గత ప్రభుత్వంలో ప్రియాగ్రహారం ఉన్నత పాఠశాలలో నాడు–నేడులో భాగంగా రూ.1.3కోట్ల నిధులతో పాఠశాల స్వరూపాన్నే మార్చేశాం. జూనియర్ కళాశాలను మరో రూ.80లక్షలతో అభివృద్ధి చేశాం. ఇప్పుడు కేవలం వాటికి ప్రహరీ నిర్మాణం చేపట్టి టీడీపీ నాయకుల పేర్లు పెట్టుకోవటం క్రెడిట్ చోరీ తప్ప మరేమీ కాదు. – సుంకరి ప్రసాదరావు, ఎంపీటీసీ సభ్యుడు, ప్రియాగ్రహారం.
గరిమెళ్లను అవమానించడమే..
ప్రియాగ్రహారంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముఖద్వారంపై టీడీపీ నాయకుల పేర్లు పెట్టడం అంటే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ల త్యాగాన్ని అవమానించడమే. ఇప్పటికే అక్కడ జూనియర్ కళాశాలకు గరిమెళ్ల పేరు వుంది. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత పాఠశాలకు సైతం అధికారికంగా గరిమెళ్ల పేరును పెట్టిస్తాం.
– డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య, జెడ్పీటీసీ సభ్యుడు, పోలాకి


