నాటిక పోటీల బ్రోచర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

నాటిక పోటీల బ్రోచర్‌ ఆవిష్కరణ

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

కవిటి: మండలంలోని బొరివంకలో కళింగ సీమ కళాపీఠం సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల ద్వితీయ ఆహ్వానిత నాటిక కళా పరిషత్‌ పోటీలు నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు బల్లెడ లక్ష్మణ మూర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం నాటిక పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పేరొందిన నాటక సమాజాలకు చెందిన ప్రదర్శన బృందాలు ఈ పోటీల్లో పాల్గోనున్నాయి. మూడు రోజులు పాటు నిర్వహించనున్న పోటీల్లో ఏడు ప్రదర్శనలతో పాటు ఒక ప్రత్యేక నాటిక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని నాటక సమాజాలు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement