Srikakulam
-
తీసుకున్నారా..?
మ్యారేజ్ సర్టిఫికెట్ ..● మ్యారేజ్ సర్టిఫికెట్ అత్యంత కీలకం ● రిజిస్ట్రేషన్తో సర్టిఫికెట్ జారీ ఇచ్ఛాపురం: ఇటీవల సీజన్లో పెళ్లిళ్లు జోరుగా జరిగాయి. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొత్త జంటలు వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీరి జీవితం కొత్తగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రభుత్వం పథకాలు రావాలన్నా, రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయించాలన్నా, పాస్పోర్టు, భూములకు సంబంధించిన మ్యుటేషన్లు ఇతరత్రా అవసరాలు ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో అప్పటికప్పుడు కార్యాలయాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతూ చివరికి సర్టిఫికెట్ల కోసం బ్రోకర్లపై ఆధారపడి ఎక్కువ మొత్తంలో సొమ్ములు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను కొత్త జంట ముందుగానే గుర్తించి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికెట్ పొందితే వారికే మంచిది. పాస్పోర్టు అప్లికేషన్, బ్యాంక్ జాయింట్ అకౌంట్, కేంద్ర, రాష్ట్ర రక్షణ బలగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సర్వీస్ రికార్డుల్లో పేరు చేర్చుకునేందుకు, ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి వీసాప్రాసెస్, వీటితో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఈ సర్టిఫికెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నవ వధూవరులు పెళ్లి చేసుకొనే ప్రదేశం ఆధారంగా గ్రామం ఐతే గ్రామ సచివాలయం లేదా పంచా యతీ కార్యాలయం, పట్టణం ఐతే వార్డు సచివా లయం లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం వివాహ శుభలేఖ, జీలకర్ర బెల్లం తలపై పెట్టుకున్న వధూవరుల ఫొటో, మంగళసూత్రం కట్టేటప్పుడు ఫొటో, పూల దండలు మార్చుకున్నప్పుడు ఫొటోలు ఉండాలి. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె జనన ధ్రువీకరణ పత్రాలు, చిరునామా ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుల జిరాక్సులను జతచేయాలి. నవవధూవరుల తరఫున ఇద్దరు సాక్షులు, వారి ఆధార్ కార్డుల జిరాక్సు లను గ్రామ/వార్డు సచివాలయం లేదా పంచాయతీ కార్యాలయంలోగానీ మున్సిపల్ కార్యాలయంకు గానీ అందజేయాలి. జత చేసిన ధ్రువీకరణ పత్రాలను జనన, మరణ రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలించి సర్టిఫికెట్ని జారీ చేస్తారు. ఆలయాల్లో వివాహం చేసుకుంటే దేవదాయ శాఖకు మందస్తుగానే రుసుం చెల్లిస్తే అధికారులు రశీదులు ఇస్తారు. వాటి ఆధారంగానే వివాహానికి సంబంధించిన ఇతర పత్రాలు ఫొటోలు సాక్షుల ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇళ్లు, కల్యాణ మండపాల్లో సంప్రదాయంగా వివాహం చేసుకుంటే అందుకు తగ్గ అన్ని రకాలు పత్రాలు సమర్పించి దరఖాస్తులు చేసుకోవాలి. పెళ్లి జరిగిన 30 రోజుల్లో మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొంటే తక్కువ ఫీజు ఉంటుంది. సాధారణంగా ఫీజు రూ.100 నుంచి రూ.500 వరకు మాత్రమే ఉంటుంది. వివాహం జరిగి 90రోజులు దాటితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి ఇందుకు ఖర్చులు కొంచెం అధికంగా ఉంటాయి. యు.ఉపేంద్ర, జనన,మరణ, రిజిస్ట్రేషన్ అధికారి, ఇచ్ఛాపురం మున్సిపాలిటి -
ఆ వ్యాఖ్యలు జుగుప్సాకరం
ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు ఏబీఎన్ రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలిఅడుగడుగునా ఆంక్షలే.. శాంతియుతంగా ఆందోళన చేసేందుకు వచ్చిన నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీస్ క్వార్టర్స్ వద్దకు చేరుకున్న నాయకులను పోలీసులు ధర్నాకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ జోక్యం చేసుకుని.. అక్కడ ఎలాంటి అంతరాయం కలిగించబోమని శాంతియుతంగా నిరసన తెలుపుతామని, ఏదైనా జరిగితే తనను అరెస్ట్ చేయవచ్చని తెలిపారు. దీంతో వీరిని నిరసనకు పంపించారు. ర్యాలీ చేయకూడదని నివారించారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదురుగా ప్లకార్డులు ప ట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో యువ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య తన వర్గంతో ఇక్కడకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వీరిని పోలీసులు రోప్ సాయంతో ఇక్కడ నుంచి పక్కకు తరలించారు. హైవేపై మోహరించిన పోలీసులు ఎవరినీ ఇటువైపు రానీయకుండా అడ్డుకున్నారు. డీఎస్పీ వివేకానంద, సీఐ అవతారంతోపాటు జిల్లాలో పదిమంది ఎస్ఐలు, సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నాను శాంతియుతంగా ముగించి పంపించారు. ఆమదాలవలసలో చింతాడ రవికుమార్ను అడ్డుకుంటున్న పోలీసులువైఎస్సార్సీపీ నేతల వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులుఎచ్చెర్ల: మహిళలపై అవమానకర వాఖ్యలు చేసిన ఏబీఎన్, అంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్చేశారు. ఎచ్చెర్లలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదురుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్యలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన రాధాకృష్ణ రాష్ట్ర మహిళలందరికీ తలవంచి క్షమాపణ చెప్పాల్సిందేనని వైఎస్సార్ సీపీ నేతలు కోరారు. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పుకునే కూటమి నాయకులు ఈ ఘటనపై స్పందించకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన రాధాకృష్ణపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్చార్జి సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కిల్లి వెంకట సత్యనారాయణ, అసెంబ్లీ నియోజక వర్గ పార్టీ పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, పిన్నింటి సాయికుమార్, కరిమి రాజేశ్వరరావు, ఎన్ని ధనుంజయ్, తూర్పు కాపు, కాళింగ, వెలమ సామాజిక విభాగాల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, ఆరంగి మురళీధర్, అంబటి శ్రీనివాస్, ఎంపీపీ పైలా వాసుదేవరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ సెక్ర టరీ నర్తు నరేంద్ర, పార్టీ నాయకులు తడక జోగారావు, బొడ్డేపల్లి పద్మజ, సనపల నారాయణరావు, చింతాడ సూర్య నారాయణ, జరుగుళ్ల శంకరరావు, లావేరు జెడ్పీ టీసీ మీసాల సీతంనాయుడు, మేధావుల ఫోరం ప్రతినిధి పిల్లల రామక్రిష్ణ, పైడి శ్రీనివాసరావు, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, పొందూరు మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాం, దన్నాన రాజీనాయుడు, గొర్లె శ్రీనివాసరావు, కొంచాడ రమణమూర్తి, లండ కిరణ్కుమార్, గొర్లె ప్రభాకరనా యుడు, మీసాల శ్రీనివాసరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గురాన మానస, కెల్ల రామకృష్ణ, అల్లు కన్నబాబు, మాడుగుల జగదీష్, డొంక రమణ, తండ్యాన లక్ష్మణ, మహంతి విజయలక్ష్మీ, గుదే శారద, వెంకన్నగారి శ్రీను, సివిల్ప్రసాద్, రౌతు శంకరరావు, గుమ్మడి రాంబాబుపాల్గొన్నారు. కాశీబుగ్గలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్ -
ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి
● నేడు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: చేసిన తప్పునకు క్షమాపణ చెప్పకపోగా మరింత దిగజారి ఏబీఎన్ రాధాకృష్ణ ప్రవర్తిస్తున్నందుకు నిరసనగా గురువా రం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదా స్ పిలుపు నిచ్చారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ కొత్త పలుకు కార్యక్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ నాయకుల భార్యలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక మీడియా సంస్థ అధినేత రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను, ఆడ బిడ్డలను నీచమైన భాషతో దూషించడం దురదృష్టకరమన్నారు. రాధాకృష్ణ ప్రవర్తనపై కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ‘రాధాకృష్ణ తీరు ఆక్షేపణీయం’ కంచిలి: ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ పత్రిక అధినేత రాధాకృష్ణ తీరు ఆక్షేపణీయంగా ఉందని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. ఆయన ఈ విషయమై బుధవారం సాయంత్రం ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్ల మెప్పు పొందడం కోసం, వారి నుంచి పొందిన ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. తన ఎల్లో మీడియాలో ఎన్నిరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయించినా కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసని రామారావు అన్నారు. మహిళలను కించపరిచే విధంగా వారి మనోభావాలు దెబ్బతీసేలా, అసభ్యకర రీతిలో, సభ్య సమాజం తలతదించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై నర్తు రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అవి కొత్త పలుకులు కావని, చెత్త పలుకులు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ మహిళను దూషించినా చర్యలు తీసుకుంటామని పలుమార్లు డైలాగులు కొట్టిన నారా లోకేష్, హోం మంత్రి అనిత ఏబీఎన్ రాధాకృష్ణపై ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎచ్చెర్ల: ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో గత ఐదురోజులుగా నిర్వహిస్తున్న ఫేర్వెల్ డే వేడుకలను బుధవారం ఘనంగా ముగించారు. ఈసీఈ ఇంజినీరింగ్ విభాగం వారు ఈ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఐదు రోజులు పాటు వినోద కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్లు సింహాచలం, యోగీశ్వరి, గగనదీప్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో ఉపాధి వేతనదారు మృతి
జి.సిగడాం: మండలంలోని వాండ్రంగి గ్రామంలో ఉపాధి పను లు చేస్తూ గుండెపోటుతో పప్పల భాస్కరరావు (59) ఒకేసారి కుప్పకూలిపోయారు. తోటి వేతనదారులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని కొత్త చెరువులో బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఉపాధి పనులు చేస్తున్నారు. సుమారుగా 10.30 గంటల సమయంలో భాస్కరరావు ఉన్నట్టుండి పని చేస్తున్న ప్రదేశంలోనే కుప్పకూలిపోయారు. 108 వాహనం వచ్చే సరికే ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతి చెందిన విషయం తెలుసుకుని ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బూరాడ వెంకటరమణ, ఏపీఓ చోళ్ల సత్యనారాయణ, వీఆర్ఓ శివనారాయణ సంఘటన స్థలం చేరుకుని వివరాలు సేకరించారు. వేతనదారు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని తోటి వేతనదారులు కోరారు. -
వధువు కావలెను
● జిల్లాలో పెరుగుతున్న ‘పెళ్లి కాని ప్రసాదులు’ ● వధువు ఓకే అంటేనే పెళ్లి అంతా 30 ఏళ్లు పైబడినవారే జాతకాల కోసం ముహుర్తాల కోసం వచ్చేవారు అధికంగా 30ఏళ్లు పైబడినవారే. చాలా మంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాం. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం, గుడివీధి యువత ఆలోచనలో మార్పు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండ డం మరో కారణం. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతుంది. – వేదుల విజయభాస్కరశర్మ, పురోహితులు శ్రీకాకుళం కల్చరల్, శ్రీకాకుళం రూరల్: జిల్లాలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇదివరకు అబ్బాయి ఓకే అంటే అమ్మాయి తరఫు వారు హమ్మయ్య అంటూ గెంతులు వేసే వారు. కానీ ఇప్పుడు ఓకే చెప్పే అధికారం పూర్తిగా అమ్మాయి తరఫు వారికే మళ్లిపోయినట్టు ఉంది. ఫలితంగా వయసు ముదురుతున్నా పెళ్లి కాక ఎంతో మంది యువకులు మిగిలిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూపించిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు తక్కువైపోయారు. అబ్బాయిలు రాజీ పడుతున్నా అమ్మాయిలు నో అంటున్నారు. పెరిగిన అడ్డుగోడలు.. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫలానా విధంగా ఉండాలని అమ్మాయిలు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సంపాదన ఒక్కటే చూడకుండా ప్రొఫెషన్ను కూడా గమనిస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లకి తక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద స్థాయిలో జీతాలు ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగాల సంబంధాలను కూడా వదిలేసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో ఉన్నత ఉద్యోగులకు అందునా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటిలాగానే డిమాండ్ ఉంది. పెళ్లికి అమ్మాయిల అనుమతి రోజులు మారాయి. అమ్మాయి కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అని అబ్బాయిలే అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా చేసుకుంటామంటున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బిఎస్సీ అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను చదివే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఈ అర్హతలు చెబితే చాలు ఇట్టే పెళ్లయిపోయేది. కానీ ఇప్పుడా పప్పులు ఉడకడం లేదు. పెరిగిన వివాహం వయసు ఒకప్పుడు అమ్మాయికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసే వారు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు కూడా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా 30 ఏళ్లు దాకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ తర్వాత అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే సరైన వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాలలో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెపుతున్నారు. అమ్మాయికి వంట వచ్చా.. అనే ప్రశ్న బదులు.. అబ్బాయి సంపాదన ఎంత అనే క్వశ్చన్ బాగా వినిపిస్తోంది. అమ్మాయి చదువుకుందా.. అని ఆరా తీయడం బదులు.. అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అన్న ఎంకై ్వరీలు మొదలయ్యాయి. కట్నం ఎంత ఇస్తారు.. అన్న మాట వినిపిస్తున్నా.. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో పురుష పుంగవులకు వివాహ రేఖలు కనిపించడం లేదు. 30 దాటినా పెళ్లి కాని వారి మగవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. -
‘కార్గో ఎయిర్పోర్టు భూ సేకరణను వ్యతిరేకిస్తున్నాం’
మందస: మందస మండలం భేతాళపురం రైతులు కార్గోఎయిర్ పోర్టుకు వ్యతిరేకిస్తూ భూ వివరాల జాబితాపై నిరసన తెలిపారు. ఈ సందర్భంలో మందస ఎమ్మార్వో కార్యాలయం, పలాస ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తమ ఆందోళన వ్యక్తం చేశారు. మందస ఎమ్మార్వో మిస్క శ్రీకాంత్కు మెమొరాండం అందజేశారు. కార్యక్రమంలో మడియా పురోషోత్తం, బత్తిన దేశయ్య, బొడ్డు శంకర్రావు, బత్తిని కృష్ణరావు, గార ఆనందరావు, బత్తిని ఉమాపతి, కీలు భీమారావు, ఇరోతు దేవరాజు, మడియా జగన్నాథం, ఆడతాల కూర్మారావు, మడియా ఋషి, బత్తిని మాధవరావు, బత్తిన మహేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు శివాజీ రాజాకు సత్కారం వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలో గల పల్లిసారథిలో బుధవారం ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజాను ఏపీ తెలుగు ఫిలిం ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కుమార్ నాయక్ సత్కరించారు. డొక్క కృష్ణారావు స్వీయ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చలన చిత్రంలో పలు సన్నివేశాలు ఉద్దాన ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం పల్లిసారథి ప్రాంతంలో చలన చిత్ర షూటింగ్ జరిగింది. చిత్రంలో నటించేందుకు శివాజీ రాజా వచ్చారు. కాగా హీరోగా, ప్రతి నాయకుడిగా సుమారు 500 పైచిలుకు సినిమాల్లో నటించినట్లు తెలిపారు. పెళ్లి సందడి, కళ్లు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ ఉద్దాన ప్రాంతంలో పర్యటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సత్కా రం చేసిన వారిలో ఫెడరేషన్ సభ్యులు కొండల ప్రకాశ్, షేక్ రాజాబాబు, మేకప్ ఆర్టిస్ట్ ఈశ్వరరావు తదితరులు ఉన్నారు. జనసేన, టీడీపీ నాయకుల కుమ్ములాట రణస్థలం: లావేరు మండలంలోని కొత్తరౌతుపేట గ్రామంలో కూటమి నాయకులు ఆల య నిర్మాణ స్థలంపై గొడవ పడ్డారు. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కొత్తరౌతు పేట గ్రామంలో కొంత స్థలంలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించేందుకు టీడీపీ నాయకులు, గ్రామస్తులు పూనుకున్నారు. బుధవారం ఉదయం ఆ స్థలంలో కొలతలు వేస్తుండగా స్థానిక జనసేన నాయకుడు మా ఇంటికి వెళ్లే రోడ్డుకు అడ్డంగా ఆలయ నిర్మాణం కట్టడం సరికాదని నిలదీశారు. ఇరు పక్షాల మధ్య కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని తోసుకున్నారు. దీంతో జనసేన నాయకుడు 100కి ఫోన్ చేయడంతో లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి వెళ్లి పరిస్థితిని గమనించి గొడవ పడవద్దని ఇరుపక్షాలకు సూచించారు. రెవెన్యూ అధికారులు వచ్చి కొలతలు వేసిన తర్వాత పనులు చేపట్టాలని చెప్పి వెనుదిరిగారు. -
భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా ‘జలధార–జలహారతి’ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి బృందాలు, వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లాలో విజయవంతంగా అమలు చేసిన జలధార కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతి గ్రామంలోనూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన బృందా లు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రజలను, సాగునీటి సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. జూలై నాటికి నిర్దేశించిన పనులన్నీ నూరు శాతం పూర్తి కావాలని, ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను ఈ నెల 15 లోపు ముగించాల ని స్పష్టం చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. శివారు భూ ములకు సాగునీరు అందేలా డ్రైయిన్లు, కాలువలకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, పూడిక తొలగింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా మిగులు జలాలను అవసరమైన చోటికి అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ లవరాజు, ఇరిగేషన్ ఎస్ఈ పొన్నాడ సుధాకర్ రావు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వంశధార, అటవీ శాఖ అధికారులు, మండల స్థాయి బృందాల సభ్యులు పాల్గొన్నారు. -
సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా బుధవారం దాడులు నిర్వహించారు. కొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన పెద్ద బురుజోల, చిన్న బురు జోల, సింగిపూర్ తదితర సరిసరాల్లో 1,080 లీటర్ల నాటు సారా, 10,500 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం జిల్లా ఎకై ్సజ్ కమిషనర్ డి.శ్రీకాంత్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ ఎం శ్రీనివాసరావు, పాతపట్నం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం టాస్క్ ఫోర్స్ ఎకై ్సజ్ అధికారులు, ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, ఉదయ్గిరి, కాశీనగర్ ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘నీరు’పయోగమేనా..?
● అభివృద్ధికి నోచుకోని అక్కలగెడ్డ ● నామ మాత్రంగా మిగిలిన గెడ్డ ● పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు కొత్తూరు: యువత మత్తుకు అలవాటు కా వద్దని స్థానిక ఎస్ఐ కె.వెంకటేష్ అన్నారు. కొత్తూరులోని రాజు వీధిలో బుధవారం రాత్రి సంకల్పం కార్యక్రమం నిర్వహించా రు. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసలైతే జీవితం అంధకారమవుతుందన్నారు. పలాస: ఉద్దానం ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే అక్కల గెడ్డ నిర్లక్ష్యానికి గురై నిరుపయోగంగా మారింది. ఈ గెడ్డ పలాస వజ్రపుకొత్తూరు మండలాల రైతులకు సుమారు 20వేలు ఎకరాలకు సాగునీరు అందించేది. అలాగే ఈ ప్రాంత ప్రజలకు తాగు నీరు కష్టాలను కూడా గతంలో తీర్చింది. ఇంతటి ప్రాధాన్యత గల అక్కల గెడ్డ నేడు నిర్లక్ష్యానికి గురైంది. ఇరిగేషన్ అధికారులు ఈ గెడ్డ ఉందన్న సంగతే మరిచి పోయారు. గత కొన్నేళ్లుగా గెడ్డలో పూడిక పేరుకు పోవడంతో పాటు, మొగిలి డొంకలు, ఇతర పిచ్చి చెట్లు మొలిచిపోయి అవి పెద్దగా తయారై ఇప్పుడు అక్కడ గెడ్డను పూర్తిగా కప్పేశాయి. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పలాస మండలం మాకన్నపల్లి గ్రామం చింతల గుండం చెరువు నుంచి ప్రారంభమైన ఈ గెడ్డ పలాస రైల్వే లైను పక్క నుంచి వస్తోంది. పెంటిభద్ర కొండ, బొడ్డపాడు చీపురు బంద, జగ్గోరు చెరువు, గరుడభద్ర ఎంకాయ చెరువులు నిండి వర్షాకాలంలో పొలాల మీదుగా ఈ గెడ్డలోకి నీరు ప్రవహించేది. వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడు, గరుడభద్ర, రిట్టపాడు, రాజాం, తాళభద్ర తదితర గ్రామాల రైతులకు సాగు నీరు అందించేది. అంతేకాకుండా పశువులకు ఎక్కువగా ఉపయోగపడేది. ఇంతటి ప్రాధాన్యత గల ఈ గెడ్డను సంబంధిత అధికారులు పూర్తిగా మరిచి పోయారు. దీంతో గెడ్డ ఆనవాలు కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. దీంతో ఈ గెడ్డపై ఆధారపడిన ఆయకట్టు రైతులకు సాగు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఈ గెడ్డపై దృష్టి సారించి పూడిక తీసి, పెరిగిపోయిన చెట్లను తొలగించాలని రైతులు కోరుతున్నారు.ఇది ఊట గెడ్డ. ఎండాకాలంలో కూడా నీరు ఉండేది. ఇది ఎంతో రైతులకు ఉపయోగ పడేది. మాకన్నపల్లి చింతల గుండం నుంచి ప్రారంభమైన ఈ గెడ్డ రిట్టపాడు మీదుగా నువ్వల రేవు వద్ద సముద్రంలో కలిసేది. ఎప్పుడు కూడా నీరు ఉండేది. అధికారుల నిర్లక్ష్యం వల్ల గెడ్డ రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. వర్షాలు పడితే అక్కల గెడ్డ మీదుగా ధర్మపురం తాళభద్ర మద్య రోడ్డు పూర్తిగా జలమయమై పోతుంది. తక్షణమే ఈ గెడ్డను బాగు చేయాలి. – తామాడ సన్యాసిరావు, రైతు, బొడ్డపాడు, పలాస మండలఉద్దానం ప్రాంత రైతులకు ఏకై న సాగునీటి వనరు ఈ అక్కల గెడ్డ. దీనికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. ఈ గెడ్డపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు సాగు నీటి కష్టాలు ఏటా తప్పడం లేదు. పూడిక తీయాలి. పిచ్చిమొక్కలు, మొగిలి డొంకలను తొలగించాలి. – వంకల అప్పారావు, రైతు, మామిడిపల్లి, పలాస మండలం -
మళ్లీ భూ సేకరణ ఎందుకు..?
● మూలపేట పోర్టు కోసం భూసేకరణ పేరుతో దోపిడీ ● మండిపడిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం క్రైమ్ : ఉత్తరాంధ్రలో జరుగుతున్న భూ కుంభకోణాలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా స్పందించారు. మూలపేట పోర్టుకు అన్ని అనుమతులు తీసుకువచ్చి వైఎస్ జగన్ 70 శాతం పనులు పూర్తిచేశారని, ఇప్పుడు బాబాయ్–అబ్బాయ్లు మరో 15 వేల ఎకరాల భూసేకరణ పేరుతో కొత్త దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. ఉద్యమాల పురిటిగెడ్డలో రైతుల భూములతో ఆడుకుంటే సహించేది లేదని, పీక తెగినా అదనపు భూసేకరణ కానివ్వబోమని హెచ్చరించారు. ఆయన బుధవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి ముసుగులో జరుగుతున్న ఈ దోచుకో.. పంచుకో.. తీసుకో విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే దీనికి తగిన మూల్యం కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం, శ్రీకాకుళం పార్టీ నియోజకవర్గాల పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, పిన్నింటి సాయికుమార్, శ్రీకాకుళం ఎంపీపీ అంబటి శ్రీను, రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం కార్యదర్శి పిల్లల రామకృష్ణ, ఎచ్చెర్ల మాజీ జెడ్పీటీసీ సనపల నారాయణరావు, కొత్తూరు మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ, టెక్కలి వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, సీనియర్ న్యాయవాది సింగుపురం మోహనరావు, కిష్టుపురం మోహనరావు, ఆమదాలవలస మాజీ జెడ్పీటీసీ బొడ్డేపల్లి నారాయణరావు, జిల్లా వైఎస్సార్ సీపీ యువ విభాగం అధ్యక్షులు మార్పు పృధ్వీరాజ్, ద్వారపు అజయ్, సీపాన వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీ దొంగల దారెటు..?
శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ కేంద్రంగా మంగళవారం పట్టపగలు బంగారం దుకాణంలో దోపిడీ దొంగలు చొరబడి భయానక వాతావరణం సృష్టించిన సంగతి తెలిసిందే. తనకు చూపించిన గన్ ఒరిజినల్దేనని షాపు యజమాని చెప్పడం గమనార్హం. షాపు ఓనరైన కిల్లంశెట్టి రామకృష్ణారావు నుంచి దుండగులు మంగళవారం మొబైల్ఫోన్ ఎత్తుకు వెళ్లిపోయినట్లు పోలీసు వర్గా ల సమాచారం. టవర్ డంప్ లొకేషన్ ఆధారంగా విజయనగరం బొబ్బిలి దగ్గర ఒకసారి చూపించగా మరోసారి రాయపూర్ వద్ద సిగ్నల్స్ చూపించినట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని బట్టి మంగళవారం గారబంద మీదుగా లూప్ మార్గాల్లో దుండగులు పర్లాఖిముడి (ఒడిశా) చేరి అక్కడి నుంచి బొబ్బిలి, సాలూరు ఘాట్రోడ్డు మీదుగా చత్తీస్గఢ్ చేరి రాయపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. వచ్చిన వారు హిందీ భాషలో ఎక్కువగా మాట్లాడటంతో పక్కా గా మహారాష్ట్ర గ్యాంగ్ లేదంటే బీహార్ గ్యాంగు పనేనని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దుండగుల్లో బంగారం ఎత్తుకుపోయిన కొందరు ఒకవైపు, మొబైల్ ఫోన్ తీసుకెళ్లిన వారు మరో వైపు వెళ్లి పోలీసులకు రాంగ్ డైవర్షన్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక కూ డా 3 చోట్ల చోరీలు జరిగాయి. పాత జాతీయ రహదారికి ఆనుకుని మంకినమ్మ చికెన్, మటన్ సెంటర్, డెకరేషన్ సాపు, రైల్వేస్టేషన్ దారిలో చోరీలు జరిగాయి. ఇటీవల కాలంలో 3 మెడికల్స్టోర్స్లో దాదాపు రూ. 4 లక్షల వరకు చోరీకి గురైనా పోలీసులు రికవరీ చేయలేకపోయారన్న ఆరోపణలు ప్రజల నుంచి వస్తున్నాయి. లక్ష్మీస్వీటుషాపులో సైతం రూ. 1.20 లక్షలు నగదు దొంగిలించారు. ‘పక్కా ప్లాన్తోనే వచ్చారు’ పలాస: దొంగలు పక్కా ప్లాన్తోనే వచ్చారని, దేవు డి దయ వల్ల తన ప్రాణాలు మిగిలాయని కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర జ్యూయలర్స్ షాపు యజ మాని కిల్లం శెట్టి రామకృష్ణారావు అన్నారు. ఆయన బుధవారం తన ఇంటి వద్ద భార్య లలిత, అతను అక్కడకు వచ్చిన వారితో జరిగిన సంఘటన గురించి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించారు. దొంగలు పక్కా ప్లాన్తోనే వచ్చారన్నారు. హిందీలో ఏదేదో చెప్పారని, ఆ తర్వాత రెండు చేతులకు బేడీలు వేశారు. మొత్తం బంగారం దోచుకు పోయారని, తన మెడలో ఉన్న గొలుసు కూడా తీసుకుపోయారని, అంతా ఒక్క 5 నిమిషాల్లో జరిగిపోయిందని తెలిపారు. ఆయనను మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ పలాస నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు బుధవారం పరామర్శించారు. దొంగతనం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిస్టు గోపి, తాజా మాజీ కౌన్సిలరు బెల్లాల శ్రీనివాసరావు, పెంట రత్నాకర్, బోర బుజ్జి, బత్తిన హేమేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
130 కొబ్బరి చెట్లు.. 63 ఎకరాల టమాటా
కంచిలి: మండలంలోని మంగళవారం కురిసిన వడగళ్ల వర్షానికి ఉద్యాన పంటలకు నష్టం ఏర్పడింది. ఇందులో మండలంలో కుత్తుం, కొక్కిలిపుట్టుగ పంచాయతీల పరిధిలో 130 కొబ్బరి చెట్లు నేలకొరిగా యి. అదేవిధంగా బూరగాం, కుత్తుం తదితర గ్రామాల్లో 63 ఎకరాల్లో టమాటా పంటకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా జీడిచెట్లు కూడా మండపల్లి, కుత్తుం, కొక్కిలిపుట్టుగ పంచాయతీల పరిధి గ్రామాల్లో నేలకొరిగాయి. పంట చేతికి వచ్చిన సమయానికి ఇలా హఠాత్తుగా ప్రకృతి ప్రకోపించడంతో ఉద్యాన పంటలు సాగుచేస్తూ జీవనాధారం పొందుతున్న రైతుల కష్టం వర్షం పాలైందని ఆందోళన చెందుతున్నారు. తమకు ఏర్పడిన నష్టాలపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సర్వేచేసి, తగిన నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు. నష్టాలు పరిశీలన.. మండలంలో ఉద్యాన పంటలకు ఏర్పడిన నష్టాల ను ఉద్యానశాఖ అఽధికారి పి.మాధవీలత బుధవా రం పరిశీలించారు. ఆమె కొక్కిలిపుట్టుగ, కుత్తుం, బూరగాం గ్రామాల్లో పర్యటించారు. బూరగాం, కుత్తుం గ్రామాల్లో సాగుచేస్తున్న టమాటా పంట పొలాలను పరిశీలించారు. ఇక్కడ టమాటా సాగుచేస్తున్న 55 మంది రైతులకు సంబంధించి 63 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. అలాగే పంట పొలాల్లో నీరు నిలువ ఉండకుండా చేసి, బిల్టాక్స్ కానీ కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ లీటరు నీటికి 3 గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారీ చేయమని రైతులకు సూచించారు. అలాగే కుత్తుం, మండపల్లి పంచాయతీ పరిధి అమ్మవారిపుట్టుగ, కొక్కిలిపుట్టుగ గ్రామాల్లో నేలకొరిగిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. ఈ గ్రామాల్లో 130 కొబ్బరి చెట్లు నేలకొరిగాయని గుర్తించారు. ఈ నష్టాల వివరాలను నమోదు చేసి, ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు మాధవీలత తెలిపారు. -
వధువు కావలెను
అమ్మాయికి వంట వచ్చా.. అనే ప్రశ్న బదులు.. అబ్బాయి సంపాదన ఎంత అనే క్వశ్చన్ బాగా వినిపిస్తోంది. అమ్మాయి చదువుకుందా.. అని ఆరా తీయడం బదులు.. అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అన్న ఎంక్వైరీలు మొదలయ్యాయి. కట్నం ఎంత ఇస్తారు.. అన్న మాట వినిపిస్తున్నా.. కట్నం ఇవ్వకపోయినా పర్లేదు అన్న అభిప్రాయాలు ఎక్కువయ్యాయి. జిల్లాలో పురుష పుంగవులకు వివాహ రేఖలు కనిపించడం లేదు. 30 దాటినా పెళ్లి కాని వారి మగవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. శ్రీకాకుళం కల్చరల్, శ్రీకాకుళం రూరల్: జిల్లాలో పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారు. ఇదివరకు అబ్బాయి ఓకే అంటే అమ్మాయి తరఫు వారు హమ్మయ్య అంటూ గెంతులు వేసే వారు. కానీ ఇప్పుడు ఓకే చెప్పే అధికారం పూర్తిగా అమ్మాయి తరఫు వారికే మళ్లిపోయినట్టు ఉంది. ఫలితంగా వయసు ముదురుతున్నా పెళ్లి కాక ఎంతో మంది యువకులు మిగిలిపోతున్నారు. ఒకప్పటిలా తల్లిదండ్రులు చూపించిన వరుడితో తలవంచుకుని తాళి కట్టించుకునే అమ్మాయిలు ఇప్పుడు తక్కువైపోయారు. అబ్బాయిలు రాజీ పడుతున్నా అమ్మాయిలు నో అంటున్నారు. పెరిగిన అడ్డుగోడలు.. ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫలానా విధంగా ఉండాలని అమ్మాయిలు చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటున్నారు. సంపాదన ఒక్కటే చూడకుండా ప్రొఫెషన్ను కూడా గమనిస్తున్నారు. తక్కువ సంపాదన ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వాళ్లకి తక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. పెద్ద స్థాయిలో జీతాలు ఉండి ఒత్తిడిని ఎదుర్కొనే ఉద్యోగాల సంబంధాలను కూడా వదిలేసుకోవడానికి వెనుకాడడం లేదు. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తుండడంతో ఉన్నత ఉద్యోగులకు అందునా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటిలాగానే డిమాండ్ ఉంది. పెళ్లికి అమ్మాయిల అనుమతి రోజులు మారాయి. అమ్మాయి కుటుంబం బాగుంటే చాలు. ఆస్తిపాస్తులు ఇవ్వనవసరం లేదంటున్నారు. అమ్మాయికి నేను నచ్చానో లేదో ఒకసారి అడగండి అని అబ్బాయిలే అంటున్నారు. అవసరమైతే కట్నం లేకుండా చేసుకుంటామంటున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బిఎస్సీ అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, ఇంజినీరింగ్ వంటి కోర్సులను చదివే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఈ అర్హతలు చెబితే చాలు ఇట్టే పెళ్లయిపోయేది. కానీ ఇప్పుడా పప్పులు ఉడకడం లేదు. పెరిగిన వివాహం వయసు ఒకప్పుడు అమ్మాయికి పెళ్లీడు రాగానే పెళ్లి చేసే వారు. ఇప్పుడు 25 ఏళ్ల వరకు వివాహ ప్రస్తావన ఎత్తడం లేదు. చదువుకున్న కుటుంబాల్లో ఇది ఎక్కువగా ఉంది. ఒకప్పుడు అబ్బాయిలు కూడా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునే వారు. కానీ వారు కూడా 30 ఏళ్లు దాకా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ తర్వాత అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో మాత్రమే సరైన వయసులో వివాహాలు జరుగుతున్నాయి. పట్టణాలు, చదువుకున్న కుటుంబాలలో మాత్రం అధిక శాతం వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెపుతున్నారు. అంతా 30 ఏళ్లు పైబడినవారే జాతకాల కోసం ముహుర్తాల కోసం వచ్చేవారు అధికంగా 30ఏళ్లు పైబడినవారే. చాలా మంది తల్లిదండ్రులు వారి అబ్బాయిలకు తగిన అమ్మాయిలు దొరకడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలను ఎంచుకునే అవకాశం అమ్మాయిలకు లభిస్తుండడం గమనిస్తున్నాం. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం, గుడివీధి యువత ఆలోచనలో మార్పు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పే ఒక కారణమైతే, అమ్మాయిలు తక్కువగా ఉండ డం మరో కారణం. పెళ్లి కోసం అమ్మాయిలను వెతుక్కోవడానికే సరిపోతుంది. – వేదుల విజయభాస్కరశర్మ, పురోహితులు -
పిడుగు పడి వ్యక్తి మృతి
మందస: మందస మండలం పుచ్చపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం పిడుగు పడి వృద్ధుడు మృతి చెందారు. గ్రామానికి చెందిన శిష్టు బీమారావు(72) ఊరిలోని రావి చెట్టు చెరువు వద్దకు వెళ్లి కాళ్లు కడుగుతుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే నీటిలో పడి ప్రాణాలు వదిలేశారు. సాయంత్రం అటుగా వెళ్తున్న గ్రామస్తులు బీమారావును గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. పోలీసులకు కూడా సమాచారం అందజేశారు. ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని హరిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే అంబుగాం గ్రామంలో ఇంటిపై పిడుగు పడి ఓ మహిళ అస్వస్థతకు గురైంది. భిన్నళమదనాపురంలోనూ చెట్టుపై పిడుగు పడి పక్కన ఉన్న పూరి గుడిసైపె మంటలు రేగాయి. రైలు ఢీ కొని యువకుడు..పాతపట్నం: మండలంలోని తెంబూరు రైల్వే స్టేషన్ సమీపంలోని తెంబూరు ఎస్సీ వీధి సమీపంలో రైలు ఢీ కొని తెంబూరు ఎస్టీ వీధికి చెందిన గిట్టంగి హిమగిరిరావు(20)మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... మంగళవాం సాయంత్రం గుణుపూర్ నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలు తెంబూరు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత.. తెంబూరు ఎస్సీ వీధి సమీపంలో గిట్టంగి హిమగిరిరావును ఢీకొంది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తండ్రి గిట్టంగి అప్పలస్వామి, తల్లి గిట్టంగి లక్ష్మి ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి..రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు పోవు ఎన్హెచ్–16 రోడ్డు మీద సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఆ వ్యక్తి అక్కడక్కడే మృతి చెందాడు. తాళ్లవలస వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేశారు. మృతుని శరీరంపై బిస్కట్ రంగు చొక్కా లుంగీ ధరించి ఉన్నారు. వివరాలు తెలిస్తే సమాచారం అందిచాలని లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి తెలిపారు. వివరాలు తెలిస్తే ఫోన్ నంబర్స్ 6309990816, 6309990851 నంబర్లకు తెలియజేయాలని సూచించారు. శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సంపద పంపిణీతోనే సామాజిక న్యాయమని, జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ జయంతులను వాడవాడలా నిర్వహించి సామాజిక న్యాయ వారోత్సవాలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. శ్రీకాకుళం సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ దేశంలో కొద్దిమంది దగ్గర పోగుపడిన సంపదను వివిధ పన్నుల ద్వారా సేకరించి పునఃపంపిణీ చేయడం ద్వారా సామాజిక న్యాయం సాధించాలని, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న అన్ని శ్రామిక సంఘాలు, దళిత, బహుజన, మైనార్టీ, మహిళా సంఘాలు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. మోదీ 12 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి రాజ్యాంగానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం అంటేనే బిలియనీర్లు, కార్పొరేట్ల ప్రభుత్వమని పేరు పొందిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వై.వేణు తదితరులు పాల్గొన్నారు. -
పోర్టుకు పోదాం సభతోనే ప్రభుత్వంలో చలనం
● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ టెక్కలి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన పోర్టుకు పోదాం పదండి కార్యక్రమం విజయవంతం కావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చలనం కలిగిందని, దీంతో మంత్రులను పోర్టుకు పరుగులు పెట్టించారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ అన్నా రు. మంగళవారం టెక్కలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మూలపేట పోర్టు పనులపై మంత్రి అచ్చెన్నాయుడు పదే పదే చెబుతున్న అబద్ధాలు ఒక్క సారిగా బహిర్గతమయ్యాయని తిలక్ ఎద్దేవా చేశారు. పోర్టు పనులు 70 శాతం మాత్రమే జరిగాయని ఆర్ అండ్ బీ మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి చెప్పడంతో పోర్టు పరిశీలించిన కూటమి నాయకులు అవాక్కయ్యారని తిలక్ పేర్కొన్నారు. పోర్టు పనులపై కనీసం అవగాహన లేకుండా కేవలం ఆర్డీవో అందజేస్తున్న స్క్రిప్ట్తో మంత్రి అచ్చెన్నాయుడు లేనిపోని అబద్ధాలు చెబుతూ వచ్చారని తిలక్ మండిపడ్డారు. దమ్ముంటే 2024 ఎన్నికల నాటికి పోర్టు పనులు చేపట్టిన విశ్వ సము ద్ర సంస్థకు ఎంత మేరకు బిల్లులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని తిలక్ డిమాండ్ చేశారు. కేవలం మంత్రి పదవి కాపాడుకోవడానికే అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దశాబ్దాలుగా అధికారం దక్కించుకుంటున్న మంత్రి అచ్చెన్నాయుడు ఆయన కుటుంబ సభ్యులు ఈ జిల్లాకు గానీ, టెక్కలి నియోజకవర్గానికి గానీ ఎలాంటి శాశ్వత అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి వైఎస్ జగన్ వేల కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. మూలపేట పోర్టు, నిర్వాసిత కాలనీ, రోడ్లు, రైల్వే మార్గాలు ఇతర అవసరాల కోసం గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రకాల అనుమతులతో పా టు ఆర్థిక వనరులు సైతం ఇచ్చారని గుర్తు చేశారు. రెండేళ్ల కూటమి పాలనలో కనీసం నిర్వాసిత కాలనీ కూడా పూర్తి చేయలేని అసమర్థత మంత్రి అచ్చెన్నాయుడు అని తిలక్ మండిపడ్డారు. సమావేశంలో సంతబొమ్మాళి జెడ్పీటీసీ పాల వసంత్రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి సత్తారు సత్యం, యువజన విభాగం అధ్యక్షుడు చిన్ని జోగారావు, ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడు బి.రాజేష్ తో పాటు డి.ఈశ్వరరావు ఉన్నారు. -
బతుకు సాగడం లేదు.. చావే దిక్కు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘పద్నాలుగేళ్లుగా వారసత్వ భూమి కోసం పోరాడుతున్నాను. న్యాయం జరగలేదు. ఇప్పుడు కటిక దరిద్రం అనుభవిస్తున్నాను. కానీ ఆదుకునే వారు లేరు. కనీసం పింఛనైనా ఇచ్చి కరుణించండి’ అంటూ శ్రీకాకుళం నగరానికి చెందిన లొట్టి మంగమ్మ పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఇదివరకు ఆమె ఇదే పీజీఆర్ఎస్లో అధికారుల సమక్షంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అయినా ఆమెకు న్యాయం జరగలేదు. ఆమెకు న్యాయస్థానం అప్పజెప్పిన భూ మి రియల్ ఎస్టేట్లో పడిపోవడంతో న్యాయం కోసం తిరుగుతున్నారు. పింఛన్ కోసం కూడా రెండేళ్లుగా తిరుగుతున్నారు. ఎన్ని సార్లు తిరగాలని ఎస్డీసీ జయదేవి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. -
మ్యాథ్స్ ఒలింపియాడ్లో విద్యార్థుల ప్రతిభ
కంచిలి: కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్, న్యూఢిల్లీ వారు నిర్వహించిన మ్యాథ్స్ ఒలింపియాడ్–2025 పరీక్షలు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. బంగారు, రజత, కాంస్య పతకాలను కై వసం చేసుకున్నారు. వీటిని సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.చాణక్య, మిగతా ఉపాధ్యాయులు మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. బంగారు పతకాలను సాయి కిషోర్ పాత్రో, మల్లార్పు బాలకృష్ణ, గుడియా యువశ్రీ, రజిత పతక విజేతలైన మారేడు దీపిక, నక్క పవన్, గణప అవంతిక, కొండా శ్యాం, కాంస్య పతక విజేతలైన లోపింటి ధనలక్ష్మి, గుడియా చరణ్, గగన్ పాత్రో, లండ ప్రసాద్రెడ్డి, యజ్జల పూజ ఉన్నారు. ఒలింపియాడ్ కోసం ప్రత్యేక తర్ఫీదునిచ్చిన గణిత ఉపాధ్యాయులు అశోక్ కుమార్, సూర్యప్రకాశ్, ప్రసాదరావు, సుధాకర్లను హెచ్ఎం సత్కరించారు. -
వెలుగుతూనే ఉంటాయి
కొత్తూరు: మండలంలోని కడుము గ్రామ పంచాయతీ పరిధిలోని కడుము, కడుము కాలనీ, గొట్లభద్ర, జగన్నాథపురం గ్రామాల్లో వీధి లైట్లు చాలాకాలంగా వెలుగుతూనే ఉన్నాయి. పగలు, రాత్రి ఇవి వెలుగుతూనే ఉండడం విశేషం. ట్రాన్స్ కో అధికారులకు పంచాయతీ సర్పంచ్తో పాటు గ్రామస్తులు పలు దఫాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తుఫాన్ సమయంలో వీధి లైట్లకు సంబంధించిన వైర్లు పాడైపోయాయి. అప్పటి నుంచి వీధి లైట్లకు కేబుల్ వేయలేదు. ఇంటికి సంబంధించిన వైర్లతో కనెక్షన్ ఇచ్చారు. దీంతో వీటిని ఆఫ్ చేసే అవకాశం లేకుండాపోయింది. ట్రాన్స్ కో అధికారులు స్పందించి స్ట్రీట్ లైన్కు సంబంధించి కేబుల్ ఏర్పాటు చేయలని పలువురు కోరుతున్నారు -
సోంపేటలో వర్ష బీభత్సం
సోంపేట: సోంపేటలో మంగళవారం మధ్యా హ్నం మూడు గంటల నుంచి 5 గంటల వరకు వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చెట్లు పడిపోవడంతో పాటు, విద్యుత్ వైర్లు నేలకొరిగాయి. మండలంలోని సాగుచేస్తున్న ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బెంకిలి, జింకిభద్ర, పలాసపురం, బారువ గ్రామాల్లో టమాటా సాగు చేస్తున్న రైతులకు తీరని నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట వర్షానికి తుడిచిపెట్టుకుపోవడంతో రైతన్న ముఖంలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా టమాటా పంట కొద్దిగా ధర పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు కనిపించాయి. పాడైపోయిన టమాటా పంటను ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ మంగళవారం సాయంత్రం పరిశీలించి, రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరారు. -
తీవ్ర నష్టం
అకాల వర్షం..శ్రీకాకుళం రూరల్: అకాల వర్షం కారణంగా జొన్న, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల పరిధిలోని కళ్లేపల్లి పంచాయతీ పరిధిలోని బందరువానిపేట, మోఫస్బందరు, పరదేశీపాలెం, ఇప్పిలి, తదితర ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం కురిసిన తీవ్రగాలులకు, వర్షానికి ఈ నష్టం వాటిల్లిందని మండల వ్యవసాయాధికారి నవీన్ తెలిపారు. వడగళ్ల వాన కంచిలి: మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్ష బీభత్సంతో మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో నష్టాలు ఏర్పడ్డాయి. ఈదురుగాలులు వీయడంతో రేకులు ఎగిరి పడటం, చెట్లు కూలిపోవడం, గోడలు కూలిపోవడం, జీడి, మామిడి పిందెలు రాలిపోవడం వంటి నష్టాలు ఏర్పడ్డాయి. మండపల్లి గ్రామంలో మాదిన ధనుంజయకు చెందిన రేకుల షెడ్డులో రేకులు ఎగిరిపడి, పక్కనే ఉన్న సోలార్ యూనిట్ ప్యానల్స్ మీద పడ్డాయి. కుదేలైన అరటి రైతులు జి.సిగడాం : అరటి పంట సాగు చేసిన రైతుల ఆశలు ఆవిరైపోయాయి. పంట చేతికొచ్చిన సమయంలో అకాల గాలి వాన పంటలను ధ్వంసం చేసిందని వెంకయ్యపేట గ్రామానికి చెందిన గల్లా కృష్ణ ఆందోళన చెందుతున్నారు. రెండు ఎకరాలు అరటి తోట ఈనెల 6న వీచిన గాలలుకు పూర్తిగా నేలమట్టం అయిపోయిందని వాపోయారు. ఎకరాకు సుమారుగా 80 వేలు రూపాయల వరకు మదుపులు పెట్టామని వాపోతున్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో ఇలాంటి వానలు రావడంతో రైతన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
మిషన్.. అడ్మిషన్
● ఇంటర్ అడ్మిషన్ల వేట ● సంక్రాంతి నుంచే కార్పొరేట్ కాలేజీల హవా మేము విశాఖలో కార్పొరేట్ కాలేజీ నుంచి వచ్చాం. మీ అమ్మాయి బాగా చదువుతుందట. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెస్తుందట. అందుకే తెలుసుకొని వచ్చాం. మా కాలేజీలో చేర్పించండి. అమ్మాయి భవిష్యత్కు మాది భరోసా. మంచి విద్యాబోధనతో పాటు అన్నిరకాల వసతులు ఉంటాయి. ఆలస్యం చేస్తే అడ్మిషన్లు పూర్తవుతాయి. ఇలాంటి అవకాశం మీకు రాదు. కొంత మొత్తం అడ్వాన్స్ కట్టి అడ్మిషన్ను ఖరారు చేసుకోండి. – ఎల్ఎన్పేటకు చెందిన వెన్నెల అనే విద్యార్థిని తల్లిదండ్రులను కార్పొరేట్ ప్రతినిధులు ఒప్పిస్తున్న తీరు ఇది.. హిరమండలం: టెన్త్ పరీక్షలు అయ్యాక కాలేజీల్లో అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలలు పెద్ద మిషనే మొదలుపెట్టాయి. నిజానికి పరీక్షల ముందు నుంచే విద్యార్థుల వేట మొదలైంది. తాజాగా పరీక్షలన్నీ ముగియడంతో ప్రచారాలు పతాక స్థాయికి చేరుకుంటు న్నాయి. ముఖ్యంగా విశాఖ కేంద్రంగా నడిచే కార్పొరేట్ కాలేజీలకు సంబంధించి పీఆర్వోలు వందలా ది మంది జిల్లాలో ఉన్నారు. వారు విద్యాశాఖ వద్ద ఉన్న పదో తరగతి విద్యార్థుల వివరాలు తీసుకొని తల్లిదండ్రులను కలుస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లాడు చేజారిపోకూడదనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. వీరి దూకుడుకు జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలు ఉన్నా అడ్మిషన్ల విషయంలో వెనుకబడుతున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 38, ఆదర్శ పాఠశాలలు 13, కేజీబీవీలు 25, ప్లస్ 2 పాఠశాలలు 6, గురుకుల పాఠశాలలు 9 ఉన్నాయి. ప్రతి సంవత్సరం 20 వేలకుపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. గత ఏడాది పదో తరగతి విద్యార్థులు 28,176 మంది పరీక్షలకు హాజరుకాగా.. 23,219 మంది ఉత్తీర్ణత సాధించారు. కానీ ఇందులో కేవలం 6,491 మంది మాత్రమే జిల్లాలో ఇంటర్లో చేరారు. ఈ ఏడాది 29,362 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరికలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నా యి. అధ్యాపకుల కొరత విద్యాబోధనపై ప్రభావం చూపుతోంది. అటు ఆశించిన స్థాయిలో జూనియర్ కాలేజీల్లో వసతులు ఉండడం లేదు. ఉత్తీర్ణతా శాతం అంతంత మాత్రమే. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. వైఎస్సార్సీపీ హయాంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేజీబీవీల్లో ఇంటర్ కాలేజీలను అప్గ్రేడ్ చేశారు. సంప్రదాయ కోర్సులతో పాటు సాంకేతిక కోర్సులు సబ్జెక్టులను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగం, ఉపాధినిచ్చే కోర్సులు సైతం వచ్చాయి. అలాగే 2021లో నరసన్నపేట మండలం ఉర్లాం, సరుబుజ్జిలి మండలం రొట్టవలస, పలాస మండలం బ్రాహ్మణతర్లా, మందస మండలం హరిపురం, వజ్రపుకొత్తూరు మండలం వజ్రపుకొత్తూరు, టెక్కలి మండలం టెక్కలిలో ప్లస్ 2గా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేశారు. అప్పట్లో ఇవన్నీ విద్యార్థులతో నిండిపోయి కళకళలాడేవి. కానీ గత రెండేళ్లలో సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయి. వేసవిలో అధికారులు అవగాహన పెంచుతున్నా విద్యార్థులు ఆసక్తి చూపని పరిస్థితి. పీఆర్వోల హల్చల్ జిల్లా నుంచి ఎక్కువగా విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల్లో చేరుతున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఉన్న 71 జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తవుతున్నాయి. కానీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రం సీట్లు నిండడం లేదు. సంక్రాంతి నుంచే కార్పొరేట్ కంపెనీల పీఆర్వోలు గ్రామాల్లో ప్రవేశిస్తున్నారు. విద్యార్థుల అడ్మిషన్లు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి ఫీజులతో పాటు హాస్టల్కు రూ.2 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు. మీ పిల్లాడు చాలా బాగా చదువుతాడట. అందుకే తెలుసుకొని వచ్చాం. మా కాలేజీలో చేర్పిస్తే పిల్లాడి భవిష్యత్కు మాదీ భరోసా. విద్యార్థికి ఇంటర్ కీలకం. అందుకే మా కాలేజీలో చేర్పించండి. మంచి విద్యా బోధనతో పాటు పోటీ పరీక్షలకు సంబంధించి అన్నిరకాల శిక్షణలు ఇస్తాం. నీట్, జేఈఈ, ఎంసెట్ ఇలా అన్ని రకాల శిక్షణలు ఉంటాయి. ముందుగా చేరితే ఫీజుల్లో రాయితీ ఉంటుంది. ఆలస్యం చేస్తే వెనుకబడి పోతారు. – హిరమండంలో శ్రీనివాస్ అనే పదో తరగతి విద్యార్థి తల్లిదండ్రులను కలిసి కార్పొరేట్ కాలేజీ ప్రతినిధులు చెప్పిన మాట ఇది..ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు చేరాలి. ఇక్కడ ఉత్తమ విద్యాబోధనతో పాటు సౌకర్యాలు ఉంటాయి. సామాన్య, మధ్యతరగతి వారికి ఇవి ఎంతో మేలు. అనవసరం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి భారం పడవద్దు. కేజీబీవీల్లో విద్యార్థినులు చేరాలి. ఇక్కడ ఉత్తమ విద్యాబోధన, రక్షణ, వసతులు ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి. – కృష్ణవేణి, ఎస్ఓ, హిరమండలం కేజీబీవీ -
మీతోటి కష్టమే!
శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో పోస్టుమార్టం కష్టాలు ఎదురవుతున్నాయి. పుట్టెడు దుఖంలో ఉండే రోగి బంధువులకు చెప్పలేని కష్టాలు కలుగుతున్నాయి. ఇంత పెద్ద ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన మార్చురీ అసిస్టెంట్లు(తోటి) లేరంటే నమ్మాల్సిందే. వైద్య కళాశాలకు అనుబంధ వైద్యశాలగా ఉండి 950 పడకలకు స్థాయి పెరిగినా తోటీలను మాత్రం నియమించుకోలేకపోయారు. మార్చురీలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నలుగురు మార్చురీ అసిస్టెంట్లు పనిచేస్తుండేవారు. వీరిలో ఇద్దరు పదవీ విరమణ చేయగా, ఆ పోస్టులు తిరిగి భర్తీ చేయలేదు. మిగిలిన ఇద్దరికీ పోస్టుమార్టం పనుల్లో పెద్దగా అనుభవం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నా యి. కొన్ని రోజుల కిందట బుడుమూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందగా వారి మృతదేహాలను పోస్టుమార్టం అనంత రం బంధువులకు అప్పగించేందుకు 24 గంటలకు పైగా పట్టడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశా రు. మృతుని బంధువులు సాయం చేయడంతో శవ పరీక్ష పూర్తి చేయగలిగారు. దాదాపు నెల రోజులు గా పరిస్థితి ఇలాగే ఉంది. మార్చురీలో ఉన్న ఇద్దరు అసిస్టెంట్లకు పెద్దగా అనుభవం లేకపోవడం, కాస్తంత బెరుకు ఉండడంతో పారిశుద్ధ్య విభాగంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న వ్యక్తికి చెందిన బంధువులను అనధికారికంగా తీసుకువచ్చి వీరి ద్వారా పోస్టుమార్టం చేయిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇష్టారీతిన పోస్టుమార్టం చేయడంతో మృతదేహాలు ఛిన్నాభిన్నమవుతున్నాయనే వా దన ఉంది. పోస్టుమార్టం కోసం చెల్లింపులు కూడా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ వారిని పోగొట్టుకొని మృతదేహాన్నైనా సక్రమంగా ఇంటికి తీసుకువెళదాం అనుకునే వారికి అది కూడా సాధ్యం కావడం లేదు. రిమ్స్లో నిత్యం మూడు నుంచి ఐదు వరకు పోస్టుమార్టంలు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన అనుభవజ్ఞులైన మార్చురీ అసిస్టెంట్లు లేకపోవడం విడ్డూరమైతే, ఉన్న వారిని అకారణంగా తొలగించడం విచారకరం. తొలగింపులతోనే ఇబ్బంది రిమ్స్లో మార్చురీలో పనిచేస్తున్న ఇద్దరు అనుభవజ్ఞులైన పారిశుద్ధ్య కార్మికులతో పాటు మరో 22 మంది పారిశుద్ధ్య కార్మికులను మార్చి 8వ తేదీ నుంచి విధుల నుంచి కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు తొలగించారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ల మేరకు రూ.16,000 వేతనం ఖాతాలకు జమ చేయాలని, మిగిలిన రూ.2500లు పీఎఫ్, ఈఎస్ఐలకు చెల్లించాలని కోరడమే ఇందుకు కారణం. అలాగే సంస్థ ప్రతినిధులు ఓ అంగీకార పత్రంపై సంతకం చేయాలని కోరగా, అందులో ఉన్న కొన్ని షరతులు నచ్చక ఈ 24 మంది సంతకాలు చేసేందుకు నిరాకరించారు. ఈ షరతుల్లో ప్రధానమైనది సంస్థ కాంట్రాక్టు పొందిన ఏ ఆస్పత్రికై నా భారత దేశవ్యాప్తంగా వెళ్లేందుకు అంగీకరించాలని పొందుపరచడం. దీన్ని తిరస్కరించడం కూడా ఈ 24 మంది తొలగింపునకు కారణమైంది. వీరికి ఐదు నెలలు జీతాలు కూడా చెల్లించకుండా విధుల నుంచి తొలగించి, మీరు తమ సంస్థ ప్రతినిధులు కా దని చెప్పడంతో జిల్లా అధికారులు, రిమ్స్ అధికారులు, ప్రజాప్రతినిధులను కలసి వినతి పత్రాలు సమర్పించారు. విధుల్లో చేర్చుకోవాలని ఆదేశించినా కాంట్రాక్టర్ మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో భర్తీ కాని మార్చురీ అసిస్టెంట్ పోస్టులు కొన్ని రోజుల కిందట ‘తోటీ’లను విధుల నుంచి తొలగింపు పోస్టుమార్టం నిర్వహణలో ఇబ్బందులు అనధికారిక వ్యక్తులతో పోస్టుమార్టం పనులు చేయిస్తున్న వైనం -
పోలీసులమని చెప్పి..చేతులకు బేడీలు వేసి.. దోచుకెళ్లిన ఘరానా చోరులు
● కాశీబుగ్గలో బంగారం షాపులో ఘటన ● షాపు యజమాని రెండు చేతులకు బేడీలు వేసిన వైనం ● షాపులో ఉన్న ముప్పావు కిలో బంగారంతో ఉడాయించిన దొంగలు ● అందరూ చూస్తుండగానే దొంగతనం రెక్కీ చేశారా..? చోరీ జరిగిన తీరు.. దుండగుల వేగాన్ని బట్టి చూస్తే పథకం ప్రకారం వారం రోజుల ముందే రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు 4 ద్విచక్ర వాహనాల్లో దుండగులు వచ్చారని, వాటిలో ఒక ద్విచక్రవాహనానికే నంబర్ ప్లేట్ ఉందని చెబుతుండగా పోలీసులు మూడు ద్విచక్రవాహనాలు, కారులో వచ్చారని సీసీ ఫుటేజీ దృశ్యాలను బట్టి చెబుతున్నారు. కారు హైస్కూల్గ్రౌండ్ సమీపంలో పార్క్ చేసినట్లు తెలుస్తోంది. షాపు ఉన్న ప్రాంతంలోనే రేషన్ షాపు ఉండటంతో జనాలు నిత్యం అక్కడ ఉంటారు. కానీ ఆ షాపు మంగళవారం తెరవలేదు. వాస్తవానికి వేంకటేశ్వర జ్యూయలర్స్లో ఇద్దరు సిబ్బంది అదే రోజు సెలవు పెట్టడం గమనార్హం. షాపులో సీసీ ఫుటేజీలో కూడా ఆధారాలు చెరిపేసినట్లు, జీరో బ్యాకప్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బయట మాత్రమే సీసీఫుటేజీ ఆధారంగా దుండుగులు 12.35 గంటలకు వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దుండగులు ఈ షాపు దగ్గరకు వెళ్లాలంటే కాశీబుగ్గ పాత జాతీయ రహదారి బంకేశ్వరి మాత గుడి సందు నుంచైనా, పాతబస్టాండు దరి సంత మైదానం నుంచి భగవతి థియేటర్ మీదుగా నిత్యానందనగర్కు వచ్చి ఉంటారా లేదంటే కారు పార్కింగ్ను బట్టి ఎంపీడీఓ కార్యాలయం మీదుగా వచ్చుంటారా అన్నది తెలియాలి. వెళ్లేటప్పుడు మాత్రం మంకినమ్మ గుడి నుంచి శివాజీనగర్ మీదుగా పారిశ్రామికవాడ మీదుగా పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నేరుగా మొగిలిపాడు బ్రిడ్జికి చేరుకుని అక్కడి నుంచి గొప్పిలి లేదంటే కంబరిగాం మీదుగా గారబంద చేరి ఒడిశా వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయమై అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 8 మంది దుండగులు చోరీకి పాల్పడ్డారని, ఒక కారు, 3 ద్విచక్రవాహనాల్లో వచ్చారని, నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని, బయట గ్యాంగుల పనే ఇదని అనుమానిస్తున్నట్లు చెప్పారు. పలాస/శ్రీకాకుళం క్రైమ్: ఆ వీధులన్నీ తెలిసినట్టే వారు వచ్చారు.. రోడ్లన్నీ పరిచయం ఉన్నట్టుగానే బైకులు పార్క్ చేశారు.. ఏ సమయానికి ఏం చేయాలో ముందే అనుకున్నట్టు అరగంటలో పని పూర్తి చేశారు. ఎలా వెళ్లాలో ముందే నిర్ణయించుకున్నట్లు వాహనాలను పోనిచ్చారు. కాశీబుగ్గలో పట్ట పగలు ఓ బంగారం షాపులోకి ప్రవేశించిన దొంగలు దర్జాగా దొంగతనం చేశారు. విజిలెన్స్ పోలీసులమంటూ భయపెట్టి, యజమాని చే తులకు బేడీలు వేసి దొరికింది దోచుకుని వెళ్లిపో యారు. స్థానికంగా ఈ ఘటన సంచలనమైంది. స్థానికులు, పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. సుమారు 8 ఏళ్ల కిందట త్రిపాఠి క్వార్టర్స్ వీధి లోని తన సొంత ఇంటి వద్దనే శ్రీ వేంకటేశ్వర జ్యూయలర్స్ షాపును కిల్లంశెట్టి రామకృష్ణారావు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఈ దుకాణం ఉన్నట్టు చాలా మందికి తెలియదు. నిత్యానందనగర్కు ఒక మూలలో ఉంటుంది. ఎప్పటి లాగే కిల్లంశెట్టి రామకృష్ణారావు దుకాణం తెరిచి కూర్చున్నారు. తన గుమస్తా శోభన్బాబు(అప్పలాచారి)ని రశీదు బుక్కులు తీసుకురమ్మని పంపించారు. అతను వెళ్లిన కొద్ది సేపటికే కాశీబుగ్గ నిత్యానగర్ నుంచి నాలుగు బైకుల మీద మొ త్తం 8 మంది మధ్యాహ్నం 12.30 గంటలకు షాపు వద్దకు చేరుకున్నారు. బయ ట బైకులను కొద్ది దూరంలో పార్క్ చేసి పెట్టారు. నలుగురు వ్యక్తులు షాపులోకి ప్రవేశించారు. ఎవరా సూడో పోలీస్..అందరూ ముఖానికి మాస్క్లు, కర్చీఫ్లు కట్టుకుని స్టైలిష్ టీషర్టులు వేసుకోగా వారిలో ఒకరు ఖాకీ ఫ్యాంటు, వెనుక ‘పోలీస్’ స్టిక్కర్ ఉన్న టీషర్టు ధరించడం విశేషం. తాము పోలీసులమని, మీ షాపులో విజిలెన్సు తనిఖీలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. అప్పటికే యజమాని భార్య టీ తీసుకొచ్చినా తాగకుండా ఆమెను పంపించే శారు. వెంటనే యజమాని రెండు చేతులకూ బేడీలు వేసి లోపలే ఉన్న స్టోర్రూమ్కు తీసుకెళ్లారు. ఈలోగా మిగిలిన నలుగురు దుండగులు ముఖానికి మాస్కులు, చేతిలో హెల్మెట్లతో వచ్చారు. డమ్మీ తుపాకీ చూపించి ..యజమాని గట్టిగా కేకలు వేసేందుకు ప్రయత్నించగా దుండగుల్లో ఒకరు డూప్లికేట్ తుపాకీ ఎక్కుపెట్టి చంపేస్తామనడంతో బెదిరిపోయి మిన్నకుండిపోయారు. ఈ లో గా దుకాణంలో ఉన్న వెండిని వదిలేసి సుమారు 800 గ్రామలకు పైగా బంగారు ఆభరణాలను బ్యాగుల్లో సర్దేశారు. సరిగ్గా 12.35 గంటలకు బయటకు వచ్చేశారు. సమీపంలో పార్క్ చేసి ద్విచక్రవాహనాల్లో ఉడాయించేశారు. వచ్చిన దారిలో కాకుండా త్రిపాఠి క్వార్టర్స్ మీదుగా కాశీబుగ్గ హైస్కూల్ క్రీడా మైదానం పక్కనున్న మంకినమ్మ గుడి సందునుంచి వెళ్లిపోయారు. వారు వచ్చిన బైకుల మీదుగా వెళ్లిపోయిన వెంటనే రెండు చేతులకు బేడీలతో ఉన్న రామకృష్ణారావు బయటకు వచ్చి స్థానికులకు జరిగిన విషయం చెప్పారు. ఈ విషయం కాశీబుగ్గ పోలీసులకు తెలియడంతో వెంటనే సీఐ రామకృష్ణ తన పోలీసు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి వేలిముద్రల క్లూస్ టీం, డాగ్ స్క్వా డ్ వచ్చి పరిశీలించారు. జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఇన్చార్జి డీఎస్పీ గోవిందరావులు వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు విలేకరులతో మా ట్లాడుతూ సంఘటన తీరుతెన్నులను పరిశీలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఫుటేజ్ వాచ్మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 36నిమిషాల వేళ నేరస్థలం సమీపంలో సీసీ కెమెరాల్లో నమోదైన దుండగుల కదలికలు -
మీకు నీరు.. మాకు కన్నీరా..?
● తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆఫ్షోర్ నిర్వాసితులు ● గ్రామాలను త్యాగం చేసి, న్యాయం కోసం దీక్షలు ● నేటికీ 132 కుటుంబాలకు అందని పరిహారాలు ● 300 రోజులుగా దీక్షలు ● పట్టించుకోని అధికారులు, నాయకులు వలస కూలీలమని.. నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఇద్దరు పిల్లలతో కాలం వెళ్లదీస్తున్నా. వలస కూలీగా ఉన్నానని, అధికారుల తప్పుగా నమోదు చేయడం వల్ల నాకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. నేనెలా బతకాలి. అధికారులు నాకు న్యాయం చేసి పరిహారం ఇప్పించాలి. – ఇప్పిలి వరలక్ష్మీ, చీపురుపల్లి గ్రామం గ్రామాన్ని ఇచ్చి దీక్షలు చేయాలా..? సర్వస్వం అర్పించాం. గ్రామాలను విడిచి కన్నీటితో బయట బతుకుతున్నాం. నా కుటుంబానికి ఒక్క పైసా ప్యాకేజీ రాలేదు. నాకు ముగ్గురు పిల్లలు. నిర్వాసితుడినైనా పరిహారానికి నోచుకోలేదు. న్యాయం కోసం దీక్షలు చేయాల్సిన దుస్థితి ఎదురైంది. – నందిగాం భాస్కరరావు, చీపురుపల్లి గ్రామం మెళియాపుట్టి: మండలంలోని ఆఫ్షోర్ రిజర్వాయర్కు భూములు, ఇళ్లు, గ్రామాలను సైతం త్యాగం చేసిన వారు ఇప్పుడు న్యాయం కోసం రోడ్డెక్కే దుస్థితి దాపురించింది. మండలంలోని చీపురుపల్లి, దాసుపురం, సవరచీపురుపల్లి గ్రామాల్లో నిర్వాసితులు ఉన్నారు. ఆఫ్షోర్ రిజ ర్వాయర్లో మెళియాపుట్టి, టెక్కలి, నందిగాం మండలాలకు చెందిన పలు గ్రామాలు ఉండడంతో నిర్వాసితులకు న్యాయపరంగా వారికి ప్యాకేజీలు అందించాల్సి ఉంది. అయితే వారికి తగిన న్యాయం జరగకపోవడంతో వారు నిరాహార దీక్షలు ప్రారంభించారు. మే 22న చీపురుపల్లి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. నేటికి 300 పైచిలుకు రోజులైనా స్పందించే వారే కరువయ్యారని నిర్వాసి తులు వాపోతున్నారు. అర్హులైన 132 మందికి నేటికి కూడా పరిహారాలు అందలేదు. గ్రామంలో 14.55 ఎకరాల డి–పట్టాభూములకు సైతం పరి హారం అందించలేదని నిర్వాసితులు తెలిపారు. అంతేకాకుండా సుమారు 240 మంది యువతకు ప్యాకేజీలు అందించలేదని, 360 కుటుంబాలకు 5 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరినా ప్రభు త్వం పట్టించుకోవడం లేదని, హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన 460 జీఓ ప్రాప్తికి పూర్తిస్థాయి ప్యాకేజీలు ఇవ్వాలని అన్నారు. చెల్లింపు ల్లో తేడాలు ఉన్నాయని, వాటిని సవరించి ఇళ్లకు పరిహారం ఇవ్వాలని యవ్వారి ఈశ్వరరావు, నందిగాం జగన్నాయకులు, గుమ్మడి మల్లేసు, నందిగాం హేమలత, చిన్నమ్మి, కొక్కిరి కిరణ్, ఉమాశంకర్, వెంకటరమణతోపాటు పలువురు నిర్వా సితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్వాసిత గ్రామాల్లో ద్విచక్రవాహన ర్యాలీ, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం, కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, వినతిపత్రం సైతం అందించారు. టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సైతం నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా వారి సమస్యలు పరిష్కారం కాలేదని నిర్వాసిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జిల్లా మంత్రు లు, అధికారులు స్పందించి న్యాయం చేయకపో తే పోరాటాలు చేస్తామని వారు హెచ్చరిస్తున్నా రు. వీరు కోర్టుకు కూడా వెళ్లారు. -
‘దళిత, పీడిత కులాల ఆత్మగౌరవ దినాలుగా పాటిద్దాం’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పూలే జయంతి ఏప్రిల్ 11 నుంచి అంబేడ్కర్ జయంతి 14వ తేదీ వరకు ‘దళిత, పీడిత కులాల ఆత్మగౌరవ పోరాట దినాలుగా పాటిద్దాం’ అని వక్తలు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియం అంబేడ్కర్ విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరణ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెలమర ప్రభాకర్ మాట్లాడుతూ.. భారతదేశంలో అంబేడ్కర్, ఫూలే సామాజిక ఉద్యమాలు జరపడం వల్లే మనుస్మృతి పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. ఐక్యంగా ఉండి రాజ్యాంగంలో ఉన్న హక్కులు దళిత పీడిత కులాల పేద ప్రజలకు హక్కులు చేరే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, నల్లబారికి శ్రీను, గురుమూర్తి, రాకోటిరాంబాబు, కె.కాళిదాసు, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.దానేసు, దానయ్య, వైకుంఠరావు, దేశభక్త ఉద్యమం నాయకులు సాలిన వీరా స్వామి, జె.వెంకటరావు, దాలినాయుడు, రైతుకూలీ సంఘం నాయకులు బైరి కూర్మారావు, బొత్స రమణ, బైరి. పాపారావు తదితరులు పాల్గొన్నారు. అన్ని పంచాయతీల్లోనూ ప్రత్యేక అధికారుల నియామకాలు అరసవల్లి: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోందని, ఈమేరకు అన్ని గ్రామ పంచాయతీల్లోనూ నియామక చర్యలు చేపట్టామని జిల్లా పంచాయతీ అధికారి ఆర్.గోపిబాల ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. జిల్లాలో మొత్తం 912 గ్రామ పంచాయతీలకు గాను గత ఐదేళ్లుగా వివిధ కారణాలతో సర్పంచ్ ఎన్నికలు జరగని 15 పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన జరుగుతూ వస్తోందని, ఇప్పుడు మిగిలిన పంచాయతీల్లోనూ ఈ ప్రత్యేకాధికారుల పాలన మొదలైందని వివరించారు. ఈనెల 2వ తేదీతో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసిందని, అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి ఆదేశాలు, ఎన్నికల ప్రక్రియ జరిగినంత వరకు పంచాయతీల్లో కార్యకలాపాలు, ప్రజల సౌకర్యార్థం చర్యల నిమిత్తం అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వినియోగం తదితర కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం లేకుండా మండల స్థాయి అధికారులతో ఈ ప్రత్యేకాధికారులను నియమించామని, అయితే చిన్నచిన్న పంచాయతీలను కలుపుకుంటూ మొత్తం 897 పంచాయతీలకు మొత్తం 335 మందిని ప్రత్యేకాధికారులుగా నియమించామని వివరించారు. డిప్యూటీ వార్డెన్ సస్పెన్షన్ హిరమండలం: మండలంలోని మర్రిగూడ ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్గా పనిచేస్తున్న కె.బాలరాజును సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ మంగళవారం సస్పెండ్ చేశా రు. వార్డెన్ మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని ఫిర్యాదుపై స్పందించిన యంత్రాంగం విచారణకు ఆదేశించింది. డిప్యూటీ డీఈఓ, ఏటీడబ్లూఓ విచారణలో వార్డెన్ మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడం, అదే విధంగా విచారణ సమయంలో కూడా మద్యం సేవించి ఉండడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వార్డెన్ను ఐటీడీఏ పీఓ సస్పెండ్ చేశారు. -
చంద్రబాబు పంతం.. 5 కోట్ల ఆంధ్రులకు శాపం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, కానీ చంద్రబాబు ఏకపక్ష, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఆయన మంగళవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వ ఏకపక్ష విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన సమయంలో రాజధానిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ కూడా అభివృద్ధి కేంద్రీకృతం చేయవద్దని స్పష్టంగా చెప్పిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకృతం కావడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చి రాష్ట్రం విడిపోడానికి కారణమైందని గుర్తుచేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అమరావతి ప్రాంతం అనుకూలం కాదని స్పష్టంగా చెప్పిందన్నారు. ఆనాడు చంద్రబాబు ఆ కమిటీకి కనీస వసతులు కూడా కల్పించకుండా హింసించి పంపారని చెప్పారు. నేడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తన రాజకీయ అవసరాల కోసం అమరావతి తీర్మానం చేసి, పార్లమెంటులో ఆమోదింపజేసుకుని కేంద్రంతో నోటిఫై చేయించారని, ఇది భవిష్యత్లో అనేక సమస్యలకు దారితీస్తుందన్నారు. అమరావతిలో కనీస మౌలిక వసతుల కోసమే రూ.2 లక్షల కోట్లు కావాలని, అది పూర్తికావడానికి 50 ఏళ్లు పడుతుందని ముఖ్యమంత్రే చెబుతున్నారన్నారు. అంతవరకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు కూలీలుగా మిగిలిపోవాలా? అని ప్రశ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా వికేంద్రీకరణను వైఎస్ జగన్ ప్రతిపాదించారని చెప్పారు. 80 ఏళ్లయినా ఇంకా వలసలేనా? ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే పేర్కొందని గుర్తుచేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. 80 ఏళ్లయినా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఇంకా పొట్ట చేతబట్టుకుని వలస వెళ్తున్నారన్నారు. ఇక్కడ 60 ఏళ్లయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తికావని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.1000 కోట్లు కూడా కేటాయించరా?అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రాజెక్టుపై చిత్తశుద్ధితో పనిచేసింది నాటి సీఎం జగన్ మాత్రమేనని చెప్పారు. ఒడిశా సీఎంను కూడా కలిసి చర్చించారని చెప్పారు. చంద్రబాబు ఏనాడైనా ఒడిశా వెళ్లి సమస్యలను ప్రస్తావించారా.. అని ప్రశ్నించారు. -
చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందడమే నిజమైన ప్రజాస్వామ్యమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇవాళ శ్రీకాకుళంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలి ప్రధాని నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు.‘రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక తండ్రి లాంటి వారు.. అందరినీ సమానంగా చూడాలి. కానీ నేడు సీఎం కేవలం ఒక ప్రాంతానికే, కొద్దిమంది సంపన్నులకే కొమ్ముకాస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ హెచ్చరికలను చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారు. నిధుల పంపిణీలో అసమానతల వల్లే గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్పై పెట్టిన దృష్టి ఇతర ప్రాంతాలపై పెట్టకపోవడం వల్లే విభజన జరిగింది. మళ్లీ అదే తప్పు చేస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు.విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం నియమించిన నిపుణుల కమిటీని చంద్రబాబు గౌరవించలేదు. అమరావతి రాజధానికి అనుకూలం కాదని నిపుణులు చెబితే వారిని అవమానించి పంపారు. రాజ్యాంగ విరుద్ధంగా అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ చట్టాన్ని సవరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజకీయ అవసరాల కోసం ఈ సవరణ చేయించారు’ అని చెప్పారు.పొట్టచేతబట్టుకుని వలస.. అమరావతి బిల్లు సమయంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా వంటి కీలక నేతలు సభకు రాలేదని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ‘రాష్ట్ర రాజధాని ఫలానా చోటే ఉండాలని చెప్పే అధికారం కేంద్రానికి లేదని గతంలో అఫిడివిట్ ఇచ్చారు. రాజ్యాంగంలో సుప్రీంకోర్టు సీటు గురించి ఉందే తప్ప రాజధాని గురించి ఎక్కడా లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే స్పష్టంగా చెప్పింది. 80 ఏళ్ల వయసులో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు పొట్టచేతబట్టుకుని వలస వెళ్తున్నారు.రాయలసీమ బిడ్డగా ఉండి కూడా ఆ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారు? వెనుకబడిన ప్రాంతాల్లో కనీసం ఒక్క ఎకరా భూమిని కూడా పేదలకు పంపిణీ చేయలేదు. 60 ఏళ్లవుతున్నా ఉత్తరాంధ్రాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావడం లేదు? విశాలమైన తీరప్రాంతం ఉన్నా ఒక్క హార్బర్ రాకుండా అడ్డుకోవడం ధర్మమేనా?రాష్ట్ర బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.1,000 కోట్లు కూడా ఇవ్వరా? లక్ష ఎకరాల్లో అమరావతిని కట్టాలంటే మౌలిక వసతులకే రూ. 2 లక్షల కోట్లు కావాలి. అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి 50 ఏళ్లు పడుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారు.అంతకాలం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉండాలా? ఒకే ప్రాంతంపై లక్షల కోట్లు ఖర్చు పెడితే మళ్లీ హైదరాబాద్ తరహా విద్వేషాలు వస్తాయి. భవిష్యత్తు తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారు.రాష్ట్ర సంపద ఐదు కోట్ల ప్రజలకు చెందాలి కానీ ఒక్క అమరావతికే కాదు. విశాఖ, విజయనగరంలో వస్తున్న సంస్థల ఆస్తులు ఇతర ప్రాంతాల వ్యక్తులకే చెందుతున్నాయి. అభివృద్ధి చెందిన ప్రాంతాలనే మళ్లీ అభివృద్ధి చేస్తే వెనుకబడిన ప్రాంతాలకు గోచీ తప్ప ఏమీ మిగలదు. ముఖ్యమంత్రి పంతం కోసం ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను మరుగున పడేయడం అన్యాయం.వలసలు ఆగేలా, స్థానిక ప్రాజెక్టులు పూర్తయ్యేలా నిధులు ఎందుకు కేటాయించడం లేదు? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కాకుండా సమాన అభివృద్ధికి సీఎం బాటలు వేయాలి. అమరావతి పేరుతో వెనుకబడిన జిల్లాల నోళ్లు నొక్కడం రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు నాయుడు తన నిర్ణయాలను పునరాలోచించుకోవాలి’ అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. -
నాటిక పరిషత్ పోటీల విజేత హైదరాబాద్
కవిటి : మండలంలోని బొరివంకలో కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల పరిషత్ నాటిక పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా న్యాయనిర్ణేతలు మానాపురం సత్యన్నారాయణ, బల్లెడ మోహనరావు, ఎల్.రామలింగ స్వామిలు ఫలితాలు వెల్లడించారు. ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్ గోవాడ ఆర్ట్స్ వారి ‘అమ్మచెక్కిన బొమ్మ’, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా అభినయా ఆర్ట్స్ గుంటూరు వారి ‘సహాన’, తృతీయ స్థానంలో కరీనగర్ చైతన్య కళాభారతి వారి స్వప్నం కురిసిన అమృతం నిలిచాయి. ఉత్తమ సంగీతం సహాన నాటికలో లీలామోహన్, ఉత్తమ రంగాలంకరణ రమణ అప్పారావు(చిటికెనవేలునాటిక), ఉత్తమ ఆహార్యం మా ఇంట్లో మహాభారతం చిత్రాలకు దక్కాయి. స్వర్గీయ బెందాళం ప్రకాష్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రముఖ రంగస్థల నటుడు యడ్ల గోపాలం, ప్రముఖ సంగీత కళాకారునిగా గుర్తింపు పొందిన బొంతలకోటి కృష్ణారావుకు నిమ్మన పురుషోత్తం లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రధానం చేశామని కళింగసీమ కళాపీఠం అధ్యక్షుడు బల్లెడ లక్ష్మణమూర్తి తెలిపారు. -
కొనేదెవరు.. ఆదుకునేదెవరు..?
నరసన్నపేట నుంచి పాతపట్నం వెళ్లే జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ రోడ్లపై మొక్కజొన్న పంటను ఆరబెట్టుకుంటున్న దృశ్యమిది. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో మద్దతు ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రోడ్లపైనే మొక్కజొన్న బస్తాలు పెట్టుకుని ప్రభుత్వ కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. పండిన పంటను కాపాడుకోవడానికి పాట్లు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని మొక్కజొన్న రైతులు రోడ్డున పడే స్థితికి వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లా అయినా రైతులకు ఏ మాత్రం మద్దతు దక్కడం లేదు. మొక్కజొన్న రైతులను నిర్లక్ష్యంగా గాలికొదిలేస్తున్నారు. శాఖా పరమైన కనీసం చర్య లు తీసుకోవడం లేదు. జిల్లాలో 87,821 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేశారు. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అంతా బాగున్నా పండిన పంటను కొనుగోలు చేసే నాథుడు లేకుండా పోయాడు. పండిన పంటను గ్రామాలకు తీసుకొ చ్చి, రోడ్లపై ఆరబెట్టుకుని, కంటికి రెప్పలా పంటను కాపాడుకోవాల్సి వస్తోంది. క్వింటా మొక్క జొన్న కు రూ. 2400 మద్దతు ధర ప్రకటించారు. కానీ, కొనుగోలుచేసేందుకు కేంద్రాలు ప్రారంభించలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి, రైతుల నుంచి కొనుగోలు చేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చేసిన ప్రకటనలు మాటలకే పరిమతమయ్యాయి. ఇంతవరకు జిల్లా లో ఒక్క కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. ప్రభుత్వంపై ఆగ్రహం.. అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అటు ఖరీఫ్లోనూ, ఇటు రబీలోనూ ధాన్యం, మొక్కజొన్న తదితర పంటల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతులంటే చంద్రబాబుకు ఎందుకంత చులకనా అని ఆవేదన చెందుతున్నారు. విత్తనం దగ్గరి నుంచి పంట విక్రయం వరకు తమకు కష్టాలు తప్పడం లేదని, ఏ ఒక్క నేత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారుల బారిన రైతన్న పండిన పంటను ప్రభుత్వం ఎంతకీ కొనుగోలు చేయకపోవడంతో ఇంట్లో దాచుకోలేక రోడ్డుపైనే ఆరబెట్టుకుంటున్నారు. ఆక్కడ మూటలు కట్టి ఉంచుతున్నారు. రాత్రి పూట దొంగతనాలు జరుగుతాయేమోనని ఆ రోడ్లుపైనే కాపలా ఉంటున్నారు. ఎంత వేచి చూసినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో చాలా మంది రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు రూ. 1500 నుంచి రూ.1700 మించి ఇవ్వలేమని, కావాలంటే ఇవ్వండి లేదంటే వదిలేసుకోండి అని ఖరాఖండీగా చెప్పేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో క్వింటాకు రూ.700కు పైగా రైతులు నష్టపోతున్నారు. దీంతో పెట్టుబడులు సైతం రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అకాల వర్షాలతో రోడ్డుపైన ఆరబెట్టిన మొక్కజొన్న తడిచి ముద్దవుతోంది. దీని వల్ల తేమ శాతం ఎక్కువై, తక్కువ ధరకు విక్రయించుకోవాల్సి వస్తోంది. రోడ్డున పడిన మొక్కజొన్న రైతులు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం రైతులకు దక్కని మద్దతు ధర తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిన దుస్థితి క్వింటాకు రూ.700కు పైగా నష్టపోతున్న వైనం -
ఉద్యమ సెగ
మూలపేటకు మంత్రుల ఉరుకులు● వైఎస్సార్ సీపీ ఉద్యమంతో మంత్రుల్లో చలనం ● ఎట్టకేలకు మూలపేట పోర్టును సందర్శించిన మంత్రులు జనార్ధనరెడ్డి, అచ్చెన్నాయుడు ● నత్తనడకగా పనులు సాగుతున్నట్టుగా కన్పించిన దృశ్యాలు ● క్రెడిట్ చోరీ కోసం తీవ్ర యత్నాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ ఉద్యమిస్తే తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో కదలిక రాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 70 శాతం పనులు చేసిన మూలపేట పోర్టును గాలికొదిలేసిన టీడీపీ ప్రభుత్వంలో ఎట్టకేలకు చలనం వచ్చింది. ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతున్నాయని మూలపేట పోర్టు సందర్శనకు ఉపక్రమించారు. రాష్ట్ర భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలిసి హుటాహుటిన పోర్టులో పర్యటించి, పనులు పరిశీలించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులే దాదాపు కన్పించాయి. నత్తనడకగా పనులు సాగుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. వచ్చిన తర్వాత ఏదో ఒక హడావుడి చేయాలన్న సంకల్పంతో పనుల పురోగతిపై సమీక్ష చేసి వచ్చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాదిరి మూలపేట పోర్టు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నాలకు తెరలేపారు. మూలపేట పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చిన దగ్గరి నుంచి నిధుల సమీకరణను వైఎస్ జగన్ ప్రభుత్వమే చేపట్టింది. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పించింది. పోర్టు పనులకు శంకుస్థాపన చేసి చకచకా పనులు చేపట్టారు. దీనికొక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. ముమ్మరంగా పనులు సాగుతున్న వేళ ఎన్నికలు రావడం, ఇంతలో వైఎస్సార్సీపీ ఓటమి పాలవ్వడం, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏడాదిన్నరకు పైగా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కనే అన్న చందంగా ఉండిపోయాయి. కానీ, మూలపేట పోర్టు ఘనతే తమదే అని చెప్పుకోవడం మొదలెట్టారు. కేంద్ర మంత్రి దగ్గరి నుంచి చంద్రబాబు వరకు క్రెడిట్ చోరీకి యత్నించారు. ఎప్పుడైతే మూలపేట పోర్టు కోసం వైఎస్సార్సీపీ గళమెత్తిందో అప్పటి నుంచి పోర్టువైపు ప్రభుత్వం చూడటం మొదలెట్టింది. ‘మన మూలపేట పోర్టుకు పోదాంపదండి’ కార్యక్రమం తర్వాత ప్రభుత్వంలో మరింత కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియడంతో భోగాపురం ఎయిర్పోర్టు మాదిరిగానే ఫొ టోలతో పోజులిచ్చి, తామే పనులు చేపడుతున్నా మని చెప్పుకోవడానికి పోర్టు సందర్శనకు ప్లాన్ చేశారు. అందులో భాగంగా సోమవారం ఇద్దరు మంత్రులు, అధికారులు నిర్మాణంలో ఉన్న పోర్టు ను పరిశీలించి, నిర్వాహకులతో సమీక్షించారు. వ చ్చే నవంబర్ కల్లా పూర్తి చేస్తామని ప్రకటన ఇ చ్చారు. భూసేకరణ సమస్య అంటూ తాత్సారానికి గల కారణాలు కూడా చెప్పేశారు. పనిలో పనిగా గత ప్రభుత్వంపై నిందలు వేసి వచ్చేశారు. -
బుజ్జాయికి పెద్ద కష్టం
ఇచ్ఛాపురం రూరల్: లొద్దపుట్టి గ్రామం అంబుగాం వీధికి చెందిన ఇసురు దానయ్య–శ్రావణి దంపతులకు చెందిన రెండు నెలల పసిపాప యామిని ప్రాణాల కోసం పోరాడుతోంది. జన్మతః మలవిసర్జనకు అవసరమైన మార్గం సరిగా ఏర్పడకపోవడంతో చిన్నారి తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ప్రస్తుతం పాప వయసు కేవలం రెండు నెలల 7 రోజులు మాత్రమే కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యులు పూర్తి స్థాయిలో చికిత్స కోసం మరో అత్యవసర ఆపరేషన్ అవసరమని సూచించారు. శస్త్ర చికిత్స, మందులు, ఆస్పత్రి ఖర్చులు కలిపి సుమారు నాలుగు లక్షలు అవసరమని వైద్యులు తెలిపినట్లు చిన్నారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవించే చిన్నారి తల్లిదండ్రులు దానయ్య–శ్రావణి దంపతులకు ఈ భారీ ఖర్చు భరించడం సాధ్యం కావడం లేదు. ఇద్దరు కుమార్తెల్లో చిన్న కుమార్తెకు ఈ సమస్య రావడంతో తమ కుమార్తెను కాపాడుకోవాలని తల్లిదండ్రులు కన్నీళ్లతో వేడుకుంటున్నారు. పాప ప్రాణాలు నిలబెట్టేందుకు దాతలు ముందుకు రావాలని వారు అభ్యర్థిస్తున్నారు. మానవత్వంతో స్పందించి చిన్నారి ప్రాణాలను రక్షించాలని కుటుంబం వేడుకుంటోంది. ఆర్థిక సాయం అందించే దాతలు 9986856973 నంబర్కు సంప్రదించాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మల విసర్జన లోపంతో ఆస్పత్రి పాలు కుమార్తెను దక్కించుకునేందుకు తల్లిదండ్రుల ఆరాటం దాతల సాయం కోసం ఎదురు చూపులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసిపాప యామిని -
‘సమస్యలు చట్టపరిధిలో పరిష్కరించాలి’
శ్రీకాకుళం క్రైమ్ : ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో వచ్చిన వినతులు చట్టపరిధిలో పరిష్కరించాలని, అర్జీదారులు సంతృప్తిచెందేలా విచారణ జరిపి బాధితులకు న్యా యం చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో బాధితుల నుంచి 61 వినతు లను ఎస్పీ స్వీకరించారు. బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. 49 వేల యూరోలు ఇవ్వలేదు.. చర్యలు తీసుకోండంటూ వినతి.. బెల్జియం కంపెనీకి చెందిన రాజీవ్ బెహల్ తమను మోసగించారని ఎస్పీ గ్రీవెన్సులో బ్లూరాక్ మినరల్స్ కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కంపెనీ పేరుతో ఉన్న గ్రానైట్ స్మారక చిహ్నాలు, శ్లాబులను వివిధ రంగులతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నామని, బ్రెజిల్కు చెందిన శరణ్ ఇంటర్నేషనల్ ఎండీ రాజీవ్ బెహల్ ఇంటర్నెట్ మెయిళ్ల ద్వారా కావాలని అభ్యర్థించారన్నారు. దీంతో వివిధ తేదీల్లో 4 కంటైనర్ల గ్రానైట్ స్మారక చిహ్నాలను వారికి సరఫరా చే శామని, వాటి పత్రాలను సిండికేట్ బ్యాంకు, శ్రీకాకుళం ద్వారా కొనుగోలుదారుల బెల్జియం బ్యాంకుకు పంపించామన్నారు. బ్యాంకు నుంచి పత్రాలు పొందిన తర్వాత వారు రాటర్డామ్ పోర్టు నుంచి 4 కంటైనర్లను విడుదల చేసి స్టాకు విక్రయించారన్నారు. అయినప్పటికీ తమకు పంపాల్సిన 49,962.65 యూరోలు (మన కరెన్సీ అయితే రూ. 53,60,471.26 లు) వారి బ్యాంకు నుంచి పంపలేదన్నారు. దీంతో స్థానిక శ్రీకాకుళం కోర్టును ఆశ్రయించగా కంటైనర్లకు సంబంధించి అనుకూలంగా డిక్రీని ఇచ్చిందని, రాజీవ్ బెహల్పైన లుకౌట్ నోటీస్ జారీ చేసిందని, దాని ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని బ్లూరాక్స్ మినరల్స్ యాజమాన్యం ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ శాఖ కార్యాలయ ఉద్యోగులు తన విధుల్లో ఆటంకపర్చడమే కాకుండా దాడికి యత్నిస్తున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఖజానా శాఖ డీడీ రవికుమార్ ఎస్పీ గ్రీవెన్స్ను ఆశ్రయించారు. ఆదివారం రాత్రి ఇదే డీడీ రవికుమార్పై ఫిర్యాదు ఇచ్చేందుకు కార్యాలయ ఉద్యోగులు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. గతంలో కూడా ఇరువర్గాలు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు ఫిర్యాదులు ఇచ్చేందుకు వెళ్లడంతో సీఐ పైడపునాయుడు సుతిమెత్తగా హెచ్చరించి పంపించేశారు. -
నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత ప్రారంభం
సంతబొమ్మాళి: నౌపడలో ఆర్అండ్ఆర్ కాలనీ వద్ద నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, సాగునీటి సంఘాలు సమర్థంగా పని చేస్తే రైతులకు మెరుగైన నీటి పంపిణీ సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్ తరాల కోసం నీటి వనరులను కాపాడుకోవడం అత్యంత అవసరమని ఆయన పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో కృష్ణమూర్తి, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొబ్బరి చెట్టుపై పిడుగుహిరమండలం: ఎల్ఎన్ పేట మండలంలోని తురకపేట కృష్ణాపురంలో సోమవారం సా యంత్రం ఉరుములతో కూడిన వర్షం కురియడంతో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. సోమవారం సాయంత్రం తురకపేట ప్రాంతంలో ఒక్కసారిగా గాలులు చెలరేగి, ఉరుములతో కూడిన వర్షం పడింది. పాలీసెట్ శిక్షణ తరగతులు ప్రారంభంఎచ్చెర్ల: స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో సోమవారం ఉదయం నుంచి పాలీసెట్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ టి.విక్టర్ పాల్ మాట్లాడుతూ.. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి 12. 30 వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామ న్నారు. హాజరైన విద్యార్థులకు ఉచిత మెటీరియల్ కూడా అందజేయనున్నారు. ‘నిర్దేశిత మెనూ అందించాలి’ ఎచ్చెర్ల: విద్యార్థులకు నిర్దేశిత మెనూ అందజేయాలని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య అమరేంద్ర కుమార్ సండ్ర అన్నారు. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో డైరెక్టర్ సండ్ర అమరేంద్ర కుమార్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మెస్ను సందర్శించారు. ఉదయం తయారు చేసిన అల్పాహారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహరం చేశారు. విద్యార్థులకు అందజేసిన ఆహారం క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పరిపాలన అధికారి ముని రామకృష్ణ, డీన్ శివ రామకృష్ణ, పైనాన్స్ ఆఫీసర్ వాసు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ విభాగపతి శ్రీధర్ ఉద్యోగులు, సహచర ఉద్యోగులు ఉన్నారు. ‘గ్యాస్ డీలర్ పై దాడులకు పాల్పడితే గ్యాస్ సరఫరా నిలిపివేస్తాం’ ఇచ్ఛాపురం: రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా గ్యాస్ డీలర్లపై దాడులకు పాల్పడితే గ్యాస్ సిలిండర్ల సరఫరాని నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఇటీవల పట్టణంలో వినియోగ దారునితో అకారణంగా దాడికి గురైన స్థానిక ఎస్వీఎస్బీ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వజ్రపు వెంకటే ష్ను వారంతా సోమవారం పరామర్శించారు. డీలర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల నిబంధనల మేరకే గ్యాస్ సరఫరాలు చేస్తున్నామని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల గ్యాస్ బుకింగ్ కాకపోతే గ్యాస్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఎవరైనా తప్పు చేసినా ఫిర్యాదుచేసేందుకు అనేక వ్యవస్థలు ఉన్నాయని, అలా కాకుండా దాడి చేయడం సరికాదన్నారు. -
‘కుల గణనతో ఎస్సీల వర్గీకరణ చేయాలి’
కొత్తూరు : కూటమి ప్రభుత్వం చేసిన ఎస్సీల వర్గీకరణతో రెల్లి ఉప కులస్తులకు తీవ్ర అన్యాయం జరి గిందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, రెల్లి ఉప కులస్తుల మండల సంఘం అధ్యక్షుడు దూళి అప్పన్న, జిల్లా ఉపాధ్యక్షుడు లోకొండ లక్ష్మణరావు, మండల నాయకులు దూలి మోహనరావు అన్నారు. కొత్తూరులో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాల వారీగా కుల గణన చేసిన తర్వాతే ఎస్సీల వర్గీకరణ చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా నేటికీ జిల్లాల వారీగా ఎస్సీ కుల గణన చేయకపోవడంతో రెల్లి ఉప కులాలు ఉద్యోగ, ఉన్నత విద్య, స్వయం ఉపాధి వంటివి పొందలేక తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. 85 శాతం మార్కులు సాధించినా రెల్లి ఉప కులస్తులు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో తీరని నష్టం జరిగిందన్నారు. వైఎస్ జగన్ పాలనలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సాయం అందేదని తెలిపారు. కుల గణన జరిగే వరకు పాత పద్ధతిలోనే ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. -
అలుదు.. ఆయుష్షు లేదు
● కబళిస్తున్న కిడ్నీ వ్యాధి ● ఇప్పటికే పలువురు మృత్యువాత ● డయాలసిస్ దశలో మరికొందరు ● సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన యువకులు వారానికి రెండు సార్లు డయాలసిస్కు వెళ్తున్నా ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించుకోగా కిడ్నీ సమస్య ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రస్తుతం వారానికి రెండు సార్లు డయాలసిస్కు శ్రీకాకుళం వెళ్తున్నాను. మా గ్రామంలో ఇది వరకు ఎంతో మంది కిడ్ని వ్యాధితో చనిపోయారు. – యారబాటి సుందరమ్మ ఆరోగ్యం దెబ్బతింది కిడ్నీ వ్యాధి సోకడంతో గత 7 నెలలు నుంచి డయాలసిస్కు వెళ్తున్నారు. ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో మంచానికి పరిమితం కావాల్సి వస్తుంది. డయాలసిస్కు వెళ్లేందుకు ఓపిక లేకుండా పోతుంది. – కుంచి నరసయ్య, అలుదు, సారవకోట మండలం సారవకోట: మండలంలోని అలుదు గ్రామంలోని ఎస్సీ వీధిని కిడ్నీ వ్యాధి కబళిస్తోంది. వ్యాధి బారిన పడి గత ఏడాదిన్నర కాలంలో సుమారు పది మంది వరకు మృత్యువాత పడ్డారని పలువురు ప్రస్తుతం శ్రీకాకుళం డయాలసిస్కు వెళ్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడున్న రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న నీటిని తాగడం వల్ల తాము వ్యాధి బారిన పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినప్పటికీ నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానిక యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరలో 10 మంది మృతి ఈ గ్రామంలోని ఎస్సీ వీధికి చెందిన 10 మంది ఏడాదిన్నరలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సతివాడ భాస్కరరావు, కూన మల్లేష్, సాగిపల్లి సింహాచలం, నాగవంశం బుడ్డెమ్మ, కూన శివ, యారబాటి మల్లేష్, యారబాటి గవిరేష్, బండి గౌరమ్మ, సతివాడ నారాయణరావులు ఈ కిడ్నీ వ్యాధితో మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ముగ్గురు శ్రీకాకుళంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు డయాలసిస్ కోసం వారానికి రెండుమూడు సార్లు వెళ్తున్నారు. మండల గ్రీవెన్స్లో ఫిర్యాదు.. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో గ్రామానికి చెందిన విజయాంబికా రెల్లి కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎల్.అప్పన్నకు ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలోని రెల్లి వీధిలో రక్షిత మంచినీటి పథకం ద్వారా కిడ్నీ వ్యాధి వ్యాపిస్తుందని నీటిని పరీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
పింఛన్ సొమ్ము ఇప్పించాలని వినతి
నందిగాం: జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్లకు నాలుగు నెలలుగా ఇవ్వాల్సిన పింఛన్ మొత్తాన్ని తక్షణం చెల్లించి ఆదుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు టి.వైకుంఠరావు కోరారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది డిసెంబరు నుంచి మార్చి 2026 వరకు నాలుగు నెలలుగా పింఛన్ ఇవ్వకపోవడంతో జిల్లాలోని 52 కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులు పండగ పూట కూడా అర్ధాకలిలో ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల నుంచి, ఇంటి పన్నుల నుంచి వచ్చిన లైబ్రరీ సెస్ 8 శాతం వినియోగించుకోవాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారని గుర్తు చేశారు. స్థానిక సంస్థలు ఈ లైబ్రరీ సెస్ను జిల్లా గ్రంథాలయ సంస్థకు జమ చేసేలా జిల్లా అధికారులు, కలెక్టర్ చొరవ చూపి పెన్షన్లు అందేలా చూడాలని ఆయన కోరారు. విద్యుత్ షాక్తో వృద్ధురాలికి గాయాలు టెక్కలి రూరల్: స్థానిక రామదాసుపేటకి చెందిన లండ లక్ష్మమ్మ అనే వృద్ధురాలు సోమవారం విద్యుత్ షాక్కు గురై గాయాలపాలైంది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆమె ఇంటి వెనుక ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. సోమవారం ఉదయం ఇంటి మేడపై బట్టలు ఆరబెట్టేందుకు వెళ్తుండగా ట్రాన్స్ఫార్మర్కి తాకుతూ ఉన్న ఓ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో షాక్ కొట్టింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పలాసలో.. పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని గాంధీనగర్లో నిర్మాణంలో ఉన్న ఇంటిలో విద్యుత్ పనులు చేస్తుండగా సూదికొండకు చెందిన సీతం మురళి అనే యువకుడు అకస్మాత్తుగా విద్యుత్ షాక్కు గురై గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు టెక్కలి రూరల్: స్థానిక చిన్న బ్రాహ్మణ వీధి సమీప జాతీయ రహదారిపై సోమవారం ఒక కారు అదుపు తప్పి రోడ్డు నుంచి కిందకు వెళ్లిపోవడంతో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. బరంపురం నుంచి నిక్కి మహాంతి తన కుమారుడు కేదార్ మహంతితో కలసి కారులో శ్రీకాకుళం వైపు వెళ్తుండగా టెక్కలి సమీపంలోకి వచ్చే సరికి డ్రైవర్ ఒక్కసారిగా నిద్రమత్తులోకి జారిపోవడంతో కారు రోడ్డు నుంచి కిందకు వెళ్లిపోయింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. పశువుల అక్రమ రవాణా అడ్డగింత నరసన్నపేట: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 19 దూడలను నరసన్నపేట పోలీసులు మండలం తామరాపల్లి వద్ద పట్టుకున్నారు. నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ తెలిపిన వివరాలు మేరకు నారాయణవలస సంత నుంచి 19 దూడలను ఒక వ్యాన్లో గుంటూరుకు తరలిస్తుండగా వచ్చిన సమాచారం మేరకు తామరాపల్లి వద్ద కాపు కాచి సోమవారం సాయంత్రం పట్టుకున్నామన్నారు. పశు రవాణా నిబంధనలు ఉల్లంఘించినందుకు దీనిపై కేసు నమోదు చేసి వ్యాన్ను సీజ్ చేశామని దూడలను గోశాలకు తరలించామని తెలిపారు. -
మూల్యాంకన కేంద్రం వద్ద టీచర్ల ఆందోళన
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. కొత్త కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నారని, వాటిని తక్షణం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు జరిమానా విధించడం దారుణమైన విషయమని, దీన్ని తక్షణం విరమించుకునేలా రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడాలని వారు కోరా రు. ఉపాధ్యాయుల ఆందోళన నేపథ్యంలో మధ్యా హ్నం 12 గంటల తర్వాత మూల్యాంకనం ప్రారంభమైంది. తొలి రోజున సుమారు 15000 జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేశా రు. ఎలాంటి పొరపాటు వచ్చినా ఉపాధ్యాయులపై జరిమానాలతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునే హెచ్చరికలు ఉండడంతో అంతా జాగ్రత్త పడ్డారు. చాలామంది ఉపాధ్యాయులు నల్ల బ్యా డ్జీలతోనే మూల్యాంకన కేంద్రంలో కనిపించారు. డీఈవో రవిబాబు పరిశీలించారు. మూల్యాంకన కేంద్రం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు -
సాగునీరు అందించండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రబీ వరి పంటకు సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని, వంశధార ఎడమ కాలువ ద్వారా సాగునీటిని తక్షణమే అందజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య కోరారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఈ మేరకు ఆయన వినతి పత్రం అందజేశారు. జలుమూరు, సారవకోట మండలాల పరిధిలోని భగీరథపురం, దోమలపల్లి, అక్కరపల్లి, పిండ్రువా డ, కరకవలస, ముఖలింగం, నగిరి కటకం, మర్రివలస తదితర గ్రామాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో సుమారు 15000 ఎకరాల్లో వరి పంట ప్రస్తుతం పొట్ట దశలో ఉందని, ఈ కీలక సమయంలో నీరు అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, రాష్ట్ర రైతు కార్యదర్శి కనపల శేఖర్ రావు, జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు రౌతు శంకరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు గురుగుబెల్లి వెంకట రమణి, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ధర్మాన జగన్ మోహన్, మండల అధ్యక్షులు కనుసు సీతారాం, మండల బూత్ కమిటీ అధ్యక్షులు బబ్బోది ఈశ్వరరావు, మండల ఉప అధ్యక్షులు బసవ రమణమూర్తి, సీపాన మోహన్,తోట భార్గవ్, కనపల అరవింద్, రౌతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
వినతుల వెల్లువ
● పీజీఆర్ఎస్లో 123 అర్జీల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు సత్వరమే పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్ జయదేవి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో డిప్యూటీ కలెక్టర్లు జయదేవి, డిప్యూటీ కలెక్టర్ పద్మావతిలు 123 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 31, రెవెన్యూ శాఖ 18, పంచాయతీ రాజ్ 16, రూరల్ వాటర్ సప్లై ఇంజినీరింగ్ 7, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ 6, మున్సిపల్ శాఖ 6, విద్యుత్ శాఖ 4, సర్వే, ల్యాండ్ రికార్ుడ్స 4, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 4, రోడ్లు, భవనాల శాఖ 4, రూరల్ డెవలప్మెంట్ 4, వాటర్ రిసోర్స్ 4, వ్యవసాయ శాఖ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 2, మార్కెటింగ్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, కో ఆపరేటివ్ సొసైటీ, సైనిక్ వెల్ఫేర్, సివిల్ సప్లై, ఫైనాన్స్, రోడ్డు రవాణా, ఫారెస్ట్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఒక్కో దరఖాస్తు చొప్పున స్వీకరించారు. ఆయా శాఖలకు సంబంధించి 123 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యథావిధిగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీవోలు సాయిప్రత్యూ ష, కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. పాత ఆమదాలవలస కుద్దిరాం వద్ద గల పెద్ద చెరువును దౌర్జన్యం చేసి ఆక్రమించారని, పొలాలకు సాగునీరు అందడం లేదని పాత ఆమదాలవలస, కుద్దిరాం గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పలుసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. చెరువు విస్తీర్ణంపై సర్వే జరిపించి నిజ వైశాల్యం గల చెరువును రైతులకు సాగు నీటికి అందజేయాలని కోరారు. -
సొమ్ముసిల్లే వంచన
శ్రీకాకుళంఎందుకో.. ఏమోసూర్య ఘర్ పథకంపై ప్రజల్లో విముఖత కనిపిస్తోంది. అంతగా ఆదరణ దక్కడం లేదు. –8లోసోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 సైబర్ కేసులను ఛేదిస్తున్నాం.. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నవారు, బాగా చదువుకున్నవాళ్లే అధికంగా మోసపోవడం వాస్తవం. గత ఏడాది నుంచే డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ప్రాడ్స్ వంటి కేసుల్లో పురోగతి సాధిస్తున్నాం. చదువుకున్న వారే సరిగా చెక్ చేసుకోక మోసపోతున్నారు. – సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం తక్షణం ఫిర్యాదు చేయాలి డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వంటి సైబర్ నేరాల్లో తక్షణమే ఫిర్యాదు చేస్తే ఖాతాలను ఫ్రీజ్ చేసే వీలుంటుంది. ఏ అకౌంట్లలోకి డబ్బు వెళ్లిందో.. ఆ అకౌంట్లు ఎవరివో తెలుసుకుని కోర్టులో మెమో వేస్తాం. కోర్టు ఆర్డర్ను బట్టి సంబంధిత ఖాతాల నుంచి అమౌంట్ రికవరీ చేసి నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తాం. ఇటీవల ఓకేసుకు సంబంధించి విజయవాడలో ముగ్గురిని పట్టుకున్నాం. మరికొందరు అనుమానితులకై వెస్ట్బెంగాల్, రాజస్థాన్ వరకు వెళ్లాం. – ఈశ్వరరావు, సీఐ, రెండో పట్టణ పోలీస్స్టేషన్, శ్రీకాకుళం శ్రీకాకుళం క్రైమ్ : లాయర్లు, డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులే.. వారి టార్గెట్. బ్యాంకులో అంతో ఇంతో సొమ్ము దాచుకునే వారే వారి లక్ష్యం. వారు చదువుకున్న వారని, అన్నీ వారికి తెలిసే ఉంటాయన్న భయమే లేదు. డిజిటల్ అరెస్టు పేరుతో నాటకాలు ఆడి ఖాతాల్లో సొమ్ము కాజేస్తున్నారు. వేధింపులు, ఆరోపణలతో.. ఈ నేరాల ప్రక్రియే వింతగా ఉంటుంది. ముందుగా పోలీస్ సెటప్తో ఉన్న వ్యక్తులు వీడియో కాల్ చేస్తారు. ముంబై క్రైమ్ బ్రాంచి, ఢిల్లీ సీబీఐ, సీఐడీ, కస్టమ్స్ ఆఫీసర్లమంటూ నమ్మబలుకుతారు. విదేశాల్లో ఉన్న మీ కొడుక్కి అక్కడి గ్యాంగ్స్టర్లతో లింకులు ఉన్నాయంటూ, మీకు వచ్చిన కొరియ ర్లో డ్రగ్స్ ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారంటూ.. అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. విద్యార్థినుల అశ్లీల వీడియోలు చిత్రించి వెబ్సైట్లలో పెడుతున్నారంటూ.. దొంగ ఆరోపణలు చేసి ముందుగా బెదిరిస్తారు. డిజిటల్ అరెస్టు చేస్తామని హెచ్చరిస్తారు. తాము చెప్పిన ఖాతాల్లోకి డబ్బులు పంపిస్తే తప్పించుకునే వీలుందని, ఎవరి వద్దనైనా విషయం చెప్పినా, మీడియాలో వచ్చినా మీ పరువే పోతుందని, కేసు కూడా రిజిస్టర్ అవ్వడం ఖాయమని చెప్పి డబ్బులు గుంజేస్తారు. ఆ ఖాతాలన్నీ ఫేకే.. ఇలా మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా జార్ఖండ్, యూపీ, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలకు చెందిన వారు. వీరు పేద ప్రజలకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు చెల్లించి వారి పేరు మీద కరెంట్ ఖాతా తెరిచి వాడుతుంటారు. మోసం చేసేటప్పుడు వారి ఖాతాల్లోనే డబ్బులు పడేలా చేసి పడ్డాక విత్డ్రా చేసేస్తారు. ఫోన్ సిమ్లు కూడా ఇలా పేదల పేర్లతోనే తీసుకుంటారు. పని పూర్తయ్యాక ఆ ఖాతాలను క్లోజ్ చేసేసి సిమ్లను పడేస్తారు. సామాన్య ప్రజల ఖాతాల్లో తక్కువ డబ్బులుండటం, వారికి అన్ని భాషల పరిజ్ఞానం ఉండకపోవడంతో ఇలా కాస్త డబ్బున్న వారినే టార్గెట్గా పెట్టుకుంటున్నారు. కొన్ని కేసులు.. ● ఇటీవల జిల్లాకేంద్రంలో రిటైర్డ్ డీఎంహెచ్ఓను బెదిరించి రూ. 56 లక్షలకు పైగా కాజేశారు. ● రాగోలు జెమ్స్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలిని సైతం డిజిటల్ అరెస్టు పేరు చెప్పి రూ. 13.5 లక్షలు కాజేశారు. ● జిల్లా కేంద్రానికి చెందిన చెందిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ డిజిటల్ అరెస్టు పేరిట రూ. 11 లక్షలు మోసపోయాడు. ఢిల్లీ సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్నని చెప్పి పోలీస్ గెటప్లో వచ్చిన సైబర్ రెచ్చిపోతున్న సైబరాసురులు అబద్ధపు ఆరోపణలతో డిజిటల్ అరెస్టుల నాటకం బాధితుల్లో లాయర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్, రిటైర్డ్ ఉన్నతోద్యోగులు మోసగాళ్లు ఓటీపీలు అడిగి ఖాతాలోని సొమ్మును మాయం చేశారు. ఓ ప్రముఖ వైద్యుడు డిజిటల్ అరెస్టు పేరిట రూ. 80 లక్షలకు పైగా మోసపోయాడు. తక్షణమే అప్రమత్తమై సైబర్సెల్కు, బ్యాంకు ప్రతినిధులకు ఫిర్యాదు చేయడంతో కొంత మొత్తాన్ని రికవరీ చేయగలిగారు. జిల్లాకేంద్రంలో ఓ మెకానికల్ ఇంజినీర్ నుంచి డిజిటల్ అరెస్టు పేరిట రూ. 1.03 కోట్లు కాజేశారు. కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. ఫెడెక్స్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ పేరిట తైవాన్ నుంచి ముంబై అడ్రస్కు మీకు డ్రగ్ పార్సిల్ వచ్చిందంటూ జిల్లాకేంద్రానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరును బురిడీ కొట్టించి రూ. 20 లక్షలు కాజేశారు. కాశీబుగ్గలో ఓ రిటైర్డ్ ఆర్మీ జవాను రూ. 1.05 కోట్లు నష్టపోయాడు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఓ అడ్వకేట్ డిజిటల్ అరెస్టు పేరిట రూ. 1.32 కోట్లు మోసపోయినట్లు సమాచారం. -
అలరించిన నాటిక పోటీలు
కవిటి: బొరివంక కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానిత నాటిక పరిషత్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. చివరి రోజు అమ్మచెక్కిన బొమ్మ, స్వప్నంరాల్చిన అమృతం అనే రెండునాటికలు ప్రదర్శించారు. గోదావరి క్రియేషన్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన అమ్మచెక్కిన బొమ్మ సమాజంలో పెరుగుతున్న ఆస్తి కాజేసే మోసాలు, అమాయక యువతులపై జరుగుతున్న మోసాలు ఇతివృత్తంగా సాగింది. అనంతరం కరీంనగర్ చైతన్యకళాభారతి సంస్థ వారు ప్రదర్శించిన స్వప్నం రాల్చిన అమృతంనాటిక ఆద్యంతం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. -
30 వరకు బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయాల సేకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం ‘డెడికేటెడ్ కమిషన్’ను నియమించిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆది వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ‘ట్రిపుల్ టెస్ట్’ నిబంధనలను అనుసరిస్తూ, బీసీల వెనుకబాటుతనంపై సమగ్ర అనుభవ ఆధారిత విచారణ చేపట్టేందుకు కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిషన్, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసేందుకు వివిధ స్టేక్ హోల్డర్లు, సంస్థలు, వ్యక్తుల నుంచి లిఖితపూర్వక వినతిపత్రాలను ఆహ్వానిస్తోందని వివరించారు. ఈ అంశంపై అవగాహన ఉన్న వారు తమ వినతిపత్రాలను ఈ నెల 30వ తేదీలోపు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ‘సెక్రటరీ, డెడికేటెడ్ కమిషన్, డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయం, 1వ అంతస్తు, మొఘల్రాజపురం, విజయవాడ – 520010’ చిరునామాకు పంపాలి. అలాగే ఈ మెయిల్ ద్వారా కూడా వివరాలు పంపవచ్చు. ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రాలు సమర్పించాలనుకునే వారు కమిషన్ కార్యదర్శిని ( 901 0400500) లేదా సంబంధిత అధికారిని (798 9344521) సంప్రదించి ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాలని ఆయన వెల్లడించారు. ఎండలో భక్తుల అవస్థలు అరసవల్లి: సూర్య నారాయణ స్వామి క్షేత్రంలో భక్తులు ఎండలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆలయానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు పలు ఏర్పాట్లు చేసినప్పటికీ, భక్తులకు ఎండ నుంచి రక్షణ కోసం వేసిన టార్పాన్లు నాసిరకానివి కావడంతో ఎక్కడికక్కడ చిరిగిపోయి తెగిపడ్డాయి. దీంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఏర్పా టు చేసిన టార్పాలిన్లు భక్తులకు తీవ్ర అసౌకర్యాన్ని కల్పించాయి. ఇక ఆలయం నుంచి బయట ప్రాంతంలో కూడా టెంట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంజాయితో ఇద్దరు అరెస్టు ఇచ్ఛాపురం రూరల్: మండలం ఎం.తోటూరు వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎం. చిన్నంనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆదివారం ఎం.తోటూరు రైల్వే క్రాసింగ్ గేటు వద్ద రూరల్ ఎస్ఐ ఆర్.జనార్ధనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న కేదారిపురం గ్రామానికి చెందిన భుక్త బలరాం, బింగి కుమార్ను అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించారు. వీరి వద్ద నుంచి 2.100 కిలోల గంజాయి, రెండు మొబై ల్ ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఆఫీసులో నిర్వహించిన పత్రి కా సమావేశంలో సీఐ చిన్నంనాయుడు మాట్లాడుతూ గంజాయికి అలవాటుపడిన భుక్త బలరాం, బింగి కుమార్లు వారు పనిచేసే అచ్యుతాపురం పట్టణంలో గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, అధిక ధరలకు అమ్ముకుంటుంటారని తెలిపారు. బరంపురానికి చెందిన గంజాయి వ్యాపారి నిలంచల వద్ద రూ.3వేలుకు రెండు కిలోలు కొనుగోలు చేసి అచ్యుతాపురం వెళ్లేందుకు ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్కు వెళ్తున్న సమయంలో ఎల్సీ గేటు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అగ్నికి తోటలు దగ్ధం
టెక్కలి: కోటబొమ్మాళిలో వంశధార విద్యా సంస్థలకు ఆనుకుని ఉన్న సుమారు 6 ఎకరాల జీడి, మామిడి, టేకు తోటలు ఆదివారం అగ్నికి ఆహుతయ్యాయి. ప్రతి రోజూ కొంత మంది ఆకతాయిలు ఇదే తోటల్లో మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతుంటారని ఈ క్రమంలో సిగరెట్లు తాగి పడేసి ఉండడంతో ఎండిపోయిన ఆకులకు మంటలు వ్యాపించి ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన కొంత మంది పాఠశాలలో ఉన్న మోటారు సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పాఠశాల యజమాని చింతాడ అనిరుద్రడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఈ ప్రమాదంలో అనిరుద్రుడు, టి.కృష్ణారావు, బోయిన సాయి, మణిపాత్రుని భాను, బాబులు, రవి, భగవాన్లకు చెందిన 6 ఎకరాల జీడి, మామిడి, టేకు తోటలు దగ్ధమై లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లింది. -
‘12వ పీఆర్సీ వెంటనే ప్రకటించాలి’
ఆమదాలవలస: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీని ప్రకటించాలని, ఐఆర్ 30 శాతం అమలు చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్దనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని సబ్ ట్రెజరీ ఆఫీసర్ కార్యాలయ ఆవరణలో సంఘం అధ్యక్షులు సురవరపు సిమ్మినాయుడు ఆధ్వ ర్యంలో ఆదివారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బొడ్డేపల్లి జనార్ధనరావును ఎంపిక చేశారు. గౌరవ అధ్యక్షుడిగా బొడ్డేపల్లి మోహనరావు, కోశాధికారిగా హెచ్వీ సత్యనారాయణను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పేడాడ భానుజీరావు, పేడాడ వైకుంఠరావు, నైనపాత్రుని చంద్రశేఖరరావు, బెండి సూర్యనారాయణ ,బొడ్డేపల్లి వెంకటరమణ, బెండి గోవిందరావు, కూర్మాన షణ్ముఖరావు, పొన్నాడ వరాహ నరసింహులను ఎన్నుకున్నారు. కార్యదర్శులుగా దన్నాన శ్రీరామమూర్తి, కర్నేని జనార్ధనరావు, కాగితాపల్లి సంజీవరావు, బెండి నారాయణరావు, నాయనపాత్రుని వాసుదేవరావు, బుడుమూరు సత్యనారాయణ, పేడాడ అప్పారావు, కేవీ రాజారావును ఎన్నుకోగా కార్యవర్గ సభ్యులుగా బెండి చిట్టయ్య, తాండ్ర కృష్ణకుమార్, తమ్మినేని సూర్యనారాయణ, పప్పల వెంకటేశ్వరరావు, నూక సూర్యనారాయణ, అంపోలు సూర్యారావు, పూజా రి ధనుంజయరావు, బలివాడ వెంకటరమణ ,బి.వి.ఎస్.ఎన్. మూర్తి, డాక్టర్ అన్నెపు ,విష్ణుమూర్తి ఎస్.వి. రమేష్ లను ఎన్నుకున్నారు. ఆడిట్ కమిటీ కన్వీనర్గా లోలుగు విశ్వేశ్వరరావుతో పాటు గురుగుబెల్లి కృష్ణమూర్తి, సంబాన అమ్మారావు లను ఎన్నుకున్నారు. -
ఇప్పుడు పాతికే!
ఒకప్పుడు 77 ఎకరాలు..ఆమదాలవలస : పట్టణ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువ గల పెద్ద చెరువు (అంకమ్మ చెరువు) భూములు కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని అంతరించిపోతున్నాయని ఆదివారం ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. ఒకప్పుడు సుమారు 77 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు, రాజకీయ అండదండలతో బడాబాబులు చుట్టుముట్టి ఆక్రమించుకోవడంతో ప్రస్తుతం కేవలం 25 ఎకరాలకు పరిమితమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న చెరువు భూమిలో ఆక్రమణలు కొనసాగుతూ పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్నప్పటికీ, రెవెన్యూ, మున్సిపల్ అధి కారులు స్పందించకపోవడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 73లో ఉన్న ప్రభుత్వ చెరువు భూమిలో ఇటీవల ఒక వస్త్ర వ్యాపారవేత్త సుమారు 40 అడుగుల మేర మట్టిని నింపి స్థలం ఎత్తు చేసిన ఘటన స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. ఈ విషయం తెలుసుకున్న పాత ఆమదాలవలస గ్రామానికి చెందిన రైతులు సంఘటితమై అక్కడకు చేరుకొని నిరసన తెలిపారు. రైతులు ముద్దాడ జోగారావు, లావేటి సన్యాసిరావు, గొలివి పురుషోత్తం, పోగోటి మణికంఠ, అంబటి పోలినాయుడు, బండి శిమ్మయ్య ఆధ్వర్యంలో మరికొంతమంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 23 వార్డులలో 19 వార్డుల డ్రైనేజీ నీరు ఈ చెరువులోకి చేరుతోందని, పాత ఆమదాలవలస, కుద్ధిరాం, రావికంటిపేట, బొడ్డేపల్లి పేట ప్రాంతాలకు చెందిన సుమారు 100 ఎకరాల సాగు భూములు ఈ చెరువు నీటిపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కీలక వనరు రోజురోజుకూ ఆక్రమణలతో అంతరించిపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వందల కోట్ల విలువైన చెరువు భూమిని రక్షించాలని రైతులు డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి కార్యాలయాలకు ఫిర్యాదు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆక్రమణలు తొలగిస్తాం ఈ అంశంపై ఆమదాలవలస తహసీల్దార్ ఎస్.రాంబాబు స్పందిస్తూ, పెద్ద చెరువు భూములపై జరిగిన ఆక్రమణలపై మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, అక్రమాలను తొలగించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఊరి ఉసురు తగులుతుంది
● ఇసుక దందాపై బాధితుల ఆందోళన ● లారీలకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు ● కూటమి నేతల ఆధ్వర్యంలోనే ఇసుక అక్రమ రవాణా శ్రీకాకుళం రూరల్: ఇసుక దందా ఆగడం లేదు. అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చుట్టు పక్కల గ్రామస్తులంతా ఆదివారం నిరసనలు చేపట్టి వందల కొద్దీ ఇసుక లారీలను రోడ్లపై ఎక్కడికక్కడే ఆపేశారు. మండల పరిధిలోని రాగోలు, బావాజీపేట, కూటికుప్పలవానిపేట, రాగోలు పేట, దూసి గ్రామాల మీదుగా వెళ్లిన లారీలను ఆయా గ్రామస్తులంతా అడ్డుకున్నారు. ఇసుక లారీలు కారణంగా తమ రహదారులు పాడైపోయాయని, ఎక్కడికక్కడికే పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయని, తమకు న్యాయం చేయాలంటూ ఆదివారం నిరసనలు చేపట్టారు. అక్రమ ఇసుక రవాణా కారణంగా గ్రామాల్లోకి వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నామని, ఈ లారీల అక్రమ రవాణా కార ణంగా రాత్రిళ్లు ప్రమాదాలకు గురవుతున్నామని ఆందోళన చేశారు. ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ నిరసనలు చేపట్టడంతో ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల గ్రామస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా వెనుదిరిగారు. కూటమి నేతల ఆధ్వర్యంలోనే.. వాస్తవంగా అక్రమ ఇసుక రవాణా అంతా కూటమి నేతల ఆధ్వర్యంలోనే రాత్రింబవళ్లు సాగుతోంది. నదీ పరివాహక ప్రాంతాలు గల నాగావళి, వంశధా ర నదులు నుంచి టన్నుల కొద్దీ ఇసుకను తోడేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రధానంగా ఆమదావలస మండలంలోని దూసి, ముద్దాడపేట, కలివరం, తొగరాం, కొత్తవలస పరిసర ప్రాంతాల నుంచి తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలోనే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం.లారీల ముందు ధర్నా చేస్తున్న దృశ్యం రోడ్లన్నీ పాడైపోయాయి అక్రమ ఇసుక రవాణా కారణంగా మా రోడ్లన్నీ పాడైపోయాయి. ఈ రోడ్లపై నడవాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. స్కూల్కు వెళ్లే విద్యార్థులు సైతం ఈ దారి గుండా వెళ్లడానికి భయపడుతున్నారు. – ఎం.జగదీష్, బావాజీపేట మాకు న్యాయం చేయాలి మా గ్రామాలకు వెళ్లడానికి ఇవే ప్రధాన రహదారులు. ఇసుక వాహనాల వల్ల దారులన్నీ ధ్వంసమైపోయాయి. రాగోలుపేట, బావాజీపేట, దూసి మీదుగా దుమ్ము ధూళి ఎగిరిపడుతోంది. – పి.వెంకటరమణ, కూటికుప్పలపేట -
ఎందుకో ఏమో..!
● సూర్యఘర్ పథకంపై జిల్లాలో విముఖత ● ఆశించిన స్థాయిలో దక్కని ఆదరణ ● అమలులో రాష్ట్రంలో జిల్లా 22వ స్థానం ● మల్లగుల్లాలు పడుతున్న అధికారులు హిరమండలం : ప్రతి ఇంట్లో విద్యుత్ ఉత్పాదన పెంచేందుకు, సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట ‘సూర్యఘర్’ పథకాన్ని ప్రారంభించింది. అయితే పథకం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో విద్యుత్ వినియోగదారుల నుంచి పెద్దగా ఆసక్తి లేకుండాపోతోంది. దీంతో రాష్ట్రంలోనే పథకం అమలులో జిల్లా వెనుకబడి ఉంది. ఏకంగా 22వ స్థానంలో జిల్లా నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. కరెంట్ వినియోగంలో భారం తగ్గించేందుకుగాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. కానీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో మాత్రం స్పందన రావడం లేదు. లక్ష్యానికి చేరువ కాలేక విద్యుత్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 8 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో ఇప్పటివరకూ 16,278 మంది మాత్రమే సోలార్ అమర్చుకున్నారు. రో జుకు అవసరం అయ్యే విద్యుత్ వినియోగం జిల్లా లో 30 వేల కిలోవాట్లుకాగా.. ఇప్పటివరకూ ఉత్పత్తి అవుతున్న సౌర విద్యుత్ కేవలం 3,256 మెగా వాట్లు. ఇలాగైతే లక్ష్యానికి ఎప్పుడు చేరువకావాలంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాన ఆశించిన స్థాయిలో పథకంలో పురోగతి లేదు. ముందుగా పట్టణాలు, మేజర్ పంచాయతీల్లో సోలార్ ప్లాంట్ల అమరిక ప్రారంభించారు. ఆర్థికంగా స్థితిమంతులు, ఉన్నత శ్రేణి వర్గాల వారు మాత్రమే సోలార్ ప్లాంట్ అమర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. సాధారణ, మధ్యతరగతి ప్రజలు అటువైపుగా చూడడం లేదు. తాము అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. అందరూ అర్హులే.. సొంతిల్లుతో పాటు విద్యుత్ కనెక్షన్ ఉన్న ప్రతిఒక్కరూ ఈ పథకానికి అర్హులే. దరఖాస్తుకు విద్యుత్ బిల్లు, ఆధార్, రేషన్ కార్డులు, బ్యాంకు అకౌంట్ వివరాలు, మొబైల్, ఇంటిపత్రాలు జతపరచాల్సి ఉంటుంది. విద్యుత్ కోతల బెడద ఉండదు. వినియోగం కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయితే తిరిగి విద్యుత్ శాఖకు విక్రయించుకోవచ్చు. ఒకసారి సోలార్ ప్యానెల్స్ అమర్చుకుంటే పాతికేళ్ల వరకూ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో సూర్యఘర్ పథకం నత్తనడకన కొనసాగుతుండటం నిజమే. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా పెద్ద మొత్తంలో కట్టాల్సి ఉండటంతో వారు ఆసక్తి చూపడం లేదు. బ్యాంకు రుణాలు కల్పిస్తామని చెబుతున్నా ఇంకా అనుమానంతోనే ఉన్నారు. అయినా సరే మా ప్రయత్నాల్లో మేమున్నాం. – జి.వి.ప్రసాద్, విద్యుత్ శాఖ డీఈ, పాతపట్నం ప్రజల విముఖత.. ప్రతి కుటుంబం 300 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా పొందేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఇంటి పైకప్పు ప్రాంగణంలో సోలార్ పలకలు ఏర్పాటుచేసుకుంటే 40 శాతం వరకూ రాయితీ ఇస్తున్నారు. 3 కిలోవాట్స్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సోలార్ పలకలను అమర్చేందుకు రూ.1.40 లక్షల వరకూ ఖర్చవుతోంది. బ్యాంకుల్లో రుణ సౌకర్యం తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నా.. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు వినియోగదారులు ఆసక్తిచూపడం లేదు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఎచ్చెర్ల : మండలంలోని కేశవరావుపేట సమీపంలోని బాబాయ్ హోటల్ దగ్గర ఆదివారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన హనుమంతు వనజాక్షి (38) మృతి చెందారు. ఈమె భర్త కామేశ్వరరావుకు కాలికి గాయాలయ్యాయి. వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై ఎచ్చెర్ల బంధువుల ఇంటికి పరా మర్శకు వెళ్తుండగా.. బాబాయ్ హొటల్ వద్దకు వచ్చే సమయంలో రాత్రి 9 గంటలకు ఎదురుగా ఒడిశాకు చెందిన బొలేరో వ్యాన్ ఢీకొట్టింది. దీంతో దంపతులు గాయపడ్డారు. వీరిని వెంటనే శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో వనజ మృతి చెందారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పెద్దబ్బాయి జ్ఞానేశ్ ఇంటర్ చదువుతున్నాడు. సాత్విక్ 10వ తరగతి ఎగ్జామ్ రాశాడు. కామేశ్వరరావు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వనజ మృతిని తెలుసుకున్న బంధువులు రిమ్స్ ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరయ్యారు. ఎచ్చెర్ల పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
అదుపు తప్పిన కారు.. ముగ్గురికి గాయాలు
పలాస: పలాస నెమలినారాయణపురం జాతీయ రహదారి వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పర్లాకిమిడికి చెందిన అక్షయ (24), ముఖేష్ పాణిగ్రాహి (52), అమూల్య పాత్రో(52)లు భువ నేశ్వర్ నుంచి తిరుగు ప్రయాణంలో తన సొంతూరు పర్లాకిమిడికి ఇన్నోవా కారులో వస్తుండగా నెమలినారాయణపురం వద్ద సాయంత్రం 5.30 గంటలకు గాలి, దూళి, వర్షం కారణంగా కారు డివైడర్ మీదుగా అవతలి రోడ్డుకు వెళ్లి ఒక లారీని గుద్ది పక్క పొలాల్లోకి దూసుకు పోయింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముఖేష్ పాణిగ్రాహి, అక్షయలు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయారు. అమూల్య పాత్రో స్వల్పంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ముఖేష్ పాణిగ్రాహి పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిఫర్ చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాశీబుగ్గ సి.ఐ రామకృష్ణ చెప్పారు. -
మృత్యు పాశం
● పిడుగు పడి తల్లీకూతుళ్ల మృతి ● విషాదంలో మునిగిన పెద్దకేశుపురం ఆ ఇల్లు ఓ చావు చూసి ఎంతో కాలం కాలేదు. అంతలోనే మృత్యుదేవత మళ్లీ ఆ ఇంటిపై మృత్యుపాశం విసిరింది. కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్న కుటుంబంపై పిడుగు వేసింది. పెద్ద కేశుపురం గ్రామంలో పిడుగుపాటుకు తల్లీకూతుళ్లు మృతి చెందారు. అచేతనంగా పడి ఉన్న తల్లీకూతుళ్లను చూసి చుట్టుపక్కల వారు కంటతడి పెట్టారు. మందస: నారాయణపురం పంచాయతీ పెద్ద కేశుపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి మడియా కృష్ణవేణి(35), మడియా లోకేశ్వరి(చిన్ని)(15) అనే తల్లీకూతుళ్లు మృతి చెందారు. కృష్ణవేణి జీడిపిక్కల బడ్డీకి వెళ్లి జీడి పిక్కలు కటింగ్ చేసుకుంటూ జీవనం గడుపుకునేవారు. ఆమె భర్త సుగర్ వ్యాధి కారణంగా గత ఏడాది డిసెంబర్లో చనిపోయారు. అప్ప టి నుంచి మడియా కృష్ణవేణి కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమె కుమార్తె లోకేశ్వరి ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశారు. ఆదివారం కృష్ణవేణి ఆవులకు నీరు పెట్టడానికి పశువుల శాలకు వెళ్లారు. ఆమె వెంటే కూ తురు కూడా వెళ్లారు. సరిగా అదే సమయంలో వర్షం ప్రారంభమై హఠాత్తుగా పిడుగు పడింది. ఆ ధాటికి తల్లీ కూతుళ్లు ఉన్న చోటనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేశారు. చుట్టుపక్కల వారు వచ్చి చూసే సరికే వారికి ప్రాణాలు లేవు. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను హరిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ తిరుమలరావు, ఎస్ఐ కృష్ణప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మడియా లోకేశ్వరి(చిన్ని) మడియా కృష్ణవేణి -
కన్న కొడుకే కాలయముడు
మందస: పెద్ద లోహరిబంద ఆదివారం రోదించింది. కొడుకు చేతిలో కన్నతండ్రి హతం కావ డంతో ఊరుఊరంతా ఉలిక్కిపడింది. గ్రామానికి చెందిన తాళ్ల ఏకాంబరరావు పదేళ్లుగా మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడు. దీని కోసం చికిత్స కూడా తీసుకుంటున్నాడు. దీనికి తోడు ఆయనకు తాగుడు అలవాటు ఉంది. ఈ నేప థ్యంలో ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఏకాంబరరావుకు ఆయన తండ్రి తాళ్ల లక్ష్మీ నారాయణ(60)కు గొడవ జరిగింది. ఈ గొడవలో ఏకాంబరరావు విచక్షణ కోల్పోయి తండ్రిని తీవ్రంగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గొడవ జరిగాక ఏకాంబరరావు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అతడిని చూసిన చిన్న కోడలు ఇంటిలోకి వెళ్లి చూడగా లక్ష్మీ నారాయణ రక్తపు మడుగులో కనిపించారు. వెంటనే ఆమె తన భర్త గోపికి విషయం చెప్పింది. చుట్టుపక్కల వారికి కూడా విషయం తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎం.తిరుపతిరావు, మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని హరిపురం సామాజిక ఆస్పత్రికి తరలించారు. పచ్చటి గ్రామంలో రక్తం చిందింది. మానసిక సమస్యలకు తోడైన తాగుడు అలవాటు ఓ మనిషిని హంతకుడిలా మార్చింది. ఎవరి చేయి పట్టుకుని నడక నేర్చుకున్నాడో, ఎవరి గుండెలపై ఆడుకున్నాడో, ఎవరి రక్తం పంచుకుని పుట్టాడో ఆ వ్యక్తి మీదే దాడికి తెగబడేంతలా పరిస్థితి మారింది. తల కొరివి పెట్టాల్సిన కొడుకే ఆయుష్షును తీసేయడంతో పెద్ద లోహరిబంద బోరున విలపించింది. తండ్రిని చంపిన తనయుడు పెద్దలోహరిబందలో ఘటన మానసిక సమస్యలతో బాధ పడుతున్న కొడుకు -
‘అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయం’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దేశ గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలో బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను మిల్లు జంక్షన్లో ఆదివారం నిర్వహించారు. మిల్లు జంక్షన్ వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ప్రముఖులు ఘనంగా నివాళులర్పించా రు. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ వ్యవసాయ, రక్షణ శాఖల మంత్రిగా ఆయన చూపిన చొరవ అద్భుతమని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి గార: వత్సవలస రాజమ్మ తల్లి యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటో బోల్తా పడటంతో గాయాలపాలైన లుకలాపు వెంకటరమణ (45) చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. గార పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రేగిడి ఆమదాలవలస మండలం లంబకండి గ్రామానికి చెందిన మృతుడు వెంకటరమణతో పాటు గ్రామస్తులు ఆటోలో శనివారం వత్సవలస వచ్చారు. తిరుగు ప్రయాణంలో కొర్ని గ్రామం మీదుగా వెళ్తుండగా మలుపు వద్ద ఆటో అదుపు తప్పడంతో బోల్తా పడగా, ఆటో కింద ఉండిపోవడంతో గాయాలపాలయ్యాడు. ముందుగా రిమ్స్లో చే ర్పించగా, మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఉదయం మృతి చెందాడు. కుమారుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ చోడిపల్లి గంగరాజు తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధిపై దాడికి పాల్పడిన వ్యక్తి పై కేసు నమోదు ఇచ్ఛాపురం: రెండు రోజుల క్రితం స్థానిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఏజెన్సీ ప్రతినిధి వజ్రపు వెంకటేష్ పై దాడికి పాల్పడిన ఏఎస్పేట చెందిన వ్యక్తి మన్యాల విఘ్నేష్ పై కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపా రు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్ ఇన్చార్జి ఆర్.జనార్ధన్ రావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ పెట్రోల్ బంక్ ప్రారంభం టెక్కలి: టెక్కలి జగతిమెట్ట సమీపంలో ఏర్పా టు చేసిన సబ్ కలెక్టర్ పెట్రోల్ బంక్ను మంత్రి కె.అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా అవసరాలకు అనుగుణంగా అందుబాటులో పెట్రో ల్ బంక్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఐవోసీఎల్ విశాఖ డివిజన్ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ బి.శేషగిరి, కె.హరివరప్రసాద్, రాజీవ్కుమార్, ప్రశాంత్ ఉన్నారు. పిడుగు పాటుకు కొబ్బరి చెట్టుకు మంటలు కవిటి: మండలంలోని రాజపురంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షం, మెరుపులకు తోడు పిడుగులు పడ్డాయి. రాజపురంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో ఆ చెట్టు మొవ్వుకు కూడా నిప్పు అంటుకుటుంది. వానలోనూ మంటలు చెలరేగాయి. -
అండర్–18 బాలబాలికల బాస్కెట్ బాల్ ఎంపికలు రేపు
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా అండర్–18 బాల బాలికల బాస్కెట్బాల్ జట్ల ఎంపిక ఈనెల 7వ తేదీ మంగళవారం జరుగుతుందని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కూడలి వద్దనున్న ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఉన్న బాస్కెట్బాల్ సెలక్షన్ ట్రైన్స్ మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి జరుగుతుందని తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు 18 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. డీఎస్సీ కోచ్ అర్జునరెడ్డి మాట్లాడుతూ ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు ఈ– సేవ సర్టిఫికెట్, రెండు పాస్పోర్ట్సైజ్ ఫొటోలు, ఆధార్కార్డు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు 9949291288 సంప్రదించాలని ఆయన కోరారు. రణస్థలంలో భారీ ట్రాఫిక్ జామ్ రణస్థలం: రణస్థలంలో జరుగుతున్న పై వంతెన పనులు వాహనదారులకు దినదిన గండంలా మారుతున్నాయి. అలాగే రోడ్డు దాటే ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం 9గంటల సమయంలో రామతీర్థాలు కూడలిలో ఉన్న భారీ స్పీడ్ బ్రేకర్ వల్ల అధిక లోడుతో వెళుతున్న లారీ వెనుక చక్రాల వద్ద కట్ ప్లేట్లు విరిగిపోయాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. రణస్థలం నుంచి యూబీ పరిశ్రమ వరకు వాహనాలు బారులు తీరాయి. రణస్థలం దాటేందుకు పక్కాగా రెండు గంటలు పట్టిందంటే ట్రాఫిక్ తీవ్రత ఎంత ఉందో తెలుస్తోంది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు జేఆర్ పురం పోలీసులు తీవ్రంగా శ్రమించారు. -
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
మందస/శ్రీకాళహస్తి రూరల్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. శ్రీకాకుళంలో తల్లీ కూతురు మరణించగా, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురం పంచాయతీ పెద్దకేశుపురం గ్రామంలో ఆదివారం పిడుగు పడి తల్లీకూతుళ్లు మృతి చెందారు. మడియా కృష్ణవేణి(35), ఆమె కుమార్తె మడియా లోకేశ్వరి(15) ఆవులకు నీళ్లు పెట్టేందుకు పశువుల శాలకు వెళ్లగా అదే సమయంలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడే ప్రాణాలు వదిలారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో పిడుగుపాటుకు కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. ఆదివారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. అదే సమయంలో కలవగుంట గ్రామంలో కల్లుగీత కార్మికుడు వి.కామరాజు (35) తాటిచెట్టు ఎక్కి కల్లు దించుతున్నాడు. ఒక్కసారిగా తాటిచెట్టుపై పిడుగు పడడంతో కామరాజు చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. స్థానికులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు ధ్రవీకరించారు. మృతుని సొంత ఊరు ఏర్పేడు మండలం, పరమాలపల్లి గ్రామం. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మడపాంలో రైస్మిల్లు సీజ్
● లెవీ బియ్యంలో రేషన్ బియ్యం కలుపుతున్నట్లు నిర్ధారణ ● 160 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం నరసన్నపేట: సివిల్ సప్లయ్కు ఇస్తున్న లెవీ బియ్యంలో రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేసి కలుపుతు న్నట్లు నిర్ధారణ కావడంతో నరసన్నపేట మండలం మడపాం వద్ద శ్రీ వేంకటేశ్వర మోడరన్ రైస్మిల్లును అధికారులు శనివారం సీజ్ చేశారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాలరావు, డీఎస్ఓ సూర్యప్రకాశరావులు శుక్ర, శనివారాల్లో రైస్మిల్లును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్ఓ మాట్లాడుతూ మిల్లులో 160 కేజీల రేషన్ బియ్యాన్ని గుర్తించామన్నారు. లెవీ బియ్యంలో రేషన్ బియ్యం కలుపుతున్నట్లు నిర్ధారణ కావ డంతో జేసీ ఆదేశాల మేరకు మిల్లుపై సిక్స్ ఎ కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నామని ప్రకటించారు. కొంతకాలంగా ఈ మిల్లు నుంచి సివిల్ సప్లయ్కు వస్తున్న లెవీ బియ్యంలో కోటా బియ్యం కలుపుతున్నట్లు అనుమానం వచ్చి నిపుణులతో పరిశీలన చేయించగా వాస్తవమని నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో మిల్లులో ఉన్న 1200 టన్నుల ధాన్యాన్ని సమీపం మిల్లులకు తరలిస్తున్నామని డీఎస్ఓ వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి మిల్లులపై నిఘా వేస్తున్నామని చెప్పారు. పీడీఎస్ బియ్యం మిల్లుల్లో ఉంటే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీఎస్ఓ వెంట తహసీల్దార్ సత్యనారాయణ, సీఎస్డీటీ రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
మూడెకరాల్లో అగ్ని కీలలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రం సమీపంలో నవభారత్ కూడలి హైవే రహదారిని ఆనుకొని పల్లపు ప్రాంతంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు మూడు ఎకరాల్లో నీలగిరి మొక్కలున్న ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తకుప్పలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టం ఏమీ జరగలేదన్నారు. మధ్యాహ్నం 1.35 గంటలకు హైవేలో వెళ్తున్న ఓ వ్యక్తి కాల్ చేయడంతో ఘటనాస్థలికి సిబ్బందితో వెళ్లి మంటలు అదుపుచేశామన్నారు. అప్పటికే దట్టమైన పొగలు అలుముకోవడంతో వాహనచోదకులకు ఇబ్బంది కలిగిందన్నారు. దాదాపు రెండు గంటల పాటు మంటలు వ్యాపించాయని స్థల యజమాని మొదలవలస కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేశామని చెప్పారు. -
అలరించిన నాటిక ప్రదర్శనలు
కవిటి : సమకాలీన సమాజంలో కుటుంబ వ్యవస్థలో నెలకొన్న పలు ప్రతికూల అంశాల్ని కళ్లకు కట్టినట్టు తెరకెక్కించిన నాటిక ప్రదర్శనలు ప్రేక్షకుల్ని ఆద్యంతం చైతన్యపరిచాయి. కవిటి మండలం బొరివంకలో కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో రెండో రోజు జరిగిన ఉభయ తెలుగురాష్ట్రాల నాటిక పోటీ లు ఆలోచింపజేశాయి. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించిన ‘సహాన’ నాటిక ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అన్యాయంపై తిరుగుబాటు చేస్తూ అలుపెరుగని ప్రయాణం చేయాలనే ఇతివృత్తంగా సా గింది. రెండో ప్రదర్శనగా ‘మా ఇంటి మహాభారతం’ నాటికలో వంద ఎకరాల భూస్వామి విలాసా ల బారిన పడి ఉన్నదానిలో అరవై ఎకరాలు అమ్ము కోవడం, తల్లి శపథం ఇతివృత్తంగా ఆద్యంతం అలరించింది. చివరి ప్రదర్శనగా ఆలీతో సరదాగా అనే హాస్యనాటిక సమాజంలో యువతీ యువకుల మధ్య ఆధునిక స్నేహసంబంధాల్లో వస్తున్న తాజా సన్నివేశాల సమాహారంగా తెరకెక్కించారు. -
జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం: జిల్లా పరిషత్ సీఈఓగా వెంకట్రామన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరంలో ఇన్చార్జి సీఈఓ గా పనిచేస్తున్న వెంకట రామన్ను పదోన్నతిపై శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈఓగా ప్రభుత్వం మూడు రోజుల కిందట నియమించిన విష యం పాఠకులకు విధితమే. ఆయన శనివారం బాధ్యతలు తీసుకున్నారు. మెళియాపుట్టి: మెళియాపుట్టి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న చాపర గ్రామంలో అర్ధరాత్రి ద్విచక్రవాహనాలు దొంగతనం చేసే వ్యక్తులు తిరుగుతున్నారంటూ శనివారం సీసీ ఫుటేజ్ వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొట్టింది. బైక్ చోరీ చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కుక్కలు మొరగడంతో పారిపోయా రు. ఇదిలా ఉండగా శనివారం అదే గ్రామానికి చెందిన కిల్లంశెట్టి జగదీశ్వరావు తన ద్విచక్ర వాహనం చోరీకి గురైందంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ తెలిపారు. చాపర గ్రామంలో నెల క్రితం కూడా రెండు ద్విచక్రవాహనాలు చోరీకి గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఎచ్చెర్ల : స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు పాలిసె ట్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ విక్టర్పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం నుంచి శిక్షణ ప్రారంభమౌతుందని, ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఆధార్ కార్డు, పదో తరగతి హాల్ టికెట్, పాలిసెట్ ఫీజు రసీదుతో వచ్చి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. పాలిసెట్కు అప్లయ్ చేసేందుకు ఈ నెల 9 వరకు గడువు పొడిగించారని చెప్పారు. పూర్తి వివరాలకు 9440951078 నంబరును సంప్రదించాలని కోరారు. -
భర్తకు డయాలసిస్ చేయిద్దామని వచ్చి..
శ్రీకాకుళం క్రైమ్ : భర్తకు కిడ్నీ వ్యాధి ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించేందుకొచ్చి ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృత్యువాత పడింది. ట్రాఫిక్ సీఐ వి. రామారావు తెలిపిన వివరాల మేర కు.. లావేరు మండలం వెంకటపురానికి చెందిన అంధవరపు మార్కండేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందా రు. భార్య జయలక్ష్మి(70), వివాహాలైన కుమారుడు, కుమార్తె ఉన్నారు. లావేరు పరిధిలోనే ఫెర్టిలైజర్ షాపు నడుపుతున్నారు. మార్కండేయులకు కొంతకాలంగా కిడ్నీ వ్యాధి ఉంది. శుక్రవారం డయాలసిస్ నిమిత్తం నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి భార్య జయలక్ష్మి తీసుకొచ్చింది. మార్కండేయులును ఐసీయూలో ఉంచడంతో ఎవరూ ఉండకూడదన్న నిబంధనతో ఆమదాలవలసలోని తన సోదరి కుమార్తె ఇంటికి జయలక్ష్మి శుక్రవారం రాత్రి వెళ్లిపోయింది. శనివారం సాయంత్రం ఆమదాలవలసలో పల్లె వెలుగు బస్సులో శ్రీకాకుళం చేరి కాంప్లెక్సులో దిగింది. నడుచుకుంటూ నాన్స్టాప్ బస్సులు, ఆటోస్టాండ్ మధ్య ఖాళీ స్థలం వైపు వెళ్తూ ఆగింది. ఔట్గేట్ వైపుగా వస్తున్న అదే పల్లెవెలుగు బస్సు వృద్ధురాలిని గమనించక పైనుంచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని అంబులెన్సులో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్ఐ దండపాణి దాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
130కు చేరిన బాదంపాలు బాధితులు
శ్రీకాకుళం రూరల్ : సింగుపురంలో రెండు రోజుల క్రితం జరిగిన హాటకేశ్వరస్వామి, కొండమ్మ తల్లి యాత్రలో బాదంబాలు తాగి అస్వస్థతకు గురైన వారి సంఖ్య 130 మందికి చేరింది. ఇప్పటికే బాధి తుల్లో కొందరికి సింగుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది ఇప్పటికే కోలుకుంటున్నారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మామిడివలసకు చెందిన ఓ వ్యక్తి పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ల్యాబ్లకు శాంపిళ్లు.. ఇదే విషయమై కలెక్టర్ స్వప్నిల్ స్పందిస్తూ బాధితులంతా సురక్షితంగానే ఉన్నారని, బాదం పాలు, కస్టర్డ్ పౌడర్ నమూనాలను పరీక్షల నిమిత్తం విశాఖ, హైదరాబాద్ పంపించామని చెప్పారు. డీఎంహెచ్ఓ, ఆహార భద్రతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షిస్తున్నారని తెలిపారు. బాదంపాలు విక్రయించిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఒకటో పట్టణ పరిధిలో బాదం పౌడర్ విక్రయించే పలు దుకాణాల్లో ఆహార తనిఖీ అధికారులు పోలీసులతో కలిపి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం సింగుపురంలో బాదంపాలు తాగి కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఫుడ్ ఇన్స్పెక్టర్ కోట లక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. -
కళంకితుడికి అందలమా..?
కళంకితుడిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కుర్చీలో కొనసాగించడంపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. అర్హత లేని వ్యక్తిని వెంటనే ఆ పదవి నుంచి సాగనంపాలని కోరుతూ శనివారం జిల్లా వ్యాప్తంగా దేవాలయాల వద్ద పూజలు నిర్వహించారు. టీటీడీ పవిత్రతను కాపాడాలని, బీఆర్ నాయుడుకు ఆ పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని అన్నారు. దేవాలయం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వారే అపవిత్రం చేస్తున్నారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. –సాక్షి నెట్వర్క్ -
విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్
పాతపట్నం: విద్యార్థుల భద్రత, వసతుల కల్పనలో ఏ మాత్రం అలసత్వం వహించినా సహించేది లేద ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను హెచ్చరించారు. శనివారం మండలంలోని ప్రహారాజపాలెంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ను కలెక్టర్ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఇటీవల 7వ తరగతి చదువుతున్న చింతల పూజిత మెట్లపై నుంచి జారిపడి మృతి చెందిన ఘటన తెలిసిందే. ప్రమాదంపై క్షుణ్ణంగా ప్రిన్సిపల్ పద్మావతి ని, సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని, మెట్లను, మెడ మీద టెర్రస్ను, విద్యార్థిని డార్మిటరీని పరిశీలించారు. విద్యార్థులపై నిఘా లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ పద్మావతి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లకు తలుపులు, ప్రహరీ పనులకు నిధులు మంజూరు చేసినప్పటికి, పనుల్లో జాప్యంపై ప్రిన్సిపాల్తో పా టు ఈడబ్లూఐడీసీ జేఈ రామారావుపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుతున్న తరగతి గదులకు వెళ్లి, విద్యార్థులతో నోట్స్ చదివించి, విద్యా బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. శుద్ధ జలం లేకపోవడంతో రిపేర్ చేయించాలని తహసీల్దార్ ప్రసాదరావును ఆదేశించారు. పాతపట్నం గ్రామ సచివాలయం–1ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
ఆ దంపతుల నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: ‘నేత్రదానం’ వెలుగుల దానమ ని రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు శనివారం పేర్కొన్నారు. గార మండలం శ్రీకూర్మం గ్రామానికి చెందిన అంధవరపు బాలకృష్ణమూర్తి (88) గత నెలలో మరణించడంతో కుటుంబ సభ్యులు రెడ్క్రాస్ ద్వారా నేత్రదానం చేశారు. ఆయన భార్య అంధవరపు రూపవతి (82) తన భర్త నేత్రదానం నుంచి ప్రేరణ పొంది మరణానంతరం నేత్రదానం చేయాలని కుమారులకు తెలియజేసి శనివారం తనువుచాలించారు. దీంతో కుటుంబ సభ్యులు అంధవరపు రాఘవ్కుమార్, శ్రీనివాస నెహ్రూ, వి.సుజాతలు నేత్రదానానికి ముందుకొచ్చారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, పి.చిన్నికృష్ణల ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్ర దానం చేయాలనుకునే 78426 99321 నంబరుకు సంప్ర దించాలని జగన్మోహనరావు కోరారు. -
తాతంశెట్టి తాట ఎప్పుడు తీస్తారు?
‘‘మహిళల జోలికి వస్తే తాట తీస్తాం.. ఆడపడుచులను కష్టపెడితే అంతు చూస్తాం.. అతివలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం’’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకప్పుడు ఆవేశంతో ఊగిపోయారు. స్త్రీల ధన..మాన.. ప్రాణాల రక్షణకే అధిక ప్రాధాన్యమిస్తామని ఊదరగొట్టారు. అయితే ఆదర్శాలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమని నిరూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగినప్పటికీ చేతులు ముడుచుకుని కూర్చున్నారు. కూటమి నేతలు బరితెగించి మహిళలపై దాడులకు పాల్పడుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం రైల్వేకోడూరులో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి తాతంశెట్టి నాగేంద్ర జంకుగొంకు లేకుండా నడిరోడ్డుపైనే ఓ మహిళను విచక్షణారహితంగా కొట్టినా కనీస మాత్రం కూడా స్పందించకుండా కాలయాపన చేస్తున్నారు.తిరుపతి జిల్లా: మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ కల్యాణ .. తమ జనసేన పార్టీ నాయకులే ఓ మహిళపై నడి రోడ్డుపై దాడిచేస్తే పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నస్తున్నారు. సినిమాలో చెప్పినట్టు సభల్లో డైలాగులు చెప్పడం తప్ప తన సొంత పార్టీకి చెందిన నేతలు ఏం చేసినా ఆయనకు పట్టదా అని మండిపడుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గ కేంద్రంలో పట్టపగలు నడిరోడ్డున జనసేన పార్టీ నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర దళిత మహిళపై పోలీసుల సమక్షంలో.. పోలీసు లాఠీతో దాడిచేశారు. దుర్భాషలాడి వీధి రౌడీలా ప్రవర్తించారు. ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తమ పార్టీ నాయకులే మహిళల పట్ల బరితెగించి ప్రవర్తిస్తుంటే నోరు మెదపడం లేదని స్థానిక మహిళలు ప్రశి్నస్తున్నారు. మొన్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సచివాలయ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడి మోసగించాడని జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తే కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తప్పు చేశాడని అన్ని ఆధారాలున్నా డిప్యూటీ సీఎం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజల ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారని.. అయితే పార్టీ అధికారిక కార్యక్రమాల్లో అతను పార్టీ కండువా వేసుకుని వేదికపై ఆశీనుడవుతున్నా పవన్ కల్యాణ్కు తెలియదా అని నిలదీస్తున్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని, పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా.. పోలీసులు చూస్తూ ఏమీ చేయక సలాములు కొడుతున్నారని మండిపడుతున్నారు. రైల్వేకోడూరు నడి»ొడ్డున దళిత మహిళపై పోలీసుల సమక్షంలో తాతంశెట్టి నాగేంద్ర దాడిచేస్తే అతనిని అడ్డుకుని చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమంటున్నారు. బాధితురాలు రోడ్డుపై నిరసనకు దిగితే స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సలహాలు ఇచ్చారని దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసులు రాజకీయ నాయకులకు రక్షకులుగా ఉన్నారు తప్ప ప్రజలకు రక్షకులు కాదా అని ప్రశ్నిస్తున్నారు.సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి రైల్వేకోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారానికి పాల్పడడంతోపాటు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక ప్రభుత్వ ఉద్యోగిని జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారని.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. నియోజకవర్గ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దళిత మహిళపై పోలీసుల లాఠీ తీసుకుని కొట్టడం అమానుషం. నిస్సహాయురాలిగా ఉన్న మహిళను కొట్టడం ఏమిటి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్న సందేహం తలెత్తుతోంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్కు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం ఉన్నా దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి. – ఇసుకపాటి లక్ష్మీనారాయణమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, రైల్వే కోడూరు ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు రైల్వేకోడూరు పట్టణం నడి»ొడ్డున ఓ దళిత మహిళపై జనసేన పార్టీ నాయకులు కర్రలతో దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో తీవ్రంగా విఫలం అయింది. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. ఈ విషయంపై సీపీఐ తరఫున పోరాటాలు చేస్తాం. కనీసం పోలీసులు కూడా పట్టించుకోకపోవడం దారుణం. – చింతలపూడి నాగమ్మ, సీపీఐ మండల కార్యదర్శి, ఓబులవారిపల్లె -
కొంప ముంచిన బాదం పాలు
శ్రీకాకుళం రూరల్: సింగుపురం పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాలకు చెందిన వారు జాతరలో బాదం పాలు తాగి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. గురువారం హటకేశ్వరస్వామి, కొండమ్మ తల్లి యాత్ర ముగింపు జరిగింది. ఈ సందర్భంగా సింగుపురం సచివాలయం కేంద్రం వద్ద రాజస్థాన్కు చెందిన ఓ ట్రావెల్ బడ్డీ ద్వారా అమ్మిన బాదంపాలు, ఐస్క్రీమ్లను చాలా మంది ఆస్వాదించారు. రూ.40 విలువ గల బాదంపాలు సాయంత్రానికి రూ.10కే ఇవ్వడంతో మరింత మంది ఆ పాల కోసం క్యూ కట్టారు. శుక్రవారం ఉదయం నుంచి వీరిలో చాలా మందికి వాంతు లు, విరేచనాలు, జ్వరం రావడంతో వారంతా దగ్గరిలో గల ప్రైవేట్ క్లినిక్లకు పరుగులు పెట్టారు. బాదం పాలు తాగడం వల్లే వాంతులయ్యాయని వారంతా వైద్యుల వద్ద చెప్పడం గమనార్హం. సింగుపురం గ్రామంలోని పలు ప్రైవేటు క్లినిక్లలో సుమా రు 60 నుంచి 70 వరకూ మందులు తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సింగుపురం ప్రాధమిక వైద్యాధికారి వద్ద వెంకట్ వద్ద ప్రస్తావించగా బాదంపాలు తాగడంతో సింగుపురం చుట్టుపక్కల గ్రామాల్లో పలువురు అస్వస్థతకు గురైనట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ప్రాథమిక వైద్య కేంద్రంలో అన్ని రకాల మందులు ఉన్నాయని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. -
ఫ్రైడే
మనసు లేని ప్రభుత్వం జిల్లాలో ఎండ మండిపోతోంది. మధ్యాహ్నానికి సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. దీంతో వాహన చోదకులు, బయట పనిమీద వెళ్లిన వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం సూరీడి ధాటికి జనం చెమట్లు కక్కారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం శ్రీకాకుళం పాత బస్టాండ్: ఫ్యూనరల్ చార్జెస్.. ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారికి ప్రభుత్వం న్యాయంగా అందజేయాల్సిన సాయం. చంద్రబాబు ప్రభుత్వం ఈ సాయం కూడా చేయలేకపోతోంది. దాదాపు ఏడాదిగా ఈ మట్టి ఖర్చులను ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో ఆయా బాధిత కుటుంబాలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఏడాదిగా జిల్లాలో మరణించిన ఒక్క ఉద్యోగికి కూడా ఈ ఫ్యూనరల్ చార్జీలు అందజేయలేదు. వారు ట్రెజరీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడమే మిగిలింది తప్ప నగదు మాత్రం వారి ఖాతాలకు జమ కాలేదు. ఒకప్పుడు ఉద్యోగి, ప్రభుత్వ పింఛన్దారుడు మరణిస్తే 24 గంటల్లో వారి కుటుంబానికి ఫ్యూనరల్ చార్జీలు రూ.25వేలు అందజేసేవారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. నెలలు, సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ మట్టి ఖర్చులు అందక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారుగా 615 మంది వరకు ఇలాంటి మట్టి ఖర్చులు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ నగదు విడుదల జరగలేదని ట్రెజరీ అధికారులు వెల్లడిస్తున్నారు. దాదాపు రూ.1.53 కోట్ల బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆర్జిత సెలవుల డబ్బులకు అతీగతీ లేదు ఉద్యోగులకు గౌరవప్రదంగా అందజేయాల్సిన ఆర్జిత సెలవుల డబ్బులు(ఎర్న్డ్ లీవ్ అమౌంట్) చెల్లింపులు కూడా జరగడం లేదు. ఇలాంటి ఆర్జిత సెలవు నగదు కోసం దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాలో 500 కు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరు ఏడాదిగా ఆ మొత్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్జిత సెలవుల నగదు చేతికి అందితే పిల్లలకు ఉపాధి కార్యక్రమాలు, వివాహాలు ఇతర అవసరాలకు పనికి వస్తాయని ఉద్యోగులు ఆశ పడుతుంటారు. కానీ వారికి నిరాశే మిగిలింది. దాదాపు రూ.60 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. గ్రాడ్యు టీ నగదు కూడా చెల్లింపులు జరగడం లేదు. ఈ బకాయిలు కూడా రూ.కోట్లలో ఉన్నాయి. జిల్లాలో వందలాది కుటుంబాలు ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. కొందరు న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించారు. -
ఉద్యోగి.. ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నారు. ఖాళీ లేకుండా ఏదో ఒక బాధ్యత అప్పగించడం, దానికి డెడ్లైన్ పెట్టడం, జిల్లా అధికారులు సతాయింపునకు గురి చేయడంతో నలిగిపోతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతి సారి ఇదే జరుగుతుందన్న ఆలోచనలో పడ్డారు. కాన్ఫరెన్స్లు, సమీక్షలతోనే గడిచిపోతుందని, పనిచేయడానికి సమయం ఎక్కడ ఉంటుందని ఆవేదన చెందుతున్నా రు. ఓపిక నశించడంతో ఎదురు ప్రశ్నించక తప్పడం లేదు. ఇటీవల కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఓ మహిళా ఉద్యోగి నేరుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రశ్నలకు స్పందించలేక మ్యూట్లో పెట్టేసి వీడియో కాన్ఫరెన్స్ కొనసాగించారు. ఒక మహిళా ఉద్యోగి నేరుగా కలెక్టర్తోనే తీవ్ర స్వరంతో మాట్లాడారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సచివాలయం ఉద్యోగులు రోడ్డెక్కారు. ముఖ్యంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లు ధాన్యం సేకరణ సమయంలో కలెక్టరేట్ను ముట్టడించడమే కాకుండా ఏకంగా కలెక్టర్నే నిలబెట్టేశారు. సర్వే ఉద్యోగుల పరిస్థితి కూడా దాదా పు అంతే. మొన్నటి వరకు సచివాలయం ఉద్యోగులే ఇబ్బందులు పడుతున్నారనుకుంటే ఇప్పుడా జాబితాలోకి రెవెన్యూ ఉద్యోగులు కూడా చేరారు. ఈ రెండు శాఖల్లోనే కాదు దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వీడియో కాన్ఫరెన్స్లు, టెలీ కాన్ఫరెన్స్లతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ మధ్య ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రభుత్వం పెట్టిన టార్గెట్లతో ఒత్తిడికి గురై గుండెపో టుతో చనిపోయారు. సచివాలయం ఉద్యో గుల పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు అనారోగ్యం బారిన పడుతున్నారు. చెప్పాలంటే ఏ ఒక్క ఉద్యోగినీ ప్రభుత్వం వదలడం లేదు. గత ప్రభుత్వం ప్రశాంత వాతావరణం మధ్య చేపట్టిన భూముల రీసర్వేను ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇప్పుడదే రీసర్వేను అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం మొదలు పెట్టింది. తాము చేస్తే పని.. వేరే వాళ్లు చేస్తే నేరమని తన సహజ ధోరణి ప్రదర్శించింది. నాలుక మడత పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన రీసర్వేను తాజాగా చేపడుతోంది. కాకపోతే, అందుకు అవసరమైన వనరులను సమకూర్చలేదు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బేస్ స్టేషన్స్ ద్వారా నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అవసరమైన రోవర్లు, కొలతలకు సంబంధించిన పరికరాలు, కంప్యూటర్లు ఇవ్వలేదు. వాటి సమస్య తీవ్రంగా ఉంది. సర్వే చేసేందుకు సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. దాన్ని అధిగమించకుండా సర్వే పేరు తో ఉన్న ఉద్యోగులను వేధింపులకు గురి చేసి, ఒత్తిడికి లోనయ్యేలా చేస్తోంది. 10 రోజుల కిందట గ్రామ సర్వేయర్లు సామూ హికంగా సర్వే నిలిపివేశారు. కలెక్టర్ను కలిసి తమ గోడు విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఇద్దరిని సస్పెండ్ చేశారు. కాకపోతే, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు, వ్యతిరేకత వస్తాయని గమనించి ప్రభుత్వం వెంటనే సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. హంగామా.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. కేవలం హంగామా తప్ప ఏమీ జరగడం లేదు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులకు ఫలి తం ఉండటం లేదు. ప్రధానంగా 22ఎ సమస్యలు, ఎల్పీఎం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకు సంబంధించి మ్యుటేషనుల, కరెక్షన్స్, అడంగల్లో పేరు మార్పు లు వంటి సమస్యలు పేరుకుపోతున్నాయి. కోర్టు ఉన్న సమస్యలకు సరైన సమాధానాలు పంపకపోవడంంతో కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ రెవెన్యూ ఉద్యోగులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీనితో పాటు అడ్డగోలు పనులు చేయాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వారు చెప్పిన పనులే చేయాలని హుకుం జారీ చేస్తుండటంతో కింది స్థాయి నుంచి తహసీల్దార్ల వరకు ఇబ్బందులు పడుతున్నారు. చెప్పింది చేయకపోతే నేతలు సతాయిస్తున్నారు. ఇటీవల గార తహసీల్దార్ అంతకుముందు పాతపట్నం తహసీల్దార్పై నేతలు చిందులు వేయడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. రెవెన్యూ ఉద్యోగులు వారి విధుల నిర్వహణ కంటే ఎమ్మెల్యేలు, మంత్రుల వారి ప్రొటోకాల్ పనుల తో బిజీ కావల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తహసీల్దార్లు, ఇతర అధికారులు హాజరు కాకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. దీంతో తహసీల్దార్లు, ఇతర అధికారులు, సచివాలయం ఉద్యోగులు వారి చుట్టూ తిరగడంతోనే సమయమైపోతోంది. పరిస్థితులు ఇలా ఉన్నా ఉన్నతాధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు. చెప్పింది ఎందుకు చేయలేదని నిరంతరం నిలదీస్తున్నారు. దీంతో ఉద్యోగులు తీవ్రంగా మనస్తాపం చెందుతున్నారు. ఊపిరి సలపనివ్వడం లేదని ఆవేదన వరుస బాధ్యతల అప్పగింతపై ఆందోళన నేతల ఒత్తిళ్లు, అనధికార హుకుం సకాలంలో పనులు పూర్తి చేయలేని పరిస్థితి జాప్యంపై ఉన్నతాధికారుల చీవాట్లు భరించలేక ఆవేదన ఒత్తిడి తట్టుకోలేక ఆకస్మిక మరణాలు -
అసలే గ్యాస్ కొరత.. ఆపై గొడవ
ఇచ్ఛాపురం: గ్యాస్ కొరతతో వినియోగదారులు సహనం కోల్పోతున్నారు. శుక్రవారం స్థానిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం వద్దకు అమీన్సాహెబ్ పేటకు చెందిన వినియోగదారుడు ఎం.విఘ్నేష్ వచ్చి గ్యాస్ సిలిండర్ కావాలని అడిగాడు. గ్యాస్ బుకింగ్ జరిగితే గానీ గ్యాస్ ఇవ్వలేమని ఏజెన్సీ ప్రతినిధి చెప్పాడు. గ్యాస్ బుకింగ్ వినియోగదారుడు తీసుకొచ్చిన గ్యాస్ పుస్తకాన్ని కార్యాలయంలో పరిశీలించగా ఆ పుస్తకం అప్పటికే ల్యాప్స్ అయినట్లు ఏజెన్సీ ప్రతినిధి వినియోగదారునికి చెప్పాడు. దీంతో వినియోగదారుడు సహనం కోల్పోయి ఏజెన్సీ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో గ్యాస్ ఏజెన్సీని మూసివేయడంతో మిగతా వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదే విషయమై స్థానిక పోలీసుల వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలు శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం సబ్డివిజన్ పరిధిలోని శాంతిభద్రతలు దృష్టిలో ఉంచుకుని పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లోకి తెస్తున్నామని డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. శుక్రవారం డీఎస్పీ తన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ ముందస్తు లిఖిత పూర్వక అనుమతి లేకుండా ధర్నాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు, ప్రజా శాంతికి భంగం కలిగించేలా గుంపులుగా ఉండే కార్యక్రమాలు నిషేధించామని తెలిపారు. ఏ విధమైన సామాజిక, ధార్మిక, రాజకీయ లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి ఉండాలన్నారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతల దృష్ట్యా ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు. నాటకాలు.. సామాజిక చైతన్య వీచికలు కవిటి: సమాజంలో వేళ్లూనుకున్న పెడ ధోరణులు, రుగ్మతల్ని కూకటి వేళ్లతో తొలగించే సామాజిక చైతన్య వీచికలు నాటకాలని వక్తలు అన్నారు. శుక్రవారం మండలంలోని బొరివంకలో కళింగసీమ కళాపీఠం సంస్థ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పరిషత్ ఆహ్వానిత పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విశాఖపట్నం తెలుగు కళాసమితి వారి చిటికెనవేలు, పెందుర్తి నటరాజ డ్రమటిక్ అసోసియేషన్ వారి నీళ్లు నీళ్లు అనే రెండు నాటిక ప్రదర్శనలు జరిగాయి. వ్యవసాయ కుటుంబంలో తండ్రి అడుగుజాడల్లో నడిచిన ఓ కుటుంబ సంప్రదాయాన్ని తర్వాత తరానికి చెందిన యువకుడు విడిచిపెట్టి ఆధునికత ఉచ్చులో పడి ఉన్న భూమిని పోగొట్టుకున్న వైనమే ఇతివృత్తంగా సాగిన చిటికెన వేలు నాటిక ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. రెండో ప్రదర్శనగా వేసిన నీళ్లు నీళ్లు అనే నాటిక ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు వర్షాలు సకాలంలో కురవక సాగులో నష్టపోతున్న వైనం, ఈ నేపథ్యంలో ఉన్న భూమిని అమ్ముకొని బోరుబావి వేసి సాగుచేసి లక్షలు ఆర్జిస్తాననే ఓ రైతు ఆలోచన ఏ విధంగా తారుమారైందనే కథాంశం నేపథ్యంగా సాగింది. -
సచివాలయాల్లో..
గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల పరిస్థితైతే మరింత దారుణంగా ఉంది. ప్రతీ పని వారికే అప్పగిస్తున్నారు. సహాయకులగా ఎవరూ లేకపోవడంతో చివరికి సబార్డినేట్ ఉద్యోగాలు కూడా వారే చేయాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. అటెండర్లు గ్రామస్థాయిలో చేయాల్సిన పనులన్నీ సచివాలయం ఉద్యోగులకు అప్పగించడంతో మదనపడుతున్నారు. గ్రామ స్థాయిలో రకరకాల డేటా, ఇతర సమాచార సేకరణ గత ప్రభుత్వంలో వలంటీర్లు చేయగా, ఇప్పుడా పని అంతా సచివాలయం ఉద్యోగులపైనే పడింది. సర్వేలు, మ్యాపింగ్, తదితర విధులను సచివాలయం ఉద్యోగులే నేరుగా ఇంటింటా తిరిగి చేస్తున్నారు. ఇక, ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉంది. రకరకాల బాధ్యతలు అప్పగించడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో, ఒత్తిడికి తట్టుకోలేక అనారోగ్యం పాలవడంతో, కొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. -
పనిచేయని కోచ్ పొజిషన్, డిస్ప్లే బోర్డులు
కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలో మూడు ప్లాట్ఫామ్స్ మీద ఇటీవల స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ అట్టహాసంగా ప్రారంభించిన డిజిటల్ కోచ్ పొజిషన్ డిస్ప్లే బోర్డులు పనిచేయడం లేదు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం ఉదయం భువనేశ్వర్ నుంచి బెంగళూ రు వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు డిస్ ప్లే బోర్డులు పనిచేయలేదు. బోర్డులు ఉంటే ప్రయాణికులు వారికి కేటాయించిన కోచ్లు ఎక్కేందుకు సౌలభ్యంగా ఉంటుంది. రైల్వే సాంకేతిక అధికారులు స్పందించి కోచ్ పొజిషన్ బోర్డులు బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
13న రాష్ట్ర మహాసభలు
శ్రీకాకుళం అర్బన్: నూతన ప్రజాస్వామిక సాహితీ సాంస్కృతికోద్యమం లక్ష్యంగా గత ఐదు దశాబ్దాలుగా జన సాహితీ అలుపెరుగని కృషి చేస్తోందని జన సాహితీ రాష్ట్ర అధ్యక్షులు దివికుమార్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని ఎన్జీఓ కార్యాలయంలో జనసాహితీ ప్రజా సాహిత్య సాంస్కృతిక పోరా ట సమితి ఆహ్వాన సంఘ ఏర్పాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దివి కుమార్ మాట్లాడుతూ తొలి తెలుగు జాతి వైతాళికుడు ప్రసి ద్ధి పొందిన గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తిది మన ప్రాంతమేనన్నారు. గరిమెళ్ల సత్యనారాయణ ఆనాడు వద్దు వద్దు అని చెప్పిన తెల్ల దొరతనం నేటి నల్ల దొరల సౌజన్యంతో పరోక్షంగా కొనసాగుతూనే ఉందని అన్నారు. మనం చమురు ఎవరి దగ్గర కొనుక్కోవాలో, కొనుక్కోకూడదో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించడం ఏమిట ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి మాట్లాడుతూ సాహితీ సాంస్కృతిక ఉద్యమ రంగంలో రాష్ట్ర మహాసభలు జరుపుకునే సందర్భంలో మే 24, 25 తేదీల్లో శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున 13వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపా రు. గోర్కీ రచించిన అమ్మ నవలలను నాటకంగా మే 24న అంబేడ్కర్ ఆడిటోరియంలో ప్రదర్శించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. -
‘దళిత విద్యార్థిని మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: పాతపట్నంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో 7వ తరగతి విద్యార్థిని పూజ మృతి చెందిన ఘటనపై దళిత సంఘాల జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనపై నిష్పక్షపాతంగా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి కనీసం రూ.15 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు. స్కూల్ వెనుక భాగంలో ఉన్న ప్రహరీ చాలా రోజు ల కిందటే కూలిపోయినా పునర్నిర్మాణం జరగలేదని, ఆ ప్రాంతానికి సమీపంలో రైల్వే ట్రాక్ ఉండటం వల్ల విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న గోడ నిర్మాణం కూడా నాణ్యత లేనిదిగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కోఆర్డినేటర్గా ఉన్న అధికారి పై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
సనాతన ధర్మ పరిరక్షణకు పాదయాత్ర
కంచిలి: భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నట్లు గుజరాత్కి చెందిన మాతా సుమణి తెలిపారు. ఈ పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం కంచిలి హైవే వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కంచిలి రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) వారు మాతాసుమణి పాదయాత్ర జట్టుకు ఆహ్వానం పలికారు. శుక్రవారం రాత్రి కంచిలి ఊన శ్రీకాంత్ ఇంటి వద్ద బస చేసి శనివారం ఉదయం 4 గంటల నుంచే పాదయాత్రను ప్రారంభించనున్నట్లు ఆర్ఎస్ఎస్ వారు తెలిపారు. దేశంలోని ప్రజలంతా ఐక్యంగా ఉంటూ హిందువులంతా ఒకే కుటుంబంలా సనాతన ధర్మం ఆచరించేలా మార్గదర్శం కల్పించేందుకు పాదయాత్రను చేపట్టినట్లు పేర్కొన్నారు. గుజరాత్ సోమనాథ్ ఆలయం వద్ద 2024 ఆగస్టు 23వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటి వరకు 11 రాష్ట్రాల గుండా కొనసాగించానని అనంతరం ఒడిశాలోని పవిత్ర క్షేత్రం పూరిని దర్శించుకొని పాదయాత్రను ముగించనున్నట్లు తెలిపారు. -
బాలిక హత్యపై విచారణ
హిరమండలం: పాతపట్నం నియోజకవర్గానికి చెందిన బాలిక హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇంటర్లో చేర్పిస్తానంటూ చెప్పి లైంగిక దాడి చేసి చంపేసిన విషయం విధితమే. ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ స్పందించారు. తక్షణం ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో సంబంధిత ప్రతినిధి బృందం డాక్టర్ నాగమానస, గంగు సూర్యనారాయణ, చల్లా మధుసూదనరావు బాధిత కు టుంబాన్ని పరామర్శించారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారితో పాటు జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణ, ఐసీడీఎస్ పీఓ మల్లేశ్వరరావు, సీడీపీఓ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్చరల్: భారత సాంస్కృతిక, సహకార, స్నేహ సంఘం (ఇస్కఫ్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఈనెల 4న శనివారం ఉదయం కొత్త రోడ్ జంక్షన్లో గల హనుమాన్ ఫంక్షన్ హాల్లో జరుగుతుందని ఆహ్వాన సంఘం అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్, జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామమూర్తి, అధ్యక్షులు బీవీఎస్ఎన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. యుద్ధాలు– మానవాళి–పర్యావరణం అనే అంశంపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధులతో చర్చ జరుగుతుందని తెలిపారు. పాతపట్నం: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఎస్ఐ కె.మధుసూధనరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సరిహద్దు ప్రాంతంలో ప్రయాణించే వాహన చోదకులు తప్పనిసరిగా వాహన పేపర్లు, లైసెన్స్ తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. ఈ చలానా పెండింగ్లు ఉంటే వెంటనే కట్టాలన్నారు. ఒడిశా నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. తనిఖీల్లో ఏఎస్ఐ కె.శ్రీరాములు, కానిస్టేబుల్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా మరో మెగా చెస్ టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. శ్రీకాకుళం జిల్లా చెస్ అసోసియేషన్, సీఎస్ఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 14 నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. అదే విధంగా ఆ టోర్నీ ముగిసిన తర్వాత జూలై 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మరో ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ శ్రీకాకుళం గ్రాండ్ కన్వెన్షన్లో జరగనుంది. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు రూ.10 లక్షలు నగదు బహుమతితో పాటు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ సర్టిఫికెట్లను సైతం అందజేయనున్నట్టు టోర్నమెంట్ డైరెక్టర్, రాష్ట్ర చెస్ ఇన్ స్కూల్స్ కన్వీనర్, సనపల భీమారావు తెలిపారు. ఈ టోర్నమెంట్లలో దేశంలో అనేక రా ష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో పాటు ఇతర దేశాల క్రీడాకారులు కూడా పాల్గొననున్నారని, ఈ టోర్నమెంట్ నిర్వహణ శ్రీకాకుళం జిల్లాకు ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ మెగా చెస్ టోర్నీలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, పారిశ్రామికవేత్త లు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహకరించాలని చెస్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని ఆర్గనైజషన్ కమిటీ ప్రెసిడెంట్ తంగుడు సుధీర్ తెలిపారు. నందిగాం: పోలవరానికి చెందిన కె.లచ్చయ్యపై శుక్రవారం తేనెటీగల దాడి చేసి గా యపరిచాయి. వివరాలు పరిశీలిస్తే లచ్చయ్య (60) తనకు గల మేకలకు గ్రామానికి సమీపంలో ఉన్న మెట్ట దగ్గరకు మేపుటకు తీసుకువెళ్లాడు. అయితే అక్కడ ఒక్కసారిగా తేనె టీగలు దాడి చేయడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. భోజనం వేళయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. అపస్మారక స్థితిలో లచ్చయ్య కనిపించాడు. దీంతో 108 వాహనానికి సమాచారం అందించారు. అందులో ప్రథమ చికిత్స చేసి టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
భూ సారానికి ముప్పు!
● వరి కొయ్య దహనంతో తగ్గుతున్న భూసారం హిరమండలం: కొన్నేళ్ల కిందట వరి కోతల అనంతరం గడ్డిని కుప్పలుగా వేసి పశువుల మేతకు ఉపయోగించేవారు. ప్రస్తుతం కూలీల కొరత ఏర్పడుతుండడంతో రైతులు కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కోతలు పూర్తయ్యాక మిగిలిన కొయ్యలతో పాటు మిగిలిన గడ్డిని రైతులు పొలంలోనే నిప్పంటిస్తున్నారు. అవగాహన లోపంతో అన్నదాతలు ఇలా చేస్తే ఇలాంటి తప్పిదాలతో భూసారానికి ముప్పు పొంచి ఉందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంతో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాదని చెబుతున్నారు. పంటలకు కీడు చేసే పురుగులను తినే వానపాములు, కీటకాలు నశించే ప్రమాదం ఉంది. అలాగే భూమికి సేంద్రియ పీచు పదార్థాలుగా ఉప యోగపడే అవశేషాలు ఖనిజ, లవణాలు నశిస్తా యి. అలాగే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఇలా చేస్తే మేలు.. పంటల సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. పంటకోత పూర్తయిన తర్వాత మిగిలిన పంటల అవశేషాలను భూమిలో మురగబెట్టి దుక్కిలో కలిపిదున్నాలి. ఇలా చేయడంతో వరి గడ్డి భూమిలో మురిగి సేంద్రీయ కర్బనం పెరుగుతుంది. ఇది తరువాత సాగుచేసే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, సూపర్ పాస్పేట్, పొటాష్లను కలిపి పంట సాగు చేసుకొనే ముందు చల్లితే పొలంలో మిగిలిన కొయ్యలు, వరి గడ్డి రెండు వారాల్లోనే మురుగుతాయి. పంట భూముల్లో గడ్డి, వరి కొయ్యలను దహనం చేస్తే భూ సారాన్ని కోల్పోతుంది. అవసరం లేని గడ్డిని భూమిలోనే కలిపి దున్నితే సేంద్రీయ ఎరువుగా మారి భూమికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. గడ్డి, కొయ్యల దహనంతో వాతావరణం కాలుష్యం అవుతుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – బి.సంధ్య, మండల వ్యవసాయాధికారి, హిరమండలం -
● కారు ఢీకొని మృతి చెందిన ఆశ కార్యకర్త ● తొమ్మిది రోజుల్లో కుమారుని వివాహం
కంచిలి: పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంటిని విషాదం కమ్మేసింది. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన వరుడి తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయా రు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్లగా.. కంచిలి మండలం ఆర వ సరియాపల్లి గ్రామానికి చెందిన బుడ్డెపు కమలా కుమారి(50) ఆశ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమె భర్త సాధారణ రైతు కూలి. వీరికి కుమారుడు దినేష్రెడ్డితో పాటు కుమార్తె ఉంది. కుమార్తెకు వివాహమై అత్తవారింట్లో ఉంటుంది. ఇటీవల కుమారునికి వివాహం నిశ్చయమైంది. 12వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో జాడుపూడి గ్రామంలోని వారి బంధువులందరికీ శుభ లేఖలు ఇవ్వడానికి ఆమె వెళ్లారు. శుభలేఖలు పంచడం పూర్తిచేసుకొని సాయంత్రానికి ఇంటికి రావడానికి జాడుపూడి వద్ద బస్సు ఎక్కి అంపురం కూడలి వద్ద దిగా రు. తన స్వగ్రామం వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటుతుండగా పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆశ కార్యకర్త ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున ట్లు ఎస్ఐ పారినాయుడు తెలిపారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన యువ క్రికెటర్ నంబళ్ల సుశాంత్ ఈ ఏడాది కూడా తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గత ఏడాది సెంచరీల వర్షం కురిపించగా.. ఈ సీజన్లోనూ అదే జోరును కనబరుస్తున్నాడు. తాజాగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో జరుగుతున్న ఏసీఏ అంతర్జిల్లాల అండర్–23 పురుషుల వన్డే క్రికెట్ టోర్నీలో సిక్కోలు యువ ఓపెనర్ 125 బంతుల్లో 10 బౌండరీలు, 8 భారీ సిక్సర్లతో 126 పరుగులు సాధించి జిల్లా జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. సుశాంత్కు ఎం.రోహిత్కుమార్ 63 పరుగల అర్ధసెంచరీతో సహకరించడంతో శ్రీకాకుళం జిల్లా జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. జిల్లా ఆటగాళ్లు రాణింపుపై కోచ్లు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
‘గిరిజనులకు అన్యాయం చేయొద్దు’
మెళియాపుట్టి: ఆదివాసీలకు అన్యాయం చేయవద్దని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆల్ ఇండియా కన్వీనర్,అరకు మాజీ ఎంపీ మిడియం బాబూరావు అన్నారు. ఆయన గురువారం చాపరలో గిరిజనుల హక్కులు, వారి సమస్యలు, జీఓ నంబర్ 3 గురించి, మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలనే డిమాండ్పై జరుగుతున్న పోరాటాల గురించి నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. గిరిజన పంటలకు మద్దతు ధర లేదు, గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు లేవు, బెంతొరియాలు గిరిజనులమని చెప్పుకుని ఆదివాసీలను అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుల సమస్యలు చెప్పుకోవాలంటే జిల్లాలో ఐటీడీఏ కూడా లేదని తెలిపారు. తక్షణమే మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, రాష్ట్ర రైతుసంఘం కార్యదర్శి మోహన రావు, జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న, జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
● తిరుమల పవిత్రత కాపాడాలి
● బీఆర్ నాయుడిని తొలగించాలి ● 4న జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: తిరుమల పవిత్రతను కాపాడే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయు డును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చైర్మన్గా బీఆర్ నాయు డు టీటీడీని అపవిత్రం చేస్తున్నారని మండి పడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 4న వైఎస్సార్ సీపీ శ్రేణులు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయనున్నారని పేర్కొన్నారు. బీఆర్ నాయుడిని ప్రభుత్వం వెనకేసుకురావడాన్ని నిరసిస్తూ పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
‘వెలుగు వీఓఏలకు వేతనాలు పెంచాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: వెలుగు వీఓఏలకు వేతనాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, వీఓఏ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.ధనలక్ష్మి, జి.అసిరినాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు డి.జోగారావు కోరారు. వెలుగు వీఓఏలకు కనీస వేతనాలు ఇవ్వాలని, హెచ్ఎర్ పాలసీ అమలు చేయాలని, సీ్త్ర నిధి ఇన్సెటివ్ బకాయిలు చెల్లించాలని, నాణ్యమైన 5జి మొబైల్ ఫోన్లు ఇవ్వా లని కోరారు. మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుతూ డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు డచ్ భవనం వద్ద వీఓఏ ఉద్యోగుల జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడేళ్లుగా వేతనాలు పెంచలేదని, డీఏ అమలు చేయలేదన్నారు. ఆన్లైన్ సరుకులు పంపిస్తామని డబ్బులు కట్టించుకొని సరుకులు ఇవ్వలేదని, డబ్బులు తిరిగి చెల్లించలేదని అన్నారు. వీఓఏల సమస్యలపై ఏప్రిల్ 13 వ తేదీన మండల కేంద్రాల్లో ధర్నాలు, 27, 28 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని యూనియన్ కమిటీ నిర్ణయించిందని తెలియజేసారు. -
‘భూ సేకరణ వద్దు’
మందస: మందస మండలం రాంపురం పంచాయతీ పరిధిలో గల తెలగ గంగువాడ గ్రా మానికి చెందిన భూ బాధిత రైతులు, గ్రామ ప్రజలు కార్గో ఎయిర్పోర్టుకు తమ వ్యతిరేకత తెలిపారు. మందస ఎమ్మార్వో కార్యాలయంలో, పలాస ఆర్డీఓ కార్యాలయంలో, సచివాలయాలకు వెళ్లి తమ అభ్యంతరాలు తెలియజేస్తూ మెమొరాండంలు సమర్పించారు. భూ సేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో చిత్త కూర్మారావు, చిత్త గున్నయ్య, యలమల కృష్ణారావు, చిత్త చంద్రశేఖర్, దాసరి మోహన్రావు, చిత్త సంతోష్, జోగి మోహన్రావు, ఆనంద్, హేమరాజు, నారాయణ, రాకెట్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. బిల్లు ఆమోదంపై హర్షం శ్రీకాకుళం పాతబస్టాండ్: అమరావతి చట్టబద్ధతపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కేక్ కటింగ్ నిర్వహించారు. కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులోని ఉభయ సభల్లో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026’ ఏకగ్రీవంగా ఆమోదం పొందటంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపు శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.2642 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. 2026–27 బడ్జెట్ ఔట్ రీచ్పై ఎమ్మెల్యేలు గౌతు శిరీష, గొండు శంకర్లతో కలెక్టరేట్ స మావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంక్షేమ పథకాలపై వివరిస్తూ జిల్లాకు రూ.2642 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు వివరించా రు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన బడ్జెట్ అన్ని వర్గాలకు చేరేలా ఉండాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ బడ్జెట్లో ఏడు పథకాలకు కేటాయింపులు చేశామన్నారు. జిల్లా అభివృద్ధి బడ్జెట్ను పలు శాఖలకు కేటాయించామన్నారు. ‘మహిళా టీచర్ల సమస్యలపై వినతి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: మహిళా టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం యూటీఎఫ్ ఆద్వర్యంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కి వినతి పత్రాలు అందజేశారు. యూటీఎఫ్ మహిళా విభాగం జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.తవిటమ్మ, జిల్లా కార్యదర్శులు జి.శారద, సూర స్వర్ణకుమారి, జిల్లా నాయకు లు సీహెచ్ సుబ్బలక్ష్మి, వెంకటేశ్వరి, జహీన రాణి తదితరులు వినతి అందజేసిన వారిలో ఉన్నారు. కనీస సదుపాయాలు కల్పించాలని, భద్రతా సమస్యలు పరిష్కరించాలని కోరారు. మహిళా టీచర్లకు ప్రత్యేక స్టాఫ్ రూమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పలు దుకాణాల్లో చోరీ యత్నం టెక్కలి రూరల్: టెక్కలిలో బుధవారం రాత్రి పలు దుకాణాల్లో చోరీ జరిగినట్లు షాపు యజమానులు గురువారం గుర్తించారు. ఆ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తెంబూర్ రోడ్డులో గల ఓ మెడికల్ షాపులో చోరీ జరిగినట్లు షాపు యజమాని గుర్తించాడు. షాపు షట్టర్ తాళాలు బద్దలు గొట్టి షాపులోకి చొరబడి షాపులోని కొంత నగదుని దొంగిలించినట్లు పోలీసులకు తెలిపారు. అలానే ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద ఒక ఒక చెప్పుల షాపు లో సైతం దొంగతనానికి ప్రయత్నించారని, అయితే ఆ షాపులో ఎలాంటి వస్తువులు గానీ డబ్బులు గానీ చోరీకి గురికాలేదని తెలిపారు. అయితే ఇదే విషయమై పోలీసులకు బాధితులు సమాచారం ఇచ్చారు. -
యమకంకరులు
పలాసలో వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి అక్రమ కంకర తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కాశీబుగ్గ రైల్వే ఫ్లై ఓవరు పేరు చెప్పి కొంతమంది గ్రావెల్ మాఫియా సభ్యులు ఈ కంకరను తవ్వి రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి అక్కడి యథేచ్ఛగా అమ్మకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాలపై పత్రికల్లో కథనాలు వస్తున్నా అధికారుల చర్యలు మాత్రం తూతూమంత్రంగా ఉంటున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా తర్లాకోట, కొత్తూరు, కోసంగిపురం, రాజగోపాలపురం, కంబిరిగాం గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి కంకరను కాశీబుగ్గలోని సెగిడి వీధిలో డంపు చేసి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు అమ్మకాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో కొండలు, చిన్న చిన్న మెట్టలు కనుమరుగవుతున్నాయి. పర్యావరణానికి పెనుముప్పుగా తయారవుతున్నాయి. కొండలను పిండి చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న వన్యప్రాణులు సైతం జనారణ్యాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల ఓ జింక శాసనాం జాతీయ రహదారి వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే. ఉద్దానం ప్రాంతంలో ఎలుగు బంట్లు సైతం గ్రామాల సమీపంలోకి వచ్చేస్తున్నాయి. వాటికి ఆవాసాలుగా ఉన్న బెండి, పెద్ద కొండ, రట్టికొండలు సైతం గ్రావెల్ తవ్వకాలతో బోసిపోతున్నాయి. ఇప్పటి వరకు పలాసలో గ్రావెల్ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని జిల్లా మైనింగ్ అధికారులు చెబుతున్నా ఈ తవ్వకాలు మాత్రం ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. -
నో స్టాక్
పొందూరులో నో స్టాక్ బోర్డుఎన్నాళ్లో మాకీ కష్టాలు... గ్యాస్ బుక్ చేసి 20 రోజులు పైనే అయింది. ఇప్పటి వరకు రాలేదు. అందుకే వచ్చాను. ఏమిటో మాకీ కష్టాలు. ఇక్కడికి వస్తే సమాధానం చెప్పే వారే కరువయ్యారు. ఎన్నాళ్లో ఈ పరిస్థితి. ఆటోలు మీద ఖాళీ బండలు పట్టుకుని వస్తున్నాం. – మెట్ట శాంతమ్మ, నో స్టాక్ అంటున్నారు.. ఎప్పుడొచ్చినా కారణాలు చెబుతూనే ఉన్నారు. పనులు మానుకుని వస్తున్నాం. రోజంతా గ్యాస్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాస్తున్నా ఫలితం ఉండడం లేదు. నో స్టాక్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఇంటిదగ్గర నుంచి గ్యాస్ బండ పట్టుకుని ఆటోలో 120 రూపాయలు ఖర్చు పెట్టి వస్తున్నాం. వస్తున్న గ్యాస్ ఎటో వెళుతుందో తెలియడం లేదు. మా పరిస్థితిని అర్థం చేసుకుని మా గ్యాస్ కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. – పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన ఓ వినియోగదారుడి ఆవేదన ఇది. పల్లెల్లో గ్యాస్ కష్టాల తీవ్రతకు నిదర్శనమీ చిత్రం. బుక్ చేసినా ఇవ్వడం లేదని పొందూరు ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఖాళీ సిలిండర్లు తెచ్చి వరుసగా పెట్టారు. ఓటీపీ వచ్చిన 15 రోజుల వరకు సిలిండర్ రాకపోవడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. వినియోగదారుల ఒత్తిడి, సిలిండర్ల సరఫరా లేకపోవడమో గానీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కూడా నోస్టాక్ బోర్డు పెట్టేశారు. దీంతో వినియోగదారులు వాదనకు దిగుతున్నారు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో గ్యాస్ కొరత తీవ్రమవుతోంది. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు గృహ వినియోగదారులకు కూడా గ్యాస్ దొరకడం లేదు. ఫోన్ ద్వారా బుక్ చేద్దామంటే కావడం లేదు. ఆన్లైన్లో ప్రయత్నించినా జరగడం లేదు. జరిగినా 15 నుంచి 20 రోజులైతే గానీ బండ ఇంటికి రావడం లేదు. గ్యాస్ ఏజెన్సీల నుంచి నో రెస్పాన్స్ వస్తోంది. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సిలిండర్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కష్టాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఆయా కంపెనీలు నిలిపివేయడంతో హోటల్స్ నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్యాస్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొందరు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ నిర్వహణ సాగిస్తున్నారు. మరికొందరు పాత పద్ధతిలో ఊక పొయ్యిలను వినియోగిస్తున్నారు. కట్టెలు, ఊక సక్రమంగా దొరకని చోట ఏకంగా హోటల్స్ మూసేస్తున్నారు. పలుకుబడి ఉన్న హోటల్స్ యజమానులకు మాత్రం గుట్టుగా సిలిండర్లు వచ్చేస్తున్నాయి. అవి కమర్షియల్ సిలిండర్లా? డొమెస్టిక్ సిలిండర్లా? తెలీదు గానీ వారికి మాత్రం గ్యాస్ సమస్య అంతగా ఉండటం లేదు. తోపుడు బళ్లు, చిన్న హోటల్స్ మాత్రం మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5వేలకు పైగా హోటళ్లు ఉన్నాయి. వీటిలో సింగిల్ డిజిట్లో తప్ప మిగతా హోటల్స్ అన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. జేసీ మీటింగ్కు డీలర్లు డుమ్మా.. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో జాయింట్ కలెక్టర్ సమావేశమయ్యారు. ఐదు ఏజెన్సీలకు గాను రెండు ఏజెన్సీలకు సంబంధించిన డీలర్లు మాత్రమే హాజరయ్యారు. మిగతా మూడు గ్యాస్ ఏజెన్సీల డీలర్లు రాకుండా వారికి సంబంధించిన సిబ్బందిని పంపించారు. చెప్పాలంటే జేసీ ఆదేశాలను లెక్క చేయనట్టు స్పష్టమైంది. జేసీ సమీక్ష చేసినప్పటికీ వారి దగ్గర సరైన సమాధానాలు రాలేదని తెలిసింది. ఒక భారత గ్యాస్ ఏజెన్సీ, మరో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులపై జేసీ సీరియస్ అయినట్టు తెలిసింది. పంపిణీ సక్రమంగా చేయాలని? లేదంటే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది. ఇకపై గ్యాస్ ఏజెన్సీలు విక్రయించే ప్రతి కమర్షియల్ సిలిండర్కు సంబంధించి రశీదు చూపించాలని, ఎవరికి విక్రయిస్తున్నారో పౌరసరఫరాల శాఖకు తెలియ జేయాలని, ఒక పర్యవేక్షక అధికారిని కూడా నియమిస్తున్నట్టు గురువారం జరిగిన సమీక్షలో స్పష్టం చేసినట్టు సమాచారం. మొత్తానికి అటు డొమెస్టిక్, ఇటు కమర్షియల్ సిలిండర్ల పంపిణీ ఒక మిస్టరీగా మారిపోయింది. కొరతను అవకాశంగా తీసుకుని కొన్ని ఏజెన్సీలు బ్లాక్లో సిలిండర్లను విక్రయిస్తున్నాయి. వాస్తవ ధరకు రెట్టింపు వేసి విక్రయిస్తున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లు అయితే రూ. 3,500 వరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. డొమెస్టిక్ సిలిండర్లను కూడా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఎక్కడికక్కడ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. బుక్ చేసిన 15రోజుల వరకు గ్యాస్ రాకపోవడంతో.. రద్దీని ఆసరాగా తీసుకుని తమ వద్ద సిలిండర్లను ఎక్కువ ధరకు విక్రయించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. తీవ్రమవుతున్న గ్యాస్ కొరత ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు గగ్గోలు పెడుతున్న వినియోగదారులు కమర్షియల్ గ్యాస్ కొరతతో మూతపడుతున్న హోటల్స్ బుక్ చేసి 15 రోజులు దాటినా రాని డొమెస్టిక్ గ్యాస్ -
ఎత్తిపోతల పనుల పరిశీలన
హిరమండలం: వంశధార కుడి కాలువపై జరుగుతున్న ఎత్తిపోతల పథకం పనులను ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీరాజ్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి గురువారం పరిశీలించారు. పనులు వేగవంతం కావాలని, సంబంధిత అధికారులకు సూచించారు. త్వరలో విద్యుత్ పనులు త్వరితగతిన చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. మెగా ఉద్దానం తాగునీటి పైపు వద్ద అడ్డంగా ఉన్న పనులు జాగ్రత్తగా ఇరు శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి చేసుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ పనులు వంశధార కట్టడం విభాగం ఈఈ బి.రవీంద్ర బాబు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ఆశలతకు పలు సూచనలు ఇచ్చారు. వంశధార రిజర్వాయర్ గట్టు పనులకు, మున్ముందు జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డంకులపై ఆరా తీశారు. వేసవి దుక్కులే కీలకం ● సస్యరక్షణతోనే అధిక దిగుబడులు ● వ్యవసాయాధికారి సంధ్య హిరమండలం: వ్యవసాయంలో రైతులు సస్యరక్షణ చర్యలు పాటించినప్పుడే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. విచక్షణారహితంగా పురుగుమందులు వాడితే ఖర్చులు పెరగడంతో పాటు దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. వేసవి దుక్కులతో రైతులకు అనేక ప్రయోజనాలు ఉంటాయని మండల వ్యవసాయాధికారి బి.సంధ్య చెబుతున్నారు. పంట అవశేషాలు తొలగింపు గత పంట తాలుకా అవశేషాలను పూర్తిగా తొలగిస్తే పురుగుల కొశస్థ దశలను నాశనం చేసిన తర్వాత సాగుచేసే పంటలకు పురుగులు ఆశించకుండా చేయవచ్చు. ముఖ్యంగా వరి పంటలో ప్రధానమైన కాండం తొలిచే పురుగు నియంత్రించవచ్చు. ముందే దున్నాలి వర్షాకాలం రాక ముందు భూమి మూడు దుక్కులు దున్నాలి. ఇలా చేస్తే తొలకరి వర్షాలకు నేల మెత్తబడి భూమిలోకి నీళ్లు ఇంకుతాయి. దుక్కులు లోతుగా అడ్డంగా, వాలుగా దున్నుకుంటే వర్షపు నీరు భూమిలోకి ఇంకి తేమను నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుంది. దుక్కి దున్ని భూమిని ఎండబెడితే కలుపు మొక్కలు నివారించవచ్చు. దుక్కులు దున్నే ముందు భూమిలో పశువుల పేడ, కంపోస్టు ఎరువులు చెరువు మట్టిని వేయాలి. వేసవిలో దుక్కి దున్నితే భూమి గుల్లగా మారుతుంది. దీంతో భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా తేమలో జీవించే సూక్ష్మజీవులు వానపాములు సంతతి వృద్ధి చెందుతుంది. -
పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ‘ఎ’ గ్రేడ్
పలాస: పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ‘ఎ’ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఈ కళాశాలలో గురువారం అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. అకడమిక్ అడ్వైజర్గా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ విభాగం లెక్చరర్ ఎం.శాంతి, రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ లెక్చరర్ డాక్టరు బి.వేణుగోపాలరావులు సందర్శించి బోధన విధానాలు, విద్యా ప్రమాణాలు, అకడమిక్ పనితీరును నిశితంగా పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.వెంకటలక్ష్మి, ఐక్యూఏసీ కోఆర్డినేటరు పి.వెంకటరమణ వీరికి సహకరించారు. ఈ సందర్భంగా అకడమిక్ అడ్వైజర్ శాంతి మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు, నిర్వహణ విధానాలు ఉన్నతంగా ఉన్నాయని ప్రశంసించారు. అధ్యాపకులను, అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ కళాశాలకు ‘ఎ’ గుర్తింపును ప్రధానం చేశారు. -
పోర్టు పరిశీలన అనుమతుల పత్రం బహిర్గతం చేయండి
● పోర్టు ఏజెన్సీ నిర్వాహకులతో అచ్చెన్న రూ.40 కోట్ల ఇంటిని కట్టించుకుంటున్నారు ● వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: మూలపేట పోర్టు పరిశీలనకు అనుమతులు ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారని, దమ్ముంటే అనుమతి పత్రాలను బహిర్గతం చేయాలని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ సవాల్ చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై గురువారం టెక్కలిలో మీడియా సమావేశం నిర్వహించి మండిపడ్డారు. పోర్టుకు పోదాం పదండి కార్యక్రమానికి సంబంధించి మార్చి 17న ఎస్పీకి దరఖాస్తు చేసుకోగా 29వ తేదీ సాయంత్రం ఆంక్షలతో సభకు మాత్రమే అనుమతులు ఇచ్చారని తిలక్ గుర్తు చేశారు. పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంలో భాగంగా అన్ని రకా ల మీడియాల ద్వారా వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియడంతో కేంద్ర, రాష్ట్ర మంత్రుల బండారం బయటపడిందన్నారు. పోర్టు పనుల విషయంలో 2024 ఎన్నికల నాటికి ఆయా ఏజెన్సీకి ఇచ్చిన బిల్లులను బహిర్గతం చేస్తే ఎంత మేరకు పనులు జరిగాయో పురోగతి అందరికీ తెలుస్తుందని తిలక్ అన్నారు. చంద్రబాబు హయాంలో భావనపాడు పోర్టు పనులు ప్రారంభించామని చెబుతున్నారని, అయితే దానికి సంబంధించిన అనుమతులు బహిర్గతం చేయాలని తిలక్ డిమాండ్ చేశారు. పోర్టు పనులు పూర్తి చేయకుండా ఆయా ఏజెన్సీని బెదిరించి విశాఖపట్టణంలో అచ్చెన్నాయుడు రూ.40 కోట్ల ఇల్లు కట్టించుకుంటున్నారని తిలక్ ఆరోపించారు. పోర్టు పూర్తి చేయడానికి గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రకాల భూసేకరణలు, అనుమతులతో పనులు ప్రారంభించారని ఇప్పుడు అర్ధంతరంగా 36 వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏముందని తిలక్ ప్రశ్నించారు. కేవలం భూములను దోపిడీ చేయడానికే ల్యాండ్ పూలింగ్కు తెర తీస్తున్నారని స్పష్టం చేశారు. ఇకనైనా అచ్చెన్నాయుడు నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, నాయకులు సత్తారు సత్యం, కె.జీవన్, ఎస్.వినోద్, బి.రాజేష్ తదితరులు ఉన్నారు. -
ఇసుకాసురులు..
● అక్రమ తవ్వకాలతో బరితెగింపు ● చోద్యం చూస్తున్న అధికారులు కొత్తూరు/పలాస: ఇసుకాసురులు బరి తెగించారు. ఉచిత ఇసుక విధానం పేరిట దోపిడీకి తెరతీశారు. టీడీపీ నేతల అండదండలతో అందినంత దోచుకుంటున్నారు. ఇసుక ర్యాంపును పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో వీరికి అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. కొత్తూరు మండలంలోని బంకి (పొనుటూరు), వసప గ్రామాల వద్ద వంశధార నదిలో సిల్ట్ తొలగింపు కోసం ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చింది. నిబంధనల ప్రకారం మనుషులతో తవ్వకాలు జరిపి ట్రాక్టర్లకు లోడ్ చేయాలి. అక్కడి నుంచి ర్యాంపు మీపంలో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్లో అన్లోడ్ చేయాలి. అనంతరం గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక విక్రయించాలి. తవ్వ కాలు సైతం మూడు అడుగుల లోతు దాట కూడదు. అయితే ఈ నిబంధనలేవీ ఇక్కడ అమలుకావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. నదిలో ఇసుక తవ్వకాలు ఆరు అడుగుల కంటే ఎక్కవ తవ్వకాలు చేయడంతో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి చెరువులను తలపిస్తున్నాయి. ఏకంగా నదిలోనే రోడ్లు ఏర్పాటు చేసుకొని అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా పొనుటూరుకు ఆనుకొని ఉన్న ఒడిశా రాష్ట్రానికి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. అస్తవ్యస్త తవ్వకాలతో భూగర్భజలాలు ఇంకిపోయే ప్రమాదం ఉందని పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై తహశీల్దార్ వై.జోగారావు వద్ద ప్రస్తావించగా ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అయితే నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసినట్లు ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
మందస: ఆంధ్రా ఒడిశా సరిహద్దు సమీపంలోని కుల్లాడియా గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మందస మండలం చీపి గ్రామానికి చెందిన సవర ప్రదీప్ మృతి చెందారు. ఈ గ్రామానికి చెందిన సవర సూర్యనారాయణ, సవర ప్రదీప్లు ఒడిశాలోని జరడ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండంగా కుల్లాడియా గ్రామం వద్ద ఓ అడవి పంది హటాత్తుగా రావడంతో దాన్ని ఢీకొట్టారు. దీంతో బండిపై ఉన్న వీరిద్దరూ అదుపు తప్పి కింద పడిపోయారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా ఆ వాహనంపై క్షతగాత్రులను హరిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం తీసుకెళ్లారు. గురువారం ఉదయం 9 గంటలకు సవర ప్రదీప్ మరణించారు. స్థానిక ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘వ్యక్తిగత దూషణలు సరికాదు’
ఆమదాలవలస: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తల పొగరుతో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, వాటిని తగ్గించుకుంటే మంచిదని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలో పార్టీ కార్యాలయంలో గురువా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కూన అనుచిత వ్యాఖ్యలు చేశారని, అదే రోజు ఆమదాలవలసలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సర్పంచ్ల అభినందన సభకు హాజరైన జనాలను చూసి మతిభ్రమించి మాట్లాడారని అన్నారు. ప్రతి సమావేశంలోనూ చింతాడ రవికి ఉన్న స్థాయి ఏంటి అనే మాట్లాడుతున్నారని, కానీ ఎమ్మెల్యే తన స్థాయి మరిచి మాట్లాడడం సరికాదన్నారు. సొంత గ్రామం పొందూరు మండలం పెనుపర్తి గ్రామంలోనే కూన రవికుమార్ ఎంపీటీసీగా, సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. నీరు–చెట్టు పనుల డబ్బులు సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎన్నో భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే తన బలమని స్పష్టం చేశారు. మేనమామ లేకుంటే ఆయన పరిస్థితి ఏమిటో కూన రవి ఆలోచించుకోవాలన్నారు. ఓటుకు రూ. 5000 ఇచ్చి ప్రజలను కొంటానని చెబుతున్న రవి అక్రమార్జన ఎంత ఉందో తెలుస్తోందన్నారు. వైఎస్ జగన్ ఐదేళ్లలో జిల్లాకు అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారని, టీడీపీ 17 ఏళ్లలో ఏం చేసిందో చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రవికుమార్, సరుబుజ్జలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, పార్టీ ముఖ్య నాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, దుంపల శ్యామలరావు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ఇవ్వండి మహాప్రభో..
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్యాస్ కొరత సమయంలో హోటల్స్ను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, తమకు కమర్షియల్ గ్యాస్ ఇవ్వాలని జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కమర్షియల్ సిలిండర్లు బ్లాక్లో ఒడిశా వెళ్లిపోతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. కొందరు డీలర్లు అక్రమంగా కమర్షియల్ సిలిండర్లు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇచ్ఛాపురంలో ఇండియన్ గ్యాస్ డీలర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్ నిర్వహణ భారంగా మారిందన్నారు. -
సిలింఢర్
శ్రీకాకుళం అమాతం పెరిగిన కమర్షియల్ గ్యాస్ బండ ధర ● అయినా బ్లాక్లోనే దందా.. ● గృహావసరాల గ్యాస్ కోసం జనం తిప్పలు ● బుక్ చేసినా 20 రోజుల పైమాటే.. ● గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న జనం లావేరు మండలం ఇజ్జాడపాలెం కిడ్నీ వ్యాధి మరణాలతో వణుకుతోంది. పదిమందికి పైగా మరణాలు సంభవించాయి. –8లోగురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026భానుడి భగభగలు ఓ వైపు.. ఆరుబయట కట్టెల పొయ్యి అగ్గిసెగలు మరోవైపు హోటల్ కార్మికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గ్యాస్ కొరత కారణంగా నగరంలో చాలా హోటళ్లు మూతపడిన సంగతి విదితమే. కొన్ని హోటళ్లు మాత్రమే కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నాయి. వేసవి కావడం.. మధ్యాహ్నం వేళ వంటలు చేసే పరిస్థితి ఉండడంతో కార్మికులు మండుటెండలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కొరత కారణంగా తమ కష్టం పెరిగిందని.. దినసరి కూలీలో ఏమాత్రం మార్పు లేదని వాపోతున్నారు. ఇలా ఎక్కువ రోజులు అగ్గి వద్ద పని చేయలేమని చెబుతున్నారు. వారి కష్టాలకు నిదర్శనమైన ఈ చిత్రాలు శ్రీకాకుళం నగరంలోని ఓ మెస్ వద్ద కనిపించాయి. – శ్రీకాకుళం (పీఎన్కాలనీ) శ్రీకాకుళం: జిల్లాలో నానాటికీ గ్యాస్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. అధికారు లు ఇబ్బంది లేదని చెబుతున్నా వ్యాపారులు, గృహ వినియోగదారులు తీవ్రంగానే ఇక్కట్లకు గురవుతున్నారు. బుకింగ్ చేసిన 20రోజుల వరకు గ్యాస్ రాకపోవడంతో చేసే ది లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలండర్ అమాంతంగా పెరిగినా అందుబాటులో లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. గృహ, వాణిజ్య అవసరాలకు కట్టెల పొయ్యిలే ప్రత్యామ్నాయంగా మారాయి. జిల్లాలో కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.214లు పెంచారు. గతంలో 19 కేజీల సిలిండర్ ధర రూ.1,970లు ఉండగా.. ప్రస్తుతం రూ.2,184.50లకు చేరుకుంది. పెరిగిన ధరను చమురు సంస్థలు మంగళవారం రాత్రి ప్రకటించి, బుధవారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. అయినప్పటికీ మార్కెట్లో రూ.3500 దాటి బ్లాక్లో విక్రయిస్తున్నారు. రాజాం, సంతకవిటి, టెక్కలి, శ్రీకాకుళంలో ఉన్న పలు ప్రైవేట్ కంపెనీల ఏజెన్సీలు పెద్ద ఎత్తున ఈ దందాకు పాల్పడతున్నాయి. గృహ వినియోగదారుల గ్యాస్ నిర్దేశిత వ్యవధిలో సరఫరా కావడం లేదు. బుక్ చేసిన తరువాత 15 నుంచి 20 రోజుల సమయం పడుతోంది. దీంతో పలు గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు గ్యాస్ కోసం బారులు తీరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. దీంతో గృహ వినియోగ దారులు ప్రత్యామ్నాయ పరిస్థితుల వైపు మొగ్గు చూపుతున్నారు. కట్టెలపొయ్యులు, బొగ్గుల పొయ్యలతో పాటు ఇండక్షన్ పొయ్యలను ఆశ్రయిస్తున్నారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ
కవిటి: మండలంలోని మాణిక్యపురం పీహెచ్సీలో ప్రభుత్వం అందించిన నిధుల వినియోగం తదితర అంశాలపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు బుధవారం విచారణ చేపట్టారు. జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డా.ఆర్.రాందాస్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డా.కె.మేరీ క్యాథరిన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్.రాంబాబుల నేతృత్వంలో విచారణ జరిపారు. దీనిలో భాగంగా కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. నిధుల వినియోగానికి సంబంధించి బాధ్యులుగా ఉన్న సంబంధిత అధికారుల నుంచి వివరాలను రాబట్టి ఉన్నతాధికారులకు నివేదించనున్నామని తెలిపారు. విచారణలో ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కార్మికవర్గాన్ని యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఐక్య పోరాటాలు తీవ్రతరం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి క్రాంతి, ఎస్.కృష్ణవేణిలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా బ్లాక్ డే నిర్వహించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుతూ ఆల్ ట్రేడ్ యూనియన్, ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక వర్గం ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కడం దారుణమన్నారు. కార్మిక మంత్రిత్వశాఖ ఇక నుంచి యాజమాన్యాల మంత్రిత్వ శాఖగా మారబోతున్నదని, యాజమాన్యాల శ్రమ దోపిడీకి రహదారులను మోడీ ప్రభుత్వమే సిద్ధం చేస్తోందని విమర్శించారు. ఇటువంటి చర్యలు వీడకుంటే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు ఎన్వీ రమణ, ఎం.ఆదినారాయణమూర్తి, ఎం.గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సైనికుల సంక్షేమమే ‘వీర్ పరివార్’ లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని మాజీ సైనికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ‘నల్సా వీర్ పరివార్ సహాయత యోజన–2025’ పథకం పనిచేస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక సైనిక్ బోర్డును సందర్శించి అక్కడి పరిస్థితులపై చర్చించారు. దేశ సేవలో తరించిన మాజీ సైనికులు తమ న్యాయపరమైన చిక్కులను వదిలించుకునేందుకు ఈ పథకం ఒక చక్కని వేదిక అని ఆయన పేర్కొన్నారు. సైనిక సంక్షేమ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ క్లినిక్ ద్వారా ప్యానెల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు నిరంతరం అందుబాటులో ఉంటారని వివరించారు. మాజీ సైనికులు తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎ.శైలజ, ప్యానెల్ అడ్వకేట్ వి.జ్యోతిర్మయి, ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
హైమావతిపై విచారణకు కమిటీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: టెక్కలి ఏవో హైమావతిపై విచారణకు ముగ్గురు అధికారుల కమిటీని కలెక్టర్ నియమించారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఒత్తిడి, మానసిక అందోళనలను ఉన్నతాధికారులకు నివేదించడంపై ఈ కమిటీని నియమించారు. కమిటీలో ఎస్డీసీ పద్మావతి, శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మలు ఉన్నారు. కాగా విచారణ కమిటీ నియామకంపై రెవెన్యూ వర్గాల్లో చర్చ మొదలైయింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాట్లాడడం తప్పుబట్టి విచారణ చేపట్టడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి నాటిక పోటీలు శ్రీకాకుళం కల్చరల్: ఈనెల 10వ తేదీ నుంచి బాపూజీ కళామందిర్లో శ్రీముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనునట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు కేతిరెడ్డి రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు బ్రోచర్ను బుధవారం విడుదల చేశారు. రోజుకు రెండు నాటికల ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 12న ముగింపు సభ, బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె.శ్యామ్ కుమార్, పొగిరి సత్యం, రమేష్, ప్రసాద్దు, కీర్తి, కుమారి, సంతోషి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఉచిత విద్యుత్ సద్వినియోగం చేసుకోండి టెక్కలి: చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు సూచించారు. బుధవారం కోటబొమ్మాళిలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్పై మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కె.హరివరప్రసాద్, నాయకులు బి.గోవిందరాజులు, బి.రమేష్, వి.విజయలక్ష్మి, ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కోరలు చాచిన కిడ్నీవ్యాధి..!
ఇజ్జాడపాలెంలో మరణ మృదంగం● ఇప్పటికే 10 మందికి పైగా మృతి ● అంతుపట్టని కారణాలు ● నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్న గ్రామస్తులు రణస్థలం: ఆహ్లాదకరమైన వాతావరణం.. చుట్టూ పచ్చని పైరు.. కొబ్బరి చెట్ల మధ్యలో అందమైన గ్రామం లావేరు మండలంలోని ఇజ్జాడపాలెం. అయితే అటువంటి గ్రామానికి పదేళ్లుగా కిడ్నీ మహమ్మారి పట్టిపీడిస్తోంది. సుమారు 1,200 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో గత పదేళ్లలో 10 మందికి పైగా కిడ్నీ వ్యాధితో చనిపోవడంతో గ్రామస్తుల్లో భయందోళనలు నెలకొన్నాయి. ఈ మహమ్మారి ఇజ్జాడపాలెంతో పాటు చుట్టుపక్కల గోవిందపురం, లుకలాపుపేట తదితర గ్రామాలకు ఇప్పుడిప్పుడే వ్యాపించడంతో అక్కడ సైతం కేసులు బయటపడుతున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితికి తాగునీరే కారణమా.. లేక మరే ఇతర అవశేషాలు ఉన్నాయో గ్రామస్తులకు అంతుబట్టడం లేదు. ఇటీవల గ్రామంలోని వాటర్ శాంపిల్స్ను వైద్యాధికారులు తీసుకొని వెళ్లారు. అయితే ఆ నమూనాలో ఎటువంటి ఫలితం కనిపించలేదు. అందువలన అధికారులు చొరవ తీసుకొని కారణాలను విశ్లేషించాలని స్థానికులు కోరుతున్నారు. మోగుతున్న ప్రమాద ఘంటికలు ఇజ్జాడపాలెం గ్రామంలో గత పదేళ్లలో పదిమంది కిడ్నీ మహమ్మారికి బలైపోయారు. వారిలో ఇజ్జాడ అప్పలనాయుడు (మాజీ సర్పంచ్), ఇజ్జాడ సూర్యనారాయణ, పిసిని అప్పలనాయుడు, పతివాడ రమణ, కందివలస అప్పారావు, కందివలస కాంతమ్మ, గొర్లె లక్ష్మి, గొర్లె త్రినాథ్, వండాన ఆదినారాయణ తదితరులు ఉన్నారు. కాగా మరో ఐదుగురు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా మంగళవారం గొర్లె త్రినాథ్ (48) మృతి చెందాడు. దీంతో ఈ గ్రామంలో నివాసం ఉండాలంటేనే ప్రజలు బయపడిపోతున్నారు. తీరని వెతలు ఇజ్జాడపాలెంలో కుటుంబాలన్నీ వ్యవసాయంపై అధారపడినవే. కిడ్నీవ్యాధి బారిన పడుతున్న ఆయా కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. కిడ్నీ వ్యాధి సోకినప్పటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి ఆస్పత్రులకు తిరుగుతూ లక్షల్లో ఖర్చులు పెడుతున్నా ఫలితం కనిపించడం లేదు. డయాలసిస్ పేరుతో నిత్యం వేలల్లో ఖర్చులు పెడుతూ నెలల తరబడి ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుండడంతో కొందరు ఇంటి వద్దనే మంచం పట్టి కాలం వెళ్లదీస్తున్నారు. కాగా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కిడ్నీవ్యాధికి గురయ్యారు. ప్రస్తుతం కుటుంబంలో గొర్లె బంగరాప్పడు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడు. కాగా తన కుమారుడు గొర్లె త్రినాథ్, భార్య లక్ష్మి ఇదే మహమ్మారికి బలైపోవడంతో కుటుంబం కకావికలం అయ్యింది. సమగ్ర పరిశీలన చేపట్టాలి మా గ్రామంలో గత పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో పదిమందికి పైగా చనిపోయారు. ఇంకా మరో ఐదుగురు కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్నారు. తాగునీటి వలనే కిడ్నీ వ్యాధి వస్తుందా.. లేక మరే ఇతర కారణం ఉందా అనే అంశంపై ఆధికారులు సమగ్ర పరిశీలన చేపట్టాలి. – ఇజ్జాడ అప్పలనాయుడు, గ్రామ నాయకుడు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలి మా ఇజ్జాడపాలెం గ్రామంలో తాగునీటి సమస్య వల నే కిడ్నీ వ్యాధి వస్తోందని అనుకుంటున్నాం. ఇప్ప టికైనా అధికారులు పూర్తిస్థాయిలో స్పందించి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలి. అలాగైనా కిడ్నీ వ్యాది వ్యాప్తి చెందకుండా ఆగే అవకాశం ఉంటుంది. – ఇజ్జాడ రాము, గోవిందపురం, ఎంపీటీసీ -
తిమడాంలో టీడీపీ నాయకుడి బరితెగింపు
జలుమూరు: మండలంలోని తిమడాం పంచాయతీలో ఒక టీడీపీ నాయకుడు ప్రభుత్వ చెరువు(దుబ్బోడో) సర్వే నంబర్ 85లో ఇంటి నిర్మాణంతోపాటు గట్టును మట్టితో కప్పి ఆక్రమణలకు పాల్పడుతున్నాడు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా ఈ చెరువు గట్టు మీద చాలా వరకూ ఆక్రమణలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఒక ఇంటి స్థలం సుమారు రూ.5 లక్షలు వరకూ పలకుతుండడంతో ఆక్రమణలుదారులు యథేచ్ఛగా గట్టును మట్టితో కప్పుతున్నారు. దీనిపై తహసీల్దార్ జెన్ని రామారావు వద్ద ప్రస్తావించగా.. సిబ్బందిని పంపి ఆక్రమణలు తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఆర్టీసీ కండక్టర్పై దాడి
టెక్కలి రూరల్: ఆర్టీసీ బస్సులో రద్దీ కారణంగా పాసింజర్లు ఎక్కువ మంది ఉండడంతో లోపలికి వెళ్లమన్నందుకు బస్సు కండక్టర్ నాసపు పాపారావుపై ఒక పాసింజర్ దాడి చేసిన ఘటన కోటబొమ్మాళి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బస్సులోని ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు.. పలాస డిపోకు చెందిన విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సులో కోటబొమ్మాళి జంక్షన్ వద్ద గంగు అర్జున్ తన కుమార్తెతో కలిసి ఎక్కాడు. అయితే జర్జంగి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎక్కుతున్న సమయంలో పాసింజర్లు ఎక్కువగా ఉండడంతో కండక్టర్ వారిని లోపలికి వెళ్లమని చెప్పాడు. అయితే ఆ సమయంలో తన కుమార్తైపె చేయి వేశాడని అర్జున్ కండక్టర్తో గొడవ పెట్టుకుని దాడి చేశాడు. తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అలాగే డ్రైవర్ అడగగా.. అతనిపై సైతం దురుసుగా మాట్లాడడంతో చివరకు బస్సును కోటబొమ్మాళి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లాడు. అనంతరం కోటబొమ్మాళి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఏడిపింఛన్
● రాజకీయ కక్షతో పింఛన్లు నిలిపివేత పొందూరు: మండలంలోని గోకర్నపల్లి గ్రామంలో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఏడుగురి పింఛన్లను అధికారులు నిలుపుదల చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎన్ని రామారావు, సంపతిరావు వేదాంతినాయుడు, గురుగుబెల్లి బంతమ్మ, సీపాన సూర్యనారాయణ, యారబాటి దాలయ్య, సంపతిరావు నేపాలరాజు, పాతిన జగన్నాథంలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ తీసుకునేందుకు అనర్హులని ఈ ఏడాది జనవరి 3వ తేదీన ఎంపీడీవో వాసుదేవరావు నోటీసులు జారీ చేశారు. నోటీసు ప్రాప్తికి వారంతా జనవరి 9వ తేదీన ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఉంది. ఈ మేరకు వీరు గోకర్నపల్లి సచివాలయంలో విచారణకు హాజరైయ్యారు. పంచాయతీ కార్యదర్శి వీరి సంతకాలు తీసుకున్నారు. ఎంపీడీవో మాత్రం హాజరుకాలేదు. అయితే వీరు అక్రమంగా పింఛన్లు పొందుతున్నారని జనవరి నెలాఖరున ఎంపీడీవో విచారణ జరిపి, ఫిబ్రవరి నుంచి నిలుపుదల చేశారు. వారిలో గురుగుబెల్లి బంతమ్మకు రూ.75లు ఉన్నప్పటి నుంచి పింఛన్ వస్తుండడం గమనార్హం. మిగిలినవారంతా వృద్ధాప్య పింఛన్ రూ.1000లు ఉన్నప్పటి నుంచి పింఛన్ తీసుకుంటున్నారు. వీరంతా అర్హులైనప్పటికీ రాజకీయ కారణాలతో పింఛన్లు తొలగించారని వాపోతున్నారు. దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్ ఇచ్చిన నివేదిక మేరకు తాత్కాలికంగా పింఛన్లు నిలిపివేయడం జరిగిందన్నారు. -
తుపాకులతో మోహరించడం ఎందుకు..?
● మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై పేరాడ తిలక్ మండిపాటు టెక్కలి: మూలపేట పోర్టు పరిశీలనకు అనుమతులిచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారని.. అయితే అనుమతులు ఇచ్చినపుడు భారీగా పోలీసులు తుపాకులతో మోహరించాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమం విజయవంతం కావడంతో, మంత్రి అచ్చెన్నాయుడు మతిభ్రమించి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోర్టు పరిశీలనకు సిద్ధమైన తరుణంలో లేనిపోని ఆంక్షలు విధించారని దుమ్మెత్తిపోశారు. కనీసం బహిరంగ సభకు సైతం చివరి నిమిషం వరకు అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేశారని గుర్తు చేశారు. మూలపేటకు వెళ్లే రహదారిలో ముళ్ల కంచెలు, తుపాకులతో భారీగా పోలీసులను ఎందుకు పెట్టారన్నారు. పోర్టు పరిశీలన చేపట్టినట్లయితే కూటమి నాయకుల నిర్లక్ష్యం బయటపడుతుందనే భయంతోనే పరిశీలనకు అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. దశాబ్ధాల కాలంగా కింజరాపు కుటుంబం ఈ జిల్లాకు ఏం మంచి చేసిందని ప్రశ్నించారు. ఇకనైనా అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
పోలీసుల అడ్డంకులు సరికాదు
గార: రెడ్బుక్ రాజ్యాంగంలో పౌరుల వ్యక్తిగత కార్యక్రమాలకు పోలీసులు అడ్డంకులు పెట్టడం సరికాదని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకరబాబు తల్లి రెండో వర్ధంతి తన ఇంటి వద్ద జరుపుకుంటుండగా.. అక్కడికి వెళ్లినవారిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి లోకేష్లు ఇలాంటి కార్యక్రమాలును ప్రోత్సహించడం తగదన్నారు. -
‘మన మూలపేట పోర్టుకు పోదాం.. విజయవంతం’
నరసన్నపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమం విజయవంతమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, టెక్కలి సమన్వయకర్త పేడాడ తిలక్ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. ఏ ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించామో అది నెరవేరిందని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా పోర్టు యాత్రను విజయవంతం చేసిన కార్యకర్తలు, నా యకులను అభినందించారు. అలాగే సభకు హాజరైన ఉత్తరాంధ్రకు చెందిన ప్రధాన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి తరలివచ్చిన నేతలు, కార్యకర్తల ఐక్యత చూసి కూటమి ప్రభుత్వం వణికిపోయిందని పేర్కొన్నారు. పేరాడ తిలక్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు, యువత అండగా నిలిచారని తెలి పారు. సమావేశంలో పార్టీ నాయకులు ముద్దాడ బైరాగినాయుడు, రాజాపు అప్పన్న, సురంగి నర్శింగరావు చిన్ని జోగారావు, బొబ్బాది ఈశ్వరరావు, బుద్దల రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. -
నాటిక పోటీల బ్రోచర్ ఆవిష్కరణ
కవిటి: మండలంలోని బొరివంకలో కళింగ సీమ కళాపీఠం సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల ద్వితీయ ఆహ్వానిత నాటిక కళా పరిషత్ పోటీలు నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు బల్లెడ లక్ష్మణ మూర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం నాటిక పోటీల బ్రోచర్ను ఆవిష్కరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పేరొందిన నాటక సమాజాలకు చెందిన ప్రదర్శన బృందాలు ఈ పోటీల్లో పాల్గోనున్నాయి. మూడు రోజులు పాటు నిర్వహించనున్న పోటీల్లో ఏడు ప్రదర్శనలతో పాటు ఒక ప్రత్యేక నాటిక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని నాటక సమాజాలు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
దళం ఇక గతమే..!
పలాస: విప్లవాలు, ఉద్యమాలు, దళాలకు చిరపరిచితమైన శ్రీకాకుళంలో ఇక ఆ పదాలన్నీ గతం కానున్నాయి. ఉద్యమాల పురిటి గెడ్డ ఉద్దానం ప్రాంతానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు అజ్ఞాత జీవితం వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. ఆపరేషన్ కగార్ తర్వాత సాయుధ దళాలు, దండకారణ్య ఉద్యమానికి గుండెకాయ లాంటి నాయకులు ఒక్కొక్కరుగా లొంగిపోయారు. ఇప్పుడు వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణరావు విజయవాడలో సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిన తర్వాత ఉద్దానం ప్రాంతంలో ఎక్కడ చూసినా మావోయిస్టుల కోసం చర్చలు మొదలయ్యాయి. గత ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను, వారి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నక్సల్బరీ పోరాట స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా సాయుధ గిరిజన రైతాంగ పోరాటం 1969లో ప్రారంభమై 1970 కల్లా ఒక్క ఏడాదిలోనే చల్లారిపోయింది. ఆ నాటి పోరాటంలో పాల్గొన్న సాయుధ దళాల సభ్యులు, నాయకులు సుమారు 360 మంది పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. ఆ తర్వాత సాయుధ పోరాటం తాత్కాలికంగా విరమిస్తూ అప్పటి మిగిలిన నాయకత్వం తిరిగి చట్టపరధి ఉద్యమాలకు పున రంకితమైంది. అప్పటికి మిగిలి ఉన్న పైలా వాసుదేవరావు, పోతనపల్లి అప్పలస్వామి, గొరకల రాంబాబు, పైలా చంద్రమ్మ, పోతనపల్లి జయమ్మ, పోతనపల్లి పారమ్మలు అజ్ఞాత జీవితం మాత్రం వీడలేదు. రహస్యంగా ఉంటూనే పార్టీ కార్యక్రమాలను సాగించారు. 1977 తర్వాత తరిగి జిల్లాలో ప్రజాఉద్యమాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే 1980 ప్రాంతం నుంచి 1990 వరకు పీపుల్స్వార్ ఉద్దానం కేంద్రంగా చేసుకొని సాయుధ దళాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసింది. జిల్లాలో అనేక సాయుధ చర్యల తర్వాత పోలీసు నిర్భందం పెరిగింది. అలా పోలీసు నిర్భందం నేపథ్యంలోనే బాతుపురం, పల్లిసారథి, బొడ్డపాడు, అక్కుపల్లి, ఒంకులూరు, బహాడపల్లి, నీలావతి, మాకన్నపల్లి, మామిడిపల్లి, మర్రిపాడు గడూరు తదితర గ్రామాల నుంచి రాడికల్ యువజన సంఘం, రాడికల్ విద్యార్థి సంఘం తదితర ప్రజాసంఘాల నుంచి అత్యధిక సంఖ్యంలో ఉద్దానం ప్రాంతం గ్రామాల నుంచి యువకులు పీపుల్స్ వార్ సాయుధ దళాల బాట పట్టారు. అనంతరం జిల్లాలో పోలీసు నిర్భందం పెరగడం, ప్రజల నుంచి తగిన సహకారం లేకపోవడంతో ఒడిశా సరిహద్దు గ్రామాలకు దళాలు వెళ్లిపోయాయి. అనంతరం పీపుల్స్వార్ మావోయిస్టు పార్టీగా మారడం దండకారణ్య అటవీ ప్రాంతానికి ఈ జిల్లా ఉద్యమం విస్తరించింది. అక్కడ కూడా సాయుధ పోరాటం తీవ్రం కావడంతో ఈ జిల్లాకు చెందిన అనేక మంది పోలీసు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఒక్క కోపర్ డాంగ్ ఎన్కౌంటర్లోనే ఉద్దానం ప్రాంతానికి చెందిన 18 మంది మృతి చెందారు. ఆ విధంగా అక్కుపల్లి గ్రామంలో 7 మంది, అత్యధికంగా చనిపోగా బొడ్డపాడు, నీలావతి, బాహాడపల్లి, బాతుపురం, ఒంకులూరు, మెట్టూరు, మామిడిపల్లి తదితర గ్రామాల్లో జిల్లా మొత్తం మీద 60 మంది మావోయిస్టులు మృతి చెందారు. చివరికి బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణరావు ఒక్కరే ఈ జిల్లా నుంచి మిగిలారు. ఇతను కూడా గత ఏడాది ఒడిశా సరిహద్దు గ్రామంలో పోలీసు కాల్పుల్లో మృతి చెందాడని, తప్పించుకున్నాడని వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే వారి ఇంటికి పోలీసులు కూడా వెళ్లి అతని కోసం వాకబు చేశారు. అయితే అనూహ్య రీతిలో సోమవారం విజయవాడలో పోలీసుల ఎదురుగా ప్రత్యక్షమవడంతో ఉద్దానంలో ఇక్కడ వారి ఉద్యమాలు, త్యాగాలు గురించి చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి నాయకులంతా లొంగిపోవడంతో నాటి ఉద్యమానికి గుర్తుగా పల్లెల్లో స్థూపాలు మిగిలాయి. అజ్ఞాతం వీడిన ఏకై క మావోయిస్టు చెల్లూరు నారాయణ ఇక జనజీవన స్రవంతిలోనే మావోలు తొలి ఉద్యమంలో 360 మంది మృతి మలి ఉద్యమంలో 60 మంది మృతి శ్రీకాకుళం జిల్లాలో సాయుధ దళాలు లేనట్టే 30 ఏళ్ల అజ్ఞాత జీవితం వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణరావు సుమారు 30 ఏళ్ల అజ్ఞాత జీవితం గడిపాడు. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన నారాయణరావు తల్లిదండ్రులు చనిపోగా ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు ఉన్నారు. ఇతను ఇంటర్ వరకు చదువుకున్నాడు. చదువుకునే సమయంలోనే రాడికల్ విద్యార్థి సంఘానికి ఆకర్షితుడై అందులో చురుగ్గా పనిచేశాడు. దీంతో 1990లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ దళంలోకి వెళ్లాడు. అక్కడ నుంచి ఎప్పుడు కూడా ఇంటి ముఖం చూడలేదు. దళ సభ్యుడు నుంచి అంచెలంచెలుగా మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుని స్థాయికి ఎదిగాడు. ఎన్నో సాయుధ చర్యల్లో పాల్గొని తప్పించుకున్న ఆయన నేడు ఈ విధంగా పోలీసులకు లొంగిపోవడం విశేషం. -
ఇదో క్రెడిట్ చోరీ
గత ప్రభుత్వంలో ప్రియాగ్రహారం ఉన్నత పాఠశాలలో నాడు–నేడులో భాగంగా రూ.1.3కోట్ల నిధులతో పాఠశాల స్వరూపాన్నే మార్చేశాం. జూనియర్ కళాశాలను మరో రూ.80లక్షలతో అభివృద్ధి చేశాం. ఇప్పుడు కేవలం వాటికి ప్రహరీ నిర్మాణం చేపట్టి టీడీపీ నాయకుల పేర్లు పెట్టుకోవటం క్రెడిట్ చోరీ తప్ప మరేమీ కాదు. – సుంకరి ప్రసాదరావు, ఎంపీటీసీ సభ్యుడు, ప్రియాగ్రహారం. గరిమెళ్లను అవమానించడమే.. ప్రియాగ్రహారంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముఖద్వారంపై టీడీపీ నాయకుల పేర్లు పెట్టడం అంటే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ల త్యాగాన్ని అవమానించడమే. ఇప్పటికే అక్కడ జూనియర్ కళాశాలకు గరిమెళ్ల పేరు వుంది. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత పాఠశాలకు సైతం అధికారికంగా గరిమెళ్ల పేరును పెట్టిస్తాం. – డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య, జెడ్పీటీసీ సభ్యుడు, పోలాకి -
గంజాయితో ముగ్గురు అరెస్టు
పలాస: ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 7.610 కిలోల గంజాయిని, మూడు సెల్ఫోన్లు, రూ.800ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా చార్రాస్తాకు చెందిన గౌతం గోపాల్ ఠాకూర్, వీరేంద్రనగర్కు చెందిన రాజేష్ అశోక్ తోడిలు ఒడిశా వెళ్లి అక్కడ రాయగడ ప్రాంతంలోని బర్తింగ్డూడకు చెందిన జగన్ సాబర్ వద్ద గంజాయి కొనుగోలు చేశారు. అతని సాయంతో పర్లాకమిడి నుంచి బస్సులో పలాస రైల్వేస్టేషన్కు మంగళవారం వస్తుండగా.. సాయిబాబా మందిరం వద్ద వారిని కాశీబుగ్గ ఎస్ఐ ఆర్.నర్సింహమూర్తి తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారినుంచి గంజాయితో పాటు సెల్ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
భార్య మెడపై బ్లేడ్తో దాడి
రణస్థలం: లావేరు మండలంలోని కొత్తకుంకాం గ్రామానికి చెందిన కొవ్వూరు సంతోషినిపై ఆమె భర్త కొవ్వూరు రాము మద్యం మత్తులో బ్లేడ్తో మంగళవారం ఉదయం దాడి చేశాడు. ఆమె మెడపై గాయమవ్వడంతో 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. వీరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. లావేరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. భర్తకు తలకొరివి పెట్టిన భార్య నందిగాం: మండలంలోని హరిదాసుపురంలో భర్తకు భార్య తలకొరివి పెట్టిన విషాదకర ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శిష్ణు తమ్మయ్య, కాంతమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండేవారు. కుమార్తె చిన్నతనంలోనే మృతి చెందగా, వివాహం అయిన కుమారుడు తిరుపతిరావు ఐదేళ్ల క్రితం అనారోగ్య సమస్యతో మృతి చెందాడు. అయితే తమ్మయ్య(63) మంగళవారం వేకువజామున గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో, భార్య కాంతమ్మ తలకొరివి పెట్టింది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కంచిలి: మండలంలోని పెద్ద శ్రీరాంపురం ఉన్నత పాఠశాల ఎదురుగా మెయిన్ రోడ్డుపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కవిటి మండలం తలగానపుట్టుగ గ్రామానికి చెందిన మదనాల పురుషోత్తం(29) అనే వ్యక్తి కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం మెయిన్రోడ్డుపై బైక్పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లగేజీ ఆటో ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఇతడికి సోంపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు పురుషోత్తం ఖతార్ దేశం నుంచి స్వగ్రామానికి ఇటీవల వచ్చి, సోంపేట మండలం జింకిభద్ర గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడికి నెల రోజుల్లో పెళ్లి కావాల్సి ఉండడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లి మదనాల దాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ కంఠం భూమి ఆక్రమణ రణస్థలం: లావేరు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 242లో ఉన్న ప్రభుత్వ భూమి (గ్రామకంఠం)ని ఒక టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణపై గ్రామ పెద్దలు ఎన్నిసార్లు వారించినా వినకుండా తనపని చేసుకుంటున్నాడు. సదరు టీడీపీ నాయకుడు గతంలో ఈ స్థలం ఆక్రమణకు విశ్వ ప్రయత్నాలు చేసినా గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆక్రమణ పర్వానికి తెరలేపాడు. తన ఇంటికి ఆనుకుని 40 అడుగుల పొడవునా, 4 అడుగుల వెడల్పున ఆక్రమించేలా పక్కాగా కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నాడు. దీనిపై కొంతమంది కలెక్టర్ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందినా మండల, గ్రామస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని ఆక్రమణలు అడ్డుకోవాలని కోరుతున్నారు. -
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
హిరమండలం: గిరిజన బాలిక జయంతి అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఇటీవల జయంతి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తెలిసిన వ్యక్తి కాలేజీలో చేర్పిస్తానని చెప్పి విగత జీవిగా ఇంటికి చేర్చాడు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పోలీస్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రెడ్డి శాంతి స్థానిక వైఎస్సార్సీపీ నేతలతో కలిసి మృతురాలి తల్లిదండ్రులు శ్రీను, రాధలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ తరుపున పోరాటం చేస్తామని చెప్పారు. ఆమెతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. -
‘సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే చెప్పండి’
శ్రీకాకుళం: జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ మున్సిపల్ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచామని, దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా విద్యా శా ఖ అధికారి ఎ.రవిబాబు కోరారు. మంగళవా రం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ త్వ రలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనున్న దృష్ట్యా ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ సీనియార్టీ జాబితాలను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. ఉపాధ్యాయులు దీన్ని పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఈ నెల ఆరో తేదీలోగా డీఈఓ కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఐసీడీఎస్కు పసికందు అప్పగింత పాతపట్నం: మండలంలోని బూరగాం గ్రామంలో ఈ నెల 30వ తేదీన ఇంటి పెరట పొదల్లో దొరికిన వారం రోజుల పసికందును జిల్లా ఐసీడీఎస్, చైల్డ్ హెల్ప్లైన్ అధికారులకు గ్రామస్తులు అప్పగించారు. పొదల్లో పసికందు దొరికిన విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, పోలీసులు, చైల్డ్ హెల్ప్లైన్ అధికారులు మంగళవారం బూరగాం గ్రామానికి చెరుకున్నారు. గ్రామానికి చెందిన దేవకి సోయి, సుబాచంద్ర సోయి దంపతుల వద్ద ఉన్న పిల్లాడిని ఎస్ఐ కె.మధుసూదనరావు, అంగన్వాడీ సూపర్ వైజర్ అమరావతి, ఐసీపీఎస్ జనార్ధనరావు, వైకుంఠరావు, సెక్రటరీ ఉదయ్శ్రీ, వీఆర్వో వెంకటరావు, సర్పంచ్ బిజిలి పుల్లాయ్, ప్రహ్లాద పుల్లాయ్, నర్సునాయుడు, గ్రామ పెద్దల సమక్షంలో జిల్లా ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పసికందును సోమవారం రాత్రి విడిచి వెళ్లిన వారిపై మంగళవారం ఉదయం పోలీసులు గ్రామానికి చేరుకుని ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్త పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నా మని ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపారు. ఘనంగా ఆదిత్యుని రథోత్సవం శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్వామి ఉష పద్మిని ఛాయా సమేత రథోత్సవం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ నిత్యౌపాసన, విశేషపూజ, మంగళహారతి ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. -
బగ్గువారి బాగోతాలు
● హస్తిన సాక్షిగాసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఏకంగా జాతీయ స్థాయికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. నియోజకవర్గంలో జరుగుతున్న, అవినీతి అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దర్జాగా దోపిడీ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. తాజాగా ఇసుక, మద్యం మాఫియాతో పాటు ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు వెళ్లింది. ఎమ్మెల్యే వ్యవహారాలను ప్రశ్నిస్తున్న సామాజిక కార్యకర్తలపై యాంత్రిక ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాది మొర పెట్టుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తమకు సంబంధించి డైరీలో కూడా రిజిస్టర్ చేసింది. బరి తెగింపు.. అంతా ఇంతా కాదు.. నరసన్నపేట నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. బహిరంగంగానే ఇసుక దోపిడీ జరుగుతోంది. రూ.వందల కోట్లను అక్రమార్కులు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఎక్కడికక్కడ అక్రమ ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారు. పట్టపగలే వంశధార నదిని యంత్రాలతో తవ్వేసి, నచ్చిన ధరకు విక్రయించి విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అడ్డొచ్చిన వాళ్లపై దాడులకు కూడా తెగబడుతున్నారు. మీడియా ప్రతినిధులపై కూడా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు తమ్ముళ్లు బరితెగించి, దర్జాగా దోచుకుంటున్నారు. చెప్పాలంటే ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అధికారులు సైతం అక్రమ తవ్వకాలపై చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. దీని ఫలితంగా నదిలో మంచినీటి వనరులకు హాని కల్గిస్తున్నారు. లోతుగా తవ్వకాలు జరిపి నీటి లభ్యతకు దెబ్బకొడుతున్నారు. అందినంతా దోచుకో.. లిక్కర్ మాఫియా కూడా ఇక్కడ నడుస్తోంది. మద్యం దుకాణాలను ఒక వర్గం ఎక్కువగా దక్కించుకోవడమే కాకుండా మిగతా దుకాణాలను కూడా గుప్పెట్లో పెట్టుకుని సిండికేట్గా నడుపుతున్నారు. గుడి, బడి అని చూడకుండా దుకాణాలు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపట్టి అదనపు దోపిడీ చేస్తున్నారు. బెల్ట్షాపులకైతే లోటే లేదు. విచ్చల విడిగా ఏర్పాటు చేసి మందుబాబులను మద్యం మత్తులో ముంచేస్తున్నారు. అంతటితో ఆగలేదు. కల్తీ లిక్కర్ స్థావరాలు కూడా ఈ నియోజకవర్గంలోనే తొలుత బయటపడ్డాయి. కేసులు కూడా నమోదయ్యాయంటే ఎంత దారుణంగా కల్తీ బాగోతం నడిచిందో అర్థం చేసు కోవచ్చు. ఉపాధి హమీ పథకం పనుల్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయి. నాసిరకం పనులు చేసి బిల్లులు కొట్టేసారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నిస్తే కేసులే.. ఈ మొత్తం అక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నించే వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. వీటిని లిఖిత పూర్వకంగా, ఆధారాల వీడియోలతో కలిపి సామాజిక కార్యకర్త, శ్రీముఖలింగం అనువంశిక అర్చకులు నాయుడు గారి రాజశేఖర్ ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ జరుగుతున్నదంతా ఫిర్యాదులో ప్రస్తావించారు. సమగ్రంగా వివరించారు. సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వీకరించింది. తమ డైరీలో రిజిస్టర్ చేసి, నంబర్ కూడా ఇచ్చింది. దీనిపై తదుపరి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయి? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్నది వేచి చూడాల్సి ఉంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి వెళ్లిన వ్యవహారాలు ఇసుక, మద్యం మాఫియాలపై ఫిర్యాదు ధన దాహానికి మంచినీటి పథకాలు నిర్వీర్యమవుతున్నాయంటూ ఫిర్యాదులో ప్రస్తావన నరసన్నపేట ఎమ్మెల్యేపై చేసిన ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం -
కాపులు అణచివేతకు గురవుతున్నారు
● జనాభా ప్రాతిపదికన పదవులివ్వాలి ● తూర్పుకాపుల ఆత్మీయ సభలో వక్తలు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో అధిక సంఖ్యలో తూర్పు కాపులున్నా.. మిగిలిన కులాల వద్ద అణచివేతకు గురవుతున్నామని తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం తూర్పుకాపుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో ఏ రాజకీయ పార్టీలైనా కాపులకే ప్రాధాన్యమివ్వాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలో ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు కాపుల ఐక్యతను చాటిచెబుతూ నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. సప్తగిరి కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, డే అండ్ నైట్ కూడలి మీదుగా ఏడు రోడ్ల జంక్షన్ వరకు సాగింది. వైఎస్సార్ కూడలి వద్దకు చేరుకుని దివంగత గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ పార్టీల తీరుపై ఆగ్రహం ఈ సందర్భంగా జరిగిన సమ్మేళనంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, అన్ని రాజకీయ పార్టీలు ఈ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నగరంలో జరిగిన కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను ఖండించారు. సుడా చైర్మన్, కాపు సామాజికవర్గ బలమైన నాయకుడు కొరికాన రవికుమార్ ప్రోటోకాల్ విషయంలో జరిగిన అన్యాయం, తూర్పు కాపు జాతికి జరిగిన అవమానంగా అభివర్ణించారు. పాలకులు కుట్ర పూరితంగా రవికుమార్ని అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. సామాజిక వర్గ సమస్యలపై స్పందిస్తూ.. అందరికీ పెద్ద దిక్కుగా ఉంటున్న కొరికాన రవికుమార్ వంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తూర్పు కాపు బిడ్డపై ఉందని పిలుపునిచ్చారు. ఆయన మార్గదర్శకత్వంలోనే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్లో జిల్లావ్యాప్తంగా ఈ ఐక్యతను మరింత బలోపేతం చేసి, సామాజికంగా, రాజకీయంగా తమ వాటాను దక్కించుకుంటామని తీర్మానించారు. సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, లుకలాపు సంతోష్ చక్రవర్తి, వాడవలస సురేష్కుమార్, అన్నెపు రామకృష్ణ, డోల జగన్, శాసపు జోగినాయుడు, పతివాడ గిరీశ్వరరావు, మిర్తివాడ ప్రభాకర్, రాజు, గిరడ అప్పలస్వామి, తాట్రాజుల రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీలో పలువురికి పదోన్నతులు
శ్రీకాకుళం: జిల్లా పరిషత్ పరిధిలోని ఉన్నత పాఠశాలలు, పంచాయతీ రాజ్ కార్యాలయాల్లో రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పలువురికి జూనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పిస్తూ నియామక పత్రాలను జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ మంగళవారం అందజేశారు. మురపాక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రమాదేవిని శ్రీకూర్మం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పిల్లలవలస జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న ఎ.రాజేశ్వరిని రాజాం మండల పరిషత్లో, బాసురు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సీహెచ్ తవిటినాయుడును రాజాం మండల పరిషత్ కార్యాలయంలో, దేవుదల జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న వీవీ రమణను లింగాలవలస జెడ్పీ హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతిపై నియమించారు. అలాగే కింతలి జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న ఎస్.పార్వతిని శ్రీకాకుళంలోని జెడ్పీ హైస్కూల్లో నియమిస్తూ నియామకపత్రాలను పదోన్నతులు పొందినవారికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పదోన్నతి పొందిన ఉద్యోగులు కష్టపడి పనిచేసి, జిల్లా పరిషత్ యాజమాన్యానికి మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఈవో డి.సత్యనారాయణ, ఏవో రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్
● ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో పథకం నిలుపుదల ● బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల డిమాండ్ ● ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆరోగ్యశ్రీ చికిత్సలు నిలుపుదల శ్రీకాకుళం : జిల్లాలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. గత కొంతకాలంగా తమ బకాయిలను చెల్లించాలని నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు పదేపదే విన్నవిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం నుంచి ప్రత్యక్ష పోరాటానికి నిశ్చయించాయి. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నారు. జిల్లాలో 20 ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివే యాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. వైఎస్సార్ మానస పుత్రికగా పేరొందిన ఆరోగ్య శ్రీని ఎలాగైనా నిలిపివేయా లని చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటి నుంచో కుట్రలు పన్నుతోంది. ఆరోగ్యశ్రీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు. ఏప్రిల్ నుంచి కొత్తగా యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకురావాలని కూడా నిర్ణయించారు. కానీ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల వారు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతూ తొలిదశగా ఆరోగ్యశ్రీని నిలుపుదల చేయాలని నిర్ణయించారు. -
రాతలు.. చెరిపివేతలు
● బడి ముఖద్వారంపై ‘గరిమెళ్ల’కు బదులు టీడీపీ నేతల పేర్లు ● చెరిపివేసిన గుర్తు తెలియని వ్యక్తులు ● ప్రియాగ్రహారంలో రాజుకున్న రాజకీయం పోలాకి: ఆ బడి ముఖద్వారంపై ఇదివరకు స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ పేరు ఉండేది. ఈ మధ్య ఏం పనులు చేశారో గానీ అదే స్థానంలో స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర, రాష్ట్ర మంత్రుల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. స్వాతంత్య్ర యోధుడి పేరు స్థానంలో వీరి పేర్లు పెట్టుకోవడంతో కొందరు వాటిని చెరిపేశారు. ఇప్పుడు ఈ వైనం మండలంలోని ప్రియాగ్రహారంలో నిప్పు రాజేసింది. పాఠశాల ముఖద్వారంపై రాసిన పేర్లు చెరిపేశారంటూ టీడీపీకి చెందిన నాయకులు సోమవారం సాయంత్రం పోలాకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామానికి చెందిన పలువురు యువకులను పోలీసులు మంగళవారం స్టేషన్కు పిలిపించారు. అందులో జనసేన, వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు టీడీపీ రెబల్గా మారిన దుబ్బ కోటేశ్వరరావు కూడా ఉన్నారు. పేర్లను ఎవరు చెరిపారో కనుక్కోకుండా తమను బెదిరించడం సరికాదని వారన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బలగ ప్రవీణ్తోపాటు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు సుంకరి రాంబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తియ్యల రాము స్టేషన్కు చేరుకుని విచారణ చేపట్టకుండా కేవలం టీడీపీ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు యువకులను స్టేషన్కు పిలిపించడంపై నిలదీశారు. అనంతరం అక్కడి నుంచి యువకులను వారి వెంట తీసుకెళ్లిపోయారు. టీడీపీ నాయకులు కూటమి ధర్మం పాటించడం లే దని, కనీసం అధికారంలో తాము భాగస్వాములం అనే విషయాన్ని పక్కన పెట్టారని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల గేట్లపై రాజకీయ నాయకుల పేర్లు రాయటం తగదని అన్నారు. దీనిపై వైఎస్సార్సీపీ సైతం తీవ్రంగానే స్పందించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ పేరుతో పాఠశాల ముఖద్వారం ఉండేదని, ఆ స్థానంలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం ఆక్షేపణీయమని జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైతన్య మండిపడ్డారు. -
‘బెందాళం ఆరోపణలు సరికాదు’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): బెంతు ఒరియా సమస్యపై తప్పుడు సమాచారం ఇస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్ అసత్యాల ప్రెస్మీట్పై పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, గిరిజనులపై ఇలా లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని గిరిజన సంఘాల జేఏసీ ముఖ్య సలహదారుడు వాబ యోగి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హొటల్లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలను అనరాని మాటలు అనేసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన చేశాక సుమారుగా 98 గంటల తర్వాత ప్రెస్ మీట్ ద్వారా క్షమాపణ అడగటం దారుణమన్నారు. బెంతు ఒరియాలు ఒడ్డి కులానికి చెందిన వారని టెక్కలి ఆర్డీఓ ప్రభుత్వానికి నివేదిక అందజేశారని గుర్తు చేశారు. ఎస్టీలుగా ఉద్యోగాలు పొందిన నలుగురు బెంతు ఒరియాల ఉద్యోగాలు రద్దు చేశారని తెలిపారు. జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి సింహాచలం మాట్లాడుతూ అశోక్ 15 ఏళ్లుగా పాలిస్తున్న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో చాలా గ్రామాలకు రోడ్డు సదుపాయం కూడా లేదన్నారు. ఇళ్లు లేని ఆదివాసీలు ఉన్నారని, దానికి ఆయన బాధ్యులు కారా అని ప్రశ్నించారు. బెంతు ఒరియాలపై పూర్తిగా ఈ ప్రభుత్వ అధ్యయనం చేసి నకిలీ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ వ్యక్తులైనా ఆదివాసుల గురించి తప్పుగా మాట్లాడితే ఇక క్షమించేది ఉండదని హెచ్చరించారు. -
సచివాలయాల తనిఖీల్లో అలసత్వం వద్దు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, క్షేత్రస్థాయి తనిఖీల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావులతో కలిసి ఆయన వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలకు సంబంధించి కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన సచివాలయాలను క్రమం తప్పకుండా సందర్శించి, సేవలందిస్తున్న తీరును పరిశీలించాలన్నారు. రిజిస్టర్ల నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు, ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలని స్పష్టం చేశారు. తనిఖీల నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. జన గణనపై దిశా నిర్దేశం రానున్న జన గణన ప్రక్రియపై కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గణన కోసం నియమించిన సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో ఎక్కడా తప్పులు దొర్లకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూముల సవరణలు, వెబ్ల్యాండ్లో మార్పులపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను వసూళ్లను శతశాతం పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నీటి తీరువా వసూళ్లలో పురోగతి సాధించాలని, రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సకాలంలో జమ చేయాలని సూచించారు. ఇందులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఏం కష్టమొచ్చిందో..
● ఇద్దరు పిల్లలతో వివాహిత ఆత్మహత్యాయత్నం ● ఘటనా స్థలంలోనే వివాహిత మృతి ● తీవ్రంగా గాయపడిన పిల్లలు నరసన్నపేట: పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోయే తల్లి ఏకంగా ఆ పిల్లలను రైలు కింద తోసింది. తానూ చనిపోవాలని అనుకుంది. తల్లీపిల్లల ఆత్మహత్యాయత్నం ఘటన స్థానికులను కలిచివేసింది. ఘటనలో తల్లి చనిపోగా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కంబకాయ రైల్వే గేటు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం శ్రీకాకుళం టౌన్కు చెందిన కొత్తపల్లి జ్యోతి(35) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇద్దరు పిల్లలతో ఆమె విశాఖ ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా జ్యోతి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇద్దరు పిల్ల లు హేమంత్, పునీత్లు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. ఈ సంఘటన చూపరుల హృదయాలను కలిచి వేసింది. అయితే లోకోపైలెట్ మానవతా దృక్పథంతో ట్రైన్ను ఆపి గాయపడిన ఇద్దరు పిల్లలను ఆమదాలవలస రైల్వే పోలీసులకు అప్పగించారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. జ్యోతిది కంబకాయ గ్రామం. పదేళ్ల కిందట వివాహమైంది. భర్తతో నిత్యం ఘర్షణలు పడుతూ మంగళవారం ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారు కాగా పెద్దబ్బాయి హేమంత్కు కుడి కాలు విరిగిపోగా చిన్నబ్బాయి పునీత్ ఎడమ కాలికి గాయాలయ్యా యి. వీరిని శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఒకరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఆమదాలవలస రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒత్తిడితో..
శ్రీకాకుళందళం ఇక గతమే..జిల్లాలో నక్సలిజం గతం కానుంది. స్థూపాలు మాత్రమే మిగిలాయి. –8లో ఏ పనీ చేయలేకపోతున్నాం ● జాబ్ చార్టును మర్చిపోతున్నాం ● వారమంతా సెలవు లేకుండా గడిచిపోతోంది ● వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ముందు గగ్గోలు పెట్టిన రెవెన్యూ ఉద్యోగిని బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026‘వారంలో ఏడు రోజులూ సెలవులు లేకుండా గడిచిపోతున్నాయి.. వీసీలు, టీసీలు, రెవెన్యూ క్లినిక్లు అంటూ ఒత్తిడి తెస్తుంటే మా జాబ్చార్టు కూడా మర్చిపోతున్నాం..’ అంటూ ఓ రెవెన్యూ ఉద్యోగిని కలెక్టర్ ముందే వీడియో కాన్ఫరెన్స్లో గగ్గోలు పెట్టారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించడంతో.. టెక్కలికి చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వెళ్లగక్కారు. జిల్లా ఉన్నతాధికారులు పని ఒత్తిడి చేస్తున్నారని, ఒక పని పూర్తికాకముందే మరో పని చెబుతున్నారని, సమయం ఇవ్వడం లేదని, రెవెన్యూకి సంబంధం లేని పనులు కూడా అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీలు టీసీలతో అసలు కార్యాలయంలో పనిచేసే అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. పని చెప్పడం తప్ప తమ సమస్యలు వినడం లేదన్నారు. దీంతో వీసీ మధ్యలో ఆమె మైక్ను మ్యూట్లో ఉంచి ఇతరులకు ఆమె మాటలు వినిపించకుండా చేశారు. కానీ దాదాపు రెవెన్యూ ఉద్యోగులందరిదీ అదే ఆవేదన అని సిబ్బంది తెలిపారు. – శ్రీకాకుళం పాతబస్టాండ్ -
ఐటీడీఏ ఏర్పాటుపై మంత్రి సమాధానం చెప్పాలి
కొత్తూరు: అధికారంలోకి వస్తే జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీపై మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో గోవిందరావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గొట్టిపల్లిలో గిరిజనులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయడంతో పాటు.. గిరిజన సమస్యలు పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా సమస్యలు పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు, సంవత్సరాలు నుంచి సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. గిరిజన భూములు ఆక్రమణలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. గిరిజనులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సిర్ల ప్రసాద్, అప్పన్న, సుంకయ్య, గణపతి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
1,112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం: జిల్లాలోని 1,112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. నగరంలోని 44వ వార్డులో ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 కింద మంజూరైన గృహన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఏవై గ్రామీణ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏప్రిల్ నెలలో నిధులు వస్తాయని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న బిల్లులు సత్వరమే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సొంతింటి కలను సాకారం చేసుకోవడం ప్రతి కుటుంబానికి ఒక గొప్ప ఆనందకరమైన క్షణమన్నారు. పట్టణ హౌసింగ్ స్కీం కింద ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 లక్షలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఈఈడబ్ల్యూడీసీ డైరెక్టర్ పీఎంజే బాబు, గృహ నిర్మాణ శాఖ పీడీ రమాకాంత్, గృహ నిర్మాణ శాఖ పీడీ డి.రమాకాంత్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు పైడిశెట్టి జయంతి, డీఈ సత్యాజీ, ఏఈ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 44 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదిక (గ్రీవెన్సు) కార్యక్రమంలో ప్రజల నుంచి 44 వినతులు అందాయి. అదనపు ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు వినతులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇసుక లారీని ఢీకొన్న ట్యాంకర్ రణస్థలం: లావేరు మండలంలో బొంతుపేట గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముందు వెళ్తున్న ఇసుక టిప్పర్ లారీని వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొంది. దీంతో ట్యాంకర్లో ఉన్న డ్రైవర్ అబ్దుల్లా షేద్కు తీవ్రగాయాలయ్యాయి. హైవే పోలీసులు, లావేరు పోలీసుల సాయంతో క్రేన్ సాయంతో క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీశారు. కాగా ఇసుక టిప్పర్ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. క్యాబిన్లో ఇరుకుపోయిన డ్రైవర్ అబ్ధుల్లా షేద్ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. ఇతను ఉత్తరప్రదేశ్ చెందినవాడు. దీనిపై ఇంకా లావేరు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. -
పోరాడుతూనే ఉంటాం
జనం తరిమికొడతారనే భయం టీడీపీలో కలగాలి. అప్పుడే పను లు చేస్తారు. అభివృద్ధి అంటే.. కిడ్నీ ఆస్పత్రి, సుజలధార, మూలపేట పోర్టు వంటి ప్రాజె క్టులు. బీచ్ ఒడ్డున 150 లైట్లు వేసి రీల్స్ చేయడం అభివృద్ధి కాదు. పోర్టు పూర్తయ్యే వరకు మేం పోరాడుతూనే ఉంటాం. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి సిగ్గు చేటు వైఎస్ జగన్ కల, ఎన్నో కుటుంబాల త్యాగాల ఫలితమే మూలపేట పోర్టు. డబ్బులు వచ్చే అమరావతి తప్ప చంద్రబాబు అండ్ కోకు ఏమీ అక్కర్లేదు. వైఎస్ జగన్ చేసిన పనుల వద్ద ఫొటోలు దిగితే క్రెడిట్ వచ్చేయదు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి కమీషన్ల కోసమే.. టెక్కలి నియోజకవర్గంలో మైనింగ్ నుంచి లిక్కర్ అక్రమ వ్యాపారాల వరకు కింజరాపు కుటుంబం పెద్ద ఎత్తున దోపిడీ చేస్తోంది. కేంద్ర మంత్రికి దమ్ముంటే బహిరంగ సభ పెట్టి మూలపేట పోర్టు చంద్రబాబు కట్టారని చెప్పగలరా.? కమీషన్ల కోసమే పనులు ఆపేశారు. – పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త -
పీ–4తో పేదరికం నిర్మూలన సాధ్యం
● ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన పీ–4 కార్యక్రమంతో పేదరికం నిర్మూలన సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో పీ–4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మార్గదర్శుల సత్కార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని సంపన్న పౌరులు మార్గదర్శులుగా అత్యంత పేదరికంలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అని కొనియాడారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8,760 మంది మార్గదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, డీఆర్వో విశ్వేశ్వరరావు, ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీప్రసన్న, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీధర్, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈవోగా వెంకట్రామన్ శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈవోగా వెంకట్రామన్ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు డిప్యూటీ సీఈవోగా శ్రీకాకుళంలో పనిచేస్తూ ఇన్చార్జి సీఈవోగా వ్యవహరించారు. శ్రీకాకుళం నుంచి విజయనగరం కొద్దిరోజుల క్రితం బదిలీ అవ్వగా, తాజాగా ఆయనకు సీఈవోగా పదోన్నతి కల్పిస్తూ శ్రీకాకుళంలో నియమించారు. గతంలో ఈయన శ్రీకాకుళం ఎంపీడీవోగా కూడా పనిచేశారు. మంగళవారం ఈయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. -
త్వరితగతిన అర్జీల పరిష్కారం
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 113 అర్జీలు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు 113 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్కు సంబంధించి 58 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ 24, పంచాయతీ రాజ్ 17, వ్యవసాయ శాఖ 5, పేదరిక నిర్మూలన సంస్థ 16, మున్సిపల్ కార్పొరేషన్ 11, సర్వే అండ్ లాండ్ రికార్డులు 8, సర్వే 9, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 7 తదితర శాఖలకు సంబంధించి 113 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించినవారిలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పలు వినతులు పరిశీలిస్తే.. పొందూరు మండలంలోని లోలుగు రెవెన్యూ పరిధిలో ఉన్న డీజీఆర్ జ్యూట్మిల్ ప్రైవేట్ లిమిటెడ్ మిషనరీ అక్రమ అమ్మకాలపై అధికారులు కోరిన సమాచారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీవీ రమణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకొని తనకు వివరాలు అందజేయాలని కోరారు. ● శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్రశాంతి వృద్ధాశ్రమం వెనుక కలెక్టర్ ఆఫీసు రోడ్డులో డీటీసీపీ అప్రూవల్ పొందిన లేఅవుట్ శ్రీసాయి శ్రీనివాసనగర్ నివాసాల మీదుగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ఆ ప్లాన్ రద్దు చేయాలని శ్రీసాయినగర్ వాసులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనివలన సుమారు 200 కుటుంబాలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
క్రెడిట్ చోరులపై
30 శాతం పనులు చేయలేరా..? పోర్టు పరిశీలిస్తే సర్కారు బండారం బయటపడుతుంది. అందుకే అడ్డుకున్నారు. 70 శాతం పనులు వైఎస్సార్ సీపీ పూర్తి చేస్తే.. 30 శాతం పనులు రెండేళ్లయినా చేయలేకపోయారు. పైగా అంతా తామే చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. – బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమం దిగ్విజయం ప్రసంగాలతో అధికార పక్షంపై నిప్పులు చెరిగిన వైఎస్సార్ సీపీ నేతలు పోర్టుకు వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు అడుగడుగునా అడ్డుగోడలే అన్నింటినీ దాటుకుని సభను విజయవంతం చేసిన నేతలు -
రణన్నినాదం
సిగ్గు లేదా.. మూలపేట పోర్టు కట్టామని చెప్పుకోవడానికి టీడీపీకి సిగ్గు లేదా. జిల్లా ప్రజల చిరకాల వాంఛ మూలపేట పోర్టు. ఈ కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్దే. – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులు నిలదీయాలి.. జిల్లాకు ఎందుకు ప్రాజెక్టులు తీసుకురావడం లేదని కేంద్ర, రాష్ట్ర మంత్రులను నిలదీయాలి. అసలు 40 ఏళ్ల టీడీపీ పాలనలో జిల్లాకు చేసిందేమిటి..? వైఎస్ఆర్.. ఆ తర్వాత వైఎస్ జగన్మాత్రమే జిల్లాకు ప్రాజెక్టులు తీసుకువచ్చారు. – చింతాడ రవికుమార్, నియోజకవర్గ ఇన్చార్జి, ఆమదాలవలసఅదే టీడీపీ భయం మూలపేట కీలకం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు ఉన్నా ఏమీ లాభం లేదు. మూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. – బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ పునాది రాయి కాదు మైలు రాయి.. మూలపేటకు వైఎస్ జగన్ వేసింది సాధారణ పునాది రాయి కాదు. జిల్లా చరిత్రలో ఓ మైలురాయి. విభజిత ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరాన్ని వాడుకోవాలన్న ఆలోచన చేసిన ఏకై క నేత వైఎస్ జగన్. – పిరియా విజయ, జెడ్పీ చైర్ పర్సన్ సీఎం అంటే వైఎస్ జగన్ సీఎం అంటే వైఎస్ జగనే. మాటిస్తే నిలబెట్టుకుంటారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కనీసం రైతాంగానికి ఒక్క యూరియా బస్తా ఇవ్వలేదు. మంత్రి రామ్మోహన్నాయుడు విమానాల్లో తిరుగుతూ ఉంటే ప్రజల సమస్యలు అర్థం కావు. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే కూటమికి చెంపదెబ్బ మూలపేట పోర్టు కార్యక్రమం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ. చంద్రబాబు అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకేమీ పట్టవు. కూటమి అరాచకాలను కార్యకర్తలు ప్రశ్నించాలి. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీఇచ్ఛాపురంసమన్వయకర్తక్రెడిట్ చోరులపైసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/టెక్కలి/ శ్రీకాకుళం పీఎన్కాలనీ : చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిప్పులు చెరిగింది. పోర్టుకు సపోర్టు ఇవ్వలేని అసమర్థ వైఖరిని జన సభ సాక్షిగా ఎండగట్టింది. మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ పేరిట పోరాటానికి పిలుపునిచ్చింది. దీనికి భయపడిన ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించింది. నేతలు పోర్టుకు వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు నౌపడ మూడు రోడ్ల జంక్షన్లో సభ నిర్వహించి అధికార పక్షంపై మాటల తూటాలు పేల్చారు. వైఎస్ జగన్ హయాంలోనే 70 శాతం పనులు పూర్తి కాగా.. టీడీపీ రెండేళ్లలో ఆ 30 శాతం పనులు చేయలేకపోయింది. పైగా మొత్తం ఘనత తమదే అన్నట్లు డబ్బాలు కొడుతోంది. ఈ పోర్టును పూర్తి చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్రెడిట్ వస్తుందని ఉద్దేశపూర్వకంగా పనులు జాప్యం చేస్తూ వస్తోంది. దీనిపైనే వైఎస్సార్ సీపీ ఉద్యమానికి సిద్ధమైంది. అర్ధంతరంగా ఆగిపోయిన మూలపేట పోర్టు పనుల పరిశీలనకు నడుం బిగించింది. దీనికోసం పోలీసులను అనుమతి కోరితే సభ ఏర్పాటుకు తప్ప పోర్టు సందర్శనకు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశంతో మూలపేట పోర్టుకు సమీపంలో నౌపడ జంక్షన్ వద్ద సభ నిర్వహించారు. సభకు తరలివచ్చిన వేలాది మందితో నౌపడ జంక్షన్ జనసంద్రమైంది. టెక్కలి, కోటబొమ్మాళి నుంచి నౌపడ జంక్షన్ వైపు వెళ్లే రహదారులన్నీ కిటకిటలాడాయి. వేలాది కార్లతో ర్యాలీగా వైఎస్సార్సీపీ శ్రేణులు వచ్చాయి. దీంతో దారులన్నీ వాహ నాల జాతరను తలపించాయి. విపరీతమైన రద్దీ ఏర్పడింది. వాహనాలన్నీ మూలపేట పోర్టు వైపు వస్తుండటంతో పోలీసులు ఆంక్షలు పెంచారు. అయినప్పటికీ ఆంక్షలను చేధించుకుని నౌపడ జంక్షన్ వద్ద జరిగిన సభ కు రకరకాల మార్గాల ద్వారా వేలాదిగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు ప్రసంగాలతో అదరగొట్టారు. పోర్టు లెక్కలన్నీ కళ్లకు కట్టినట్టుగా వివరించారు. టీడీపీ అలసత్వాన్ని వివరిస్తూ మాటల తూటాలు పేల్చారు. క్రెడిట్ చోరీకి యత్నిస్తున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, చంద్రబాబు అండ్కోపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి...మన పోర్టు మన కృషి అంటూ పిలుపుతో నిర్వహించిన నిరసన సభ విజయవంతమైంది. ప్రజల నుంచి అశేష స్పందన రావడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తలేరాజేష్, శ్రీకాకుళం జిల్లాలోని వివిధ నియోజకవర్గ పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, చల్లా రవికుమార్, పిన్నింటి సాయి, కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంబటి శ్రీనివాస్, ఆరంగి మురళీధర్, రాజాపు అప్పన్న, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కేవీజీ సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, పార్టీ యువజన నాయకులు ధర్మాన కృష్ణచైతన్య, ధర్మాన రామ్మనోహర్నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, ఇంటలెక్చువల్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు పిల్లల రామకృష్ణ, పార్టీ నాయకులు దువ్వాడ వాణి, వైవీ శ్రీధర్, పొన్నాడ రుషి, చిట్టి జనార్ధనరావు, మండవల్లి రవి, శ్రీరామ్మూర్తి, బుక్కూరు ఉమామహేశ్వరరావు, పాలవసంత రెడ్డి, మార్పు అశోక్కుమార్, గద్దిబోయిన కృష్ణయాదవ్, చింతాడ వరుణ్, ఆట్ల సుజనమ్మ, కోణార్క్ శ్రీను, ఇప్పిలి కృష్ణారావు, కడియాల శ్రీహరి, ఎంఏ భేగ్, డాక్టర్ దాస్, పిలక రాజ్యలక్ష్మిలతో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాల వైఎస్సార్సీపీ శ్రేణులు వేలాదిగా హాజరయ్యారు. -
● పొదల్లో పసికూన
పాతపట్నం: ఆకలి తీర్చడానికి చనుబాలు లేవు.. ఏడుపు ఆపడానికి తల్లి పొత్తిళ్లు లేవు.. ఒంటి నిండా చీమల కాట్లు.. కంటి నిండా కన్నీటి బొట్లు. వారం వయసున్న పిల్లాడు పొదల మధ్య పడిన అవస్థ ఇది. పాతపట్నం మండలంలోని బూరగాం గ్రామంలోని సత్యనారాయణ ఆలయం పక్కన ఘంసీ పుల్లాయ్ ఇంటి పెరటిలో సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరో పసి కందును పడేసి వెళ్లిపోయారు. ఆ పసికందు గుక్కపట్టి ఏడవడంతో భూదేవి అనే మహిళ బాబును రక్షించి, గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో బాబుకు సపర్యలు చేసి, శరీరాన్ని శుభ్రం చేశారు. బాబుకు వైద్య సేవల కోసం మంగళవారం ఉదయం తీసుకువెళతామన్నారు. ప్రస్తుతం బాబు ను భూదేవి అనే మహిళ వద్ద గ్రామస్తులు ఉంచారు. -
తీరంలో రణన్నినాదం 'పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం'
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/టెక్కలి/ సంతబొమ్మాళి/నందిగాం/ టెక్కలిరూరల్: ఉత్తరాంధ్ర తీరంలో అభివృద్ధికి అత్యంత కీలకమైన మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ రణభేరి మోగించింది. రెండేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని ప్రభుత్వ అసమర్థతను తూర్పారపట్టింది. చేసిందేమీ లేకపోయినా పోర్టు ఘనత తమదే అంటూ క్రెడిట్ చోరీకి యత్నిస్తున్న చంద్రబాబు కుయుక్తులను కడిగిపారేసింది. శ్రీకాకుళం జిల్లా నౌపడలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి స్థానిక ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా జనం రాకను ఆపలేకపోయారు. పోర్టు పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. నౌపడ జంక్షన్ వద్ద ముళ్లకంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. చుట్టు పక్కల గ్రామాల వద్ద ఎక్కడిక్కడ టిప్పర్లను అడ్డం పెట్టారు. గ్రామాల శివార్లలో బారికేడ్లు పెట్టారు. ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామాల్లోకి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. వాటిన్నింటినీ ఛేదించుకుని సభకు అశేషంగా హాజరయ్యారు. మూలపేట పోర్టు విషయంలో అధికార పార్టీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని నేతలు తిప్పి కొట్టారు. ఈ పోర్టు పూర్తయ్యేంతవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.జగన్ హయాంలోనే 70 శాతం పూర్తి మూలపేట పోర్టు పనులలో మెజారిటీ భాగం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.4,362 కోట్ల నిధులను సమకూర్చారు. ఫైనాన్షియల్ క్లోజర్ జరిగింది. రుణాలకు బ్యాంకులతో టైఅప్ పూర్తి చేశారు. భూసేకరణ పూర్తిచేశారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ. 149 కోట్లుఖర్చు చేశారు. వీటితోపాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులనూ తెచ్చారు. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగించడంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ పూర్తిచేశారు కాబట్టి ప్రాజెక్టు 70శాతానికి పైగా పూర్తి అయినట్లే. జగన్ హయాంలో పనులన్నీ వేగంగా జరగడాన్ని గుర్తు చేసుకుంటూ.. మళ్లీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదని స్థానికులు పేర్కొంటున్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ బహిరంగ సభకు హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా ఆంక్షలువైఎస్సార్సీపీ చేపట్టిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. మూలపేట పోర్టుకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. కనీసం గ్రామస్తులు రావడానికి వీల్లేని విధంగా ఆంక్షలు పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులెవరూ పోర్టు వైపు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నౌపడ జంక్షన్ నుంచి పాలనాయుడుపేట జంక్షన్ వద్ద, యామల పేటకు వెళ్లే రహదారి వద్ద, రాజపురం జంక్షన్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి బయట వ్యక్తులెవరూ పోర్టు ప్రదేశానికి వెళ్లకుండా బారికేడ్లు, ముళ్ల కంచెలతో మోహరించారు. నౌపడ మూడు రోడ్లు జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్లే రహదారిలో టిప్పర్లను అడ్డంగా పెట్టి దాని ముందు బారికేడ్లు పెట్టి ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. మూలపేట గ్రామస్తులు కూడా తమ గ్రామానికి వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. కొందరికి జీడి తోటలకు పరిహారం, పీడీఎఫ్ పరిహారం ఇవ్వలేదని, ఇంటి స్థలాలు కూడా కేటాయించలేదని, నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండానే తరలిస్తున్నారని మూలపేట గ్రామస్తులు వైఎస్సార్సీపీ నేతలకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణి, బూడి ముత్యాల నాయుడు, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్ చైర్మన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాసరావు, జల్లిపల్లి సుభద్ర, ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ ఎంపీ సత్యవతి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవి బాబు, నర్తురామారావు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ఎం. విశ్వేశరరాజు, రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కరణం ధర్మశ్రీ, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వాసుపల్లి గణేశ్, అదీప్రాజ్, గొర్లె కిరణ్కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేశ్, మళ్ల విజయప్రసాద్, శోభా హైమావతి, భాగ్యలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, కేకే రాజు, జెడ్పీ మాజీ చైర్మన్, జీసీసీ మాజీ చైర్మన్ గులిపల్లి శోభాస్వాతీరాణి తదితరులు హాజరయ్యారు.బహిరంగ సభలో ప్రసంగిస్తున్న శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వేదికపై వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు జగన్కు పేరొస్తుందన్న కక్షతోనే..ఒక ప్రభుత్వం కొనసాగిస్తున్న పనిని తర్వాత ప్రభుత్వం పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కక్షతో మూలపేట పనులు ఆపేసింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం పోర్టులో రీల్స్ చేసుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ భూ సేకరణ, అనుమతులన్నీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చేసింది. రామ్మోహన్ నాయుడికి సమర్థత ఉంటే, తన శాఖ పరిధిలోని విశాఖ ఎయిర్ పోర్టు పనులను రెండేళ్లుగా ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు..? మీ మామూళ్ల కోసం ఇక్కడి పనులు సాగనివ్వరా..? అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నా మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించలేదు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టు పూర్తయి ఉండేది. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే అధికార పక్షం వారు ఇవాళ ప్రజాసంక్షేమం అంటూ మాట్లాడడం సిగ్గుచేటు. పోర్టు పనులను మేం పరిశీలిస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతోంది? భయంతో ఎంతోకాలం మీరు పరిపాలన చేయలేరు. త్వరితగతిన పోర్టు పూర్తి చేయాలి. – బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత టీడీపీ నేతలను తరిమికొట్టాలి..ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ సిక్కోలు వెనుకబాటును రూపుమాపే ప్రాజెక్టులు తీసుకువచ్చారు. టీడీపీ పాతికేళ్ల పాలనలో ఒక్క శాశ్వత ప్రాజెక్టు అయినా తీసుకురాలేదు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాకు ఏం చేశారో చూపగలరా..? మూలపేట పోర్టుకు అవసరమైన ఆర్థిక వనరులు, అనుమతులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వమే తీసుకువచ్చింది. టీడీపీ రెండేళ్లలో నయాపైసా ఇవ్వలేదు. ఏ రోజైతే జిల్లాలో టీడీపీని ప్రజలు తరిమి కొడతారో, ఆ రోజే వీరు భయపడి పనిచేస్తారు. ప్రైవేటు వ్యక్తులు కడుతున్న భోగాపురం ప్రాజెక్టుకు రామ్మోహన్ నాయుడు టూరిస్టులా వెళ్లి తామే కడుతున్నామని అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు రూ.3.50 లక్షల కోట్లు అప్పు తెచ్చి, అందులో రూ.1000 కోట్లైనా ఈ పేద జిల్లాకు పెట్టారా? వైఎస్ జగన్ పోర్టులు, హార్బర్లతో అభివృద్ధి వికేంద్రీకరణకు రూపకల్పన చేశారు. కానీ టీడీపీ నేతలు జిల్లాలో ఇసుక, మట్టి, రాయి దోచుకుంటున్నారు. ఉద్దానం ప్రాంతానికి ఊపిరి పోసే విధంగా కిడ్నీ ఆస్పత్రి, హిరమండలం నుంచి సుజలధార ప్రాజెక్టుల ఘనత వైఎస్ జగన్కే దక్కింది. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి రెండేళ్లలో ఒక్కశాతం పని చేయలేదుకూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా మూలపేట పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో పునరావాసం, భూసేకరణ, అనుమతులన్నీ పూర్తి చేసి కీలకమైన పనులు చేస్తే, వీరు అడ్డగోలుగా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడానికి చూశారు. బుడగట్ల పాలెం జట్టీ, భోగాపురం అన్నీ జగన్ చలవే. అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసగించడమే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు తెలిసిన పని. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటూ జిల్లాకు ఏమీ చేయకుండా చంద్రబాబు భజన చేయడం సిగ్గుచేటు. వలస వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోతున్న జిల్లా వాసుల కష్టాలను చూసి, పాదయాత్రలో జగన్ తయారుచేసిన బ్లూ ప్రింట్ ఫలితమే మూలపేట పోర్టు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఛాలెంజ్ చేస్తున్నాను.. జిల్లాకు మీరు తెచ్చిన ఒక్క ప్రాజెక్టు అయినా చూపగలరా?. వైఎస్సార్, జగన్ హయాంలోనే జిల్లాకు వంశధార, రిమ్స్, పోర్టు, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీలు వచ్చాయి. అచ్చెన్నాయుడు గారూ.. అసెంబ్లీలో జగన్ను కాల్చేయాలంటున్నారు.. ఎవరిని కాల్చాలి? సంపదనంతా అమరావతిలో కేంద్రీకరిస్తున్న వారినా? లేక అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన జగన్నా..? – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారుమూలపేట పోర్టు పూర్తయితే టెక్కలి ప్రాంతం ముంబైలా అభివృద్ధి చెందుతుంది. గతంలో భారీ భూసేకరణ సాధ్యం కాదని వాయిదా వేసిన ప్రాజెక్టును వైఎస్ జగన్ ఆచరణాత్మక ఆలోచనతో కేవలం 1,800 ఎకరాలతో సాధ్యమని నిరూపించి పనులు ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ సీఎం చేయని పనిని వైఎస్ జగన్ చేసి చూపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. కనీసం పనుల పరిశీలనకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. మూలపేట పోర్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, ఫిషింగ్ హార్బర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో వైఎస్ జగన్ జిల్లాపై ప్రేమను చాటుకున్నారు. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడురెండేళ్లవుతున్నా ఎక్కడి పనులక్కడే..దశాబ్దాలుగా టీడీపీ ఎన్నికల అజెండాగా మాత్రమే ఉన్న పోర్టును వైఎస్ జగన్ పట్టాలెక్కించి 70 శాతం పూర్తి చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్లవుతున్నా మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేని అసమర్థతతో ఉంది. పోర్టు పూర్తయితే వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కుళ్లుతోనే పనులు ఆపేశారు. గతంలో టీడీపీ 5 వేల ఎకరాలు దోచుకోవాలని చూస్తే, జగన్ మాత్రం తక్కువ భూమితో, అత్యధిక పరిహారం ఇచ్చి ప్రాజెక్టు సాకారం చేశారు. – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎంవాస్తవ రూపంలోకి తెచ్చింది జగనేచాలామంది నేతల్లా శంకుస్థాపన రాయి వేసి వదిలేయకుండా, రూ.4,362 కోట్ల నిధులతో, నిర్వాసితులకు న్యాయం చేస్తూ పోర్టు పనులను వాస్తవ రూపంలోకి తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వాడుకుని 11 పోర్టులు నిర్మిస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందనే ముందుచూపు జగన్ది. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, శ్రీకాకుళంమాట మీద నిలబడని బాబు‘చెప్పాడంటే చేస్తాడు’ అనే క్రెడిట్ జగన్కే దక్కుతుంది. మాట తప్పడం చంద్రబాబు నైజం. 70 శాతం పనులు పూర్తయ్యాక వచ్చి, ఏమీ చేయకుండా కూర్చున్న కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. – మత్స్యలింగం, అరకు ఎమ్మెల్యేబాబాయి, అబ్బాయ్లదే పాపంవలసల జిల్లా శ్రీకాకుళంలో రూ.4,362 కోట్లతో పోర్టు తెచ్చి, 25 వేల మందికి ఉపాధి, అందులో స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా జగన్ జీఓ తెచ్చారు. కానీ కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న బాబాయి, అబ్బాయిలు క్రెడిట్ జగన్కు వెళ్తుందనే కుట్రతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త జగన్ గెలిస్తేనే జిల్లా అభివృద్ధికిడ్నీ ఆస్పత్రి, మంచినీరు, పోర్టు వంటి ప్రాజెక్టులతో జగన్ జిల్లాకు దిక్సూచిలా నిలిచారు. కూటమి పాలనలో ఒక్క మంచి పనీ జరగలేదు. మళ్లీ జగన్ను గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యం. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యేఅన్నీ అబద్ధాలే..కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించడం, క్రెడిట్ చోరీ మాత్రమే జరుగుతోంది. 71 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ సంస్థే చెబుతుంటే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. 40 ఏళ్లుగా మీ కుటుంబం జిల్లాకు చేసిందేమీ లేదు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్తబాబు చేసింది శూన్యంశ్రీకాకుళం అభివృద్ధికి కీలకమైన వంశధార, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీ, పోర్టు అన్నీ వైఎస్ జగన్ తెచ్చినవే. 17 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు జిల్లాకు ఇచ్చింది శూన్యం.– చింతాడ రవికుమార్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఈ పోర్టుజిల్లా ప్రజల చిరకాల వాంఛ మూలపేట పోర్టు. ఈ కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్దే. తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాన్ని వైఎస్ జగన్ మొదలుపెట్టారు. ప్రధానంగా 4 పోర్టుల నిర్మాణం, 8 ఫిషింగ్ హార్బర్స్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన వైఎస్సార్సీపీది. కూటమి నేతలు మూలపేట పోర్టును తామే నిర్మించామని ప్రగల్బాలు పలకడానికి సిగ్గులేదా..? – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుమూలపేట కీలకంమూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాల్సిన అవసరం ప్రతిపక్షాలపై ఉంది. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న శ్రీకాకుళం జిల్లా నుంచి దీనికి నాంది పలకడం చాలా సంతోషం. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్నా ఏ ఒక్క అభివృద్ధి పనికీ శ్రీకారం చుట్టకపోగా గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తిచేసేందుకు ముందుకు కూడా రాకపోవడం దారుణం. – బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ -
కోడిపుంజు గుడ్డు పెట్టింది.. గ్రామం మొత్తం షాక్!
శ్రీకాకుళం జిల్లా: ఎక్కడైనా కోడిపెట్ట గుడ్డు పెడుతుంది. అది సృష్టి ధర్మం కూడా. కానీ ఎల్ఎన్పేట మండలం బొర్రంపేటలో మాత్రం కోడిపుంజు గుడ్డు పెట్టడం విశేషం. సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న కోడిపుంజు గుడ్డు పెట్టడంతో సతీష్తో పాటు కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జన్యుపరమైన లోపాలతో ఇటువంటివి జరుగుతుంటాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..
‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ అప్డేట్స్.. వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభశ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని గల మూలపేట పోర్ట్ పనులు త్వరితగతన జరగాలని ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నౌపాడలో జరిగిన భారీ బహిరంగ సభ. ఈ సభకు భారీగా తరలివచ్చిన ఉత్తరాంధ్ర వాసులు. ధర్మాన ప్రసాదరావు కామెంట్స్..చిత్తశుద్ధి లేని ప్రభుత్వం నోరులని ప్రాంతాలకు అన్యాయం చేస్తోంది.అన్ని ప్రాంతాలకు సంపద సమానంగా పంపిణీ చేయాలి.టీడీపీ ప్రభుత్వం ఏనాడైనా శ్రీకాకుళం జిల్లాకు శాశ్వతమైన పనిచేసిందా?.ఎల్లో పత్రికలు పెట్టిన హెడ్డింగ్స్ చూసి ప్రజలు మోసపోతున్నారు.తరిమికొట్టే రోజు వచ్చినప్పుడే భయపడి అభివృద్ధి చేస్తారు.దిగజారి మూలపేట పోర్టు మేమే తెచ్చామని కేంద్రమంత్రి చెప్తున్నారు.మనం మౌనంగా ఉంటే మన జిల్లా అభివృద్ధిని పట్టించుకోరు.టీడీపీ ఎమ్మెల్యేలే రాక్షసుల్లా దాడులు చేస్తున్నారు.కూటమి ఎమ్మెల్యే దుర్మార్గాలు చూస్తే సిగ్గేస్తోంది.వైఎస్సార్సీపీ హయాంలో 30 లక్షల ఇళ్లు కట్టించాం.వైఎస్ జగన్ గొప్ప నాయకుడు, విశాలమైన భావాలున్న నాయకుడు. బొత్స సత్యనారాయణ కామెంట్స్..మూలపేట ఈ ప్రాంత అభివృద్ధి కాదు రాష్ట్ర మొత్తం అభివృద్ధి.దూరదృష్టితో పోర్టును వైఎస్ జగన్ నిర్మించారు..కూటమి ప్రభుత్వం పోర్టును పట్టించుకోలేదు.ప్రజల కష్టాలను పట్టించుకోలేదు..కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి సభ పెట్టడానికి వచ్చామురామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లి రీల్స్ తీసుకునేవారు.భోగాపురం ఎయిర్ పోర్టు వైఎస్ జగన్ కృషి కాదా?.కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్ జగన్ చేసిన మంచిని అచ్చెన్నాయుడు మర్చిపోయావా?.వైఎస్ జగన్ పనులను వారి మెప్పు కోసం ప్రచారం చేసుకుంటున్నారు..30 శాతం పనులను ఎందుకు పూర్తి చేయలేదు..కాంట్రాక్టర్కు మీకు సెట్టింగ్ కుదరలేదా?పోర్టును చూస్తే మీకు కలిగే ఇబ్బంది ఏమిటి?.వేరే వారికి పుట్టిన పిల్లలకు మీరు పెట్టవద్దు.రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం.అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు.రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకం కాదని ఎర్రం నాయుడు చెప్పారు.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..చంద్రబాబు వలనే పోర్ట్ పనులు జరుగుతున్నాయనడం టీడీపీ నేతల సిగ్గుచేటు.ఇలా మాట్లాడం అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు దివాలకోరు రాజకీయానికి నిదర్శనం.పాదయాత్ర సందర్భంగా జగన్ పోర్ట్ నిర్మాణం గురించి హామీ ఇచ్చారు..అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు..నేను పుట్టక ముందు నుంచి పోర్ట్ అంటూ చెపుతున్నారు..ఏ నాయకుడు నిర్మించ లేకపోయారు.వైఎస్ జగన్ వలన పోర్ట్ నిర్మాణం పూర్తి అయింది.శ్రీకాకుళం జిల్లాకు తీసుకువచ్చిన ఒక ప్రాజెక్ట్ గురించి బాబాయి అబ్బాయి చెప్పాలి..చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. శ్రీకాకుళానికి ఏం చేశారో చెప్పాలి?. శ్రీకాకుళం..ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..భావనపాడు పోర్టును నిర్మిస్తామని టీడీపీ నేతలు మోసం చేశారు..ఉత్తరాంధ్ర ప్రజలను ఓటు బ్యాంకుగా చంద్రబాబు చూశారు..దశాబ్దాల కలను వైఎస్ జగన్ నిజం చేశారుమూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వైఎస్ జగన్ నిర్మించారుచదువుకున్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. పాముల పుష్పశ్రీవాణి కామెంట్స్.. మూలపేట పోర్టు దశాబ్దల కల.ప్రజల కలను వైఎస్ జగన్ నిజం చేశారు..మూలపేట పోర్టు పనులను 70 శాతం పూర్తి చేశారు..30% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది.వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని చెప్పి పోర్ట్ నిర్మాణం పూర్తి చేయలేదు..ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పెద్దన్న పాత్ర వైఎస్ జగన్ పోషించారు.. పోలీసుల ఆంక్షలు..మూలపేట పోర్టును పరిశీలించవద్దంటూ పోలీసుల ఆంక్షలు.నౌపాడ జంక్షన్ వద్ద సభకు మాత్రమే అనుమతి.వైఎస్సార్సీపీ నేతల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు.నౌపాడ జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారికేడ్లు ఏర్పాట్లు. మూలపేట పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం: ధర్మాన కృష్ణదాస్ఏడాది కాలంలోనే 70 శాతం పనులు పూర్తి చేశాం.కూటమి వచ్చిన తర్వాత 30 శాతం పనులను కూడా చేయలేకపోయింది.వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర. విశాఖ:కురసాల కన్నబాబు కామెంట్స్...క్రెడిట్ చోరీలో చంద్రబాబు స్థాయి పెరిగింది..ఇప్పుడు క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు..బాబు ఏనాడైనా ఒక్క పోర్టు నిర్మాణం చేశాడా?చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు..వైఎస్ జగన్కు పేరు రాకూడదని కుట్ర చేస్తున్నారు..ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే మూలపేటకు వెళ్తున్నాం.రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ కామెంట్స్..ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టాలని జగన్ సంకల్పించారు..వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకు ఊపిరి పోశారు..ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ..మూలపేట పోర్టు కోసం పోరాటం చేస్తాం..అమరావతిపై పెట్టిన శ్రద్ద.. ఉత్తరాంధ్రపై ఎందుకు లేదు.. విశాఖ..ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..మూలపేట పోర్టు వైఎస్ జగన్ సంకల్పం..70 శాతం పనులు మా హయాంలో చేసాం..30 శాతం పనులు కూడా చేయకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు..వెనకబడిన శ్రీకాకుళం అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదు..ఎన్ని కుట్రలు చేసినా.. మూలపేట పోర్టు ఘనత జగన్నదే.. మూలపేట పోర్టుకు ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు..జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.. ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..నౌపాడ జంక్షన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..విశాఖ నుంచి మూలపేటకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు. మన మూలపేటకు పోదాం అనే కార్యక్రమాన్ని విచ్చిన్నం చేసే కుట్రలో ప్రభుత్వంవైఎస్సార్సీపీ నేతలు మూలపేట పోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు.పార్టీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు..నౌపాడ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారీకేడ్లు ఏర్పాటు..మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు..రోడ్డును టిప్పర్లతో బ్లాక్ చేసిన పోలీసులు.మన మూలపేట పోర్టుకు పోదాం నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు..ఎన్ని ఆంక్షలు పెట్టినా కార్యక్రమం విజయవంతం చేస్తానంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 👉రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు.👉మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు.👉అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. -
సపోర్టు ఇచ్చిందే వైఎస్సార్సీపీ
పోర్టు నిర్మాణంలో వాస్తవాలను వివరిస్తాం ● మూలపేట పోర్టు క్రెడిట్ కొట్టేయడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు ● పోర్టు పనుల ఘనత వైఎస్ జగన్దే ● నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు ● జనాలకు వాస్తవాలు చెప్పడానికి సిద్ధమవుతున్న నాయకులు – సాక్షి ప్రతినిధి శ్రీకాకుళంమూలపేట పోర్టు నిర్మాణంలో వాస్తవాలను ప్రజలకు వివరించడానికి మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని రకాల అనుమతులతో పోర్టు పనులు ప్రారంభించి, ఏడాది కాలంలో 70 శాతం పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కమిషన్ల లావాదేవీల కోసం కాలయాపన చేశారు. ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. జిల్లాలో వలసల నివారణ, యువతకు ఉపాధితో పాటు జిల్లాను ప్రపంచ పటంలో గుర్తించే విధంగా పోర్టుకు శ్రీకారం చుట్టిన గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే ఈ ఘనత అని నిరూపిస్తాం. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి ● వైఎస్సార్సీపీ ఉన్నప్పుడు రూ.4361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం కోసం 2023 ఏప్రిల్ 19వ తేదీన శంకుస్థాపన చేశారు. ● మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలకు పునరావాస కాలనీ, మౌలిక సదు పాయాల కోసం నౌపడ సమీపంలో రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రోడ్డు కోసం రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. ● రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను రైతుల అంగీకారంతో సేకరించారు. ● ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. ● కేవలం ఏడాది కాలంలోనే అనగా ఎన్నికల సమయానికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులతో పాటు కార్గో బెర్తుల నిర్మాణం, క్యాటింగ్ యార్డు నిర్మాణం, బ్లాచింగ్ చిప్స్ ప్లాంట్ నిర్మాణంతో పాటు డ్రెడ్జింగ్ పనులతో సహా 70 శాతం పనులు పూర్తి చేశారు. మరో వైపు రోడ్డు పనులు ప్రాథమిక స్థాయిలో పూర్తి చేశారు. పోర్టు పనులకు శంకుస్థాపన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్) -
అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పేద విద్యార్థులను కించపరిచేవిధంగా మాట్లాడిన గరికపాటి నరసింహారావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటును విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మిలు డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో గరికపాటి వ్యాఖ్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ల వల్ల వంట కార్మికులు ఉపాధి కోల్పోతారని, మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలలపై అసభ్యంగా మాట్లాడిన గరికపాటిపై ప్రభుత్వం, బాలల హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తర, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డి.చందు, ఖగేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, ఐద్వా నాయకురాలు టి.ప్రవీణ, యూనియన్ నాయకులు ఎ.రాధ, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా చెస్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలో కొత్తరోడ్లోని కాశ్యప్ నర్సింగ్ కళాశాల వేదికగా ఆదివారం జరిగిన జల్లాస్థాయి అండర్–9 చెస్ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు హాజరై ప్రతిభ కనబర్చారు. ఈ ఎంపిక పోటీల్లో బాలురు విభాగంలో అన్నెపు శశాంక్, శనుగును శివ, సనపల రిత్విక్సాయి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో లిపిక కారుణ్య, కొల్ల భవిష్య, రేష్మిక మొదటి మూడు స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న వీరంతా ఏప్రిల్ 18, 19 తేదీల్లో అన్నవరం వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి అండర్–9 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరుపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆలిండియా చెస్ ఆన్ స్కూల్ కమిటీ సభ్యుడు సనపల భీమారావు తెలిపారు. అంతకుముందు ఈ ఎంపిక పోటీలను తంగుడు సుధీర్ మొదటి ఎత్తువేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్, కార్యదర్శి జామి రమేష్, సంఘ ప్రతినిధులు, కోచ్లు పాల్గొన్నారు. జిల్లాకు ఇన్చార్జి మంత్రి కొండపల్లి రాక నేడు శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1.00 గంటకు విజయనగరం నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. జీరో పావర్టీ పీ–4 (పేదరిక నిర్మూలన) ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో విజయనగరం చేరుకుంటారని వివరించారు. -
రెండేళ్ల పాలనలో ఏం చేశారు..?
టెక్కలి, సంతబొమ్మాళి: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపునిచ్చే విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, జిల్లా పరిశీలకుడు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. సోమవారం సంతబొమ్మాళి మండలం నౌపడ సమీపంలో నిర్వహించనున్న ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ భారీ బహిరంగ సభ స్థలాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. గతంలో ఎంతో మంది నాయకులు ఈ ప్రాంతంలో పోర్టు కడతామని హామీలిచ్చి మరచిపోయారని గుర్తు చేశారు. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ హయాంలో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సుమారు రూ.4362 కోట్లతో అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించారని, ఎన్నికల సమయానికి 70 శాతం పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మాయ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారం దక్కించుకుని మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేదని ముత్యాలనాయుడు ఆరోపించారు. పోర్టు నిర్మాణంలో వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికే ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గం ప్రాంతంలో పోర్టు నిర్మాణం 70 ఏళ్లుగా కలగా మిగిలిపోయిందన్నారు. అలాంటి కలను సాకారం చేసే విధంగా గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న కూటమి నాయకులు రెండేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. 30 శాతం పనులు పూర్తి చేయలేకపోవడమే కాకుండా పోర్టు క్రెడిట్ను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మూలపేట పోర్టు మంజూరు కోసం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయం చేయాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో ఏడాది కాలంలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్కలి నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకులతో పాటు నారా లోకేష్ వరకు కమీషన్ల కోసం కక్కుర్తి పడడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. జిల్లాలో వలసల నివారణ, యువతకు ఉపాధి, జిల్లా అభివృద్ధి కోసం నిర్మాణం తలపెట్టిన పోర్టు పనులు పూర్తి చేసేందుకు నిర్వహిస్తున్న పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వీరితో పాటు జెడ్పీటీసీ పాల వసంత్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బి.మోహన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, నాయకులు పి.రవికుమార్రెడ్డి, ఎన్.భీమారావు, ఎస్.సత్యం, కె.సతీష్, జి.గురునాధ్యాదవ్, కె.అజయ్, ఎ.మురళి, కె.జీవన్, బి.రాజేష్, వి.శ్రీధర్రెడ్డి, బి.కార్తీక్, ఆర్.మురళీరెడ్డి తదితరులు ఉన్నారు. ఏడాదిలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే పోర్టు నిర్మాణంలో వాస్తవాలను ప్రజలకు వివరించడానికే కార్యక్రమం నౌపడ సమీపంలో సభా స్థలం పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులు నేడే ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ భారీ బహిరంగ సభ -
‘పోర్టు పేరుతో టీడీపీ నాయకులు పబ్బం గడుపుకున్నారు’
టెక్కలి: జిల్లాలో పోర్టు నిర్మాణం పేరుతో ప్రజల్ని ఊరిస్తూ టీడీపీ నాయకులు దశాబ్దాల కాలంగా పబ్బం గడుపుకుని అధికారం వెలగబెట్టుకున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై ఆయన మాట్లాడారు. దివంగత ఎర్రంన్నాయుడు నుంచి ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు సైతం భావనపాడులో పోర్టు కడతామంటూ ఏళ్ల తరబడి ఓటు రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. వైఎస్సార్సీపీ హయాంలో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సంకల్పించి మూలపేటలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అప్పలరాజు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూలపేట పోర్టు క్రెడిట్ను దోచుకునే విధంగా టీడీపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వీటిని తిప్పికొట్టడానికి మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ (భూ సమస్యలపై) సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు నేరుగా లేదా ఆన్లైన్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయడమైనదని, ఈ అవకాశాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో భాగంగా తాపీపని చేస్తున్న బార రామారావు (45) విద్యుత్ ఘాతానికి గురై ఆదివారం మృతి చెందాడు. పని చేస్తున్న సమయంలో పైన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య బార్ అప్పన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి గార: మండలంలోని వత్సవలస రాజమ్మ తల్లి జాతరకు వెళ్తూ ఆర్టీసీ బస్సు చక్రాలు కిందపడి మహిళ మృతి చెందింది. జి.సిగ డాం మండలం ఎస్పీ రామచంద్రాపురాని (అగ్రహారం)కి చెందిన ముగుడ కనక (50) కుమారుడు కవిలేశు స్కూటీపై ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీకూ ర్మం మీదుగా వత్సవలస వెళ్తున్నారు. తండ్యాలపేట గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఎదురు గా వస్తున్న ఆర్టీసీ బస్సు స్కూటీకి తగిలింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న కవిలేశు పక్కకు పడిపోగా, తల్లి కనక రోడ్డుపై పడిపోవడంతో తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెనుక చక్రం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కనక భర్త గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కవిలేశు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలుగు చంద్రమోహన్ తెలిపారు. స్కూటీ అదుపుతప్పి మహిళ మృతి పోలాకి: మండలంలోని సుసరాం ర్యాంపుల వద్ద స్కూటీ అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో ఉర్జాం గ్రామానికి చెందిన సంపతిరావు తేజ అనే మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. మరో మహిళతో కలిసి ఒక ఫంక్షన్లో మెహందీ పెట్టేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలం వద్ద నుంచి పోలీసుల సహకారంతో నరసన్నపేట ఆస్పత్రికి తరలించగా, అప్పటికే తేజ మృతి చెందింది. మృతురాలి భర్త ప్రకాశ్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, అతనికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో మెహందీ పెట్టేందుకు తేజ వెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
దాచేస్తే దాగని నిజం.. మూలపేట పోర్టు ఘనత వైఎస్ జగన్దే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటినుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు. అనంతరంవచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
వైఎస్సార్సీపీ మూలపేట పోర్టు పర్యటనకు పోలీసుల అడ్డంకులు
సాక్షి, శ్రీకాకుళం: ‘‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’’ కార్యక్రమంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. రేపు(మార్చి 30 సోమవారం) చలో మూలపేట పోర్టు కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.మూలపేట పోర్టుకు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. న్యాయబద్ధమైన కార్యక్రమాన్ని కూటమి సర్కార్ అడ్డుకుంటోంది. అనుమతులు లేవంటూ వైఎస్సార్సీపీ నేతలకు ఫోన్ల ద్వారా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చెత్త శుభ్రం చేసిన కలెక్టర్
ఆమదాలవలస: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని అక్కులపేట, దూసి, తొగరాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. పీహెచ్సీలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెడికల్కు సంబంధించిన వ్యర్థాలను వేరు చేసి డస్ట్బిన్లో వేయాలని సూచించారు. తొగరాం స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతంలో పిచ్చి మొక్కలు, చెత్త తొలగించారు. -
భారీగా గంజాయి స్వాధీనం
నరసన్నపేట: ఒడిశా నుంచి తమిళనాడులోని తిరువూర్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అజిత్కుమార్, గోకుల్ శక్తివేల్లను నరసన్నపేట పోలీసు లు శనివారం అరెస్టు చేశారు. మడపాం టోల్గేట్ వ ద్ద నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వాహనంలో వెళ్తున్న అజిత్కుమార్ పట్టుబడినట్లు సీఐ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఈయన వద్ద 12.550 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళంకు చెందిన అజిత్కుమార్ ఒక ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తుండగా అదే కంపెనీలో పనిచేసే పద్మచరణ్ దిగల్ బత్తుతో పరిచయం ఏర్పడింది. ఈయన సహకారంతో అజిత్కుమార్ భువనేశ్వర్లో తక్కువ ధరకు గంజాయి కొని తమిళనాడులోని తిరువూర్ ప్రాంతంలో అధిక ధరలకు విక్రయాలు చేయడం ప్రారంభించాడు. మంచి ఆదాయం వస్తుండటంతో ఈ నెల 21న తిరువూర్ నుంచి బయల్దేరి పద్మచరణ్ సూచించిన వ్యక్తి వద్దకు వెళ్లి తన స్నేహితుడు గోకుల్ శక్తివేల్తో కలసి గంజాయి కొనుగోలు చేసి తిరిగి తిరువూర్ వెళ్తుండగా మడపాం వద్ద శనివా రం పట్టుపడినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్ట్ ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి తమిళనాడుకు 3.060 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నం నాయుడు తెలిపారు. పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం సీఐ విలేకరులతో మాట్లాడారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడులోని కాంచీపురం జిల్లా వలజబాద్కి చెందిన నాగరాజుమురుగన్, రాజీలు గంజాయితో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయి, ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు.వీరిని విచారించగా ఒడిశా సమంతపూర్ చంచలకులో గ్రామానికి చెంది న బరుజోదోళాయి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకి తీసుకెళ్తుండగా పోలీసుల కు పట్టుబడినట్లు సీఐ వెల్లడించారు. పట్టణ ఎస్ఐ ముకుందరావు, క్రైమ్ సిబ్బంది ఉన్నారు. రెండు కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు ఆమదాలవలస: బీఆర్ నగర్ సమీపంలో రెండు కేజీల గంజాయితో పట్టుబడిన ఆమదాలవలస పట్టణానికి చెందిన సయ్యద్ తాహిర్, మన్యాల నరేష్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సనపల బాలరాజు తెలిపారు. గంజాయి సేవిస్తున్న అందిన పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. వీరి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. -
12వ పీఆర్సీ అమలు చేయాలని వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో 12వ పీఆర్సీని అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు కావస్తున్నా కొత్త పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రూ.30 వేల కోట్ల పైబడి బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉందని చెబుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలు, సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమాంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, జిల్లా సహాధ్యక్షుడు వై.ఉమాశంకర్, జిల్లా కార్యదర్శి బి.రవికుమార్, జి.సురేష్, జిల్లా నాయకులు బి.శ్యాం, వైకుంఠరావు, ఎల్.అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మందస : కార్గో ఎయిర్పోర్టు వల్ల విలువైన భూములను కోల్పోయి రోడ్డున పడతామని మందస మండలం రాంపురం పంచాయతీ రాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ సచివాలయం, తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిర్పోర్టు వల్ల గ్రామంలో 115 మంది రైతులకు చెందిన దాదాపు 200 ఎకరాల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని, ఉపాధి కోల్పోయి కోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సేకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తమ సేవలందించిన మార్గదర్శకులకు ఈనెల 30న సత్కరించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం వెల్లడించారు. జీరో పోవర్టీ పి–4 కార్యక్రమం ద్వారా మార్గదర్శులు బంగారు కుటుంబాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం మార్చి 30 నాటికి సంవత్సరం పూర్తిచేసుకుంటోందన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన, అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలో శాసన సభ్యుల అధ్యక్షతన సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
నిజాలు చెప్పేందుకే పోర్టుకు పోదాం
● జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ ఇచ్చిన గొప్ప కానుక మూలపేట పోర్టు ● 30న పోర్టుకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ టెక్కలి, సంతబొమ్మాళి: దశాబ్దాల పాలనలో టీడీపీ జిల్లాకు చేయలేని పనులు వైఎస్ జగన్ ఐదేళ్లలో చేసి చూపించారని, జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ ఇచ్చిన గొప్ప కానుక మూలపేట పోర్టు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షు డు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన శనివారం నౌపడ మూడు రోడ్లు జంక్షన్లో గల బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా అభివృద్ధికి రూ.4361కోట్లతో మూలపేట పోర్టు ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని, కూటమి అధికారంలోకి వచ్చాక పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. పనులు చేయకపోగా.. పోర్టు చంద్రబాబు కృషి ఫలితంగా వచ్చిందంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పోర్టు నిర్మాణంపై నిజానిజాలు ప్రజలకు చెప్పేందుకు ఈ నెల 30న పోర్టుకు పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ... దశాబ్దాలుగా జిల్లాను పాలించిన టీడీపీ ఈ జిల్లా ప్రజలకు ఏం చేశారో ప్రశ్నించాలన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారని, వారు జిల్లాకు ఎన్ని ప్రాజెక్టులు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇతర జిల్లాల తో అభివృద్ధిలో పోటీ పడాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దీనిపై టీడీపీ క్రెడిట్ చోరీ చేయడం సిగ్గు చేటన్నారు. పోర్టుకు పోదాం బలప్రదర్శన కాదని, వాస్తవ పరి స్థితులు ప్రజలకు వివరించడానికి అని తెలిపారు. వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరా తిలక్ మాట్లాడుతూ... గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని రకాల అనుమతులతో పోర్టు పనులు ప్రారంభించి, ఏడాది కాలంలో 70 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కాలయాపన చేశారని దుయ్యబట్టారు. శాంతియుతంగా పరిశీలన కార్యక్రమం చేపడుతున్నామని, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పోర్టు పేరుతో సుమారు 36 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 30న జరగనున్న కార్యక్రమానికి పోలీసులు సహకరించాలని, దీన్ని ఉద్యమంగా మార్చొద్దని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, వైఎస్సార్ సీపీ ఇచ్ఛాపురం, ఆమదాలవలన నియోజకవర్గ ఇన్చార్జిలు సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, చింతాడ రవికుమార్, టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకులు చల్లా రవికుమార్, దుంపల లక్ష్మణరావు, ఎన్ని ధనుంజయ్, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయిసురేష్కుమార్, సీనియర్ నాయకులు అంబటి శ్రీను, సనపల నారాయణరావు, పిన్నింటి సాయికుమార్, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, పాలిన శ్రీనివాస్, ఆరంగి మురళి, నర్తు నరేంద్ర, టెక్కలి, కోటబొమ్మాళి జెడ్పీటీసీలు దువ్వాడ వాణి, దుబ్బ వెంకట్రావు, పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులు బి.మోహన్రెడ్డి, హెచ్.వెంకటేశ్వర్రావు, ఎస్.హేమసుందర్రాజు, టి.ఫల్గుణరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, కంచిలి ఎంపీపీ పి.దేవదాస్రెడ్డి, ఎస్.సత్యం, జి. గురునాద్ యాదవ్, పి.రాజా, పి.రవికుమార్రెడ్డి, కె.సతీష్, కె.అజయ్, ఉంగ సాయి, శిష్టు గోపి, టి.కిరణ్, ఎన్.భీమారావు తదితరులు పాల్గొన్నారు. -
డీబీసీ టు ఏబీసీ
● కర్నూలులో జరిగిన అక్రమాలపై చర్యలు ● జిల్లాలో అక్రమాలపై ఉన్నతాధికారుల విచారణ ●జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధకు డిమోషన్శ్రీకాకుళం పాతబస్టాండ్: లంచాలు తీసుకోవడం, కిందిస్థాయి సిబ్బందిని ఇంటి పనికి పెట్టుకోవడం, ప్రతి పనికీ డబ్బు లు అడగడం, అక్రమాలపై రాజకీయ అండతో కప్పిపుచ్చుకోవడం.. ఏళ్లకు ఏళ్ల పాటు సాగిన ఈ తంతుకు ఎట్టకేలకు తెరపడింది. జిల్లా బీసీ సంక్షేమాధికారి అనురాధ అక్రమాలపై ఎట్టకేలకు ఉన్నతాధికారుల విచారణ పూర్తయ్యింది. ఆమె హోదా తగ్గించడమే కాకుండా పీలేరుకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి(డీసీబీ) అనురాధపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. అనురాధపై ఇదివరకే లెక్క లేనన్ని ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి ఉద్యోగులను అవమానపరిచినట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. తనపై వచ్చిన అభియోగాలపై విచారణ జరగకుండా జిల్లాకు చెందిన మంత్రి పీఏతో ఒత్తిడి తెచ్చుకొని తప్పించుకున్న ఆమె.. ఈ సారి మాత్రం తప్పించుకోలేకపోయారు. తాజాగా విజయవాడ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.మల్లికార్జునరావు ఈమెకు డిమోషన్ ఇచ్చారు. అంతేకాకుండా బదిలీ చేస్తూ ఈ నెల 25న ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం డీబీసీడబ్ల్యూఓగా ఉన్న ఈమెను ఏబీసీడబ్ల్యూఓ(సహాయ బీసీ సంక్షేమాధికారి)గా హోదాను తగ్గించారు. నాలుగేళ్ల పాటు డీబీసీడబ్ల్యూఓగా పనిచేసిన ఈమెను తిరిగి ఏబీసీడబ్ల్యూఓగా నియమించడం పరాభవంగానే చెప్పాలి. ఆమెను ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పీలేరు ఏబీసీడబ్ల్యూఓగా బదిలీ చేశారు. అనురాధ కర్నూలు జిల్లాలో ఏబీసీగా పనిచేసిన కాలంలో అవినీతి, అక్రమాలు, పర్యవేక్షణ లోపం, లంచాలు ఇతర అంశాలపై ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని విచారించాక డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ విచారణ చేసి ఆమెను డీబీసీడబ్ల్యూఓ నుంచి ఏబీసీడబ్ల్యూఓగా వెనక్కి పంపించాలని నిర్ణయించారు. కర్నూలు నుంచి ఆమె తాత్కాలిక పదోన్నతి పద్ధతిలో నాలుగేళ్ల కిందట శ్రీకాకుళం డీబీసీడబ్ల్యూఓగా బదిలీపై వచ్చారు. ఇచ్ఛాపురానికి చెందిన శాసన సభ్యుడి అండదండలు అందడంతో ఈమె అక్రమాలు పెచ్చుమీరాయి. విజయవాడలో జిల్లాకు చెందిన మంత్రి పీఏతో ఆర్థిక లావాదేవీలు జరిపేవారన్న అభియోగాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే తనపై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ తొక్కి పెట్టి ఉంచడంతో ఇంతవరకు ఆమె ఆటలు సాగాయి. ఎట్టకేలకు కర్నూలు అక్రమాలపై విచారణ పూర్తి కావడంతో చర్యలకు ఉపక్రమించారు. ఆమె జిల్లాకు డీబీసీడబ్ల్యూఓగా వచ్చి నాలుగేళ్లు అవుతోంది. జిల్లాలోనూ ఆమైపె అనేక ఆరోపణ లు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది సైతం ఆమైపె పలు రకాల ఫిర్యాదులు చేశారు. రాజకీ య నాయకుల అండతో వాటిని తొక్కిపెట్టి నెట్టుకొచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లోనూ, కింది స్థాయి సిబ్బంది పదోన్నతులలోనూ రూ.లక్షల్లో చేతులు మారాయన్న అభియోగాలు ఉన్నాయి. అలాగే ప్రతి వసతి గృహం నుంచి ప్రతి నెల పిల్లల సంఖ్యను బట్టి నెల వారీ వసూలు చేస్తున్నట్టు, ఇటీవల జరిగి ఏసీబీ దాడుల్లో బయట పడింది. దీనిపై ఇంచా విచారణ సాగుతోంది. ఈ విచారణ పూర్తయితే మరోసారి ఈమైపె శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాకు వచ్చిన తర్వాత బొడ్డేపల్లి రాజగోపాలరావు శత జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ఇచ్చి న నిధులు రూ.లక్షల్లో కాజేశారని అప్పట్లో బీసీ సంఘాల వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. నాలుగేళ్లలో శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ఇచ్చిన ప్రమోషన్లు, బదిలీలు, డిప్యూటేషన్ల పేరుతో అవినీతి, అక్రమంగా శాంతి నగర్లో రూ. కోటి విలువైన ఆస్తులు సంపాదించినట్టు ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే బీసీ సంక్షేమ శాఖ కింది స్థాయి సిబ్బందిని తన ఇంటి వద్ద పనులకు వినియోగించుకుంటారనే అపవాదు కూడా ఉంది. జిల్లాలో జరిగిని అవినీతిపై విచారణ పూర్తయితే ఈమైపె మరిన్ని చర్యలు ఉంటాయని తెలుస్తోంది. -
శ్రీకాకుళం బాలిక కేసులో ట్విస్టులు.. నిందితుడి కూతురే డాక్టర్..
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి అరెస్ట్పై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలిని బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే, నిందితుడు సివిల్ ఇంజినీర్ వెంకటరమణకు భారీగా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉందని బాధితులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కేసు మలుపు తిరుగుతుందేమోనని భయం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి విషయంలో కూడా జీజీహెచ్లో నిందితుడి కూతురు వైద్యురాలి ఉండటంతో పోస్టుమార్టం రిపోర్ట్ మార్పిడి ప్రయత్నాలపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్బంగా బాధితురాలి పేరెంట్స్ మాట్లాడుతూ..‘నా కూతురికి న్యాయం చేయాలి. న్యాయం జరగకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. నిందితుడికి ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.జరిగింది ఇది.. శ్రీకాకుళం జిల్లాలో హిరమండలంలో ఓ గ్రామానికి చెందిన దంపతుల ఏకైక కుమార్తె(17) విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది. స్థానికంగా సివిల్ ఇంజినీరుగా పని చేస్తున్న వెంకటరమణ.. ‘అమ్మాయికి పాఠాలు చెబుతాను.. నా వద్దకు పంపండి’ అని తల్లిదండ్రులను ఒప్పించాడు. కుమార్తె భవిష్యత్తు బాగుండాలని ఆశించిన వారు నమ్మకంతో అందుకు అంగీకరించారు. ఈ నెల 22న బాలికను శ్రీకాకుళం తీసుకురావాలని వెంకటరమణ సూచించడంతో తండ్రి స్వయంగా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక తాను శ్రీకూర్మంలో ఉన్నానని.. ఇక్కడికి రావాలని వెంకటరమణ ఫోన్లో చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి శ్రీకూర్మం వెళ్లారు. బాలికను అక్కడే ఉంచిన వెంకటరమణ.. తండ్రిని వెనక్కి పంపేశాడు.అనంతరం, ఈ నెల 23న బాలికను విశాఖలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి పైశాచికంగా దాడి చేశాడు. ‘మీ కుమార్తె అనారోగ్యానికి గురైంది’ అంటూ 24న తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారికి బాలికను అప్పగించడంతో స్వస్థలానికి తీసుకెళ్లారు. అప్పటికీ ఆమె కొనఊపిరితో ఉన్నప్పటికీ... ‘మీ కుమార్తె చనిపోయింది. అందుకు నేనే కారణం. ఈ విషయం బయటకు చెప్పకుండా దహన సంస్కారాలు నిర్వహించండి. మీకు డబ్బు ఇస్తాను’ అని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. కొనఊపిరితో ఉన్న కుమార్తెను వారు శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి బుధవారం తీసుకొచ్చారు. ‘చదువు చెబుతానంటే నమ్మి పంపించాం. మా బిడ్డను చంపేశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించండి. న్యాయం చేయండి’ అని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
శ్రీకాకుళం
● సీతారామం శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026శ్రీకాకుళం నగరంలోని కోదండరామాలయంలో కల్యాణశోభవరుడు.. రఘుకుల తిలకుడు.. వధువు.. భూమాత కూతురు. వేద మంత్రాల మధ్య వేదికలు అయోధ్యలా మారాయి. పెళ్లి సందడితో ఆలయాలు వివాహ మండపాలుగా కనిపించాయి. జానకి రాముల పరిణయ ఘట్టాన్ని తిలకించే భాగ్యం పొందిన భక్తులు తన్మయత్వంలో మునిగారు. శ్రీరామనవమి సందర్భంగా ఊరూరా రామాలయాల్లో సీతారాముల పెళ్లి జరుపుకున్నారు. వడపప్పు, పానకం పంచి పెట్టి సంబరం చేశారు. -
భూవివాదంలో నలుగురికి గాయాలు
రణస్థలం : లావేరు మండలం కొత్తకోట పంచాయతీ బట్టుపాలెం గ్రామంలో శుక్రవారం మధ్యాహం భూమి విషయమై రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్ శివంగం నాగరాజు, అతని కుమారుడు చైతన్య, తల్లి బుల్లెమ్మ, సోదరుడు కుమారుడు సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ కుటుంబాన్ని అంతమొందించడానికే కొందరు నెల్లిమర్ల నుంచి వచ్చారని నాగరాజు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. రిమ్స్ నుంచి వచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇరువర్గీయులపై కేసు నమోదు చేస్తామని లావేరు ఎస్సై కె.అప్పలసూరి తెలిపారు. -
సిరి కల్యాణపు బొట్టును పెట్టి..!
కల్యాణం వీక్షిస్తున్న భక్తులు శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల పరిణయ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాల నడుమ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి పులకించిపోయారు. అంతకుముందు రామాలయాలు, రామమందిరాల వద్ద వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధనలు, కోలాట భజనలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. – శ్రీకాకుళం కల్చరల్/వజ్రపుకొత్తూరు రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
రెవెన్యూ క్రీడా పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్: క్రీడలతో ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026ను శుక్రవారం ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్లతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కోడి రామమూర్తి స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ క్రీడల కలెక్టరేట్ యూనిట్, శ్రీకాకుళం డివిజన్ యూనిట్, టెక్కలి డివిజన్ యూనిట్, పలాస డివిజన్ యూనిట్ సభ్యులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్కుమార్, శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆర్డీఓలు కె.సాయి ప్రత్యూష, ఎం.కష్ణమూర్తి, ఆర్.అప్పలరాజు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సూర్యనారాయణ, సివిల్ సప్లయ్ డీఎం టి.వేణుగోపాల్, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎం.లావణ్య, ఏపీఆర్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ వి.వి.ఎన్.రాజు, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ ఐ.లింగ రాజు, ట్రెజరర్ మురళీధర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల సమస్యలపై సైకిల్యాత్ర
మందస : మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదించేందుకు ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు 700 కిలోమీటర్లు మేర సైకిల్యాత్ర చేపడుతున్నట్లు కవిటి మండలం కపాసుకుద్ధి గ్రామానికి చెందిన గుడార ప్రసాద్ తెలిపారు. డొంకూరులో ఈ నెల 13న ప్రారంభమైన యాత్ర శుక్రవారం గెడ్డవూరు గ్రామ తీరానికి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 55 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశానని, తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారుల సమస్యలను తెలుసుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు ప్రసాద్ను అభినందించారు. -
మాజీ స్పీకర్ తమ్మినేనికి పరామర్శ
ఆమదాలవలస: మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం చేతికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఆమదాలవలసలోని తమ్మినేని స్వగృహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పార్టీకి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. పరామర్శించిన వారిలో పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ ఆరంగి మురళి, పార్టీ నాయకుడు పొందర అప్పన్న, తదితరులు ఉన్నారు. -
వణికించిన వడగళ్లు
● రబీ వరి పంటపై తీవ్ర ప్రభావం ● పలుచోట్ల నేలవాలిన పైరు ● రాలిన మామిడిపిందెలు సారవకోట/మెళియాపుట్టి: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వాన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రబీ వరి పంటతో పాటు మామిడి, మిరప సాగులపై అకాల వాన తీవ్ర ప్రభావం చూపుతోంది. సారవకోట మండలంలోని పొప్పంగి సమీపంలో రంగసాగరం ఆయకట్టును నమ్ముకుని ఈ ఏడాది రబీలో స్థానిక రైతులు వరి సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పంట దిగుబడి బాగా తగ్గింది. గత ఏడాది కరాకు సుమారు 35 నుంచి 40 బస్తాలు రాగా, ఈ ఏడాది పొల్లు గింజలు అధికంగా కనిపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా వరి పంటకు సుమారు 8 నుంచి 10 బస్తాల వరకు పొల్లు గింజలు వచ్చాయని సారవకోట, గొర్రిబంద గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగసాగరం ఆయకట్టు ప్రాంతంలోని జగన్నాథపురం, జగ్గయ్యపేట, బురుజువాడ, రైవాడ, కొత్తూరు, అగదల, సవరపేట, సారవకోట, గోపాలపురం, వండానవలస తదితర గ్రామాలలో ఈ ఏడాది సుమారు 2000 ఎకరాలలో వరి సాగు చేశారు. ఈ తరుణంలో గురువారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో కోత దశకు వచ్చిన పంట చాలా వరకు నేల రాలిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా వడగళ్లు పడటంతో పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పొల్లు గింజల వల్ల దిగుబడి తగ్గిపోగా తాజాగా వడగళ్ల వానతో పంట నేల రాలి పోయిందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు 82 కేజీల ధాన్యాన్ని రూ.1200కే దళారులు కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. మెళియాపుట్టి మండలం జోడూరు గ్రామానికి చెందిన కమిరి సోమేశ్వరరావు, బి.ధర్మారావులకు చెందిన మిరప, నువ్వు, మామిడి పంట అంతా రాలిపోయింది. అధికారులు పరిశీలించి నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నేలవాలింది.. గురువారం కురిసిన వడగళ్ల వానతో వరి పంట చాలా వరకు నేలవాలింది. ఇంత వరకు ఎన్నడూ చూడని విధంగా వడగళ్లు పడ్డాయి. ఈ ఏడాది పొల్లు గింజలు అధికంగా రావడంతో దిగుబడి బాగా తగ్గింది. – చెంచల చంద్రరావు, రైతు, గొర్రిబంద, సారవకోట మండలం -
రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు రేపు
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రగ్బీ జిల్లా జట్లు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.పార్వతీశం, ఆర్గనైజర్ బి.నారాయణరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెన్ అండ్ ఉమెన్ కేటగిరిలో నిర్వహిస్తున్న ఎంపికల్లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8500007272, 7842423423 నంబర్లకు సంప్రందించాలని కోరారు. 108లో గిరిజన గర్భిణి ప్రసవం కొత్తూరు: చిన్నరాజపురం గ్రామానికి చెందిన 26 ఏళ్ల గిరిజన మహిళ సవర జ్యోతి నిండు గర్భిణి. శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కొత్తూరు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది చేరుకొని గర్భిణిని హిరమండలం పీహెచ్సీకి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో హిరమండలం పీహెచ్సీలో చేర్చించినట్లు ఈఎంటీ ఎం.కృష్ణ, పైలట్ గోవిందరావు తెలిపారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని గొంటివీధి సమీపంలో ఓ ప్లై వుడ్ ఎంటర్ప్రైజెస్ దుకాణంలో శుక్రవారం వేకువఝామున విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపాడురోడ్డులోని కిల్లిపాలెం యూనియన్ బ్యాంకు సమీపంలో అద్దె ఇంట్లో 62ఏళ్ల వృద్ధుడు దుర్గ విజయ్కుమార్ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నాడు. గొంటివీధిలో అద్దెషాపులో ప్లై వుడ్, ఫర్నిచర్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున 2.05 గంటలకు షాపులో అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం అందడంతో సిబ్బందిని పంపించి మంటలను అదుపు చేశామని ఏడీఎఫ్వో శ్రీనుబాబు తెలిపారు. ఇన్వాల్వ్డ్ మెటీరియల్, డ్రెస్సింగ్ టేబుల్ మెటీరియల్, గ్లాస్, కంప్యూటర్, ప్రింటర్, రివాల్వింగ్ కుర్చీలు, ఫర్నిచర్ మెటీరియల్ కాలి బూడిదయ్యాయని చెప్పారు. బ్యాంకు రుణాలతో గొంటివీధి, న్యూకాలనీలో అద్దె షాపులు నడుపుతున్నానని, ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని, కుమార్తెలకు వివాహం చేయాల్సిన సమయంలో ఈ కష్టమొచ్చిందని బాధితుడు వాపోయాడు. హోటళ్లలో విజిలెన్స్ దాడులు పొందూరు: మండలంలోని పలు హోటళ్లలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా ఏడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై 6ఏ కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్ఐ రామారావు తెలిపారు. తనిఖీల్లో ఇన్చార్జి ఆర్ఐ జగదీష్, వీఆర్వో రేవతిరావు, సిబ్బంది పాల్గొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి నరసన్నపేట: మండల పరిధిలోని కామేశ్వరిపేట, దాసరివానిపేట వద్ద రైల్వేలైన్పై శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆమదాలవలస రైల్వే హెచ్సీ మధుసూదనరావు తెలిపిన వివరాలు మేరకు.. కామేశ్వరిపేట వద్ద వంశధార వంతెనపై ట్రాక్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తున్న తిలారుకు చెందిన కోట అప్పారావు(29) ప్రమాదవశాత్తూ ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. అలాగే దాసరివానిపేట వద్ద జరిగిన మరో ప్రమాదంలో గుర్తు తెలియని రైలు ఢీకొని గంజాం జిల్లా కాలీకట్ ప్రాంతానికి చెందిన ఎస్.బి.పాణిగ్రహి(35) మృతి చెందాడు. ఈ రెండు ప్రమాదాలపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాకుళం రిమ్స్కు తరలించామని హెచ్సీ తెలిపారు.


