మూడెకరాల్లో అగ్ని కీలలు | - | Sakshi
Sakshi News home page

మూడెకరాల్లో అగ్ని కీలలు

Apr 5 2026 9:18 AM | Updated on Apr 5 2026 9:18 AM

మూడెకరాల్లో అగ్ని కీలలు

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా కేంద్రం సమీపంలో నవభారత్‌ కూడలి హైవే రహదారిని ఆనుకొని పల్లపు ప్రాంతంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు మూడు ఎకరాల్లో నీలగిరి మొక్కలున్న ప్రాంతంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తకుప్పలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టం ఏమీ జరగలేదన్నారు. మధ్యాహ్నం 1.35 గంటలకు హైవేలో వెళ్తున్న ఓ వ్యక్తి కాల్‌ చేయడంతో ఘటనాస్థలికి సిబ్బందితో వెళ్లి మంటలు అదుపుచేశామన్నారు. అప్పటికే దట్టమైన పొగలు అలుముకోవడంతో వాహనచోదకులకు ఇబ్బంది కలిగిందన్నారు. దాదాపు రెండు గంటల పాటు మంటలు వ్యాపించాయని స్థల యజమాని మొదలవలస కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement