ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు.. | YSRCP Leaders Mulapeta Port Visit Program Updates | Sakshi
Sakshi News home page

ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..

Mar 30 2026 9:03 AM | Updated on Mar 30 2026 10:20 AM

YSRCP Leaders Mulapeta Port Visit Program Updates

‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ అప్‌డేట్స్‌..

విశాఖ:

  • కురసాల కన్నబాబు కామెంట్స్‌...
  • క్రెడిట్ చోరీలో చంద్రబాబు స్థాయి పెరిగింది..
  • ఇప్పుడు క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు..
  • బాబు ఏనాడైనా ఒక్క పోర్టు నిర్మాణం చేశాడా?
  • చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు..
  • వైఎస్‌ జగన్‌కు పేరు రాకూడదని కుట్ర చేస్తున్నారు..
  • ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే మూలపేటకు వెళ్తున్నాం.

రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ కామెంట్స్‌..

  • ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టాలని జగన్ సంకల్పించారు..
  • వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకు ఊపిరి పోశారు..
  • ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ..
  • మూలపేట పోర్టు కోసం పోరాటం చేస్తాం..
  • అమరావతిపై పెట్టిన శ్రద్ద.. ఉత్తరాంధ్రపై ఎందుకు లేదు..

 

విశాఖ..

  • ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్‌..
  • మూలపేట పోర్టు వైఎస్ జగన్ సంకల్పం..
  • 70 శాతం పనులు మా హయాంలో చేసాం..
  • 30 శాతం పనులు కూడా చేయకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు..
  • వెనకబడిన శ్రీకాకుళం అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదు..
  • ఎన్ని కుట్రలు చేసినా.. మూలపేట పోర్టు ఘనత జగన్నదే..
     
  • మూలపేట పోర్టుకు ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలు..
  • జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు..

 

ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..

  • నౌపాడ జంక్షన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..

  • విశాఖ నుంచి మూలపేటకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నేతలు. 

  • మన మూలపేటకు పోదాం అనే కార్యక్రమాన్ని విచ్చిన్నం చేసే కుట్రలో ప్రభుత్వం

  • వైఎస్సార్‌సీపీ నేతలు మూలపేట పోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు.

  • పార్టీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు..

  • నౌపాడ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారీకేడ్లు ఏర్పాటు..

  • మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు..

  • రోడ్డును టిప్పర్లతో బ్లాక్ చేసిన పోలీసులు.

  • మన మూలపేట పోర్టుకు పోదాం నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు..

  • ఎన్ని ఆంక్షలు పెట్టినా కార్యక్రమం విజయవంతం చేస్తానంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు..

నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’  

  • మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్‌సీపీ నేతలు సిద్ధమయ్యారు.

  • ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్‌ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

  • వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్‌ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.  


👉రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్‌ జగన్‌ 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో  వైఎస్‌ జగన్‌ తన పాలనలో  సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్‌ 19న శంకుస్థాపన చేశారు.

👉మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు.

👉అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్‌ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్‌సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్‌లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement