు నమోదు సరుబుజ్జిలి: మండల కేంద్రంలోని సరుబుజ్జిలి జంక్షన్ వద్ద ప్రధాన రహదారిలో తరలిస్తున్న గోవుల అక్రమ రవాణాకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ బి.హైమావతి తెలిపారు. ఆదివారం రాత్రి సరుబుజ్జిలి నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా బోలేరో పికప్ వాహనంలో గోవులను గుర్తించినట్లు తెలిపారు. వాహనంలో ఉన్న కొండంగి కృష్ణ, పుచ్చ లక్ష్మణరావు, ఓనము వెంకట తిరుపతి అనే వ్యక్తులను విచారించామన్నారు. వీరంతా కలిసి రుగడ ప్రాంతం నుంచి విజయనగరం జిల్లా అలమండకు కబేళాకు తరలిస్తున్నట్లు తెలిసిందని, దీంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి బండిని సీజ్ చేశామని చెప్పారు. ‘సమాన పనికి సమాన వేతనం కల్పించాలి’ శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చట్టప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఆర్టీసీ ఔట్సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్య క్షుడు టి.ముత్యాలరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆర్టీసీ శ్రీకాకుళం–1, 2 డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపోలలో ఔట్ సోర్సింగ్ కార్మి కులు దాదాపుగా 220 మంది పని చేస్తున్నారన్నారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాల పంపిణీలో న్యాయం చేయాలని కోరా రు. కార్యక్రమంలో ఏపీపీటీడీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాసరి కిరణ్, కార్యదర్శి పి.సంతోష్, జిల్లా కోశాధికారి ఆర్.నవీన్కుమార్, సభ్యులు రా మ్మోహన్, శివ, శ్యాం, నరసింహ, రాజారావు, వేణుగోపాల్, వెంకట్, పార్వతమ్మ, సావిత్రి, ఈశ్వరమ్మ తదితరులు ఉన్నారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 63 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో అర్జీదారుల నుంచి 63 ఫిర్యాదులందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులు స్వీకరించారు. ఎచ్చెర్ల మండలం కొంగరాం గ్రామానికి చెందిన నక్క దామోదరరావు అదే గ్రామానికి చెందిన కొంతమందిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గత నెల 16న తమ పొలంలోకి ట్రాక్టరు ఎందుకు తెచ్చారని తన కుటుంబీకులు అడిగినందుకు దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారన్నారు. రిమ్స్లో చికిత్స సైతం పొందామని, ఇదే విషయమై ఎచ్చెర్ల ఎస్ఐను సంప్రదించామని, న్యాయం చేయలేదు సరికదా ఎఫ్ఐఆర్ తమపై నమోదు చేశారని వాపోయారు. స్టేషన్లో దివ్యాంగుడైన తనను కాళ్లతో తన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై ఎచ్చెర్ల ఎస్ఐ వద్ద ప్రస్తావించగా అవతలి వ్యక్తులపై కేసు నమోదు చేశామని, తనపై ఆరోపణలుంటే రుజువు చేసుకోవాలన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
నరసన్నపేట: అధికారం అండతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులపై అక్రమ కేసులు బనాయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం కూటమి ప్రభుత్వం చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వారి దౌర్జన్యాలు, అక్రమాలు ఇంకెన్నాళ్లో కొనసాగవని, వారికి తగిన బుద్ధి చెబుతామని అంతవరకు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. కోమర్తి సర్పంచ్ ఉంగటి చి న్నమ్ముడు, భర్త, అత్తల పేరున ఉన్న ఆస్తులను పోలీసు బందోబస్తుతో ధ్వంసం చేయడం తెలిసిందే. ఈ సమాచారాన్ని తెలుసుకున్న కృష్ణదాస్ సోమ వారం ఉంగటి చిన్నమ్ముడు, ఆమె భర్త ఉంగటి రాజు, అత్త ఉంగటి అప్పమ్మలకు ధైర్యం చెప్పారు. మీకు పార్టీ అండగా ఉంటుందన్నారు. నరసన్నపేట మండలంలో చోడవరం, పారశిల్లి, చేనులవలస ఇలా పలు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు. జగనన్న మళ్లీ సీఎం అయిన వెంటనే వీరందరికీ తగు విధంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కృష్ణదాస్ వెంట వైఎస్సార్సీపీ నాయకులు చింతు రామారావు, రాజాపు అప్పన్న, బగ్గు రమణయ్య, కనపల శేఖరరావు బొబ్బాది ఈశ్వరరావు, యాబాజి రమేష్, కోల ఈశ్వరరావు తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
సదరం సర్టిఫికెట్ల వ్యవహారంపై సీఐ ఆరా
నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఆర్థో స్పెషలిస్టుగా పనిచేసిన రవికిరణ్ జారీ చేసిన సద రం సర్టిఫికెట్లపై నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు తన కార్యాలయంలో ఆరా తీశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన శ్రీకాకుళంలో గతంలో డీసీహెచ్గా పనిచేసి ప్రస్తుతం రాజాం సివిల్ సర్జన్ స్పెషలిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మితో సోమవారం మాట్లాడి వివరాలు సేకరించారు. నరసన్నపేట ఏరి యా ఆస్పత్రిలో పలువురు అనర్హులకు వికలాంగత్వం ఉందని రవికిరణ్ సర్టిఫై చేయడం, దానికి ఆస్పత్రి కమిటీ సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం తెలిసిందే. ఈ సర్టిఫికెట్లపై కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లడం, ఆయన పరిశీలనకు ఆదేశించడం, అవి అక్ర మమని నిర్ధారణ కావడం విధితమే. దీనిపై ఆర్థో స్పెషలిస్టు రవికిరణ్తో పాటు కమిటీలో ఉన్న వైద్యులకు వైద్య శాఖ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 30న నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశా రు. దీనికి సంబంధించి గతంలో డీసీహెచ్గా పనిచేసిన రాజ్యలక్ష్మి నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. ఎంత మంది అనర్హులకు సర్టిఫికెట్లు ఇచ్చారో అడిగి తెలుసుకున్నారు. సీఐ మాట్లాడుతూ ఈ కేసు దర్యాప్తులో ఉందని మరిన్ని వివరాల కోసం రాజ్యలక్ష్మితో మాట్లాడామని అన్నారు. -
కింజరాపు ఏజెన్సీ ద్వారా మైనింగ్ దోపిడీ
● ధ్వజమెత్తిన పేరాడ తిలక్టెక్కలి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత టెక్కలి నియోజకవర్గంలో కింజరాపు ఏజెన్సీ ద్వారా పెద్ద ఎత్తున మైనింగ్ దోపిడీ జరుగుతోందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరోపించారు. సోమ వారం టెక్కలిలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మైనింగ్ కార్యకలాపాల కోసం గతంలో విశ్వ సముద్ర, ఏఎంఆర్ సంస్థలు ఉండేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు సోదరుడు హరిప్రసాద్ నేతృత్వంలో కింజరాపు ఏజె న్సీగా మారిందన్నారు. టెక్కలి మండలంలోని గూ డేం, అడ్డుకొండ, కోటబొమ్మాళి మండలంలోని అక్కయ్యవలస, కొత్తపేట, శ్రీజగన్నాథపురం, పొడుగుపాడు, చిన్నసాన, జర్జంగి, సంతబొమ్మాళి మండలంలోని నర్సాపురం, గోవిందపురం, సంతబొ మ్మాళి, వెంకటాపురం, నందిగాం మండలంలోని తురకలకోట, సొంటినూరు, బెజ్జిపల్లి, కొండతెంబూరు తదితర ప్రాంతాల్లో మంత్రి అండదండలతో మైనింగ్ మాఫియా జరుగుతోందని దుయ్యబట్టారు. కక్ష సాధింపులు చేస్తున్నారు అనుమతులు ఉన్న క్వారీలు, క్రషర్లు, ఫ్యాక్టరీలపై కక్ష సాధింపులు చేస్తూ, అనుమతులు లేని క్వారీలు, క్రషర్లు, ఫ్యాక్టరీలను నడిపించడానికి రాజస్థాన్కు చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రతి నెలా ఒక్కో క్వారీ నుంచి మంత్రి సోద రుడికి 4 గ్రానైట్ బ్లాకులు ఉచితంగా ఇస్తున్నారని, దీంతో అక్రమ మైనింగ్ చేసినా అధికారులు పట్టించుకోకుండా ఉండేవిధంగా డీల్ కుదుర్చుకున్నారని ధ్వజమెత్తారు. నందిగాం మండలంలోని కణితూరు గ్రామంలో శ్మశానవాటికకు విద్యుత్ సదుపాయం కల్పించే విషయంలో సైతం అధికారులతో మంత్రి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉందన్నారు. తన ఆరోపణల్లో ఎక్కడైనా అవాస్తవం ఉందని నిరూపిస్తే దేనికై నా సిద్ధంగా ఉన్నానని తిలక్ సవాల్ విసిరారు. మూలపేట పోర్టు సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. -
ఉపాధ్యాయులే ఉద్యమ, సాహిత్య నిర్మాతలు
శ్రీకాకుళం కల్చరల్ : ఇటు ఉద్యమాలైనా, అటు సాహిత్య ప్రక్రియలైనా సమర్థంగా నిర్వహించగల సత్తా ఉపాధ్యాయులకు ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్లో ఆదివారం ఏపీటీఎఫ్ అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్ అధ్యక్షతన పుస్తకావిష్కరణ, పుస్తక పరిచయ సభ నిర్వహించారు. కంచరాన భుజంగరావు రచించిన ‘గీసి చెరిపే బొమ్మ’ పుస్తకాలను ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పుస్తక రూపంలో ప్రచురించారు. ఏపీటీఎఫ్ పూర్వ ప్రధాన కార్యదర్శి సీహెచ్ ప్రభాకరరావు సతీమణి చిగురుపల్లి చంద్రకళ వర్ధంతి సందర్భంగా రచయిత గంట్యాడ గౌరునాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవి తన ఆలోచనలను మెరుగుపరుచుకుంటూ చేసిన రచనకు ఈ పుస్తకం ప్రతీక అని పేర్కొన్నారు. డాక్టర్ సుంకరి గోపాలయ్య పుస్తకాన్ని పరిచయం చేస్తూ కొన్ని కవితలను చదివి వినిపించారు. కవి కంచరాన భుజంగరావు మాట్లాడుతూ తాను సాహిత్యం రాయడానికి గురువులే కారణమని చెప్పారు. అనంతరం దివికుమార్ రచించిన ‘ఉరికంబం సాక్షిగా’ పుస్తకాన్ని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి పరిచయం చేశారు. భగత్సింగ్ జీవితాన్ని ఈ పుస్తకం మనముందు ఆవిష్కరిస్తుందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ తిరుమల చైతన్య మాట్లాడుతూ శబ్దం అర్థం కలిస్తే సాహిత్యం అవుతుందని, ఉపాధ్యాయుడు బోధనలో తాత్వికుడుగా ఎదగాలని, వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సాహిత్యం అవసరమని చెప్పారు. జనసాహితీ రాష్ట్ర అధ్యక్షుడు, రచయిత దివికుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఈ పుస్తకంలో పూర్తి సాక్ష్యాలతో జీవితాన్ని, తాత్వికతను పరిచయం చేశానని చెప్పారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.అనిల్కుమార్, రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి, జనసాహితీ జిల్లా కార్యదర్శి పి.మోహనరావు, చావలి శ్రీనివాస్, సదాశివుని శంకరరావు, సీహెచ్ రామచంద్రరావు, కె.గోవిందరావు, పి.లక్ష్మణరావు, రౌతు గణపతిరావునాయుడు, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ సభలో వక్తలు -
ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడిస్తారు?
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు కొత్త పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందో లేదో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని దాసరి క్రాంతి భవన్లో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ వేతన సవరణ గడువు ముగిసి రెండేళ్లు పూర్తి కావస్తున్నా 12వ వేతన సవరణ ఊసే లేదన్నారు. అసలు పీఆర్సీ చైర్మన్ను ఇంతవరకు నియమించకపోవడం తగదన్నారు. పీఆర్సీపై ఇప్పటికై నా స్పష్టత ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమంటూ ఒక ప్రక్క ప్రకటనలు చేస్తూ కార్పొరేట్ పాఠశాలలకు తల్లికి వందనం పథకం అమలు చేయడంలో ప్రభుత్వం కుట్ర దాగి ఉందని ఆరోపించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రమణ మాట్లాడుతూ విద్యార్థులను తరలించకుండా మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా విద్యార్థులను సమీప పాఠశాలలకు తరలించి మోడల్ విధానమంటూ ఏకోపాధ్యాయ పాఠశాలలను పెంచిందని దుయ్యబట్టారు. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పాలక పురుషోత్తం, ఆర్థిక కార్యదర్శి పి.రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.తమ్మినాయుడు, చింతల రామారావు, కూన శ్రీనివాసరావు, బి.సత్యం, ఎస్.రామచంద్ర, హనుమంతు రామకృష్ణ, జి.తిరుమలరావు, డీవీఎస్ పట్నాయిక్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
ఊరి బడికి ఊపిరి
టెక్కలి: నూతన విద్యా విధానంలో భాగంగా విలీనం పేరిట జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మూసివేస్తోంది. పిల్లలు తక్కువగా ఉన్నారని, ఇతర కారణాలు చూపుతూ గ్రామాలకు సర్కారు బడులను దూరం చేస్తోంది. ఊరి బడితో ఎంతో అనుబంధం కలిగిన ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వ వైఖరి పట్ల మండిపడుతున్నారు. ఎలాగైనా తమ పాఠశాల మూతపడకుండా ఉండేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్కలి మండలం గంగాధరపేటలో గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు మౌలిక వసతులు కల్పించి అదనంగా వలంటీర్ను సైతం నియమించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సొంత ఖర్చులతో నిర్వహణ... గంగాధరపేట ప్రాథమిక పాఠశాలలో గతంలో 13 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. గత రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఈ ఏడాది పూర్తిగా ఒకే ఒక్క విద్యార్థికి పరిమితమైంది. దీంతో పాఠశాల కొనసాగింపు విషయంలో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. పిల్లలు లేకపోతే పాఠశాల ఎత్తివేస్తారని తెలిసి ఎలాగైనా పాఠశాలలో విద్యార్థులను చేర్పించి బడిని బతికించాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పటికే గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్ని తిరిగి గ్రామ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 19కు చేరింది. ఇప్పటికే ఒక టీచర్ ఉన్నప్పటికీ అదనంగా సొంత ఖర్చుతో విద్యా వలంటీర్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన మినరల్ వాటర్, ఇతర గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు తీసుకువెళ్లడానికి సొంతంగా ఆటో ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగులు పిల్లల కోసం భోజనం ప్లేట్లు, మరికొంత మంది గ్రామస్తులు బెంచీలను వితరణగా అందజేశారు. పాఠశాలకు రంగులు వేయించడమే కాకుండా పాఠశాలకు ఆనుకుని విద్యార్థుల ఆట వస్తువుల కోసం చిన్న పాటి మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ మాన్పించేశా.. గ్రామ పెద్దలు, యువకులంతా మాలో చైతన్యం కల్పించారు. ఎలాగైనా మా గ్రామంలో పాఠశాలను బతికించుకోవాలనే ఆలోచనతో టెక్కలిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పిల్లల్ని మా గ్రామంలో ప్రభుత్వ బడిలో చేర్పించాను. నాతో పాటు ఎంతో మంది ఇలాగే వారి పిల్లల్ని మా ఊరి బడిలో చేర్పించారు. – బి.శ్రీనివాసరావు, విద్యార్థుల తండ్రి, గంగాధరపేట పాఠశాలను వదులుకోం... గ్రామంలో ఎన్నో దశాబ్దాలుగా ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే ఇటీవల విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. దీంతో పాఠశాల మూసివేస్తారనే భయం మా గ్రామంలో ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలను వదులుకోకూడదనే సంకల్పంతో అన్ని వర్గాల ప్రజలతో పాటు యువకుల సాయంతో స్వచ్ఛందంగా అభివృద్ధి చేస్తున్నాం. – సంపతిరావు ధర్మారావు, గ్రామపెద్ద, గంగాధరపేట గంగాధరపేట పాఠశాలకు మూసివేత ముప్పు బడిని కాపాడుకునేందుకు రంగంలోకి దిగిన గ్రామస్తులు ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను మాన్పించి పాఠశాలలో చేర్పిస్తున్న వైనం సొంత ఖర్చులతో మౌలిక సదుపాయాల ఏర్పాటు అందరి సహకారంతో.. పాఠశాల అభివృద్ధి విష యంలో గ్రామస్తుల సహకారం మరువలేనిది. ముఖ్యంగా విద్యార్ధుల తల్లిదండ్రులు చైతన్యవంతమై ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న వారి పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించారు. బడిని బతికించుకోవడానికి మేము చేస్తున్న కార్యక్రమాలకు ఉపాధ్యాయురాలు ఎంతగానో సహకరిస్తున్నారు. గ్రామస్తులతో పాటు యువకులు, ఆర్మీ ఉద్యోగులు, మిగిలిన వారు వారి తోచినవిధంగా సాయం చేస్తున్నారు. – బమ్మిడి లక్ష్మీపతి, గంగాధరపేట, టెక్కలి మండలం గ్రామస్తుల కృషి అభినందనీయం.. గంగాధరపేటలో ప్రాథమిక పాఠశాలకు ఇటీవల బదిలీపై వచ్చాను. నేను వచ్చినప్పటికే విద్యార్థుల సంఖ్య పూర్తిగా శూన్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో విద్యార్థులను చేర్పించడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించడానికి గ్రామస్తులు పడుతున్న ఆరాటం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి గ్రామంలోనూ ఇలాగే చేస్తే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగుపడతాయి. ఇక్కడి గ్రామస్తుల కృషి ఆదర్శనీయం. – బి.భవానీ, ఉపాధ్యాయురాలు, గంగాధరపేట -
న్యాయం కోసం మృతదేహంతో బైఠాయింపు
నందిగాం/వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొరికాన చైతన్య అనే యువకుడు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోవడంతో కొండవూరు గ్రామస్తులు ఆదివారం నిరసనకు దిగారు. యువకుడి మృతదేహంతో నందిగాం మండలం కవిటిఅగ్రహరం రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రమాదానికి కారణమైన కవిటి అగ్రహారం ట్రాక్టర్ డ్రైవర్ పిట్ట మహేష్ సాయం కోసం వేడుకుంటున్న క్షతగాత్రున్ని అక్కడే విడిచి పట్టి మానవత్వం లేకుండా వెళ్లిపోయాడని, విషయం తెలుసుకున్న ట్రాక్టర్ యజమాని పిట్ట అర్జున్ ట్రాక్టర్ను నీటితో కడిగి ప్రమాద ఆనవాళ్లు లేకుండా దాచారని మండిపడ్డారు. న్యాయం చేస్తానని చెప్పి కనిపించకుండాపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల నిరసన నేపథ్యంలో కవిటి అగ్రహారం వద్ద పూండి –పలాస రోడ్డుపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతి, నందిగాం ఎస్సై షేక్ మహహ్మద్ ఆలీ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే యజమాని అర్జున్ వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం, కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు వచ్చి బాధితులతో మాట్లాడి ట్రాక్టర్ డ్రైవర్తో పాటు, ఓనర్పై కూడా కేసు నమోదు చేస్తామని, మృతుని తమ్ముడు హరీష్కు న్యాయం చేస్తామని తెలపడంతో శాంతించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు మానవత్వం చూపని ట్రాక్టర్ డ్రైవర్, ఓనర్ రోడ్డుపై ఆందోళనకు దిగిన గ్రామస్తులు -
అచ్చెన్నా..మీకిది తగునా!
నందిగాం: మండల పరిధిలోని కణితూరు శ్మశాన వాటికకు విద్యుత్ సరఫరా కోసం పంచాయతీ తీర్మాణం చేసి డబ్బులు చెల్లించినా కనెక్షన్ మంజూరు చేయకుండా విద్యుత్శాఖ అధికారులు తాత్సారం చేస్తున్నారని సర్పంచ్ పేరాడ విమల, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న మంచినీటి కోనేరు పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ నుంచి శ్మశాన వాటికకు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు అంచనాలు తయారు చేయాలని ఆ శాఖ ఏఈని కోరేందుకు ఈ ఏడాది జనవరి 7న పంచాయతీ తీర్మానం చేశారు. ఫిబ్రవరి 27న నందిగాం కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అనుగుణంగా విద్యుత్ శాఖ వారు తయారు చేసిన అంచనాల మేరకు స్తంభాలు, లైన్ కోసం ఏప్రిల్ 29న రూ.1,26,273 సంస్థకు చెల్లించారు. అనంతరం విద్యుత్ సిబ్బంది శ్మశాన వాటిక వరకు స్తంభాలు తీసుకువచ్చి రెండింటిని పాతిపెట్టారు. తర్వాత ఏం జరిగిందో గానీ మిగిలిన వాటిని అలాగే వదిలేశారు. నెలలు గడుస్తున్నా మిగతావాటిని పాతకుండా విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దీనికి కారణం రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విద్యుత్ శాఖ అధికారులపై లొత్తిడి చేసి పని జరగకుండా అడ్డుకోవడమేనని సర్పంచ్, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాల అభివృద్దికి కట్టుబడి ఉంటానని చెప్పే మంత్రి.. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉన్న పంచాయతీల్లో అభివృద్ధి జరగకుండా, అధికారులపై ఒత్తిడి చేసి పనులు జరగకుండా అడ్డుకోవడం తగదని గ్రామస్తులు అంటున్నారు. అధికారులు కూడా గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనలో ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజలకు సేవలు అందించాలని కోరుతున్నారు. ఇక్కడా రాజకీయమేనా.. గ్రామ పరిధిలోని శ్మశాన వాటికకు విద్యుత్ సదుపాయం కల్పించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి అనుకూలమైన గ్రామమనే కక్షతోనే మంత్రి అచ్చెన్నాయుడు శ్మశానవాటిక వద్ద కూడా రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యుత్ పనులు పూర్తి చేయాలి. – పేరాడ రమేష్, కణితూరు కణితూరులో శ్మశానవాటికకు విద్యుత్ సరఫరా చేయని అధికారులు రాజకీయ కక్షలో భాగమేనంటున్న సర్పంచ్, గ్రామస్తులు -
శ్రీముఖలింగంలో అధికారికంగా బాలియాత్ర
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వంశధార నదీ తీరాన కార్తీక పౌర్ణమి తర్వాత బాలియాత్ర నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం నిర్వాహక కమిటీ ప్రతినిధులు జీవితేశ్వరరావు, హెచ్.వి.దొర, అర్చకులు, భక్తులతో శ్రీముఖలింగంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా బాలియాత్ర నిర్వహించే ఘాట్లను పరిశీలించారు. వాస్తవంగా కార్తీక పౌర్ణమి మరుసటి రోజున వంశధార నదిలో దీపాలు విడిచిపెట్టి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు, బాలియాత్రకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఎంతో విశిష్టతగల ఈ యాత్రను అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు. శ్రీముఖలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, ఏకవార అభిషేకాలు, వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు, వివిధ దేవతా విగ్రహాల దర్శనం అనంతరం సాయంత్రం ఆరు గంటలకు దీపోత్సవం నిర్వహించేందుకు గ్రామ పెద్దలతో చర్చించారు. పార్టీలకు అతీతంగా పుణ్యక్రతువు నిర్వహించాలని నిర్ణయించారు. సుమారు ఐదు వేల సంవత్సరాలు క్రితం కళింగ రాజ్యంలో బాలి అనే దీవికి వెళ్లి దీపాలు విడిచిపెట్టేవారని, దీంతో వారి నౌకా వ్యాపారం విజయవంతంగా జరిగి మంచి లాభాలతో తిరిగి వచ్చేవారని పూర్వీకుల కథనం. బాలి యాత్ర వల్ల పూర్వీకులు ఆత్మకు శాంతి కలుగుతుందని, తోబుట్టువులు ఆయురారోగ్యాలతో జీవితం గడిపేవారని స్థానికులు చెబుతుంటారు. సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు కె.హరిప్రసాద్, బి.వి.రమణ, బి.యోగీశ్వరరావు, వైద్యులు సంపతిరావు జగదీష్, పైల శ్రీనివాసరావు, పంచాది రవికుమార్, అర్చకులు కొండయ్య, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి నివేదించిన నిర్వాహక కమిటీ ప్రతినిధులు కార్తీక పౌర్ణమి తర్వాత నిర్వహించాలని నిర్ణయం -
పేటలో మాటల తూటా
శ్రీకాకుళంఊరి బడికి ఊపిరిగంగాధరపేట వాసులు బడిని కాపాడుకున్నారు. మూసివేత ముప్పును తప్పించారు. –8లోసోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025పలాస, టెక్కలిలో డివిజన్ స్థాయి రెవెన్యూ సమావేశాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రెవెన్యూ పరిపాలన మరింత సమర్థంగా ఉండేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం పలాసలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫి ర్యాదుల స్వీకరణ అనంతరం, పలాస డివిజన్ అధికారుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే జూలై 2 వ తేదీన టెక్కలిలో టెక్కలి డివిజన్ రెవెన్యూ అధికారుల సమావేశం జరగనుంది. ఈ మేరకు వివరాలు తెలియజేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. సమీక్ష సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చించి, పరిష్కార మార్గాలు సూచించనున్నట్లు తెలిపారు. మేట తొలగింది.. గండం గడిచింది ఇచ్ఛాపురం రూరల్: ఇటీవల కురిసిన వర్షాలకు డొంకూరు మత్స్యకార గ్రామంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన ఆటుపోట్లకు సముద్రం–ఉప్పుటేరు మధ్య ఇసుక మేట వేయడంతో పంట పొలాల్లో ఉప్పునీరు పూర్తిగా నిండిపోయింది. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండటంతో రైతులు నారు మడులు వేసేందుకు భయాందోళన చెందారు. అధికారులు స్పందించకపోవడంతో పంచాయతీ నిధులతో ఆదివారం పంచాయతీ పాలక వర్గం పొక్లెయినర్లతో ఇసుక మేటలు(పొగురు తీత) తొలగించి ఉప్పుటేరు నీటిని సముద్రంలోకి మళ్లించారు. దీంతో అ టు అన్నదాతలు, ఇటు మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ దున్న గురుమూర్తి, సర్పంచ్ బుడ్డ కళ్యాణ్, చీకటి కృష్ణ, బాలరాజు, శివంగి మోహనరావు, బైపల్లి మోహనరావులతో పాటు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. బాహుదాకు గర్భశోకం ఇచ్ఛాపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇచ్ఛాపురంలో ఇసుక రీచ్లను ప్రభుత్వం మంజూరు చేయనప్పటికి స్థానిక నేతల సాయంతో బాహుదా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకాసురులు దర్జాగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ విదంగా తవ్వకాలు చేపట్టడంతో బాహుదానది ఇప్పటికే ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. నదికి వరదలు వచ్చేటప్పుడు నది ఉప్పొంగే సమయంలో మట్టిదిబ్బలు, వరదగట్లు రక్షణగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఇసుకాసురుల కన్ను బాహుదానదిలో గల మట్టిదిబ్బలు, వరద గట్లపై పడింది. దీంతో ఆ మట్టిదిబ్బలు, వరదగట్టులను సైతం తవ్వేస్తున్నారు. పట్టపగలే ఈ తంతు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే వరదల సమయంలో ఊరిలోకి నీరు వచ్చేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘యూజ్లెస్ ఫెలో’.. టీడీపీ వర్గాల్లో రెండురోజులుగా నలుగుతున్న మాట ఇది. జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు, కింజరాపు సోదరుల ముద్దుల మేనల్లుడు మెండ దాసునాయుడుపై సాక్షాత్తు అతని బావ కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు సమక్షంలోనే నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన ఈ పదం వాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. అంతటితో ఆగకుండా ‘గెట్అవుట్’ అని కూడా అన్నారు. అసలు అర్చనకు దాసునాయుడుపై ఇంత అసహనానికి కారణమేంటి?, అనుకోకుండా అక్కడ జరిగిన ఇష్యూ వల్లనే దాసునాయుడును అనాల్సి వచ్చిందా..? లేక మరేదైనా కారణం మనసులో పెట్టుకుని అందరిముందూ అవకాశం చూసుకుని కావాలనే ‘గెట్అవుట్’ అన్నారా..? అని ఇలా అనేక రకాలుగా పార్టీలో చర్చ జరుగుతోంది. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు దురుసుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మామ అనో, కేంద్రమంత్రి రా మ్మోహన్నాయుడు బావనో గానీ దూకుడుగా వెళ్తున్నారు. అంతా తానే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అనేక వ్యవహారాలు నడుపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను, ఇతర నాయకులను ఓవర్టేక్ చేసి చక్రం తిప్పుతున్నారు. కానీ నరసన్నపేటలో ఆయన ఆధిపత్యం సాగలేదు. దిమ్మతిరిగే విధంగా, అవాక్కయ్యేలా అవమానం ఎదుర్కొన్నారు. ప్రతి విషయంలోనూ ఆయన జోక్యం చేసుకుంటుండడంతో ఎమ్మెల్యేతో పాటు కుమార్తె ఒప్పుకోవడం లేదని, అందుకే ఇలా అన్నారనే వాదన ఉంది. అర్చన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చిచ్చు రేపాయి. పేటలో కింజరాపు కోటరీకి దన్ను నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అయినప్పటికీ అక్కడ కింజరాపు కుటుంబం ప్రత్యేకంగా కోటరీని నడుపుతోందని రమణమూర్తి వర్గం ఎన్నికల్లో సీటు కేటాయించినప్పటి నుంచే ఆరోపిస్తూ వస్తోంది. సొంత నియోజకవర్గం కావటం, బావ కేంద్రమంత్రిగా, మామ రాష్ట్రమంత్రిగా కొనసాగుతుండటంతో దాసునాయుడు ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా పనులు చేపడుతున్నారని రమణమూర్తి వర్గం నుంచి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పోలాకి మండలంలోని అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి విడిపోయి నరసన్నపేటలో చేరిన 14 పంచాయతీల టీడీపీ కేడర్ ఇప్పటికీ నిమ్మాడ నాయకత్వంపైనే ఆధారపడుతున్నారనేది వాస్తవం. ఆ గ్రామాల్లోనే దాసునాయుడు స్వగ్రామం యాట్లబసివలస కూడా ఒక టి. క్రమేణా ఆయాగ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు నిమ్మాడలో రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు అందుబాటులో లేకపోవటంతో దాసునాయుడుకు టచ్లోకి వెళ్లిపోతున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ‘గెట్అవుట్’ అని ఉండవచ్చని కొందరు అంటున్నారు. కించపరిచినందుకేనా..? అధికారంలోకి వచ్చిన తర్వాత మేనమామల అండతో దాసునాయుడు ఆధిపత్యం మరింత ఎక్కువైంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా నరసన్నపేట నియోజకవర్గం మొత్తం దాసునాయుడు జన్మదిన బ్యానర్లు, వాల్పోస్టర్లతో అనుచరులు హ డావుడి చేశారు. సోషల్మీడియాలో సైతం పేటలో కాబోయే ఎమ్మెల్యే దాసునాయుడే అంటూ రమణమూర్తిని కించపరిచేలా వ్యవహరించటం వెనుక దా సునాయుడు పాత్ర ఉందనేది అర్చన అనుమానం కావచ్చు. పట్టణంలో ఇటీవల ఒక హోటల్ ప్రారంభానికి ఎమ్మెల్యే లేకుండా దాసునాయుడు నేరుగా ప్రారంభానికి విచ్చేశారని, దీంతో బగ్గు వర్గానికి మ రింత మండినట్లు అయిందని చెబుతున్నారు. ఇవే కాకుండా వైన్స్ సిండికేట్ దగ్గర కూడా అక్కడక్కడా దాసునాయుడు వర్గంతో ఇబ్బందులు తలెత్తుతున్న ట్లు వినికిడి. ఒక సమావేశంలో ఎమ్మెల్యేను నెట్టేసినట్టు సైతం వార్తలు వినిపిస్తున్నాయి. బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ అవుతున్నాయి. సోషల్ మీడి యా వేదికగా పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు యువత అధ్యక్షుడిని పట్టుకుని అంత పెద్ద మాట అనేస్తారా అని పోస్టులు పెట్టుకు ని బాధపడుతున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా యూజ్ లెస్ ఫెలో.. గెట్ అవుట్ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. ● మార్పులే గానీ చేర్పులు లేని పింఛన్ జాబితాలు ● పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఎదు రు చూపులు తప్పడం లేదు. కూటమి పాలనలో నెలనెలా కలిపి దాదాపు 12వేల మంది పింఛన్లను తొలగించేసిన ప్రభుత్వం కొత్తవారికి మాత్రం పింఛన్ల జాబితాలో చోటు కల్పించడం లేదు. 2024 ఏప్రిల్లో జిల్లాలో పింఛన్దారుల సంఖ్య 3,20,886 ఉండగా ఈ ఏడాది మే నాటికి ఆ సంఖ్య 3,08,674కు పడిపోయింది. దాదాపు 12,212 పింఛన్లు తగ్గాయి. చనిపోయిన వారి సంఖ్య పక్కన పెట్టేసినా.. అనర్హుల పేరుతో రాజకీయ కారణాలతో తీసేసిన వారి సంఖ్యే ఎక్కువ. కొత్త పింఛన్ల మాట అటుంచితే ఉన్న పింఛన్లను కూడా ప్రతి నెలా తీసేస్తున్నారు. ప్రధానంగా దివ్యాంగులు తమ దివ్యాంగత్వం నిరూపించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. సదరం పత్రం ఉన్నా మరోసారి వెరిఫికేషన్ చేసుకోవాలని, లేకుంటే పింఛన్ నిలిపివేస్తామని నోటీసులు ఇచ్చి తొలగించడానికి కూడా వెనుకాడడం లేదు. ఇక చాలా గ్రామాల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా పింఛన్లను ఆపే క్రమం నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనే నెపంతో పింఛన్లు ఆపేశారు. జిల్లాలో దాదాపు ఇరవై వేల మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వారంతా వయోవృద్ధులు, సదరం దివ్యాంగ పత్రాలు కలిగిన వారు, ఒంటరి మహిళలు, అనారోగ్య బాధితులు. కానీ వీరికి పింఛన్లు మంజూరు చేసే అవకాశాలు కనిపించడం లేదు. వారి గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలీక అవస్థలు పడుతున్నారు. రెండు నెలల కిందట భర్త పింఛనుదారుడై ఉండి మరణిస్తే వారి భార్యకు వితంతు పింఛన్ ఇస్తామని చెప్పారు. ఇలాంటి వారు జిల్లాలో 4623 మంది ఉన్నారని లెక్కలు వేశారు. కానీ వారికి పింఛన్ మొత్తం అందడం లేదు. ఇక యాభై ఏళ్లకే పింఛన్ హామీని పాలకులు పూర్తిగా మర్చిపోయారు. న్యూస్రీల్ మెండ దాసునాయుడిపై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన తీవ్ర వ్యాఖ్యలు ‘యూజ్లెస్ ఫెలో’ అనడంతో పార్టీలో దుమారం హీటెక్కిన టీడీపీ అంతర్గత రాజకీయం వేడెక్కిన టీడీపీ అంతర్గత రాజకీయం మెండ దాసునాయుడ్ని యూజ్ లెస్ ఫెలో...గెట్ అవుట్ అంటూ ఎమ్మెల్యే కుమార్తె అర్చన చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో అంతర్గత రాజకీయం వేడెక్కింది. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి వద్ద చర్చ పెట్టాలని, ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని మెండ దాసునాయుడు వర్గం డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నుంచి మెండ దాసునాయుడే పోటీ చేస్తారని అప్పుడు చూసుకుంటామని తామేంటో చూపిస్తామని బీరాలు కూడా పలు కుతున్నారు. మరోవైపు జరుగుతున్న పరిణామాలపై బగ్గు రమణమూర్తి వర్గం కూడా నిశితంగా పరిశీలిస్తోంది. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై సమాలోచనలు చేస్తోంది. -
క్లస్టర్ ఉపాధ్యాయులకు
గోడు వినేవారు కరువు భాషోపాధ్యాయుల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. రాష్ట్ర అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెబుతున్నా మా సమస్యలు పరిష్కరించకుండా మరింత జటిలం చేస్తున్నారు. క్లస్టర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారి కష్టాలు వర్ణణాతీతం. – పిసిని వసంతరావు, చైర్మన్ భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం● ఏ పాఠశాలలో ఏ సబ్జెక్టు బోధించాలో తెలీని పరిస్థితి ● క్లస్టర్ పరిధిలో ఏ పాఠశాలకు వెళ్లాలో తెలీని వైనం ● బయోమెట్రిక్ సమయానికి వెళ్లలేమోనని ఆందోళన శ్రీకాకుళం: జిల్లాలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన క్లస్టర్ ఉపాధ్యాయ పోస్టుల్లో ఉన్న వారికి అనుకోని కష్టాలు ఎదురవుతున్నాయి. క్లస్టర్ పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ విధి విధానాలు ఇప్పటివరకు ప్రకటించలేదు. ఉపాధ్యాయుల బదిలీలకు ముందు క్లస్టర్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, అందులో నియమితులైన వారు క్లస్టర్ పరిధిలో ఎవరైనా సెలవు పెడి తే, ఆయా పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. క్లస్టర్ పరిధిలో 10 నుంచి 15 పాఠశాలలు ఉంటాయి. ఈ పాఠశాలల్లో ఎవరైనా సెలవు పెడి తే, ఆ పాఠశాలకు క్లస్టర్ ఉపాధ్యాయుడు వెళ్లా ల్సి ఉంటుంది. ఈ క్లస్టర్ పోస్టుల్లో నియమితు లైన వారంతా డీఈఓ పూల్లో ఉన్న తెలుగు స్కూల్ అసిస్టెంట్లు కావడం గమనార్హం. వీరు తెలుగు ఉపాధ్యాయులైనప్పటికి, తెలుగు బోధించే పరిస్థితి ఉండదు. క్లస్టర్ పరిధిలోని ఏ పాఠశాలలోనైనా ఎవరైనా సెలవు పెడితే వీరు బోధించాల్సి ఉంటుంది. దీంతో వీరు మనోవేదనకు గురవుతున్నారు. అలాగే ఇటీవల విద్యాశాఖ రాష్ట్ర అధికారులు ఓ ఉత్తర్వు విడుదల చేస్తూ, ప్రార్థన సమయానికి ఏ ఉపాధ్యాయుడైనా బయోమెట్రిక్ వేయకపోతే, వారిని గైర్హాజరు కింద పరిగణించి, ఆ రోజు జీతం కూడా చెల్లించకూడదని పేర్కొన్నారు. దీంతో ఎప్పుడు ఏ పాఠశాలకు వెళ్లాలో తెలీని క్లస్టర్ ఉపాధ్యాయులు మరింత వేదనకు గురవుతున్నారు. సమాచారం లోపం ఉంటే సమయానికి బడికి వెళ్లడం కుదరని పని. అలాగే క్లస్టర్ ఉపాధ్యాయుడి బయోమెట్రిక్ కూడా క్లిష్టతరంగా ఉంటోంది. ఆన్లైన్లో స్పెష ల్ డ్యూటీ అప్లై చేసుకుని, వెళ్లబోతున్న పాఠశాల లొకేషన్ నమోదు చేసి, హాజరు వేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా క్లస్టర్ ఉపా ధ్యాయులకు గండాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదీలీలు జరగక ముందు, డీఈఓ పూల్లో 200 మందికి పైగా భాషా పండితులు ఉండేవారు. వీరిలో 100 మందిని క్లస్టర్ పోస్టుల్లో నియమించగా 45 మంది హిందీ, 18 మంది ఒడియా, 60మంది వరకు తెలుగు భాషా ఉపాధ్యాయులు ఇంకా డీఈఓ పూల్ ఉన్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా 160 ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో భాషోపాధ్యాయులను నియమిస్తే, క్లస్టర్ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా డీఈఓ పూల్లో ఉంచాల్సిన పని ఉండదు. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతులు ఉన్నప్పటికి, తెలుగు పోస్టునే ఇవ్వలేదు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్లస్ ఉపాధ్యాయులు ఉన్నప్పటికి, డీఎస్సీని ప్రకటించి, క్షేత్ర స్థాయిలో ఖాళీలను చూపించేందుకు ఫీట్లు చేస్తున్నారు. ఇప్పటిౖకైనా ఈ గందరగోళ పరిస్థితిని తప్పించాలని గురువులు కోరుతున్నారు. -
వైఎస్సార్ సీపీ సమావేశానికి ముమ్మర సన్నాహాలు
నరసన్నపేట: జిల్లా కేంద్రంలోని అరసవల్లి రోడ్డులో ఉన్న సన్రైజ్ హొటల్లో జూలై 3న సాయంత్రం 3 గంటలకు వైఎస్సార్ సీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఇందులో శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా పరిశీలకులు కుంభా రవిబాబు తదితరులు ముఖ్య అతిథులు గా పాల్గొంటారని తెలిపారు. -
నవ్విపోదురు గాక..
● ఉద్దానం తాగునీటి పథకం రెండోదశ పనులకు రెండోసారి శంకుస్థాపన ● గత ఏడాదే ఈ పనులకు శ్రీకారం చుట్టిన అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ● మళ్లీ ఆ పనులకే శంకుస్థాపన చేయడంపై విమర్శలు పాతపట్నం/హిరమండలం: వైఎస్సార్ సుజల ధార ఉద్దానం ప్రాజెక్ట్.. వైఎస్ జగన్ ప్రభుత్వం రూపకల్పన చేసి, నిధులు విడుదల చేసి, పనులు పూర్తి చేసిన ప్రాజెక్టు. దశాబ్దాల తరబడి జిల్లాను పాలిస్తున్న వారు కలలో సైతం ఊహించని రీతిలో వైఎస్సార్ సీపీ సర్కారు ఉద్దానం గ్రామాల ప్రజల కోసం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చూపించింది. ఇదే ప్రాజెక్టుకు అనుసంధానంగా పాతపట్నం నియోజకవర్గంలోని 444 గ్రా మాలకు తాగునీరు అందించేందుకు పథకం విస్తరణకు సైతం శ్రీకారం చుట్టింది. అప్పట్లోనే శంకుస్థాపన కూడా జరిగింది. సరిగ్గా అవే పనులకు కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం మళ్లీ శంకుస్థాపన చేయడం హాస్యాస్పదంగా మారింది. భగీరథ ప్రయత్నం.. కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న ఉద్దానం ప్రజల కోసం రూ.700 కోట్లతో ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కరోనా కష్టకాలం ఎదురువచ్చి నా అన్నింటినీ దాటుకుని ఉద్దానం వరకు వంశధారను తీసుకువచ్చింది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు భగీరథ ప్రయత్నమే చేసింది. రూ.265 కోట్లతో పాతపట్నానికి.. హిరమండలం వద్ద ఉన్న వంశధార రిజర్వాయర్ నుంచి జలాలను తరలించి శుద్ధి చేసి నీటిని అందించాలన్నది ఈ పథకం లక్ష్యం. పాతపట్నంకు కూడా ఈ నీటిని అందించేందుకు అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి వైఎస్ జగన్ను ఒప్పించారు. ఆమె అడిగిందే తడవుగా పథకం విస్తరణకు రూ.265 కోట్లు విడుదల చేశారు. దీంతో 2024 ఫిబ్రవరి 19న అప్పటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు శంకుస్థాపన చేసి పను లు కూడా ప్రారంభించారు. ఇంతలో ఎన్నికలు వ చ్చి ప్రభుత్వం మారిపోయింది. ఏడాదిగా ఈ పను ల ఊసేలేదు. కానీ ఇప్పుడు అవే పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడం విమర్శలకు తావిస్తోంది. జెడ్పీ చైర్ను అవమానించారు.. ‘జిల్లా పరిషత్ నుంచే ఆర్డబ్ల్యూఎస్ పథకాలకు నిధులిస్తున్నాం. ఉద్దానం ప్రాజెక్టుకై తే జగనన్న ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లతో హిరమండలం నుంచి ఏకంగా ఉద్దాన ప్రాంతానికి ఇంటింటికీ తాగునీరు అందించాం. కానీ ఇప్పుడు అధికారులు నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా కొత్తగా శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇలా ప్రొటోకాల్ ఉల్లంఘించడం నన్ను అవమానించడం కాదు.. జెడ్పీ చైర్ను అవమానించడం.’ అని జెడ్పీ చైర్ పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె ఇలా స్పందించారు. పాతపట్నం నియోజకవర్గానికి హిరమండలం నుంచి రూ.265 కోట్లతో మంచినీటిని అందించే పనులకు గతంలోనే శంకుస్థాపన చేయించామని, మళ్లీ ఇవే పనులకు ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లు మళ్లీ శంకుస్థాపనకు సిద్ధమయ్యారని విమర్శించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా తనకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం ఏమాత్రం సరికాదన్నారు. -
మత్స్యావతారుడై..
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం మొండేటివీధి షిర్డీ సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రథయాత్ర ఉత్సవాల్లో స్వామిని శనివారం మత్స్యావతారంలో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఖండాలు దాటి.. కన్నవారింటికి ఇచ్ఛాపురం రూరల్: సైబీరియా నుంచి విదేశీ విహంగాలు తేలుకుంచికి చేరుకుంటున్నాయి. వీటి శాసీ్త్రయ నామం ‘అనస్థోమస్’. పక్షులు గ్రామంలోని ఊర చెరువు, గ్రామ దేవత ఆల యం వద్ద కంచి చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడే గుడ్లు పొదుగుతాయి. ఏటా జూన్ నెలాఖరులో వచ్చి తమ గ్రామంలో గుడ్లు పొదిగి, పిల్లలను సంరక్షించుకునే ఈ పక్షులను గ్రామస్తులు తమ పుట్టింటి ఆడబిడ్డగా పరిగణిస్తారు. పక్షులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా గ్రామస్తులు కాపాడుకుంటారు. -
తెలుగు వారి ధైర్యసాహసాలకు ప్రతీక రామ్గోపాల్ నాయుడు
టెక్కలి: తెలుగు వారి ధైర్య సాహసాలకు ప్రతీకగా రామ్గోపాల్నాయుడు నిలిచారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. శనివారం సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామంలో మేజర్ రామ్గోపాల్నాయుడును అభినందించి జ్ఞాపికను అందజే శారు. దేశరక్షణలో భాగంగా జమ్మూ కశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద శత్రువులను మట్టుబెట్టి తన తోటి సైనికులను రక్షించడంలో రామ్గోపాల్నాయుడు చూపిన ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శ మని గుర్తు చేశారు. దేశంలో అత్యున్నత పురస్కా రం అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్గోపాల్నాయుడు చరిత్ర సృష్టించారని కొనియాడారు. రామ్గోపాల్నాయుడును సన్మానించిన వారిలో వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, కళింగ సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, సంతబొమ్మాళి, టెక్కలి, కోటబొమ్మాళి జెడ్పీటీసీలు పాల వసంత్రెడ్డి, దువ్వాడ వాణి, దుబ్బ వెంకటరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.