breaking news
Amaravati
-
కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన: సజ్జల
తాడేపల్లి : ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తుందన్నారు పార్టీ స్టేట్ కో -ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, అందుకే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు. ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 5వ తేదీ) కోటి సంతకాల సేకరణ సమీక్షలో భాగంగా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇందులో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జూమ్ మీటింగ్కు హాజరయ్యారు. ఈ మేరకు సజ్జల మాట్లాడుతూ.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందికోటి సంతకాల సేకరణకు అనూహ్యమైన స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజలూ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. వారం క్రితమే కోటికి పైగా సంతకాలు అయ్యాయి. ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలి. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు నాయకులతో అవసరమైన సమన్వయం చేసుకోవాలి’ అని స్పష్టం చేశారు. గురువారం(డిసెంబర్ 4వ తేదీ) వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. -
‘అమరావతి.. అంతులేని కథ.. పోలవరం.. ముగింపు లేని కథ’
సాక్షి, తాడేపల్లి: పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని.. దాన్ని బ్యారేజికే పరిమితం చేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 41 మీటర్లకే పూర్తి చేస్తుంటే కూటమి నేతలు ఏం చేస్తున్నారు? అంటూ నిలదీశారు. ఇప్పుడు చంద్రబాబు, వారి కేంద్ర మంత్రులు గుడ్డి గుర్రాలకి పళ్లు తోముతున్నారా? అని మండిపడ్డారు.‘‘అమరావతిది అంతులేని కథ.. పోలవరంది ముగింపు లేని కథగా మార్చారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎంలాగా వాడుకుంటున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రమే పోలవరాన్ని పూర్తి చేయాలని ఉంది. కానీ డబ్బులు కొట్టేయటానికి ఆ ప్రాజెక్టును ఏపీకి బదలాయించుకున్నారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. అది కొట్టుకు పోవటంతో వెయ్యి కోట్ల నష్టం జరిగింది. స్పిల్ వే నిర్మిస్తే డబ్బులు రావని దాన్ని వదిలేశారు. జగన్ హయాంలోనే స్పిల్ వే, కాఫర్ డ్యాంల నిర్మాణాలు పూర్తి చేశారు. 2013-14 రేట్ల ప్రకారం పోలవరం కడతానని చంద్రబాబు చెప్పారు. కానీ అది పూర్తి కాదని జగన్ కేంద్రంతో మాట్లాడి 2017-18 ధరల ప్రకారం నిర్మాణానికి అంగీకరించేలా చేశారు...తొలిదశ నిర్మాణానికి రూ.12,157 కోట్లు ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు కుట్ర పన్ని అప్పుడు ఆ నిధులు రాకుండా చేశారు. మొదటి దశకే 41.5 కు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేశారు. రెండోదశ అయిన 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మాణం జరగటం లేదు. అది పూర్తయితేనే ఉత్తరాంధ్రకు నీరు వెళ్తుంది. పోలవరాన్ని ఇప్పుడు బ్యారేజీకే పరిమితం చేశారు. ప్రాజెక్టును నట్టేట ముంచారు...వైఎస్ జగన్ కొన్ని వేల స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేశారు. జగన్ ఇచ్చిన బెంచీల మీద కూర్చుని చంద్రబాబు జగన్ని విమర్శించారు. సినిమా సెట్టింగ్ మాదిరి సెట్ చేసినా, అందులో పెట్టినవన్నీ జగన్ ఇచ్చిన బెంచీలు, కుర్చీలే. లోకేష్ విద్యా శాఖామంత్రిగా ఏ పనీ చేయలేదు. హోంమంత్రి అనిత చౌకబారు విమర్శలు మానుకోవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వారాంతంలో ఎక్కడ ఉంటున్నారు?. అసలు వీరికి హెడ్ క్వార్టర్ ఏది?..చంద్రబాబు ఇప్పటికీ అమరావతిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు?. హైదరాబాద్లోని ఇంట్లోకి పవన్కి తప్ప మరెవరికీ ప్రవేశం లేదు. ధాన్యం కొనుగోలు చేయటం చేతగాని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా జగన్ని విమర్శిస్తున్నాడు. రేషన్ బియ్యంలో కమీషన్లు దండు కుంటున్నారు. షిప్ని సీజ్ చేశారా? రేషన్ మాఫియాని అరికట్టారా?. ఆస్పత్రులలో సరైన వైద్యం అందించలేని మంత్రి సత్య కుమార్ కూడా జగన్ని విమర్శించటం సిగ్గుచేటు. లోకేష్.. చంద్రబాబు ప్లేటు తీశారు. రేపు కుర్చీ కూడా తీసేస్తారు. దైవాన్ని అడ్డం పెట్టుకుని దుర్మార్గపు నాటకాలు ఆడుతున్నారు. రాజకీయ కక్షల కోసం నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. అధికారం కోల్పోయాక ఏం అవుతారో ఆలోచించుకోవాలి’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. -
ముంబై కల… అమరావతి గిమ్మిక్
అమరావతిలో 15 బ్యాంకులు, రెండు బీమా సంస్థల కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్లు కేంద్రం తమకు సహకరిస్తోందని చంకలు గుద్దుకుంటున్నారు. పైగా ఈ చిన్న విషయంతోనే అమరావతి ముంబై అయిపోతుందన్నంత బిల్డప్ కూడా ఇచ్చేశారు. నిన్నమొన్నటివరకూ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అన్నవాళ్లు కాస్తా ఇప్పుడు అమరావతి అంటున్నారు. ఇలా రోజుకో మాట మారిస్తే నమ్మేదెలా?.. ఇంతకి ఏమిటి వీరి బలహీనత?.. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారుకు చిత్తశుద్ది ఉంటే, ఈ బ్యాంకు కార్యకలాపాలన్నీ కొత్తగా వస్తువన్నవి అని నమ్ముతూంటే అవి విశాఖలో పెరిగేలా చేస్తే ఏపీకి సత్వర ప్రయోజనం కలిగేది కదా! అని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ విలువలు పెంచడానికి, ధరలు పెరిగాయన్న కృత్రిమ భావన కల్పించడానికి తంటాలు పడుతున్న ప్రభుత్వ పెద్దలు దీనిని ఒక గిమ్మిక్కుగా మార్చారన్న అనుమానం కలుగుతుంది. తాజా ప్రచారం ప్రకారం మరికొన్ని సంస్థలను కూడా విశాఖ అమరావతికి తరలిస్తున్నారట. స్టాక్ ఎక్చేంజ్ బోర్డు ఆఫీస్ను గతంలో విశాఖలో ఏర్పాటు చేయాలని తలపెట్టగా ఇప్పుడు అమరావతికి మార్చే యోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫీస్ను వైజాగ్లో ప్రతిపాదిస్తే అమరావతికి మార్చారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, బిట్స్ పిలాని క్యాంపస్, ఏఐ, స్కిల్ యూనివర్శిటీలరె కూడా అమరావతికి మారుస్తారట. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్, కర్నూలు నుంచి లా యూనివర్శిటీ తిరుపతి నుంచి హెచ్సీఎల్లను తరలించారు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడ నుంచి ఒక కార్యాలయం ఇక్కడకు తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇలా చేస్తే మళ్లీ ప్రాంతీయ అసమానతలు,విద్వేషాలు పెరగవా అని కొంతమంది విజ్ఞులు బాదపడుతున్నారు. కొత్త ప్రభుత్వ సంస్థలను అమరావతిలో స్థాపించవచ్చు.గతంలో అనేక ప్రైవేటు పరిశ్రమలు అమరావతికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయని అన్నారు.అలా జరిగితే అందరికి ప్రయోజనంగా ఉంటుంది. వేల కోట్ల అప్పులు తెచ్చి అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు. దాని ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి దక్కాలి.అలాకాకుండా అప్పులు భారం అందరిపై పడి, ఆర్థిక లాభం మాత్రం అమరావతి ప్రాంతంలోని కొందరికే లభిస్తే అది సమస్యలకు దారి తీయవచ్చు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమరావతిలో పెడుతున్న బ్యాంకు ఆఫీసులు అన్ని విజయవాడలో ఇప్పటికే పనిచేస్తున్నాయట. వాటినే అమరావతికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారన్నమాట. కాకపోతే దానికి ఫైనాన్షియల్ స్ట్రీట్ అని ఒక పేరు తగిలిస్తారన్నమాట. నిజానికి బ్యాంకులు, బీమా సంస్థలు అన్నీ ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు. మరో సంగతి ఏమిటంటే ఆయా చోట్ల వివిధ బ్యాంకులకు రీజినల్ ఆఫీసులు కూడా ఉంటాయి. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన ఈ రోజుల్లో అన్ని బ్యాంకులు ఓకే చోట ఉండడం వల్ల కలిసివచ్చేది ఏమీ ఉండదు. వికేంద్రీకరిస్తే అందరికి సమన్యాయం జరుగుతున్నట్లు అవుతుంది.అందుకు భిన్నంగా ఇతర చోట్ల నుంచి తీసుకు వచ్చి వాటిని అమరావతిలో పెడితే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.కాకపోతే ప్రభుత్వ సొమ్ము కాబట్టి కోట్ల రూపాయలకు వారికి భూమిని కేటాయించామని చెప్పుకోవచ్చేమో!. విశాఖలో ప్రైవేటు సంస్థలకు 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు పందారం కావిస్తూ, అమరావతిలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించాలి. ఒకప్పుడు అమరావతిలో ఐటీ మొదలు అనేక సంస్థలు వస్తున్నాయని ఊదరగొట్టారు.నవ నగరాల పేరుతో ఏదో జరిగిపోతుందని ప్రచారం చేశారు. ఇప్పుడేమో అందుబాటులో ఉన్న ఏభైవేల ఎకరాలు సరిపోదని, అలా అయితే మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని చంద్రబాబు బెదిరిస్తున్నారు. కొత్తగా మరో నలభైవేల ఎకరాల భూముల సమీకరణకు సిద్దం అవుతున్నారు. నిర్మలా సీతారామన్ కు ఈ విషయాలన్నీ తెలుసో ,లేదో కాని ఆమె ఒక విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో కూరగాయలు బాగా పండుతాయని, వాటికి ప్రోసెసింగ్ యూనిట్లు పెట్టడం, ఎగుమతికి అవసరమైన కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు నెలకొల్పడం వంటివి చేయాలని సూచించారు. కాని ఇప్పటికే రాజధాని పేరుతో భూములన్నిటిని చంద్రబాబు ప్రభుత్వం దున్నివేయించింది. వేలాది ఎకరాలలో పంటలు లేకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవిలా మారినట్టు పలు కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె గమనించి సరైన సలహా ఇచ్చి ఉండాల్సింది. బ్యాంకులు వారు రైతులకు సహకరించాలని చెబుతూనే కమర్షియల్ గా మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. అంటే ఎవరికి ఎలాంటి రాయితీలు ఇవ్వవలసిన అవసరం లేదని తేల్చేశారన్నమాట. పోనీ అమరావతికి ఏమైనా కొత్తగా నిధులు ఇస్తున్నారా అంటే అదేమి చెప్పలేదు. చంద్రబాబు తన ప్రసంగంలో కేంద్రం రూ.15 వేల కోట్ల ఇచ్చి సహకరిస్తోందని అన్నారు. కాని అది రుణమా?లేక గ్రాంటా అన్నది చెప్పినట్లు కనిపించలేదు. నిజంగానే అది గ్రాంట్ అయితే నిర్మలా సీతారామన్ ప్రస్తావించకుండా ఉంటారా?.. బడ్జెట్ లో ఏపీకి బలమైన మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ చెప్పారని ఆమె తెలిపారు. కాని అది ఏ రూపంలో ఇంతవరకు ఇచ్చారు. ప్రపంచ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడానికి అనుమతి ఇస్తే ఏపీకి ఆర్థిక భారం అవుతుంది. అలాంటప్పుడు అది సాయం ఎలా అవుతుంది?. కేంద్రం నుంచి సుమారు రూ.36 వేల కోట్ల సాయం వస్తుందని ఏపీ బడ్జెట్లో పెడితే ఇప్పటికి కేవలం ఐదువేల కోట్ల లోపే అందిందట. దీని గురించి ఆమె ఏమైనా హామీ ఇస్తే బాగుండేది కదా!. రాష్ట్రం సుమారు రూ.45 వేల కోట్ల భారీ రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అది తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సాయపడి ఉంటే అందరు అభినందించేవారు. అవేవి చేయకపోయినా చంద్రబాబు, తదితరులు మెచ్చుకుంటున్నారు. కాబట్టి కేంద్రంలోని వారికి ఇబ్బంది లేదనుకోవాలి. నిర్మలా సీతారామన్ కూడా చంద్రబాబుకు లేని క్రెడిట్ ఇవ్వడం ఆశ్చర్యపరిచింది. ఆయన చేసిన పనులు చెప్పి పొగిడితే తప్పు లేదు. కాని హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం అయనే చేసినట్లు నిర్మలా వ్యాఖ్యానించడం అందరిని విస్తుపరచింది. హైదరాబాద్లో ఈ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ది అంతా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంతా తానే నిర్మించానన్నట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటారు. ఈ మధ్య ఆయన ఒక స్పీచ్ ఇస్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తానే వేసినట్లు చెప్పుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దానికింద ఒక అధికారి గతంలో ఈ రింగ్ రోడ్డును వైఎస్సార్ ఎలా అభివృద్ది చేసింది వివరిస్తున్న దృశ్యం కనిపించింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రింగ్ రోడ్డు నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిందని తెలిపే వీడియో కూడా వచ్చింది. అయినా చంద్రబాబు ఎందుకో అసత్యాలు చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తూంటారు. ఇలాంటి పరిస్థితిలో నిర్మలా సీతారామన్ కూడా హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ ను చంద్రబాబుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం. చంద్రబాబు ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జరిగిన అభివృద్దిని కూడా తన ఖాతాలో వేసుకుని ఏపీలో ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలన్నది ఆయన ఉద్దేశం అన్నది కనిపిస్తూనే ఉంది. హైదరాబాద్ను అంతగా అభివృద్ది చేసి ఉంటే మరి ఏపీలో విశాఖ,విజయవాడ,తిరుపతి వంటి నగరాలను ఎందుకు వృద్ది చేయలేకపోయారు?.. ఇకపై ముంబై ఆర్ధిక నగరం కాదట.అమరావతి అట. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.ఈ రకంగా మాట్లాడడం నవ్వులపాలయ్యే అంశమా? కాదా? అన్నది ఆలోచించుకోవాలి. ముంబై ఎక్కడ?అమరావతి ఎక్కడ? అర్థం ఉండాలి కదా మాట్లాడడానికి!. విమానాశ్రయం పేరుతో, స్పోర్ట్స్ సిటీ పేరుతో రకరకాలుగా వేల ఎకరాల అదనపు భూమి సమీకరణకు ప్రభుత్వం సన్నద్దమవుతున్న తీరు అమరావతి రైతుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తిస్తోంది. వారిని మభ్య పెడుతూ ఇలాంటి కార్యక్రమాలలో ప్రసంగాలు చేస్తే ఏమి ఉపయోగం?.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైద్య విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ వెన్నుపోటు
సాక్షి, అమరావతి: పీజీ సీట్లు అమ్మకానికి పెట్టిన కూటమి సర్కార్పై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఒకవైపు 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. మరోవైపు ఆ కాలేజీల్లోని పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఒక్కో పీజీ సీటుకు రూ.29 లక్షల వసూలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రభుత్వ కోటా సీటుకు రూ.30 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్ సీటుకు రూ.9 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు రూ.29 లక్షలుగా ఫీజులు ఖరారు చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4 కోర్సుల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) మంజూరు చేసింది.రాజమండ్రి, నంద్యాల కళాశాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళాశాలలో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నారు. కాగా, 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు పోగా, మిగిలిన 50 శాతం సీట్లను రాష్ట్ర కోటాలో యూనివర్సిటీ భర్తీ చేయనుంది. ఈ 50 శాతంలో సగం కన్వీనర్ కోటాకు, 35 శాతం సెల్ఫ్ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించారు. -
కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలో పీజీ సీటు ఫీజు రూ.29 లక్షలు
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి వస్తే కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటాను వంద రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచి్చన చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారు. ఒకవైపు 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. మరోవైపు ఆ కాలేజీల్లోని పీజీ సీట్లను అమ్మకానికి పెట్టేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రారంభించిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో పీజీ సీటుకు రూ.29 లక్షల వసూలుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రభుత్వ కోటా సీటుకు రూ.30 వేలు, సెల్ఫ్ ఫైనాన్స్ సీటుకు రూ.9 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు రూ.29 లక్షలుగా ఫీజులు ఖరారు చేశారు. 2025–26 విద్యా సంవత్సరానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 4 కోర్సుల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) మంజూరు చేసింది.రాజమండ్రి, నంద్యాల కళాశాలల్లో 16 సీట్లు చొప్పున, విజయనగరం, మచిలీపట్నం కళాశాలల్లో 12 చొప్పున, ఏలూరు కళాశాలలో 4 పీజీ సీట్లకు అడ్మిషన్లు చేపట్టనున్నారు. కాగా, 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు పోగా, మిగిలిన 50 శాతం సీట్లను రాష్ట్ర కోటాలో యూనివర్సిటీ భర్తీ చేయనుంది. ఈ 50 శాతంలో సగం కన్వీనర్ కోటాకు, 35 శాతం సెల్ఫ్ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటాకు కేటాయించారు. -
ఇలా ‘సెలవిచ్చారు’
సాక్షి, అమరావతి: 2026 క్యాలెండర్ ఇయర్లో సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మొత్తం 24 సెలవు దినాలు ప్రకటించింది. ఇందులో నాలుగు సెలవులు మహాశివరాత్రి, బాబూ జగ్జీవన్రాం జయంతి, దుర్గాష్టమి, దీపావళిలు ఆదివారం రావడంతో నికరంగా 20 సెలవులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు లభించనున్నాయి. కానీ ఈసారి అత్యధిక సెలవులు శుక్రవారం రావడంతో మధ్యలో శనివారం లీవ్ పెట్టుకుంటే వారాంతాల్లో మూడు రోజులు ఆటవిడుపు కలగనుంది. పై అధికారికి ముందస్తు సమాచారంతో గరిష్టంగా ఐదు సెలవుదినాలను వినియోగించుకునేలా 21 ఆప్షనల్ హాలిడేలను ప్రకటించింది. ఇందులో రెండు ఈద్ ఈ గదర్, మహాలయ అమావాస్య ఆదివారంతో కలిసిపోయాయి. బ్యాంకులు వంటి ఇతర వ్యాపార సంస్థలకు నెగోషబుల్ ఇనిస్ట్రుమెంట్స్ యాక్ట్ 1981 ద్వారా 21 సాధారణ సెలవులను ప్రకటించింది. చంద్ర దర్శనాన్ని బట్టి నిర్ణయించే రంజాన్, బక్రీద్, మొహర్రం, ఈద్ మిలాద్ ఉన్నబీతో పాటు హిందూ పర్వదినాల్లో ఏమైనా మార్పులు ఉంటే వాటిని ప్రసార మాధ్యమాల ద్వారా ముందుగానే తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సందట్లో సడేమియా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగిస్తూ మరో వైపు తనపై అవినీతి కేసులను సందట్లో సడేమియా మాదిరిగా ఎత్తేసుకునే కుట్ర చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి కేసుల్లో బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు ‘తానే దొంగ.. తానే పోలీస్.. తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్..’ అన్నట్లు వ్యవహరిస్తూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి.. తనపై కేసులను తన ప్రభుత్వం ద్వారా విత్ డ్రా చేసుకుంటూ బరితెగిస్తున్నారని మండిపడ్డారు.గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు 2014–19 మధ్య ఆషామాషీ స్కాములు చేయలేదు. ఒక్క స్కిల్ స్కామ్లోనే వందల కోట్లు బొక్కేశారు. స్వయంగా ఆ ఫైళ్లపై చంద్రబాబు సంతకాలు చేసి డొల్ల కంపెనీలకు రూ.370 కోట్లు దోచిపెట్టారు. అక్కడేమో సీమెన్స్ ఎండీ ఆ డబ్బులు నాకు రాలేదు, నా కంపెనీయే కాదని స్టేట్మెంట్ ఇచ్చారు.డొల్ల కంపెనీలకు చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి ఫైల్ మూవ్ చేసి రూ.370 కోట్లు ఇచ్చిన కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన ఈడీ.. డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్లను, డబ్బులు తీసుకున్నోళ్లను అరెస్టు చేసింది. కానీ, డబ్బులు ఇచ్చినోడిని అరెస్టు చేయలేదు. డబ్బు మాత్రం పోయింది. డబ్బు ఇచ్చినోడిని అరెస్టు చేయకుండా ప్రొటెస్ట్ చేస్తుండటం ఏంటని ఏసీబీ కోర్టు ఆయన్ను జైలుకు పంపింది’ అని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. అతిపెద్ద అసైన్డ్ ల్యాండ్ స్కామ్చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కొనడం ఒక స్కాం అయితే.. ఆ తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం మరో పెద్ద స్కాం. అదే స్థాయిలో రింగు రోడ్డు అలైన్మెంట్ స్కాం చేశారు. కరెక్టుగా చంద్రబాబు హెరిటేజ్ భూముల దగ్గరకు వచ్చే సరికే రింగ్ రోడ్డు పక్కకు వెళ్లిపోతుంది. మరో వైపు ఉచితం పేరుతో రూ.కోట్ల విలువైన ఇసుకను దోచేస్తున్నారు. మా హయాంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.3,750 కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. బ్లాక్ లిస్టులోని కంపెనీకి కాంట్రాక్టులు!ఫైబర్ నెట్లో అర్హత లేని, బ్లాక్ లిస్టులో ఉన్న తన అనుచరుడి కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి రూ.వందల కోట్లు అప్పనంగా మింగేశారు. లిక్కర్లో ఎమ్మార్పీ కన్నా అధిక రేట్లకు అమ్మి తన బెల్ట్ షాపుల ద్వారా, పర్మిట్ రూముల ద్వారా, తన మాఫియా సామ్రాజ్యం ద్వారా దోచేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి, దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కాంకు తెర తీశారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో లిక్కర్ స్కామ్ చేస్తున్నారు. డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చేది ప్రైవేట్ షాపులు. అలాంటి ప్రైవేట్ షాపులన్నీ చంద్రబాబు వ్యక్తులవి కాదా? ప్రతి ఐదు బాటిళ్లకు ఒక బాటిల్ కల్తీ మద్యం అమ్మేస్తున్నారు. చట్టం.. చంద్రబాబు చుట్టం!ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజదొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావాల్సిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో కేసులు విత్డ్రా చేసుకునే కుట్రలకు తెగబడ్డారు. ఫిర్యాదుదారులైన అధికారుల్ని భయపెట్టి, బెదిరించి స్టేట్మెంట్లు విత్ డ్రా చేయించి, వాటిని కోర్టు ముందు పెట్టి, ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. రెఫర్ చార్జ్ షీట్ వేయించి మూసేయిస్తున్నారు.గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరెండీకి పాల్పడ్డారు. ఏలేరు స్కామ్ తీసుకున్నా అంతే. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంకు అకౌంట్లను, ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసులో.. ఇవాళ్టి కేసు వరకు చట్టం ఒక వైపు, వ్యవస్థలు మరో వైపు.. చంద్రబాబుకు చుట్టాలుగా మారి దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాలను వేలెత్తి చూపిస్తూ.. సాక్ష్యాలు, ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలు ప్రజా క్షేత్రంలోకి తీసుకెళ్తాం. -
ఈ సర్కారుకు మాయరోగం!
‘‘ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీకి 18 నెలలకు రూ.5,400 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా..! ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందట. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! బొనాంజా కాదా ఇది?’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు ప్రభుత్వానికి మాయరోగం వచ్చింది. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేశారు. గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? ఏం చేయడం కోసం ప్రజలు నీకు అధికారం ఇచ్చారు? విద్య, వైద్యం, వ్యవసాయం, శాంతిభద్రతల పరిరక్షణ, పారదర్శక పాలన.. ఇవి కదా చేయాల్సింది. కానీ అన్నీ తిరోగమనమే. అన్నీ స్కాములే. ఏవీ పట్టించుకునే పరిస్థితి లేదు. అన్నీ ప్రైవేటీకరణే.. బాధ్యత నుంచి తప్పించుకోవడం.. ఉన్నకాడికి స్కామ్లు చేయడమే..’’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. దారుణంగా ప్రజారోగ్య వ్యవస్థ ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేయడం అన్నది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ అమలుకు నెలకు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 18 నెలలకు కలిపి రూ.5,400 కోట్లు ఇవ్వాలి. ఇటీవల నేను దీనిపై పలుదఫాలు మాట్లాడటం.. వాళ్లు కూడా (నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు) స్ట్రైక్లు చేయడంతో ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.1,800 కోట్లు. అంటే ఇంకా రూ.3,600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి. చివరికి మొన్న నెట్వర్క్ ఆస్పత్రులన్నీ సమ్మెకు దిగాయి. సమ్మె విరమించేటప్పుడు ప్రభుత్వం వాళ్లకిచి్చన మాటకు ఇంతవరకు దిక్కులేదు. పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 సేవలను స్కాములుగా మార్చేశారు. రూ.5 కోట్లు టర్నోవర్ లేని వాటికి 104, 108 సరీ్వసుల నిర్వహణను అప్పగించేశారు. ఆ వ్యక్తి ఎవరంటే.. టీడీపీ ఆఫీసులో డాక్టర్ల సెల్ అధ్యక్షుడట..! ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే.. మరోవైపు సంజీవని అంటారు. అది ఇంకో డ్రామా. అన్నీ గవర్నమెంట్వే.. లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణే పెద్ద స్కాము.. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బొనాంజా.. ఓవైపున ఆరోగ్యశ్రీని ఖూనీ చేస్తూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా హతం చేస్తూ ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఒక స్కాముగా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది. కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ఒక స్కాము అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాంజా కూడా ఇచ్చారు. అది ఇంకో పెద్ద స్కామ్. ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందంట. (ప్రభుత్వం జారీ చేసిన జీవో 847ను ప్రదర్శించారు). ఒక్కో టీచింగ్ హాస్పిటల్ (550 పడకల ఆసుపత్రి)లో ఉద్యోగుల జీతాల కోసం నెలకు దాదాపు రూ.5 నుంచి రూ.6 కోట్లు ఖర్చవుతుంది. అంటే ఏడాదికి రూ.60 నుంచి రూ.70 కోట్లు. రెండేళ్లకు రూ.120 నుంచి రూ.140 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది.ఆశ్చర్యమేమిటంటే.. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు.. కానీ ఓనర్లేమో ప్రైవేటు వాళ్లు! లాభాలేమో ప్రైవేటు వాళ్లకు! భారమేమో ప్రజలపై! ఆశ్చర్యంగా లేదా ఇది..? బొనాంజా కాదా ఇది? స్కాముల్లో అన్నిటికంటే పెద్ద స్కామ్ కాదా ఇది? ఓవైపు ప్రజా ఉద్యమం జరుగుతోంది. దానిని ఖాతరు చేయకుండా, సిగ్గు లేకుండా చంద్రబాబు స్కాములపర్వం ముందుకు పోతోంది. ఒక పక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికిపైగా ప్రజలు సంతకాలు చేస్తున్నారు. మరో వైపున వాటిని ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తున్న స్కామ్ల్లో ఒక అడుగు ముందుకేసి ఇంకో స్కామ్ చేస్తున్నాడు.16న గవర్నర్కు కోటి సంతకాల పత్రాలు అందచేస్తాంకొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో రోడ్లెక్కుతున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి మా పార్టీ భారీ ర్యాలీలు చేపట్టి ప్రజల గొంతుకను వినిపించింది. కోటిమందికి పైగా సంతకాలు చేసి ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నెల 10వ తేదీన సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శించి ప్రజలకు, మీడియాకు అందరికీ చూపించి జిల్లా కేంద్రాలకు పంపుతారు. ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేసి పార్టీ సెంట్రల్ ఆఫీసుకు చేరుస్తారు. ఆ కోటి సంతకాల పత్రాలను ఈ నెల 16న గవర్నర్కు అందచేస్తాం. ఆ తరువాత ఈ పత్రాలతో హైకోర్టులో పిటిషన్ వేస్తాం. -
ఉద్యోగులను ముంచేశారు
‘‘ఉద్యోగుల సమస్యలు చూస్తే.. ఈ డిసెంబర్ పూర్తై జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ ఛైర్మన్ను నియమించలేదు. ఐఆర్ ఊసే లేదు’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం చంద్రబాబు నిండా ముంచేశారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో చంద్రబాబు కుప్పలు తెప్పలుగా ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ సర్కార్ తీరును కడిగిపారేశారు. గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఐదింటికి ఒకే డీఏ.. ఉద్యోగుల సమస్యలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూస్తే... ఈ డిసెంబర్ పూర్తయి జనవరి వస్తే ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా వాయిదాల్లో ఇస్తామంటున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. డీఏ అరియర్స్ను రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పిన ప్రభుత్వాన్ని బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండం... ఒక్క చంద్రబాబు ప్రభుత్వంలో మినహా! దానికి తగ్గట్టుగా జీవో 60 జారీ చేశారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇంత దౌర్బాగ్యమైన జీవోను తీసుకొని వచ్చి ఉండరు (జీవో నంబర్ 60ని ప్రదర్శించారు). దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని ఉపసంహరించుకుని, వాయిదాల్లో ఇస్తామన్నారు. ఐఆర్ లేదు.. మెరుగైన పీఆర్సీ బూటకం మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న పీఆర్సీ చైర్మన్నే తీసేశారు. ఆ స్థానంలో ఇప్పటివరకూ కొత్త చైర్మన్ను నియమించలేదు. చైర్మన్ను నియమిస్తే పీఆర్సీ రిపోర్టు ఇవ్వాలి. రిపోర్టు వస్తే దాన్ని వెంటనే అమలు చేయాలి. అమలు చేస్తే.. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. దీంతో ఉద్యోగులకు పెరిగిన జీతాలు వెంటనే ఇవ్వాల్సి వస్తుందనే దుర్బుద్ధితోనే పీఆర్సీ చైర్మన్ను ఇప్పటివరకూ నియమించలేదు. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కానీ.. ఇప్పటివరకు ఐఆర్ ఊసే లేదు. నాడు మేం అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం.దాంతో ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. మా ప్రభుత్వం ఇచ్చిన జీపీఎస్(గ్యారంటీడ్ పెన్షన్ స్కీం)ను కూడా చెల్లుబాటు కాకుండా చేసి ఉద్యోగులను చంద్రబాబు త్రిశంకు స్వర్గంలోకి నెట్టాడు. మేం తెచ్చిన జీపీఎస్ను దేశమంతా కాపీ కొడుతున్నారు. కనీసం అదైనా అమలు చేసి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చేవి. పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, మెడికల్ రీయింబర్స్మెంట్, సరెండర్ లీవ్స్ రూపంలో ఉద్యోగులకు చంద్రబాబు ఏకంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు.ఆప్కాస్(ఏపీసీఓఎస్)లో ప్రతి నెలా 1వ తేదీనే జీతాలిచ్చేలా మా ప్రభుత్వంలో చర్యలు తీసుకున్నాం. కానీ ఇప్పుడు రెండు మూడు నెలలకోసారి ఇస్తున్నారు. నేను పులివెందులకు వెళ్తే మా వాళ్లు వచ్చి వినతిపత్రం ఇచ్చారు. మీరున్నప్పుడు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వచ్చేవి.. ఇప్పుడు ఒకటో తేదీన జీతం కథ దేవుడెరుగు.. రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్..! అని చెబుతున్నారు. గెస్ట్ లెక్చరర్లకైతే ఎనిమిది నెలలుగా జీతాలే లేవు. ఈ ప్రభుత్వంలోఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దేవాలయాల్లో శానిటేషన్ పనులు కూడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టేస్తున్నారు. భాస్కరనాయుడు లాంటి చంద్రబాబు బంధువులు, సన్నిహితులకే కాంట్రాక్టులు ఇస్తున్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్కు సొంత గని అడగరు.. ప్రైవేటు ప్లాంట్కు అడుగుతారా?
‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. ప్రైవేటీకరించకుండా కాపాడుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చుతున్నారు. ప్రైవేటు సంస్థ స్టీల్ ప్లాంట్ పెడితే లాభాల్లో ఉంటుందట, తమాషాలు చేయొద్దు... పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. సినిమాల్లో విలన్ పాత్ర ఎలా ఉంటుందో చెప్పడానికి... చంద్రబాబు వ్యవహరిస్తున్న ఈ తీరే నిదర్శనం’’ - వైఎస్ జగన్సాక్షి, అమరావతి: విపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు... ప్రైవేటీకరించకుండా కాపాడుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా కాపాడుకున్నామని, ప్రభుత్వ రంగంలోనే నడపాలని, సొంత గని (క్యాప్టివ్ మైన్) కేటాయించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం కార్మికులు కానే కాదని, సొంత గని లేకపోవడమేనని తేల్చి చెప్పారు. దీనికి ఆధారంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఏఐఎల్) వార్షిక నివేదికలను చూపారు. ‘‘విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గని కేటాయించాలని అడగరు కాని.. మిట్టల్ సంస్థ పెట్టే ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప గని కేటాయించాలని టీడీపీ కూటమి ఎంపీలతో కేంద్రాన్ని అడిగిస్తారా?’’ అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన జగన్ ఇంకా ఏమన్నారంటే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాటా? మా ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా అడ్డుకున్నాం. కానీ, ఎన్నికల ముందు చంద్రబాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏం మాట్లాడారు..? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారనేది చూడండి. (2021 ఫిబ్రవరి 16న చంద్రబాబు మాట్లాడిన మాటలు, 2025 నవంబర్ 15న మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగ్లను చూపించారు). ప్లాంట్ను కాపాడుకుంటాం. కలిసి పోరాడతాం అంటూ వీర డైలాగులు చెప్పారు. ఇప్పుడు ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా? అంటున్నారు. ప్రైవేటు సంస్థ స్టీల్ ప్లాంట్ పెడితే లాభాల్లో ఉంటుందట, తమాషాలు చేయెద్దు పీడీ యాక్ట్ పెట్టి లోపలేస్తాం అని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నిజానికి నష్టాలకు ఉద్యోగులు కారణం కాదు. విశాఖ స్టీల్కు సొంత గనుల్లేకనే నష్టాలు. ఆర్ఐఎన్ఎల్, ఎస్ఏఐఎల్ 2023–24 వార్షిక నివేదిక ప్రకారం.. సెయిల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కోసం చేసే వ్యయం 11.2 శాతం ఉంది. కానీ, సెయిల్కు ఐరన్ ఓర్ ఉంది. క్యాప్టివ్ ఐరన్ ఓర్ ఉంది. దాన్నుంచి 34.34 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ తీసుకోవడమే కాకుండా, జార్ఖండ్ ప్రభుత్వం అనుమతితో 1.16 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ను మార్కెట్లో అమ్ముకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ లేవు. అందుకే ఐరన్ ఓర్ వ్యయం 18.6 శాతం అవుతుంటే సెయిల్లో ఇది 9.8 శాతమే. 10 శాతం తేడా ఉంది. -
లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలా?
తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై దాడి చేయించడం చంద్రబాబుకు పరిపాటే. ఏకంగా న్యాయవ్యవస్థపైనే దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దుష్ప్రచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా?’’ - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదాలు తయారు చేశారని.. వాటిని భక్తులు తిన్నారని అన్నావ్..! వాటికి ఆధారాలు దొరికాయా..?’’ అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల వెంకటేశ్వరస్వామి విశిష్టతను అభాసుపాలు చేస్తావా బాబూ? అంటూ మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. బెయిల్పై ఉన్న చంద్రబాబు షరతులను ఉల్లంఘిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్నారని తూర్పారబట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా బాబూ..? చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా! టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. వాటిని భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ట్యాంకర్లు ప్రసాదం తయారీ కేంద్రంలోకి వెళ్లాయా? వీటికి ఆధారాలున్నాయా? టీటీడీలో ఒక బలమైన తనిఖీ వ్యవస్థ (రోబస్ట్ ప్రొసీజర్) ఉంది. టీటీడీకి వచ్చే ఏ నెయ్యి ట్యాంకర్ అయినా ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లా»ొరేటరీస్) సర్టిఫికేషన్తోనే రావాలి. ఇది దశాబ్దాలుగా టీటీడీలో పాటిస్తున్న నిబంధన. ఈ సర్టిఫికెట్ లేకుండా తిరుమలలోకి ట్యాంకర్లు రావు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ ఒక్కటే సరిపోదు. టీటీడీకి ఒక సొంత ల్యాబ్ కూడా ఉంది. ఆ ల్యాబ్లో మళ్లీ టెస్టు పాస్ అయితేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది. ఈ స్టాండర్డ్స్ లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించి, వెనక్కి పంపిస్తారు. ఇలా గతంలో చంద్రబాబు హయాంలో 15 సార్లు వెనక్కి పంపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో 18 సార్లు వెనక్కి పంపారు. టీటీడీలో బలమైన తనిఖీ వ్యవస్థ ఉందని, సమర్థవంతంగా పని చేస్తుందని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. అలాంటప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడిది? కల్తీ నెయ్యి వాడితే నీ వైఫల్యం కాదా బాబూ? చంద్రబాబు హయాంలో, ఆయన నియమించిన టీటీడీ ఈవో టైమ్స్ నౌలో(ఈవో మాట్లాడిన వీడియో ప్రదర్శించారు) స్వయంగా ఆ ట్యాంకర్ల నెయ్యిని వినియోగించలేదని చెప్పారు. సెపె్టంబర్ 20, 2024న చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నియమించిన టీటీడీ ఈవో.. నాలుగు నెయ్యి ట్యాంకర్లు టెస్టులు పాస్ కాకపోవడంతో రిజెక్ట్ చేసి వెనక్కి పంపించామని ప్రకటించారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయన హయాంలో జూలైలో∙4 ట్యాంకర్లు తిప్పి పంపారు. మళ్లీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయట! మరి అప్పుడు సీఎం ఎవరు? చంద్రబాబు కాదా..? ప్రభుత్వాన్ని నడిపేది ఆయన కాదా..? గతంలో రిజెక్టు చేసిన నెయ్యి ట్యాంకులు ఆగస్టులో తిరిగి వచ్చాయని, లడ్డూ ప్రసాదంలో వినియోగించారని సిట్ రిమాండ్ రిపోర్టులో రాసింది. అలాంటప్పుడు ఇక్కడ ఎవరిని లోపల వేయాలి? ఇదే నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఆ నెయ్యి ట్యాంకులు ఎలా తిరిగి వచ్చాయి? చంద్రబాబు చెప్పినట్టుగా ఆ నెయ్యిని వాడి ఉంటే అది ఈ ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రస్తుత టీటీడీ చైర్మన్, అప్పటి టీటీడీ ఈవో ఇద్దరూ ఏం చేస్తున్నారు? వాళ్లిద్దరిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టు చేయలేదు? పైగా మాపై నిందలు వేస్తారా? చంద్రబాబు ముఠాకు దేవుడంటే భయం, భక్తీ లేదు. దుర్మార్గమైన అసత్యాలు ప్రచారం చేయడమే వీళ్ల పని. పైగా చంద్రబాబు వేసిన సిట్.. వ్యక్తులను ఇరికించాలనే ఆరాటం, తపన, తాపత్రయంతో తప్పులపై తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. 2014–19 మధ్య కిలో నెయ్యి రూ.276–రూ.314మరి అదంతా కల్తీ నెయ్యేనా బాబూ? స్వచ్ఛమైన నెయ్యి రూ.320కే మీరు ఎలా సప్లయ్ చేయిస్తారు? అని చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు. నాణ్యమైనది కావాలంటే కిలో రూ.3 వేలు అవుతుందని ప్రకటించారు. చంద్రబాబు గెజిట్ పత్రిక ఈనాడు అయితే కనీసం రూ.1,000–రూ.1,600 అని రాసింది. మరి టీటీడీలో ఇప్పుడు నెయ్యి ఎంతకు కొంటున్నారు? రూ.3 వేలు ఇస్తున్నారా? రూ.1,600 లేక రూ.1,000 ఇచ్చి కొంటున్నారా? 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కిలో నెయ్యి రూ.276–314 మధ్య కొన్నాడు. ఇది రూ.320 కంటే తక్కువ కదా? కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. పైగా భోలే బాబా డెయిరీ విషయంలో చేస్తున్న దు్రష్పచారం అంతా ఇంతా కాదు. 2018 జూన్ 26న టీటీడీ బోర్డు మినిట్స్ చూస్తే భోలేబాబా ఎవరో తేలింది. హర్‡్ష ఫ్రెష్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్గా మారింది. ఈ సంస్థ టీటీడీకి పాలు సప్లై చేయడానికి డీమ్డ్ టు క్వాలిఫై అని సర్టిఫై చేసింది చంద్రబాబు హయాంలోనే. తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లయ్ చేస్తుంటాయి. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలుస్తుంటారు. ఎవరు తక్కువకు కోట్ చేస్తారో వారి దగ్గర నుంచి కొంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రొసీజర్. టెండర్లలో ఎల్–1 ఎవరుంటారో వారికి కేటాయిస్తారు. ఇందులో రాజకీయ ప్రమేయం ఉండదు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడానికి వీళ్లు ప్రయతి్నస్తున్నారు. నెయ్యిని సప్లై చేసే ఏ కంపెనీ అయినా కచ్చితంగా ఏన్ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకోవాలి, టీటీడీలో ఉన్న ల్యాబ్లో టెస్టులు పాసవ్వాలి. అప్పుడే ట్యాంకులు లోపలకు వెళ్తాయి. దుష్ప్రచారం ఆపాలని సుప్రీంకు వెళ్లింది మేం కాదా? టీటీడీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం ఆపాలని, నిజాలు బయటకు తీసుకురావాలని సుప్రీం కోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ వాళ్లు కాదు. అలాంటిది.. సుబ్బారెడ్డిపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఇంటికి ఎప్పుడైనా వెళ్లారా? హైదరాబాద్లో ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది. ఆయన 1978 నుంచి 35–40 సార్లు అయ్యప్పమాల ధరించి కొండకు వెళ్లి ఉంటారు. అందులోనూ ఆయనది గురుస్వామి స్థానం. అలాంటి వ్యక్తిపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియాలి. టీటీడీలో స్కాములన్నీ బాబువే! పరకామణి కేసులో దొంగను పట్టుకున్న పోలీసు అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ ఓ వ్యక్తి దొరికిపోయాడు. ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు రూ.14 కోట్లు విలువైన ఆస్తులను దేవుడికి ఇవ్వడం తప్పు అవుతుందా? దేశంలో అనేక చోట్ల, అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి. కానీ, ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. తిరుపతి కోర్టులో చార్జిషీట్ వేశారు. మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్నీ కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్టు ప్రొసీజర్తో జరిగాయి. జ్యుడీషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో సాంకేతిక పరమైన అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు తప్పులేదు. కానీ, రాజకీయాల కోసం ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ఉన్నాడనో.. భూమన కరుణాకర్రెడ్డి ఉన్నాడనో.. వారి మీద బురదజల్లాలని తప్పుడు స్టేట్మెంట్ కోసం అక్కడ పనిచేస్తున్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేశారు. ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత తప్పుడు కథనాలు రాయించారు.మీ హయాంలో పట్టుకోలేదేం బాబూ? ఆ దొరికిన దొంగ... 30 ఏళ్ల నుంచి జీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్ల నుంచి పాల్గొంటున్నాడు. కొత్తగా మా ప్రభుత్వంలో వచి్చన వ్యక్తి కాదు. మరి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆ దొంగను మేం పట్టుకున్నాం. వాస్తవానికి మేం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో తిరుమల హుండీ డబ్బు లెక్కింపు ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేశాం. దేవుడి సొమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త పరకామణి బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. దాన్ని సీఎం హోదాలో నేను ప్రారంభించా. 2023 ఫిబ్రవరి 5 నుంచి ఆ బిల్డింగ్లో పూర్తి స్థాయి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాత భవనంలో అరకొరగా సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే. బ్లయిండ్ స్పాట్స్ ఎక్కువ. వాటిని అన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో 360 డిగ్రీల కవరేజ్తో 4కే హెచ్డీ సీసీ టీవీ వ్యవస్థలు, హైబ్రీడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ తెచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత ఏప్రిల్ 4, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు మంచివారు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా..? ఆ వ్యక్తి దశాబ్దాలుగా ఇదే పనిచేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ చంద్రబాబు హయాంలో ఎవరూ పట్టుకోలేదు. మా హయాంలో పట్టుకున్నాం. గతంలో ఏం జరిగిందో దేవుడికే తెలుసు. రూ.72 వేల విలువైన అమెరికన్ డాలర్లు దొరికితే.. ఏకంగా రూ.14 కోట్ల ఆస్తిని ఆ కుటుంబం దేవుడికి రాసిచ్చింది. న్యాయ వ్యవస్థపైనే దాడి..! చంద్రబాబు తనకు అనుకూలంగా లేకుంటే వ్యవస్థలపై సైతం దాడి చేయించడం పరిపాటే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, అధికార ప్రతినిధి వర్ల రామయ్యతో మాట్లాడిస్తున్న మాటలు న్యాయ వ్యవస్థపై దాడి చేయించినట్లే! (వర్ల వీడియోను ప్రదర్శించారు)! ‘‘23–9–2025: ప్రాపర్టీ ఓనర్ ఎవరు? కోర్టు కూడా తప్పు చేసిందా.. అనుమానం వస్తుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ను కోరుతున్నా.. మీ తరఫున దర్యాప్తు చేయించాలి. ఈ కేసులు సీరియస్. ఎందుకు లోక్ అదాలత్తో దర్యాప్తు చేయిస్తారు? తిరుపతిలో రూమర్స్ వస్తున్నాయి. ఈ జడ్జిగారికి పైనుంచి ఎవరో మరో జడ్జి చెప్పారట. నేను జడ్జి ఎవరని అడగట్లేదు. అందరం మనుషులమే. ఈ జడ్జికి పైనుంచి ఎవరో జడ్జి చెప్పారట. ఏ జడ్జి చెప్పినా.. ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేసినా.. అన్యాయం జరిగింది మాత్రం స్వామి వారికే. 13–11–2025: తమిళనాడులో రిజిస్టర్ చేశారట ఆస్తులు. దీని వెనుక జడ్జి ఉన్నారని చెబుతున్నారు. రూ.50 లక్షల స్టాంపు డ్యూటీ కట్టారట. ఆ రూ.50 లక్షలు ఎవరు కట్టారు? జడ్జిలు, టీటీడీ అధికారులపై నిందలు సిగ్గుచేటు.. ఇలా ఏకంగా న్యాయవ్యవస్థపైనే చంద్రబాబు దాడి చేస్తున్నారు. తిరుపతి జడ్జి, లోక్ అదాలత్ జడ్జిపైనే కాకుండా, ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చారని దు్రష్పచారానికి తెగబడ్డారు. పెద్ద జడ్జిల గురించి వీళ్లు మాట్లాడుతున్నారు. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు సమస్య పరిష్కారంలో భాగస్వామ్యం అవ్వడం తప్పా? తిరుమలకు పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తుంటారు. ఇలాంటి కేసులు ఏమైనా జరిగినప్పుడు తిరుపతిలో ఉన్న జడ్జిలు, సుప్రీం కోర్టు జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటారు. ఇలాంటి ముఖ్యమైన కేసుల్లో, దేశం మొత్తం చూస్తున్న కేసులో సలహాలు కోరతారు. జ్యుడీషియల్ పరిధిలో సలహాలు తీసుకుంటారు. ఏ తప్పూ జరగలేదు, ఏ తప్పూ చేయలేదు కాబట్టి సలహాలు తీసుకొని, ఇంప్లిమెంట్ చేశారేమో..! దాంట్లో రాజకీయం చేయడానికి ఏముంది? జడ్జిలపై, టీటీడీ అధికారులపై నిందలు వేయడం సిగ్గుచేటు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? టీడీపీ స్టాండ్ ఎలా ఉంటుందంటే.. ఈ ఏడాది సెపె్టంబర్ 1న చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, అత్యంత విశిష్టత కలిగిన సింహాచలంలో రూ.55 వేలు హుండీ డబ్బులు చోరీ చేస్తూ దేవస్థానం ఉద్యోగి రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ పట్టుబడ్డారు. ఉద్యోగి రమణను సస్పెండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ ను పోలీసులకు అప్పగించి, ఆ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఆ వ్యకిని ఎందుకు జైల్లో పెట్టలేదు? మరి చంద్రబాబు దీనిపై ఎందుకు విచారణ చేయలే దు? మొత్తం వారిద్దరి ఆస్తులపై విచారణ చేసి, వాటిని మొత్తం ఎందుకు స్వా«దీనం చేసుకోలేదు? పైగా సింహాచలం ఆలయానికి ధర్మకర్త టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్రెడ్డి చైర్మన్గా ఉంటే ఒక న్యాయం..! అదే అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా ఉంటే ఇంకో న్యాయం..! మరి ఆయన మీద విచారణ ఎందుకు చేయడం లేదు? ఎక్కడైనా న్యాయం ఒక్కటే కదా!!టీటీడీలో బాబు స్కాములు ఇవీ...!రాష్ట్రంలో దేవుడి సొమ్ముతో స్కామ్లు చేసింది చంద్రబాబే. తిరుచానూరు మార్కెట్ యార్డ్ నుంచి కపిలతీర్థం వరకు శ్రీనివాస సేతు 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపాదన చేశారు. ఇందులో 67 శాతం ఖర్చు టీటీడీ, 33 శాతం ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించారు. అప్పటి తిరుపతి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను చంద్రబాబు పిలిపించుకుని రూ.684 కోట్లతో శ్రీనివాససేతు కట్టేయమని చెప్పారు. అయితే, ఆ మీటింగ్లో టీటీడీ ప్రతినిధులు లేకుండానే.. ఏకంగా 67 శాతం డబ్బులు టీటీడీ నుంచి తీసుకునేలా నిర్ణయం తీసేసుకున్నారు. అసలు బోర్డు అనుమతి, ఆమోదం లేకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇది కాదా స్కామ్? మన ప్రభుత్వం వచ్చాక టీటీడీ బోర్డు రీ విజిట్ చేసి రూ.40 కోట్లు ఖర్చు తగ్గించింది. కొత్త బోర్డు రాకపోయి ఉంటే ఆ రూ.40 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయేవి? కమీషన్ల కోసం కక్కుర్తి! టీటీడీ డబ్బుల్లో 10 శాతానికి మించి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు. ఇది టీటీడీ రూల్. చంద్రబాబు హయాంలో కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్లో పెట్టించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచి్చన తర్వాత బోర్డు ఆ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి ఎస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బును విత్ డ్రా చేసి జాతీయ బ్యాంకులో పెట్టింది. ఆ తర్వాత మూడు నెలలకు ఎస్ బ్యాంక్ ఆర్థికంగా కుదేలయ్యింది. ఒకవేళ చంద్రబాబు పెట్టిన రూ.1,300 కోట్లు ఎస్ బ్యాంక్లోనే ఉండి ఉంటే ఆ డబ్బు ఏమయ్యేది? మరి ఏది స్కామ్? మాకు ఇవన్నీ తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాల్లో లాగకూడదని సమస్య పరిష్కరించి, సరిదిద్దాం. మన ఇప్పుడు వీళ్లు చేసేవి చూస్తుంటే అసలు ఏమీ జరగకపోయినా, మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తూ, రివర్స్ అబద్ధాలు చెబుతున్నారు. వాస్తవానికి టీటీడీ ఒక స్వతంత్ర వ్యవస్థ. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విధానాలను తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేస్తున్నారు. అలాంటి ఆలయాన్ని, ఏకంగా దేవుడి ప్రతిష్టను మంటగలుపుతున్నామనే కనీస ధ్యాస కూడా లేకుండా, వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తూ చంద్రబాబు అత్యంత హేయమైన రాజకీయాలు చేస్తున్నారు. అది చంద్రబాబు సొంత సిట్! లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు వేసిన సిట్ చూస్తే వాళ్ల బాగోతం తెలిసిపోతుంది. సిట్లో ఉన్న గోపీనాథ్ జెట్టి.. ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పని చేసిన కృష్ణయ్యకు అత్యంత సమీప బంధువు (ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో దిగిన ఫొటో ప్రదర్శించారు). కృష్ణయ్యపై చంద్రబాబుకు ఎంత ప్రేమ అంటే.. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎన్టీఆర్ ట్రస్టులో ట్రస్టీగా పెట్టుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్ను చేశారు. ఇలాంటి వ్యక్తి సమీప బంధువు సిట్ ఆఫీసర్లలో ఒకరు. మరో ఆఫీసర్ డీఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ట త్రిపాఠి ఎలాంటి వాడో చెప్పాల్సిన పనిలేదు. పల్నాడు జిల్లాలో ఆయన సృష్టించిన అల్లకల్లోలం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం కోసం భుజాన వేసుకుని పాకులాడారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ అధికారిని పక్కన కూర్చోబెట్టుకుని డీఐజీ స్థానం ఇచ్చి.. ఆయన చేస్తున్న మాఫియా కలెక్షన్లలో ప్రముఖ ప్రధాన పాత్ర ఇచ్చారు. ఇలాంటోళ్లు అందరూ సిట్లో ఉన్నారు. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అతను వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) పీఏ. వీపీఆర్ ఒక టీడీపీ ఎంపీ. ఆయన దగ్గర నుంచి ప్రతి నెలా అప్పన్న జీతం (చెక్కులు) తీసుకుంటున్నాడు. పైగా ఏపీ భవన్ ఉద్యోగి. వీపీఆర్ పీఏ, తర్వాత ఏపీ భవన్ ఉద్యోగి. మరి వైవీ సుబ్బారెడ్డి పిక్చర్లోకి ఎలా వచ్చారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఎంతసేపూ వైవీ సుబ్బారెడ్డి పీఏ అని గోబెల్స్ ప్రచారం చేస్తూ డ్రిల్ చేస్తున్నారు!. -
ఆ 53 వేల ఎకరాలకే దిక్కులేదు..
అధికారంలో ఉంటే చంద్రబాబుకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి? నేషనల్ హైవేలు కిలోమీటర్కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. అందుకే ఇలా అన్నీ స్కాములు. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి గతంలో తీసుకున్న 53 వేల ఎకరాలకే దిక్కులేదు.. ఇప్పుడు రైతుల నుంచి ఇంకో 53 వేల ఎకరాలు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు వెనుకాడటం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్పారు. రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘అమరావతి గురించి మీరే చెప్పాలి. ఇంతకు ముందు అంతా చంద్రబాబు ఏమన్నాడు? 2014–19 మధ్య 53 వేల ఎకరాలు తీసుకుంటూ అసలు ఇది ఇంటర్నేషనల్ రాజధాని.. సింగపూర్, గింగపూర్ ఎక్కడికి పోవాలో.. మన దగ్గర నుంచే ఏదైనా కానీ.. మన రాజధానిని చూసి వాళ్లు కాపీ కొట్టే పరిస్థితుల్లోకి దీన్ని బిల్డప్ చేస్తున్నానని మనకు బాహుబలి సెట్టింగ్స్ చూపించారు. ఆ 53 వేల ఎకరాల్లో ఆయన రాజధాని కట్టింది ఎంత? రాజధాని కట్టడం కథ దేవుడెరుగు.. ఆ 53 వేల ఎకరాల్లో రోడ్లు వేయడానికి, కరెంటు ఇవ్వడానికి, డ్రెయినేజీ కనెక్షన్లు ఇవ్వడానికి, నీళ్లు ఇవ్వడానికి.. వీటికే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుందని తానే డీపీఆర్ ఇచ్చాడు. అంటే ఆ 53 వేల ఎకరాలకే లక్ష కోట్ల రూపాయలు కావాలని సినిమా చూపిస్తూ రూ.5 వేల కోట్లు పెట్టాడు. మళ్లీ ఈ రోజు ఏం చేస్తున్నాడు? ఆ 53 వేల ఎకరాలు సరిపోదు అంటున్నాడు.’ అని చెప్పారు.స్కాముల కోసమే అది చాలదంటున్నారు‘ఆ రోజేమో సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అన్నాడు. 8 వేల ఎకరాలు మిగిలిందని, దాంతోనే రాజధాని అయిపోతుందని చెప్పాడు. మళ్లీ ఈ రోజు అది చాలదంటున్నాడు. అధికారంలో ఉంటే ఆయనకు స్కాములే గుర్తుకొస్తాయి. ఎవరెవరికి భూమి ఇవ్వాలి? ఎవరెవరి దగ్గర ఎంత పుచ్చుకోవాలి? చదరపు అడుగు నిర్మాణం రూ.4 వేలు అయ్యే దగ్గర ఎలా రూ.10 వేలకు కాంట్రాక్ట్ ఇవ్వాలి. నేషనల్ హైవేలు కిలోమీటర్కు రూ.25 కోట్లు అయ్యే చోట రూ.54 కోట్లు పెట్టి ఎలా దండుకోవాలి? ఇలా అన్నీ స్కాములే కాబట్టి రాజధానిలో పనులు నిరంతరం జరుగుతుండాలనేది ఆయన ఉద్దేశం. ఇక్కడ జరిగేది ఒక్కటే... ఈయన, ఈయన బినామీలు ముందుగానే ల్యాండ్ కొంటారు. కొన్న తర్వాత ఆ పక్కన భూములను ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటారు. ఆ తర్వాత తన బినామీలకు మాత్రం ప్లాట్లు ఇచ్చుకోవాల్సిన చోట ఇచ్చుకుంటాడు. మిగిలిన వాళ్లకు ప్లాట్లు వేరే చోట ఇస్తాడు. అక్కడ ఎప్పటికీ అభివృద్ధి జరగదు. అంటే మిగతా వాళ్లు గాలికి పోతారు. వేసే రోడ్లు ఏవో వీళ్ల మనుషులకు ప్లాట్లు ఇచ్చిన చోట వేసుకుంటారు’ అని చెప్పారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తనపై ఉన్న అవినీతి కేసులు తీసేయించుకుంటున్నారన్న ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయస్థానాల ద్వారానే పోరాటం చేయగలుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే.. పై నుంచి దేవుడు చూస్తుంటాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తుంటారు. దేవుడు, ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి’ జగన్ అన్నారు. -
చినబాబు డైరెక్షన్లోనే పేదల ఇళ్లు నేలమట్టం
‘‘ నాపేరు డి.నాగరాజు. తినీతినక కష్టపడిన సొమ్ముతో 9 ఏళ్ల క్రితం విజయవాడ జోజినగర్లో స్థలం కొనుక్కున్నాను. కార్పొరేషన్లో ప్లాన్ తీసుకొన్నాను. బ్యాంకు రుణంతో ఇల్లు కట్టుకున్నా. నా కళ్లముందే ఆ ఇంటిని బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ నెలాఖరు వరకు సమయం ఉందని కోర్టు ఉత్తర్వు చూపించినా కోర్టు అమీనాగానీ, పోలీసులుగానీ పట్టించుకోలేదు. కోర్టు ఆర్డర్ కాపీని ఫోన్లో చూపిస్తుంటే లాయర్, అమీనా వెటకారంగా మాట్లాడారు. వ్యవస్థలు అమ్ముడు పోతుంటే నాలాంటి సామాన్యులు ఎలా బతకాలి? నాలుగు నెలల నుంచి నరకం చూపించారు. ఉన్న పళంగా నడిరోడ్డుపైకి నెట్టారు’’ – ఇదీ చంద్రబాబు పాలనలో ఓ బాధితుడి ఆక్రోశం సాక్షి ప్రతినిధి,విజయవాడ/భవానీపురం(విజయవాడపశ్చిమ): చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలపై కత్తిగట్టింది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి బలవంతంగా విజయవాడ జోజినగర్లోని 42 ఇళ్లను బుధవారం నేలమట్టం చేసింది. రూపాయిరూపాయి కూడబెట్టుకొని, స్థలం కొని ఇళ్లు కట్టుకొన్న పేదల జీవితాలను రోడ్డు పాలు చేసింది. విజయవాడ నడిబొడ్డున్న ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే 2.17 ఎకరాల స్థలంపై కన్నేసిన పచ్చనేతలు పక్కా ప్రణాళికతో వ్యవస్థలను మెనేజ్ చేశారు. చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో సుప్రీం కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఆగమేఘాలపై 42 ఇళ్లను నేలమట్టం చేశారు. పేదలను నడిరోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఈ తతంగం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు భాదితులు బహిరంగానే విమర్శిస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణం కోసమే! విజయవాడ నడిబొడ్డున జోజినగర్లో ఉన్న ఈ భూమి రూ.కోట్లు విలువ చేస్తుంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని తొలుత ఒకరికి అగ్రిమెంటు చేశారు. వారు స్పందించక పోవడంతో 1980 ప్రాంతంలో స్థల యజమాని మరో వ్యక్తికి విక్రయించారు. ఆ కొనుగోలు చేసిన వ్యక్తి ప్లాట్లు వేసి 42 మందికి విక్రయించి రిజి్రస్టేషన్లు చేశారు. ఇందులో కార్పొరేషన్ నుంచి ఇళ్ల నిర్మాణకోసం అవసరమైన అనుమతులు, విద్యుత్, తాగునీరు కనెక్షన్లు తీసుకున్నారు. బ్యాంకు నుంచి రుణాలు పొంది ఇళ్లు నిరి్మంచుకున్నారు. వీటిలో చాలా ఇళ్లు ఇప్పటికే పలువురి చేతులు మారి రిజి్రస్టేషన్లు జరిగాయి. అయితే స్థలం తొలుత అగ్రిమెంటు చేసుకున్న వ్యక్తి నుంచి పొందిన కాగితాల సాయంతో పచ్చనేతలు దొడ్డిదారిన ఓ సొసైటీని ఏర్పాటు చేసి, వారికి అనుకూలంగా అన్ని రకాల పత్రాలు సిద్ధం చేసుకుని చక్రంతిప్పారు. కోర్టు ద్వారా స్థలాన్ని కాజేయడానికి తీవ్ర యత్నం చేసి సఫలీకృతులయ్యారు.బహుళ అంతస్తుల నిర్మాణానికి బెంగళూరుకు చెందిన బడా వ్యక్తులు, చినబాబు, పార్లమెంటు ప్రజాప్రతినిధి డైరెక్షన్లో బుల్డోజర్లతో కూల్చివేతలకు ఒడిగట్టారు. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. ఒకవేళ తమ రిజిస్ట్రేషన్లు అక్రమమైతే వాటిని చేసిన అధికారులపైనా, భవన నిర్మాణానికి అనుమతులిచ్చిన మున్సిపాలిటీ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన ఉద్ధృతం ఇళ్లు కోల్పోయిన బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆందోళనలను వారు ఉద్ధృతం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ గోడు వినిపించుకునేందుకు బాధితులు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే వారిని పోలీసులు అనుమతించలేదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. కూల్చివేతలపై స్టే ఉందని, తాము ఖాళీ చేసేందుకు ఈనెలాఖరు వరకు సమయం ఉందని చెప్పినా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంలో బుధవారం వాదనలు ఉన్నాయని, నాలుగు గంటలపాటు సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. గురువారం ఉదయం భవానీ పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అధికారులు అసభ్యంగా ప్రవర్తించారని, శ్రీలక్ష్మి రామ కో–ఆపరేటివ్ సొసైటీ అక్రమాలకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత బాధితులు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయానికి వెళ్లి «న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. ఎన్నికల సమయంలో తమ సమస్యను వివరిస్తే న్యాయం చేస్తామన్న కూటమి నేతలు ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోలవరం రిజర్వాయర్ కాదు.. బ్యారేజే
సాక్షి, అమరావతి: పోలవరం జలాశయం కాదు.. కేవలం బ్యారేజ్ మాత్రమేనని గురువారం లోక్సభలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ పరోక్షంగా తేల్చిచెప్పారు. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లని తెలిపారు. సకాలంలో ప్రాజెక్టును పూరి చేయడం కోసం రూ.12,157 కోట్లను అదనపు సహాయం కింద కేంద్రం ఇస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.20,658 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానంపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సీఆర్ పాటిల్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లుగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) 2019లో ఆమోదించింది. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచి్చన మేరకు 45.72 మీటర్ల గరిష్ఠమట్టంలో నీటిని నిల్వచేసేలా పోలవరాన్ని పూర్తిచేయాలంటే ఆ మేరకు నిధులు అవసరం. కానీ.. పోలవరం ప్రాజెక్టులో నీటినిల్వ కనీసమట్టం (ఎండీడీఎల్) 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ.. ప్రాజెక్టును పూర్తిచేసేలా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మేరకు పనులు పూర్తిచేయడానికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లుగా తేల్చింది. ఇప్పటిదాకా విడుదల చేసిన నిధులు పోను.. ప్రాజెక్టును పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,157 కోట్లను విడుదల చేస్తామని పేర్కొంది. ప్రాజెక్టును 2027 మార్చిలోగా పూర్తిచేయాలని షరతు పెట్టింది. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీటినిల్వను పరిమితం చేస్తే.. 115.4 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయవచ్చు. కానీ.. ఆ స్థాయిలో నీటిని నిల్వచేస్తే కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, కేవలం 1.98 లక్షల ఎకరాలకే.. అదీ గోదావరి వరదల సమయంలో మాత్రమే నీటిని అందించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వచేస్తే పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా డెల్టాలో 13.8 లక్షలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలను స్థీరికరించడంతోపాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.8 టీఎంసీలను సరఫరా చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ.. పోలవరంలో నీటినిల్వ ఎత్తును 41.15 మీటర్లకే కేంద్ర కేబినెట్ పరిమితం చేస్తూ తీర్మానం చేసినా ఆ సమావేశంలో ఉన్న టీడీపీ మంత్రులు నోరుమెదపలేదు. ఇక లోక్సభలో గురువారం పోలవరం సవరించిన అంచనా వ్యయం రూ.30,436 కోట్లేనని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాతపూర్వకంగా తేల్చిచెప్పినా టీడీపీ ఎంపీలు మౌనం దాల్చారు. అంటే.. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తువరకే నీటినిల్వను పరిమితం చేస్తూ ప్రాజెక్టును పూర్తిచేయడానికి నిధులు ఇస్తున్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసినట్లు అర్థమవుతోంది. నీటినిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేస్తే.. పోలవరం రిజర్వాయర్ కానేకాదని.. కేవలం బ్యారేజీగా మిగిలిపోతుందని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు. 2005లోనే గోదావరి–కృష్ణా అనుసంధానం ఇక పోలవరం (గోదావరి)–విజయవాడ(కృష్ణా) అనుసంధానాన్ని ఎన్డబ్ల్యూడీఏ 1999లో ప్రతిపాదించిందని.. దాన్ని 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. పోలవరం కుడికాలువ ద్వారా 4,666 మిలియన్ క్యూబిక్ లీటర్ల (164.82 టీఎంసీలు) గోదావరి–కృష్ణా అనుసంధానం చేపట్టందని వివరించారు. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పీఎఫ్ఆర్ను 2025 మే 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి సమర్పించిందని తెలిపారు. దానిపై బేసిన్లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల అభిప్రాయం కోరామని, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
నాలుగొచ్చినా.. నరక‘వేతన’ జీతమేది బాబూ?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సర్కారు ఈ నెల 4వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు జమ చేయలేదు. కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకూ జీతాలు పడలేదు. వ్యవసాయ, జలవనరులు, పంచాయతీరాజ్, సమాచార, ప్రణాళికా శాఖలో పని చేసే ఉద్యోగులు వేతనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితంగా వారు రుణ వాయిదాల చెల్లింపులు.. పిల్లల ఫీజులు, ఖర్చులకు నరకయాతన అనుభవిస్తున్నారు. 3వతేదీన అరకొరగా కొన్నిశాఖల్లో అదీ అతికొద్దిమందికి మాత్రమే జీతాలు జమైనట్టు సమాచారం. దీంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు చెల్లింపులను విడతల వారీ తంతుగా చంద్రబాబు సర్కారు మార్చేసిందని మండిపడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తామని గత ఎన్నికల ముందు ప్రతిసభలోనూ ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినెల మాత్రమే ఉద్యోగులకు ఒకటో తేదీ చెల్లించారని, ఆ తర్వాత పూర్తిగా చతికిలపడ్డారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతితక్కువ గౌరవ వేతనాలు తీసుకునే ఉద్యోగులకూ సర్కారు చెల్లింపులు చేయలేకపోతోందని ధ్వజమెత్తుతున్నారు. మంగళవారం రూ.3000 కోట్లు అప్పు చేసినప్పటికీ బాబు సర్కారు జీతాలు చెల్లించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులపై వ్యత్యాసం చూపడమేమిటీ? చంద్రబాబు సర్కారు ఉద్యోగులందరూ సమానం కాదనే ధోరణిలో వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ముందుగా వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగుల్లో విభజన తీసుకొస్తోందని, అలాగే ఇప్పటికే పలుమార్లు రోడ్డెక్కిన ఉపాధ్యాయులకు 3న జీతాలు జమ చేశారని, మిగతా వారికి చెల్లించలేదని.. ఇలా ఉద్యోగుల్లో విభజన తీసుకురావడం సరికాదని ఉద్యోగవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చిరుద్యోగులూ ఎదురు చూపే కూటమి సర్కారులో చిరుద్యోగులు వేతనాల కోసం ప్రతి నెలా ఎదురు చూడాల్సి వస్తోందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. 104 ఉద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, హోంగార్డులు, వీఆర్ఏలుఏ, ఆరోగ్య మిత్రలు వేతనాల కోసం 10–15వ తేదీ వరకు నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులైతే వేతనాల కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు. జనవరి వస్తే ఐదు డీఏలు పెండింగ్ డిసెంబర్ వచ్చేసింది జనవరి వస్తే మొత్తం ఐదు డీఏలు పెండింగ్లో ఉంటాయి. అయితే ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే మంజూరు చేసి అదీ మూడు వాయిదాల రూపంలో చెల్లిస్తామని పేర్కొందని, ఇప్పుడు ప్రతీ నెలా వేతేనాలను కూడా 1వ తేదీన కాకుండా విడతల వారీగా పలు తేదీల్లో చెల్లించే విధానాన్ని చంద్రబాబు సర్కారు అమలు చేస్తోందని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏ నెలా ఒకటినే జీతాల్లేవు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను పట్టించుకోవడం లేదని, చులకనగా చూస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఏ నెలా ఉద్యోగులందరికీ 1న జీతాలు, పెన్షన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రతి నెలా ఉద్యోగులు జీతాల కోసం 10వ తేదీ వరకు ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలు, హోంగార్డులు లాంటి చిరుద్యోగులకూ జీతాలు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. వీఆర్ఏలు గౌరవ వేతనంతో పనిచేస్తారని, ఆ గౌరవ వేతనం కూడా సకాలంలో ఇవ్వకపోడం బాధాకరమన్నారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు ఒక తేదీన మరో కొంత మందికి మరో తేదీన జీతాలు చెల్లించడం అనేది ఇప్పుడే కొత్తగా చూస్తున్నామని పేర్కొన్నారు. -
వెర్రితలలు వేస్తోన్న రెడ్బుక్ రాజ్యాంగం
తనపై ఉన్న లిక్కర్ కేసును నీరుగార్చేందుకు, కొట్టేయించేందుకు... వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన మద్యం పాలసీని తప్పుగా చూపిస్తూ లేని లిక్కర్ స్కామ్ను చంద్రబాబు సృష్టించారు. ఇక రాష్ట్రంలో కుటీర పరిశ్రమల్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టింది టీడీపీ వాళ్లే. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్లు. రెడ్బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా? మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ అసభ్య పదజాలంతో తనను లైంగికంగా వేధిస్తున్నాడని మండలాఫీసు అటెండర్ అయిన ఒంటరి మహిళ ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్లినా, వాట్సాప్ మెసేజ్లు చూపించినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. బాధ్యత గల ప్రభుత్వమైతే గలీజ్ మెసేజ్లు పెట్టిన పీఏను లోపలేయాలి. –వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలతో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమ కేసులతో నిర్బంధిస్తూ ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... గత 19 నెలలుగా వీళ్లే ప్రభుత్వంలో ఉన్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, ఆముదాలవలస, నెల్లూరు, పాలకొల్లు, రేపల్లె... ఇలా అన్నిచోట్లా కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు వీళ్లు పెట్టినవే. (రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులతో కల్తీ మద్యం ఫ్యాక్టరీల నిర్వాహకులు దిగిన ఫొటోలు, సీజ్ చేసిన కల్తీ లిక్కర్ బాటిళ్ల ఫొటోలను చూపించారు) కల్తీ మద్యం మీద నచ్చిన బ్రాండ్ పేరుతో లేబుళ్లు వేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ చానల్ కూడా వాళ్లదే. తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుంటూ ఫొటో దిగారు. ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డ ఆయన పార్టనర్ జనార్దనరావు, సురేంద్రనాయుడులు చంద్రబాబు, లోకేశ్తో ఫొటోలు దిగారు. అనకాపల్లి జిల్లా పరవాడలో స్పీకర్ అయ్యన్నపాత్రుడితో, మంత్రి లోకేశ్తో ఇలా పలుకుబడి కలిగిన టీడీపీ నేతలతో కల్తీ లిక్కర్ మాఫియా నడుపుతున్నవాళ్లు ఎక్కడపడితే అక్కడ ఫొటోలు దిగుతున్నారు. వీళ్లదే పోలీస్ వ్యవస్థ, వీళ్లవే బెల్టు షాపులు, వీళ్లవే పర్మిట్ రూమ్లు. రెడ్బుక్ పాలనలో వీళ్లుగాక ఇంకెవరికైనా నడిపే ధైర్యం ఉందా?. కానీ, ములకలచెరువు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ను తీసుకుపోయారు. కల్తీ చేసిన జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్లను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వీళ్ల ప్రభుత్వంలో అన్నీ వీళ్లే చేస్తూ, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో... జోగి రమేష్ కల్తీ చేయిస్తున్నారంటున్నారు. ఇదెక్కడి అన్యాయం. దొంగే దొంగ దొంగ అంటున్నాడు. ఒక మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? జోగి రమేష్, ఆయన తమ్ముడిని అరెస్ట్ చేస్తే... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్న రమేష్ కుమారుడిపై కేసులు పెడుతున్నారు.మిథున్ను ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ఆశ్చర్యపడే పరిస్థితిమద్యం అక్రమ కేసులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మిథున్రెడ్డితోపాటు ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతోమందిని జైలుకు పంపించారు. అసలు మిథున్రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో? ఆయనకు ఏం సంబంధమో? అని జడ్జి కూడా ఆశ్చర్యపడి తీర్పు రాసే పరిస్థితి. కృష్ణమోహన్రెడ్డి, ధనంజయరెడ్డి, ఎంఎన్సీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డిలను నిర్బంధించారు. రూ.11 కోట్లు దొరికినట్లుగా చూపిస్తున్నారు. ఆ నోట్లపై ఉన్న నంబర్ల ద్వారా ఏ బ్యాంకులో డ్రా చేశారో? ఎప్పుడు డ్రా చేశారో? చెప్పాలని బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. రెడ్ హ్యాండెడ్గా డబ్బు దొరికితే పక్కనపెడతారు కదా? కానీ, వీళ్లు అన్నీ కలిపేశాం అంటున్నారు. ఆ డబ్బు బయటపడితే ఇంజనీరింగ్ కాలేజీవని తెలుస్తుందని, అది తెలియకుండా లిక్కర్ అని బ్యాండ్ వేసి రూ.11 కోట్లు వీళ్లే పెట్టి కేసులు బిల్డ్ చేస్తున్నారు. వీళ్లు ఏ స్థాయికి పోతున్నారంటే... భాస్కర్రెడ్డి, మిథున్రెడ్డి, కాకాణి గోవర్థన్రెడ్డి, వల్లభనేని వంశీ, పినిపె శ్రీకాంత్పై తప్పుడు కేసులు పెట్టారు. సాక్ష్యాలు సృష్టించి, అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు. పోసాని కృష్ణమురళి వంటి సామాన్యులు, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును తప్పుడు కేసులతో అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపైనా గంజాయి కేసులు పెడుతున్నారు. విశాఖలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడిపై గంజాయి కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామని ఎఫ్ఐఆర్లో రాశారు. కానీ, ఇంటి దగ్గర్లోని టిఫిన్ సెంటర్కు వెళ్తుండగా, మద్దిలపాలెం వద్ద పట్టుకున్నట్లు, స్టేషన్కు తరలిస్తున్నట్లు సీసీకెమెరాలో రికార్డైంది. అతడి బైక్ను 14 కి.మీ. దూరంలో ఉన్న రైల్వే న్యూకాలనీకి తీసుకెళ్లారు. ఆ బైక్కు ఉన్న జీపీఎస్ ద్వారా ఈ విషయం తెలిసింది. పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి తీసుకువెళ్లి గంజాయి దొరికిందని చెప్పి కొండారెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక బాధ్యత గల ప్రభుత్వమైతే సాలూరులో ఒంటరి మహిళకు గలీజ్ మెసేజ్లు పెట్టిన మంత్రి పీఏను లోపలేయాలి. కానీ, కేసులు పెట్టకపోగా, బాధితురాలు దిక్కుతోచక జర్నలిస్టులకు చెబితే, ఆ వార్త రాసిన ‘సాక్షి’ విలేకరి మీద కేసులు పెట్టారు. ఇది రెడ్బుక్ పాలన వెర్రితలలు వేస్తోందనడానికి నిదర్శనం.పిన్నెల్లిపై 16 తప్పుడు కేసులుమా పార్టీ మాచర్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డిని తప్పుడు కేసులో ఇరికించాలని చూస్తున్నారు. టీడీపీకి చెందినవారి గ్రూపుల తగాదాలలో వాళ్లూవాళ్లూ చంపుకొంటే మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసులు పెట్టారు. ఆ ఘటనపై మీడియా సాక్షిగా టీడీపీ హయాంలో... పల్నాడు జిల్లా అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు ఏమన్నారో మీరే చూడండి. (ఎస్పీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూపించారు) ‘గుండ్లపాడు గ్రామానికి చెందిన జె.వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య, జె.కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోతో ఢీకొట్టి చంపారు. చనిపోయినవారికి తోట చంద్రయ్య కుటుంబంతో ఎలాంటి బంధుత్వం లేదు. ఇద్దరూ టీడీపీ వారే’ అని ఎస్పీ చెప్పారు. అంతేకాదు హతులు, హంతకులు టీడీపీవారేనని ఏకంగా ట్వీట్ చేశారు. ఈనాడులో కూడా అదే రాశారు. కానీ, ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడిని అరెస్టు చేశారు. ఎక్కడన్నా న్యాయం, ధర్మం ఉందా? ఇలాంటివి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. పిన్నెల్లిపై ఈ 19 నెలల్లో 16 తప్పుడు కేసుల పెట్టారు. ఆయన్ను ఇబ్బందులు పెడుతున్నారు. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో ఉంచారు. -
‘ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు’
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీ మేడ రఘునాథ్రెడ్డి పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, డిసెంబర్ 4వ తేదీ) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఎక్సైజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..‘ ఏపీలో పొగాకు, పత్తి, వరి, మామిడి, అరటి రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంట నష్టం వివరాలను కూడా నమోదు చేయడం లేదు. ఏపీ పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి జీవనోపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు. పొగాకు ఉత్పత్తి పెరగడంతో ధరలు పడిపోయి రైతులు కష్టాలు పడుతున్నారు. పొగాకు రైతులు కనీసం తమ పంట ఖర్చును కూడా తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు. వేలాదిమంది రైతులకు ఇదొక పెద్ద సమస్యగా మారింది. రకరకాల కారణాలతో పొగాకును బోర్డు తిరస్కరిస్తుంది. పొగాకు బోర్డు తగిన చర్యల వల్ల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఏపీ రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. ఎక్సైజ్ డ్యూటీ వల్ల పొగాకు రైతులపై పడే ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేయాలి. పొగాకు ఉత్పత్తి , మార్కెట్ స్థిరీకరణ అంశాలపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ఉపాధిని దెబ్బతీసేలా ఎక్సైజ్ పన్నులు ఉండొద్దు’ అని పేర్కొన్నారు. -
దొంగ, పోలీస్.. రెండూ చంద్రబాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు బెయిల్ కండీషన్స్ను ఉల్లంఘిస్తున్నారని.. ఆయన అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను బెదిరిస్తున్నారంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు.. తానే దొంగ, తానే పోలీసు. తనపై ఉన్న అవినీతి కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారు. ఇది బెయిల్ కండీషన్స్ను ఉల్లంఘించడం కదా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.‘‘చంద్రబాబు ఇవాళ బెయిల్ మీద ఉన్నారు. అమరావతిలో బాబు, ఆయన బినామీలు అవినీతికి పాల్పడ్డారు. బ్లాక్లిస్ట్లో ఉన్న తన అనుచరుడికి ఫైబర్నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారు. రూ.వందల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు గత పాలనలో కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్ బ్యాంకులో రూ.1300 కోట్లు డిపాజిట్ చేశారు. మేం వచ్చాక రూ. 1300 కోట్లను వెనక్కి తీసుకున్నాం. వెనక్కి తీసుకున్న కొన్ని రోజులకే ఎస్ బ్యాంక్ దివాలా తీసింది. 1300 కోట్లు వెనక్కి తీసుకోకపోతే పరిస్థితి ఏంటి?’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘స్కిల్ స్కామ్లో రూ.370 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారు. స్వయంగా బాబు సంతకాలు చేసిన పత్రాలు ఉన్నాయి. అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉంది. కానీ బాబు, ఆయన బినామీలు స్కామ్లు చేస్తున్నారు. ఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి ఫైబర్ నెట్ కట్టాబెట్టారు. వందల కోట్లు దోచిపెట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేశారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్పై బాబు సంతకం చేశారు. బాబు అండ్కో గోబెల్స్ను మించిపోయారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
రెడ్బుక్ వెర్రితలలు వేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు నుంచి బయటపడేందుకే లేని కుంభకోణం ఒకటి సృష్టించారని.. ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపడ్డారు. రెడ్ బుక్ వెర్రితలలు వేస్తోందన్నారు. ‘‘కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీపీ వాళ్లే. మంత్రులు, ఎమ్మెల్యేల మనుషులే కల్తీ లిక్కర్ దందా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ దందా బయటపడింది. జయచంద్రారెడ్డికి బాబు స్వయంగా బీఫామ్ ఇచ్చారు. అనకాపల్లి, పరవాడలో కూడా కల్తీ మద్యం కేంద్రాలు నడిపారు. ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ కల్తీ మద్యం దందా చేస్తున్నారు. రాష్ట్రమంతా కల్తీ మద్యం దందా నడుపుతున్నారు. లిక్కర్, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్లన్నీ టీడీపీ వారివే. మ్యానుఫాక్యరింగ్, డిస్ట్రిబ్యూషన్ అంతా టీడీపీ వాళ్లే. టీడీపీ నేతలకు పోలీసులు సహాయం చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.‘‘జోగి రమేష్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టారు. జోగి రమేష్ కుమారుడిపై కూడా అక్రమ కేసు పెట్టారు. పిన్నెల్లి సోదరులపై కూడా అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ వాళ్లే హత్యలు చేసుకుంటే పిన్నెల్లిని ఇరికించారు. టీడీపీ గ్రూప్ తగాదాల వల్లే హత్యలని ఎస్పీ చెప్పారు. టీడీపీ గొడవల వల్లే హత్యలని ఎస్పీ ట్వీట్ చేశారు‘‘మా పార్టీ విద్యార్థి నాయకుడు కొండారెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. కొండారెడ్డిపై గంజాయి అక్రమ కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో గంజాయి పట్టుకున్నామని ఎఫ్ఆర్ఐ రాశారు. నిజానికి కొండారెడ్డి టిఫిన్ చేస్తుండగా పట్టుకెళ్లారు. బైక్కు జీపీఎస్ ట్రాక్ ఉంది కాబట్టి.. పోలీసుల దౌర్జన్యం బయటపడింది. పోలీసులు ఇలా చేస్తే వ్యవస్థలు బతుకుతాయా? రెడ్ బుక్ను పోలీసులు ఫాలో అయితే ఎలా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డిని వేధించారు. మిథున్రెడ్డి బెయిల్ సమయంలో జడ్జి సైతం ఎందుకు అరెస్ట చేశారని ఆశ్చర్యపోయారు. మా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారు. కాకాణి, వంశీ పోసాని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టులను.. చివరకు ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులనూ వేధించారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్పై ఇప్పటివరకు కేసు లేదు. బాధిత మహిళ ఆధారాలు చూపించినా విచారణ లేదు. వాట్సాప్ మెసేజ్లు చూపించినా పోలీసుల్లో చలనం లేదు. వార్త రాసిన సాక్షి విలేకరిపై కేసు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. -
స్టీల్ప్లాంట్పై బాబు అప్పుడో మాట.. ఇప్పుడో మాట: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: స్టీల్ప్లాంట్పై చంద్రబాబు ఎన్నికల ముందు ఏమన్నారు?.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటూ వైఎస్ జగన్ నిలదీశారు. విశాఖలో ఉక్కుకు గనులు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని.. మా హయాంలో స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేశాం’’ అని వైఎస్ జగన్ వివరించారు. ఉక్కు కార్మికులపై పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తాడట..!’’ అంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘ఎస్ఏఐఎల్కు సొంత గనులున్నాయి. ఆర్ఐఎన్ఎల్కు సొంత గనులు లేవు. ఎస్ఏఐఎల్, ఆర్ఐఎన్ఎల్కు తేడా ఇదే. విశాఖ స్టీల్కు సొంత గనులు లేకే నష్టాలు. మిట్టల్కు సొంత గనులు ఇవ్వాలని బాబు అంటాడు. కానీ విశాఖ స్టీల్కు మాత్రం సొంత గనులు అడగరు. ప్రైవేట్కు గనులు అడుగుతారు కానీ.. ప్రభుత్వ ప్లాంట్ను పట్టించుకోరు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబు హయాంలో ఏపీసీవోఎస్ను నీరుగార్చారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీసీఎస్వోతో మేం ఒకటినే జీతాలు ఇచ్చేలా చేశామని.. చంద్రబాబు హయాంలో ఏపీసీవోఎస్ను నీరుగార్చారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ‘‘ఏపీసీవోఎస్లో రెండు, మూడు నెలలకు కూడా జీతాలు లేవు. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు. ఒక డీఏ కూడా వాయిదాల్లో ఇస్తారంట. రిటైర్డ్ అయ్యాక ఎరియర్స్ ఇస్తామన్నది బాబు ప్రభుత్వమే. ఎన్నికల్లో ఇచ్చిన పీఆర్సీ హామీ ఇప్పటికీ లేదు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘పీఆర్సీ ఛైర్మన్ కూడా లేడు. జీతాలు పెరగొద్దని పీఆర్సీ ఛైర్మన్ను నియమించలేదు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.31 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
గోబెల్స్కు గురువు మన చంద్రబాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సూపర్ సిక్స్ ఇచ్చేశామంటూ నిసిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది గాడిదలను కాయడానికా? అంటూ మండిపడ్డారు. రైతులకు కూటమి ఇచ్చిన ప్రతిమాట అబద్ధమన్న వైఎస్ జగన్.. ఉచిత బస్సు ప్రయాణం కొంతమందికే, కొన్ని బస్సులు పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సూపర్-6,7 సూపర్హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నుంచి గోబెల్స్ పాఠాలు నేర్చుకోవాలి. గోబెల్స్కు చంద్రబాబే టీచర్’’ అంటూ వైఎస్ జగన్ చురకలు అంటించారు. ‘‘నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. ఏమైంది?. రెండేళ్లలో ఒక్కొక్కరికి రూ. 72 వేలు ఇవ్వాలి ఏమైంది?. ఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ. 1500 ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.18 వేలు ఇవ్వాలి.. ఇచ్చారా?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అన్నారు.. ఇచ్చారా?. చంద్రబాబు ఈ-క్రాప్ వ్యవస్థను భ్రష్టుపట్టించారు’’ అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
సేవ్ ఆంధ్రా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రజలకు వాస్తవాలు తెలియాలని.. రైతులు పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమైనా రైతులను సంతోషపెట్టాలి.. రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుందన్నారు.‘‘పండుగలా ఉండాల్సిన వ్యవసాయాన్ని చంద్రబాబు హయాంలో దండగలా మారింది. మొంథా తుపాను ఇంకా కళ్లముందే కదలాడుతోంది. మొంథా తుపానుపై ఎంత బిల్డప్ ఇచ్చారో చూశాం. మొంథా తుపాన్ పీకను పట్టుకుని విసిరేసిట్లు బిల్డప్ఇచ్చారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. మా హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా హక్కుగా లభించింది. చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇన్ఫుట్ సబ్సీడీల మాటే ఎత్తరు. ఈ 19 నెలల పాలనలో 17 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే 19 లక్షల మందికి మాత్రమే పంటల బీమా ఉంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘బాబు పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. రూ.1100 కోట్ల ఇన్ఫుట్ సబ్సీడీ బకాయిలు ఉన్నాయి. మా హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమా ఇచ్చాం. మా హయాంలో ఉచిత పంటల బీమా కింద రూ.7800 కోట్లు ఇచ్చాం. ఉచిత పంటల బీమాకు బాబు ఉరేశారు. బాబు పాలనలో కౌలు ైతుల పరిస్థతి దయనీయంగా ఉంది. ..ఇన్ఫుట్ సబ్సీడీ బకాయిలు ఎప్పుడు ఇస్తారో బాబు చెప్పరు. ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పరు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాలి.. బాబు ఇచ్చింది 10 వేలే. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధరల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బాబు పాలనలో రైతులను దళారులు దోచుకుంటున్నారు. అయినా చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నారు.’’ అని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. -
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుంభవృష్టి
సాక్షి, అమరావతి/నెల్లూరు/వెంకటాచలం/తొట్టంబేడు: వాయుగుండం ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా చిట్టమూరులో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 27.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 27.2, ఇదగలిలో 24, తిరుపతి జిల్లా అల్లంపాడులో 23.8, విద్యానగర్లో 19.6, నెల్లూరు జిల్లా మనుబోలులో 17.9, మల్లంలో 17.6, అక్కంపేటలో 16.7, నెల్లూరులో 14 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. నెల్లూరు రూరల్, సైదాపురం, నాయుడుపేట, అల్లూరు, మనుబోలు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, తిరుపతి జిల్లా గూడూరు, చింతవరం, సూళ్లూరుపేట, తొట్టంబేడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం సాయంత్రం వరకు తిరుపతి జిల్లా తొట్టంబేడులో 4.7, నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 3.7, తిరుపతి జిల్లా మన్నారు పోలూరులో 3.2, చిత్తూరు జిల్లా నిండ్రలో 3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దిత్వా తుపాను బలహీనపడి రెండు రోజుల క్రితం వాయుగుండంగా మారగా.. బుధవారం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.జలదిగ్బంధంలో నెల్లూరు హైవే వాయుగుండం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది. వాగులు, వంకలు, పంట పొలాలు సముద్రాన్ని తలపించాయి. వెంకటాచలం మండలం చెముడుగుంట, కాకుటూరు, కాగితాలపూరు తదితర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై వరద ప్రవహించింది. బుజబుజ నెల్లూరు, చెముడుగుంట ప్రాంతాల్లో జాతీయ రహదారిపైకి వరద పోటెత్తడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంకటాచలం–మనుబోలు మధ్య జాతీయ రహదారిలో ఒక వరుస రోడ్డు మునిగిపోయింది. ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నెల్లూరు నుంచి వెంకటాచలం చేరుకునేందుకు సుమారు 3 గంటల సమయం పట్టింది. నెల్లూరు అయ్యప్పగుడి నుంచి హైవే రోడ్డు కలిసేచోట రోడ్డుపై మోకాలి లోతు నీరు చేరడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంకటాచలంలో 3 వేల ఎకరాల్లో మునిగిన నారు మళ్లు, నాట్లు మునిగినట్లు ప్రాథమిక అంచనా.నీట మునిగిన కాలనీలు భారీ వర్షాలకు నెల్లూరు నగరంలో సగం ప్రాంతాలు నీటమునిగాయి. చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, మల్లయ్యగుంట, బుజబుజ నెల్లూరులోని ఆర్టీసీ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, తల్పగిరి కాలనీ, శివగిరి కాలనీ, జనార్దన్రెడ్డి నగర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆర్డీటీ కాలనీ, సుందరయ్య కాలనీ డి–బ్లాకులోని కొన్ని ప్రాంతాలు, హరనాథపురం విస్తరిత(ఎక్స్టెర్ననల్) ప్రాంతాల్లో పెద్దఎత్తున వరద నీరు చేరింది. మాగుంట లేఅవుట్, రామలింగాపురం, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిలు నీటమునిగాయి.గోడ కూలి వృద్ధురాలి మృతి తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కానవరంలో బుధవారం కురిసిన వర్షానికి పూరి గుడిసె గోడకూలి నిద్రదిస్తున్న రేణుకమ్మ(59)పై పడింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
చంద్రబాబుపై కేసు మూసివేత డాక్యుమెంట్లను ఎందుకు బయట పెట్టడం లేదు?
సాక్షి, అమరావతి: అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకు చంద్రబాబుపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను మూసివేసిన విజయవాడ ఏసీబీ కోర్టు.. అందుకు సంబంధించిన కాపీలను బహిర్గతం చేయకపోవడంపై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోర్టులో ఏదీ రహస్యం కాదన్నారు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలను బహిర్గతం చేయడాన్ని సీఐడీ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. డాక్యుమెంట్ల కాపీలు బయటపెట్టే విషయంలో సీఐడీ ఎందుకు జంకుతోందని నిలదీశారు. ఏదో గూడుపుఠాణి లేకుంటే కోర్టు తీర్పు కాపీలను బయటకు రాకుండా చేయాల్సిన అవసరం ప్రాసిక్యూషన్కు ఏముందని ప్రశి్నంచారు. ప్రతి విషయాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, అది న్యాయపాలనలో భాగమని స్పష్టం చేశారు. కోర్టులోని ప్రతి డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంటేనని, అది కక్షిదారులు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తి కాదని తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా చెప్పిందని ఆయన ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రాసిక్యూషన్, నిందితులకే పరిమితం కాదు కోర్టు రికార్డులను ఏ వ్యక్తి అయినా నిబంధనలకు అనుగుణంగా తీసుకోవచ్చని, వాటిని తిరస్కరించే అధికారం ఎవరికీ లేదని పొన్నవోలు కోర్టుకు వివరించారు. చార్జిషీట్, ఎఫ్ఐఆర్లతో సహా అన్ని రికార్డులను థర్డ్ పార్టీ తీసుకోవచ్చన్నారు. ఈ విషయంలో ఏ చట్టంలోనూ నిషేధం లేదని నివేదించారు. ఎవిడెన్స్ చట్టం ప్రకారం సహేతుక కారణం చూపి ఏ వ్యక్తయినా కూడా కోర్టు డాక్యుమెంట్లను తీసుకోవచ్చని కేకే వేలుస్వామి వర్సెస్ పళని స్వామి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని వివరించారు. కోర్టు డాక్యుమెంట్లు కేవలం ప్రాసిక్యూషన్, నిందితులకే పరిమితం కాదని, ఫిర్యాదుదారులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు, సదుద్దేశం ఉన్నవారు ఎవరైనా కూడా తీసుకోవచ్చని ఎన్.శివశంకరయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచి్చందని కూడా ఆయన తెలిపారు. ఏ డాక్యుమెంట్నైనా తీసుకోవచ్చుకేవలం పార్ట్–1 కేసు డైరీని మాత్రమే బహిర్గతం చేయకూడదని, మిగిలిన ఏ డాక్యుమెంట్నైనా తీసుకోవచ్చని పొన్నవోలు కోర్టుకు వివరించారు. కోర్టు డాక్యుమెంట్లను తీసుకునే విషయంలో లోకస్ స్టాండీ (జోక్యం చేసుకునే హక్కు) వాదనకు ఎంతమాత్రం ఆమోదయోగ్యత లేదన్నారు. క్రిమినల్ లాలో ఎక్కడా లోకస్ స్టాండీ ప్రస్తావనే లేదన్నారు. అలాంటప్పుడు దేని ఆధారంగా చంద్రబాబుపై కేసుల మూసివేత డాక్యుమెంట్లను రహస్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. చట్టాన్ని పాటించబోమంటే, సుప్రీంకోర్టులో పోరాటం చేయడం మినహా చేయగలిగిందేమీ లేదన్నారు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్ల కాపీలను కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్పై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఏసీబీ కోర్టును కోరారు. దీంతో ఏసీబీ కోర్టు న్యాయాధికారి గురువారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పారు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలను ఇవ్వాలని కోరుతూ చీరాలకు చెందిన సువర్ణరాజు అనే వ్యక్తి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన తరఫున బుధవారం పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. -
టెన్త్ పరీక్షల్లో స్వల్ప మార్పులు
సాక్షి, అమరావతి: మార్చి–2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో స్వల్ప మార్పులు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే జనరల్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ కేటగిరీల విద్యార్థులు మార్పులను పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పరీక్షల్లో అంతర్గత మార్కుల వెయిటేజీ ఉండదని, ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులకు 7 పేపర్ల విధానం ఉంటుందని పేర్కొంది. ఒకటో భాష, రెండో భాష, మూడో భాషా పేపర్లు, గణితం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు ఒక్కొక్క పేపర్ ఉంటుంది. ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. జనరల్ సైన్స్ సబ్జెక్టులో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు రెండు వేర్వేరు రోజుల్లో 50 మార్కుల చొప్పున ఉంటాయి. ప్రథమ భాషలో కాంపోజిట్ పేపర్–వన్ 70 మార్కులకు, పేపర్–టు 30 మార్కులకు ఉంటాయి. పాఠశాలలు/విద్యార్థుల డేటాలో వ్యత్యాసం ఉంటే, యూడైస్ ప్లస్ డేటాలో మార్పులకు కమిషనరేట్ను సంప్రదించాలని ఆదేశించారు. ప్రైవేట్ అభ్యర్థులకు వారి ఆన్లైన్ దరఖాస్తులో మునుపటి హాజరు రోల్ నంబర్ను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. వీరికి పరీక్ష ఫీజు మినహాయింపు పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.24 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో 2.5 ఎకరాల తడి భూమి/5 ఎకరాల పొడి భూమి మించని వారి పిల్లలకు పరీక్ష ఫీజు నుంచి మినహాయించారు. ఇది మార్చి–2026లో తొలిసారి రెగ్యులర్ పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. వికలాంగులు, కేజీబీవీ విద్యార్థినులకు పూర్తి స్థాయిలో ఫీజు మినహాయింపు ఉంటుంది. 2011 సెపె్టంబర్ ముందు పుట్టిన వారు మాత్రమే 10వ తరగతి పరీక్షలు రాసేందుకు అర్హులని, రూ.300 చెల్లించి ఏడాదిన్నర వరకు వయసు సడలింపును స్థానిక పాఠశాల హెచ్ఎం అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రోగులతో చెలగాటం!
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో ఉన్న వీఆర్డీఎల్ (వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీ)లో దారుణం జరుగుతోంది. ఎక్స్పైరీ అయిపోయిన రసాయనాల (రియేజంట్ల)తో స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేసి, కొందరికి అసలు చేయకుండానే నకిలీ రిపోర్టులు ఇచ్చి ప్రజల్ని, అధికారుల్ని పచ్చిమోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు నెలలుగా ఈ తంతు కొనసాగుతుండడం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇన్నాళ్లుగా వచ్చిన నివేదికలన్నీ కేవలం సృష్టించినవేనన్న వాస్తవం కళ్లుబైర్లు కమ్మేలా చేస్తోంది. తీవ్ర కలకలం రేపుతున్న ఈ దారుణం వివరాలివీ.. కాకినాడ జీజీహెచ్లో ఉన్న వీఆర్డీఎల్ ల్యాబ్కు రాష్ట్రస్థాయి గుర్తింపు ఉంది. రీసెర్చ్ సైంటిస్ట్ హోదాలో పనిచేసే ఓ ఉద్యోగి కాసులకు కక్కుర్తిపడి స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేసేందుకు రక్త నమూనాలు సేకరించి నకిలీ రిపోర్టులు ఇస్తున్నారు. వ్యాధి నిర్ధారణకు ఐజీఎం ఎలీసా (ఇమ్యునో గ్లోబలిన్ ఎం–ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే) టెస్ట్ చేస్తారు. ఇందుకు కాలంచెల్లిన రియేజంట్లు వినియోగించి రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. రెండు నెలలుగా ఇదే తంతు.. సాధారణంగా రక్త నమూనా ఇచ్చిన తర్వాత రక్తం నుంచి సీరంను వేరుచేసి ఎలీస్ ప్లేట్లో ఉన్న రంధ్రాల్లో వేస్తారు. అరగంట ఇంక్యుబేషన్ వ్యవధి చొప్పున కాంజ్యుగేట్, సబ్్రస్టేట్ రియేజంట్లు వేస్తారు. ఇవే వ్యాధిని నిర్ధారిస్తాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న రియేజంట్లను కాలం చెల్లినవి వాడి రెండు నెలలుగా తోచిన రిపోర్టును రాసి పంపిస్తున్నారు. అంతేకాక.. స్టేట్ పోర్టల్లోనూ ఈ కాకిలెక్కలే అప్డేట్ చేస్తుండడంతో యావత్ రాష్ట్రం ఈ గణాంకాలనే నిజమని నమ్ముతోంది. రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖలకు బురిడీ.. ఈ తప్పుడు నివేదికల ఆధారంగానే వైద్యం అందించడం, అందించకపోవడం జరుగుతోంది. రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విభాగాలను ఈ వీఆర్డీఎల్ ఉద్యోగి బురిడీ కొట్టించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. రోగి వయసు, ప్రాంతం ఆధారంగా వ్యాధి సోకే అవకాశం ఉందా లేదా అన్న విషయాలపై ఓ అంచనాకు వచ్చేసి, నివేదికలు ఇస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇన్నాళ్లూ ఇచ్చిన పాజిటివ్, నెగటివ్ నివేదికలు కల్పితాలేనన్న విషయం బట్టబయలవడంతో వైద్యులే నిర్ఘాంతపోతున్నారు. ఎక్స్పైరీ రియేజంట్లు ఎందుకంటే.. కాలంచెల్లిన కిట్ల వినియోగం వెనుక రీసెర్చ్ సైంటిస్ట్దే కీలకపాత్ర. నెలన్నరకు పైగా జీజీహెచ్ స్టోర్స్ నుంచి రియేజంట్లు తీసుకోకుండా ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఇచ్చిన అవకా«శాన్ని అడ్డుపెట్టుకుని బయటి నుంచే కొంటున్నట్లు ఆయన చూపిస్తున్నారు. అవీ కాలం చెల్లినవి తెస్తున్నారు. పొరుగు ప్రాంతాల వారు పనికిరాక పక్కన పడేసిన కిట్లు ఉచితంగా లభిస్తుండడంతో అవి తెచ్చి నాణ్యమైనవి కొంటున్నట్లు బిల్లులు డ్రా చేస్తున్నారనే విమర్శలున్నాయి. పైగా.. ఒక్కో కిట్టు ధర కనీసం రూ.25 వేలు ఉంటుండగా రూ.లక్షల్లో ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ ఒక్క కిట్టుకీ లెక్కాపత్రం లేదు.. వైరాలజీ ల్యాబ్లో వినియోగిస్తున్న ఏ ఒక్క కిట్టుకీ తగిన లెక్కాపత్రం లేదు. ఈ తంతుపై పర్యవేక్షణ లోపించడంతో అక్కడ పనిచేస్తున్న రీసెర్చ్ సైంటిస్టుది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది. కిట్లు కాలం చెల్లినవి కావడంవల్ల కోల్డ్ చెయిన్ను మెయింటైన్ (నిర్దిష్ట శీతల ప్రక్రియ) చేయకుండానే జీజీహెచ్లోని ల్యాబ్కు చేరుతున్నాయి. ఇలా అందుకుంటున్న వాటికి ఎటువంటి బిల్లులుగానీ సరఫరా రశీదులుగానీ ఉండడంలేదు.కోవిడ్, హెపటైటిస్ రియేజంట్లు కూడా..ఇక కోవిడ్, హెపటైటిస్ సహా పలు ప్రాణాంతక రోగాలను నిర్ధారించే రియేజంట్లు కూడా కాలం చెల్లినవే వినియోగిస్తున్నారు. మరణించిన వ్యక్తికి కోవిడ్ పరీక్ష చేయాల్సి వస్తే పరీక్ష చేయకుండా లేదా కాలంచెల్లిన కిట్లతో చేసి, రిపోర్టు ఇస్తున్నారు. పోస్ట్మార్టం చేస్తున్న ఫోరెన్సిక్ వైద్యులు, మృతుడి కుటుంబీకుల ప్రాణాలకూ ముప్పుతెస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఎక్స్పైర్ అయిన హెపటైటిస్ కిట్లను డిసెంబరు 1న తీసుకొచ్చి, హెపటైటిస్ పరీక్షలు చేస్తున్నారు. ఎక్స్పైరీ రియేజంట్లను తేదీ ముద్రించి ఉన్న ట్యూబ్ల నుంచి స్టిక్కర్ లేని ఖాళీ ట్యూబ్ల్లోకి నింపి శ్వాసకోశ సంబంధిత ప్రాణాంతక కోవిడ్ సహా ఫ్లూ–ఏ, ఫ్లూ–బి, ఇన్ఫ్లూయెంజా, స్వైన్ ఫ్లూ, ఆర్ఎస్వీ–ఏ, ఆర్ఎస్వీ–బి, హ్యూమన్ రినోవైరస్ వంటి ముఖ్యమైన పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు.. రోగులు కూడా జీజీహెచ్ నివేదికలకు, బయట ప్రైవేటు ల్యాబ్ల నివేదికలకు తేడాలు ఉంటున్నాయని వాపోతున్నారు. ఆ కేసులు నిజమా.. కాకిలెక్కలా?జిల్లా వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. వీఆర్డీఎల్ ల్యాబ్ గణాంకాల ఆధారంగానే ఈ వ్యాప్తిని నిర్ధారిస్తున్నారు. రీసెర్చ్ సైంటిస్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం 151 మందికి స్క్రబ్ టైఫస్ సోకిందని.. నవంబరు, డిసెంబరులో 45 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు. అసలు ఈ లెక్కల సంగతి ఏంటని జీజీహెచ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అవి నిజం లెక్కలా లేక కాకి లెక్కలా తెలీక గందరగోళంలో పడ్డారు. -
రైళ్లల్లో తత్కాల్ రిజర్వేషన్కు ఓటీపీ తప్పనిసరి
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సాధారణ రైలు ప్రయాణికులకు పారదర్శకత, సౌకర్యవంతమైన సేవలు అందించే దిశగా రైల్వే శాఖ ఓటీపీ ఆధారిత తత్కాల్ రిజర్వేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచి్చంది. పైలట్ ప్రాజెక్ట్గా 52 రైళ్లకు సంబంధించి చేపట్టిన ఈ విధానం విజయవంతం కావటంతో త్వరలో మిగిలిన అన్ని రైళ్లకూ వర్తింప చేయనుంది. నవంబర్ 17 నుంచి రిజర్వేషన్ కౌంటర్లలో కూడా ఓటీపీ ఆధారిత తత్కాల్ రిజర్వేషన్ వ్యవస్థను ప్రాంభించిన విషయం తెలిసిందే. ఈ విధానంలో ప్రయాణికుడు రిజర్వేషన్ ఫారమ్లో ఇచి్చన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేస్తేనే టికెట్ నిర్ధారణ అవుతుంది. -
రోడ్డుపైనే అంతిమ సంస్కారమా!
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలను రోడ్డుపైనే నిర్వహించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. శ్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితిలో ఉన్నామా? అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. శ్మశానాల నిర్వహణకు నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అసక్తి చూపడం లేదని ప్రశ్నించింది. శ్మశానాల ఏర్పాటు, నిర్వహణ కోసం జీవోలు ఇచ్చినప్పటికీ అవేవీ అమలు కావడం లేదంది. ఆ జీవోలు కేవలం కాగితాలకే పరిమిత మయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో రాబోయే రెండు దశాబ్దాలకు అనుగుణంగా శ్మశాన వాటికల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న శ్మశానాల నిర్వహణకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. శ్మశాన వాటికల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను సైతం విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేసి దానిపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లోని శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలు లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విజయవాడకు చెందిన పి.ప్రమోద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గడిపూడి వెంకటేశ్వర్లు, పురపాలక శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది అంబటి శ్రీకాంత్రెడ్డి వాదనలు వినిపించారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. -
16న వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలు అందజేత
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ జిల్లా పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్)తో బుధవారం రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా సాగిందన్నారు. సంతకాలు కోటి అనుకుంటే అంతకుమించి వస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంతకాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపాలని సూచించారు. 13న జిల్లా కార్యాలయాల నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లికి పంపాలని కోరారు. ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలు అందజేయనున్నట్టు చెప్పారు.సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడియా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బాక్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నాయకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13న జిల్లా కేంద్రంలో కూడా అదే స్థాయిలో కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకంగా చెప్పారని వెల్లడించారు. జిల్లా కేంద్రం నుంచి వేలాది మందితో ర్యాలీలు చేపట్టి రాష్ట్ర కార్యాలయానికి పంపాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించాలని సూచించారు. -
జీవో సాక్షిగా బాబు క్రెడిట్ చోరీ గుట్టు రట్టు..'ఔను.. అదానీనే'!
రెండు నెలల క్రితం..రూ.లక్ష కోట్లకుపైగా భారీ పెట్టుబడులతో విశాఖకు గూగుల్ వస్తోంది..! మేమే తీసుకొస్తున్నాం.. డేటా సెంటర్ ఏర్పాటు ఘనత మాదే!రెండు రోజుల క్రితం..అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ప్రాజెక్టు. గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాలను తిరిగి అదానీకి బదలాయిస్తున్నాం. గూగుల్కు ఇచ్చిన అన్ని రాయితీలను ప్రైమరీ నోటిఫైడ్ పార్టనర్ అదానీకి వర్తింప చేస్తున్నాం.– గూగుల్ రాకపై చంద్రబాబు సర్కారు విన్యాసాలివీ! గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని అదానీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జారీ చేసిన జీవో సాక్షి, అమరావతి: గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన జిమ్మిక్కులు, సంకుచిత వైఖరి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా వెలువరించిన జీవోల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ను అదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ ఏర్పాటు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వమే జీవోలో వెల్లడించింది. అంతేకాదు... గతంలో గూగుల్కు విశాఖలో కేటాయించిన 480 ఎకరాల భూమిని తిరిగి అదానీకి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం గమనార్హం. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో ఒప్పందం సమయంలో ఉద్దేశపూర్వకంగానే అదానీ పేరును తొక్కి పెట్టి క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన విన్యాసాలు విఫలమైన విషయం తెలిసిందే. డేటా సెంటర్ ఏర్పాటుపై తొలుత ఈ ఏడాది అక్టోబర్లో ఆగమేఘాలపై జీవో ఇచ్చిన చంద్రబాబు సర్కారు.. స్వయంగా గూగులే దీన్ని నిర్మిస్తోందని, ఈ ప్రాజెక్టు మొత్తం గూగుల్ సంస్థే ఇప్పటికిప్పుడు కొత్తగా చేపడుతోందనే భ్రమలు కల్పించింది. ఇక యథావిధిగా ఎల్లో మీడియా దీనికి కోరస్ పాడుతూ అదొక ప్రపంచ ఈవెంట్ మాదిరిగా చిత్రీకరించింది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో రక్తి కట్టించిన ఈ నాటకం అంతా డ్రామా అని తాజాగా ప్రభుత్వ జీవోలే వెల్లడిస్తున్నాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో అబద్ధాలు ఆడటం.. ఇంతటి ఘరానా మోసం.. ప్రజలకు ఎలా తప్పుడు సమాచారం ఇస్తున్నారో చెప్పేందుకు ఇదొక క్లాసిక్ కేస్ స్టడీగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు కళ్లార్పకుండా నిస్సిగ్గుగా అబద్ధాలాడతారనేందుకు విశాఖ డేటా సెంటర్లే నిదర్శనమని పేర్కొంటున్నారు. చంద్రబాబు బృందం క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఎంతటి అబద్ధాలైనా ఆడగలదని, ఆత్మసాక్షిని మోసగించి వంచనకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నొయిడాలోని అదానీ ఎంటర్ప్రైజెస్లో డేటా సెంటర్ ఏర్పాటు కోసం 4.64లక్షల చదరపు అడుగులను గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ లీజుకు తీసుకుందని 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఇది. , గూగుల్తో కలిసి విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేయనుండటం గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ ‘ఎక్స్’లో పెట్టిన పోస్టు అదానీ.. గూగుల్ సంస్థ భాగస్వామేవిశాఖలో గూగుల్ డేటా సెంటర్కు తొలుత అడవివరం–ముడసర్లోవ వద్ద 120 ఎకరాలు, ఆనందపురం మండలం తర్లువాడ వద్ద 200 ఎకరాలు, రాంబిల్లి వద్ద 160 ఎకరాలను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్కు కేటాయిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 11న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రెడిట్ చోరీలో భాగంగానే అదానీ పేరును దాచిపెట్టి కేవలం రైడెన్ టెక్ పేరుతో జీవో విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో గూగుల్ అధికారిక భాగస్వామిగా అదానీ వ్యవహరిస్తున్నట్లు చంద్రబాబు సర్కారు వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదానీ గ్రూపును గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ వ్యాపార భాగస్వామిగా చంద్రబాబు సర్కారు తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.ఆ భూములను అదానీకి బదలాయించండి..ఏపీఐఐసీ కేటాయించిన ఆ 480 ఎకరాలను అదానీ గ్రూపు తదితర సంస్థల పేరిట బదలాయించాల్సిందిగా గూగుల్ కోరింది. తర్లువాడ, అడవివరం–ముడసర్లోవలో కేటాయించిన భూములను అదాని పేరిట అంతర్గతంగా బదలాయించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ బదలాయింపు రైడెన్, అదానీ మధ్య అంతర్గత ఒప్పందం ద్వారా జరుగుతుందని వివరించింది. ప్రైమరీ నోటిఫైడ్ పార్టనర్గా ఉన్న అదానీకి గూగుల్కు ఇచ్చిన అన్ని రాయితీలను వర్తింప చేస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆ ఉత్తర్వుల్లో వెల్లడించడం గమనార్హం. సీఐఐ సదస్సు సాక్షిగా తేల్చి చెప్పిన అదానీ..విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్ 14న ఢిలీల్లో ఎంవోయూ కుదుర్చుకున్న సమయంలో అదానీ పేరును చంద్రబాబు సర్కారు కనీసం ప్రస్తావించలేదు. దాదాపు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్న అదానీ పేరు ఎక్కడా చెప్పకుండా చంద్రబాబు దాగుడుమూతలు ఆడారు. అయితే అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ తాము ఆ డేటా సెంటర్లో భాగస్వామి అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. గత నెలలో విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ సందర్భంగా తాము గూగుల్తో కలసి 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ స్వయంగా సీఎం చంద్రబాబు సమక్షంలోనే ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రితో పాటు వేదికపైన ఉన్న మంత్రుల మొహాలు ఒక్కసారిగా మాడిపోయిన సంగతి తెలిసిందే.ఆ డేటాసెంటర్.. జగన్ నాటిన మొక్కసంకుచిత బుద్ధితోనే అదానీ పేరెత్తని బాబుచంద్రబాబు సర్కారు క్రెడిట్ చోరీని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే విలేకరుల సమావేశంలో సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే సీఎం చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరెత్తలేదని విమర్శించారు. గత ప్రభుత్వం కృషి, చొరవతో సాకారమైన డేటా సెంటర్ క్రెడిట్ను చంద్రబాబు అబద్ధాలతో తన ఖాతాలో ఏ విధంగా వేసుకున్నాడన్న విషయాన్ని వైఎస్ జగన్ సాక్ష్యాలతో ఎండగట్టారు. డేటా సెంటర్ ద్వారా విశాఖలో ఒక ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని, తద్వారా గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ వస్తాయన్నారు. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్ సీ కేబుల్ సింగపూర్ నుంచి విశాఖకు ఏర్పాటు పనులకు వైఎస్ జగన్ ప్రభుత్వమే అంకురార్పణ చేసింది. వైఎస్ జగన్ చెప్పిన ప్రతీ అక్షరం సత్యమని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన జీవో సాక్షిగా మరోసారి తేటతెల్లమైంది. తొలుత గూగుల్ పేరిట జీవో విడుదల చేసిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఆ భూములను అదానీ పేరు మీదకు బదలాయించడమే దానికి తార్కాణం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 2020 నవంబర్లో అదానీతో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. డేటా సెంటర్కు డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కి.మీ. పొడవున సబ్సీ (సముద్ర గర్భం)లో కేబుళ్లు వేయాల్సి ఉన్నందున దీనిపై 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి గూగుల్తో అదానీకి వ్యాపార అనుబంధం ఉంది. నోయిడాలో అదానీ నిర్మించిన డేటా సెంటర్ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 2022 అక్టోబర్ 11 లీజుకు తీసుకుంది. ఈ క్రమంలో విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. ఆ డేటా సెంటర్ కోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు చెబుతున్న డేటా సెంటర్ను అసలు తాము నిర్మించడం లేదని, దీన్ని అదానీ గ్రూపే నిర్మిస్తుందని, ఆ భూమిని కూడా అదానీకే కేటాయించాలంటూ గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు అక్టోబర్లో లేఖ రాయడం గమనార్హం. చంద్రబాబును కలిసిన గౌతమ్ అదానీసాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో రాష్ట్రంలో అదాని గ్రూపు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై చర్చించారు. -
వరి వల్ల ఉపయోగం లేదు.. ఆదాయం లేదు
సాక్షి, రాజమహేంద్రవరం/నల్లజర్ల: వరి సాగు వల్ల ఎలాంటి ఉపయోగం, ఆదాయం లేవని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. వరిస్థానంలో ఉద్యాన పంటలు సాగుచేయాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బుధవారం నిర్వహించిన రైతన్నా మీ కోసం.. కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పామాయిల్ సాగులో టెక్నాలజీ ఉపయోగించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు. గోదావరి జలాలను కృష్ణానదిలో కలిపామని, వంశధారకు కలుపుతామని, పెన్నానది వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. భూగర్భ జలాలు పెంచుకోగలిగితే కరవు ఉండదని చెప్పారు. పోలవరం రైట్ కెనాల్ నుంచి నీరు ఇస్తే నల్లజర్ల ప్రాంతంలో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. కరవు ఎక్కువగా ఉండే రాయలసీమ నంద్యాల జిల్లాలో భూగర్భ జలాలు నాలుగు మీటర్లకు పెరిగాయన్నారు. తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలాలు తగ్గాయని చెప్పారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు మాదిరిగానే దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ సభలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో అమరావతితోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోను ‘దివ్యాంగ్ భవన్’లు ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నంలో 23 ఎకరాల్లో నేషనల్ సెంటర్ ఫర్ డిసిబిలిటీ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన కరుణ కుమారికి రూ.15 లక్షలు, దీపికకు రూ.10 లక్షలు చొప్పున ప్రభుత్వం తరపున అందిస్తామని, వారికి ఇళ్లు నిరి్మస్తామని చెప్పారు. -
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.పార్టీ ప్రధాన కార్యదర్శిగా (ఎన్నారై ఎఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా, జీసీసీ గల్ఫ్ కమిటీ కన్వీనర్ గా బద్వేల్ హజీ ఇలియాస్, కో- కన్వీనర్లుగా గోవిందు నాగరాజు (కువైట్), దొండపాటి శశి కిరణ్ (ఖతర్), మహమ్మద్ జిలాని భాష (దుబాయ్) నియమితులయ్యారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం, డిసెంబర్ 4వ తేదీ) ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో ఆయన మాట్లాడనున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. -
ఆత్మ విశ్వాసానికి, దృఢ సంకల్పానికి ఏ వైకల్యం అడ్డుకాదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మ విశ్వాసానికి, దృఢ సంకల్పానికి ఏ వైకల్యం అడ్డుకాదు. పట్టుదలతో సవాళ్లను అధిగమిస్తూ.. ప్రతి రంగంలోనూ నూతన శిఖరాలను అధిరోహిస్తున్న విభిన్న ప్రతిభావంతులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఆత్మ విశ్వాసానికి, దృఢ సంకల్పానికి ఏ వైకల్యం అడ్డుకాదు. పట్టుదలతో సవాళ్లను అధిగమిస్తూ, ప్రతి రంగంలోనూ నూతన శిఖరాలను అధిరోహిస్తున్న విభిన్న ప్రతిభావంతులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 3, 2025 -
సంపద సృష్టి చేతకాలేదు.. చంద్రబాబు ఒప్పేసుకున్నారు!
సాక్షి, విజయవాడ: ఏపీ ఖజానా ఖాళీ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం చేతకాలేదని పరోక్షంగా ఆయన అంగీకరించారు. ఎంత వెతికిన కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదన్న చంద్రబాబు.. అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరన్నారు. అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదన్నారు. ఆదాయాన్ని బట్టి కొంతవరకే అప్పు చేయొచ్చు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ఎక్కువ అప్పు చేయడానికి వీలుండదు’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీలకు తిలోదకాలివ్వడమే కాకుండా రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీ ఖజానా ఖాళీ అంటూ చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించడం.. సంపద సృష్టి చేతకాలేదని తేలిపోయింది. ఏడాదిన్నర పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పులు చేసింది. తద్వారా ప్రజలపై భారీగా రుణ భారం మోపింది. చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసింది. ఇక అప్పు కావాలంటే ఇచ్చేవారు కూడా లేరంటూ చంద్రబాబు తెగ బాధపడిపోతున్నారు.బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్ సిక్స్లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది. -
ఏపీకి హెచ్చరిక.. నాలుగు జిల్లాల్లో ఆకస్మిక వరదలు!
సాక్షి, అమరావతి: దిత్వా తుపాను ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాపై దిత్వా ప్రభావం ఎక్కువగా ఉంది. కాగా, తాజాగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రానున్న 24 గంటల్లో ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.దిత్వా తుపాను ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు.. నైరుతి-పశ్చిమ బంగాళాఖాతం ఆనుకొని వాయుగుండం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద వాయుగుండం కదలుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలినట్లు వెల్లడించారు. తీరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయ్యింది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వైపు నెమ్మదిగా వాయుగుండం కదులుతోంది. మరో 12 గంటల్లో బలమైన అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉంది. గంటకు 45-55 కి.మీ. మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తుపాను ప్రభావంతో గాలుల ప్రభావానికి కోతకు సిద్ధంగా ఉన్న వందల ఎకరాల వరి పంట నేల వాలింది. గాలుల ప్రభావం పెరిగితే చేతికి వచ్చిన పంట పూర్తిగా నేలమట్టం అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వర్షాల ప్రభావంతో నిజాంపట్నం హార్బర్ వద్ద మూడో నంబర్ ప్రమాద సూచిక కొనసాగుతోంది. సముద్రంలో వేటకు వెళ్లే బోట్లు అన్ని జెట్టికే పరిమితం అయ్యాయి.తమిళనాడులో కొనసాగుతున్న వర్షాలుబలహీనపడ్డ దిత్వా తుపాను దిశను మార్చుకున్నప్పటికీ తమిళనాడులో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం చెన్నై, శివారులలో 30 చోట్ల భారీగా వర్షం పడింది. ఉత్తర చెన్నై పరిధిలోని ఎన్నూరులో 26 సెం.మీ., బ్రాడ్వేలో 25 సెం.మీ. వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై వరదలు పోటెత్తాయి. నీటి తొలగింపు పనులను వేగవంతం చేశారు. 40కి పైగా ప్రాంతాలలో ఈదురు గాలుల ధాటికి చెట్లు నేల కొరగడంతో వాటిని తొలగించారు. ఆంధ్రప్రదేశ్ వైపుగా వాయుగుండం కదలుతుందని భావిస్తే.. అది వచ్చిన దారిలో మళ్లీ పుదుచ్చేరి వైపుగా కదలడం గమనార్హం. బుధవారం పుదుచ్చేరి–మహాబలిపురానికి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో చెన్నై, శివారులలో చిరు జల్లులతో వర్షం పడుతోంది. ఇక అలాగే, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుపత్తూరు, వేలూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. -
ప్రజా ధనంతో ప్రభుత్వ పెద్దల జల్సాలు!
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని.. అది అర్థం చేసుకోవాలంటూ ఏపీ ప్రజల ముందు నారా చంద్రబాబు నాయుడు ఆడే డ్రామాలు తెలియంది కాదు. ఈ వంకతో ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎగ్గొడుతూ వస్తున్నారు కూడా. అయితే రాష్ట్రం అప్పులలో కూరుకుపోతున్నా సరే.. ప్రజా సొమ్ముతో ప్రభుత్వ పెద్దల జల్సాలు మాత్రం ఆగడం లేదు.. రాష్ట్రం ఆర్ధిక లోటులో ఉన్నా సరే.. ప్రభుతవ ఖజానాకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు గండికొడుతూనే ఉన్నారు. ప్రత్యేక విమానాల్లోనే పర్యటనలకు మొగ్గు చూపిస్తున్నారు. వీకెండ్ ఎంజాయ్మెంట్కైతే అధికారిక పర్యటనలనే వంకతో తెగచక్కర్లు కొట్టేస్తున్నారు. దీంతో ఖర్చు తడిసి మోపెడు అవుతోందిసీఎం అయినప్పటి నుంచి చంద్రబాబు ఇప్పటిదాకా 88 సార్లు ప్రత్యేక విమానాల్లో తిరిగారు. అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి నిజంగానే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉదయం టిఫిన్ మంగళగిరిలో, లంచ్ తిరుపతిలో, డిన్నర్ హైదరాబాదులో.. ఇలా ఆయన ప్రత్యేక పర్యటనలకు మాత్రం లెక్కే లేకుండా పోయింది. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ నుంచి ఆయన కాలు కింద పెట్టడం లేదని అధికార వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పటిదాకా 92సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించారు. ఈ మధ్యే క్రికెట్ చూడటానికి ప్రత్యేక విమానంలో దుబాయ్, ముంబై వెళ్లారు కూడా. అయితే సొంత ఖర్చులతో ఆయన ఇదంతా చేస్తున్నారని.. ఆర్టీఐ ద్వారా ఈ విషయం తేటతెల్లమైందంటూ ఆయన వర్గీయులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇటు వైఎస్ జగన్ మీద ఫోకస్ పెడుతూ కూటమి పెద్దల విలాసాలను ప్రజల్లోకి పోనీయకుండా ఎల్లో మీడియా జాగ్రత్త పడుతోంది. -
అన్నదాత విలవిల
పెరవలి : ఆంధ్రుల అన్నపూర్ణగా ఖ్యాతి గడించిన గోదావరి జిల్లాల్లోని రైతులు నానాటికీ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటల్లో దాదాపు ఏ ఒక్కదానికీ గిట్టుబాటు ధర లభించకపోవడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. తేమ శాతం నిబంధనల పేరుతో ఆహార పంట అయిన వరి ధాన్యానికి ఎలాగూ మద్దతు ధర ఇవ్వడం లేదు. దీనికి తోడు మొక్కజొన్న, కొబ్బరి, అరటి.. ఇలా ఏ పంట చూసినా సరైన ధర లభించని దుస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, మంచి ధర వచ్చేలా చూసి, ఆదుకునే చర్యలు చేపట్టడం లేదని రైతులు ముఖ్యంగా ఉద్యాన రైతులు వాపోతున్నారు. 90 వేల మంది రైతులు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 90 వేల మంది రైతులు 64,536 హెక్టార్లలో మొక్కజొన్న, కొబ్బరి, కోకో, ఆయిల్పామ్, మామిడి, జామ, కంద, పసుపు, బొప్పాయి, నిమ్మ, తమలపాకులు, జీడిమామిడి వంటి వాణిజ్య, ఉద్యాన పంటలతో పాటు కూరగాయలు కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగుపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 3 లక్షల మంది జీవిస్తున్నారు. జిల్లా నుంచి వివిధ వాణిజ్య, ఉద్యాన పంట ఉత్పత్తులు రాష్ట్రం నలుమూలలతో పాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్,ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతూంటాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పంటకూ ముందుగానే గిట్టుబాటు ధర నిర్ణయించి, పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలు ప్రారంభించేవారు. నేడు అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.మామిడి జిల్లాలో 5,500 హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. ఈ ఏడాది దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లభించలేదు. రకాన్ని బట్టి టన్నుకు రూ.17 వేల నుంచి రూ.25 వేలు మాత్రమే ధర లభించింది, గత ప్రభుత్వంలో ఇదే పంటకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకూ ధర లభించింది. మొక్కజొన్న జిల్లావ్యాప్తంగా 1,500 హెక్టార్లలో మొక్కజొన్న ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేస్తారు. దీనికి గరప, ఎర్రరేగడి నేలలు అనుకూలం. అందుకే, ఈ పంటను ఎక్కుగా లంకల్లో వేస్తారు. గత ప్రభుత్వ హయాంలో క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2,600 ధర పలకగా, ఈ ఏడాది రూ.2,200 మాత్రమే దక్కుతోంది. దొండ కూరగాయల పంటల్లో అత్యధికంగా సాగు చేసే పంట దొండ. జిల్లావ్యాప్తంగా 400 హెక్టార్లలో దొండ సాగు ఉంది. సుమారు 4 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటి దొండ రైతుకు ఈ ఏడాది చేదు అనుభవమే ఎదురైంది. ప్రస్తుతం రైతుకు కిలోకు రూ.5 మాత్రమే లభిస్తోంది.వరి ఈ ఏడాది ఖరీఫ్ వరి రైతుకు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. ప్రకృతి విపత్తులకు ఎదురీది సాగు చేసినా.. దిగుబడుల్లో నష్టాలు చవి చూస్తున్నా గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ప్రభుత్వం 75 కేజీల బస్తాకు సుమారు రూ.1,780 మద్దతు ధర ప్రకటించినా తేమ శాతంతో పాటు సవాలక్ష ఆంక్షలు విధించింది. దీంతో, మరో మార్గం లేక రైతులు ధాన్యాన్ని దళారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు. దొరికిందే చాన్సు అన్నట్టుగా దళారులు చేల వద్దకు వచ్చి రూ.300 నుంచి రూ.400 వరకూ తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.కొబ్బరి జిల్లావ్యాప్తంగా 8,050 హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోంది. ఇక్కడి నుంచి నిత్యం 50 లారీల వరకూ కాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతూంటాయి. అన్నీ సక్రమంగా ఉంటే ఒక్కో చెట్టు నుంచి ఏటా 150 నుంచి 175 కాయల దిగుబడి వస్తుంది. ఎకరానికి 75 చెట్లు వేస్తారు. ఈ తోటల్లో అంతర పంటలుగా కూరగాయలు, కోకో, పూల సాగు వంటివి చేపడుతూ, అదనపు ఆదాయం పొందుతారు. ఈ పంటపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన దింపు, ఎగుమతి, దిగుమతి కూలీలు, ఒలుపు కారి్మకులు, వ్యాపారులు సుమారు 30 వేల మంది ఉన్నారు. ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్లో కుంభమేళా సందర్భంగా ఎక్కడ లేని డిమాండూ వచ్చి వెయ్యి కాయల ధర ఏకంగా రూ.32 వేలు పలికింది. ఇది రెండు నెలలుగా తగ్గుతూ వచ్చి, ప్రస్తుతం రూ.8 వేలకు పడిపోయింది. కోకో జిల్లాలోని 5,517 హెక్టార్లలో కోకో సాగు జరుగుతోంది. దీనిపై ఆధారపడిన వారు 10 వేల మంది ఉన్నారు. ఈ పంటను చిన్న పిల్లల్లా సాకాలి. తెగుళ్లను తట్టుకోలేవు. నీడ పట్టున పెంచాలి. అందుకే, దీనిని కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేస్తారు. చాక్లెట్ల తయారీలో వాడే కోకో గింజలకు మంచి డిమాండ్ ఉన్నా ఈ ఏడాది తయారీ కంపెనీలు సిండికేట్గా ఏర్పడి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. దీంతో రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కిలో గింజల ధర రూ.1,050 ఉంటే నేడు రూ.350కి పడిపోయింది.అరటి జిల్లావ్యాప్తంగా అరటి సాగు 7,500 హెక్టార్లలో ఉంది. చక్కెరకేళీ, కూర అరటి (బొంత), ఎర్ర చక్కెరకేళీ, అమృతపాణి, కర్పూరం రకాలను ఇక్కడి రైతులు పండిస్తూంటారు. జిల్లా నుంచి నిత్యం 40 లారీల్లో అరటి గెలలు వివిధ ప్రాంతాలతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మే నెలలో 10 టన్నుల లారీ ధర రూ.2 లక్షలు పలికింది. అది కాస్తా నేడు రూ.40 వేలకు పడిపోయింది. గెలలను కొనే నాథుడు లేక అరటి రైతులు అల్లాడిపోతున్నారు. ఈ పంటపై ఆధారపడి రైతులతో పాటు నిత్యం కూలి పనులు చేసుకుంటూ సుమారు 12 వేల మంది జీవిస్తున్నారు. జామ పేదల యాపిల్గా పేరొందిన పండు జామ. దీనిని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. జిల్లాలోని 300 హెక్టార్లలో జామ సాగు ఉంది. ఇక్కడి రైతులు వివిధ దేశవాళీ రకాలతో పాటు కేజీ జామ, తైవాన్ జామ కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటపై వ్యాపారులు, కూలీలు కలిపి నిత్యం 3 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జామ పండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉన్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. రైతుల వద్ద నుంచి వ్యాపారులు కిలో రూ.20 నుంచి రూ.25కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కిలోకు రైతుకు రూ.50 వరకూ దక్కేది.తీవ్ర నష్టాలు అరటి పంట తీవ్ర నష్టాలు మిగిల్చింది. తోటలు అమ్మినప్పుడు మంచి ధర లభించింది. నేడు మార్కెట్లో ధరలు పతనమవడంతో వ్యాపారులు సగానికి సగం కోత పెడుతున్నారు. దీంతో, మేం నష్టపోవాల్సి వచ్చింది. అసలు తోటలు కొనుగోలు చేయటానికే ఎవరూ రావటం లేదు. – వాకలపూడి గాం«దీ, అరటి రైతు, కానూరుకొబ్బరి ధర పతనం కొబ్బరి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రెండు నెలలు క్రితం వెయ్యి కాయల ధర రూ.32 వేలు పలికితే నేడు రూ.8 వేలు ఉంది. అంటే వెయ్యి కాయలకు రూ.24 వేల మేర ధర పతనమైంది. – పెనుమత్స వెంకట గోపాలకృష్ణంరాజు, కొబ్బరి రైతు, ఖండవల్లి ఇంత దారుణం ఎప్పుడూ లేదు కోకో పంట దిగుబడి బాగున్నా వ్యాపారులు సిండ్కేట్గా మారి ధరలు తగ్గించారు. గతం ప్రభుత్వంలో కిలో రూ.1,050 పలికితే నేడు రూ.350 లభిస్తోంది. ఇంత దారుణం ఎప్పుడూ లేదు. – వాకలపూడి సూర్యారావు, కోకో రైతు, కానూరుప్రభుత్వమే ఆదుకోవాలి క్వింటాల్ మొక్కజొన్న గింజలకు గత ఏడాది ధర రూ.2,600 ఉంటే నేడు రూ.2,200కు పడిపోయింది. దీంతో ఆర్థికంగా నష్టపోయాం, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతులను ఆదుకోవలసింది ప్రభుత్వమే. – కంటిపూడి సూర్యనారాయణ, మొక్కజొన్న రైతు, తీపర్రు -
కొనసాగుతున్న వాయుగుండం
సాక్షి, అమరావతి/వాకాడు/చెన్నై: దిత్వా తుపాను వాయుగుండంగా బలహీనపడి కొనసాగుతుండంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం తిరుపతి జిల్లా మల్లంలో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా తడ, చిత్తమూరులో 5, పూలతోటలో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలావుండగా బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం బుధవారం అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.వాకాడులో 30 మీటర్ల ముందుకొచ్చిన సముద్రంమంగళవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. సముద్ర తీర ప్రాంత మండలాలైన చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేటలో 52 తీర గ్రామాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు మండలంలో సముద్రం దాదాపు 30 మీటర్లు ముందుకొచ్చింది. వాకాడు బ్యారేజ్లో వరద నీరు అధికంగా చేరడంతో 7 గేట్ల ద్వారా 7 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. దిగువన ఉన్న బాలిరెడ్డిపాళెం–గంగన్నపాళెం మధ్య ఉన్న చప్టా వరద ముంపునకు గురై మునిగిపోయే ప్రమాదం ఉన్నందున అధికారులు గస్తీ కాస్తున్నారు. చిట్టమూరు మండలంలో వరద ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను రెవెన్యూ అధికారులు, పోలీసులు గుర్తించి నిఘా ఉంచారు.తమిళనాడులో కొనసాగుతున్న వర్షాలుబలహీనపడ్డ దిత్వా తుపాను దిశను మార్చుకున్నప్పటికీ తమిళనాడులో వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం కూడా అనేక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం చెన్నై, శివారులలో 30 చోట్ల భారీగా వర్షం పడింది. ఉత్తర చెన్నై పరిధిలోని ఎన్నూరులో 26 సెం.మీ., బ్రాడ్వేలో 25 సెం.మీ. వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై వరదలు పోటెత్తాయి. నీటి తొలగింపు పనులను వేగవంతం చేశారు. 40కి పైగా ప్రాంతాలలో ఈదురు గాలుల ధాటికి చెట్లు నేల కొరగడంతో వాటిని తొలగించారు. ఆంధ్రప్రదేశ్ వైపుగా వాయుగుండం కదలుతుందని భావిస్తే.. అది వచ్చిన దారిలో మళ్లీ పుదుచ్చేరి వైపుగా కదలడం గమనార్హం. బుధవారం పుదుచ్చేరి–మహాబలిపురానికి మధ్యలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో చెన్నై, శివారులలో చిరు జల్లులతో వర్షం పడుతోంది. ఇక అలాగే, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుపత్తూరు, వేలూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. -
చి'వరి'కి మిగిలింది ఇదే బాబూ..!
పల్లెకోన(భట్టిప్రోలు): ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు విమర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామంలో మంగళవారం రైతులతో కలసి అశోక్బాబు వినూత్నంగా నిరసన తెలిపారు. ‘దళారుల వ్యవస్థను అడ్డుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం... మద్దతు ధరకు ధాన్యం కొనడంలో విఫలం... పంటలకు బీమా చేయకుండా నిర్లక్ష్యం... రైతులకు యూరియా, కోతయంత్రాలను, టార్పాలిన్లను సరఫరా చేయడంలో వైఫల్యం... కులం, పార్టీలను పట్టించుకోకుండా రైతును రైతుగా చూడకపోవడం...’ అనే ఐదు రకాల పాడెలను కట్టి వాటిపై ధాన్యం బస్తాలు పెట్టి పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆ పాడెల చుట్టూ అశోక్బాబు తిరిగి తలకొరివి పెట్టారు. ఆ తర్వాత ఆయన రోడ్డుపై స్నానం చేశారు. అశోక్బాబు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని చెప్పారు. -
ఏడాదిన్నరలోనే బాబు చేసిన అప్పు రూ.2,66,175 కోట్లు
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ హామీలకు తిలోదకాలివ్వడమే కాకుండా రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్నారు. బడ్జెట్లోనూ, బడ్జేటేతర అప్పుల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఏడాదిన్నర పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పులు చేసింది. తద్వారా ప్రజలపై భారీగా రుణ భారం మోపింది. చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం బడ్జెట్ లోపల రూ.3,000 కోట్ల అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,000 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చింది. దీంతో బడ్జెట్ లోపల చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రూ.1,54,880 కోట్లకు చేరాయి. ఇక బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో మరో రూ.1,11,295 కోట్ల అప్పులు చేసింది. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం రూ.71,295 కోట్ల అప్పు చేసింది. అలాగే రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్(ఎన్ఏబీఎఫ్ఐడీ), ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్సీఎల్) నుంచి ఏకంగా రూ.40,000 కోట్ల అప్పు చేసింది. ఆస్తులను సైతం ప్రైవేటుకు కట్టబెడుతూ..బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు సర్కారు.. సూపర్ సిక్స్లోని ప్రధాన హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. అలాగే ఇప్పటివరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా.. గత వైఎస్సార్సీపీ సర్కారు అభివృద్ధి చేసిన ఆస్తులను సైతం ప్రైవేటుపరం చేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేయగా.. ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తోంది. కేవలం ఏడాదిన్నర పాలనలోనే చంద్రబాబు సర్కారు రూ.2.66 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించట్లేదా అని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కానీ గత వైఎస్సార్సీపీ పాలనలో లేని అప్పులు కూడా ఉన్నట్లుగా ఎల్లో మీడియా ఇష్టారీతిన దుష్ప్రచారం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ బాబు అండ్ కో గగ్గోలు పెట్టిందని పేర్కొంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు మెదపకపోవడం గమనార్హమని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.బడ్జెట్ అప్పు(రూ.కోట్లలో)2024–25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పు 81,597 2025–26 ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పు 67,283నవంబర్ 4వ తేదీ (ఆర్బీఐ ప్రకారం) 3,000డిసెంబర్ 2వ తేదీ (ఆర్బీఐ ప్రకారం) 3,000మొత్తం 1,54,880బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా బాబు సర్కారు అప్పులు (రూ.కోట్లలో)పౌరసరఫరాల సంస్థ 7,000మార్క్ఫెడ్ 18,700ఏపీఐఐసీ 8,500ఏపీఎండీసీ 9,000ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు 1,150ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1,000ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ 10,000ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా.. 5,473 నాబార్డు నుంచి డిస్కంలకు 3,762మొత్తం 71,295రాజధాని కోసం చేసిన అప్పులు(రూ.కోట్లలో)ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 15,000హడ్కో 11,0జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ 5,000ఎన్ఏబీఎఫ్ఐడీ 7,500ఏపీపీఎఫ్సీఎల్ 1,500మొత్తం 40,000 -
రాజధానిలో రెండో విడత భూసమీకరణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం కోసం రెండో విడతలో 20,494.87 ఎకరాల భూసమీకరణకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్కు ప్రభుత్వం అనుమతిచ్చింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాల్లో 16,562.56 ఎకరాలు పట్టా, 104.01 ఎకరాల అసైన్డ్ భూమి కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను రైతుల నుంచి సమీకరించనుంది. మంత్రుల బృందం(జీవోఎం) 21వ సమావేశం మినిట్స్ ప్రకారం ఆ భూములను ఏపీ సీఆర్డీఏ చట్టం సెక్షన్–55(2) ప్రకారం రైతుల నుంచి సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు పట్టా, అసైన్డ్ భూమి 16,666.57 ఎకరాలతోపాటు 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా సీఆర్డీఏ కమిషనర్ సమీకరించనున్నారు. అంటే.. రెండో విడత భూసమీకరణలో మొత్తం 20,494.87 ఎకరాల భూమిని సీఆర్డీఏ సమీకరించనుంది. రాజధానిలో రెండో విడత భూసమీకరణకు జూన్ 24న రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. తొలుత గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 11 గ్రామాల్లో 44,676.44 ఎకరాలను సమీకరించేందుకు సిద్ధమైంది. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గింది.తొలుత ఏడు గ్రామాల పరిధిలో 20,494.87 ఎకరాల సమీకరణకు గత నెల 28న మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండో విడత భూసమీకరణ కింద భూములు ఇచ్చే రైతులకు జూలై 1న జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 మార్గదర్శకాల ప్రకారం ప్రయోజనం చేకూర్చుతామని ప్రభుత్వం పేర్కొంది. భూసమీకరణ ఇలా...ప్రస్తుతం పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో పట్టాభూమి 1,965 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1,395.48 ఎకరాలు, పెదమద్దూరులో పట్టా భూమి 1,018 ఎకరాలు, ప్రభుత్వ భూమి 127 ఎకరాలు, యండ్రాయిలో పట్టా భూమి 1,879 ఎకరాలు, అసైన్డ్ భూమి 46 ఎకరాలు, ప్రభుత్వ భూమి 241 ఎకరాలు, కర్లపూడి లేమల్లెలో పట్టా భూమి 2,603 ఎకరాలు, అసైన్డ్ భూమి 51 ఎకరాలు, ప్రభుత్వ భూమి 290.75 ఎకరాలను సమీకరిస్తారు.అదేవిధంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమానులో పట్టా భూమి 1,763.29 ఎకరాలు, అసైన్డ్ భూమి 4.72, ప్రభుత్వ భూమి 168.86, హరిశ్చంద్రాపురంలో పట్టా భూమి 1,448.09 ఎకరాలు, అసైన్డ్ భూమి 2.29 ఎకరాలు, ప్రభుత్వ భూమి 977.87 ఎకరాలు, పెదపరిమిలో పట్టా భూమి 5,886.18 ఎకరాలు, ప్రభుత్వ భూములు 627.34 ఎకరాలను సమీకరిస్తారు. -
అమరావతి నాడు ఇంటర్నేషనల్.. నేడు.. మున్సిపాల్టీ!
సాక్షి, అమరావతి: ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని రీతిలో అత్యద్భుతంగా అమరావతి రాజధానిని నిర్మిస్తానంటూ 2014 నుంచి 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చే వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే నమ్మబలికారు! కానీ ఇప్పుడు 29 గ్రామాలకే పరిమితమైతే రాజధాని అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ వితండ వాదనకు తెరతీశారు. నాడు ఇంటర్నేషనల్ సిటీ అంటూ ప్రగల్భాలు పలికి, ఇప్పుడు మున్సిపాల్టీ అంటూ బీద అరుపులు అరవడమేమిటని మేధావులే కాదు.. రాజధాని రైతులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను తాను విజనరీగా చెప్పుకునే చంద్రబాబు నాడే ఈ మాట చెప్పి ఉంటే.. అసలు రాజధానికి భూములు ఇచ్చేవాళ్లమే కాదని రైతులు మండిపడుతున్నారు. భూములిచ్చి 11 ఏళ్లవుతున్నా.. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా ఇప్పుడు రెండో విడత అంటూ 20,494.87 ఎకరాల భూసమీకరణకు అనుమతిస్తూ చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంపై రైతులు రగిలిపోతున్నారు. రెండో విడతలో సమీకరించే భూములను ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ పేరుతో తక్కువ ధరకు బినామీలు, సన్నిహితులకు కట్టబెట్టేసి.. ఇప్పటికే తొలి విడతలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికి రాజధాని ముసుగులో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారని ఆరోపిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ఉత్తదేనా..?సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాజధాని లేని రాష్ట్రానికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మిస్తానంటూ 2014లో సీఎం చంద్రబాబు ప్రకటించారు. తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల పరిధిలో రాజధాని ఏర్పాటుపై బినామీలు, సన్నిహితులకు లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే భారీ ఎత్తున భూములు కాజేశారు. ఆ తర్వాత రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు. అప్పట్లో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల్లో 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217 చ.కి.మీ) రాజధాని నిర్మాణానికి ప్రణాళిక రచించారు. ఆ పరిధిలో రాజధాని నిర్మాణానికి సింగపూర్ కన్సార్షియం ‘సుర్బానా–జురాంగ్’లకు రూ.28.96 కోట్లు చెల్లించి 2015–16లో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్తో ప్రపంచంలోనే ఎక్కడా లేని రీతిలో రాష్ట్రానికి అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తామంటూ నాడు చంద్రబాబు నమ్మబలికారు. మన ఇంజనీర్ల మాస్టర్ ప్లాన్తో నిర్మిస్తే అవి మురికివాడలుగా మారుతాయంటూ మన రాష్ట్ర, దేశ ఇంజనీర్లను అప్పట్లో అవమానించారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్తో 53,748 ఎకరాల్లో ప్రపంచంలోనే అత్యద్భుతమైన రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు 2014 నుంచి చెబుతూ వచ్చారు. తాజాగా 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది అంటూ కాడి పారేశారు! అంటే.. మరి సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఉత్తదేనా..? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు రాజధాని విషయంలోనూ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ దాగుడుమూతలాడుతున్నారని మండిపడుతున్నారు. రియల్ ఎస్టేట్కు రాజధాని ముసుగు..!ప్రస్తుతం రాజధాని నిర్మిస్తున్న 53,748 ఎకరాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, ఇతర అవసరాలు పోనూ ప్రభుత్వం వద్ద ఇంకా 8,274 ఎకరాలు మిగులు భూమి ఉందని 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే విడుదల చేసిన శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబే వెల్లడించారు. ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీతోపాటు స్మార్ట్ ఇండస్ట్రీస్కు ఆ భూమి సరిపోతుందని నిపుణులు, రాజధాని రైతులు స్పష్టం చేస్తున్నారు. తొలి విడతలో సమీకరించిన భూముల్లోనే ఇప్పటికీ రాజధాని పనులు ప్రాథమిక దశ దాటలేదని, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు నేటికీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. ఆ పనులను 2036 నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రభుత్వమే ప్రపంచ బ్యాంకుకు చెబుతోందని పేర్కొంటున్నారు. రాజధాని నిర్మించడమంటే నగరం నిర్మించడం కాదని.. పరిపాలన భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ బాధ్యతని.. ఆ తర్వాత తనకు తానుగానే నగరంగా రూపుదిద్దుకుంటుందని.. హైదరాబాద్ అందుకు నిదర్శనమని నిపుణులు స్పష్టం చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా బినామీలు, సన్నిహితులతో కలిసి కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే చంద్రబాబు రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీశారని విశ్లేషిస్తున్నారు.ఐఎంజీ భారత్, బిల్లీ రావు తరహా బినామీలను ముందు పెట్టి.. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో చంద్రబాబు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు క్రీడల అభివృద్ధి ముసుగులో ఊరూ పేరులేని ఐఎంజీ భారత్ అనే సంస్థ ముసుగులో బిల్లీరావుకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అత్యంత విలువైన 400 ఎకరాలు, శంషాబాద్కు సమీపంలో 450 ఎకరాలు కేటాయించేశారు. అంతేకాదు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో స్టేడియంలు, క్రీడా మైదానాలను బిల్లీరావుకు 45 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేసి వాటి నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ.. నాడు చంద్రబాబు భూకుంభకోణానికి 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చెక్ పడింది. ఇప్పుడు అదే రీతిలో అమరావతిలో మరో భూకుంభకోణానికి తెరతీశారనే ఆరోపణలు వెల్లువెతున్నాయి. రాజధాని తొలి విడత, రెండో విడతలో సమీకరించే భూముల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణం పేరుతో 5 వేల ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణం పేరుతో 2,500 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటు పేరుతో మరో 2,500 ఎకరాలను బిల్లీరావు లాంటి సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
ప్రైవేటుకు కాలేజీలు.. అప్పనంగా ఆస్పత్రులూ..
నిన్న...ప్రభుత్వ భూమిలో... ప్రభుత్వ డబ్బుతో... వైఎస్సార్సీపీ సర్కారులో వైఎస్ జగన్ నిరి్మంచిన వైద్య కళాశాలలను పప్పుబెల్లాల తరహాలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. తద్వారా మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను చిదిమేసింది. మనకు రావాల్సిన మెడికల్ సీట్లను కూడా పోగొట్టింది. పేదలకు ఉచితంగా అందాల్సిన మల్టీ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేసింది.నేడు..చంద్రబాబు సర్కారు మరింత బరితెగించింది. ప్రభుత్వ డబ్బులతో నిరి్మంచిన నాలుగు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పబోతోంది. కొసమెరుపు ఏంటంటే... ఇప్పటికే ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బందికి జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు గంపగుత్తగా ఆస్పత్రిని ప్రైవేటుకు అప్పజెప్పడమే కాకుండా.. ఈ రెండేళ్లు పాటు అక్కడ పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది అందరికీ ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుందట. అంటే... ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కట్టి, ప్రభుత్వ ఆస్పత్రిని, దానిలో పనిచేసే సిబ్బంది జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టబోతోంది. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామిక ప్రభుత్వమూ చేయని రీతిలో చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. సాక్షి, అమరావతి: సంపద సృష్టి హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు... పచ్చపార్టీ కార్పొరేట్లు, అస్మదీయులు, బంధుమిత్రులకు ప్రజా సంపదను దోచిపెట్టడంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ)ను ప్రధాన ఆయుధంగా మలుచుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నిరి్మంచిన కొత్త వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి పప్పుబెల్లాల్లా కట్టబెడుతున్నారు. భూమి ప్రభుత్వానిది, మెడికల్ కాలేజీ ప్రభుత్వానిది, ఆస్పత్రులు ప్రభుత్వానివి, అక్కడ పనిచేసే వైద్య సిబ్బందిని హోల్సేల్గా ప్రైవేటుకు అప్పజెప్పడమే కాక రెండేళ్ల పాటు వారి జీతాలను ప్రభుత్వమే చెల్లించడానికి సిద్ధమైంది. తద్వారా జీతభత్యాల రూపేణానే వందల కోట్ల రూపాయిలను అప్పనంగా ప్రైవేటు వారికి దోచిపెడుతోంది. జగన్ శ్రీకారం.. చంద్రబాబు బేరం వైఎస్ జగన్ రూ.8,480 కోట్లతో కొత్తగా 17 మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టగా గత ప్రభుత్వంలోనే ఐదు కళాశాలలు ప్రారంభమై తరగతులు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు 10 వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కార్ ప్రైవేట్కు కట్టబెడుతున్న విషయం తెలిసిందే. తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కళాశాలలను కైవసం చేసుకునే ప్రైవేట్కు ధారాదత్తం చేసింది. ఇది చాలదన్నట్లు వాళ్లకు ప్రభుత్వ ఆస్పత్రులను రెండేళ్ల పాటు అప్పగించనుంది. వాటిలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ఖజానా నుంచి వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏకంగా రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అధికారికంగా దోచిపెడుతోంది. ఆర్ఎఫ్పీకి సవరణలు చేస్తూ ఉత్తర్వులు ఇప్పటికే రూ.కోట్ల విలువైన భూములను ఎకరానికి రూ.వంద లీజు, వైద్య సేవలకు రుసుములు, ప్రైవేట్ కళాశాలల మాదిరి వైద్య విద్యార్థుల నుంచి ఫీజు వసూలుతో ప్రైవేట్ వ్యక్తులకు భారీ మేలు తలపెట్టడానికి బాబు సర్కారు సిద్ధమైంది. ఇదికూడా సరిపోనట్లుగా ప్రైవేట్ వ్యక్తులకు మరింత లబ్ధి చేకూరుస్తూ ఖజానా నుంచి ఏకంగా రూ.వందల కోట్లపైనే ప్రయోజనం చేకూర్చే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)కు సవరణలు చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అత్యాధునిక పరికరాలు, పోస్టులు భర్తీ చేసిన జగన్ సర్కారు.. తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలలను ప్రైవేట్కు ఇస్తూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లు పిలిచింది. వీటిలో పులివెందుల వైద్య కళాశాల, ఆస్పత్రి నిర్మాణం గత వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయి. మిగతా మూడుచోట్ల ఏపీవీవీపీ ఆస్పత్రులను 300 పైగా పడకల ఆస్పత్రులుగా అభివృద్ధి చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా వైద్యులు, బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేశారు. పులివెందుల కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులను ప్రారంభించడానికి ఎన్ఎంసీ నుంచి అనుమతులు కూడా వచ్చాయి. కానీ, బాబు సర్కారు కళాశాలకు సీట్లు వద్దని లేఖ రాసి రద్దు చేయించింది. దీన్నిబట్టి పరిశీలిస్తే ప్లగ్ అండ్ ప్లే తరహాలో నాలుగు కళాశాలలు ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా, ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ఒక కొత్త వైద్య కళాశాలను స్థాపించాలంటే 25 ఎకరాల భూమి సమకూర్చుకోవాలి. కనీసం 320 పడకల బోధనాస్పత్రిని అభివృద్ధి చేశాక... ఎన్ఎంసీకి దరఖాస్తు చేసి ఓపీ, ఐపీ, సర్జరీలు, ఇతర సేవల్లో నిర్దేశించిన ప్రమాణాలను అధిగమించాకే నెలకొల్పే అర్హత వస్తుంది. ఇది ఎంతో ఖర్చు, ప్రయాసలతో కూడినది. దీనంతటికీ రూ.వందల కోట్ల పెట్టుబడి పెట్టి, సుమారు ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ వ్యయ ప్రయాసలేమీ లేకుండా తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న కళాశాలలను బాబు సర్కార్ ప్రైవేట్కు ఇచ్చేసింది. దాంతో ఆగకుండా మరింత బరితెగించి ఆస్పత్రులను ఇచ్చేసి, అక్కడి పనిచేసే వైద్య సిబ్బందికి జీతాలను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడానికి సిద్ధమైంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి 800 మంది వైద్య సిబ్బంది నాలుగు ఆస్పత్రుల్లో ప్రస్తుతం 800 మంది మేర వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. టెండర్లలో కళాశాలలను కైవసం చేసుకున్న ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఆస్పత్రులు పెట్టి, వైద్యులు, సిబ్బంది వేతనాలను ప్రభుత్వమే చెల్లించబోతోంది. అంటే, రూ.వందల కోట్లపైగా ప్రజాధనాన్ని జీతాల రూపంలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు భారీ మేలు చేయబోతోంది. గోరంత ప్రభుత్వానికి ఇస్తే చాలు భవిష్యత్లో నర్సింగ్, ఆయుష్, డెంటల్ వంటి అనుబంధ వైద్య విద్య కళాశాలలు మిగులు భూముల్లో ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం అవకాశం ఇచి్చంది. ప్రతిఫలంగా వచ్చే ఆదాయం నుంచి ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి 3 శాతం ఇవ్వాలని ఆఫర్ ఇచ్చారు. వాస్తవానికి తొలుత మెడికల్, నర్సింగ్, అనంతరం డెంటల్, ఆయుష్ వంటి ఇతర కళాశాలలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడానికి వీలుగా వైఎస్ జగన్ హయాంలో కళాశాలలకు భూములను కేటాయించారు. ఇప్పుడా భూములన్నింటినీ నామమాత్రం లీజు ధరలతో ప్రైవేట్కు కట్టబెట్టేయడమే కాకుండా అనుబంధ కళాశాలలు ఏర్పాటు చేసుకుని లాభాలు గడించడానికి బాబు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది. పీపీపీలో వైద్య కళాశాలల అభివృద్ధిలో ప్రభుత్వం, ప్రజలు, విద్యార్థులపై ఎలాటి భారం ఉండదంటూ చంద్రబాబు, మంత్రులు తేనె పూసిన కత్తిలాంటి ప్రకటనలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం, ప్రజలు, విద్యార్థులకు నష్టం తలపెడుతూ ప్రైవేట్ వ్యక్తులకు లాభాల పంట పండించేలా పీపీపీ విధానం రూపొందించారు. ఈ కళాశాలల్లో... మిగతా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే ఫీజులు ఉంటాయని సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించింది. కోటి సంతకాలతో కలమెత్తి..! వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునకు అపూర్వ స్పందన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కదంతొక్కిన వైఎస్సార్సీపీ ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థుల నుంచి స్వచ్ఛందంగా మద్దతు మేధావులు, తల్లిదండ్రులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంతకాలుప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ, వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచి్చన కోటి సంతకాల సేకరణ పిలుపునకు అపూర్వ స్పందన లభించింది. రూ.లక్షల కోట్ల విలువైన సంపద లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన సన్నిహితులకు పప్పుబెల్లాల మాదిరిగా పంచిపెట్టడంపై వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. పేదలు వైద్యం కోసం వెళ్లిన క్రమంలో ప్రైవేటు దోపిడీకి బలికాకుండా అరికట్టి సేవలందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాసంఘాలు, మేధావులు, విద్యార్థులు స్వచ్ఛందంగా మద్దతు పలికి పెద్దఎత్తున పాల్గొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీల్లో ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేశారు. ప్రభుత్వ రంగంలోనే కొత్త మెడికల్ కాలేజీలు నిర్వహించాలంటూ చంద్రబాబు సర్కార్పై సమరభేరి మోగించారు. మరోవైపు కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పరాకాష్టకు చేరిన చంద్రబాబు సర్కారు అవినీతికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రభుత్వ రంగంలో కొత్త మెడికల్ కాలేజీలతో పేదలకు చేరువలో నాణ్యమైన వైద్యంతో పాటు మన విద్యార్థులకు కనీ్వనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు ఉచితంగా, మిగిలినవి కూడా ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే అతి తక్కువ ఫీజులతో అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని చంద్రబాబు కాలదన్నడాన్ని వివరించింది. కాగా, కోటి సంతకాల కార్యక్రమంలో సంతకాలు చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాల సేకరణలో భాగమయ్యారు. ఇది ఒక మహోద్యమంగా రూపాంతరం చెందడంతో బాబు ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి దిగింది. నిరసన ర్యాలీల్లో పాల్గొనొద్దని, కేసులు పెడతామని వైఎస్సార్సీపీ నేతలకు పోలీసుల చేత నోటీసులిప్పించింది. అయినా నిరసన ర్యాలీల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు గళం విప్పాయి. -
అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్.. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే
శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీ పెరగడంతో తాజాగా మరో 10 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు ఈ రైళ్లు అన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల మీదుగా శబరిమలకు చేరుకుంటాయి. డిసెంబర్ 13 నుంచి 31 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఆ రైళ్లు ఏయే తేదీల్లో ఎక్కడి నుంచి వెళ్తాయో వాటి వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శబరిమలకు ఇప్పటికే సుమారు 60 ప్రత్యేక సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది.చర్లపల్లి -కొల్లం జంక్షన్ (07119), సిర్పూర్ కాగజ్ నగర్ -కొల్లం జంక్షన్ (రైలు నం. 07117), చర్లపల్లి -కొల్లం జంక్షన్ (07121), నాందేడ్ - కొల్లం (07123) రైళ్లకు డిసెంబర్ 3 నుంచే టికెట్ల బుకింగ్ ప్రారంభం కానున్నాయి. ఈ నాలుగు రైళ్లకు బుధవారం ఉదయం 8గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. -
టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శాపం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఒక వైపు పంటల కొనుగోలు లేక, మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడిక్కడ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్కుమార్ వెల్లడించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా, అటు వైపు నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదని ఆయన ఆక్షేపించారు.కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని చెప్పారు. వ్యవసాయంపై చంద్రబాబు, ఎన్నికల ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ తెలిపారు. ఏం మాట్లాడారంటే..:సంక్షోభంలో వ్యవసాయ రంగం:గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండగలా సాగింది. విత్తనాలు మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి గ్రామంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాయి నాటి రైతు భరోసా కేంద్రాలు. వాటిని జగన్ ఏర్పాటు చేశారన్న అక్కసుతోనే, ఇప్పుడు ఆ వ్యసవ్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో విత్తనాలతో పాటు, యూరియా కోసం కూడా రైతుల క్యూ కట్టక తప్పడం లేదు. యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనకా తప్పడం లేదు.చివరకు పంటలు అమ్ముకోవడానికి కూడా ఇప్పుడు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదు. చాలా చోట్ల ధాన్యం కళ్ళాల్లోనే ఆరబోసి ఉండగా, వరస తుపాన్లు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు ప్రభుత్వం నుంచి ఏ విధంగానూ అండ లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం, కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోవడం.. ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేశాయి.కళ్ళాల్లోనే ధాన్యం. లేని కొనుగోళ్లు:రాష్ట్రంలో ఎక్కడికక్కడ కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. ఇంకా చాలా చోట్ల రోడ్లపైనా ధాన్యం రాసులే ఉన్నాయి. మచిలీపట్నం హైవే మీద పెనమలూరు నుంచి «10 రోజులుగా, ధాన్యం రాసులు పోసి ఉండగా, ఓ మంత్రి అటుగా వెళ్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, వాటిని అక్కడి నుంచి తీసేయాలని ఆదేశించారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, మరోవైపు రైతులను ఆ విధంగా కూడా ఇబ్బంది పెడుతోంది.మొంథా తుపాన్తో నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటామనే దానిపై ఇప్పటి వరకు అటు కేంద్రం నుంచి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఒక్క ప్రకటన కూడా రాలేదు. తుపాన్ తర్వాత కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా, రైతుల కష్టాలు కొంత వరకైనా తీరేవి. కానీ, కూటమి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీకి పూర్తిగా మంగళం పాడింది.దారుణంగా పడిపోయిన ధరలు:మా పామర్రు నియోజకవర్గంలో 75 కేజీల బస్తా ధాన్యాన్ని కనీసం రూ.1000కి కూడా కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. తేమ పేరుతో తూకం తగ్గిస్తున్నారు. అలా ఒక్కోసారి 75 కేజీల బస్తాల్లో 12 కేజీల వరకు తీసేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు, దళారులదే రాజ్యంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో, ధాన్యం కొనుగోళ్లలో ఆర్బీకేలు పని చేయడం వల్ల, ఏనాడూ రైతులు ఇలా ఇబ్బంది పడలేదు.ఇప్పుడు మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, చీనీ, మామిడి ఇలా దేనికీ మద్దతు ధర ఇచ్చిన పరిస్ధితి లేదు. అరటి అయితే మరీ దారుణంగా కేజీ కనీసం 50 పైసలు కూడా పలకడం లేదు. ఇకనైనా ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కైలే అనిల్కుమార్ కోరారు. అలాగే రైతుల సమస్యలపై నోరెత్తితే, కక్ష సాధింపు చర్యలు విడనాడి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మాజీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. -
కేసులు ఎదుర్కొనే ధైర్యం లేక.. చంద్రబాబు అడ్డదారులు: బొత్స
సాక్షి, విజయవాడ: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించడానికి సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘ఆ కేసుల్లో ఫిర్యాదుదారులుగా ఉన్న అధికారులను బెదిరించి, భయపెట్టి వాటిని ఉపసంహరించు కునేలాచేస్తున్నారు. ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్యహరించాల్సిన దర్యాప్తు అధికారులు కూడా పూర్తిగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నారు. తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు అడ్డదారులు తొక్కుతున్నారు.’’ అని బొత్స మండిపడ్డారు.‘‘తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయ నాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటే. అదే ఈసారి కూడా కొనసాగుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై గవర్నర్ తక్షణం చర్యలు తీసుకోవాలి. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. -
రాజకీయాల్లో చంద్రబాబు వింత పోకడ: పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: దేశంలో తప్పుడు రాజకీయాలు చేయటంలో చంద్రబాబు దిట్ట.. ఎప్పటికప్పుడు వింత పోకడలతో దిగజారుడు రాజకీయాలు చేస్తారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లటం గతంలో చూశాం. ఇప్పుడు డబ్బు ఇచ్చి పదవులు కొనుక్కునే పరిస్థితి తెచ్చారు’’ అంటూ మండిపడ్డారు.‘‘డబ్బులు ఇచ్చి రాజీనామా చేయిస్తారు. తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన వారికి పదవులు ఇస్తారు. పదవులు కొనుక్కునే వారిని కూడా చంద్రబాబే చూస్తారు. ముందే బేరం మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి రాజీనామాను చేయిస్తారు. ఎన్టీఆర్ హయాం నుండి ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయటం చంద్రబాబు కు అలవాటే. ప్రజాస్వామ్యం, చట్టం, విలువులు అనేవీ పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి నాయకులు వస్తారని రాజ్యాంగం రాసేటపుడు అంబేద్కర్ కూడా ఊహించి ఉండరు’’ అంటూ పేర్ని నాని చురకలు అంటించారు.‘‘వైద్యం చేయించుకోకపోతే చచ్చిపోతాడని బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పటికీ ఆస్పత్రి కి వెళ్లలేదు. అధికారులను బెదిరించి తన మీద ఉన్న కేసులను మూయించేసుకుంటున్నారు. బెయిల్ ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. అధికారాన్నిఅడ్డం పెట్టుకుని కేసులు మాఫీ చేయించుకుంటున్నారు. అమరావతిని చంద్రబాబు చంపేశారు. అసలైన కుట్ర దారు చంద్రబాబేనని రాజధాని రైతులే అంటున్నారు. అమరావతికి ఏ పరిశ్రమా రావటం లేదు. పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ వైజాగ్ వెళ్తుంటే ఇక అమరావతిలో భూములకు రేట్లు ఎలా వస్తాయి?..హైవే నిర్మాణం చేస్తూ జగన్ రైతులకు మేలు చేశారు. ప్రధాన రోడ్డుకు పక్కనే చంద్రబాబు ఎలా ఇల్లు కట్టుకోగలిగారు?. రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా మళ్ళీ రెండు విడత భూసమీకరణ ఎలా చేస్తారని రైతులే ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చింది కేవలం కేవలం దోచుకోవటానికి, తమ మీద ఉన్న కేసులను మాఫీ చేసుకోవటానికే. దోచుకున్న సొమ్మంతా దుబాయ్లో దాచుకుంటున్నారు. దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన చంద్రబాబు పునీతుడు కాదు. కచ్చితంగా చంద్రబాబు మీద ప్రకృతి తిరగపడుతుంది. అప్పుడు ఇవే కోర్టులు చంద్రబాబును జైలుకు పంపుతాయి..గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్ల చనిపోవటంపై శాస్త్రవేత్తలతో పరిశోధన చేయించాలి. రైతులతో పాటు కొబ్బరి చెట్లకు కూడా ఊపిరి పోయాలి. ప్రజల అవసరాలు తీర్చటం చేతకాకే పవన్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. లోకేష్ విమానాలు ఎలా తిరుగుతున్నారు. రూ.50 కోట్ల విలువైన భూమిని ఎకరా 99 పైసలకే తీసుకున్న వారు పెడుతున్నారా?. లోకేష్ బినామీలు ఖర్చు పెడుతున్నారా?. ఎవరు డబ్బు ఖర్చు చేస్తే విమానాల్లో తిరుగుతున్నారో లోకేష్ చెప్పాలి. చంద్రబాబు బినామీ పేరుతో హెలికాఫ్టర్ కొన్నారు. మరి లోకేష్ వాడుతున్న విమానాలకు డబ్బు ఎవరు కడుతున్నారు?. వారానికి రూ.20 లక్షల ఖర్చు ఎవరు చేస్తున్నారో చెప్పే దమ్ముందా?చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. దీనిపై నేనే స్వయంగా ఆర్టీఐ ద్వారా అడిగి రెండేళ్లయినా ఎందుకు ఇవ్వటం లేదు?. పవన్ కళ్యాణ్ సినిమా మ్యాట్నీకే ఎవరూ వెళ్లటం లేదు. నిర్మాతలు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు జీఎస్టీ కూడా నిర్మాతలు చెల్లించలేదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు దుర్మార్గపు విషపు ప్రచారాలను జనం నమ్మారు. ఇప్పుడు వారి మోసాన్ని జనం గ్రహించారు. తగిన సమయంలో తగిన గుణపాఠం నేర్పుతారు’’ అని పేర్ని నాని అన్నారు. -
అమరావతికి రెండో విడత భూ సమీకరణ
సాక్షి, విజయవాడ: అమరావతికి రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు గ్రామాల్లో భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రభుత్వ భూములు కాకుండా 16,666 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. భూ సమీకరణ బాధ్యత సీఆర్డీఏ(CRDA) కమిషనర్కు అప్పగించింది. అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణ చేయనుంది.రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53,748 ఎకరాలు సమీకరించిన సీఎం చంద్రబాబుకు భూ దాహం తీరడం లేదు. అమరావతి మండలంలోని 4, తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. కాగా, గత జూన్ 24న మంత్రివర్గంలో మలి విడత భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. రాజధాని మలి విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జూలై 1న ల్యాండ్ పూలింగ్ స్కీం (భూ సమీకరణ పథకం)–2025 విధి విధానాలు జారీ చేశారు.మరోవైపు, మొదటి విడత సమీకరణ కింద పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని.. అభివృద్ధి చేసిన నివాస(రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నాబార్డు నుంచి డిస్కమ్స్కు రూ.3,762.26 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: నాబార్డు నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్స్) రూ.3,762.26 కోట్లు అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి షరతుల్లేని, మార్చలేని హామీకి లోబడి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్ల అమలు కోసం ఈ రుణాన్ని వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీఈపీడీసీఎల్కు రూ.1,294.87 కోట్లు, ఏపీసీపీడీసీఎల్కు రూ.1,162.86 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్కు రూ.1,304.53 కోట్లు కలిపి మొత్తం రూ.3,762.26 కోట్లు నాబార్డు నుంచి రుణం తీసుకుంటున్నట్లు వివరించారు. చంద్రబాబు సర్కారు ఇప్పటికే డిస్కమ్స్ పేరిట వివిధ బ్యాంకుల నుంచి విద్యుత్, బొగ్గు కొనుగోళ్ల పేరుతో రూ.5,473 కోట్ల అప్పులకు గ్యారెంటీ ఇచ్చింది. ప్రస్తుత రూ.3,762.26 కోట్లు కూడా కలిపితే డిస్కమ్స్ అప్పులు రూ.9,235.26 కోట్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినట్లయ్యింది. -
చంద్రబాబు హామీ: వేతనాలు, పెన్షన్లకు ఎదురుచూపులే
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ ప్రతి నెలా 1వ తేదీన ఇస్తామన్న చంద్రబాబు హామీ ఒక నెల ముచ్చటగానే మిగిలిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత తొలి నెల మాత్రమే 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇచ్చింది. ఆ తరువాత నుంచి ప్రతి నెలా జీతాల కోసం ఉద్యోగులు, పెన్షన్ల కోసం రిటైర్డ్ ఉద్యోగులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నెల రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మాత్రమే సోమవారం వేతనాలు పడ్డాయి. మిగతా శాఖల ఉద్యోగులకు వేతనాలు పడలేదు. మున్సిపాలిటీ ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగికీ జీతాలు రాలేదు. పెన్షనర్లకు పెన్షన్లు కూడా పడలేదు. తక్కువ జీతాలతో పనిచేసే హోంగార్డులు, వీఆర్ఏలకు కూడా 1వ తేదీన జీతాలు ఇవ్వడం లేదు. ఒక్కోనెల ఐదు, ఆరు తేదీలు వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని, చంద్రబాబు హామీ ఒక నెలకే పరిమితమైందని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తున్నామని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెబుతున్నాయి. ప్రతి నెలా జీతాలు, పెన్షన్లకోసం 10వ తేదీ వరకు వేచిచూడాల్సి వస్తోందని ఉద్యోగులు, పెన్షనర్లు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3 వేల కోట్ల అప్పు చేయనుంది. ఆ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరేవరకు జీతాలకు, పెన్షన్కు ఆగాల్సిందేనని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. -
ఉరేసుకుని ఐఏఎస్ కుమార్తె ఆత్మహత్య
తాడేపల్లి రూరల్/నంద్యాల: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఉంటున్న ఓ ఐఏఎస్ కుమార్తె భర్త వేధింపులు తాళలేక పుట్టింట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐఏఎస్ అధికారి, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్న రాముడు తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. 8 నెలల క్రితం ఆయన కుమార్తె మాధురి సాహితి బాయి (27) ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన రాజేష్ నాయుడిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెద్ద మనసుతో చిన్న రాముడు కుటుంబం ఈ పెళ్లి అంగీకరించింది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రెండు నెలల క్రితం మాధురి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.ఈ క్రమంలో ఆదివారం మాధురి బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మాధురి మృతదేహాన్ని ఎయిమ్స్కు తరలించారు. అనంతరం చిన్న రాముడు మీడియాతో మాట్లాడుతూ కొన్ని నెలలుగా అదనపు కట్నం కోసం రాజేష్ వేధిస్తున్నట్టు తన కుమార్తె చెప్పిందన్నారు. భర్తతో విడిపోయి రెండు నెలలుగా తమవద్దే ఉంటోందని, మానసికంగా బాధపడుతోందని చెప్పారు. తన కుమార్తె మృతికి రాజేష్ నాయుడే కారణమని వాపోయారు. అత్తింటి వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉండలేకపోతున్నానని, వచ్చి తీసుకెళ్లమని మాధురి చెప్పిందని, కూతుర్ని తీసుకువచ్చేందుకు రాజేష్ నాయుడు ఇంటికి వెళ్లగా, అక్కడ వారు గొడవ చేశారన్నారు. స్థానిక పోలీసుల సహాయంతో మాధురి ఇష్ట్రపకారం తాడేపల్లికి తీసుకొచ్చామని చెప్పారు. తమ కుమార్తెమృతికి కారణమైన రాజేష్ నాయుడిని చట్టప్రకారం శిక్షించాలని చిన్నరాముడు దంపతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మాధురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, ఆమె గర్భవతిగా ఉందని, మరో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు తనకు మెసేజ్ చేసిందని భర్త రాజేష్ నాయుడు ఆరోపిస్తున్నాడు. తన భార్య ఉరివేసుకొని చనిపోయేంత పిరికిది కాదనీ, వారి తల్లిదండ్రులే చంపేసి ఉంటారని చెబుతున్నాడు.తన భార్య మృతదేహాన్ని అప్పగిస్తే, అంత్యక్రియలు తానే చేసుకుంటానని, మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని, తాను వెళ్లేంత వరకు పోస్టుమార్టం జరగకుండా చూడాలని కోరుతున్నాడు. తన భార్య తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్కు వాల్మీకి సంఘం నాయకులతో కలిసి రాజేష్ నాయుడు వినతి పత్రం అందజేశారు. -
99 పైసలకే భూ పందేరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అప్పనంగా భూ పందేరానికి చంద్రబాబు ప్రభుత్వం తెర తీసింది. కేవలం 99 పైసలకే ఎకరం చొప్పున కంపెనీలకు ఎన్ని ఎకరాలైనా ఇచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేస్తోంది. ఐటీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)లను ఆకర్షించే పేరుతో ఎంత భూమి అయినా 99 పైసలకే కేటాయించేలా చంద్రబాబు ప్రభుత్వం ‘ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2025–2030’ని రూపొందించింది. లిఫ్ట్ పాలసీ విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ పాలసీ కింద ఐటీ కంపెనీలు, ఐటీఈఎస్, జీసీసీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ డెవలపర్స్, ఐటీ పార్క్ డెవలపర్స్ తక్కువ ధరకు భూమిని పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.పెద్ద కంపెనీలకు ఎంత భూమి అవసరమైనా మొత్తం 99 పైసలకే కేటాయిస్తామని నిబంధనల్లో స్పష్టంచేశారు. మధ్య స్థాయి కంపెనీలైతే రాయితీ ధరపై ఎకరం రూ.4 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. వీటికి అదనంగా ఐటీ, జీసీసీ పాలసీ కింద ఇతర రాయితీలూ అందించనున్నట్లు స్పష్టంచేశారు. పెద్ద కంపెనీలు ఒక్కో ఎకరానికి 500 చొప్పున ఉద్యోగాలు కల్పించాలని తెలిపారు. భారీ ఐటీ కంపెనీలు కనీసం మూడేళ్లుగా రూ.8,900 కోట్ల టర్నోవర్ను కలిగి ఉండాలని, ఐటీ డెవలపర్స్ ఇప్పటికే 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేసి ఉండాలని పేర్కొన్నారు. మధ్యస్థాయి కంపెనీలైతే మూడేళ్లలో కనీసం రూ.30 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలని, 500 ఉద్యోగాలు ఇచ్చి ఉండాలని స్పష్టం చేశారు. -
సీఎం, మంత్రులు, సీఎస్ కార్యాలయాల్లో కంప్యూటర్ల కోసం రూ.12.50 కోట్లు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో), సీఎం క్యాంపు ఆఫీసుతోపాటు మంత్రులు, సీఎస్ కార్యాలయాల్లో కంప్యూటర్లు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కోసం రూ.12.50 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా ఈ కార్యాలయాలకు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్లను సరఫరా చేశారు.ఇందుకుగాను ఏపీటీఎస్కు రూ.12.5 కోట్లు విడుదల చేస్తూ ఐటీ శాఖ కార్యాదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తంతో ఇప్పటికే పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించడంతోపాటు భవిష్యత్తులో కొనుగోళ్లకు వినియోగించుకోవడానికి అనుమతించారు. -
రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం ఢమాల్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం పడిపోయింది. 2023–24 ఆర్థిక ఏడాది కన్నా 2024–25లో రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం. బిహార్, పశ్చిమ బెంగాల్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి 2023–24 ఆరి్థక ఏడాది కన్నా 2024–25లో ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం పెరిగింది.కానీ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం పడిపోయింది. ఈ విషయాన్ని సోమవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 2023–24లో ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి రూ.26,066 కోట్లు రాబడి వస్తే 2024–25లో అది రూ.23,804 కోట్లకు పడిపోయింది. అంటే.. రూ.2,262 కోట్ల రాబడి తగ్గిపోయింది. రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం పడిపోవడంవల్లే పన్ను రూపంలో కేంద్రానికి ఏపీ నుంచి రాబడి తగ్గిపోయిందని స్పష్టమవుతోంది. నెలనెలా తగ్గుతున్న అమ్మకం పన్ను రాబడులు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపటి్టనప్పటి నుంచి రాష్ట్ర అమ్మకం పన్ను రాబడులు అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే ప్రతీనెలా తగ్గుతున్నాయని కాగ్ నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వల్లే అమ్మకం పన్ను రాబడి తగ్గిపోతోంది. ఎన్నికల ముందు ప్రజలిచ్చిన హామీలను చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను అమలుచేయకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. -
వివేకా హత్యకేసులో సునీతపై అనుమానం
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో పరిస్థితులను పరిశీలిస్తే ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతపైనే అనుమానం వస్తోందని న్యాయవాది ఉమామహేశ్వర్రావు చెప్పారు. ఈ కేసులో కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి యథేచ్ఛగా తిరుగుతుంటే.. నిందారోపణలు భరిస్తున్నవారు మాత్రం కుటుంబాలకు దూరంగా బతకాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నర్రెడ్డి సునీత బాధితురాలు కాదని.. ఆమె, నర్రెడ్డి రాజశేఖర్రెడ్డిపై కూడా అనేక అనుమానాలున్నాయని తెలిపారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ నర్రెడ్డి సునీత సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయాధికారి టి.రాఘురామ్ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా శివశంకర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్రావు వాదనలు వినిపించారు. ఆరి్థక విభేదాలు, కుటుంబ వివాదాలు, వివేకా మరో పెళ్లితో పరువు పోతోందన్న గొడవ, ఆస్తిని రెండో భార్యకు, ఆమెకు కుమారుడికి రాసిస్తారన్న కోపం, ఆయన్ని ఏకాకిని చేయడం, తిండిపెట్టే దిక్కు లేకపోవడం, తండ్రిని గొడ్డలితో నరికానని చెప్పిన కిరాయి నరహంతకుడు షేక్ దస్తగిరికి అనుకూలంగా వ్యవహరించడం, అతడి బెయిల్ను వ్యతిరేకించకపోవడం, అతడు స్వేచ్ఛగా తిరుగుతున్నా మిన్నకుండటం.. ఇవన్నీ గమనిస్తే కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్లకు కూడా సునీతపై అనుమానం వస్తుందని చెప్పారు. కానీ సీబీఐ ఆ దిశగా విచారణ జరపలేదన్నారు. ఆమె చెప్పిన మేరకు నిరాధార నిందలు మోపి మరికొందరిని నిందితులుగా చేర్చేలా దర్యాప్తు మరింత లోతుగా చేసేలా ఆదేశించాలని పిటిషన్ వేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అనంతరం విచారణను న్యాయస్థానం నేటికి (మంగళవారానికి) వాయిదా వేసింది. కుటుంబాలకు దూరంగా ఎన్నాళ్లు.. ‘కరుడుగట్టిన కిరాయి నరహంతకుడు దస్తగిరి స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి తిరుగుతుంటే.. నిందమోపబడిన వారు స్వగ్రామానికి దూరంగా హైదరాబాద్లో ఉంటూ న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారు. వివేకా హత్య జరిగి వచ్చే మార్చికి ఏడేళ్లు. ఈ కేసు ఇంకా ఎన్నాళ్లు కొనసాగాలి. 2023 వరకల్లా సీబీఐ చార్జిషీట్, అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసింది. 2025 జనవరి వరకు సత్వర విచారణ కోరిన సునీత యూటర్న్ తీసుకుని ఇప్పుడిలా పిటిషన్ వేయడం వెనుక రాజకీయ కుట్ర ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కేసు పూర్తిగాకుండా చూడాలన్న వైఎస్సార్సీపీ వ్యతిరేకుల కుయుక్తిలో ఆమె కూడా చేరారు.అందుకే ఆగమేఘాల మీద తన నిర్ణయాన్ని మార్చుకుని దర్యాప్తు కొనసాగించాలని పిటిషన్ వేశారు తప్ప.. మరో కారణం లేదు. వైఎస్ భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డి ఇద్దరూ వయోవృద్ధులు. విచారణ జరిపి వారు నిర్దోషులని నిరూపించుకునే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉంది’ అని ఉమామహేశ్వరరావు తన వాదనల్లో పేర్కొన్నారు. హైకోర్టుల్లోని పిటిషన్లు దాచిపెట్టి.. ‘కొత్తగా సాక్షులు వచ్చినా, డాక్యుమెంట్ ఆధారాలు లభించినా.. పిటిషన్ వేయడంలో అర్థముంది. కానీ ఇక్కడ కొత్తగా ఎలాంటి ఆధారం దొరకలేదు. విచిత్రంగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా తప్పుగా ఉందని, మార్చాల్సిందేనని ఆమె పట్టుబడుతుండటం విడ్డూరం. ఇలా ఆమె కోరిన వాటన్నింటికి కోర్టుకు అంగీకరిస్తే.. ఏళ్లకు ఏళ్లు గడిచినా ట్రయల్ కూడా ప్రారంభంకాదు. రోజువారీ విచారణ కోరుతూ హైకోర్టులో ఆమె వేసిన పిటిషన్ను ధర్మాసనం అనుమతిస్తే.. ఈ కోర్టు తదుపరి దర్యాప్తునకు అనుమతి ఇచ్చినా నిష్ప్రయోజనం. సునీల్యాదవ్ తనకు రూ.కోటి ఇచ్చాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు.అందులో చాలా మొత్తం సీబీఐ రికవరీ చేయలేదు. అది రికవరీ చేయాలని మేం వాదనలు వినిపిస్తున్నాం. కానీ సునీత దాన్ని పట్టించుకోరు. చైతన్యరెడ్డి.. దస్తగిరిని బెదిరించాడన్న అంశాన్ని ఆమె పేర్కొన్నారు. ఆ అంశంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏపీ హైకోర్టు దర్యాప్తు నిలిపేస్తూ ఆదేశాలిచి్చంది. వీటితోపాటు తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ను దాచిపెట్టి ఈ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణార్హం కాదు. కొట్టివేయండి’ అని ఉమామహేశ్వర్రావు వాదించారు. -
మరింత బలహీన పడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/నెల్లూరు (అర్బన్)/తిరుమల/సాక్షి, చెన్నై: తీవ్ర వాయుగుండం తమిళనాడు–పుదుచ్చేరి మీదుగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. సోమవారం సాయంత్రానికి ఇది చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130, కడలూరుకు 150, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ బలహీనపడుతోంది. దీని ప్రభావంతో మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. స్తంభించిన ‘నెల్లూరు’ నెల్లూరు జిల్లాను దిత్వా తుపాను వణికిస్తోంది. వాయుగుండం బలహీన పడి నెల్లూరుకు దగ్గరగా వస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మూడు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండగా, ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్రం నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకువచి్చంది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. దీనికితోడు చలి కూడా ఎక్కువగా ఉంది. తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి.చేజర్ల మండలంలోని నల్లవాగుకు ప్రవాహం పెరగడంతో యనమదల, తూర్పుకంభంపాడు, తూర్పుపల్లి తదితర ఐదు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పొదలకూరు మండలంలోని నావూరు వద్ద పెద్దవాగుకు నీటి ప్రవాహం పెరిగింది. బొగ్గేరు, బీరాపేరుకు ఓ మోస్తరు వరద పెరిగింది. విడవలూరు మండలంలోని మలిదేవి డ్రైన్, పైడేరులకు నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే పలుచోట్ల చెరువులు నిండిపోయాయి.అవి ఎక్కడ తెగిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమశిల నుంచి పెన్నానదిలోకి 35 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొలాల నిండా నీరు చేరడంతో నాట్లు, నారుమళ్లు కుళ్లిపోతాయేమోనని రైతులు భయపడుతున్నారు. నెల్లూరు శివారు ప్రాంతాలైన ఆర్టీసీ కాలనీ, చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, పడారుపల్లి, కల్లూరుపల్లి, రాజీవ్ గృహకల్ప, సాయినగర్, జనార్ధన్రెడ్డినగర్ ప్రాంతాల్లో వర్షం నీరు నిలబడిపోయింది. తిరుమలలో వర్షం తుపాను కారణంగా తిరుమలలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. దట్టమైన పొగమంచు తిరుమల కొండలను కమ్మేసింది. చెన్నైలో కుండపోత బలహీన పడ్డ దిత్వా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారడంతో చెన్నైలో సోమవారం అనేక చోట్ల భారీ వర్షం పడింది. మంగళవారం మరింతగా భారీ వర్షాలు పడుతాయనే హెచ్చరికలతో చెన్నై, శివారు జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో చెన్నై తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా రూపంలో చిరు జల్లుల వాన మొదలైంది.ఇది చెన్నైకు 50 కి.మీ దూరంలో ఏడు గంటలకు పైగా కేంద్రీకృతం కావడంతో క్రమంగా వర్షం ప్రభావం పెరిగింది. చెన్నై, శివారులలోని తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో లేదా మంగళవారం ఉదయం చెన్నె తీరానికి 30 కి.మీ దూరంలోకి తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా సమీపిస్తుందని, ఈసమయంలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు మంగళవారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
కేసులను ఎదుర్కొనే దమ్ములేక మూసేయించుకుంటున్నారా?
సాక్షి, అమరావతి: అవినీతి కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక వాటి నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసైన్డ్ భూముల కుంభకోణం కేసు, తాజాగా మద్యం కుంభకోణం కేసును మూసేయించుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులైన అధికారులు కొందరిని లేని స్కాంలలో ఇరికించి.. భయపెట్టి.. ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేస్తే, మరికొందరితో కూడా అడ్డదారుల్లో ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు.దర్యాప్తు సంస్థలు సైతం కేసుల మూసివేతకు సహకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్పై ఉన్న చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడ్డం అత్యంత దుర్మార్గమన్నారు. దేశంలో ఎక్కడా ఇంతటి అధికార దుర్వినియోగాన్ని చూడలేదన్నారు. తక్షణమే చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని నిలువరించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చర్యలపై న్యాయపోరాటం చేస్తామని కూడా బొత్స హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలు..కుట్రపూరితమే..‘ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారు. వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబునాయుడికి అలవాటే. అదే ఒరవడి ఈసారి కూడా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య చంద్రబాబు చేసిన అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో పలు కేసులు నమోదయ్యాయి. స్కిల్ స్కాం కేసులో ప్రాథమిక ఆధారాలు ఉండడంతో చంద్రబాబును కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు కూడా పంపింది.ఆ కేసులో చంద్రబాబు బెయిల్పై ఉన్నారు. ఇవికాక అసైన్డ్ ల్యాండ్ కేసు, అమరావతి రింగ్రోడ్డు అలైన్మెంట్ కేసు, ఉచిత ఇసుక పేరుతో దోపిడీచేసిన వ్యవహారంలో కేసు, ఫైబర్ నెట్లో వందలకోట్ల అవినీతికేసు సహా లిక్కర్ కేసులు కూడా నమోదయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ కేసుల దర్యాప్తులో పురోగతి లేదు. దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రతి క్షణం కేసులను నిర్వీర్యం చేయడానికి బాబు సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ ధోరణిని సహించబోము’ అని బొత్స స్పష్టం చేశారు. -
చంద్రబాబు సర్కారు చేపట్టిన ‘రైతన్నా మీ కోసం’ అట్టర్ ఫ్లాప్
సాక్షి, అమరావతి: ప్రకటన ఆర్భాటం... ఆచరణ అధ్వానం..! ఇదీ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల అమలు తీరు. ఈ కోవలోనే ‘రైతన్నా మీ కోసం’ అంటూ హడావుడి చేశారు. కానీ, హామీల ఎగవేత తప్ప ఏడాదిన్నర పాలనలో చేసిందేమీ లేకపోవడం, అన్నదాత సుఖీభవ అంటూ దగా చేయడం, విపత్తుల వేళ ఆదుకోకుండా గాలికి వదిలేయడంతో తొలిరోజే అన్నదాతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో రెండో రోజు నుంచే మొహం చాటేశారు. కనీసం కరపత్రాలు కూడా పంచే సాహసం చేయలేకపోయారు. ప్రతి నెల సామాజిక పింఛన్ల పంపిణీలో ఫొటో షూట్తో నానా హంగామా చేస్తున్న సీఎం చంద్రబాబు రైతుల గడప తొక్కలేకపోయారు. రైతుల కోసం ప్రాణం ఇస్తానంటూ ఎన్నికల్లో నమ్మబలికిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అయితే పత్తా లేరు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సైతం కూడా రైతుల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే కాదు చివరకు స్థానిక ప్రజా ప్రతినిధులకూ హాజరయ్యేందుకు ధైర్యం చాల్లేదు. ఫలితంగా ‘రైతన్నా మీ కోసం’ అట్టర్ఫ్లాప్ అయ్యింది. అసలు ఈ కార్యక్రమం కోసం పైసా కూడా విదిల్చ లేదంటేనే చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోంది. పంచసూత్రాల్లేవ్.. ఇంటింటికీ పోలేదు.. ‘‘నేనూ రైతు బిడ్డనే. రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం నాకు తెలుసు. మీతో కలిసి నడవడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి, మీకు పూర్తిగా అండగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం’’ అంటూ ‘రైతన్నా మీ కోసం’పై ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు గొప్పలు పోయారు. ప్రతి రైతు ఇంటికి వెళ్లి తమ ప్రభుత్వం గత ఏడాదిన్నరలో ఏం చేసిందో చెబుతామన్నారు. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు అధికారులు కూడా పాల్గొంటారని, తానూ రైతుల ఇళ్లకు వెళ్తానని సీఎం స్వయంగా ప్రకటించారు. రైతును రాజును చేసేందుకు పంచ సూత్రాల పేరిట ముద్రించిన కరపత్రాలను అందించడంతో పాటు ప్రత్యేకంగా తెచ్చిన ఏపీఏఐఎంఎస్ (ఏపీ వ్యవసాయ సమాచార, నిర్వహణ వ్యవస్థ) యాప్ను వారి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి, దాని నిర్వహణపై అవగాహన కల్పించాలని ఆదేశాలిచ్చారు. ఆచరణకు వచ్చేసరికి ఆరంభ శూరత్వంగా మిగిలిపోయింది. తొలి రోజు హడావుడి, హంగామా చేసినా రైతుల నుంచి కనీస స్పందన లేదు. సరికదా పలుచోట్ల తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచి్చంది. టీడీపీ నేతలు తప్ప కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీకి చెందిన ప్రజాప్రతినిదులు, నేతలు మచ్చుకైనా కనిపించలేదు. ఏ పంటకూ మద్దతు ధర లేదు.. ఇదే మీ నిర్వాకం ‘‘మిరప మొదలు అరటి వరకు 18 నెలలుగా ఏ పంటకూ గిట్టుబాటు ధర కాదు కదా మద్దతు ధర కూడా దక్కలేదు. ధాన్యానికి సైతం తేమ శాతం వంకతో మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు. ఓ వైపు ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం మద్దతు ధరకు సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు’’ అంటూ రైతన్నా మీ కోసంలో తొలిరోజే రైతులు ప్రజాప్రతినిధులను కడిగేశారు. మరోవైపు ‘ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ప్రీమియం కట్టలేక బీమా చేయించుకోలేకపోయాం. వరుస విపత్తులతో పంటలు నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదంటూ’ నిలదీశారు. ఎక్కడొచ్చింది అన్నదాత సుఖీభవ? అన్నదాత సుఖీభవ రెండు విడతల్లో పీఎం కిసాన్తో కలిపి రూ.14 వేలు జమ చేసినట్లు చెప్పి తప్పించుకుందాం అని కూటమి ప్రజాప్రతినిధులు భావించినా, ఆ సొమ్ము తమకు పడలేదంటే తమకు పడలేదని, తొలి విడతకు సంబంధించిన వినతులను కనీసం పట్టించుకోలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సమాధానం చెప్పలేక, రైతులను సముదాయించలేక జారుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో చేసేది లేక పాల్గొనలేదని పల్నాడుకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు. ‘‘అన్నదాత సుఖీభవ తొలి ఏడాది ఎగ్గొట్టాం. రెండో ఏడాది పీఎం కిసాన్తో కలిపి రెండు విడతల్లో రూ.14వేలు ఇవ్వడం తప్ప రైతులకు చేసిందేమి లేదు’’ అని కూటమి నేతలే బాహాటంగా చెబుతున్నారు. భజన మీడియా గప్చుప్.. సీఎం చంద్రబాబు బృందం కాలుబయటపెడితే చాలు.. అహో ఒహో అంటూ భజన చేసే పచ్చ మీడియా సైతం ‘‘రైతన్నా మీకోసం’’ గురించి ప్రస్తావించలేదు. దీంతోనే ఈ కార్యక్రమం ఎలా సాగిందో స్పష్టం అవుతోంది. రైతుల ఇళ్లకు వెళ్లినట్టు, వారు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టు రోజువారీ నివేదికలివ్వడం తప్ప ప్రత్యక్షంగా రైతుల ఇళ్లకు వెళ్లిన దాఖలాలు మచ్చుకైనా కని్పంచలేదు. మెజార్టీ గ్రామాల్లో రైతులనే అధికారులు పిలిపించుకుని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే మా ఉద్యోగాలు పోతాయంటూ బతిమిలాడిన పరిస్థితి నెలకొంది. రైతన్నా మీ కోసం ముగింపు సందర్భంగా ఈ నెల 3న ఆర్బీకేల పరిధిలో వర్కుషాపులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మా ఊరికి వస్తే నిలదీద్దామనుకున్నా.. ఎవరూ రాలేదు ‘నా వయస్సు 60 ఏళ్లు.. గత 45 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది రెండు విడతల్లో రూ.10 వేలు వేసామని చెబుతున్నారు. నాకు పడలేదు. ఎవరికి పడ్డాయో కూడా తెలియదు. సొంతంగా ఏడు ఎకరాలు, కౌలుకు మూడు ఎకరాలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. అప్పు చేసి పెట్టుబడి పెట్టి టమాట, పత్తి, కూరగాయలు పండించా. అధిక వర్షాల కారణంగా పత్తి 2–3 క్వింటాళ్ల దిగుబడే రాగా, మిగిలిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తికి క్వింటా రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదు. కేంద్రానికి తీసుకెళ్తే కొనే పరిస్థితి లేదు. ఏంచేయాలో పాలు పోవడం లేదు. రైతన్నా మీ కోసం కార్యక్రమంలో మా గ్రామానికి వస్తే నిలదీద్దామనుకున్నా. ఏ ఒక్కరూ మాఇంటికి వచ్చిన పాపాన పోలేదు. -కె.తిమ్మయ్య, నలకలదొడ్డి, కర్నూలు జిల్లా బాబు సర్కారును రైతులు నమ్మడం లేదు మాటల గారడీ తప్ప రైతులకు కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. మద్దతు ధర దక్కక ఓవైపు అరటి, ఉల్లి, మొక్కజొన్న, సజ్జ రైతులు గగ్గోలు పెడుతుంటే ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో చంద్రబాబు అన్నదాతల గడప తొక్కలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తానని నమ్మబలికి తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది. రెండో ఏడాది రూ.10 వేలతో సరిపెట్టింది. కౌలు రైతులనైతే నిండా ముంచేసింది. అన్నింటా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం రైతన్నా మీ కోసం అంటూ ఆడుతున్న దొంగ నాటకాన్ని నమ్మే స్థితిలో రైతులు లేరు. – పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం -
బాబు మద్యం దోపిడీ కేసు క్లోజ్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు బరి తెగించి సాగించిన మద్యం దోపిడీ దందాకు టీడీపీ గూటి చిలుక సీఐడీ ‘పచ్చతర్పణం’ వదిలేసింది! ఆ కేసులో ఆధారాలు లేవని న్యాయస్థానానికి నివేదించింది. తద్వారా ఆ కేసు మూసివేతకు మార్గం సుగమం చేసింది. 2014–19లో టీడీపీ హయాంలో చంద్రబాబు సాగించిన అవినీతి దందాపై నమోదైన కేసుల మూసివేత కుట్రలో మరో అంకాన్ని ముగించింది. మద్యం దోపిడీ కేసులో నిందితుడైన చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో సీఐడీ ఆయన గూటి చిలుకగా మారిపోయింది. అదే అదనుగా తన మద్యం దోపిడీ కేసు అర్ధాంతరంగా మూసివేతకు చంద్రబాబు చకచకా పావులు కదిపారు.నిందితుడైన ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో పోలీసు, సీఐడీ అధికారులతో ఆ కేసులపై సమీక్ష నిర్వహించి కుట్రకు తెరతీశారు. ఆ కేసును ఎలా క్లోజ్ చేయాలో ఆయనే దిశానిర్దేశం చేసినట్టు అప్పుడే స్పష్టమైంది. ఆ బాధ్యతను చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు అప్పగించడంతోపాటు మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రస్తుత డీజీపీ హరీశ్కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్లకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించారు. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలను బరితెగించి దుర్వినియోగం చేస్తూ మద్యం దోపిడీ కేసు మూసివేత ద్వారా కుట్రలో ఓ అంకాన్ని పూర్తి చేశారు.చీకటి జీవోలతో మద్యం దోపిడీ...రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు మద్యం దోపిడీకి తెగబడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ అనుమతి గానీ కేబినెట్ ఆమోదం గానీ లేకుండానే 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలు 216, 217 జారీ చేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు నాలుగేళ్లలో ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. ఇక 4,840 ప్రైవేటు మద్యం దుకాణాలతోపాటు మరో 4,840 పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాలు, బార్లు అన్నీ టీడీపీ సిండికేట్కే కట్టబెట్టింది. 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీలలో 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతినిచ్చింది. మిగిలిన డిస్టిలరీలకు కూడా అంతకుముందు ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చాయి. అంతేకాదు.. బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా బాబు సర్కారే! ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి మరో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టింది. మొత్తం మీద 2014–19లో రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడింది. ఈ కుంభకోణాన్ని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలతోపాటు పలువురిపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్పై ఉన్నారు. అబ్బే..! ఆధారాల్లేవ్2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ కేసును అటకెక్కించింది. కేసు దర్యాప్తును నిలిపివేసింది. చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని వేధించి బెంబేలెత్తించింది. ఆయనపై కేసులు నమోదు చేసి లొంగదీసుకుంది. చంద్రబాబుపై గతంలో ఇచ్చిన కేసును వాపసు తీసుకోవాలని బెదిరించింది. అనంతరం పక్కాగా కుట్ర కథ నడిపింది. టీడీపీ హయాంలో మద్యం కుంభకోణంపై ఆధారాలు లేవని న్యాయస్థానానికి నివేదించింది. తద్వారా కేసు క్లోజ్ కావటానికి మార్గం సుగమం చేసింది.దీనిపై స్పందించి సమగ్ర దర్యాప్తు కోరాల్సిన వాసుదేవరెడ్డి.. కూటమి ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గారు. ఆ మద్యం కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని తెలిపినట్లు సమాచారం. అంటే గతంతో తాను ఇచ్చిన ఫిర్యాదు, వాంగ్మూలాలకు వ్యతిరేకంగా ఆయన ప్రస్తుతం వ్యవహరించారు. తద్వారా ఆ కేసు మూసివేతకు ఆయన సహకరించారని తెలుస్తోంది. దాంతో చంద్రబాబు మద్యం దోపిడీ కేసు మూసివేతకు లైన్ క్లియర్ అయింది! -
హామీలు ఎగ్గొట్టి.. పెన్షన్లు పోగొట్టి!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ హయాంలో ఎన్నికల నాటికి అత్యధికంగా ఇచ్చిన పింఛన్లు 66.34 లక్షలు..! చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల 1వతేదీ రాత్రి సమయానికి పంపిణీ చేసిన పెన్షన్లు 59.11 లక్షలు! పోనీ గత నెలలో చూసినా.. నవంబర్ 1న బాబు సర్కారు పంచిన పెన్షన్లు 61.64 లక్షలే!! అంటే.. గత 18 నెలల వ్యవధిలో ఏకంగా దాదాపు ఐదు లక్షల పింఛన్లు ఎగిరిపోయాయ్! రాష్ట్రంలో దాదాపుగా తొలిరోజే పింఛన్లు తీసుకునే లబ్ధిదారులే అత్యధికంగా ఉంటారు. దీన్నిబట్టి ఎలా చూసినా గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే చంద్రబాబు సర్కారు వచ్చాక దాదాపు ఐదు లక్షల పింఛన్లు తగ్గినట్లు తెలిసిపోతోంది. మరి ఇది సుపరిపాలనా? ప్రజలకు మంచి చేసినట్లా? సూపర్ సిక్స్లు అమలు చేసినట్లా? కొత్త పెన్షన్లు ఇచ్చినట్లా? టీడీపీ కూటమి ప్రభుత్వం అవ్వాతాతలతోపాటు దివ్యాంగులనూ కనికరించడం లేదు. రీ వెరిఫికేషన్ పేరుతో నోటీసులిచ్చి దాదాపు లక్ష మంది దివ్యాంగులపై కత్తి వేలాడదీసింది! ఇలా ఒకవైపు పెన్షన్లు ఎగరగొడుతూ.. మరోవైపు ఈ నెలలో 8,190 మందికి కొత్త పింఛన్లు ఇచ్చినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెండు రోజుల క్రితం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇక పింఛన్ల పంపిణీని చంద్రబాబు ప్రభుత్వం స్వీయ ప్రచార వేదికగా, పార్టీ కార్యక్రమంలా మార్చేసింది. గత ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటివద్దే గుడ్మార్నింగ్ చెప్పి మరీ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఠంచన్గా పెన్షన్లు పంపిణీ సాగగా... ఇప్పుడు చంద్రబాబు సర్కారు అవ్వాతాతలను, దివ్యాంగులను, వితంతువులను రోడ్డుకీడ్చి పడిగాపులు కాసేలా చేసింది. ఉదయం పూట ఇవ్వాల్సిన పింఛన్లు కాస్తా సోమవారం తిరుపతిలోని జీవకోనలో జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో మధ్యాహ్నం 12:30 గంటలకు వానలో గుంపులుగా నిల్చోబెట్టి అరకొరగా అందజేశారు. దరఖాస్తులకే దిక్కులేదు.. పంపిణీ పేరుతో పబ్లిసిటీ!రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తు ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కొత్తగా 60 ఏళ్లు నిండినవారు, వితంతువులకు అర్హత ఉన్నా గత 18 నెలలుగా పింఛనుకు దరఖాస్తు కూడా చేసుకునే అవకాశం లేకుండా చేసింది. కనీసం ఆన్లైన్ పోర్టల్ను కూడా అందుబాటులోకి తేలేదు. ఒకవైపు దరఖాస్తులను తొక్కిపెడుతూ మరోవైపు పంపిణీ పేరుతో పార్టీ ప్రచార కార్యక్రమాలను రక్తి కట్టిస్తోంది. గ్రామాల్లో టీడీపీ నేతలంతా సచివాలయాల ఉద్యోగులతో కలసి పింఛన్ల పంపిణీలో పాల్గొని ఫోటోలు దిగి ప్రచారం చేయాలని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ కావడం గమనార్హం. దీనికి అనుగుణంగా టీడీపీ ప్రజా ప్రతినిధులు హడావుడి చేస్తున్నారు. పాత పింఛనుదారులకే ఇప్పుడే కొత్తగా ఇచ్చినట్లు ప్రచారం చేశారు. పెండింగ్లో 2.5 లక్షల దరఖాస్తులు.. దాదాపు రెండున్నర లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఏడాదిన్నరకుపైగా పెండింగ్లో పెట్టింది. మరోవైపు అర్హత ఉన్నప్పటికీ కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేక పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు సుమారు మరో 3 లక్షలమందికిపైగా ఉంటారని అంచనా.50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికి..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.నాలుగు వేల చొప్పున పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఒకపక్క ఉన్న పింఛన్లనే ఎగరగొడుతూ.. దరఖాస్తులను తొక్కిపెడుతూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు 50 ఏళ్లకే పెన్షన్ హామీని గాలికి వదిలేసింది.ఐదేళ్లలో 29.51 లక్షల కొత్త పెన్షన్లువైఎస్సార్ సీపీ హయాంలో వృద్ధాప్య పింఛను అర్హత వయసును 60 ఏళ్లకు తగ్గించడంతో మరింత మందికి ప్రయోజనం చేకూరింది. అర్హులు ఏడాదిలో ఏ రోజైనా సరే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. చివరిగా 2024లో జనవరి ఆరంభంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అర్హులైన అవ్వాతాతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏకంగా 29.51 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) స్వయంగా ప్రకటించడం గమనార్హం.ఇంటి పన్ను చెల్లిస్తేనే పింఛన్ప్రత్తిపాడు రూరల్: ఇంటి పన్నుకు, పింఛన్లకు చంద్రబాబు సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో సోమవారం 11,463 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 10,500 మందికే పంపిణీ చేశారు. మండలంలోని పోతులూరులో పింఛన్ల పంపిణీలో ఇంటి పన్నులు వసూలు చేసినట్లు పలువురు లబ్ధిదారులు చెప్పారు. ఈ విషయాన్ని వారు స్థానిక వైఎస్సార్సీపీ నేత శెట్టి సత్తిబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన సత్తిబాబు స్థానిక గ్రామ కార్యదర్శిని నిలదీశారు. అప్పటికే పింఛన్ల పంపిణీ ముగిసింది. సత్తిబాబు మాట్లాడుతూ..గ్రామంలో ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇచ్చారని చెప్పారు. ఇలా బలవంతంగా ఇంటి పన్నులు వసూలు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదని సత్తిబాబు అన్నారు. దీనిపై ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్బాబును వివరణ కోరగా, స్వచ్ఛందంగా ముందుకు వచి్చనవారి వద్ద మాత్రమే పన్ను వసూలు చేసి, రశీదులు ఇచ్చామని చెప్పారు. -
కదంతొక్కిన అరటి రైతు
అనంతపురం: ఆరుగాలం పంటను పండించిన అనంత రైతన్న.. దాన్ని అమ్ముకోలేక పొలాల్లోనే ట్రాక్టర్తో దున్నేసే పరిస్థితి నెలకొందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆవేదన వ్యక్తంచేశారు. రైతును పూర్తిగా విస్మరించిన చంద్రబాబు సర్కార్ తీరును నిరసిస్తూ సోమవారం శైలజానాథ్ నేతృత్వంలో అనంతపురంలో అరటి రైతులు కదం తొక్కారు. ఓటీఆర్ఐ నుంచి కలెక్టరేట్ వరకూ అరటి గెలలతో వినూత్న నిరసన తెలిపారు.అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో రైతులు వేలాది మంది పాల్గొన్నారు. అరటి గెలలను తీసుకొచ్చి కలెక్టరేట్ ఎదుట పడేశారు. ‘కేజీకి రెండు రూపాయలకు కూడా కొనుగోలు చేసే వారు లేరు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అరటి పంటలను తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. -
హలో ఇండియా.. ఓసారి ఏపీ వైపు చూడండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతులు పండించిన అరటి పండ్ల ధర కిలో కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతుండడం, ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అవస్థ పడుతుండడాన్ని దేశం మొత్తానికి తెలియజేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పోస్టు చేశారు. అన్నదాతలకు దన్నుగా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని సూటిగా ప్రస్తావిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు.అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడాన్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు భారీఎత్తున ధర్నా చేస్తున్న ఫొటోలను ట్యాగ్ చేస్తూ ‘‘సేవ్ ఫార్మర్స్’’ హ్యాష్ట్యాగ్తో ‘‘హలో ఇండియా... ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆ పోస్టులో ఆయన ఏమన్నారంటే..‘‘హలో ఇండియా.. ఓ సారి ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి! కిలో అరటిపండ్లు కేవలం రూ.0.50కి అమ్ముడవుతున్నాయి! ఔను, మీరు విన్నది నిజమే, యాభై పైసలే. ఇదీ ఏపీలో అరటి రైతుల దుస్థితి.అగ్గిపెట్టె కంటే చౌక, ఒక బిస్కెట్ కంటే చౌక. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, నెలల తరబడి కష్టపడి పనిచేసిన రైతులకు దక్కిన దారుణమైన ప్రతిఫలం ఇది. అరటిపండ్లు మాత్రమే కాదు, ఉల్లిపాయల నుంచి టమాట వరకు, ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదు. విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా లేదా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చి, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నమ్మబలికి మోసం చేశారు. చంద్రబాబు ప్రతి హామీ ఒక మోసమేనని నిరూపితమైంది.📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!One kilogram of bananas is being sold for just Rs 0.50!Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరటి పండ్లను టన్నుకు సగటున రూ.25 వేల ధరకు రైతులు అమ్ముకున్నారు. రైతులు ఎప్పుడూ నష్టపోకుండా చూసుకోవడానికి రాష్ట్రం నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశాం. రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలు నిర్మించాం. నాటి మా నిబద్ధత వేలాది కుటుంబాలను కాపాడింది. గిట్టుబాటు ధరలకు పంటల ఉత్పత్తులను విక్రయించుకుని లబ్ధి పొందేలా రైతులకు తోడుగా నిలిచాం. కానీ నేడు చంద్రబాబు రైతులను వారి ఖర్మకు వదిలేశారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుంటే మౌనరాగం ఆలపిస్తున్నారు. నేడు ఆహారం విలువ 50 పైసలైతే దానిని ఉత్పత్తి చేసే రైతుల శ్రమ విలువ ఎంత?’’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండి’
తాడేపల్లి: ‘రాష్ట్రంలోని రైతుల దుస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘హలో ఇండియా.. ఒకసారి ఏపీవైపు చూడండి’అంటూ రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి గళమెత్తారు వైఎస్ జగన్. సేవ్ ఏపీ ఫార్మర్స్హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ చేశారు.ఇదీ రైతుల దుస్థితి..కిలో అరటిపండ్లు రైతుల వద్ద నుంచి రూ. 50 పైసలకే అమ్ముడవుతున్నాయని రాష్ట్రంలోని రైతుల దుస్థితికి ఇదే నిదర్శనమన్నారు. అగ్గిపెట్ట, బిస్కెట్ కంటే కూడా అరటిపండు చౌకయ్యిందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల పెట్టుబడి పెట్టి నెలల తరబడి శ్రమిస్తే చివరకు రైతులకు దక్కిన ప్రతిఫలం ఇది అని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అరటి పండ్లే కాదు ఉల్లినుంచి టమోట వరకూ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని జగన్ అన్నారు. మార్కెట్ లో మాత్రం అరటిపండ్లు రూ. 60 నుంచి 70 వరకూ విక్రయిస్తున్నారని అన్నారు. ఈ డబ్బులంతా మధ్యలోని దళారుల జేబుల్లోకే వెళుతున్నాయని రైతులకు మాత్రం రవాణా ఛార్జీలు కూడా మిగలడం లేదన్నారు. దీంతో ఆవేదనతో రైతులు తమ పంటను రోడ్లపై పడివేస్తున్నారన్నారు.బొప్పాయి ధర కూడా మార్కెట్ను బట్టి మారిపోతుందని రైతులకు మాత్రం ఏమీ మిగలడం లేదన్నారు. ఉల్లి టమాట ధరలు కూడా మార్కెట్లో రూ1. నుంచి రూ.3 వరకూ పలుకుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు బతికేది ఎలా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అంతే కాకుండా విపత్తులు వస్తే ఆదుకునేందుకు ఉచిత పంట బీమా లేదు. కనీసం ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అరటి పండ్ల ధర టన్ను రూ. 25 వేలు పలికేదాని అంతేకాకుండా రైతులకోసం ఢిల్లీకి ప్రత్యేకంగా రైళ్లు నడిపామన్నారు. తమ ప్రభుత్వంలో కృతనిశ్చయంతో రైతులకు ఎంతో మేలు చేశామని, రైతుల ఉత్పత్తులను పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ సెంటర్ లను ఏర్పాటు చేశామన్నారు. కానీ నేడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు వైఎస్ జగన్.📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!One kilogram of bananas is being sold for just Rs 0.50!Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025 -
ఏపీకి ‘దిత్వా’ అలర్ట్.. మూడు జిల్లాల్లో పాఠశాలలు బంద్
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. దిత్వా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కరైకాల్కు 120, పుదుచ్చేరికి 90, చెన్నైకు 150 కి.మీ. దూరంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.తుపాన్ ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో తుపాను కదిలింది. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగా నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో దిత్వా తుపాను ప్రభావంతో మరోసారి బీచ్ మూతపడింది. సముద్ర స్నానాలకు యాత్రికులు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బాయపాలెం, విజయలక్ష్మిపురంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.నేడు దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఉన్నాయి. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని చెప్పారు.మంగళవారం వర్షాలు ఇలా.. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అన్నారు. తీరం వెంట గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధావులు స్పందించాలి
ప్రొద్దుటూరు : సీఎం చంద్రబాబు చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేధావులు స్పందించకపోతే భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్ష సంతకాలు పూర్తిచేసిన సందర్భంగా ఆదివారం ఆయన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, డా. జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు వేదికలపై మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రసంగించాలి్సన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వీరు ఈ విషయంపై అస్సలు మాట్లాడటంలేదని, దీనివల్ల రాçÙ్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని రాచమల్లు చెప్పారు. ఇది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య కాదని.. ఈ అంశాన్ని రాజకీయంగా కాకుండా సామాజిక కోణంలో చూడాలని ఆయన సూచించారు. రాచమల్లు ఇంకా ఏమన్నారంటే.. చంద్రబాబు సిగ్గుపడాలి..మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణవల్ల ప్రతిభగల విద్యార్థులకు ఉచితంగా సీట్లు దొరికే అవకాశం ఉండదు. అందరి ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను మంజూరుచేసి అందులో కొన్నింటిని నిర్మించారు. నిజానికి గతంలో ఎవరూ ఇన్ని తీసుకురాలేదు. ప్రతీవారం సీఎం చంద్రబాబు చేసే అప్పుల్లో కేవలం రూ.నాలుగైదు వేల కోట్లు ఖర్చుపెడితే ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పూర్తిచెయొ్యచ్చు. సీఎం చంద్రబాబు వీటిని ప్రాథమిక బాధ్యతగా భావించి యుద్ధప్రాతిపదికన వీటి నిర్మాణం పూర్తిచేయాలి. వీటివల్ల ఆటో కార్మికులు, బేల్దారి పనిచేసే వారు, హమాలీల పిల్లలకు వాటిల్లో చదివే అవకాశం దొరుకుతుంది. పూర్తిగా జగన్పై కక్షతోనే.. ఆయనకు పేరొస్తుందన్న అక్కసుతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను గాలికొదిలేశారు. ఏంచెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. ఇందుకు బాబు సిగ్గుపడాలి.ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ను అటకెక్కించారుఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. ఎంతోమంది నిరుపేదలు ఆరోగ్యశ్రీతో గుండెజబ్బుల ఆపరేషన్లు చేయించుకుని జీవిస్తున్నారు. పేద పిల్లలూ ఉన్నత చదువులు చదివారు. చంద్రబాబు ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీని అటకెక్కించారు. దీంతో ఆస్పత్రుల వద్ద ఆరోగ్యశ్రీ లేదని బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సక్రమంగా చెల్లించడంలేదు. బాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో నాలుగోసారి సీఎంగా ఉన్నారు. అసలు ఇప్పటివరకు ఆయనకు మెడికల్ కాలేజీలు నిర్మించాలన్న ఆలోచన ఎందుకు రాలేదు?లక్ష సంతకాలు పూర్తిచేశాం..ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గాంధేయ మార్గంలో చేపట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులతోపాటు నియోజకవర్గంలోని 30 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక్కో పుస్తకంలో 200 సంతకాలతో మొత్తం 500 పుస్తకాలను పూర్తిచేశాం. వాస్తవానికి అన్ని నియోజకవర్గాల్లో 50 వేల నుంచి 60 వేలు సంతకాలు చేయించాలని పార్టీ సూచించగా, ఇక్కడొక్క చోటే లక్ష సంతకాలు పూర్తిచేయడంతో నియోజకవర్గం అందరికీ ఆదర్శంగా ఉంది. డిసెంబరు 10న పార్టీ హైకమాండ్కు వీటిని అందిస్తాం. -
తొలుత కృష్ణా తర్వాత గంగ
సాక్షి, అమరావతి: దేశంలో అతి పెద్ద నది గంగ..అతి పెద్ద నదుల్లో కృష్ణమ్మది మూడో స్థానం. కానీ.. అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఉన్న నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో మాత్రం కృష్ణ అగ్రగామిగా నిలిచింది. ఆ తరువాత స్థానంలో గంగ బేసిన్ నిలిచింది. కానీ.. నిర్మాణంలో ఉన్న జలాశయాలు పూర్తయితే నీటి నిల్వ సామర్థ్యం అత్యధికంగా కలిగిన జలాశయాలు ఉన్న బేసిన్లలో గంగమ్మ తొలి స్థానంలో నిలుస్తుంది. ఆ తరువాతి స్థానంలో కృష్ణమ్మ నిలుస్తుందంటూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.దేశంలో సింధూ నుంచి కావేరి వరకూ అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వలపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఆ అధ్యయన నివేదికలో ప్రధానాంశాలు.. ⇒ దేశంలో అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,651.73 టీఎంసీలు.⇒ దేశంలో అతి పెద్ద నదుల్లో గంగా నదిది మొదటి స్థానం.. రెండో స్థానంలో గోదావరి.. మూడో స్థానంలో కృష్ణా నిలుస్తాయి.⇒ నదీ పరివాహక ప్రాంతాల్లో అత్యధిక నీటి నిల్వలు కలిగిన జలాశయాలు ఉన్న బేసిన్లలో కృష్ణా మొదటి స్థానంలో నిలుస్తుంది. కృష్ణా బేసిన్లో ఇప్పటికే పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,789 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 146.79 టీఎంసీలు. కృష్ణా బేసిన్లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,935.79 టీఎంసీలు.⇒ గంగా బేసిన్లో పూర్తయిన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,719.28 టీఎంసీలు.. నిర్మాణంలో ఉన్న జలాశయాల నిల్వ సామర్థ్యం 270.17.. గంగా బేసిన్లో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1,989.45 టీఎంసీలు. అంటే.. నిర్మాణంలో ఉన్న జలాశయాలు పూర్తయితే అత్యధిక నీటి నిల్వ కలిగిన రిజర్వాయర్లు ఉన్న బేసిన్లలో కృష్ణమ్మను గంగమ్మ అధిగమించి ప్రథమ స్థానానికి చేరుతుందన్న మాట.⇒ చైనా, భారత్, బంగ్లాదేశ్ల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే బ్రహ్మపుత్రా నది జీవనది. కానీ.. వర్షాచాయ ప్రాంతంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల మీదుగా ప్రవహించే బంగాళఖాతంలో కలిసే పెన్నా నదీ పరివాహక ప్రాంతంలోనే అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఉండటం గమనార్హం. దేశంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న జలాశయాల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే..అత్యధిక నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఉన్న బేసిన్ల్లో పెన్నా పదో స్థానంలో నిలిస్తే.. బ్రహ్మపుత్ర 11వ స్థానంలో నిలిచింది. బ్రహ్మపుత్ర బేసిన్ పర్వతాలు, కొండలు, లోయలతో కూడుకున్నది. జలాశయాల నిర్మాణానికి అంత అనువైన ప్రాంతం కాదు. -
సర్జికల్ బ్లేడ్ను లోపలే పెట్టి కుట్టేశారు!
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. ఉచిత చికిత్సల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన వారికి చంద్రబాబు ప్రభుత్వం నరకం చూపిస్తోంది. కాకినాడ జిల్లా తుని ఏరియా ఆస్పత్రిలో ఓ యువకుడి కాలులో సర్జికల్ బ్లేడ్ పెట్టి కుట్టేసిన ఘటన ప్రభుత్వాస్పత్రుల్లో దిగజారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖలో కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని రాడ్ వేయించుకున్న యువకుడు అప్పట్లో అమర్చిన స్కూృ తొలగించాలని తుని ఆస్పత్రిని ఆశ్రయించాడు. వైదు్యలు నవంబర్ 27న శస్త్ర చికిత్స చేసి స్కూృ తొలగించి, సర్జికల్ బ్లేడ్ను లోపలే పెట్టి కుట్టేశారు. ఇంటికి వెళ్లాక నొప్పి తీవ్రమవడంతో బాధితుడు ఎక్స్రే తీయించాడు. సర్జికల్ బ్లేడ్ లోపలే ఉన్నట్టు తేలడంతో శస్త్రచికిత్స చేసిన వైద్యుడు సత్యప్రసాద్, నర్సు పద్మావతిని సస్పెండ్ చేసినట్టు వైద్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
‘ఉపాధి’ కూలీలకు ముఖ ఆధారిత హాజరు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకంలో రోజువారీ పనులకు హాజరయ్యే కూలీలకు కూడా ఉద్యోగుల మాదిరి ముఖ ఆధారిత హాజరును నమోదు చేయనున్నారు. ఈ పథకంలో దొంగ మస్టర్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో సోమవారం నుంచి అమలు చేయనుంది. ఇందులో మన రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాను రాష్ట్ర అధికారులు ఇందుకు ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే కూలీల నమోదును గ్రామాల్లో పనిచేసే ఫీల్డు అసిస్టెంట్లు లేదా మేట్లు రోజువారీగా నిర్ణీత ప్రొఫార్మాలో నమోదు చేసుకొని, వారానికి ఒకసారి మండలాఫీసులోని ఉపాధి హామీ పథకం విభాగంలో అందజేస్తారు.ప్రస్తుత ప్రక్రియలో పనులకు హాజరయ్యే కూలీలను గ్రూపు ఫొటో తీసి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్న నిబంధన ఉన్నప్పటికీ, మాన్యువల్ విధానంలో సమరి్పంచే రోజు వారీ మస్టరు షీట్లలో పేర్కొన్న కూలీల వివరాల మేరకే వేతన బిల్లులు రికార్డు చేస్తున్నారు. ముఖ ఆధారిత హాజరు కోసం ప్రత్యేక యాప్ ద్వారా పని ప్రదేశంలో ఆయా కూలీల ఫొటో తీసినప్పుడు, అది ఆ వ్యక్తి ఆధార్లో ఉన్న ఫొటోతో సరిపోయినప్పుడే అతని హజరు నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. రెండు మూడు నెలల తర్వాత దేశమంతటా ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. 4 గంటల వ్యవధిలో రోజూ రెండుసార్లు క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం అమలుకు ఉద్దేశించి పనిచేసే ఫీల్డు అసిసెంట్లు లేదా మేట్ల వద్ద ఉండే మొబైల్ యాప్లో కూలీలు ఫొటో దిగి తమ రోజు వారీ హాజరు నమోదు చేస్తారు. పని జరిగే ప్రాంతానికి గరిష్టంగా పది మీటర్ల పరిధిలోపు మాత్రమే ముఖ ఆధారిత హాజరు నమోదు చేసేలా కేంద్రం ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. ఉదయం 11 గంటల లోపు ఒక విడత.. మరో నాలుగు గంటల తర్వాత రెండో విడత ఈ తరహాలో హాజరు నమోదు చేయనున్నారు. ఇలా హాజరు నమోదు చేసుకున్న వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వ పోర్టల్ వేతన బిల్లులను అనుమతిస్తుందని అధికార వర్గాలు వివరించాయి.ఇందులో భాగంగా కేంద్రం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం జాబ్కార్డులను ఆధార్తో అనుసంధానం చేసి, ఈకేవైసీ చేపట్టి, దాదాపు పూర్తి చేసింది. కాగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల దాదాపు ఏడున్నర లక్షల కుటుంబాల జాబ్ కార్డులు తొలగించిన తర్వాత కూడా రాష్ట్రంలో 64.93 లక్షల కుటుంబాలకు సంబంధించి 1.13 కోట్ల మంది ఉపాధి హామీ పథకం జాబ్కార్డులు కలిగి ఉన్నారు. సగటున 47 లక్షల కుటుంబాలు సుమారు రూ.7 వేల కోట్ల మేర లబ్ధి పొందుతున్నాయి. దేశ వ్యాప్తంగా 15.50 కోట్ల కుటుంబాలకు సంబంధించి 26.57 కోట్ల మందికి జాబ్కార్డులు ఉన్నాయి. -
రాష్ట్ర సమస్యలపై ఎలుగెత్తాలి.. పార్లమెంట్లో ప్రజా గళం
సాక్షి, అమరావతి: అన్నదాతల ఇక్కట్లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంటు ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి.. ప్రజల గొంతుకను గట్టిగా వినిపించాలని పార్టీ ఎంపీలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఒకవైపు తుపానుతో తీవ్ర నష్టం, మరోవైపు ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కక కుదేలైన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఈ అంశాలన్నింటినీ పార్లమెంటు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు. మోంథా తుపాను వల్ల తీర ప్రాంత జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మరోవైపు ఏ పంటకూ కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) లేకపోవడం వారిని మరింత కష్టాల పాల్జేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారా నేరుగా ధాన్యాన్ని సేకరించడం వల్ల ప్రతి పంటకూ కనీస మద్దతు ధర కచ్చితంగా దక్కేదని గుర్తుచేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నింటికి మంగళం పాడి రైతులను గాలికి వదిలేయడంతో దళారులు, వ్యాపారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని మండిపడ్డారు.వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చితోపాటు మామిడి లాంటి ప్రధాన పంటలకు ఎమ్మెస్పీ లభించక రైతులు అల్లాడుతున్న దృష్ట్యా కేంద్రం వెంటనే అత్యవసర నిధులు విడుదల చేసి కనీస మద్దతు ధర దక్కేలా ఎంపీలు ఒత్తిడి తేవాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేసిన ఉచిత పంటల బీమాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదని, ఈ–క్రాపింగ్ చేయకపోవడం వల్ల పంటల గణాంకాలు స్పష్టంగా తెలియక అర్హులైన రైతులకు కూడా పరిహారం అందని దుస్థితి నెలకొందన్నారు. మిర్చి రైతులను ఆర్థికంగా ఆదుకుంటామని మాట ఇచ్చిన ఈ ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోకుండా వారిని దగా చేసిందని, మామిడి కొనుగోళ్లలో కంపెనీలు తగిన ధర చెల్లించేలా చూడడంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆ రైతులూ తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. గ్రామీణ నిరుపేదల ఉపాధిని దెబ్బతీశారు..మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సామూహికంగా 18.63 లక్షల జాబ్ కార్డులను చంద్రబాబు ప్రభుత్వం తొలగించడాన్ని ఎంపీల వద్ద వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఇది అత్యంత దారుణమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. అర్హత ఉన్న జాబ్ కార్డులన్నింటినీ పునరుద్ధరించడంతోపాటు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే ఆపేయాలి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను గట్టిగా వ్యతిరేకించాలని ఎంపీలను జగన్ ఆదేశించారు. సంస్థను ముక్కలుగా చేసి అమ్మేస్తున్నారని, ఇది సంస్థ పూర్తి ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న పని అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు, వేలాది మంది త్యాగాల ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడిన విషయాన్ని గుర్తుచేశారు. వారందరితోపాటు ఆ సంస్థ కోసం భూములిచ్చిన రైతులను దగా చేయడం తగదన్నారు. సంస్థను ముక్కలు చేస్తూ ప్రైవేటీకరణ కోసం చేపట్టిన చర్యలన్నింటినీ వెంటనే ఉపసంహరించాలని, సంస్థను పునరుద్ధరించేలా వెంటనే సొంతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయించి వేలాది మంది కారి్మకులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవనోపాధిని కాపాడాలని కోరారు. శాంతి భద్రతలు దారుణం..రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ కక్షతో పోలీసు యంత్రాంగాన్ని దురి్వనియోగం చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని ప్రస్తావించారు. చాలా మంది నాయకులు, ప్రజా ప్రతినిధులకు సెక్యూరిటీ తగ్గించి వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి తీసుకొచ్చారని ఆక్షేపించారు. మరోవైపు ప్రభుత్వ హాస్టళ్లు, సంక్షేమ వసతిగృహాల్లో పరిస్థితి నానాటికీ దుర్భరంగా మారుతోందన్నారు.విద్యార్థులకు సరైన ఆహారం, తాగు నీరు అందడంలేదని, పరిశుభ్రత పూర్తిగా కొరవడిందని ఆందోళన వ్యక్తంచేశారు. వీటన్నింటితోపాటు కేంద్రం నుంచి పెండింగ్ నిధులు రాబట్టడం, రాష్ట్రంలో ఉపాధి కల్పన, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ఎంపీలు చొరవ చూపాలని.. ప్రజాసమస్యలను గట్టిగా ప్రస్తావిస్తూ, వారి గొంతుకలను బలంగా వినిపించి, కేంద్రం వాటిపై దృష్టిసారించేలా కృషిచేయాలని వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. -
బలహీన పడుతున్న ‘దిత్వా’.. ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/తిరుమల/ఇందుకూరుపేట/ఒంగోలు సబర్బన్/సాక్షి, చెన్నై: దిత్వా తుపాను ఆదివారం తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ క్రమేపీ బలహీనపడుతోంది. సోమవారం తెల్లవారుజాముకల్లా ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం సాయంత్రానికి ఇది గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదులుతూ చెన్నైకి 150 కిలోమీటర్లు, వేదరన్నియంకు 170, కరైకల్కు 120, కడలూరుకు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా నావూరులో 4.8, బుచ్చిరెడ్డిపాలెంలో 4.7, జలదంకిలో 3.6, పులికల్లులో 3.6, తిరుపతి జిల్లా చిట్టమూరులో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. మైపాడు, కోడూరు, జువ్వలదిన్నె, తుమ్మలపెంట, రామాయపట్నం బీచ్లలోకి పర్యాటకులు రాకుండా మెరైన్, స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తుపాను నేపథ్యంలో చల్లగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు తుపాను ప్రభావంతో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.తిరుపతి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం దిత్వా తుపాను తిరుపతి జిల్లాను వణికిస్తోంది. జిల్లాలోని 24 మండలాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ తుపాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం తిరుపతి జిల్లాలోని అంగన్వాడీ స్కూల్స్తోపాటు పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో తిరుమలలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుజాగ్రత్తగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గాలను టీటీడీ అధికారులు మూసివేశారు. తిరుమలలోని ఐదు డ్యామ్లు పూర్తిగా నిండినట్లు టీటీడీ వాటర్ వర్క్స్ ఈఈ సుధాకర్రెడ్డి తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (ఫోన్ నంబర్ 0877 2236007)ను ఏర్పాటు చేశారు.ప్రకాశం, వైఎస్సార్సీపీ కడప జిల్లాల్లో...ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి చిరు జల్లులు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒంగోలులోని కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలోనూ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు వర్షం కురుస్తోంది. జిల్లాలో అత్యధికంగా ఒంటిమిట్టలో 25.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను వర్షం దెబ్బతీస్తుందని భయపడుతున్నారు. తమిళనాడులో భారీ వర్షం... ఆరుగురు మృతినాగపట్నంలో కుంభవృష్టి... 23 సెం.మీ. వర్షపాతం నమోదు. దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని కావేరి డెల్టా ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు అతిభారీ వర్షం కురిసింది. కావేరి డెల్టా పరిధిలోని తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షం పడింది. అత్యధికంగా నాగపట్నంలో 23 సెం.మీ., మైలాడుతురైలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ ప్రాంతాల్లో ఆరుగురు మృతిచెందారు. గోడలు, ఇళ్లు కూలి రామనాథపురం జిల్లాలో ముగ్గురు, తుత్కుకూడి, నాగపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు, విద్యుత్ షాక్తో మైలాడుతురై జిల్లాలో ఒకరు మృతిచెందారు. దిత్వా తుపాను ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాగపట్నం, కడలూరు మీదుగా పుదుచ్చేరి వైపునకు నెమ్మదిగా ప్రయాణించి కరైకాల్–పుదుచ్చేరి మధ్య బలహీన పడుతుండటంతో చెన్నై నగరంతోపాటు శివారు జిల్లాల్లో పెద్దగా వర్షం కురవలేదు. -
ఫీజులకు బూజు.. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యను అథఃపాతాళానికి దిగజార్చింది. అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడుతుండగా.. పాఠాలు బోధించడం మానేసి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం పిల్లలను వేధిస్తున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రైవేట్ యాజమాన్యాలు తాము కళాశాలలు నడపలేమంటూ రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ గత ఏడాదిన్నరకుపైగా ఫీజు రీయింబర్స్మెంట్ను అటకెక్కించే కుయుక్తులు పన్నుతూ లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోంది. కళాశాలల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ఎన్నికల సమయంలో నమ్మబలికి తరువాత చేతులు ఎత్తేసింది. ఇప్పటి వరకు చెల్లించాల్సిన ఎనిమిది క్వార్టర్ల ఫీజుల డబ్బులు రూ.5,600 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ కింద విద్యార్థులకు ఇవ్వాల్సిన మరో రూ.2,200 కోట్లతో కలిపి ఏకంగా రూ.7,800 కోట్ల మేర బకాయిలు కొండలా పేరుకుపోయాయి. నిధులను తొక్కిపెట్టి అరకొరగా, పాక్షిక చెల్లింపులతో విద్యార్థులను సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తోంది. తేలికగా ఎగ్గొట్టవచ్చనే దురుద్దేశంతోనే తల్లుల ఖాతాలో కాకుండా, తాము కాలేజీల ఖాతాలో జమ చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. ఉన్నత విద్యలో పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ అమలు చేసి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పిల్లల చదువులకు ఆటంకం లేకుండా సంపూర్ణ భరోసా కల్పించి ఐదేళ్ల పాటు అండగా నిలిచారు. త్రైమాసికం వారీగా నిధుల విడుదలకు చర్యలు తీసుకున్నారు. 2024 జనవరి నుంచి మార్చి త్రైమాసికం ఫీజులు ఏప్రిల్లో ప్రాసెస్ చేసి మే నెలలో విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అడ్డు పెట్టుకుని టీడీపీ కూటమి నాయకులు కుట్రలతో అడ్డుకున్నారు. అనంతరం అధికారంలోకి వచి్చన చంద్రబాబు సర్కారు సుమారు ఎనిమిది క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ను నిలిపివేసింది. ప్రభుత్వ వర్సిటీల్లోనూ సర్టిఫికెట్ల నిలుపుదల.. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడంతో విద్యార్థులు ఫీజులు చెల్లిస్తే గానీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వబోమనే పరిస్థితికి ఉన్నత విద్య దిగజారిపోయింది. చివరికి ప్రభుత్వ వర్సిటీలు సైతం ఇదే బాటలో పయనిస్తూ విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపేశాయి. సర్కారు బాధ్యతారాహిత్యానికి బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విలువైన ఉద్యోగ అవకాశాలు, పీజీ విద్య సీట్లను కోల్పోతున్న దుస్థితి దాపురించింది. ఎంటెక్, పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్కు ఆయా వర్సిటీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యా మండలికి మొరపెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఏ ప్రభుత్వమైనా తప్పనిసరిగా కొనసాగించాల్సిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. 2014–19లో టీడీపీ హయాంలో 16.73 లక్షల మంది విద్యార్థులకు బకాయి పెట్టిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను అనంతరం వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే తక్షణ బాధ్యతగా భావించి చెల్లింపులు చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులకు మంగళం పలికి ఆర్నెల్లకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామంటూ కళాశాలలను, విద్యార్థులను నిలువునా ముంచేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో కళాశాలలు.. రాష్ట్రవ్యాప్తంగా 230కిపైగా ఇంజనీరింగ్ కళాశాలలు, 1,250 వరకు డిగ్రీ కాలేజీలు ఉన్నత విద్యలో వివిధ కోర్సుల్లో బోధన సాగిస్తున్నాయి. ఇందులో 70 శాతం సీట్లు కనీ్వనర్ కోటాలో ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్పైనే ఆధారపడి బోధిస్తున్నాయి. చంద్రబాబు సర్కారు సుమారు రూ.7,800 వేల కోట్ల చెల్లింపులు నిలిపివేయడంతో నిర్వహణ భారాన్ని భరించలేక అటు కాలేజీలు ఇటు విద్యార్థులు ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఫీజుల కోసం విద్యార్థులపై యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి, పుస్తెలు తాకట్టు పెట్టి ఫీజులు కడుతున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. వసతి దీవెనకు మంగళం.. పిల్లల చదువులకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు హాస్టల్ మెయింటెనెన్స్ (వసతిదీవెన) ద్వారా ఆరి్థక సాయం అందించి ఆదుకున్నారు. భోజన, వసతి ఖర్చుల కోసం ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా జమ చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఫీజులను నీరుగార్చగా.. వసతి దీవెనను ఏకంగా ఎత్తేసింది. విద్యార్థులకు రూ.2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు ఎగ్గొట్టింది. హాస్టల్ మెయింటెనెన్స్ ఇచ్చే అంశాన్ని పక్కన పడేసింది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ విద్య అభ్యసిస్తున్న వారికి సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు బృందం నమ్మబలికింది. తీరా అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టింది. విద్యకు లోటు బడ్జెట్ఒక్కో విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.2,800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చులు కింద రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.3,900 కోట్లు అవసరం. చంద్రబాబు ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి బడ్జెట్లో కేవలం రూ.2,600 కోట్లు కేటాయింపులు చూపించి నిధులు మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం. అదే వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో జగనన్న విద్యా దీవెన కింద ఫీజుల కోసం రూ.12,609.68 కోట్లు క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి చెల్లించడంతో పాటు గతంలో టీడీపీ సర్కారు బకాయి పెట్టిన రూ.1,778 కోట్లు సైతం చెల్లించింది. కళాశాలలు సక్రమంగా నడిచేలా, విద్యార్థులు నిశ్చింతగా చదువుకునేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భరోసా కల్పించింది. ఇక జగనన్న వసతి దీవెన కింద రూ.4,275.76 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసింది. ఇలా ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్క విద్యా దీవెన, వసతి దీవెన కోసమే ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది. ‘ఎక్స్’లో ట్వీట్ల పిట్టలా లోకేశ్! ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ పర్యవేక్షణలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తం కుదేలైంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అస్తవ్యస్తంగా మారింది. ప్రపంచ స్థాయి విద్య, క్వాంటం సెంటర్లు అంటూ ప్రచారం మినహా కళాశాలలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడం విద్యా నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఉన్నత విద్యపై సమీక్ష చేసినప్పుడల్లా అదిగో ఫీజులు చెల్లిస్తున్నాం.. ఇదిగో ఇచ్చేస్తున్నాం.. అంటూ ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్లు చేసుకోవడంతోనే లోకేశ్ కాలం గడిపేస్తున్నారు. ఈ తంతు గతేడాది జూన్ నుంచి మొదలు కాగా ఈ ఏడాది నవంబర్ వచి్చనా బకాయిలు చెల్లించకపోవడంతో కొండలా పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది జూలైలో కచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తామని యాజమాన్యాలకు హామీ ఇచ్చిన లోకేశ్ అక్టోబర్ చివరిలో కంటి తుడుపుగా విదిల్చారు. పుట్టపర్తిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం రూ.60 వేలు ఫీజు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా సమాచారం పంపించింది. తమకు రీయింబర్స్మెంట్ జమ కానందున ఫీజులు కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది.కదిరిలోని ఎస్ఎంజేఎల్ డిగ్రీ కాలేజీతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన కళాశాలలో సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో కొందరు తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టి విద్యార్థులను పరీక్షలకు పంపించారు. కొందరు బాలికలను చదువు మానిపించి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్న దుస్థితి కనిపిస్తోంది. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నపరెడ్డి గారి గంగిరెడ్డి సొంతూరు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటుపల్లె కొత్తపల్లి. ఆయన కుమార్తె గౌరీప్రియ రాజంపేటలో ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో రూ.45 వేలు అప్పు చేసి కాలేజీలో చెల్లించారు. రెండో ఏడాదీ ఇదే పరిస్థితి కనిపిస్తోందని వాపోతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తన కుమారుడు గౌతమ్రెడ్డి బీటెక్ ఎలాంటి ఆర్థిక ఆటంకాలు లేకుండా పూర్తయిందని గుర్తు చేసుకుంటున్నారు. ఎంబీఏ పూర్తయి ఏడాదిన్నర.. రామచంద్రపురం కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశా. ఫీజు చెల్లించలేదని సరి్టఫికెట్లు ఇవ్వడంలేదు. రూ.48,500 వరకు కట్టాలని చెబుతున్నారు. నాన్న ఇటుక బట్టీలో కార్మికుడు. సర్టిఫికెట్లు లేక ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నా – ఎస్.గంగరాజు, సందిపూడి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా నగలు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించా మా కుమార్తె తిరుపతి సమీపంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో ఏడాది చదువుతోంది. ఇప్పటి వరకు ఫీజు రీయిబర్స్మెంట్ అందలేదు. కళాశాల యాజమాన్యం ఒత్తిడిని తట్టుకోలేక బంగారు నగలు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లించాం. నా భర్త చనిపోయారు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను చదివించుకుంటున్నా. – సుభద్రమ్మ, విద్యార్థిని తల్లి, తిరుపతిమానసికంగా కుంగిపోతున్నా.. కర్నూలు జీఎన్ఎంలో నర్సింగ్ మూడో ఏడాది చదువుతున్నా. గతంలో మా అమ్మ ఖాతాలో జగనన్న విద్యా దీవెన సకాలంలో జమయ్యేది. ఈ ప్రభుత్వం వచ్చాక కాలేజీ యాజమాన్యం ఖాతాలో జమకాలేదు. పెండింగ్ ఫీజులు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. ఇంట్లో ఫీజులు అడగలేక.. కాలేజీలో ఒత్తిళ్లు తట్టుకోలేక మానసికంగా కుంగిపోతున్నా. ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నాం. – కె.సురేష్, నర్సింగ్ విద్యార్థిసి.బెళగల్ మండలం, ముడుమూల మా పీక పట్టుకుంటుంది.. మా అబ్బాయి కార్తికేయ భీమిలి మండలంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ మూడో ఏడాది చదువుతున్నాడు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఒక క్వార్టర్ ఫీజు మాత్రమే జమ చేసింది. అప్పటికే కళాశాల యాజమాన్యం రూ.20 వేలు చొప్పున వసూలు చేసింది. జిరాక్స్ షాపుపై ఆధారపడి జీవిస్తున్న నేను అతి కష్టం మీద ఆ డబ్బులు కట్టా. లేదంటే సెమిస్టర్ పరీక్షలు రాయనివ్వబోమంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఉందనే కాలేజీలో చేర్చాం. ప్రభుత్వం బకాయిలు చెల్లించకుంటే యాజమాన్యం మా పీక పట్టుకుంటుంది. – గంటా రాజు, భీమిలి మండలం సకాలంలో ఇస్తే మాకీ అవస్థలుండవు నా కుమారుడు హుసేన్ అమీద్ బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గతేడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. మాకు ఎలాంటి చర, స్థిర ఆస్తులు లేవు. చిన్న దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తున్నాం. ఏటా ప్రభుత్వం సకాలంలో ఫీజులు జమ చేస్తే మాకీ అవస్థలు ఉండవు. – హుసేన్బీ, విద్యార్థి తల్లి, పాములపాడు, నంద్యాల జిల్లాచిల్లి గవ్వ ఇవ్వలేదు.. నా కుమారుడు రోషన్ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. కళాశాలలో ఫీజు కట్టకపోతే పంపొద్దు అంటూ బెదిరిస్తున్నారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ప్రభుత్వం సాయం చేస్తుందనే ధైర్యంతో ఉన్నత విద్యలో చేరి్పంచాం. – బాబు, విద్యార్థి తండ్రి, చిత్తూరుమదనపల్లె సమీపంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ రెండో ఏడాది చదువుతున్న విజయ్బాబుకు ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత ఉంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ చదివిస్తున్న విద్యార్థి తల్లిదండ్రులు అప్పులు చేసి జూన్లో రూ.25 వేలతో మొదటి ఏడాది ఫీజు కట్టారు. ఉన్నత చదువులు చదవాలని ఆశతో ప్రభుత్వాన్ని నమ్ముకుని ఎంబీఏలో చేరితే తన పరిస్థితి తల్లకిందులైందని.. రెండో ఏడాదీ ఫీజు తానే కట్టుకోక తప్పదని విజయ్బాబు వాపోతున్నాడు. -
వైఎస్సార్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి, తాడేపల్లి: పార్లమెంటు సమావేశాలు రేపటి(డిసెంబర్ 1, సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలని ఎంపీలను ఆదేశించారు. రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపానులతో రైతులు నష్టపోయిన తీరు. పంటలకు గిట్టుబాటు ధరల్లేని అంశాలపై గట్టిగా చర్చించాలన్నారు.‘‘రైతులపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై గట్టిగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలి. దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్న వైనాన్ని సభలో చర్చించాలి. తమ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయటంపై మాట్లాడాలి. బీమా లేకపోవడంతో రైతులు నష్టపోవటం, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించని వైనాన్ని సభలో చర్చించాలి. ఈ-క్రాప్ విధానం అమలు చేయకపోవటాన్ని సభ దృష్టికి తీసుకు వెళ్లాలి. మామిడి రైతులకు ఇప్పటికీ ఫ్యాక్టరీలు బకాయిలు చెల్లించని వైనంపై మాట్లాడాలి. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డుల తొలగింపును గట్టిగా ప్రశ్నించాలి..18.63 లక్షల కార్డులు తొలగించి పేదల కడుపు కొట్టడాన్ని పార్లమెంటులో నిలదీయాలి. అర్హులందరికీ తిరిగి కార్డులు ఇచ్చేలాగ ఒత్తిడి తేవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాలి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం చేసిన త్యాగాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ అరెస్టులపై పార్లమెంట్లో చర్చించాలి. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయటంపై చర్చించాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలవటం.. మౌలిక సదుపాయాలను కల్పించని వైనాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. రాష్ట్రానికి రావాల్సిన పాత బకాయిలపై చర్చించాలి. ఏపీ హక్కుల కోసం ఎంపీలు గట్టిగా గళమెత్తాలి’’ అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
ఏపీ వైపు దూసుకొస్తున్న ‘దిత్వా’ తుపాను..
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతూ మరికాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఇది కారైకాల్కి 120 కి. మీ, పుదుచ్చేరికి 90 కి.మీ, చెన్నైకి 150కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో తుపాను కదిలింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగా నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు (డిసెంబర్ 1, సోమవారం) సెలవు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.బాపట్ల జిల్లా చీరాలలో దిత్వా తుపాను ప్రభావంతో మరోసారి బీచ్ మూతపడింది. సముద్ర స్నానాలకు యాత్రికులు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బాయపాలెం, విజయలక్ష్మిపురంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
ఆరోగ్యం అంధకారంలోకి.. చదువులు పాతాళంలోకి..
వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతినెలా ప్రభుత్వాస్పత్రి, విలేజ్ క్లినిక్ల సిబ్బంది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసేవారు. రక్త పరీక్షలు చేసి విద్యార్థుల్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే గుర్తించి వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేసేవారు. రక్తహీనత ఉంటే ఐరన్ మాత్రలు ఇచ్చి జాగ్రత్తలు సూచించేవారు. బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. విద్యార్థులకు ఆరోగ్య కార్డులు ఇచ్చి ప్రతినెలా ఆరోగ్య పరీక్షల్లో వచ్చిన ఫలితాలను వాటిలో నమోదు చేసేవారు. ఫలితంగా పిల్లల ఆరోగ్యం మెరుగుపడేది. ఇలా ప్రతి నెలా దాదాపు 45 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పరిస్థితి తారుమారైంది. సాక్షి, అమరావతి: ‘ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం సర్కారీ విద్యను పూర్తిగా నీరుగార్చడంతోపాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికొదిలేసింది. పాలకుల నిర్లక్ష్యానికి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య 45 లక్షల నుంచి 34 లక్షలకు తగ్గిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో విద్యార్థులకు ప్రతినెలా ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు చేసి అందించిన ఆరోగ్య కార్డులు సైతం ఇప్పుడు కనిపించకుండా పోయాయి. గతేడాది మెగా పీటీఎం పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసిన సర్కారు ఒక్కరోజే వైద్య పరీక్షలు అంటూ హడావుడి చేసింది. ఆ తర్వాత ఆ ఆలోచనే చేయడం మానేసింది. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ సైతం తన బాధ్యత కాదని వదిలేసింది. 34 లక్షల మంది పిల్లల ఆరోగ్యంపై నిర్లక్ష్యంరాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై నెలలో మెగా పేరెంట్–టీచర్స్ సమావేశం నిర్వహించింది. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించామంటోంది. 96 శాతం మంది పిల్లలకు పరీక్షలు చేయించినట్టు ప్రకటించి.. వివరాలను హోలిస్టిక్ మార్కుల లిస్టుకు అనుసంధానం చేసినట్టు చెబుతోంది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 98 శాతం మందికి, ఎయిడెడ్ పాఠశాలల్లో 97.07 శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 89 శాతం పూర్తిచేసినట్టు ప్రకటించింది. జూలై తర్వాత మళ్లీ పరిస్థితి ఏమిటనేది పట్టించుకున్న పాపానపోలేదు. గత ప్రభుత్వంలో ప్రతినెలా పరీక్షలు చేసి తల్లిదండ్రులను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన రక్త పరీక్షలు చేసి రిపోర్టులు ఇచ్చేవారు. అలాగే కంటి పరీక్షలు చేసి అద్దాలు కూడా అందించారు. ప్రస్తుతం ఈ విధానం పూర్తిగా నీరుగారిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఇంటరీ్మడియట్ వరకు 34 లక్షల మంది విద్యార్థులున్నా వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో అర్థంగాని పరిస్థితి నెలకొంది. ఇక సంక్షేమ వసతి గృహాల్లో పిల్లల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అస్వస్థతలతో మరణాలుచంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనడానికి ఎన్నో ఘటనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలోని పాఠశాలలు, హాస్టళ్లలో అస్వస్థతకు గురైన విద్యార్థులు వందల్లో ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 14 మంది, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఒకరు, పాడేరు ఐటీడీఏ పరిధిలో ఏడుగురు మృతి చెందారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల సంఖ్య 22 మంది కంటే ఎక్కువేనని అంచనా. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో 184 మంది విద్యార్థులు పచ్చకామెర్ల బారిన పడ్డారు.వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పరిధిలోని డుంబ్రిగూడ మండలం జామిగూడ గిరిజన బాలికల హాస్టల్లో కలుషిత ఆహారంతో 60 మంది ఆస్పత్రి పాలయ్యారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ఒక ప్రైవేట్ ట్రస్ట్ హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు గిరిజన విద్యార్థులు మరణించారు. 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.అవాంఛనీయ ఘటనలెన్నో..కొన్ని పాఠశాలల్లో బాలికలకు పాఠశాలలు, హాస్టళ్లలోనే అబార్షన్లు అయిన ఘటనలు కూడా వెలుగు చూశాయి. కొన్ని కాన్పులు సైతం జరిగాయి. కడప గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటూ స్థానిక కళాశాలలో ఒకేషనల్ చదవుతున్న 17 ఏళ్ల బాలిక 9 నెలల గర్భంతో ఉన్నా సిబ్బంది గుర్తించలేని పరిస్థితి. గతేడాది డిసెంబర్లో గుంటూరు సాంఘిక సంక్షేమ హాస్టల్ ఉంటున్న ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డను హాస్టల్లోనే ప్రసవించింది. అప్పట్లో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. గతేడాది డిసెంబర్లోనే ఏలూరు జిల్లాలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక హాస్టల్లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకు ఆమె శరీరంలో వస్తున్న మార్పులను సిబ్బంది గమనించలేదు. ప్రతినెలా వైద్య పరీక్షలు చేసి ఉంటే ఇలాంటి ఘటనలను ముందుగానే గుర్తించే ఆస్కారం ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంతమంది పిల్లల తల్లిదండ్రులకు తీరని వేదనకు గురి చేస్తోంది. -
గ్రానైట్ పరిశ్రమల తిరుగుబాటు
సాక్షి ప్రతినిధి, బాపట్ల/బల్లికురవ/మార్టూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్పై విచ్చలవిడిగా పన్నులు వసూలుచేయడాన్ని నిరసిస్తూ.. శనివారం బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వేమవరం జంక్షన్లోని ఏఎంఆర్ చెక్పోస్టు వద్ద గ్రానైట్ పరిశ్రమల యజమానులు, కార్మికులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ఆగ్రహంతో చెక్పోస్టు కంటైనర్ బాక్స్ను బద్దలుకొట్టారు. కంప్యూటర్లు, ఇతర సామగ్రితోపాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.అయితే, విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గం అద్దంకి నుంచే గ్రానైట్ పరిశ్రమల యజమానులు, కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు శ్రీకారం చుట్టారు. అలాగే, ఆందోళనలో పాల్గొన్న వారిలో 90 శాతం అధికార టీడీపీకి చెందిన వారే ఉన్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో.. మల్లాయిపాలెం, వేమవరం, ఉప్పమాగులూరు, కొనెదన, గంగపాలెం, నక్కబొక్కలపాడు గ్రామాల పరిధిలోని 500 పరిశ్రమల నుంచి పలువురు యజమానులతోపాటు వేలాది మంది కార్మికులు జంక్షన్కు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం రాయలీ్ట, జీఎస్టీ అంటూ పన్నుల పేరుతో దోపిడీకి పాల్పడుతోందంటూ తీవ్రంగా నిరసించారు. చంద్రబాబు సర్కారు తీరును దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వం దుర్మార్గంగా పన్నులు వేసి గ్రానైట్ వ్యాపారాన్ని కుదేలు చేసిందని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఒక కట్టర్కు రూ.27 వేలు టాక్స్ వసూలు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా కట్టర్కు రూ.35 వేల రాయల్టీతోపాటు రూ.5 వేల జీఎస్టీ వసూలుచేస్తోందన్నారు. ఇదికాక.. కట్టర్కు మరో రూ.35 వేలు కప్పం కింద వసూలు చేస్తున్నారన్నారు. వసూలు బాధ్యతలు ఏఎంఆర్కు అప్పజెప్పడంతో వారు చెక్పోస్టులు పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని పరిశ్రమల యజమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత మొత్తంలో పన్నులు, ఇతరత్రా చెల్లించి వ్యాపారం చేయలేమన్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందని, అదే జరిగితే తాము నష్టపోవడమే కాక యుపీ, ఎంపీ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పశి్చమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి పొట్టచేతబట్టుకుని వచి్చన కార్మికులు రోడ్డునపడతారని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం పన్నుల పేరుతో దోపిడీకి పాల్పడుతోందని యజమానులుతోపాటు కార్మికులూ మండిపడుతున్నారు. తక్షణం ప్రభుత్వం అధికంగా విధించిన పన్నులు ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఉద్రిక్తంగా మారిన ఆందోళన.. ఇదిలా ఉంటే.. యజమానులతోపాటు వేలాది మంది కార్మికులు వేమవరం జంక్షన్కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఒక్కసారిగా ఆందోళనకారులు అక్కడే వున్న ఏఎంఆర్ చెక్పోస్టు కంటైనర్ బాక్స్ వద్దకు వెళ్లి దానిని కూలదోశారు. బాక్స్లో వున్న కంప్యూటర్ సెట్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చెక్పోస్ట్ లైటింగ్ పోల్ను నేలమట్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వేమవరం చేరుకుని ఆందోళనకారులను శాంతింప జేశారు. దీంతో.. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిరసనకారులు ఆందోళన విరమించారు. ప్రభుత్వం విధించిన పన్నుల భారానికి వ్యతిరేకంగా గ్రానైట్ పరిశ్రమల యజమానులు, కార్మికులు నాలుగు రోజుల క్రితం మార్టూరు జాతీయ రహదారిపై జొన్నతాళి గ్రామం వద్ద నిరసన తెలిపారు.గ్రానైట్ సంఘ ప్రతినిధులకు డీఎస్పీ హెచ్చరిక అనంతరం మార్టూరు పోలీస్స్టేషన్లో శనివారం రాత్రి బాపట్ల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు ఇరువర్గాలతో సమావేశమయ్యారు. చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే గ్రానైట్ అసోసియేషన్ సభ్యులపై, ఏఎంఆర్ సంస్థ ప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
సబ్సిడీ విత్తనానికి మంగళం
సాక్షి, అమరావతి: అదునులో పెట్టుబడి సాయం అందించలేదు.. అన్నదాతా సుఖీభవ పేరుతో వంచన.. ఉచిత పంటల బీమా ఎగరగొట్టారు.. ఇన్పుట్ సబ్సిడీ ఊసే ఉండదు.. మద్దతు ధర ధ్యాసే పట్టదు.. కనీసం ఎరువులూ కరువే..! ఇలా అన్ని రకాలుగా అన్నదాతల నడ్డి విరిచిన చంద్రబాబు సర్కారు సబ్సిడీ విత్తనాలను కూడా సకాలంలో పంపిణీ చేయకుండా మంగళం పాడేందుకు కుట్రలు చేస్తోంది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి ప్రీమియం భారాన్ని రైతుల నెత్తిన మోపినట్లుగానే విత్తన సబ్సిడీ భారాన్ని సైతం రైతన్నలపైనే మోపుతోంది.గత మూడు సీజన్లలో సబ్సిడీ విత్తన కేటాయింపులను కుదించి రాయితీలో కోతలు విధించడమే దీనికి నిదర్శనం. అదునుకు విత్తనాలు సరఫరా చేయకుండా రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించేలా పురిగొల్పుతోంది. తద్వారా సబ్సిడీ విత్తన సరఫరా బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే నాన్ సబ్సిడీ విత్తన సరఫరాను అటకెక్కించింది. పథకం ప్రకారం సబ్సిడీ విత్తనంలో కోతలు.. రాష్ట్రంలో వ్యవసాయ పంటల సాధారణ విస్తీర్ణం ఖరీఫ్లో 77.87 లక్షల ఎకరాలు కాగా, రబీలో 53.80 లక్షల ఎకరాలు ఉంటుంది. గత ప్రభుత్వంలో ఖరీఫ్–2023లో 6.85 లక్షల క్వింటాళ్లు, రబీ 2023–24లో 3.98 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేయగా, దాదాపు రూ.365 కోట్లు సబ్సిడీ కింద ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జిల్లాల నుంచి వచి్చన ఇండెంట్ ఆధారంగా రూ.310 కోట్లతో 10.48 లక్షల క్వింటాళ్ల విత్తన సరఫరాకు ఏర్పాట్లు చేసింది. అయితే జూన్లో పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం కోతల మీద కోతలు పెట్టి రూ.268 కోట్ల సబ్సిడీతో 7.87 లక్షల క్వింటాళ్ల విత్తనం మాత్రమే సరఫరా చేసింది.గడిచిన ఖరీఫ్ 2025 సీజన్లో రూ.165.96 కోట్ల సబ్సిడీతో 5.24 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే సరఫరా చేయగలిగారు. గడిచిన 18 నెలల్లో 16 సార్లు వైపరీత్యాలు సంభవించాయి. వరదలు, అధిక వర్షాలు, తుపానుల బారిన పడి లక్షలాది ఎకరాలు ముంపునకు గురై పంటలు దెబ్బతిన్నాయి. ఇలాంటి సందర్భాలు తలెత్తినప్పుడు గత ప్రభుత్వం కంటింజెన్సీ ప్లాన్ కింద 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసి ఆదుకుంది. చంద్రబాబు సర్కారు మాత్రం ఒక్క క్వింటా విత్తనం కూడా కంటింజెన్సీ ప్లాన్ కింద సరఫరా చేసిన పాపాన పోలేదు. అదునులో అందక అగచాట్లు రబీలో వరి తర్వాత ఎక్కువగా 10.92 లక్షల ఎకరాల్లో శనగ పంట సాగవుతుంది. 90 శాతానికిపైగా రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే శనగ సాగు చేస్తున్నారు. రబీ సీజన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ముందస్తు రబీకి వెళ్లే రైతులు అక్టోబర్ మొదటి వారంలోనే విత్తుకుంటారు. గత ప్రభుత్వంలో సాగు లక్ష్యాలకు అనుగుణంగా సీజన్కు ముందుగానే విత్తన పంపిణీకి ఏర్పాట్లు చేసేవారు. సెపె్టంబర్ 25 నుంచి రైతుల వివరాలు నమోదు చేసి అక్టోబర్ 1 నుంచి శనగ విత్తనం, సెపె్టంబర్ 15 నుంచి వరి సహా ఇతర విత్తనాలను సరఫరా చేసేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అక్టోబర్ మూడో వారం వరకు శనగ విత్తన టెండర్లు ఖరారు చేయలేదు. ఏటా అక్టోబర్ 1న సబ్సిడీ విత్తన పంపిణీ మొదలు కావాల్సి ఉండగా ఈసారి నవంబర్ 1న రిజి్రస్టేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. సబ్సిడీలోనూ కోతలు.. రవాణా చార్జీల భారం వైఎస్సార్సీపీ హయాంలో 40 శాతం సబ్సిడీపై శనగ విత్తనం సరఫరా చేయగా, రాయితీని ప్రస్తుతం 25 శాతానికి కుదించారు. అయినప్పటికీ కొనుగోలు చేద్దామంటే ఆర్బీకేల్లో ఎక్కడా విత్తనాలు లేవు. రాయలసీమ జిల్లాల్లో 60 శాతానికి పైగా ఆర్బీకేల్లో విత్తనాలు దొరకని దుస్థితి నెలకొంది. చేసేది లేక రైతులు దూరప్రాంతాలకు వెళ్లి ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేయాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికే 60–70 శాతం మంది రైతులు ప్రైవేటుగా డీలర్ల నుంచి కొనుగోలు చేశారు. మార్కెట్లో దొరికే విత్తనాల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. సగం కూడా సిద్ధం చేయకుండా..! రబీ 2024–25 సీజన్లో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లాల నుంచి ఇండెంట్ రాగా, అతికష్టమ్మీద కేవలం 1.76 లక్షల క్వింటాళ్లను మాత్రమే సరఫరా చేయగలిగారు. ప్రస్తుత రబీ సీజన్లో సబ్సిడీ విత్తనాన్ని కుదించి రూ.74.05 కోట్ల సబ్సిడీ 2.83 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరాకు ప్రతిపాదించారు. ఏటా రబీకి సిద్ధం చేసే విత్తనంలో దాదాపు 2 లక్షల క్వింటాళ్లకు పైగా శనగ విత్తనాన్ని అందుబాటులో ఉంచాలి. కాగా ఈ ఏడాది 1.50 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం సరఫరాకు యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేయగా సబ్సిడీ కోతలతో చివరికి 73 వేల క్వింటాళ్లు మాత్రమే సిద్ధం చేశారు. అయితే అప్పటికే రైతులు అధిక ధరలకు బయట కొనుగోలు చేశారు.వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణ సంస్థకు గ్రహణంరాష్ట్రంలో విత్తన పరీక్ష నెట్వర్క్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా దేశంలోనే తొలి రాష్ట్రస్థాయి విత్తన జీన్స్ బ్యాంక్ ఏర్పాటుకు వైఎస్ జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు. గన్నవరం వద్ద 8 ఎకరాల్లో రూ.40 కోట్లతో చేపట్టిన డాక్టర్ వైఎస్సార్ విత్తన పరిశోధన, శిక్షణా సంస్థ నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ల్యాబ్ అందుబాటులోకి వస్తే గ్రో అవుట్ టెస్ట్ ఫామ్, సీడ్ టెస్టింగ్ ల్యాబ్, గ్రీన్హౌస్, సీడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ అందుబాటులోకి వచ్చేవి. రైతు శిక్షణ కోసం ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్, హాస్టల్ ఏర్పాటయ్యేవి. అలాగే నంద్యాల మెగా సీడ్ పార్కుకు ఈ ప్రభుత్వం పైసా విదల్చలేదు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకాన్నీ నిరీ్వర్యం చేస్తున్నారు. విత్తనోత్పత్తిలో భాగస్వాములవుతున్న రైతులకు చెల్లించాల్సిన బకాయిలూ ఎగ్గొట్టారు. టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే.. రబీలో మినుము, పెసర సాగు చేశా. స్థానిక టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికే ఆర్బీకేల్లో విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. దీంతో అదును దాటుతుండటంతో చేసేది లేక కిలో రూ.130 చొప్పున మినుములు, కేజీ రూ.110 చొప్పున పెసర విత్తనాలను తెనాలి, గుంటూరు వెళ్లి తెచ్చుకున్నా. రవాణా ఖర్చులతో అదనపు భారం పడింది. విత్తనం కోసం ఎకరాకు రూ.5 వేలు పెట్టుబడి అయ్యింది. గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు. ఆర్బీకేల ద్వారా సీజన్కు ముందుగానే అందుబాటులో ఉంచి పార్టీలకతీతంగా రైతులకు ఇచ్చేవారు. – వి.రామిరెడ్డి, వెంగపల్లి, హనుమంతునిపాడు మండలం, ప్రకాశం జిల్లా ఈ దుస్థితి ఎన్నడూ చూడలేదు నేను 20 ఏళ్లుగా శనగ సాగు చేస్తున్నా. ఈ ప్రభుత్వం రాయితీని 40 నుంచి 25 శాతానికి కుదించేసింది. దీనికంటే బయట మార్కెట్లోనే తక్కువ రేటుకు దొరుకుతున్నాయి. సబ్సిడీ తగ్గించడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ దుస్థితి ఎన్నడూ చూడలేదు. – జెట్టి శ్రీనివాసరావు, ముప్పాళ్ల, నాగులుప్పలపాడు మండలం, ప్రకాశం జిల్లా జగన్ హయాంలో నాణ్యతకు భరోసా.. వైఎస్సార్సీపీ హయాంలో రెండు సీజన్లలో కలిపి ఏటా సగటున 11 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను సరఫరా చేశారు. ఇందుకోసం ఏటా రూ.400 కోట్ల వరకు బడ్జెట్లో కేటాయించారు. సీఎం స్థాయిలోనే సమీక్షించి విత్తన సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీజన్కు ముందే రైతుల వివరాలను నమోదు చేసి సబ్సిడీపై ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే విత్తనాలను పంపిణీ చేశారు. ప్రైవేటు కంపెనీల నుంచి సమీకరించిన విత్తన నిల్వలను వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లలో ర్యాండమ్గా పరీక్షించి సరి్టఫై చేసిన తర్వాత ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేవారు.తద్వారా విత్తనాల నాణ్యతకు భరోసా లభించేది. ఐదేళ్లలో రూ.1,380.14 కోట్ల రాయితీతో 76.10 లక్షల మంది రైతులకు 55.27 లక్షల క్వింటాళ్ల çసరి్టఫైడ్ సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేశారు. వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనె గింజలు, పచి్చరొట్టతోపాటు పత్తి, మిరప లాంటి నాన్ సబ్సిడీ విత్తనాలనూ ఆర్బీకేల ద్వారా అందించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్ల నిర్వహణకు నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు. -
నెక్స్ట్ ఇప్పట్లో లేనట్లే
సాక్షి, అమరావతి: వైద్యవిద్యలో ప్రమాణాల పెంపులో భాగంగా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ంఎసీ) రూపొందించిన నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్ట్) అమలు ఇప్పట్లో ఉండబోదని తెలుస్తోంది. వచ్చే మూడు, నాలుగేళ్లలో నెక్స్ట్ఉండదని నేషనల్ మీడియా తాజాగా రిపోర్ట్ చేసింది. వైద్యవిద్యలో ప్రమాణాలు పెంచే చర్యల్లో భాగంగా ఎంబీబీఎస్ తుది సంవత్సర విద్యార్థులకు నెక్స్ట్నిర్వహించాలని ఎన్ఎంసీ నిర్ణయించింది. రెండుదశల్లో నెక్స్ట్ఉంటుందని 2023లో ప్రకటించడమే కాకుండా, నిర్వహణకు కార్యాచరణ కూడా ప్రకటించింది. వైద్య విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి మాక్ టెస్ట్ నిర్వహణకు అప్పట్లో దరఖాస్తులు ఆహ్వానించారు. 2024 నుంచి నెక్స్ట్నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దీంతో అప్పట్లో విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో మాక్ టెస్ట్ నిర్వహించకుండానే నెక్స్ట్అమలును ఎన్ఎంసీ వాయిదా వేసింది. గతేడాది దాని ఊసే లేకుండాపోయింది. ఇదిలా ఉండగా ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) ప్రతినిధులతో భేటీ సందర్భంగా నెక్స్ట్అమలుపై ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ అభిజత్ శేత్ పలు అంశాలను వెల్లడించినట్టు తెలిసింది. గతంలో ప్రకటించిన కార్యాచరణ ఇలానెక్సట్ రెండుదశల్లో ఉంటుంది. మొదటిదశ పరీక్షను మూడురోజులు నిర్వహించనున్నట్టు ఎన్ఎంసీ ప్రతిపాదించింది. పూర్తిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ (ఎంసీక్యూ) విధానంలో స్టెప్–1లో మెడిసిన్ అలైడ్ సబ్జెక్ట్స్, సర్జరీ అలైడ్ సబెక్ట్స్, ఓబీజీ, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, ఈఎన్టీ.. ఈ ఆరు సబ్జెక్ట్ల్లో రోజుకు రెండు సబ్జెక్ట్ల చొప్పున రోజు విడిచి రోజు నిర్వహిస్తారు. మెడిసిన్ అలైడ్ సబ్జెక్ట్స్, సర్జరీ అలైడ్ సబ్జెక్ట్స్, ఓబీజీ ఈ మూడు పేపర్లలో 120 చొప్పున ప్రశ్నలకు మూడుగంటల సమయం, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ, ఈఎన్టీ పేపర్లలో 60 చొప్పున ప్రశ్నలకు గంటన్నర సమయం కాలవ్యవధితో పరీక్షలు నిర్వహిస్తారు. స్టెప్–1 అనంతరం ఆరోగ్య విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రాక్టికల్స్లో ఉత్తీర్ణులవ్వాలి. వీరికి హౌస్సర్జన్ చేయడానికి అర్హత ఉంటుంది. హౌస్సర్జన్ అనంతరం స్టెప్–2 పరీక్ష ఉంటుంది. కాంప్రహెన్సివ్ ప్రాక్టికల్/క్లినికల్ ఎగ్జామినేషన్ విధానంలో స్టెప్–2 నిర్వహిస్తారు. స్టెప్–1లోని ఆరు సబ్జెక్ట్లతో పాటు ఆర్థోపెడిక్స్, ఫిజికల్ మెడిసిన్ రీహాబిలిటేషన్ (పీఎంఆర్)లో ఎవల్యూ షన్ మెథడ్లో క్లినికల్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ]సాధ్యాసాధ్యాలు అంచనా వేశాకే..ప్రస్తుతమున్న విధానంలో దేశంలో ఎంబీబీఎస్ విద్యార్థులు యూనివర్సిటీలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాక పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పీజీలో అర్హత సాధించాలి. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన వారు మనదేశంలో రిజిస్ట్రేషన్ కోసం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పాసవ్వాలి. అనంతరం దేశీయ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ల మాదిరిగానే పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ పీజీలో అర్హత సాధించాలి. ఇవేవి లేకుండా ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, మెడికల్ ప్రాక్టీస్కు లైసెన్స్, రిజిస్ట్రేషన్కు, పీజీ మెడికల్ సీటులో ప్రవేశాలకు నెక్స్ట్అర్హతే ప్రామాణికమని ఎన్ఎంసీ ప్రకటించింది. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన వారికి ఈ పరీక్ష ద్వారానే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది. నెక్స్ట్విద్యార్థులు, విద్యాసంస్థల్లో గందరగోళాన్ని నివారించడానికి దేశం మొత్తం మాక్ టెస్ట్లను నిర్వహించాలని ఎన్ఎంసీ యోచిస్తోంది. అంతేకాకుండా సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి అభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. వీటి ఫలితాలను మూల్యాంకనం చేసిన తర్వాతే నెక్స్ట్అమలుపై తుది నిర్ణయానికి రానున్నారు. -
మరో మూడు నెలలు సీఎస్గా విజయానంద్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ మరో మూడు నెలలు కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్రం ఆమోదించింది. వాస్తవానికి విజయానంద్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ సీఎం చంద్రబాబు మరో మూడు నెలలపాటు ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు పదవీకాలాన్ని పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయానంద్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయనున్నారని పేర్కొన్నారు. తదుపరి సీఎస్గా సాయిప్రసాద్ అలాగే ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్గా పనిచేస్తున్న జి.సాయిప్రసాద్ను మార్చి 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి నియమించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సాయిప్రసాద్ మే నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. సాయిప్రసాద్ పదవీకాలాన్ని కూడా మరో 3 నెలలు పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
‘దిత్వా’ వాన గండం
సాక్షి, అమరావతి: దిత్వా తుపాను అన్నదాత గుండెల్లో గుబులు రేపుతోంది. మోంథా తుపానుతో వాటిల్లిన నష్టం నుంచి ఇంకా తేరుకోకుండానే మరో తుపాను వల్ల ముప్పు ముంచుకొస్తుండడం రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఆదివారం రాత్రికి చెన్నై సమీపంలో తీరం దాటే దిత్వా తుపాను ఆ తర్వాత వాయుగుండంగా మారి ఏపీలోకి ప్రవేశిస్తుందని, ఈ ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మద్దతు ధర దక్కక రైతుల అగచాట్లు ప్రభుత్వ నిర్వాకంతో రైతుల కష్టం దళారుల పాలవుతోంది. ఉల్లి, టమాటా, మొక్కజొన్న, శనగ, అరటి, సజ్జ, చివరికి «ధాన్యానికి కూడా మద్దతు ధర దక్కని పరిస్థితి నెలకొంది. అయినా ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగానే ఉంది. అధిక తేమ శాతం వంకతో మోకాలడ్డడంతో కోసింది కోసినట్టుగా ధళారులకు అయినకాడికి ధాన్యం రైతులు అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడింది. ఖరీఫ్ కోతలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఇప్పటి వరకు 10 శాతానికి మించి ధాన్యం కొనుగోళ్లు జరగలేదు. రైతు సేవా కేంద్రాల్లో చాలినన్ని సంచులూ అందుబాటులో లేవు. రవాణా, కాటా, కూలీ ఖర్చులు రైతులే భరించాలని ఆర్ఎస్కే సిబ్బంది చెబు తుండడంతో రైతులకు తలకు మించిన భారమవుతోంది. ఈ ఖర్చులన్నీ భరించలేక అయిన కాడకి తెగనమ్ముకుంటున్నారు. కనీస మద్దతు ధర ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1792 దక్కాల్సి ఉండగా, తేమ శాతాన్ని సాకుగా చూపి దళారులు, మిల్లర్లు బస్తాకు రూ.1300 నుంచి రూ,1450కు మించి ఇవ్వడం లేదు. ఇప్పుడు దిత్వా తుపాను హెచ్చరికల ప్రభావంతో ఒక్కసారిగా మారిన వాతావరణం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 30 నుంచి 40 శాతం దాటని కోతలు గోదావరి డెల్టా కింద 40 శాతం, కృష్ణా డెల్టా పరిధిలో 30 శాతంలోపు పంట కోతలు పూర్తయ్యాయి. మరో 15 శాతం పంట నూరి్పళ్ల మీద ఉంది. ఇటీవల విరుచుకుపడిన మోంథా తుపాను దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. పత్తి, మొక్కజొన్న పంటలతో పాటు ధాన్యం దిగుబడులూ తగ్గనున్నాయని అంచనా. మోంథా కారణంగా 20 శాతానికి పైగా తేమ శాతం నమోదవుతోంది. కోసిన పంటను కనీసం నాలుగైదు రోజుల పాటు ఆరబెడితే కానీ తేమ తగ్గే అవకాశం కన్పించడం లేదు. ఇదే వంకతో గడిచిన రెండ్రోజులుగా ప్రైవేటు వ్యాపారులు సైతం ధాన్యం కొనేందుకు ముందుకు రావడం లేదు. కోత దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. కోతలు ప్రారంభమవడంతో కూలీల కొరత తీవ్రంగా ఉంది. రెట్టింపు కూలీ చెల్లించి మరీ వరి నూర్పిళ్లు, ధాన్యం భద్రపర్చు కోవడం పంటి పనులు చేయిçస్తున్నారు. కోసిన పంటను కుప్పలుగా వేసి భద్ర పరుస్తున్నారు. చాలాచోట్ల పొలాల్లోనే పనలపైనే ఉంచారు. కోసిన ధాన్యాన్ని తేమ శాతం తగ్గించుకునేందుకు రోడ్లపై ఆరబెడుతున్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇస్తానన్న టార్పాలిన్ల జాడ కన్పించక పోవడంతో అద్దెలకు టార్పాలిన్లు తెచ్చుకొని పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎకరం పంటను 3 రోజుల పాటు ఆరబెట్టుకునేందుకు రూ.వెయ్యి నుంచి 2 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. దిత్వా హెచ్చరికల నేపథ్యంలో మారుతున్న వాతావరణ పరిస్థితులతో తేమ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క రాయలసీమలో రబీ పంటలపై దిత్వా తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీజన్ ఆరంభం నుంచి కష్టాలేకష్టాలుఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఓ వైపు వరుస వైపరీత్యాలు, మరొక వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను తీవ్ర నష్టాల పాల్జేస్తోంది. ఆగస్టు ఏడో తేదీ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, ఆ తర్వాత అధిక వర్షాలతో పాటు వరదలు, తుపానులు వెంటాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో రాయలసీమలో లక్షలాది ఎకరాల్లో పంటలు బీడువారి పోయాయి. గతేడాది ఇదే సమయంలో ఫెంగల్ తుపాను దెబ్బతీయగా, ఈసారి అధిక వర్షాలతోపాటు మోంథా దెబ్బతీసింది. ఫలితంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అడ్డగోలుగా కోతలతో అంచనాలను కుదించి చివరకు 4.27 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్టుగా లెక్కతేల్చారు. దాంట్లో 4.11 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 16 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలకు మాత్రమే నష్టం వాటిల్లినట్టు ప్రకటించారు. తొలుత ఇన్పుట్సబ్సిడీ రూ.869 కోట్లని చెప్పి, చివరకు రూ.390 కోట్లకు కుదించారు. ఈ మొత్తాన్ని అన్నదాత సుఖీభవతో కలిపి ఇస్తామని నమ్మబలికారు. గడిచిన 18 నెలల్లో సంభవించిన కరువుతో పాటు వివిధ రకాల వైపరీత్యాలకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు కూడా కలుపుకుంటే దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. మోంథా తుపానుకు సంబంధించిన ఇన్పుట్సబ్సిడీతో పాటు పెండింగ్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో కూడా చెప్పలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. దిత్వా తుపానుపై అప్రమత్తం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు సాక్షి, అమరావతి: దిత్వా తుపానుపై అప్రమత్తంగా ఉండాలని సీఎస్ కె.విజయానంద్ శనివారం అధికారులను ఆదేశించారు.ఈ అంశంపై ఆయన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్య సాయి, నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రం లోనికి చేపల వేటకు వెళ్లకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్టీజిఎస్ ద్వారా తుపాను సమాచారాన్ని ఎస్ఎంఎస్ లు ద్వారా తెలియజేయాలని చెప్పారు. అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. టెలికాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, పౌర సరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీ రావు, భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వణికిస్తున్న ‘దిత్వా’ తుపాను3 రోజుల పాటు రాయలసీమ, నెల్లూరుకు భారీ వర్ష సూచన.. తిరుపతి, నెల్లూరులో అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ వెల్లడిసాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను రాష్ట్రాన్ని వణికిస్తోంది. బంగాళాఖాతంలో గంటకి 8 కిలోమీటర్ల వేగంతో కదులుతూ శనివారం జాఫా్నకు 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 280, చెన్నైకి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది శనివారం రాత్రికి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్ర తీరాలకు దగ్గరగా వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి తమిళనాడుకు 25 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై సముద్రంలోనే బలహీనపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి మూడు రోజుల పాటు రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. -
పగలు బోధన.. రాత్రి కాపలా!
సాక్షి, అమరావతి: పగటి వేళ తరగతి గదుల్లో టీచర్లుగా విద్యాబోధన.. రాత్రివేళ స్కూల్, హాస్టల్ బయట వాచ్మెన్లుగా కాపలా.. వేతనాలు సకాలంలో ఇవ్వరు.. సమస్యలతో సతమవుతూనే విధులు నిర్వర్తించాల్సిందే.. ఇది రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, విద్యాసంస్థల్లో టీచర్ల దుస్థితి. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ విద్యాలయాల్లో పనిచేసే పార్ట్టైమ్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టీ), గెస్ట్ ఫ్యాకల్టీ, అవుట్ సోర్సింగ్ టీచర్ల పరిస్థితి దుర్భరంగా మారింది. సమాన పనికి సమాన వేతనం అనే సుప్రీంకోర్టు ఆదేశాలు వీరికి అమలు కావు. రెగ్యులర్ టీచర్లకు సుమారు రూ.60 వేల నుంచి లక్షకుపైగా ఉంటే.. వీరు మాత్రం రూ.18వేల నుంచి రూ.27,500 వేతనంతో నెట్టుకొస్తున్నారు. పేరుకే పార్ట్టైమ్ విధులు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ వారితో ఫుల్టైమ్ పని చేయిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. టీచర్లను బోధనేతర పనులకు వాడకూడదనే నిబంధనను తుంగలోకి తొక్కి వీరితో ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బోధన చేయించి రాత్రివేళ వాచ్మెన్ విధుల్లో పెడుతున్నారు. బీసీ హాస్టల్స్లో ఇష్టారాజ్యం బీసీ హాస్టల్స్, విద్యాసంస్థల నిర్వహణలో అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. నిబంధనలు పాటించేది లేదు. గతంలో ఇచి్చన ఆదేశాలను లెక్క చేసేదిలేదు. మాకు తోచింది చేస్తాం. మేం అనుకున్నదే అమలు చేస్తాం అనే రీతిలో సాగుతోంది. మంత్రి నుంచి అధికారుల వరకు ఎవరికి తోచినట్టు వారు ఇష్టారాజ్యంగా చేయడంతో మహాత్మ జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకులాలు ఆస్తవ్యస్తంగా మారాయి. ఇటీవల డిప్యుటేషన్ల దందా పెద్దఎత్తున సాగింది. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ స్కూల్స్ (గురుకులాలు)లో ఒక్క ప్రిన్సిపల్ మాత్రమే రెగ్యులర్ ఉద్యోగి ఉంటారు. మిగిలిన టీచింగ్ స్టాఫ్ అంతా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకోవాల్సి ఉంటుంది. ఆ పోస్టుల్లో కాంట్రాక్ట్ టీచర్ల నియామకం లేకపోవడంతో గెస్ట్ టీచర్లతో నడిపిస్తున్నారు. ఆ పోస్టుల్లో సైతం రెగ్యులర్ టీచర్లకు పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డగోలుగా డిప్యుటేషన్లు ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలోని 109 బీసీ గురుకులాల్లో 1,253 గెస్ట్ ఫ్యాకల్టీ (టీచర్లు) 8–10 ఏళ్లనుంచి సేవలు అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి పగలు బోధనతోపాటు రాత్రి భద్రత పేరుతో బోధనేతర పనులను, వాచ్మెన్ విధులను కూడా అప్పగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కాంట్రాక్ట్ పోస్టుల్లో పనిచేస్తున్న గెస్ట్ టీచర్లను పొమ్మనకుండా పొగబెట్టినట్టు నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులర్ టీచింగ్కు డిప్యుటేషన్లు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. కేవలం రూ.24వేల వేతనానికి పనిచేస్తున్న గెస్ట్ టీచర్లు రెండు, మూడు జిల్లాలు దాటి వెళ్లలేక ఉద్యోగాలు వదులుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, గురుకులాల్లో రెండో శనివారం సెలవు ఉంది. ఒక్క బీసీ గురుకులాల్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా రెండో శనివారం కూడా పనిచేయాలని ఆ సంస్థ కార్యదర్శి ఉత్తర్వులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఎస్సీ గురుకులాల్లో వేతన వెతలు మరోవైపు సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల్లోని టీచర్లను వేతన వెతలు వెంటాడుతున్నాయి. ఎస్సీ గురుకులాల్లో 1,500 మంది పార్ట్టైమ్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. 750 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్(సీఆర్టీ)కు రెండు నెలల వేతనాలు రాలేదు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు కనిపించడం లేదు. గిరిజన టీచర్ల వేదన వినేదెవరు! ఇక రాష్ట్రంలో 191 గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో 10–18 ఏళ్లుగా సేవలందిస్తున్న 1,143 మంది అవుట్సోర్సింగ్ టీచర్ల వేదనను చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. డీఎస్సీలో వీరంతా పోస్టులు కోల్పోవడంతో సర్దుబాటు చేస్తామంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇదే సమయంలో వారికి రెండు నెలల వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
అభివృద్ధి మాటున విశాఖలో భూ దోపిడీ
సాక్షి, అమరావతి: పర్యాటకాభివృద్ధి మాటున చంద్రబాబు సర్కారు అప్పనంగా భూ దోపిడీకి పాల్పడుతోంది. అత్యంత ఖరీదైన ప్రాంతాలు, పారిశ్రామికవాడలు, పోర్టులకు సమీపంలోని భూములను కొల్లగొట్టేందుకు భారీ కుట్ర నెరుపుతోంది. డొల్ల కంపెనీలను తెరపైకి తీసుకొచ్చి పెట్టుబడుల పేరుతో తీర ప్రాంతాల్లో ఖరీదైన భూములను దోచేస్తోంది. కేవలం ఆరు నెలల క్రితం పెట్టిన ఓ కంపెనీకి రెండు వేర్వేరు ప్రాంతాల్లో 35 ఎకరాల భూములు కేటాయించింది. దీని విలువ ఏకంగా రూ.660 కోట్ల నుంచి రూ.850 కోట్లుగా ఉంది. ఆతిథ్య రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థలకు సైతం వీలుపడని పెట్టుబడులను.. డొల్ల కంపెనీలను అడ్డుపెట్టుకుని డీపీఆర్లు చూపిస్తూ భూ కుంభకోణానికి తెరతీస్తోంది. ఇందులో భాగంగా పర్యాటక పెట్టుబడులను ప్రోత్సహించే పేరుతో కనీస మూలధన పెట్టుబడి లేని సంస్థలు రూ.వందల కోట్ల పెట్టుబడి పెడతామంటూ ముందుకొస్తే వాటికి ఖరీదైన భూములు అప్పగించేస్తోంది. ‘మైరా బే వ్యూ రిసార్ట్స్ ప్రైవేటు లిమిటెడ్’ అనే సంస్థ 2025 మే 5న రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ)లో నమోదైంది. ఆ కంపెనీ చిరునామా విశాఖలోనే ఉంది. అయితే, సదరు కంపెనీ మూలధన పెట్టుబడిగా రూ.15 లక్షలు మాత్రమే చూపించింది. ఈ కంపెనీ నమోదైన ఐదు నెలల్లోనే రూ.255.91 కోట్లతో విశాఖలో రిసార్ట్స్, కన్వెన్షన్ సెంటర్ నిరి్మస్తామంటూ ముందుకొచ్చింది. ఆ వెంటనే ప్రభుత్వం విశాఖలోని కొత్తవలసలో 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఈ ఏడాది అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి విశాఖ తీర ప్రాంతంలో ఎకరా భూమి సగటు విలువ రూ.40కోట్ల నుంచి రూ.50కోట్లకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన సుమారు రూ.600కోట్ల నుంచి రూ.750 కోట్లకుపైగా విలువైన భూమిని ఇచ్చేసింది. అంతటితో ఆగకుండా అదే కంపెనీ మచిలీపట్నంలో రూ.157.53 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్కుతో కూడిన రిసార్టు కడతామంటే.. వెనువెంటనే ఈ నెల 13న తాళ్లపాలెంలో రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల విలువైన మరో 20 ఎకరాలను కేటాయించింది. ఇక్కడ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తరంగా తలపెట్టిన పోర్టు నిర్మాణంతో మచిలీపట్నం రూపురేఖలు మారుతున్నాయి. ప్రస్తుతం అక్కడ భూమి మార్కెట్ రేటు ఎకరం రూ.3–5 కోట్లకుపైగా ఉంది. అంటే, రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్లు విలువైన భూములను అప్పనంగా ఈ కంపెనీకి అప్పగించేస్తోంది. వాస్తవానికి మచిలీపట్నం తీరంలో పోర్టు వచి్చన తర్వాత భూముల విలువ పెరిగింది. పోర్టు సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తే అక్కడి భూములు అమూల్యంగా మారతాయి. ఇంతటి విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల మాటున చంద్రబాబు సర్కార్ మింగేస్తోంది. రూ.15 లక్షల సంస్థ రూ.413.44 కోట్ల పెట్టుబడి! ‘మైరా బే వ్యూ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నమోదు సమయంలో మూల ధన పెట్టుబడి కేవలం రూ.15 లక్షలు మాత్రమే. అలాంటి సంస్థ ఆరు నెలలు తిరగకుండా ఒకచోట రూ.255.91 కోట్లు, మరొకచోట రూ.157.53 కోట్లు కలిపి రూ.413.44 కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయికి వచ్చేసింది. దీన్నిబట్టి ఇక్కడ ఈ సంస్థను కేవలం భూములు కాజేసేందుకు మాత్రమే తెరపైకి తెచి్చనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి కంపెనీని అడ్డుపెట్టుకుని రూ.660 కోట్ల నుంచి రూ.850 కోట్ల విలువైన భూములను కారుచౌకగా లీజు పేరుతో ఏకంగా 99 ఏళ్లపాటు తమ చేతుల్లో పెట్టుకునేందుకు ప్రభుత్వ పెద్దలు పన్నిన పన్నాగంగా అర్థమవుతోంది. వాస్తవానికి ఈ కంపెనీ ఐదుగురు డైరెక్టర్లతో ఏర్పాటైంది. ఇందులో ఒక వ్యక్తి ఛత్తీస్గఢ్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో కలిసి ఆతిథ్య రంగంలో పని చేస్తున్నారు. అయితే, సదరు కంపెనీ రెండేళ్ల కిందట నమోదవ్వగా ఇప్పటి వరకు ‘మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్’(ఎంసీఏ)కు తమ ఆరి్థక లావాదేవీల వివరాలను సమరి్పంచలేదు. పైగా ప్రతి కార్పొరేట్ సంస్థ/ప్రైవేటు సంస్థకు క్రెడిట్ రేటింగ్ చాలా కీలకం. ఆ క్రెడిట్ రేటింగ్పై ఆధారపడే సంస్థ పనితీరును అంచనా వేస్తారు. అలాంటిది ఛత్తీస్గఢ్లో నిర్వహిస్తున్న ఫర్మ్ ఒక సంస్థ నుంచి క్రెడిట్ రేటింగ్ను విత్డ్రా చేసుకుని మరో సంస్థ ద్వారా తీసుకోవడం సందేహాలను కలిగిస్తోంది. ఆ క్రెడిట్ రేటింగ్ ఇచ్చిన సంస్థ కూడా ఉత్తమమైన క్రెడిట్ రేటింగ్ ఇచ్చే సంస్థల జాబితాలో లేకపోవడం గమనార్హం. పైగా ఈ ఫర్మ్కు రూ.50కోట్లకుపైగా బ్యాంకు రుణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సంస్థల్లోని వ్యక్తులు కొత్తగా కంపెనీలు పెడితే పాలకులు చెప్పారని పర్యాటకశాఖ రూ.వందల కోట్ల విలువైన భూములను కళ్లు మూసుకుని అప్పగించేస్తోంది. డొల్ల ప్రాజెక్టులకు భూ సంతర్పణ చంద్రబాబు అధికారంలోకి వచి్చనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విలువైన భూములపై కన్నేసింది. పరిశ్రమలు, పర్యాటకం పేరుతో నచి్చనోళ్లకు కావాల్సినంత కట్టబెట్టేస్తోంది. విశాఖలో భూముల కేటాయింపుల వెనుక ఓ కీలక నేత చకచకా పావులు కదిపినట్లు సమాచారం. మచిలీపట్నంలో ఎప్పటి నుంచో భూములపై మనసు పడ్డ ఓ మంత్రి ఇదే అదునుగా ఈ సంస్థను అడ్డుపెట్టుకుని భూములు పొందేందుకు ప్రణాళిక వేసినట్టు తెలిసింది. మొత్తానికి రాష్ట్రంలో ఎక్కడ ఏ సంస్థకు ప్రభుత్వ భూములు కేటాయించినా, దాని వెనుక ప్రభుత్వ పెద్దలు, బినామీలు ఉండటం సర్వసాధారణమైంది. ముఖ్యంగా పర్యాటక శాఖలోని ఓ కన్సల్టెంట్ సంస్థ ఇలాంటి డొల్ల ప్రాజెక్టులను తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. సదరు సంస్థ ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. ప్రభుత్వం భూములు కేటాయించేలా కంపెనీలకు లేని అర్హతలతో డీపీఆర్ రూపొందించి భారీగా ముడుపులు మూట కట్టుకుంటున్నట్టు బహిరంగ విమర్శలున్నాయి. మొత్తంగా భూములు పొందిన సంస్థ.. ప్రభుత్వ పెద్దలు.. మీకింత–మాకింత అని పంచుకోవడమేనని పర్యాటక శాఖలో అధికారవర్గాల మధ్య చర్చ నడుస్తోంది. -
'దిత్వా' తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
దిత్వా తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను పుదుచ్చేరికి 280 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 380 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర దిశగా కదులుతున్న తుపాను రాత్రికి చెన్నై, రేపు పుదుచ్చేరి తీరాన్ని తాకనుంది. దీంతో ఏపీలోని పలు జిల్లాలకు కూడా దిత్వా తుపాను ముప్పు ఉంది. దక్షిణ కోస్తా , రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. రేపు ప్రకాశం, అన్నమయ్య, కడప, నంద్యాల, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించనున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లోని అన్ని పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. -
వెంకటేశ్వరశర్మతో వైఎస్సార్సీపీకి ఏ సంబంధం లేదు
సాక్షి, తాడేపల్లి: న్యాయవాది కోటంరాజు వెంకటేశ్వరశర్మ మీద మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే, వెంటనే ఆయన్ను మా పార్టీకి చెందిన వాడిగా చెబుతూ.. ఎల్లో మీడియాలోనూ, వారి అనుకూల సోషల్ మీడియాలోనూ అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లాకు చెందిన లీగల్సెల్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.నిజానికి వెంకటేశ్వరశర్మకు వైఎస్సార్సీపీతో కానీ, పారీ లీగల్ సెల్తో కానీ, ఏనాడూ ఏ విధమైన సంబంధం లేదని, ఆయన తమ పార్టీలో ఎప్పుడూ క్రియాశీలకంగా లేరని వారు స్పష్టం చేశారు. టీడీపీకి చెందిన కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, వైఎస్సార్సీపీతో పాటు, జగన్ని నిందిస్తున్నారని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎన్టీఆర్ జిల్లా లీగల్సెల్ కోఆర్డినేటర్ ఒ.గవాస్కర్, అదే విభాగం అధ్యక్షుడు సీహెచ్.సాయిరాం ఆక్షేపించారు. ఈ సందర్భంగా వారు ఏమన్నారంటే..:ఎంత వరకు సబబు? ఆలోచించండి:న్యాయవాది కోటంరాజు వెంకటేశ్వరశర్మకు సంబంధించి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఎప్పుడూ మా పార్టీలో కానీ, పార్టీ లీగల్ సెల్లో కానీ, క్రియాశీలకంగా లేరు. ఆయన మీద నమోదైన కేసు పూర్తిగా వ్యక్తిగతం. కానీ టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ, వీడియోలు రిలీజ్ చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, జగన్ని అభాసుపాల్జేయాలని చూస్తున్నారు. కనీసం వాస్తవాలు కూడా తెలుసుకోకుండా, పత్రికలు కూడా అలా ప్రచారం చేయడం ఎంత వరకు సబబు అనేది ఆలోచించాలి.వెంకటేశ్వరశర్మ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏమేమో చేశారని నిందిస్తున్నారు. నిజానికి ఆయనకు పార్టీతో ఏనాడూ, ఏ విధమైన సంబంధం లేదు. అప్పుడు, ఇప్పుడు ఆయన ఏం చేసినా, అది పూర్తిగా వ్యక్తిగతం. అయినా ఆయన ఏదో చేశారని చూపుతూ, దాన్ని వైఎస్సార్సీపీకి అంటగడుతూ బురద చల్లడం అత్యంత హేయం. టీడీపీ కూటమి ప్రభుత్వం చివరకు లాయర్లను కూడా వదలడం లేదు.ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం:ఒక వైపు హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం మా పార్టీపై బురద చల్లుతూ.. వెంకటేశ్వరశర్మ ఏదో చేశారని, మా పార్టీకి అంటగడుతున్నారు. ఆ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదే వెంకటేశ్వరశర్మ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో అంటకాగారు. కావాలంటే ఈ ఫోటోలు చూడండి. (అంటూ ఆ ఫోటోలతో పాటు, నందమూరి బాలకృష్ణతో దిగిన ఫోటో కూడా మీడియాకు చూపారు). మరి అలా చూస్తే, వెంకటేశ్వరశర్మ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అనుకోవచ్చు కదా? లేకపోతే పల్లా శ్రీనివాసరావుతో ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? దీనికి టీడీపీ ఏం సమాధానం చెబుతుంది? ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నట్లు ఈ ఫోటోలు చూపుతున్నాయి. మరి వెంకటేశ్వరశర్మకు, టీడీపీతో ఏం సంబంధం? ఆయన టీడీపీకి చెందిన వారు అనుకోవచ్చు కదా? అదే వెంకటేశ్వరశర్మ గతంలో నందమూరి బాలకృష్ణతో కూడా ఫోటో దిగారు. మరి ఆయనతో ఏం సంబంధం? ఇవన్నీ చూస్తుంటే, వెంకటేశ్వరశర్మ టీడీపీ లీగల్సెల్ సభ్యుడా?. ఇంకా ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవితో కూడా వెంకటేశ్వరశర్మ కలిసి ఉన్నాడు. చిరంజీవితో, ఆ పార్టీతో కూడా ఆయనకు ఏం సంబంధం ఉంది? ఇప్పటికైనా ఆ మీడియా ఇలాంటి దుష్ప్రచారాన్ని విడనాడాలి. లేకపోతే చట్టపరంగా చర్య తీసుకుంటాం.కేసు నమోదు కాగానే నింద మొదలు:వెంకటేశ్వరశర్మపై మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగానే, వెంటనే ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఆయన వైయస్సార్సీపీకి చెందిన వారని, జగన్గారికి అత్యంత సన్నిహితుడని చెబుతూ బురద చల్లుతున్నాయి. మళ్లీ చెబుతున్నాం. వెంకటేశ్వరశర్మ ఏనాడూ మా పార్టీలో లేడు. ఆయనకు మా పార్టీతో ఏ సంబంధం లేదు. ఆయన జగన్ వ్యక్తిగత లాయర్ కాదు.నిజానికి ఆ ఫోటోలు చూస్తుంటే, వెంకటేశ్వరశర్మకు మీ (టీడీపీ) పార్టీతోనే సంబంధాలు ఉన్నాయనిపిస్తోంది. ఆయన మీ పార్టీకి చెందిన వ్యక్తినే. మీకు డబ్బుల పంపకాల విషయంలో గొడవ అయింది కాబట్టే ఆయన మీద ఆరోపణలు చేస్తూ మాపైకి నెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే వెంకటేశ్వరశర్మ తమ్ముడు జనసేనలో ఉన్నాడని ఒ.గవాస్కర్, సీహెచ్.సాయిరాం వివరించారు. ప్రెస్మీట్లో వై.పుల్లారెడ్డి, నాగిరెడ్డి, జి.లావణ్య కూడా పాల్గొన్నారు. -
చంద్రబాబు డైరెక్షన్లో అమరావతి మెగా సీరియల్
సాక్షి, తాడేపల్లి: అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే. అడ్డగోలుగా భూదోపిడీ చేస్తూ వేల కోట్లు వెనుకేసుకుంటున్నారు. అమరావతి రైతులు పునరాలోచన చేసుకునే పరిస్థితిలో పడ్డారు. చంద్రబాబును నమ్మి పదేళ్ల క్రితమే భూములు ఇస్తే ఇంకా కావాలంట. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని అప్పట్లో చంద్రబాబు ప్రగల్భాలు పలికారు’’ అంటూ దుయ్యబట్టారు.‘‘ఇప్పటికే 54 వేల ఎకరాలను సేకరించారు. ఇప్పుడు రెండో విడతలో మరో 16,666 ఎకరాలను రైతుల నుండి సమీకరిస్తారట. మూడో విడతలో మరో 25 వేల ఎకరాలు తీసుకుంటారట. తొలి విడతలో తీసుకున్న భూములకే ఇప్పటికీ పూర్తిగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. రైతులు అడిగితే అధికారులు అవమానపరుస్తున్నారు. భూములు తీసుకునేటప్పుడు త్యాగధనులు అన్నారు. ఇప్పుడేమో రైతులంటే పనికిమాలిన వాళ్లు అన్నట్టుగా చూస్తున్నారు..భూములు ఇచ్చిన రైతులు ఎంతో బాధపడుతున్నారు. అమరావతిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే భూముల ధరలు తగ్గాయి. 18 నెలల్లో రాజధాని ప్రాంతంలో తట్టెడు మట్టి ఎత్తలేదు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అప్పులు తీసుకొస్తున్నారు. అమరావతి కోసం ఇన్నీ తీసుకొచ్చి రూ.3 వేల కోట్లకే టెండర్లు పిలిచారు. చంద్రబాబు నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది’’ అని అంబటి పేర్కొన్నారు.‘‘రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడపాలన్నది చంద్రబాబు ప్లాన్. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం లేదు. అమరావతిలో చంద్రబాబు నిర్మించిన భవనాలన్నీ తాత్కాలికమే. పార్లమెంట్కు రూ.970 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ సచివాలయానికి రూ.500 కోట్లు ఖర్చు చేశారు. కానీ తాత్కాలిక అసెంబ్లీకే చంద్రబాబు రూ.700 కోట్లు ఖర్చు చేశారు’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘చంద్రబాబు అధికారంలోకి వస్తే భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు అత్యంత దారుణంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాజధానిలో ఇప్పటికీ ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు. కానీ రూ.3 వేల కోట్ల అడ్వాన్సులు ఇచ్చారు. వాటిలో కమీషన్లు కొట్టేశారు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ స్కీం అని చంద్రబాబు జనాన్ని మోసం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి రాజధాని కోసం అప్పులు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రేట్లు పెంచి కాంట్రాక్టర్లకు అప్పగించారు..దాని వెనుక పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నట్టు రైతులు కూడా గుర్తించారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలకే వేల కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో అడుగుకు రూ.11 వేలు ఖర్చు చేశారు. దేశ పార్లమెంటు భవనానికి రూ.970 కోట్లు ఖర్చు చేస్తే, చంద్రబాబు తాత్కాలిక భవనాలకే రూ.750 కోట్లు ఖర్చు చేశారు. రాజధాని పల్లపు ప్రాంతంలో ఉండటం వలన ముంపునకు గురవుతోంది. రాజధాని నీరు నదిలోకి ఎత్తి పోయటం అమరావతిలోనే చూస్తున్నాం. రైతులకు న్యాయం చేయకుండా భూములు లాక్కోవటం సరికాదు’’ అని అంబటి రాంబాబు హితవు పలికారు.‘‘డిప్యూటీ సీఎంకి సరైన సెక్యూరిటీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అపరిచిత వ్యక్తి వచ్చాడంటూ ఫిర్యాదులు ఇవ్వటం సిగ్గుచేటు. పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం కామెడీ చేస్తున్నారు. సీరియస్ రాజకీయాల్లో పవన్ వెరైటీ కామెడీ చేస్తున్నారు. తన అభిమాని తనకోసం వచ్చినా పవన్ భయపడుతున్నారు. ఒక డీఎస్పీని అవినీతి పరుడని పవన్ అంటే చంద్రబాబు ఆ డీఎస్పీకి అవార్డులు ఇచ్చారు. ఇదీ ప్రభుత్వంలో పవన్ పరిస్థితి’’ అంటూ అంబటి చురకలు అంటించారు. -
నందిగం రాణికి చుక్కెదురు
సాక్షి, అమరావతి: ఏలూరు జిల్లా, కామవరపు కోట మండలం, తడికలపూడి గ్రామంలో శ్రీ హర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యవహారంలో నిందితురాలు నందిగం రాణికి హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కలి్పస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. నేర తీవ్రత నేపథ్యంలో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. ఇదే కేసులో ఇతర నిందితులుగా కొందరికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఇటీవల తీర్పునిచ్చారు. హర్షిత ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఏర్పాటు పేరుతో నందిగం రాణి, అతని భర్త పలువురి నుంచి దాదాపు రూ.33 కోట్ల వరకు డబ్బు వసూలు చేశారు. వీరి చేతిలో మోసపోయిన కొర్రపాటి చంద్రశేఖర్ అనే వ్యక్తి నందిగం రాణి తదితరులపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నందిగం రాణి, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చారు. దీంతో వీరంతా కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నందిగం రాణి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టేశారు. మిగిలిన వారికి మాత్రం ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. -
తీవ్ర సంక్షోభంలో రాష్ట్ర వ్యవసాయ రంగం
సాక్షి, అమరావతి: తుపానుల ప్రభావం, గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ (అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్), వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అది పక్కనపెట్టి రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపక్ష నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆయన మండిపడ్డారు.దేశ సగటుకన్నా రాష్ట్ర సగటు సాగు విస్తీర్ణం పడిపోయినా ఈ ప్రభుత్వం మేల్కోవడం లేదని, మోంథా తుపాను, మద్దతు ధరలు లేకపోవడం వల్ల రాష్ట్రంలో మూడు ప్రధాన పంటలు వరి, పత్తి, మొక్కజొన్న సాగుచేస్తున్న రైతులు ఈ ఏడాది రూ.13,324 కోట్లు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తిరైతులు రూ. 9,209 కోట్లు, మొక్కజొన్న రైతులు రూ.1,536 కోట్లు నష్టపోయారని పేర్కొన్నారు.. టమాట, చీనీ, అరటి పంటలకు కనీస మద్దతు ధరలు కరువై పంటలను రాయలసీమలో రోడ్లపై పారబోస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. సాధారణ పంటలతో పోలిస్తే హార్టికల్చర్ సాగు విస్తీర్ణం తక్కువే అయినా జీఎస్డీపీలో మాత్రం మెజారిటీ వాటా పండ్ల తోటలదే అన్న విషయాన్ని ఈ ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. 11 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టం ‘మోంథా తుపాను వల్ల అన్ని పంటలు కలిపి 4 లక్షల ఎకరాల్లోనే దెబ్బతిన్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి మోంథా తుపాను ముందు వరకు రాష్ట్రంలో వరి సాగు బాగానే ఉన్నా తర్వాత బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు 28 లక్షల ఎకరాలపై తుపాను ప్రభావం తీవ్రంగా పడింది. అందులో 11 లక్షల ఎకరాల్లో దిగుబడులు పడిపోతున్నాయని గతంలోనే మా పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. ఒక్క వరిలోనే 11 లక్షల ఎకరాల్లో పంటదెబ్బతింటే అన్నిపంటలూ కలిపి 4 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని ప్రభుత్వం చెబుతోంది. 83 లక్షల టన్నుల ఉత్పత్తి కూడా 73 నుంచి 74 లక్షల టన్నులకు పడిపోబోతోంది. 33 శాతం పైన పంట దెబ్బతింటేనే ఇన్పుట్ సబ్సిడీకి అర్హత ఉందంటున్నారు.అంతకన్నా తక్కువ నష్టం జరిగిన రైతుల గురించి చెప్పడం లేదు. 83 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే పరిస్థితి ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు, అందులో 51 లక్షల టన్నులు సేకరిస్తామని చెబుతున్నారు. గత రబీ సీజన్లో అమ్మిన పంటకు ఏప్రిల్ తరువాత నాలుగు నెలలపాటు డబ్బులు ఇవ్వకున్నా 24 గంటల్లోనే డబ్బులిస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడం హాస్యాస్పదం. ఈ దిగుబడి మోంథా తుపాన్ కారణం గా ఉత్పత్తి తగ్గడం వల్ల సేకరణ కూడా 36 టన్నుల నుంచి 37 లక్షల టన్నులు దాటదు’ అని చెప్పారు.వరి రైతుకు రూ.2579 కోట్లు నష్టం ‘కల్లాల్లో ధాన్యం.. కళ్లల్లో దైన్యం! శీర్షికతో తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక ఈనాడులోనే రాశారు. ఇన్ని రోజులుగా వైఎస్సార్సీపీ రైతుల పక్షాన చెబుతున్న మాటలనే యథాతథంగా ఈనాడు కూడా రాసిందంటే ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయనేది తెలిసిపోతోంది. తేమ శాతం చూపించి ధర తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారు. ఎక్కడికెళ్లినా గన్నీ సంచులు దొరకడం లేదు. రవాణా చేద్దామంటే లారీలు లేవంటున్నారు. 75 కిలోల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,777 దక్కాల్సి ఉంటే.. రైతుకు సగటున రూ.1,450 మాత్రమే లభిస్తోంది. ఈనాడు చెప్పే లెక్కల ప్రకారమే రైతు బస్తాకు రూ.250 నష్టపోతున్నాడు. ఈ లెక్కన ఒక్క ధాన్యం మీదనే రూ.2,579 కోట్లు వరి రైతు నష్టపోతున్నాడు’ అని వివరించారు. -
‘ఈనాడు’ బరితెగింపు.. అవే అబద్ధాలు.. అదే దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: టీడీపీ భజంత్రీ పత్రిక, దుష్ప్రచార విష పుత్రిక ‘ఈనాడు’ మరోసారి తన మార్కు కుట్రకు బరితెగించింది! దశాబ్దాలుగా అవాస్తవాలు వండివార్చి నిత్యం ఉషోదయంతో ప్రజలను తప్పుదారి పట్టించే కుతంత్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో దారుణంగా విఫలమైన చంద్రబాబుకు రక్షా కవచంగా మరోసారి దుష్ప్రచారానికి దిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఏమాత్రం సంబంధంలేని ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుతో ఆయనకు ముడిపెట్టేందుకు యత్నిస్తోంది. ఆ కేసులో నిందితుడుగా ఉన్న సునీల్రెడ్డి ఆయనకు సన్నిహితుడు అంటూ నిస్సిగ్గుగా అవాస్తవ కథనాన్ని ప్రచురించి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది.సునీల్రెడ్డిని సిట్ విచారించిన సమాచారాన్ని వార్తా కథనంగా ప్రచురిస్తూ, అందులో ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు వివరాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారానికి తెగబడింది. కేవలం ముఖ పరిచయం ఉన్నవారిని బినావీులని చిత్రీకరిస్తోంది. మరి అదే సిద్ధాంతం ప్రకారం.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రామోజీ కుటుంబం, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, గీతం మూర్తి ఆయనకు బినావీులనుకోవాలా? చిన్నా చితక వ్యాపారాలు చేసుకుంటున్న సునీల్రెడ్డి దుబాయ్లో పెట్టుబడులు పెట్టాడని, వైఎస్ జగన్కు సన్నిహితుడని ఎల్లో మీడియా బురద చల్లుతోంది. లేని ఆస్తులను, లేని నగదును సునీల్వంటూ దుష్ప్రచారం చేస్తోంది.అసలు ఎమ్మార్ కేసుతో వైఎస్ జగన్కు ఏం సంబంధం? ఈ వ్యవహారంతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని సీఐడీ చార్జిషీట్లోనే పేర్కొంది. ఇంకా చెప్పాలంటే.. ఆ కంపెనీకి నాడు భూములిచ్చిందే చంద్రబాబు. దాని ప్రమోటర్ ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఇస్తేగిస్తే చంద్రబాబుకే ముడుపులివ్వాలి! వైఎస్ జగన్పై అక్రమ కేసుల నమోదు చంద్రబాబు, నాడు కాంగ్రెస్ కుట్రే! టీడీపీ నేతలతో కలసి కేసులు వేయించి నాడు కిరణ్కుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారును కాపాడింది చంద్రబాబే!‘ఈనాడు’ దుష్ప్రచార కుట్రతన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే చంద్రబాబు డైవర్షన్ కుట్రలో భాగంగానే ఈనాడు పత్రిక ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసును వక్రీకరిస్తూ కథనాన్ని ప్రచురించింది. ఆ కేసులో ఏ–7గా ఉన్న హైదరాబాద్కు చెందిన న్యాయవాది, చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడని చెప్పుకొచ్చింది. ఆయన చెప్పిన పనులను ఎడమ చేతికి తెలియకుండా నమ్మకంగా పని చేసే కుడిభుజం అంటూ పచ్చి అవాస్తవాలు ప్రచురించడం విస్మయపరుస్తోంది. ఈ పదేళ్లలో కలిసినట్లు ఒక్క ఫొటో చూపగలదా? చూపలేదు. ఎందుకంటే దశాబ్దంపైగా వైఎస్ జగన్ను సునీల్రెడ్డి ఏనాడూ వ్యక్తిగతంగా కలవనే లేదు. అయినప్పటికీ ఎల్లో మీడియా పాత ఫోటో ప్రచురించి విష ప్రచారానికి తెగబడింది. సునీల్రెడ్డి గత కొన్నేళ్లలో వైఎస్ జగన్ను ఎప్పుడైనా కలిసినట్లు ఈనాడు గానీ, చంద్రబాబు గానీ చూపించగలరా..?‘ఎమ్మార్ ప్రాపర్టీస్’కు భూములిచ్చింది బాబేఅసలు వాస్తవం ఏమిటంటే... ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రాజెక్టుకు 1999–2004 మధ్య టీడీపీ హయాంలో ఆమోదం తెలిపింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే. భూములు కేటాయించింది అప్పటి టీడీపీ ప్రభుత్వమే. ఎమ్మార్ ప్రాపర్టీస్ ప్రమోటర్లు, డైరెక్టర్లు చంద్రబాబుకే సన్నిహితులు. బాబు కుట్రతోనే వైఎస్ జగన్పై అక్రమ కేసులువైఎస్ జగన్పై అక్రమ కేసుల నమోదు చంద్రబాబు, అప్పటి కాంగ్రెస్ కుట్రేనన్నది బహిరంగ రహస్యం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణానంతరం కాంగ్రెస్ అధిష్టానంతో జట్టు కట్టి చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. అప్పటి కాంగ్రెస్ మంత్రి శంకర్రావు, టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడు కలిసే వైఎస్ జగన్కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేయడమే అందుకు తార్కాణం. ఇక అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పటి కిరణ్కుమార్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడింది చంద్రబాబే. ఆ విధంగా కాంగ్రెస్, టీడీపీ కలిసే వైఎస్ జగన్పై అక్రమ కేసులు నమోదు చేయించాయన్న వాస్తవం ప్రజలందరికీ తెలుసు. అదే కుట్రను కొనసాగిస్తూ ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు పేరిట వైఎస్ జగన్పై ఈనాడు పత్రిక విష ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఆదేశాలతోనే అవాస్తవ కథనాలను ప్రచురిస్తోంది.ఆ కుటుంబాల ఆస్తులన్నీ బాబు బినావీుయేనా...!ఫొటోలు దిగితేనే సన్నిహితుడు, బినామీ అయితే... చంద్రబాబు, లోకేశ్ ఎందరెందరితోనో ఫొటోలు దిగుతూ ఉంటారు. వారంతా ఆ తండ్రీకుమారులకు బినావీులుగానే పరిగణించాలా మరి...! అసలు క్విడ్ప్రోకో, బినామీ అనే పదాలు చంద్రబాబుకే వర్తిస్తాయి. ‘ఈనాడు’ రామోజీరావు కుటుంబం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబం, టీవీ 5 బీఆర్ నాయుడు కుటుంబం, విశాఖపట్నం టీడీపీ ఎంపీ ఎం. భరత్ కుటుంబం... ఇలా ఈ జాబితాకు అంతే లేదు. వారందరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులే కాదు... ఆయన రాజకీయ కుట్రలో భాగస్వాములు కూడా. 1995లో వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్తో ఎన్టీరామారావుకు వెన్నుపోటు కుట్రలో వారందరూ భాగస్వాములే కదా. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రామోజీ కుటుంబ అక్రమ ఆర్థిక సామ్రాజ్య విస్తరణకు పూర్తిగా సహకరించారు.ఎన్టీ రామారావు అమలు చేసిన సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తొలగించారు. రామోజీ ఫిల్మ్ సిటీ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇదంతా చేశారు. టీడీపీ ప్రభుత్వ అండతోనే రామోజీ రావు కుటుంబం రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములను చెరబట్టి ఫిల్మ్ సిటీ నిర్మించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిటర్స్ రూ.వేల కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడింది. అదే రీతిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, విశాఖఫట్నంలో ‘గీతం’ ఎంవీవీఎస్ మూర్తి (ప్రస్తుత టీడీపీ ఎంపీ భరత్ తాత) కుటుంబాల ఆస్తులు అమాంతంగా పెరిగిన విషయం బహిరంగ రహస్యమే. అదంతా చంద్రబాబు క్విడ్ ప్రోకో కుట్రనే. అంటే రామోజీ కుటుంబం, రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు, ‘గీతం’ ఎంవీవీఎస్ మూర్తి కుటుంబాల ఆస్తులన్నీ చంద్రబాబు బినామీ ఆస్తులేనన్నది స్పష్టమవుతోంది. -
కూతురు సునీతే అంతా చేశారు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కూతురు నర్రెడ్డి సునీత, ఆమె భర్త రాజశేఖర్రెడ్డి మానసికంగా, ఆర్థికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని సీబీఐ కోర్టుకు న్యాయవాది ఉమామహేశ్వర్రావు విన్నవించారు. ఆయనకు కనీసం తిండి పెట్టేవారు లేకుండా చేశారంటూ వివేకా రెండో భార్య షమీమ్ ఇచ్చిన వాంగ్మూలాన్ని చదివి వినిపించారు. ‘బావమరిది, భార్య కూడా ఆయనను చేరదీయలేదు. కుమారుడి గురించి ఆందోళన చెందారు. ఆయన చెక్పవర్ తొలగించి, ఆర్థిక దిగ్బంధం చేశారు. కుమారుడి పేరిట కొంత ఆస్తి ఇవ్వాలని భావించినా కూతురు, అల్లుడు, బావమరిది అడ్డుకున్నారు’ అంటూ ఆమె వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు. కొంత డబ్బును ఆమెకు ఇవ్వాలనుకున్న క్రమంలో హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. ఇంత స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చినా సీబీఐ అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేయకపోవడం ఆశ్చర్యకరమని నివేదించారు. హత్యకు ముందు వివేకా రాసిన లేఖను కూడా అల్లుడు మాయ చేసేందుకు యత్నించారన్నారు. హంతకుడు షేక్ దస్తగిరికి అనుకూలంగా వ్యవహరిస్తుండటం తీవ్ర అనుమానాస్పదమని వివరించారు. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించాలని కోరుతూ సీబీఐకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి డాక్టర్ టి.రాఘురామ్ శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా శివశంకర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్రెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్రావు కోర్టుకు వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి వాదనల నిమిత్తం పిటిషన్ను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రతివాదుల తరఫు వాదనల్లో ముఖ్యాంశాలు...ఇతరులను ఇరికించడమే ఉద్దేశం..‘కూతురు, అల్లుడితో తీవ్ర ఆర్థిక, కుటుంబ విభేదాలున్న అంశాన్ని కూడా ఈ కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. అనుమానం వారిపైకి రాకుండా ఉండేందుకు ఇతరులపై మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. అవినాశ్రెడ్డి ఓ పార్టీ ఎంపీ కావడంతో ఆయనను నేరుగా ఎదుర్కోలేక అక్రమ మార్గంలో ఎదుర్కొనడానికి మరో వర్గం సునీతను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే పిటిషన్లపై పిటిషన్లు దాఖలవుతున్నాయి. రాజకీయంగా కొందరిని ఇరికించాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం. సునీత అంతా తాను అనుకున్నట్లే జరగాలని భావిస్తున్నారు. ఈ తీరు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. చార్జ్షీట్ దాఖలయిన చాలా కాలం తర్వాత.. రోజువారీ విచారణ చేసి ఆరు నెలల్లో పూర్తి చేసేలా సీబీఐ కోర్టును ఆదేశించాలంటూ సునీత హైకోర్టులో (సీఆర్ఎల్పీ 1270/2025) దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఇంకా దర్యాప్తు కోరుతూ పిటిషన్ వేశారు. ఒక్కో కోర్టులో ఒక్కో విధంగా పిటిషన్లు వేస్తూ న్యాయస్థానం విలువైన సమయాన్ని వృథా చేయడమే కాకుండా ట్రయల్ను అడ్డుకుంటున్నారు’ అని నాయవాది నివేదించారు. ఎన్నాళ్లు కోర్టు చుట్టూ తిరగాలి..‘చార్జ్షీట్, రెండు అనుబంధ చార్జ్షీట్లు దాఖలు చేసి ఏళ్లు గడుస్తున్నా.. ట్రయల్ ఇంకా ప్రారంభం కాలేదు. సాక్ష్యాధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వారు ఎన్నాళ్లు కోర్టు చుట్టూ తిరగాలి? అది వారికున్న రాజ్యాంగ హక్కులను హరించడమే. ఏ కేసులోనైనా నిందితుల హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు. ఇదే విషయాన్ని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొంది. వీలైనంత సత్వరం విచారణ పూర్తి చేసి తీర్పులివ్వాలని ఆదేశించింది. ఈ కేసులో శివశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దర్యాప్తు చేయమని కోర్టు ఆదేశిస్తే చేస్తామని సీబీఐ చెప్పడం సబబుకాదు. హత్య జరిగి దాదాపు ఏడేళ్లు కావొస్తున్నా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూపోతే విచారణ ముగిసేదెప్పుడు? నిందితులు ఎన్నాళ్లు కోర్టు చుట్టూ తిరగాలి. వారి హక్కులను కాపాడే బాధ్యత ఈ కోర్టుకు ఉంది. దర్యాప్తు కొనసాగింపు అవసరం లేదు’అని ఉమామహేశ్వర్రావు వాదనలు వినిపించారు. -
వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విపణి వరకు ఐదేళ్ల పాటు రైతులను గ్రామస్థాయిలో చేయిపెట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే) వ్యవస్థకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ అయిన ఇంగ్లాండ్లోని బర్మింగ్హాం విశ్వవిద్యాలయం ఆర్బీకేలను సువర్ణ యజ్ఞంగా గుర్తించింది. యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఎంబీఏ) చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని నిరోషా ఆర్బీకేలపై ప్రదర్శించిన ప్రాజెక్టుకు గోల్డ్మెడల్ బహూకరించింది.వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన మహత్తర వ్యవస్థవైఎస్ జగన్ ప్రవేశపెట్టిన మహత్తర వ్యవస్థే ఆర్బీకేలు. పౌరసేవలను ప్రజల ముంగిట తీసుకెళ్లే లక్ష్యంతో రెండు వేల జనాభాకొక గ్రామసచివాలయాలను అందుబాటులోకి తీసుకొచి్చన వైఎస్ జగన్ వాటికి అనుబంధంగా గ్రామస్థాయిలో ఒకేసారి 10,77 8రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆక్వా ఫీడ్, పశువుల దాణా వంటి ఉత్పాదకాలతోపాటు రైతు సంక్షేమ ఫలాలను ఈ కేంద్రాల ద్వారానే కర్షకుల ముంగిటకే అందించారు. వ్యవసాయ అనుబంధ యూనివర్శిటీలకు ఆర్బీకేలు కేంద్రంగా చేసి ఇంటర్న్షిప్లనూ నిర్వహించారు. దేశానికే రోల్మోడల్గా నిలిచిన ఆర్బీకే వ్యవస్థను గతంలోనే జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలతోపాటు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి.ఆర్బీకేల స్పూర్తితోనే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతోపాటు ఇథియోపియా వంటి దేశాలూ ఆర్బీకే వ్యవస్థపై అధ్యయనం చేసి వీటి స్ఫూర్తితో తమ ప్రాంతాల్లో గ్రామస్థాయిలో రైతులకు మెరుగైన సేవలందించే దిశగా అడుగులు వేశాయి. అంత గొప్ప కీర్తిగడించిన ఆర్బీకే వ్యవస్థను గడిచిన 18 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఇదిలా ఉంటే ఆర్బీకేలపై ప్రాజెక్టు ప్రెజెంట్ చేసిన నిరోషా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారానే బర్మింగ్ హాం వర్సిటీలో ఎంబీఏ చేస్తున్నారు.చివరి ఏడాది సమర్పించే ప్రాజెక్టుగా ఆర్బీకేల అంశాన్ని ఆమె ఎంపిక చేసుకుంది. ఈ వ్యవస్థను అధ్యయనం చేసి ఆర్బీకేల ద్వారా రైతులకు అందిన సేవలపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సమర్పించింది. ఈ ప్రాజెక్టును బర్మింగ్ హాం యూనివర్సిటీ బెస్ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రేయాస్ ఫీల్డ్ అవార్డుతోపాటు గోల్డ్ మెడల్ బహూకరించింది. ఈ గోల్డ్మెడల్ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే అంకితం ఇస్తున్నట్టు నిరోషా సగర్వంగా ప్రకటించడం గమనార్హం. -
దుష్ప్రచారం చేయబోయి అడ్డంగా బుక్కయిన జనసేన!
మలికిపురం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఈ నెల 26న జరిగిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ పర్యటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త పాల్గొన్నాడని.. పవన్ను హత్య చేసేందుకు పర్యటన ఆద్యంతం ఆయన వెనకే తిరిగాడంటూ జనసేన నాయకులు చేసిన హడావుడి వికటించింది. ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ మీద బురదజల్లాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాజోలు దీవిలో బుధవారం పవన్ కల్యాణ్ పర్యటనలో మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన పున్నం నరసింహమూర్తి అనే వ్యక్తి పాల్గొన్నాడు. అతడు వైఎస్సార్సీపీకి చెందిన వాడని, పవన్ను హత్య చేయడానికి రెక్కీ చేశాడని జనసేన నాయకులు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ఆ పార్టీ నాయకులు అమరావతిలోని పార్టీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. తీరా చూస్తే నరసింహమూర్తి జనసేన కార్యకర్తగా నిర్ధారణ అయ్యింది. అసలేం జరిగిందంటే.. గూడపల్లికి చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సుందర శ్రీనుబాబు అనారోగ్యం వల్ల పవన్ పర్యటనకు రాలేదు. అతడి పాస్ మీద నరసింహమూర్తి పవన్ పర్యటనలో పాల్గొన్నాడు. ఈ వివాదానికి రాజోలులో జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు కూడా ఒక కార ణం. పవన్ పర్యటనలో రైతుల సభకు వచ్చే వారికి ఇచ్చే పాస్ల పంపిణీ ఆ పార్టీలోని రెండు వర్గాల మధ్య విభేదాలకు కారణమైంది. పాస్లు పెద్దగా పొందలేకపోయిన ఒక వర్గం.. జనసేన కార్యకర్తలకు కాదని వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పాస్లు ఇచ్చారనే ప్రచారానికి దిగారు. ఇలా పాస్ పొందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పవన్కు హాని కలిగించేందుకు వచ్చారంటూ జనసేన వ్యక్తులే ప్రచారం చేశారు. విచారించిన పోలీసులు నరసింహమూర్తి జనసేన కార్యకర్తేనని, అతనికి ఆ పార్టీ సభ్యత్వం కూడా ఉందని నిర్ధారించడంతో ఆ పార్టీ నాయకులు ఖంగుతిన్నారు. అసలు విషయం బయటపడగానే అందరూ కుక్కిన పేనులా మారిపోయారు. -
నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/వాకాడు: ‘దిత్వా’ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాను ఉత్తర–వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతూ శుక్రవారం రాత్రి సమయానికి పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 510 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. ఆదివారం తెల్లవారుజామున తీవ్రవాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101లను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. -
మూడో దశ ల్యాండ్ పూలింగ్కు వెళ్తాం
సాక్షి, అమరావతి: రాజధానిలో మూడో దశ ల్యాండ్ పూలింగ్కు కచ్చితంగా వెళ్తామని మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. ఎంత భూమి సేకరించాలన్నదానిపై వర్కవుట్ చేస్తున్నామన్నారు. కనీసం మరో 20వేల నుంచి 25వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రెండో విడతలో ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే స్టేషన్, రైల్వేట్రాక్, ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం రాజధాని ప్రాంతంలోని ఏడు గ్రామాల రైతుల నుంచి 16,666.57 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించాలని నిర్ణయించామని తెలిపారు.వీటితోపాటు 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉందన్నారు. రాజధానిలో రాబోయే 30 ఏళ్లకు సరిపడా ప్రజల జీవనస్థితి ఉండేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అమరావతి రాజధానిలో భూముల రేట్లు పెరగాలన్నా, గ్రోత్ రేటు పెరగాలన్నా కచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీలు ఉండాలన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లేనిదే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదని పేర్కొన్నారు. రెండో దశలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడిలో 7,562 ఎకరాలు, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104.57 ఎకరాలు సమీకరిస్తున్నామని చెప్పారు. గతంలోని నిబంధనలే వర్తింపు...ల్యాండ్ పూలింగ్లో భూములిచ్చే రైతులకు గతంలో ఇచ్చిన విధంగానే నిబంధనలు వర్తిస్తాయని నారాయణ చెప్పారు. జరీబు భూములు ఇచ్చిన వారికి నివాస ప్లాటు కింద 1,000 చదరపు గజాలు, వాణిజ్య ప్లాటు కింద 450 చదరపు గజాలు, మెట్ట భూములు ఇచ్చిన వారికి నివాస ప్లాట్ కింద 1,000చదరపు గజాలు, వాణిజ్య ప్లాట్ కింద 250 చదరపు గజాలు కేటాయిస్తామన్నారు. కౌలు కూడా గతంలో మాదిరిగానే చెల్లిస్తామని, పెంచే ఆలోచన లేదని నారాయణ తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి పంపించిన తీర్మానాలను కేబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు.గతంలో స్పోర్ట్స్ సిటీకి 70 ఎకరాలు కేటాయించగా, ఒలింపిక్స్ వంటి ఇంటర్నేషనల్ క్రీడలు నిర్వహించే స్థాయిలో ఈ సిటీని తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం 2,500 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఉండాలని సీఎం నిర్ణయించారని నారాయణ వెల్లడించారు. అందుకోసమే స్పోర్ట్స్ సిటికీ భూ కేటాయింపులు పెంచుతున్నామన్నారు. గతంలో భూములిచ్చిన రైతులందరికీ ప్లాట్లు ఇచ్చామన్నారు. కొన్నిచోట్ల ప్లాట్ల కేటాయింపుపై ఉన్న సమస్యలు నెల రోజుల్లో పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. గ్రామ కంఠాల విషయంలో ఎవరికైనా పొరపాటున ఎక్కువ భూమి ఇచ్చి ఉంటే మళ్లీ వెనక్కి తీసుకుంటామని మంత్రి చెప్పారు. మరోవైపు అసైన్డ్ రైతుల సమస్యను మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తుందని తెలిపారు. -
మరో 20,494.57 ఎకరాల సమీకరణ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణ చేపట్టేందుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో 16,666.57 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రారంభించి రైతుల నుంచి భూమి తీసుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరో 3,828 ఎకరాల అసైన్డ్, పోరంబోకు భూమిని రాజధాని కోసం తీసుకోనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన భూములను సమీకరణలో తీసుకుంటామని, ఇందులో భాగంగా దేవదాయ, వక్ఫ్ భూములున్నా నిబంధనల మేరకు తీసుకుంటామని స్పష్టం చేశారు.⇒ ధాన్యం సేకరణ కోసం మార్క్ఫెడ్ ద్వారా రూ.5,000 కోట్లు రుణం తీసుకునేందుకు ఆమోదం.⇒ ఎస్సీ, ఎస్టీ వర్గాల గృహాలపై సోలార్ రూఫ్ టాప్ కోసం నాబార్డు నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో డిస్కమ్లు రూ.3,762.26 కోట్లు రుణం పొందేందుకు ఆమోదం.⇒ రాష్ట్ర నూర్ బాషా, దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను రద్దు చేసి ఏపీ నూర్ బాషా, దూదేకుల కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటుకు ఆమోదం. ⇒ పట్టణాభివృద్ధి శాఖలో పలు చట్ట సవరణలకు ఆమోదం. పట్టణ స్థానిక సంస్థల్లో రెగ్యులేషన్, డిస్ప్లే కంట్రోల్ డివైజెస్ ఏర్పాటు. నిర్మాణ సమయంలో ఖాళీ భూమిపై పన్ను మినహాయింపు కోసం మునిసిపాలిటీల చట్టం 1965, మునిసిపల్ కార్పొరేషన్ల చట్టం 1955సవరణలకు ఆమోదం.⇒ ఒడిశా పవర్ కన్సార్షియంకు రెండు ప్రాజెక్టులు కేటాయిపు. ⇒ భారత్ నెట్లో భాగంగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు ఆమోదం.⇒ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ బలోపేతంలో భాగంగా 16 పోస్టులు డిప్యుటేషన్/కాంట్రాక్ట్/అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకానికి ఆమోదం.⇒ పోలవరం పనులకు రూ.542.85కోట్లతో పరిపాలన అనుమతి. ⇒ గతేడాది జూన్ 15 వరకు తెల్లపేపర్పై అగ్రిమెంట్ చేసుకున్న చిన్న, సామాన్య రైతుల భూముల లావాదేవీల క్రమబద్ధీకరణకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించేందుకు చట్ట సవరణలకు ఆమోదం.⇒ తిరుపతి రూరల్ మండలం దామినేడులో ఎకరా రూ.2.5 కోట్ల విలువైన భూమి ఉచితంగా స్పోర్ట్స్ అథారిటీకి బదిలీ చేసేందుకు ఆమోదం. ⇒ ఇతర రాష్ట్రాలలో మరణించిన వారి వారసత్వ వ్యవసాయ ఆస్తుల బదిలీ విషయంలో విభజన డీడ్లపై స్టాంప్ డ్యూటీని నిర్దేశిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్కు ఆమోదం.అమరావతి రైతులు పూర్తి సంతృప్తిగా ఉన్నారు!మంత్రులతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యరాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు పూర్తి సంతృప్తిగా ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలను త్వరగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. -
పీపీపీ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ కోటా 50 శాతం
సాక్షి,అమరాతి: పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో చేపడుతున్న ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలల్లో ప్రభుత్వ కోటా కింద 50 శాతం సీట్లు భర్తీ చేసి, మిగతావి యాజమాన్యం, ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. తొలుత 33 ఏళ్లపాటు, తర్వాత మరో 33 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏడాదికి ఎకరానికి రూ.100 చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.ఆ సంస్థలు ఆస్పత్రులను నిర్మాణం చేసుకునే వరకు రెండేళ్లపాటు ప్రభుత్వ బోధనాస్పత్రులను వినియోగించుకునేందుకు అనుమతించారు. అప్పటివరకు ప్రస్తుత ఆస్పత్రుల్లోని సిబ్బంది జీతభత్యాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రీ బిడ్ సమావేశాల్లో పీపీపీ సంస్థలు కోరిన మేరకు ఆర్ఎఫ్పీలో 6 సవరణలను ఆమోదించినట్లు చెప్పారు. కాలేజీలకు 59.89 ఎకరాలు కుదింపు.. పీపీపీ ఆస్పత్రుల్లో 70 శాతం పడకలు ప్రభుత్వ ఆరోగ్య పథకాలకు కేటాయిస్తారు. మిగతా 30 శాతం పడకలకు యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకుంటాయి. గతంలో ఈ నాలుగు కొత్త వైద్య కళాశాలలకు 257.60 ఎకరాలను కేటాయించగా, ఇప్పుడు 197.71 ఎకరాలకు తగ్గించారు. భవిష్యత్తులో డెంటల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ ఇన్స్టిట్యూట్, ఆయుష్, శిక్షణ, పరిశోధన కేంద్రాల అభివృద్ధికి అనుమతిస్తారు. అయితే వాటి నుంచి వచ్చే ఆదాయంలో 3శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. వైద్య కళాశాలలు, ఆస్పత్రులు ప్రభుత్వ, ప్రైవేట్ బ్రాండింగ్తో పని చేస్తాయి. 30 శాతం వరకు ప్రైవేట్ బ్రాండింగ్ ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలుగా పెద్దగా పేరు పెట్టి కింద పీపీపీ సంస్థల పేర్లు పొందుపరుస్తారు. వచ్చే నెల 10వ తేదీ వరకు బిడ్ల సమర్పణకు గడువు ఉంది. డిసెంబర్ 31న బిడ్డర్లను ప్రకటిస్తారు. నియంత్రణ పరిధిలోకి ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రులు అర్హతలు లేని, నకిలీ వైద్యులు ఆస్పత్రులను నిర్వహించకుండా నియంత్రించేందుకు ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రులను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజి్రస్టేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2010 పరిధిలోకి తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రైవేట్ అల్లోపతిక్ ఆస్పత్రులను మాత్రమే ఈ చట్టం కింద నియంత్రిస్తున్నారు. చట్ట సవరణ ద్వారా ఇకపై ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రులను కూడా నియంత్రిస్తారు. దీంతో ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్యం అందించే ప్రైవేట్ ఆస్పత్రులు నియంత్రణ పరిధిలోకి రానున్నాయి. -
రాజధానికి మరో రూ.7,500 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం మరో రూ.7,500 కోట్ల అప్పు చేస్తోంది. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ) నుంచి సీఆర్డీఏ తీసుకునే ఈ అప్పునకు రాష్ట్ర ప్రభుత్వం అసలుకు, వడ్డీకి గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రుణ సంస్థకు ఈ మొత్తం చెల్లించడంలో సీఆర్డీఏ విఫలమైన పక్షంలో ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ మేరకు రుణ ఒప్పందంపై ఆర్థికశాఖ అధికారి సంతకం చేయనున్నారు. సీఆర్డీఏ తన సొంత వనరుల నుంచి రుణసేవలకు బాధ్యత వహిస్తుందని అందులో పేర్కొన్నారు. హామీ ఇచ్చిన మొత్తంపై రెండు శాతం గ్యారెంటీ కమీషన్ సీఆర్డీఏ చెల్లించాలని స్పష్టంచేశారు. దీంతో.. రాజధాని కోసం ఇప్పటివరకు చేసిన అప్పులు రూ.40,000 కోట్లకు చేరాయి. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి... రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే, అందుకు భిన్నంగా భారీగా అప్పులు తెస్తున్నారు. బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. అప్పులు తెస్తూ బడ్జెట్ నుంచి నిధులు విడుదల చేస్తున్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఎలాగవుతుందో ముఖ్యమంత్రికే తెలియాలని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పటి వరకు రాజధాని కోసం ఏ సంస్థ నుంచి ఎంత అప్పు‡అంటే... (రూ.కోట్లలో..) ⇒ ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు 15,000⇒ హడ్కో 11,000 ఎన్ఏబీఎఫ్ఐడీ 7,500⇒ జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ 5,000⇒ ఏపీపీఎఫ్సీఎల్ 1,500⇒ మొత్తం 40,000మంగళవారం మళ్లీ బాబు సర్కారు అప్పు రూ.3,000 కోట్ల రుణాన్ని నోటిఫై చేసిన ఆర్బీఐ సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు మళ్లీ బడ్జెట్ పరిధిలో అప్పు చేస్తోంది. రూ.3,000 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్బీఐ సమీకరించి ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. -
క్రెడిట్ చౌర్యం.. క్యాబినెట్ సాక్షిగా బట్టబయలు!
సాక్షి, అమరావతి: విశాఖకు గూగుల్ రాక వెనుక నిజాలను తొక్కిపెట్టి సంకుచిత బుద్ధితో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించిన వైనం తాజాగా మంత్రివర్గ సమావేశం సాక్షిగా మరోసారి బట్టబయలైంది! విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాంబిల్లి, అనకాపల్లి పరిధిలో అడవివరం, తర్లువాడ గ్రామాలలో 480 ఎకరాలను గూగుల్తో డేటా సెంటర్లకు సంబంధించి వ్యాపార అనుబంధం ఉన్న అదానీకి కేటాయించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడమే దీనికి నిదర్శనం. అదానీ గ్రూపు సంస్థలు అదానీ ఇన్ఫ్రా, అదానీ కోనెక్స్, అదానీ పవర్ లిమిటెడ్ తదితర సంస్థలను గూగుల్ నోటిఫైడ్ పార్టనర్స్గా గుర్తిస్తూ మంత్రివర్గం ఆమోదించడం గమనార్హం. విశాఖలో అదానీ సంస్థ డేటా సెంటర్ నిర్మిస్తుందని.. అందుకోసం భూమి అప్పగించాలంటూ గత అక్టోబర్ 4న రాష్ట ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ లేఖ రాయడం గమనార్హం.జగన్ హయాంలోనే డేటా సెంటర్కు శంకుస్థాపనవిశాఖ నగరాన్ని అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ హయాంలోనే 2020 నవంబర్లో (కోవిడ్ సమయంలో) అదానీ డేటా సెంటర్కు బీజం పడటం.. ఆ తర్వాత 2023 మే 3న అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన జరగడం తెలిసిందే. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం సింగపూర్ నుంచి 3,900 కి.మీ. మేర సముద్రంలో కేబుల్ ఏర్పాటు ప్రక్రియకు నాడే శ్రీకారం చుట్టారు. ఈమేరకు సింగపూర్ ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ హయాంలోనే 2021 మార్చి 9న లేఖ రాయడం గమనార్హం. విశాఖలో అదానీ డేటా సెంటర్కు 190 ఎకరాలు కేటాయించి 2023 మే 3న శంకుస్థాపన చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 1,000 మెగావాట్లకు డేటా సెంటర్ను విస్తరిస్తున్నారు. ఇందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సింగపూర్, కేంద్ర ప్రభుత్వం, అదానీ కృషి ఎంతో ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. అదానీ పేరెత్తితే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని బాబు సంకుచిత బుద్ధితో వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఉద్యోగాలు కూడా ఇచ్చేలా నాడు ఒప్పందం.. డేటా సెంటర్కు అవసరమైన హార్డ్వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తుండగా.. అదానీ గ్రూప్ దాదాపు రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెట్టి దీన్ని నిర్మిస్తోంది. రాష్ట్రానికి గూగుల్ను తెస్తున్నందుకు అదానీకి ధన్యవాదాలు చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇవ్వలేదు. ఆ పేరు చెబితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కృషి గురించి కూడా ప్రస్తావించాల్సి వస్తుందనే భయంతోనే నిజాలను కప్పిపుచ్చి గుట్టుగా వ్యవహరించారు. కేంద్రం, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, అదానీ.. ఇంతమంది కృషితో గూగుల్ రాకకు మార్గం సుగమమైందని చెప్పటానికి చంద్రబాబు సంకోచించారు. కేవలం డేటా సెంటర్ ఏర్పాటు మాత్రమే కాకుండా 25 వేల ఉద్యోగాలు కల్పించాలని ఆ రోజు అదానీతో చేసుకున్న ఒప్పందంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కోరడం గమనార్హం. తద్వారా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందంలో పొందుపరిచింది. -
44వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరించే దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53,748 ఎకరాలు సమీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి భూ దాహం తీరడం లేదు. మలి విడతలో తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లోని 11 గ్రామాల పరిధిలో 44,676.74 ఎకరాల భూమిని సమీకరించే దిశగా అడుగులు వేశారు. గత జూన్ 24న మంత్రివర్గంలో మలి విడత భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. రాజధాని మలి విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జూలై 1న ల్యాండ్ పూలింగ్ స్కీం (భూ సమీకరణ పథకం)–2025 విధి విధానాలు జారీ చేశారు. మొదటి విడత సమీకరణ కింద పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని.. అభివృద్ధి చేసిన నివాస(రెసిడెన్షియల్), వాణిజ్య (కమర్షియల్) ప్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్లో ఆగ్రహావేశాలు గమనించిన చంద్రబాబు సర్కార్ కాస్త వెనక్కు తగ్గినట్లు తగ్గి.. మలి విడత భూ సమీకరణకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచి్చంది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అవి రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక మంత్రి నారాయణ పదేపదే చెబుతూ వచ్చారు. వీటి నిర్మాణానికి భూమి అందుబాటులో లేదని వాపోతూ వచ్చారు. రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాలీటిగా మిగిలి పోతుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలంటే– మలి విడత భూ సమీకరణ తప్పదంటూ గురువారం రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ఇందుకు రైతులు సహకరించకపోతే అమరావతి చిన్న మున్సిపాలీటిగా మిగులుతుందని అన్నారు.మూడో విడత కూడా ఖాయం ఈ నేపథ్యంలో శుక్రవారం కేబినెట్లో రెండో విడత తుళ్లూరు, అమరావతి మండలాల పరిధిలో వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కార్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం, పెద్దపరిమిలో రైతులకు చెందిన 16,666.57 ఎకరాల పట్టా భూమి, మరో 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి వెరసి.. 20,494.57 ఎకరాల భూ సమీకరణకు ఆమోద ముద్ర వేయించారు. మిగతా నాలుగు గ్రామాల్లో (మొతడక, తాడికొండ, కంతేరు, కాజా) 24,182.17 ఎకరాలను మూడో విడతలో సమీకరించడం ఖాయమని అధికార వర్గాలు తెలిపాయి. భూ సమీకరణ మూడో విడత కూడా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేయడం దీన్ని బలపరుస్తోంది. మొత్తంమ్మీద 98,424.74 ఎకరాలలో రాజధాని నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టమవుతోంది. అందుకయ్యే వ్యయాన్ని అప్పుగా తెచి్చ.. రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులతోనే తీర్చాల్సి వస్తుందని ఆరి్థక నిపుణులు తేగిసి చెబుతున్నారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఏమాత్రం కాదన్నది మలి విడత భూ సమీకరణతోనే స్పష్టమైందని చెబుతున్నారు. మిగిలిందన్న 8,250 ఎకరాల మాటేంటి? గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడికొండ, మంగళగరి మండలాల పరిధిలోని 29 గ్రామాలలో రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ కింద 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు 2015లో ప్రభుత్వం సమీకరించింది. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి కలిపి 53,748 ఎకరాల్లో (217 చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించింది. ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు.. మురుగు నీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు కలి్పంచేందుకు.. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చినా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని, దాన్ని అమ్మగా వచ్చే నిధులతో అమరావతి తనను తానే నిర్మించుకుంటుందని సీఎం చంద్రబాబు అనేకసార్లు సెలవిచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ గొప్పలు చెప్పారు. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్కు భూములు లేవని చెప్పడంపై రైతులే విస్తుపోతున్నారు. ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లోనే.. రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని గత ఏప్రిల్ 16న 16వ ఆరి్థక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి రూ.1.50 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన తాజాగా సమీకరిస్తున్న 44,676.74 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తికి మరో రూ.1.5 లక్షల కోట్లు అవసరమవుతాయి. రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఆ రూ.3 లక్షల కోట్లను అప్పుగా తేవాల్సిందే. ఇక వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అవసరమవుతాయో అంచనా వేసుకోవచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజధానా.. రియల్ ఎస్టేట్ వెంచరా? చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మిస్తోందా.. లేక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి వ్యాపారం చేస్తోందా.. అని ఆరి్థక రంగ నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఇప్పటికే సమీకరించిన భూమిలో రాజ«దాని నిర్మాణంపై దృష్టి సారించకుండా.. మలి విడత భూ సమీకరణకు సిద్ధమవ్వడం ఏమిటని నిలదీస్తున్నారు. పదేళ్ల క్రితం రాజధానికి భూములు ఇచి్చన రైతులకు ఇప్పటికీ హామీలు నెరవేర్చలేదని.. అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి18 నెలలైనా, రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్న తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేవని రాజధాని రైతులు బాహాటంగా వ్యాఖ్యానిస్తుండటాన్ని వారు ఎత్తిచూపుతున్నారు. ఈ స్థితిలో మలి విడతగా 44,676.74 ఎకరాల సమీకరణకు సిద్ధమవడంపై అటు రైతులు, ఇటు ఆర్థిక వేత్తలు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.భూముల ధరలు పెంచుకోవడం, కమీషన్లే లక్ష్యం రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవడం కోసం.. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు నిర్మాణ పనులు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకోవడం కోసం మలి విడత రాజధాని భూ సమీకరణకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైందనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీనికి 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న పరిణామాలను నిపుణులు, అధికార వర్గాల వారు ఎత్తిచూపుతున్నారు. సరైన ఆర్థిక ప్రణాళిక (నిధులు ఉన్నాయా లేదా అన్నది చూసుకోకుండా) లేకుండా రాజధాని ప్రాంతంలో 2016–19 మధ్య రహదారులు, మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ స్కీం లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించిన పనులను 55 ప్యాకేజీల కింద రూ.33,476.23 కోట్లకు అప్పగించారు. ఈ పనుల కోసం సీఆర్డీఏ రూ.8,540.52 కోట్లను అప్పు తెచ్చింది. కానీ.. ఆ పనులకు రూ.5,428.41 కోట్లను మాత్రమే 2019 మే నాటికి వ్యయం చేసింది. ఆ పనులు పూర్తి కావాలంటే రూ.28,047.82 కోట్లు కావాలి. ఇప్పుడు ఆ పనులన్నింటినీ ప్రభుత్వం రద్దు చేసింది. 2018–19 ధరలతో పోలి్చతే.. పెట్రోల్, డీజిల్, సిమెంటు, స్టీలు తదితర ధరల్లో పెద్దగా మార్పులేదు. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 50 నుంచి 105% పెంచేసి కొత్తగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని నిర్మాణ పనుల కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు, ఎన్ఏబీఎఫ్ఐడీ నుంచి రూ.7,500 కోట్లు, ఏపీఎస్పీసీఎల్ నుంచి రూ.1,500 కోట్లు వెరసి రూ.40 వేల కోట్లు అప్పు తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. సీఆర్డీఏ బాండ్ల ద్వారా మరో రూ.21 వేల కోట్లు సమీకరించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే.. ఇప్పటికే రూ.61 వేల కోట్లు అప్పులు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఇక 2025–26 బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.6 వేల కోట్లు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే.. రాజధాని కామధేనువు కాదు.. అప్పులకుప్ప అన్నది స్పష్టమవుతోంది. మరి సెల్ఫ్ పైనాన్స్ మోడల్ ఎక్కడ ఉందన్నది పెరుమాళ్లకెరుక! రాజధాని నిర్మాణ పనులు రూ.62 వేల కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే కాంట్రాక్టర్లకు అప్పగించి.. అందులో పది శాతం అంటే రూ.6,200 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పేసి నీకింత–నాకింత అంటూ పెద్దలు పంచుకుతిన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2014–19 మధ్య రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల నుంచి పెద్దల తరఫున కమీషన్లు వసూలు చేస్తూ ఆదాయపు పన్ను శాఖ అధికారులకు దొరికిపోయిన అధికారికే ఇప్పుడూ అదే బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అటు తమ భూముల ధరలు పెంచుకోవడం, ఇటు నిర్మాణ పనుల్లో కమీషన్లు కాజేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు ముందుకు వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఇటీవల జపిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు 5వేల ఎకరాలు, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మాణాన్ని సమీప వ్యక్తులకు కట్టబెట్టి.. కమీషన్లు దండుకునేందుకు వ్యూహం సిద్ధమైందని సమాచారం. -
అమరావతి కోసం మళ్ళీ భూ సేకరణ
సాక్షి, విజయవాడ: అమరావతి కోసం మళ్ళీ భూ సేకరణ చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కోసం శుక్రవారం జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో రైతుల నుంచి 50 వేల ఎకరాల సమీకరణ చేపట్టగా.. ఇప్పుడు రెండో దశలో మరో 20 వేల ఎకరాలపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది.అమరావతి కోసం రైతుల నుంచి 50వేల ఎకరాల భూమి సేకరణ చేపట్టింది. మొదటి దశలో ప్రభుత్వ భూమి 16వేల ఎకరాలను సీఆర్డీఏకు అప్పగించింది. ఇప్పుడు రెండో విడత సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూ సేకరణ చేపట్టనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయి 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,418 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాలను సేకరించనుంది. అసైన్డ్ ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూ సేకరణ ద్వారా సీఆర్డీఏ తీసుకోనుంది. ఈ మేరకు త్వరలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ను సీఆర్డీఏ విడుదల చేయనుంది. -
దోషులు ఎవరో నిగ్గు తేల్చాలి: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విజయవాడ: పరకామణి కేసులో సీఐడీ విచారణకు మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం నాటి ఈవో ధర్మారెడ్డి, సీ.ఎస్.వో నరసింహ కిషోర్లను విచారించిన సీఐడీ అధికారులు.. ఇవాళ వైవీ సుబ్బారెడ్డి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. విచారణ అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారని తెలిపారు. గంటన్నరపాటు జరిగిన విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానన్నారు.మనోభావాలకు సంబంధించి ఇష్యూను పొలిటికల్ ఇష్యూలా మారుస్తున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి, పరకామణి అంశాలను రాజకీయ వివాదాలుగా మార్చారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘‘పరకామణి కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలి. దోషులు ఎవరో నిగ్గు తేల్చాలి. దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడాలి. మీ హయంలో జరిగింది కాబట్టి విచారణకు పిలిచామని చెప్పారు. ఎవరిని పిలిచినా ఎవరిని విచారించినా రాజకీయం చేయొద్దు. తప్పు ఎవరు చేసిన తప్పే తప్పు. చేసినా దోషులను శిక్షించాలని మేము చెప్తున్నాం. నన్ను పిలిచినా, భూమన కరుణాకర్ రెడ్డిని పిలిచినా విచారణ కోసమే పిలిచారు.’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
పెట్టుబడులు.. అంకెల గారడీ.. అదన్నమాట సంగతి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సక్సెస్ అయిందా?లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ఇరవై లక్షల ఉద్యోగాల నుంచి ఏకంగా ఐదేళ్లలో ఏభై లక్షల ఉద్యోగాలు టార్గెట్గా పెట్టినట్లు ప్రకటించడం ఆసక్తికరమైన అంశమే. అంతేకాదు. పదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. వినడానికి విడ్డూరంగా ఉంటుంది. అలా మాట్లాడడమే ఆయన సక్సెస్ మంత్ర అనుకోవాలి. భారీగా అంకెలు, గణాంకాలు చెబితే అది అసత్యమైనా నమ్మేవారు కూడా ఉంటారు.పదిహేనేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇంతవరకు ఎందుకు ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోయారన్న అనుమానం రావచ్చు. కాని ఎప్పటికప్పుడు కొత్త అంకెలు చెబుతూ ఏదో జరుగుతోంది అని భ్రమ కల్పించడమే ఇందులోని లక్ష్యమన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా మారిన మంత్రి లోకేష్ వచ్చే మూడేళ్లలో విశాఖలోనే ఐదు లక్షల ఐటి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తండ్రి బాటలోనే ఆయన కూడా పయనిస్తున్నట్లు అనించడం లేదూ! ఈ సమ్మిట్ లో మొత్తం మీద పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇవన్ని వినడానికి ఎంత బాగుంటాయి. నిజంగానే వాస్తవ రూపం దాల్చితే ఎంత మంచిగా ఉంటుంది అనిపిస్తుంది!గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పారిశ్రామిక సదస్సు జరిగినా చంద్రబాబు నాయుడి ఏకపాత్రాభినయం అధికంగా కనిపించేది. ఈ సారి సదస్సులో కొంత మార్పు కనిపించింది. అదేమిటంటే చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఈ సదస్సులో ప్రముఖంగా మారారు. అంటే ఈ విడత వీరిద్దరూ కలిసి షో నిర్వహించారన్న అభిప్రాయం ఆయా వర్గాలలో కలిగింది. దీనిని పెద్దగా తప్పు పట్టనవసరం లేదు. నిజంగానే టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేసినట్లుగా ఈ పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్ అయినా, పండగలా జరిగినా సంతోషించవచ్చు. కాని ఎప్పుడు ఇలాంటి సదస్సులు సఫలం అయినట్లు అంటే ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చినప్పుడే అన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఈ ఒప్పందాలన్నిటిని మూడున్నరేళ్లలోనే ఆచరణలోకి తెస్తామని చంద్రబాబు తెలిపారు. ఆయన చెప్పిన రీతిలో జరిగితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అలా చేస్తే ఆయనకు భారీ ఎత్తున సన్మానం చేయవచ్చు. కాని గత అనుభవాల రీత్యా చూసినా, వాస్తవాల ప్రకారం పరిశీలించినా అదంత తేలికైన సంగతి కాదు. ఉదాహరణకు ఒక సంస్థ పెట్టుబడి ప్రతిపాదన చేసిన తర్వాత ఏంతో ప్రాసెస్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా చర్యలు తీసుకున్నా, అదొక్కటే సరిపోదు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పారిశ్రామికవేత్తకు ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయవచ్చని, ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని భరోసా ఇచ్చే యత్నం చేసేవారు. ఆయన టైమ్లో పలు పరిశ్రమలు కూడా వచ్చాయి.రెన్యుబుల్ ఎనర్జీలో రికార్డు స్థాయిలో సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో కొన్ని పనులు కూడా ఆరంభించాయి. అయినా చంద్రబాబు మాత్రం గతంలో పరిశ్రమలను తరిమేశారని అంటూ అబద్దాన్ని చెప్పడాన్ని మానుకోవడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలిసినా, అలాంటి వ్యాఖ్యలను పారిశ్రామికవేత్తల ముందు చేయడానికి వెనుకాడకపోవడం దురదృష్టకరం. అంటే వచ్చేసారి వైఎస్సార్సీపీ గెలిస్తే ఎలా అని పెట్టుబడిదారులలో ఉన్న సందేహం అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రచారం చేశారు. దీనిని పారిశ్రామికవేత్తలు నమ్మితే ఇప్పుడు పెట్టుబడులు ఎందుకు పెడతారు అంతేకాదు.. ప్రముఖ పారిశ్రామికేత్త జిందాలపై తప్పుడు కేసు పెట్టి వేధించే యత్నం కూటమి సర్కార్ చేసిందా?లేదా?ఆయన ఏపీకి రాకుండా మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్డడానికి ఎందుకు సిద్ధమయ్యారు. లోకేష్ విరచిత రెడ్ బుక్ ప్రబావం గురించి పారిశ్రామికవేత్తలకు తెలియదా! నిజానికి చంద్రబాబు టైమ్లో వచ్చిన పరిశ్రమలకన్నా అధికంగా జగన్ టైమ్లోనే గ్రౌండ్ అయ్యాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం వచ్చినా అనేకమంది పారిశ్రామికవేత్తలను ఆయన ఏపీకి రప్పించగలిగారు. జగన్ ప్రభుత్వ టైమ్లో జరిగిన సమ్మిట్ లో రిలయన్స్ ముకేష్ అంబానీ వచ్చి భారీ పెట్టుబడిని ప్రతిపాదించారు. జగన్ చెంతనే కూర్చుని సదస్సుకు నిండుదనం తెచ్చారు. మరి ఇప్పుడు అంబానీ ఎందుకు రాలేదో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమ్మిట్లో పాల్గొనకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఆదిత్య మిట్టల్, నవీన్ జిందాల్, బివిఆర్ మోహన్ రెడ్డి, భంగర్, కరణ్ అదానీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు టీడీపీ కూటమి హయాంలో జరిగిన సమ్మిట్లో కరణ్ అదాని తప్ప మిగిలిన ప్రముఖులు పలువురు ఎందుకు రాలేదో తెలియదు. కరణ్ అదాని తన ప్రసంగంలో ఏమి చెప్పారు?. విశాఖలో వస్తున్నది అదాని డేటా సెంటర్ అని, దానికి గూగుల్ భాగస్వామి అవుతోందని ప్రకటించారా?లేదా? దానిపై చంద్రబాబు, లోకేష్లు కిమ్మనలేకపోయారే? ఆదాని డేటా సెంటర్ తో పాటు ఐటి బిజెనెస్ సెంటర్ కు ఆనాడు జగన్ శంకుస్థాపన చేసిన సంగతి విస్మరించి, అంతా గూగుల్ డేటా సెంటర్ అనుకోవాలని ప్రయత్నించి భంగపడడం ప్రభుత్వానికి ఏ పాటి మర్యాద అవుతుంది.ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లిఖార్జునరావు తదితరులు అప్పుడూ వచ్చారు. ఇప్పుడూ వచ్చారు. 2014-19 టరమ్లో కూడా చంద్రబాబు సదస్సులు నిర్వహించారు. ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు, నలభై లక్షల ఉద్యోగాలు వస్తాయని తెగ ప్రచారం చేశారు. ఆ పెట్టుబడుల ప్రగతి గురించి చంద్రబాబు ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించి, తదుపరి మళ్లీ ఏభై లక్షల ఉద్యోగాలు అన్నా, కోటి ఉద్యోగాలు అన్నా జనం నమ్ముతారు. అంతే తప్ప ప్రజలను మభ్య పెట్టడం కోసం ఇలా లక్షల ఉద్యోగాలు అని చెబితే చివరికి కూటమి ప్రభుత్వానికే నష్టం అన్న సంగతి మర్చిపోకూడదు.కాకపోతే ఎప్పటి ప్రచారం అప్పటికే అన్నట్లుగా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుంటారు. గతంలో జగన్ టైమ్లో రెన్యూ పవర్, హీరో ఫ్యూచర్స్, ఎనర్జీస్, వంటి కొన్ని సంస్థలు సుమారు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేశాయి. మళ్లీ అవే ఒప్పందాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా తిరిగి కుదుర్చుకుందన్న వార్తలు వచ్చాయి. ఈ ఏడాదిన్నర కాలంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు చెప్పడం ఆరంభించారు. చంద్రబాబు స్టైల్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇప్పుడు దానినే లోకేష్ కూడా ఫాలో అవుతున్నారు.ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు బ్రాండ్ చూసి పరిశ్రమలవారు తరలి వచ్చేస్తారని టీడీపీ నేతలు చెబుతుంటారు. తీరా చూస్తే ఆ బ్రాండ్ విలువ ఎంతో తెలియదు కాని, విశాఖ వంటి కీలకమైన ప్రాంతంలో ఎకరా 99 పైసలకే కంపెనీలకు లీజుకు ఇవ్వవలసి వస్తోంది. వేల కోట్ల రాయితీలు ఇచ్చి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాలవారు చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అని, ఈ పద్దతి వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా విధ్వంసం అవుతాయని చెప్పుకుంటున్నారని ఒక వ్యాసకర్త పేర్కొన్నారు. చంద్రబాబులో ఉన్న విశిష్టత ఏమిటంటే తాము చేస్తే అది ప్రజలకు ఉపయోగం, ఎదుటివారు చేస్తే విధ్వంసం అని ప్రచారం చేస్తుంటారు.ఉదాహరణకు రిషికొండపై జగన్ అద్బుతమైన రీతిలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతిన్నదని విషం చిమ్మారు. రిషికొండను గుండు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు అవే కొండలను ప్రైవేటు కంపెనీలకు ఇస్తామని, సముద్రం ఎదురుగా ఉండే ఈ కొండలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయని చెబుతున్నారు. ఇలా ఉంటుంది ఆయన తీరు. ఏది ఏమైనా ఈ సమ్మిట్ లోకేష్కు మంచి ఎలివేషన్ ఇచ్చుకోవడానికి బాగానే ఉపయోగపడిందని అనుకోవచ్చు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
మహాత్మా జ్యోతిరావ్ పూలేకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావ్ పూలేకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. మహిళా విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే గారు. తన సతీమణి సావిత్రి బాయిని చదివించి ఈ దేశపు మొదటి మహిళా టీచర్గా నిలబెట్టిన దార్శనికుడు ఆయన. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.మహిళా విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే గారు. తన సతీమణి సావిత్రి బాయిని చదివించి ఈ దేశపు మొదటి మహిళా టీచర్గా నిలబెట్టిన దార్శనికుడు ఆయన. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మ… pic.twitter.com/eNgDWAJ2n8— YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2025తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి, మంగళగిరి ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ నేతలు హాజరయ్యారు. -
పర్యాటక రంగంలో రాపిడో సేవలు
సాక్షి, అమరావతి: పర్యాటక రంగంలో రాపిడో సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ‘డ్రైవర్–కం–గైడ్’ సేవలను అందించనుంది. ఈ మేరకు సీఐఐ సదస్సుల్లో రాపిడో సహ–వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లితో పర్యాటక శాఖ ఒప్పందం చేసుకోగా, సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు గురువారం పర్యాటక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.మంచి రేటింగ్ ఉన్న డ్రైవర్లను ఎంపిక చేసి, వారికి రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, ఆతిథ్యం, భద్రతపై వచ్చే నెల నుంచి ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. త్వరలోనే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఈ సేవలు ప్రారంభించనుంది. రాపిడో యాప్లోనే టూరిస్ట్ ఆటోలు/క్యాబ్లు, పర్యాటక సర్క్యూట్ల వివరాలు అందుబాటులో ఉంచనుంది. -
వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో అప్రూవర్లుగా మారుతామని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితులైన అప్పటి ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ స్పెషలాఫీసర్ దొడ్డా వెంకట సత్యప్రసాద్ దాఖలు చేసిన వ్యాజ్యాలను వ్యతిరేకిస్తూ మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్లలో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు కూడా వినాలని హైకోర్టును కోరారు. వీరివురి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈ నెల 28వ తేదీన (శుక్రవారం) హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో చెవిరెడ్డి తాజా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలోని ముఖ్యాంశాలు ఇవీ.. బెయిల్తో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ‘మద్యం అక్రమ కేసులో 2, 3 నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారి ముందస్తు బెయిల్ పొందితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. వారికి ముందస్తు బెయిలిస్తే అది కేసుతో పాటు ట్రయల్పై, సహనిందితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వీరిద్దరూ ఇచి్చన వాంగ్మూలాలు నమ్మదగినవి కావు. అందువల్ల వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులో ట్రయల్ మొత్తం పూర్తయ్యేంత వరకు వారిద్దరినీ కస్టడీలోకి తీసుకోవాలి. వారికి ముందస్తు బెయిల్ నిష్పాక్షిక దర్యాప్తు సూత్రాలకు విరుద్ధం. దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 150 మంది సాక్షులను విచారించారు. 50 మందిని ఈ కేసులో చట్ట విరుద్ధంగా నిందితులుగా చేర్చారు.తప్పు చేయకపోయినా కొందరు నిందితులు ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం ఈ కేసులో పబ్లిక్ సర్వెంట్లుగా వీరిద్దరి పాత్ర కీలకం. అయితే ఇప్పటికీ వారిని అరెస్ట్ చేయలేదు. వారిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. దర్యాప్తు సంస్థ రాజ్యాంగంలోని అధికరణ 14, 20, 21 నిర్దేశించిన నిష్పాక్షిక దర్యాప్తు సూత్రాలను ఉల్లంఘించినట్లు దీని ప్రకారం అర్థం అవుతోంది.ఈ అక్రమ కేసులో కొందరిపై రాజకీయ కక్ష సాధింపు3లకు వీరిరువురి వాంగ్మూలాలను వినియోగించుకోవాలని బాబు సర్కార్ కనుసన్నల్లోని దర్యాప్తు సంస్థ కుట్ర పన్నుతోంది. ప్రధాన నిందితులుగా ఉన్న వారిని రక్షిస్తోంది. న్యాయపరమైన పర్యవసానాల నుంచి కాపాడుతోంది. ఇదే విషయంలో వీరు దాఖలు చేసిన పిటిషన్లను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో వారిద్దరూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు’ అని భాస్కర్రెడ్డి ఆపిటిషన్లలో వివరించారు. -
వైఎస్సార్ కడప జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
సాక్షి కడప: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటన గురువారం ముగిసింది. పులివెందులలోని క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం ఆయన బయలుదేరి వెళ్లారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ తొలిరోజు పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలు, పార్టీ నాయకులతో మమేకమయ్యారు.రెండో రోజు పులివెందుల పరి«ధిలోని బ్రాహ్మణపల్లె సమీపంలో అరటి తోటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. పలువురు నేతలను పరామర్శించడంతోపాటు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మూడోరోజు కూడా ఇల్లు, కార్యాలయం వద్ద వేచి ఉన్న ప్రజలతో మమేకమయ్యారు. -
ఉచితంగా విద్య, వైద్యం ప్రభుత్వం బాధ్యతే
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్య, పేదలకు వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను అందజేసేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్మెంట్ కోరుతూ గురువారం విజయవాడలో ఆయన్ని కలిశారు. అనంతరం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావులతో కలసి బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులతో పాటు ప్రజాసంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి గవర్నర్కి సమర్పించనున్నట్లు బొత్స పేర్కొన్నారు. తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కూటమి నేతలు కూడా పాల్గొన్నట్లు చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.ప్రజారోగ్యం ప్రభుత్వం చేతుల్లో ఉండాలే గానీ ప్రైవేటు ఆధీనంలో ఉంటే ప్రజలకు న్యాయం జరగదు. ప్రజారోగ్యం కోసం పరితపించిన వ్యక్తిగా వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐదు కాలేజీలు పూర్తై తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్ జగన్కు పేరు వస్తుందన్న అక్కసుతోనే మిగిలిన వాటిని సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారు. స్కూలు పిల్లలకు ఉచితంగా ట్యాబులిస్తే గేమ్స్ ఆడుకుంటారని మాక్ అసెంబ్లీలో విద్యార్థులతో చెప్పించడం సిగ్గుచేటు.ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చూశాం. ఈ క్రమంలో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి రూ.500 కోట్లు కేటాయించి, ప్రభుత్వ నిధులతో పాటు వివిధ ఆర్థిక సంస్థలతో టై అప్ చేసి పనులు ప్రారంభించాం. మెడికల్ కాలేజీలకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించే ఏర్పాట్లు చేశాం. దురదృష్టవశాత్తూ ప్రభుత్వం మారిన తర్వాత మెడికల్ కాలేజీలని్నంటినీ పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల్లో 30 శాతం పేదలకు చికిత్స చేయాలన్న నిబంధన ఉన్నా ఎక్కడా అమలు కాని పరిస్థితి నెలకొంది.వైఎస్సార్ పేదవాడు కూడా ధనవంతుడితో సమానంగా వైద్య చికిత్స పొందాలన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైఎస్ జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 2 వేల వరకు అదనపు ప్రొసీజర్లను చేర్చడంతో పాటు ఉచిత చికిత్స పరిధిని రూ.25 లక్షల వరకు విస్తరించారు. ఈ ప్రభుత్వానికి పేదలపై ఇంత కక్ష ఎందుకు? నెలకు రూ.300 కోట్లు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేయలేదా? బిల్లులు విడుదల కాకపోవడంతో నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేదవాళ్లకు చికిత్స అందని పరిస్థితి నెలకొంది. పథకాన్ని నీరుగార్చి బీమా పరిధిలోకి తెస్తామంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 60 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాం. రూ.14 వేల కోట్లు ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించాం. ఇంత డబ్బు ప్రైవేటు సంస్థలు అందిస్తాయా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రజారోగ్యం నాశనం అయిపోయినా ఫర్వాలేదు అనుకుంటున్నారా? ఇది దోపిడీ కాదా? రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేశారు. ఏ పంటకూ మద్దతు ధర లేదు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రాయలసీమలో అరటి పంట తీవ్ర సంక్షోభంలో పడింది. 18 నెలలుగా శాంతి భద్రతలు దిగజారాయి. సంక్షేమ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని పిల్లలు అనారోగ్యం పాలై చనిపోతున్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం పేరు ఉచ్ఛరించడానికి కూడా కూటమి ప్రభుత్వానికి అర్హత లేదు. రాజ్యాంగం అంటే కేవలం అధికార పార్టీలో ఉన్న ముగ్గురేనా? ప్రతిపక్ష నేతలను, వారి ఉనికిని కూడా భరించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం చంద్రబాబూ? పవన్ కళ్యాణ్ గతంలో ఆయన చేసిన ప్రసంగాలను ఒక్కసారి మళ్లీ వింటే బాగుంటుంది. ఆయన బూతులు మాట్లాడితే ఒప్పా? కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. ఆ తర్వాత కూడా అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు? ఒక డీఎస్పీ అవినీతిపరుడని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు? -
సర్కారు నిర్లక్ష్యం.. గిరిజన విద్యార్థులకు సంకటం
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు గిరిజన బిడ్డల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. నాడు – నేడుతో ప్రైవేట్ స్కూళ్లను మించి సదుపాయాలు కల్పించిన ప్రభుత్వ పాఠశాలలను ప్రస్తుతం కనీసం రక్షిత మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితికి దిగజార్చింది. ఫలితంగా గిరిజన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లో మరణ మదంగం మోగుతోంది. వరుసగా పిల్లలు మత్యువాత పడుతున్నా.. వందల మంది అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నా పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోకపోవడం నివ్వెరపరుస్తోంది.» పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో మంచినీటి ఆర్వో ప్లాంట్ పని చేయకపోవడంతో విద్యార్థులు పచ్చకామెర్ల బారి న పడ్డారు. సుమారు 184 మంది అస్వస్థతకు గురి కాగా చిన్నారులు పువ్వల అంజలి (కంబగూడ), తోయక కల్పన (దండనూరు) కామెర్లు ముది రిపోయి మత్యువాత పడ్డారు.» అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పరిధిలోని డుంబ్రిగుడా మండలం జామిగూడ గిరిజన బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం (పాడైన గుడ్లు కూర) తిని 60 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారు.» అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ప్రైవేట్ ట్రస్ట్ హాస్టల్లో కలుషిత ఆహారం (మిగిలిపోయిన సాంబార్ అన్నం) తిని ముగ్గురు గిరిజన విద్యార్థులు (శ్రద్ధ, జాషువా, నిత్య) చనిపోయారు. 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.కలుషిత నీరు, ఆహారమే కారణం..! చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్వతీపురం సమీకత గిరిజనాభివద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో 14 మంది, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఒకరు, పాడేరు ఐటీడీఏ పరిధిలో ఏడుగురు మతి చెందినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది మరింత అధికంగా ఉంటుందని అంచనా. వీరంతా కలుషిత నీరు తాగడం, నిల్వ ఆహారం తినడం, పారిశుధ్య లోపం, సకాలంలో సరైన వైద్యం అందకపోవడం లాంటి ప్రధాన కారణాల వల్లే మతి చెందారన్నది తేటతెల్లమవుతోంది. విద్యార్థుల మరణాలను అరికట్టాలంటూ కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో ఆందోళనలు నిర్వహించారు.ఏఎన్ఎంల నియామకం ఎప్పుడు? ఏజెన్సీలోని 558 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు ఒకరు చొప్పున ఏఎన్ఎంలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రతి సందర్భంలో చెబుతున్నా అడుగు ముందుకు పడలేదు. ప్రతి వంద మంది విద్యార్థులకు ఒక ఏఎన్ఎంను నియమిస్తే తక్షణం ప్రాథమిక వైద్యం అందించడంతోపాటు ఆరోగ్య సమస్య తీవ్రతను గుర్తించి ఆస్పత్రికి తరలించేలా అప్రమత్తం చేసే వీలుంది. విద్యాసంస్థల్లో పారిశుధ్య నిర్వహణ, ఆహార నాణ్యతను ఏఎన్ఎంల ద్వారా పరిశీలించవచ్చు. వరుస ఘటనలతో గ్రామ సచివాలయాల్లో అరకొరగా ఉన్న ఏఎన్ఎంలను ఆయా విద్యా సంస్థల్లో తాత్కాలిక సేవలు అందించాలని ఆదేశించారు.మంత్రి బాధ్యతారాహిత్యం..! గిరిజన విద్యా సంస్థలు, హాస్టళ్లలో మంచినీటి (ఆర్వో) ప్లాంట్లు, మరుగుదొడ్లు, భవనాల మరమ్మతులకు కేవలం రూ.వంద కోట్లు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మాత్రమే కేటాయించడంతో సమస్యలు తప్పడం లేదు. 558 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో 1.35 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఇంతమంది గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి పాఠశాలలో పిల్లలు జ్వరాలు, పచ్చ కామెర్లతో బాధపడుతున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబు కేసుల కొట్టివేతపై కోర్టులో వాగ్వాదం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబుపై గతంలో నమోదైన కేసుల కొట్టివేతపై పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి మధ్య కోర్టులో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు కేసులో సాక్షులు ప్రభుత్వోద్యోగులు కావడంతో వారిని భయపెట్టి కేసులు కొట్టివేయించుకుంటున్నారని, అలా కొట్టేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు. దీంతో.. ఈ కేసులతో సంబంధంలేని వ్యక్తులు సర్టిఫైడ్ కాపీలు ఎలా అడుగుతారని పీపీ అభ్యంతరం తెలిపారు. ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసు అని, సర్టిఫైడ్ కాపీలు థర్డ్ పార్టీ ఎవరైనా కోరవచ్చని పొన్నవోలు చెప్పారు. ఇందుకు సంబం«ధించి గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. సాక్షులను ప్రభావితం చేసి, వారిని భయపెట్టి చంద్రబాబు కేసులు కొట్టివేయించుకుంటున్నారంటూ కోర్టులో ఆయన బలంగా వాదనలు వినిపించారు. ముఖ్యంగా అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై నమోదైన కేసుకు సంబంధించి గురువారం పీపీకి, పొన్నవోలుకు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అసైన్డ్ భూముల కేసు కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో తాము థర్డ్ పార్టీకి ఇచ్చేదిలేదని లిఖితపూర్వకంగా చెప్పాలని పొన్నవోలు కోరారు. -
జాయింట్గా ‘దండు’కో..!
సాక్షి, అమరావతి: అనుభవం, అర్హతా లేని అస్మదీయ కంపెనీకి భారీ కాంట్రాక్టు కట్టబెట్టేందుకు సర్కారు పెద్దలు నిబంధనలు తుంగలోతొక్కారు. మరో కంపెనీని జత చేసి మరీ జాయింట్గా దండుకునేలా చక్రం తిప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ టెండర్లలో జరిగిన ఈ గోల్మాల్ ఇంజినీరింగ్ నిపుణులను సైతం విస్తుపోయేలా చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో భారీఎత్తున ముడుపులు చేతులు మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత సన్నిహిత సంస్థ కాబట్టే..! జలవనరుల శాఖ టెండర్ నిబంధనల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ టెండర్లలో పనులు అప్పగించాలంటే సదరు కాంట్రాక్టు సంస్థ 2015–16 నుంచి 2024–25 వరకూ ఏదైనా ఒక ఏడాదిలో రూ.148.16 కోట్ల విలువైన కాలువ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులను ప్రధాన కాంట్రాక్టర్గా పూర్తి చేసి ఉండాలి. కానీ.. కేఎమ్వీ ప్రాజెక్ట్స్ సంస్థకు ప్రధాన కాంట్రాక్టర్గా ఆ మేరకు అనుభవం లేదు. ఆ సంస్థ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడిది. అదే సంస్థకు పనులు కట్టబెట్టాలని టెండర్ నోటిఫికేషన్ ముందే నిర్ణయం జరిగిపోయినట్టు కాంట్రాక్టు వర్గాలు చెబుతున్నాయి. దీంతో జీడీఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థతో కేఎమ్వీ ప్రాజెక్ట్స్ సంస్థను జత కట్టించి.. జాయింట్ వెంచర్(జేవీ)గా ఏర్పాటుచేసి కాంట్రాక్టు విలువ రూ.370.42 కోట్ల కంటే 4.59 శాతం అధిక ధర అంటే రూ.387.42 కోట్లకు కోట్ చేయించి బిడ్ దాఖలు చేయించారు. అదే సంస్థ ఎల్–1గా నిలవడంతో పనులను కట్టబెట్టారు. దీని వల్ల ఖజానాపై అదనంగా రూ.17 కోట్లకుపైగా భారం పడింది. అంచనాల దశలోనే పనుల వ్యయాన్ని పెంచేసి.. అధిక ధరలకు అస్మదీయునికి కట్టబెట్టేలా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులు తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసి.. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 4,47,300 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి.. అధిక శాతం పనులు పూర్తి చేశారు. అనంతరం కీలకమైన సొరంగాల పనులను రూ.1,046.46 కోట్లు ఖర్చు చేసి గత సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. కిలోమీటర్ లైనింగ్కు రూ.17కోట్లు!శ్రీశైలం జలాశయం నుంచి సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు కృష్ణా జలాలు తరలించడానికి 23 కిలోమీటర్ల పొడవున 11,585 క్యూసెక్కులు తరలించేలా ఫీడర్ చానల్నూ ఇప్పటికే తవ్వారు. 2014 నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల ఫీడర్ కెనాల్ గట్లు 0 కిలోమీటర్ల నుంచి 21.8 కిలోమీటర్ల వరకు కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి. ఫీడర్ కెనాల్ గట్లు బలహీనంగా ఉన్న చోట కాంక్రీట్ రిటైనింగ్ వాల్, మిగతా ప్రాంతాల్లో కాంక్రీట్ లైనింగ్ చేసే పనులకు రూ.370.42 కోట్లను కాంట్రాక్టు అంచనా విలువగా నిర్ణయించి, అక్టోబర్ 1న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులను 15 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ పనులకు అంచనాల దశలోనే భారీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిలోమీటర్ లైనింగ్కు రూ.17 కోట్లను అంచనాగా నిర్ణయించడం గమనార్హం. అస్మదీయునికి పనులు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచేసే ఎత్తుగడలో భాగంగానే అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసేలా చక్రం తిప్పారని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ముందే అనుకున్నట్లుగా అంచనా వ్యయాన్ని పెంచి.. అధిక ధరలకు అస్మదీయునికే ఆ పనులు కట్టబెట్టారు. -
పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్
సాక్షి, అమరావతి: పోలవరం–బనకచర్ల అనుసంధానం(లింక్) ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి పోలవరం–నల్లమలసాగర్ వరకే పరిమితం చేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు చేపట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీతోపాటు కేంద్రప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులు తెచ్చేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించే పనులకు జలవనరులశాఖ గురువారం టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. కాంట్రాక్టు విలువను రూ.7,68,33,372గా నిర్ణయించింది. ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో ఏడాదిలోగా ఈ పనులు పూర్తిచేయాలని నిర్దేశించింది. ఈ టెండర్లో బిడ్ల దాఖలుకు డిసెంబర్ 11వ తేదీని తుదిగడువుగా తెలిపింది. డిసెంబర్ 17న ఆర్థిక బిడ్ తెరిచి.. తక్కువ ధరకు కోట్చేసి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనుంది. డీపీఆర్ తయారీలో భాగంగా లైడార్ సర్వే చేయాలని నిర్దేశించింది. ఈ లింక్ ప్రాజెక్టును మూడుభాగాలుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో పోలవరం నుంచి కృష్ణానదిలోకి, రెండోదశలో కృష్ణా నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు, మూడోదశలో బొల్లాపల్లి నుంచి నల్లమలసాగర్కు గోదావరి జలాలు తరలించేలా పనులు చేపట్టాలని నిర్ణయించింది. లైడార్ సర్వేలో ఈ మూడు భాగాల్లో అలైన్మెంట్ను ఖరారు చేసి గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు ఏర్పాటుచేయాలని.. పనులు చేపట్టడానికి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయాలని టెండర్లలో షరతు విధించింది. గతనెలలో పిలిచిన టెండర్లు రద్దు సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ తయారీ, అవసరమైన పరిశోధనలు, కేంద్రం నుంచి చట్టపరమైన అనుమతులు పొందడానికి సహకారం అందించే పనులకు అక్టోబర్ 7న జారీచేసిన నోటిఫికేషన్కు సంబంధించిన టెండర్లను జలవనరులశాఖ రద్దుచేసింది. రూ.9.20 కోట్ల విలువైన ఈ పనులకు బిడ్ల దాఖలు గడువు గత నెల 22తో ముగిసింది. కానీ.. ఎవరూ బిడ్లు దాఖలు చేయకపోవడంతో ఆ టెండర్లను రద్దుచేసింది. ఇప్పుడు ఆ లింక్ ప్రాజెక్టును పోలవరం–నల్లమలసాగర్కే పరిమితం చేసి డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. ఇకపోతే.. పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి మే 22న పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజుబులిటీ రిపోర్టు)ను రాష్ట్ర జలవనరులశాఖ సమరి్పంచింది.. దీనిపై సీడబ్ల్యూసీ బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు.. గోదావరి, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అభిప్రాయాలను కోరింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి పర్యావరణ ప్రభావ అంచనా (ఈఏఐ)పై అధ్యయనం చేయడానికి నియమ, నిబంధనల (టీవోఆర్) రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర అటవీ, పర్యావరణశాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) జూన్ 30న తోసిపుచి్చంది. గోదావరి నదిలో వరద జలాల లభ్యత.. అంతర్రాష్ట్ర అనుమతి తీసుకున్న తర్వాతే టీవోఆర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు పనుల నిమిత్తం పర్యావరణ, వైల్డ్లైఫ్ (వన్యప్రాణులు), అటవీ అనుమతుల కోసం అవసరమైన నివేదికల తయారీ పనులను జనవరి 26న రూ.1.77 కోట్లకు ఎస్వీ ఎన్విరో ల్యాబ్స్ అండ్ కన్సల్టెంట్స్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. పోలవరం–బనకచర్ల డీపీఆర్ టెండర్పై వాస్తవ పరిస్థితి చెప్పండిరాష్ట్ర ప్రభుత్వానికి గోదావరి బోర్డు మరోసారి లేఖసాక్షి, అమరావతి : పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి జారీచేసిన టెండర్ నోటిఫికేషన్పై వాస్తవ పరిస్థితి ఏమిటో వారంలోగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి రంగస్వామి అజగేశన్ గురువారం మరోసారి లేఖ రాశారు. ఇదే అంశంపై గతనెల 16న లేఖ రాశామని.. కానీ, స్పందనలేదని అందులో గుర్తుచేశారు. తక్షణమే ఆ టెండర్ వాస్తవ పరిస్థితిని తెలపాలని ఆయన కోరారు. -
బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుపాను
సాక్షి, అమరావతి: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తుపాను ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ తుపానుకు యెమెన్ దేశం ‘దిత్వా’(అక్కడి ప్రసిద్ధ జలాశయం దిత్వా లగూన్ పేరు మీద)గా నామకరణం చేసినట్లు పేర్కొంది. దీని ప్రభావం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీరాలపై ఉంటుందని తెలిపింది. గడిచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో తుపాను ముందుకు కదులుతోందని వెల్లడించింది. ట్రింకోమలీ(శ్రీలంక)కి 200 కి.మీ, పుదుచ్చేరికి 610 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. కాగా, ఈ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ముందు జాగ్రత్తలు తీసుకోండి తుపాను నేపథ్యంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాలు, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ధాన్యం తడవకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. తుపాను సమాచారాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. ధాన్యం తడిచిపోయి.. తక్కువ ధరకు రైతులు బయట విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే సంబంధిత జాయింట్ కలెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడాలని ఆదేశించారు. -
ధాన్యం.. దళారుల భోజ్యం!
ఈ చిత్రంలో కనిపిస్తున్న ధాన్యం ఆరబోసిన దృశ్యం చంద్రబాబు క్యాబినెట్లోని మంత్రి పార్థసారథిని అవాక్కయ్యేలా చేసింది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంబాడు గ్రామం నుంచి పామర్రు సెంటరు–గుడివాడ వెళ్లే రహదారిలో ఈ దృశ్యం కనిపించింది. కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది. వ్యవసాయ కుటుంబాలన్నీ రోడ్లపై ధాన్యాన్ని పోసి పగలంతా ఆరబెట్టుకోవడం.. రాత్రి అయితే అక్కడే చలిలో కాపలా ఉండటం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులు 75 కిలోల బస్తాను రూ.వెయ్యికి కొనుగోలు చేస్తున్న దుస్థితి. బుధవారం ఈ రహదారిలో వెళ్తున్న మంత్రి పార్థసారథి రోడ్లపై ధాన్యాన్ని చూసి కారు దిగేసరికి.. అన్నదాతలు ఆయన్ను చుట్టుముట్టి నిలదీశారు. మిల్లర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వాహనాలు రాక ధాన్యం కొనుగోలు చేయట్లేదని, రంగు మారిన ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని వాపోయారు. మంత్రి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. మోంథా తుపానుతో అతలాకుతలమైన ధాన్యం రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం డబుల్ గేమ్ అడుతోంది.. ఓ వైపు నష్టపోయిన రైతులకు రూపాయి పరిహారం ఇవ్వకపోగా, ఇప్పుడు అంతంత మాత్రంగా చేతికందిన పంటను కొనుగోలు చేయడంలో దళారులకు మేలు జరిగేలా అంతర్గతంగా సహకరిస్తోంది.. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పి.. నిర్దయగా తిరస్కరిస్తోంది.. గోనె సంచులు లేవు.. టార్పాలిన్లు లేవు.. రవాణా వాహనాలు లేవు.. కొనుగోలు కేంద్రాలు లేవు.. ఈ ఇబ్బందులన్నీ అధిగమించి రైతులు ధాన్యాన్ని అమ్ముకుందామంటే కనీస మద్దతు ధర కూడా లేదు.. ఈ దళారీ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేస్తున్నది మరొకటని అన్నదాతలు దుమ్మెత్తిపోస్తున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ధాన్యం సేకరణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి వదిలేసింది. రెండు మూడు గ్రామాలకు ఒక దళారి చొప్పున అప్పగించి, అందినకాడికి దోచుకోమని పచ్చ జెండా ఊపింది. సంచులు, లారీలు, ధర విషయంలోనూ వారికి పూర్తి స్వేచ్ఛ ఇచి్చంది. మొత్తంగా ధాన్యం కొనుగోలు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్న వారు అతి తక్కువ ధరకు అడుగుతుండటం ఊరూరా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దళారులు, మిల్లర్లు చెప్పిన రేటుకు అమ్ముకోవడం తప్ప అన్నదాతలకు మరో మార్గం లేకుండా చేసింది. రైతు నేరుగా మిల్లులోకి ప్రవేశించే పరిస్థితి లేకుండా కుతంత్రం సాగిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఏ దశలోనూ ప్రభుత్వ పర్యవేక్షణ అన్నదే లేదు. ధాన్యం కొనాలనే చిత్తశుద్ధి అంతకంటే లేదు. రాష్ట్రంలో రైతులకు చంద్రబాబు సర్కార్ కంటి మీద కునుకు లేకుండా చేయడంతో పాటు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కలి్పంచకుండా నిలువునా దోపిడీ చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు దళారుల దందాకు వత్తాసు పలుకుతూ రైతులను నిలువునా ముంచేస్తోంది. కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోగా, రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకవైపు ఖరీఫ్లో ధాన్యం కోతలు ఊపందుకున్నా, మరోవైపు కొనుగోళ్లు మాత్రం ముందుకు కదలట్లేదు. ఇటీవల వరుస వాయు గుండాలు, మోంథా తుపాన్ రైతులను తీవ్రంగా దెబ్బ తీశాయి. మిగిలిన అరకొర పంటలను చేజిక్కించుకున్నా, అమ్ముకునే పరిస్థితి లేదు. రైతు భరోసా కేంద్రాలు, సొసైటీలు ఉత్సవ కేంద్రాలుగా మారాయి. కనీసం పంట పట్టుబడికి గోనె సంచులూ సమకూర్చలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వ యంత్రాంగం మిన్నకుండిపోయింది. ఫలితంగా రోజుల తరబడి రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి ఎత్తుకోవడం.. లేదా దళారులు అడిగిన రేటుకు ఇచ్చేయడం తప్ప మరో దారి కనిపించట్లేదు. దళారుల దోపిడీ పర్వంచంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నడూ రైతులకు మద్దతు ధర అందించిన పాపాన పోలేదు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల దోపిడీ పర్వానికి తెరతీసి వేడుక చూస్తోంది. పేరుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టినా, దళారుల అనుమతి లేకుండా ఒక్క గింజ కూడా పంట పొలం నుంచి మిల్లులకు చేరే పరిస్థితి లేదు. పంటను మద్దతు ధరకు విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లినా, నిరాశే ఎదురవుతోంది. రోజుల తరబడి షెడ్యూల్ ఇవ్వక పోవడం, గోనె సంచులు సమకూర్చక పోవడంతో కోసిన పంటను నిల్వ చేసుకునేందుకు అగచాట్లు పడాల్సి వస్తోంది. ఒకవేళ పట్టుబడి చేసినా రోజుల తరబడి లోడు మిల్లులకు చేరట్లేదు. అదే, దళారులు చెప్పిన రేటుకు ధాన్యాన్ని ఇస్తే మాత్రం క్షణాల్లో తరలించేస్తున్నారు. ఫలితంగా రైతులు 75 కిలోల బస్తాను రూ.400–500 తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తోంది. అంటే, సాధారణ రకానికి రూ.1,777, ఏ–గ్రేడ్కు రూ.1,792 మద్దతు ధర ఉంటే.. దళారులు ఇచ్చేది రూ.1,200–1,300 మాత్రమే. ఆరు కోట్ల గోనె సంచులు ఎక్కడ?ఖరీఫ్లో ధాన్యం సేకరణకు ఏకంగా 7,53,000 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ, క్షేత్ర స్థాయిలో రైతులకు పంట పట్టుబడికి మాత్రం సంచులు దొరకట్లేదు. ఏలూరు జిల్లా చింతలపూడిలో గోనె సంచుల కోసం రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. మరో వైపు 30 వేలకు పైగా రవాణా వాహనాలు సిద్ధం చేసినట్టు ప్రభుత్వం చెబుతున్నా, లోడింగ్కు మాత్రం కనీసం ట్రాక్టర్లు కూడా అందుబాటులో ఉండట్లేదు. ఇదిలా ఉండగా, ఇటీవల పౌర సరఫరాల సంస్థ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ కాంట్రాక్టును, వాటి సాఫ్ట్వేర్ను ఉత్తర భారతదేశానికి చెందిన ఓ సంస్థకు అప్పగించింది. ఇప్పుడు ఒకే సంస్థ పరిధిలో అన్ని రకాల జీపీఎస్ డివైజ్న్లను అనుసంధానం చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా చాలా చోట్ల జీపీఎస్లు పనిచేయక పోవడంతో లారీల్లో లోడింగ్కు ముందుకు రావట్లేదు. బ్యాంకు గ్యారంటీలు కట్టని మిల్లర్లు ప్రభుత్వం 3,013 రైతు భరోసా కేంద్రాలు, 2,061 పీపీసీ (పీఏసీఎస్)ల ద్వారా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసినట్టు చెబుతోంది. కానీ, చాలా చోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ఇక్కడ అధికారులు, దళారులు కుమ్మక్కులో భాగంగా కొనుగోలు కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించేలా పరోక్షంగా కుట్ర చేస్తున్నారు. అంటే.. ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనకపోగా.. దళారులతో కలిసి రైతులను దోపిడీ చేస్తూ.. మళ్లీ అదే దళారీ, రైతు పేరుతోనే ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్ముకుని లాభపడేలా దోపిడీ వ్యవస్థను ప్రోత్సహిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో మిల్లర్లు రూ.3 వేల కోట్లకు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 50 శాతం కూడా ఇవ్వలేదు. ఫలితంగా ఆ ప్రాంతాల్లో మిల్లులకు ధాన్యాన్ని తరలించలేక అధికార యంత్రాంగం చేతులు ఎత్తేస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం వాట్సాప్లో ‘హాయ్’ అని మెసేజ్ పెట్టగానే.. ధాన్యం కొంటామంటూ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ, రైతు నేరుగా కొనుగోలు కేంద్రానికి వెళ్లినా పట్టించుకునే నాథుడే లేడు. తేమ.. తూకంలోనూ మోసం! మోంథా తుపాన్ దెబ్బతిన్న పంటను కోత కోయించే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఎకరానికి రూ.4 వేలు పెట్టి మిషన్ల ద్వారా కోతలు కోయిస్తున్నారు. కోసిన పంటను కోసినట్టు అమ్ముకుందామంటే ప్రభుత్వం 17 శాతం కంటే ఎక్కువ తేమ ఉంటే నిరాకరిస్తోంది. ప్రభుత్వం రైతులకు పంట ఒబ్బిడికి టార్పాలిన్లు ఇవ్వకపోగా, తేమ శాతం పేరుతో కొనుగోలుకు నిరాకరిస్తోంది. రంగుమారిన ధాన్యాన్నీ కొనడం లేదు. దీనికి తోడు గోనె సంచికి రెండు కిలోల బరువు కట్టి, అంతే మొత్తాన్ని రైతుల ధాన్యంలో నుంచి లాగేస్తున్నారు. ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్లో సుమారు 81 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొంటామని చెప్పింది. అయితే తుపాను, ఇతర కారణాల వల్ల అంత దిగుబడి రాలేదు. ఇప్పటిదాకా 7.19 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుపాను వస్తేనే పరదాలు ఇస్తారట! ఈ రైతు పేరు ఆరుమళ్ల రాజశేఖర్రెడ్డి. కృష్ణా జిల్లా పామర్రు గ్రామం. సొంత పొలం మూడెకరాలు, మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మొత్తం ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. ప్రస్తుతం మిషన్ సహాయంతో రెండు ఎకరాలు నూరి్పడి చేశాడు. ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చు అయింది. దిగుబడి ఎకరాకు 25–27 బస్తాలే వస్తోంది. పంటను ఆరబెట్టుకునేందుకు పరదాలు (టార్పాలిన్లు) కావాలని ఆర్బీకేకు వెళ్లి అడిగాడు. ‘ప్రస్తుతం పరదాలు ఇచ్చేది లేదు.. తుపాను వస్తేనే ఇస్తాం’ అని చెప్పారని వాపోయాడు. గోనె సంచులైతే చిరిగిపోయినవి ఇస్తున్నారని, కష్టపడి పంటను ఆరబెట్టుకుంటే లోడింగ్కు లారీలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్కువకు రేటు కడదామని చూస్తున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరుకు చెందిన ఎస్ సత్యనారాయణ ఐదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఇటీవల మోంథా తుపాను వల్ల పొలం నీట మునిగి పోవడంతో నష్టపోయాడు. ఒక్క రూపాయి పరిహారం రాలేదు. ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి మళ్లీ తుపాను హెచ్చరిక రావడంతో భయంతో కోతలు ప్రారంభించాడు. అధిక వ్యయంతో యంత్రాలతో కోతలు నిర్వహిస్తే ఎకరాకు 33 బస్తాల ధాన్యమే దిగుబడి వచి్చంది. మద్దతు ధర దక్కడం గగనంగా మారింది. పొలాల వద్దకు వచ్చే వ్యాపారులు 75 కిలోల బస్తా రూ.1,300కే అడుగుతున్నారు. విక్రయించేందుకు సిద్ధమైనా సిండికేట్గా ఏర్పడి కొనుగోలు చేయకుండా మరింత తక్కువ రేటు కడదామని చూస్తున్నారని వాపోయాడు. ధాన్యం ఎవరికి అమ్మాలి? గత నెలలో తుపాను కారణంగా కురిసిన వర్షాలకు ధాన్యం బాగా దెబ్బతింది. తేమ అధికంగా వస్తోంది. రెండు రోజుల కిందట కోతలు మొదలు పెట్టాం. వాతావరణంలో మార్పులు రావడంతో హడావిడిగా ఒబ్బిడి చేస్తున్నాం. ధాన్యం కల్లాల్లోనే బరకాలతో కప్పి ఉంది. ఆర్బీకేలో సవాలక్ష నిబంధనలు పెట్టారు. వ్యాపారులు కూడా తక్కువ ధరకు అడుగుతున్నారు. ఈ పరిస్థితిలో ధాన్యాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. – పెద్దిరెడ్డి సత్యనారాయణ, గాడిలంక, -ముమ్మిడివరం మండలం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా రోజుకో రేటు నేను రెండు ఎకరాల్లో వరి సాగు చేశా. కొనుగోలు కేంద్రంలో స్పందన లేకపోవడంతో ఏజెంట్లను అడిగితే రోజుకో రేటు చెబుతున్నారు. మూడు రోజుల కిందట రూ.1,400 ఉంటే, ఇప్పుడు అది రూ.1,330కి పడిపోయింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం అమ్మాలంటే సవాలక్ష నిబంధనలు పెట్టారు. తేమ శాతం, పొట్టు, మట్టి గెడ్డలు, పూర్తిగా ఆరబెట్టినవి మాత్రమే కొనుగోలు చేస్తారట. ధాన్యం ఆరబెట్టడానికి జాగా లేని మేము ఏం చేయాలి? – కట్టేపోగు నాగులు, శృంగారపురం గ్రామం, దుగ్గిరాల, గుంటూరు జిల్లా గోనె సంచులు ఇవ్వట్లేదు నేను ఎకరానికి రూ.20 వేలు వంతున ఖర్చు చేసి 13 ఎకరాలలో వరి సాగు చేశా. నూరి్పడులు కూడా పూర్తయ్యాయి. వాతావరణ మార్పుల హెచ్చరికలతో గుండెల్లో గుబులు మొదలైంది. నాకు ఈ ధాన్యం పట్టడానికి 500 గోనె సంచులు అవసరం. కానీ, 200 మాత్రమే ఇచ్చారు. తుపాను ఆందోళనతో గోనెలు లేకపోతే పంట నష్టపోవడం కంటే దళారులకు అమ్ముకోవడం ఉత్తమం అనిపిస్తుంది. అయితే, క్వింటాకు రూ.400 నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం గోనె సంచులు ఇవాలి. – కనకల శ్రీనివాసరావు, బోని, ఆనందపురం మండలం, విశాఖపట్నం -
దళిత ఐపీఎస్ల పట్ల వివక్ష, వేధింపులు
సాక్షి, అమరావతి: దళిత ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులపట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోంది. అక్రమ కేసులతో కక్ష సాధింపులకు పాల్పడుతూ వేధిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్కుమార్, సంజయ్, జాషువా తదితరులకు ఎదురవుతున్న అవమానాలు, వేధింపులు, అక్రమ అరెస్టులు, విచారణకు సమన్లే అందుకు తార్కాణం. ఇక వచ్చే నెల 4న విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారి పీవీ సునీల్ కుమార్కు సమన్లు జారీ చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ కుట్రను మరోసారి బహిర్గతం చేసింది. దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం నినదించే డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమారే స్వయంగా వివక్షకు గురికావడం విస్మయ పరుస్తోంది. ఆయనకు ఏడాదిపాటు పోస్టింగు ఇవ్వలేదు. అనంతరం ఆయనపై అక్రమ కేసులు నమోదు చేయడంతోపాటు సస్పెండ్ చేసి, వేధింపులను తీవ్రతరం చేసింది. ఆరు నెలలుగా ఆయన సస్పెన్షన్లోనే ఉన్నారు. పీవీ సునీల్కుమార్.. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకుని మరీ వ్యక్తిగత పనుల మీద చేసిన విదేశీ పర్యటనలను కూడా వక్రీకరించి అక్రమ కేసు నమోదు చేయడం గమనార్హం. ఇక సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి కాస్త ఖరీదైన వాచీ ధరించడాన్ని కూడా టీడీపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి వత్తాసు పలికే ఎల్లో మీడియా భరించలేక పోవడం విభ్రాంతి పరిచింది. ఆయన వాచీ మీద కూడా ఎల్లో మీడియా దుష్ప్రచారానికి పాల్పడింది. గతంలో ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్పై చేసిన ఆరోపణలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని చెప్పింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెగబడుతుండటం గమనార్హం. ఆ కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు ఆయనకు తాజాగా సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది.⇒ మరో సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా చంద్రబాబు ప్రభుత్వ బాధితుడిగా మారారు. ఆయన కేవలం మూడు నెలలపాటు అగ్ని మాపక శాఖ ఇన్చార్్జగా అదనపు డీజీగా వ్యవహరించారు. అగ్ని మాపక శాఖ పరికరాల కొనుగోలు, బిల్లుల చెల్లింపుతో ఆయనకు నేరుగా ప్రమేయం లేదు. కానీ సంజయ్పై అక్రమ కేసు నమోదు చేసి సస్పెండ్ చేసింది. అనంతరం ఏకంగా అరెస్టు చేసి జైలు పాలు చేసింది. ఇప్పటికీ అక్రమ కేసులో ఆయన జైలులోనే ఉన్నారు. ఆయన సస్పెన్షన్ను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ సీనియర్ దళిత ఐపీఎస్ అధికారి జాషువాకు కూడా పోస్టింగు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. ⇒ దళిత అధికారి విశాల్ గున్నీని అక్రమ కేసులో సస్పెండ్ చేసింది. ⇒ రిటైర్డ్ దళిత పోలీసు అధికారి విజయ్ పాల్పై అక్రమ కేసు నమోదు చేసింది. రాజకీయ కక్ష సాధింపుతో ఆయన్ను అరెస్టు చేసి జైలు పాలు చేసింది. ⇒ ఇలా ఐపీఎస్లు డీఎస్పీ నుంచి ఎస్సై వరకు ఎంతో మంది దళిత పోలీసు అధికారులను చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది.ఏపీలో దళిత ఐపీఎస్ అధికారులకు వేధింపులు దళిత ఐపీఎస్ అధికారులపై వివక్ష, వేధింపులు హరియాణలో కంటే ఆంధ్రప్రదేశ్లో మరింత తీవ్రంగా సాగుతున్నాయి. కుల వివక్షకు గురైన హరియాణలో పూరన్ కుమార్ అనే దళిత ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కానీ, అంతకంటే తీవ్ర స్థాయిలో దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఏపీలో దళిత ఐపీఎస్ అధికారుల పట్ల వివక్షను ప్రదర్శించడమే కాకుండా, వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీవీ సునీల్ కుమార్, సంజయ్లపై నమోదు చేసిన అక్రమ కేసులే ఇందుకు నిదర్శనం. అక్రమ కేసులు బనాయించి ఐపీఎస్ సంజయ్ని జైల్లో పెట్టారు. దళిత, అణగారిన వర్గాల హక్కుల కోసం నినదించే పీవీ సునీల్ కుమార్ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వేధిస్తోంది. ఈ వేధింపులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నా.– ‘ఎక్స్’లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ -
‘టీటీడీలో గత పదేళ్ల నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ చేయాలి’
న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారాలకు ఇకనైనా ముగింపు పలకాలని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. తిరుమల ప్రసాదంపై పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు తెలుసుకని మాట్లాడితే మంచిదన్నారు. లడ్డూ ప్రసాదంపై జంతువుల కొవ్వు ఆరోపణలపై సిట్ ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఈరోజు(గురువారం, నవంబర్ 27వ తేదీ) న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. తిరుమల లడ్డూ విషయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదన్నారు. ప్రసాదం టెస్టింగ్ విసయంలో పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పుడు ఎలా కల్తీ జరుగుతుందన్నారు. తమ హయాంలో నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించామని, టీటీడీలో 15 ఏళ్లుగా ఏం జరుగుతుందో తెలుసుకుని మాట్లాడాలన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించామన్నారు. ఈవో, చంద్రబాబులు తిరుమల లడ్డూ వివాదంపై పరస్పర విరుద్ధ ఆరోపణలు చేశారని, దానిపై ఇప్పటివరకఊ సిట్ క్లారిటీ ఇవ్వలేదన్నారు. తిరుమల లడ్డూ అంశంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎవరి మీద బురద జల్లుతున్నారని ప్రశ్నించారు. 2019-2024 వరకూ తయారైనా లడ్డూలన్నీ కల్తీ చేసినట్లు తప్పుడు ప్రచారాలకు దిగారన్నారు. రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి.. కోట్లాడి మంది భక్తుల మనోభవాలను దెబ్బతీస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో భక్తుల కానుకలను ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేసిన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. గత పది ఏళ్ల నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ చేయాలిటీటీడీలో గత పది ఏళ్ల నెయ్యి కొనుగోళ్లపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు వైవీ సుబ్బారెడ్డి. ‘ 2014 నుంచి జరిగిన నెయ్యి కొనుగోళ్ళ పై విచారణ జరపాలి. 2024 ఆగస్టులో బాబు హయాంలోనే కల్తీ నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు..దానిపై సమాధానం చెప్పాలి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. మేము, మా కుటుంబం ఎవరివద్ద డబ్బు తీసుకోలేదు. నేను లై డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం. సత్య శోధన పరీక్షకు సిద్ధంగా ఉన్నా. నేను ఏ అవినీతికి పాల్పడలేదు. అలాగే, ఎస్ బ్యాంక్ లో టీటీడీ డబ్బు డిపాజిట్లు, శ్రీనివాస సేతు వ్యవహారంపై దర్యాప్తు చేయాలి. అప్పన్న నా పిఎ కాదు. ఆయనకు నాకు సంబంధం లేదు. అప్పన్న ఎంపీ వేమిరెడ్డి దగ్గర పని చేశారు’ అని తెలిపారు. -
అనుబంధాలు మరిచి.. అంతం కోరుతున్న ఆస్తి
ఆస్తుల ముందు.. రక్త సంబంధాలు, పేగు బంధాలు, దాంపత్య బాంధవ్యాలు కూడా నిలవడం లేదు. ఆస్తుల కోసం, భూముల కోసం మనిషి మృగంలా మారుతున్నాడు. క్షణికావేశంలో కన్నవారు, తోబుట్టువులు అనేది కూడా చూడటం లేదు. తన అవసరాల కోసం భూమిని అమ్మకోనీయలేదని తండ్రిని చంపిన కొడుకు.. తండ్రికి ఆస్తిలో వాటా పంచలేదని నాయనమ్మని చంపిన మనవడు.. తన పేరుమీద భూమి రాయలేదని తండ్రిపై దాడికి తెగబడిన కొడుకు.. భూమి కోసం మహిళపై దాడి చేసిన భర్త వైపు బంధువులు.. భూ వివాదంలో బంధువులతో కొట్లాటకు దిగిన రెవెన్యూ అధికారి.. ఇలాంటి హృదయ విదారక ఘటనలు చూసి, సమాజం ఎటు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంటోంది.. ముఖ్యంగా మైలవరం నియోజక వర్గంలో ఆస్తుల కోసం దాడులు, హత్యలు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.జి.కొండూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రభుత్వ పాలనను విజయవాడ నుంచి కొనసాగించడం వల్ల విజయవాడకు ఆనుకొని ఉన్న మైలవరం నియోజకవర్గంలో భూముల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 2,48,195.51ఎకరాలుగా ఉండగా, వ్యవసాయ భూమి 38,200హెక్టార్లు ఉంది. అయితే ఇటీవల అమరావతి రాజధాని పేరుతో ప్రభుత్వం అనేక గ్రాఫిక్స్లను విడుదల చేయడంతో భూముల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందన్న ఆశ స్థానికుల్లో రెట్టింపైంది. ఈ ఆశతో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకునేందుకు ఇష్ట పడటంలేదు. ఈ క్రమంలో దారుల విషయమై, సరిహద్దుల విషయమై వివాదాలు జరుగుతున్నాయి. అంతే కాకుండా ఉమ్మడి కుటుంబాల్లో వాటాల విషయమై కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా చెడు వ్యసనాలకు బానిసలైన వారసులు చేసిన అప్పులు తీర్చలేక భూములు అమ్మేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో దాడులు చేసి హత్యలు చేస్తున్నారు. భూ వివాదాలపై కుటుంబ సభ్యులు ఆవేశాలకు పోకుండా ఆలోచనతో మాట్లాడుకొని పరిష్కరించుకోవడంతో పాటు ఫిర్యాదులు అందగానే రెవెన్యూ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరించకుండా వెంటనే స్పందిస్తే వివాదాలు కొంత మేర తగ్గే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. భూ వివాదాల్లో దాడులు మచ్చుకు కొన్ని.. ∙మైలవరం మండల పరిధి బొర్రాగూడెం గ్రామానికి చెందిన పొన్నూరు సత్యనారాయణకు గ్రామంలో 2.10ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి తన పేరుమీద రాయాలంటూ గత కొంత కాలంగా రామ్కిరణ్ తండ్రి సత్యనారాయణపై గొడవ పడుతున్నాడు. ఇదిలా ఉండగా ఈ భూమిలో ఉన్న మామిడి చెట్లను కలప కోసం తండ్రికి తెలియకుండా రూ.1.15లక్షలకు రామ్కిరణ్ విక్రయించాడు. ఈ విషయమై ఈ నెల 24వ తేదీన తండ్రి, కొడుకుల మధ్య వాగ్వాదం జరిగి రామ్కిరణ్ తండ్రిపై దాడికి తెగబడ్డాడు. అదే సమయంలో రామ్కిరణ్ పక్కనే ఉన్న సత్యనారాయణ మేనల్లుడు కోడూరు నవీన్ సైతం దాడికి సహకరించడంతో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ∙ఈ నెల 17వ తేదీన మైలవరం మండల పరిధి పోరాటనగర్ గ్రామంలో భూ వివాదమై, జరిగిన దాడిలో గ్రామానికి చెందిన ఆంగోతు జయ గాయాలతో మైలవరం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. మద్యం మత్తులో ఉన్న తన భర్త నుంచి సంతకాలు సేకరించిన భర్త వైపు కుటుంబ సభ్యులు భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆక్రమణను అడ్డుకున్నందుకు తనపై దాడి తెగబడ్డారని మీడియాకు వెల్లడించారు. ఐదేళ్లుగా జరుగుతున్న ఈ వివాదాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. మైలవరం మండల పరిధి మొర్సుమల్లి పంచాయతీలోని ములకలపెంట గ్రామానికి చెందిన కడియం పుల్లారావు చెడు వ్యసనాలకు బానిసై భారీగా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చేందుకు పొలం అమ్ముతానంటూ తండ్రి శ్రీనివాసరావు(57)కి చెప్పడంతో అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన సాయంత్రం తండ్రి పొలంలోకి వెళ్లిన సమయంలో కర్రతో దాడి చేసి తండ్రిని హతమార్చి జైలుపాలయ్యాడు.∙భూ సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారే భూ వివాదంలో బంధువులతో కొట్లాటకు దిగడం విస్మయానికి గురి చేసింది. మైలవరం మండల పరిధి దాసుళ్లపాలెం గ్రామంలో భూ వివాదమై ఈ నెల 25వ తేదీన వీఆర్ఓ వింజమూరి లక్ష్మయ్య, ఆయన బంధువు చక్రవర్తి కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం కాస్తా ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడిచేసుకునే వరకు వెళ్లింది. ఈ దాడిలో వీఆర్ఓ లక్ష్మయ్య, చక్రవర్తిలకు గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.∙తన తండ్రికి ఆస్తిని పంచడం లేదనే కోపంతో జి.కొండూరు మండల పరిధి చెవుటూరు గ్రామానికి చెందిన ఉమ్మడి శివసచీ్చంద్ర కుమార్ కొడుకు వేణుగోపాలరావు తన నాయనమ్మ ఉమ్మడి హైమావతి(65)ని జూలై 1వ తేదీన ఉదయం పొలంలో పశువులను మేపుతుండగా కర్రతో దాడి చేసి స్పృహ కోల్పోయిన తర్వాత వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి తగలబెట్టాడు.కొట్లాట పరిష్కారం కాదు.. సరిహద్దులు, దారుల సమస్యలు ఉన్నప్పుడు ఇరువర్గాలు రెవెన్యూ శాఖను సంప్రదించి పరిష్కరించుకోవాలి. వారసత్వ ఆస్తుల విషయంలో వివాదాలు ఉంటే కోర్టుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. భూ వివాదాలు ఉన్నప్పుడు ఓపికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇగోలకు పోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటే కేసులలో ఇరుక్కుపోతారు. దాడుల వల్ల ఇరు వర్గాల కుటుంబాలు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నష్టపోతారు. – రావూరి రమేష్బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, మైలవరం -
పిల్లల అసెంబ్లీలోనూ రాజకీయాలే
సాక్షి, అమరావతి: రాజ్యాంగం విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు బుధవారం నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీని సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న, మంత్రి లోకేశ్ రాజకీయ ప్రసంగాలతో విద్యార్థుల్లో విద్వేషాలు నింపేలా మాట్లాడారు. విద్యార్థులకు విజ్ఞాన యాత్రగా ఉండాల్సిన కార్యక్రమాన్ని సొంత అజెండా అమలు వేదికగా చేశారు.మొత్తం కార్యక్రమం నాలుగు గంటల పాటు జరిగితే.. అందులో మాక్ అసెంబ్లీ గంటన్నర పాటు జరిగింది. మిగిలిన రెండున్నర గంటలు పూర్తిగా రాజకీయ ప్రసంగాలకు కేంద్రమైంది. సీఎం చంద్రబాబు ప్రసంగం ఒక్కటే గంటా నలభై నిమిషాల పాటు సాగింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో లైవ్ టెలీకాస్ట్ చేసిన ఈ కార్యకమ్రంలో సీఎం, స్పీకర్ల రాజకీయ ప్రసంగాలే ప్రధానంగా సాగాయి. పోలీసులకు రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదని.. తన పాదయాత్రలో ఇది గమనించానని లోకేశ్ వ్యాఖ్యానించారు.ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? : స్పీకర్ అయ్యన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. రాష్ట్రం ఏమైపోయినా, గ్రామాలు, కుటుంబాలు ఏమైనా పర్లేదన్నట్లుగా ప్రతిపక్షం ఉందంటూ విద్యార్థుల్లో విద్వేషాలు రగిలేలా మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలి? ప్రజలు వారిని ఏం చేయాలి? ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు తీసుకోవాలి? ఇక పెద్దలు నిర్ణయించాలి’.. అంటూ చంద్రబాబు వైపు చేతులు చూపుతూ అయ్యన్న మాట్లాడారు.రాజకీయాలు, స్కోత్కర్షతో సీఎం ప్రసంగంఈ మాక్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం యావత్తూ రాజకీయాలు, వ్యక్తిగత గొప్పలే ప్రధానంగా సాగింది. ప్రతిపక్షంపై విద్యార్థుల్లో విషం నింపడమే లక్ష్యంగా మాట్లాడారు. ఎమ్మెల్యే కావాలంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని చెప్పడంతో అంతా విస్మయం వ్యక్తంచేశారు. ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని నిజాంకి ఇస్తే నిజాం ఆ వజ్రాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడని కొత్త భాష్యం చెప్పారు.ఇక తాను తన చిన్నతనంలో లాంతరు వెలుగులో చదువుకున్నానని, దాంతో 1999లో విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చానని.. ఇప్పుడు ఏకంగా ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్థాయికి వచ్చామని అన్నారు. ఇలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు తన కీర్తిని తానే కీర్తించుకున్నారు. ఎప్పటిలాగే.. సెల్ఫోన్ తానే తెచ్చానని, టెక్నాలజీకి తానే ఆద్యుడినని, ఇప్పుడు టీచర్ స్థానంలో ఏఐ పనిచేస్తోందంటే దానికి తానే కారణమని గప్పాలు కొట్టుకున్నారు. -
తప్పిన తుపాన్ ముప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి సెనియార్ తుపాన్ ముప్పు తప్పింది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. క్రమంగా ఇండోనేషియా వైపు కదులుతూ బుధవారం తుపాన్గా మారి తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మినహా ఎటువంటి ప్రభావం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం అక్కడే కొనసాగుతోంది. అలాగే ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ఆ తర్వాత 48 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. -
పర్యాటకంలో కన్సల్టెంట్ల ‘ప్రభ’!
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యాటకశాఖ ప్రైవేటు కన్సల్టెంట్లు, డిప్యుటేషన్పై పనిచేస్తున్న అధికారుల హస్తాల్లో విలవిల్లాడుతోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ), ఏపీ పర్యాటక ప్రాధికార సంస్థ (ఆప్టా)లోను వారి హవానే సాగుతోంది. ఏపీటీడీసీ రెగ్యులర్ ఉద్యోగులను ప్రధాన కార్యాలయం నుంచి బదిలీ పేరుతో బయటకు పంపించడమే కాకుండా డిప్యుటేషన్, కన్సల్టెంట్ ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తూ ఇష్టారీతిన వ్యవహారాలు కొనసాగించడం పరిపాటిగా మారిపోయింది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పర్యాటక ఆస్తులను ప్రైవేటుపరం చేసేందుకు చకచకా పావులు కదిపింది. దీనికోసం ప్రత్యేకంగా కన్సల్టెంట్ల వ్యవస్థతో పాటు పాలకులు చెప్పినట్టు వినే అధికారులను డిప్యుటేషన్లపై ఏపీటీడీసీ, ఆప్టాలో నియమించి అడ్డగోలు దోపిడీకి తెగబడుతోంది. పర్యాటకశాఖలో 30 మందికిపైనే కన్సల్టెంట్లు పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. ఆప్టా ఉద్యోగులకు మొండిచెయ్యి ఆప్టాలో ఓ ప్రైవేటు ఏజెన్సీకి చెందిన ఐదుగురు కన్సల్టెంట్లు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్) నుంచి మరో ఆరుగురు కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు. వీరికి ఏడాదికి ఏకంగా రూ.5 కోట్ల వరకు చెల్లిస్తోంది. అంతటితో ఆగకుండా ప్రత్యేకంగా పెట్టుబడులను తీసుకొచ్చేందుకు ఇద్దరు కన్సల్టెంట్లను ఏకంగా ఏడాదికి రూ.కోటి వరకు చెల్లించే ప్రాతిపదికపై తీసుకొచ్చింది. వీరితోపాటు ఆప్టా, ఏపీటీడీసీల్లో ఉద్యోగ విరమణ చేసిన 18 మందిని ఆన్రోల్ కన్సల్టెంట్ కింద చేర్చుకుంది. ఆప్టాలో అయితే పొరుగు శాఖల నుంచి వచ్చిన వ్యక్తులే ఏళ్లుగా తిష్టవేసి ఉద్యోగులను శాసించేస్థాయికి వెళ్లిపోయారు. ఇటీవల ఆప్టాకు శాశ్వత ఉద్యోగి పదవీ విరమణ దగ్గరకు వస్తున్న తరుణంలో తన సేవలను గుర్తిస్తూ పదోన్నతి కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకోగా.. డిప్యుటేషన్పై ఆప్టాలో పనిచేస్తున్న అధికారులు అడ్డుచెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆడిట్ శాఖకు చెందిన ఓ అధికారి పర్యాటకశాఖ అనుమతి లేకపోయినా ఏళ్లతరబడి ఆప్టాలో డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు. డిప్యుటేషన్ కొనసాగింపు ఆర్డర్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తన పై అధికారి సాయంతో ట్రెజరీ నుంచి జీతం తీసుకుంటూ ఆప్టా ఉద్యోగులపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గత జూన్లో ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉండగా వాటిని అడ్డుకున్న సదరు అధికారి పదవీ విరమణ చేస్తున్న ఆప్టా ఉద్యోగి కి ప్రమోషన్ ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పడం గమనార్హం. పైగా ఆ అధికారికి ఇన్నేళ్లు ఆర్డర్ లేకుండా పని చేస్తుండటంపై పర్యాటక శాఖ మెమో కూడా జారీ చేసింది.అనధికారిక డిప్యూటీ సీఈవో..ఆప్టాకు సీఈవోగా ఏపీటీడీసీ ఎండీ వ్యవహరిస్తారు. సీఈవోకు అనుబంధంగా డిప్యూటీ సీఈవో కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్టాలో కన్సల్టెంట్ల ‘ప్రభ’ దేదీప్యమానంగా వెలుగుతోంది. ఎంతగా అంటే.. సదరు కన్సల్టెంట్ అనధికారిక డిప్యూటీ సీఈవోగా చలామణి అవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కన్సల్టెంట్లకు ఎక్కడా లేనివిధంగా కీలకమైన పర్యాటక ఆస్తుల పర్యవేక్షణ, నిర్వహణలో ఫ్రీహోల్డ్ ఇచ్చేసింది. దీంతో ఆ కన్సల్టెంట్ ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఆప్టాతో పాటు ఏపీటీడీసీ అధికారులకు సైతం పెట్టుబడులకు సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదు. ఆ కన్సల్టెంట్ తీసుకొచ్చినవాళ్లే పెట్టుబడిదారులు.. తాను తయారు చేసిందే డీపీఆర్. ఇందులో వాస్తవాలతో పనిలేదు. ప్రభుత్వానికి కాగితాలపై లెక్కలు చూపించి రూ.కోట్ల విలువైన భూములను అప్పనంగా పంచిపెట్టడమే సదరు కన్సల్టెంట్ ప్రధాన విధి. అందుకే 2014–19 మధ్య ఆప్టాలో ఓ వెలుగు వెలిగిన ఆ కన్సల్టెంట్ మళ్లీ 2024లో చంద్రబాబు సర్కార్ రాగానే వాలిపోయారు. తాజాగా సీఐఐ సదస్సులో పర్యాటకశాఖకు 104 ఎంవోయూల్లో రూ.17,973 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు గొప్పగా ప్రకటించారు. కానీ పెట్టుబడిదారుల వివరాలను మాత్రం ఇప్పటికీ బయటపెట్టడం లేదు. ఎందుకంటే ఆ పెట్టుబడిదారుల జాబితాలో చెప్పుకోదగ్గ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు లేవు. మొత్తం పెట్టుబడిదారుల్లో 95 శాతానికిపైగా ఏపీలోని వివిధ ప్రాంతాల వారే. వారి పేర్లతో ఎంవోయూలు చేసుకోవడం గమనార్హం. దీనివెనుక సదరు కన్సల్టెంట్ చక్రం తిప్పినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఏపీటీడీసీలోనూ అంతే ఏపీటీడీసీలోని కీలక విభాగాల్లో జీఎం స్థాయిలో ఒక్కరు కూడా శాశ్వత ఉద్యోగులు లేరంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. కనీసం ఈడీ స్థాయిలో పనిచేస్తున్న ఓ అధికారికి ఏడాది కిందట డిప్యుటేషన్ ముగిసింది. అయినా ఇప్పటివరకు పొడిగింపు ఆర్డర్ లేకుండానే కొనసాగుతున్నారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా నెలనెలా జీతం తీసుకోవడం, శాశ్వత ఉద్యోగులను చిన్నచూపు చూస్తుండటం ఏపీటీడీసీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. కీలకమైన ఆర్థిక వ్యవహారాలను ఆప్టాలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న అధికారికి అప్పగించడం విచిత్రంగా ఉంది. పైగా ఆరు క్లస్టర్ల ద్వారా 22 హరిత హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్న తరుణంలో ఏపీటీడీసీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వాస్తవానికి స్వయం సమృద్ధి సాధించడం ద్వారా సింహభాగం ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులను ఏపీటీడీసీ ఆదాయం నుంచే భరించేది. ప్రభుత్వం నుంచి మాత్రం ఏటా సుమారు రూ.2.50 కోట్ల వరకు కేటాయింపులు ఉండేవి. కానీ ఈసారి బడ్జెట్లో కేటాయింపులను ప్రభుత్వం రూ.64 లక్షలకు కుదించేసింది. తద్వారా ఏపీటీడీసీని వ్యూహాత్మకంగా దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. -
ప్రైవేట్కు 1,300 ఎకరాల మున్సిపల్ భూములు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ)లో ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని మున్సిపాలిటీలకు విస్తరించింది. విలువైన 1,300 ఎకరాల భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. భూములతోపాటు కంపెనీల యాజమాన్యాలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.2 వేల కోట్ల వయబులిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో నీటిసరఫరా ప్రాజెక్టులు, రవాణా నెట్వర్క్, హౌసింగ్ తదితర 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలంటే 2029 నాటికి రూ.66,523 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని, ఈ లక్ష్యాలను చేరుకునేందుకు పీపీపీని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ విధానంలో 2.30 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ప్రైవేటు సంస్థలకు వేల ఎకరాల భూములను కట్టబెట్టడంతోపాటు వయబులిటీ ఫండింగ్ ఇవ్వడాన్ని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. నిరుపయోగం పేరుతో నేతలకు ధారాదత్తం పట్టణప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని అనుయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు స్కెచ్ వేసింది. ఈ భూములను వాణిజ్యపరంగా లాభదాయకంగా మార్చేందుకని కలరింగ్ ఇచ్చి రాష్ట్రంలోని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(యూడీఏ)ల ద్వారా అమలుచేస్తున్న ల్యాండ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్తో అప్పగించేందుకు సిద్ధమైంది. మొత్తం 18 యూడీఏల్లో 73 ల్యాండ్ పార్సిల్స్లో 1,300 ఎకరాలను ఇప్పటికే గుర్తించారు. ఈ భూములు నిరుపయోగంగా ఉన్నాయని తేల్చారు. ఇప్పటికే నాలుగు యూడీఏల్లో ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) జారీచేశారు. మిగిలిన వాటికి త్వరలో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. పీపీపీ విధానంలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయవచ్చని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని, ఈ విధానం దేశంలో పట్టణాభివృద్ధిలో రాష్ట్రాన్ని నిలబెడతాయని పేర్కొనడం గమనార్హం. ట్యాక్స్ బాదుడికి రంగం సిద్ధమైనట్టే? మున్సిపాలిటీలు, పంచాయతీల్లో రోడ్లు, రవాణాను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగిస్తే ప్రభుత్వంపై ఆరి్థకభారం ఉండదని గతంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు రోడ్లు వేసి ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు ఈ పీపీపీ విధానాన్ని మున్సిపాలిటీలకు ఆపాదించి అమల్లోకి తెచ్చినట్టయింది. ప్రజలకు తాగునీటి సరఫరా, రోడ్లు, విద్య వంటి సదుపాయాలు ఉచితంగా ప్రభుత్వం కల్పించాలి. కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రస్తుతం ప్రకటించిన నీటిసరఫరా, రవాణా, హౌసింగ్ తదితర 12 రకాల మౌలిక సదుపాయాలను ప్రైవేటుకు కట్టబెడుతోంది. దీంతో వీటిపై ప్రజల నుంచి పన్ను వసూలుకు ఆయా సంస్థలకు అధికారం ఇచ్చినట్టేనని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పీపీపీ విధానం: ముఖ్య కార్యదర్శి పట్టణ ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఆర్థిక మండలాల్లో రూ.35 వేలకోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఇందులో భాగంగా మున్సిపల్శాఖలో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంపై సమగ్ర పాలసీ ఫ్రేమ్వర్క్ను ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు. -
ఆశలు కకావికలం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వానికి దివ్యాంగులపై కనీస కనికరం కూడా లేదు. వారి పింఛన్లకు కోత పెట్టి వారి బతుకులను కకావికలం చేయడానికి రీ వెరిఫికేషన్ పేరుతో నానా అగచాట్లకు గురిచేస్తోంది. అరకొర సదరం శిబిరాలతో ముప్పుతిప్పులు పెడుతోంది. ఫలితంగా వైకల్య ధ్రువీకరణ కోసం సదరం స్లాట్ పొందేందుకు దివ్యాంగులు, వివిధ జబ్బులతో బాధపడుతున్న వారు అవస్థలకు గురవుతున్నారు. సామాజిక భద్రతా పింఛన్లలో కోత పెట్టేందుకు బాబు సర్కారు రీ–వెరిఫికేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో గతేడాది నుంచి వైద్య శాఖ సదరం రీ–వెరిఫికేషన్లో నిమగ్నమైంది. కొత్తగా వైకల్య ధ్రువీకరణ కోసం వారంలో ఒకరోజు మాత్రమే సదరం క్యాంపులను మొక్కుబడిగా నిర్వహిస్తుండటంతో సదరం స్లాట్లకు భారీ డిమాండ్ ఉంటోంది. ఇటీవల నవంబర్, డిసెంబర్ నెలలకు కలిపి 30 వేల స్లాట్లను ఈ నెల 14న వైద్య శాఖ విడుదల చేసింది. స్లాట్లన్నీ రెండు రోజుల్లోనే బుక్ అయిపోయాయి. మరో 13 వేల మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. స్లాట్లకు ఉన్న డిమాండ్ను ఆసరా చేసుకుని కొందరు మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు, దళారులు దివ్యాంగులను దోపిడీ చేస్తున్నారు.సదరంపై నీలినీడలు2019కి ముందు వరకూ చంద్రబాబు పాలనలో కేవలం 56 ఆస్పత్రుల్లోనే సదరం స్క్రీనింగ్స్ నిర్వహించేవారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సదరం సర్టిఫికెట్లు పొందడానికి దివ్యాంగులు పడుతున్న అవస్థలకు చెక్పెడుతూ అదనంగా మరో 117 ఆస్పత్రులను కలిపి 173 చోట్ల సదరం క్యాంపులు ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ ఆస్పత్రులోనైనా స్లాట్ బుక్ చేసుకుని అసెస్మెంట్కు హాజరయ్యే అవకాశం కల్పించారు. దీంతో అంతకుముందు టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైకల్య ధ్రువీకరణ ప్రక్రియ ఎంతో సులభతరం అయింది. గత ఏడాది చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడంతో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతేడాది జూన్లో ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పింఛన్ల ఏరివేతలో భాగంగా రీ–వెరిఫికేషన్కు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి కొత్త సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. దివ్యాంగుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో మొక్కుబడిగా స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించారు. వారంలో ఒకరోజు (ఏపీవీవీపీ, బోధనాస్పత్రుల్లో ఒక్కో రోజు) మాత్రమే సదరం క్యాంప్లను నిర్వహిస్తున్నారు. స్క్రీనింగ్ నిర్వహించే ఆస్పత్రులను సైతం 173 నుంచి 118కి కుదించారు. అటు స్లాట్లు, ఇటు ఆస్పత్రుల సంఖ్య కూడా తగ్గడంతో ఒక్కసారిగా డిమాండ్ ఎక్కువైంది.రూ.10 వేలు ఇవ్వాల్సిందే ప్రభుత్వం విడుదల చేస్తున్న చాలీచాలని స్లాట్లను కొందరు మీ–సేవ నిర్వాహకులు గంటల్లోనే బ్లాక్ చేసేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పక్క జిల్లాల్లో స్లాట్లు బుక్ చేసి, అనంతరం దివ్యాంగుల సొంత జిల్లాలకు స్లాట్ ట్రాన్స్ఫర్ రూపంలో పెద్దఎత్తున దందా నడుస్తోంది. ఇలా దివ్యాంగుల నుంచి మీ–సేవ నిర్వాహకులు, దళారులు రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నారు. అనంతపురం, కర్నూలు, తిరుపతి, గుంటూరు, కృష్ణా ఇలా రాష్ట్రంలో ప్రతిచోటా దళారుల దోపిడీ కొనసాగుతోంది. దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దంటూ ప్రభుత్వం ప్రకటనలతోనే సరిపెడుతోంది. ప్రభుత్వం ఆస్పత్రులు, క్యాంప్లను పెంచితేనే దోపిడీకి అడ్డుకట్టపడుతుందని దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రకృతి విపత్తుల 'భారత్'!
సాక్షి, అమరావతి: వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్టపోతున్న టాప్ 10 దేశాల్లో భారత్ 9వ స్థానంలో ఉంది. జర్మన్ వాచ్ అనే అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్–2026 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 1995 నుంచి 2024 వరకు మన దేశం సుమారు 430 విపత్తుల బారిన పడినట్లు ఈ నివేదిక పేర్కొంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు లక్షల మందిపై ప్రభావం చూపడంతో సుమారు 80 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. అంతేగాక, ఆర్థికంగా దేశానికి రూ.14 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఉత్తర, మధ్య భారతదేశ రాష్ట్రాల్లో వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనేక చోట్ల 50 డిగ్రీల వరకు నమోదవుతుండడంతో వడ దెబ్బ తగిలి వందలాది మంది చనిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు తదితర తీర ప్రాంతాలను తుపానులు తీవ్రంగా దెబ్బతీశాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేడి గాలులు తీవ్రంగా ఉంటున్నాయి. రుతుపవనాల సీజన్లో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల వరదల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పంటలు, ఇళ్లు, రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయి. వాతావరణ హెచ్చరికలు, అరకొర రక్షణ చర్యల వల్ల నష్ట తీవ్రత మరింత పెరుగుతోంది.ప్రపంచవ్యాప్తంగా 9,700 విపత్తులుఅంతర్జాతీయంగానూ వాతావరణ మార్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది విడుదలైన సీఓపీ30 నివేదికలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రధానంగా భారత్ వంటి దేశాలు వాతావరణ మార్పుల వల్ల తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటున్నాయని హెచ్చరించింది. 1995 నుంచి 2024 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 9,700పైగా అత్యంత ప్రభావం చూపిన వాతావరణ విపత్తులు వచ్చాయి. అమెరికాలో కత్రీనా, ఫిలిప్పీన్స్లో హైయాన్, ఇండియాలో ఆంఫన్ తుపాను తీవ్ర ప్రభావం చూపాయి. చైనా, పాకిస్తాన్, ఇండియా, జర్మనీ తదితర దేశాల్లో భారీ వరదలు వచ్చాయి. యూరప్, ఇండియా, కెనడా, ఆస్ట్రేలియాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జపాన్, నేపాల్, బంగ్లాదేశ్లో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. హిమాలయ ప్రాంతాలు, దక్షిణ అమెరికాలో కొండలు కూలిపోతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాల్లో నీటి కొరత, పంటల నష్టం, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల అడవుల్లో తీవ్ర అగ్ని ప్రమాదాలు సంభవించాయి.భారత్లో తీవ్ర విపత్తులుమన దేశంలో 1999లో ఒడిశాలో సంభవించిన సూపర్ సైక్లోన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. 2014లో హుద్హుద్ తుపాను ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని మిగల్చగా.. 2013–2021 మధ్య ఫాలిన్, గజా, తిత్లీ, ఆంఫన్, యాస్ తుపానులు పెను నష్టాన్ని కలిగించాయి. 2005లో ముంబైలో వచ్చిన వరదలు, 2013 ఉత్తరాఖండ్ వరదలు, 2018లో కేరళలో వరదలు ఆ రాష్ట్రాల్లో ఊహించని నష్టాన్ని కలిగించాయి. ఏటా గంగ, గోదావరి, కృష్ణా నది పరీవాహక ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు తరచూ కరువు బారిన పడడంతో వ్యవసాయానికి తీరని నష్టం మిగులుతోంది. హిమాచల్ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కొండ చరియలు విరిగిపడడం, కూలిపోవడం (ల్యాండ్ స్లైడ్స్) వల్ల అపార నష్టం వాటిల్లుతోంది. వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాల్లో అస్థిరత, సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో వరదలు రావడం, ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతోంది. తీర ప్రాంతాల్లో అధిక జనాభా, ప్రణాళిక లోపాలతో తీవ్ర నష్టం జరుగుతోంది. అడవుల ధ్వంసం, డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడం వల్ల నష్టం ఎక్కువ అవుతున్నట్లు నివేదిక వెల్లడించింది. -
రైతుల పరిస్థితి అగమ్యగోచరం
ప్రజలకు, రైతులకు నష్టం జరుగుతోందంటే డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకు అలవాటే. వెంటనే ఏకంగా 10 వేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడానంటాడు. అన్నీ చేసేస్తాం అంటాడు. కానీ, ఏదీ చేయడు. క్వింటా ఉల్లి రూ.1,200కు కొంటామన్నారు. ఆ తర్వాత ఉల్లి రైతులకు హెక్టార్కు రూ.50 వేలు ఇస్తా మన్నారు.అదీ లేదు. ఇదీ లేదు.. ఏదీ లేదు. వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టాపిక్ డైవర్షన్. ఏదో ఒక అంశం తెరపైకి తెస్తారు. దాన్ని ఎల్లో మీడియాలో ఊదరగొడతారు. అలా వాటి నుంచి అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి రైతుల పరిస్థితి బస్టాండ్ అన్నట్లు తయారైంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి కడప: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని, అరటి రైతుల పరిస్థితి దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులన్నా, వ్యవసాయ రంగం అన్నా ప్రేమ లేదని.. ఈ 18 నెలల్లో 16 విపత్తులు వచ్చినా కనీస సాయం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు బుధవారం ఆయన పులివెందుల సమీపంలోని బ్రాహ్మణపల్లి వద్ద అరటి తోటలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు. కిలో అరటికి చివరకు 50 పైసలు కూడా రాకపోవడంతో, తోటల్లో అలాగే వదిలేస్తున్నామని, పశువులకు వేస్తున్నామని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఇంత జరుగుతున్నా, ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోవడం లేదని వాపోయారు. రైతుల బాధలు ఓపికగా విన్న వైఎస్ జగన్.. ఆ తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇకనైనా సీఎం చంద్రబాబు మారకపోతే, రాబోయే రోజుల్లో అందరితో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కరెంటు ఖర్చవుతుందని వినియోగంలోకి తీసుకు రారా? ⇒ఈ ప్రాంతంలో 600 టన్నుల ఇంటిగ్రేటెడ్ బనానా కోల్డ్ స్టోరేజ్ను 2024 మార్చిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించాను. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 18 నెలలైంది. కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని స్టోరేజ్ను నడపడం లేదు. ఇలా అయితే రైతులు ఎలా బతుకుతారు? చంద్రబాబు రైతులను ఏ విధంగా పట్టించుకుంటున్నాడో చెప్పేందుకు ఈ కోల్డ్ స్టోరేజీయే నిదర్శనం.వైఎస్సార్ కడప జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అరటి తోటలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ⇒చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులు, వ్యవసాయ రంగం పరిస్థితి తిరోగమనమే. ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టితో రైతులు చాలా నష్టపోయారు. వారికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా, వారికి చంద్రబాబు ఇచ్చింది గుండు సున్నా.⇒మొన్నటి మోంథా తుపాను నష్టాన్ని కూడా తక్కువ చేసి చూపుతున్నారు. దాదాపు రూ.1,100 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఎగరగొట్టిన పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొడుతూ, రైతుల హక్కు అయిన, ఉచిత పంటల బీమా ఇవ్వకుండా, వారి హక్కులు కాలరాశారు. ఈ–క్రాప్ కూడా చేయడం లేదు.⇒రైతు ఏ పరిస్థితుల్లోనూ కష్టపడకూడదు.. వారికి అగచాట్లు రాకూడదని తపన పడిన ప్రభుత్వం మాది. మా ప్రభుత్వ హయాంలో ఈ క్రాప్ చేసి 84 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా సదుపాయం కల్పించాం. ఆ విధంగా దాదాపు రూ.7,400 కోట్లు అందించాం. ఈ రోజు రాష్ట్రంలో 84 లక్షల మంది రైతులు ఉంటే, కేవలం 18 లక్షల మంది రైతులకు పంటల బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునే నాథుడే లేడు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. హక్కు అయిన ఉచిత పంటల బీమా లేదు. చంద్రబాబు వచ్చాక, ఎరువులు సైతం బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి ఉంది. ⇒మరోవైపు పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. వారికి పెట్టుబడి సాయం కూడా అందడం లేదు. నాడు మా ప్రభుత్వ హయాంలో రైతులకు ఏటా రూ.13,500 క్రమం తప్పకుండా ఇచ్చాం. ఏ ఏడాది కూడా ఎగ్గొట్టలేదు. ఈ పెద్దమనిషి చంద్రబాబు రైతు భరోసా ఎగ్గొట్టి, అన్నదాతా సుఖీభవ అన్నాడు. పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానని చెప్పి, తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టాడు. రెండేళ్లకు మొత్తం రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.10 వేలు ఇచ్చి, మిగిలింది ఎగ్గొట్టాడు.నాడు రూ.32 వేలు.. నేడు రూ.2 వేలుమా ప్రభుత్వ హయాంలో అరటి టన్ను సగటు ధర రూ.25 వేలు కాగా, గరిష్టంగా రూ.32 వేల వరకు పోయింది. అదే ఈ రోజు కనీసం రూ.2 వేలకు కూడా కొనడం లేదు. దీంతో పంట మొత్తం చెట్ల మీదే కుళ్లిపోతోంది. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మా ప్రభుత్వ హయాంలో అరటి ఎగుమతి కోసం అనంతపురం నుంచి ఢిల్లీకి రైళ్లు నడిపాం. అరటితో పాటు, ఉద్యాన పంటలు కూడా వాటిలో ఎగుమతి చేశాం. చివరకు బనగానపల్లి నుంచి గువాహటి వరకు రైళ్లు నడిచాయి.ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు ⇒దళారీలతో చంద్రబాబు కుమ్మక్కై, రైతుల బతుకులు అగమ్య గోచరంగా మార్చాడు. అందుకే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. గత ఏడాది ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీనీ, మామిడి.. ఇలా ఏ పంట తీసుకున్నా దేనికీ గిట్టుబాటు ధర రాలేదు. ఈ ఏడాది కూడా ధాన్యంతో సహా ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు.⇒గతంలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేసేవాళ్లం. ఆర్బీకేల్లో ఆ వివరాలు ప్రదర్శించే వాళ్లం. సీఎం–యాప్ ఉండేది. ఎక్కడైనా ధరలు తగ్గితే, వెంటనే జేసీ అప్రమత్తమై, జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసేవారు. అలా రూ.7,746 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. కోవిడ్ సమయంలో కూడా రైతులను ఆదుకున్నాం. అందుకే ఈ రోజు పరిస్థితిని గమనించమని కోరుతున్నాను. హామీలన్నీ గాలికి.. అంతటా దోపిడీ ⇒సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికెగిరిపోయాయి. అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఇస్తానన్నాడు. అలా ఏటా రూ.18 వేలు. అలా వారికి రూ.36 వేలు బాకీ. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తానన్నాడు. అలా రెండేళ్లకు రూ.72 వేలు బాకీ. అమ్మ ఒడి రూ.15 వేలు అన్నాడు. రూ.2 వేలు కట్ చేశారు. రూ.13 వేలు కూడా ఇవ్వకుండా రూ.8 వేలు, రూ.9 వేలు మాత్రమే ఇచ్చారు. అందులోనూ 30 లక్షల మందికి కోత పెట్టారు. పెన్షన్లు కొత్తవి ఇవ్వకపోగా, ఐదు లక్షలు కట్ చేశారు. మా ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షలకు పైగా పెన్షన్లు ఇస్తే, ఈ రోజు 61 లక్షల మందికే ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఎవ్వరూ సంతోషంగా లేరనేందుకు ఈ లెక్కలే నిదర్శనం.⇒ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టారు. కొత్త మెడికల్ కాలేజీలను శనక్కాయలు, బెల్లానికి అమ్మేస్తున్నారు. ఇసుక, సిలికా, క్వార్ట్జ్.. దేన్నీ వదలకుండా అన్ని వనరులు, గనులను దోచేస్తున్నారు. అమరావతిలో చదరపు అడుగుకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తూ అక్కడా యథేచ్ఛగా దోచుకుంటున్నారు.ప్రజలతో కలిసి మరింతగా ఉద్యమిస్తాం చంద్రబాబూ ఇప్పటికైనా మారండి. ఇలాగే ఉంటూ రైతులను పట్టించుకోకపోతే.. విద్యార్థులు, ప్రజలను ఇలాగే కష్టాలపాలు చేస్తామంటే వారితో కలిసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రాబోయే రోజుల్లో వీళ్లందరి తరఫున తీవ్రమైన ఉద్యమాలు ఖాయం. చంద్రబాబును గద్దె దింపే కాలం త్వరలోనే వస్తుంది. దేవుడు కూడా మొట్టికాయలు వేస్తాడు’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.అనంతరం ఒక రైతు మాట్లాడుతూ ‘అయ్యా.. చంద్రబాబు గారూ.. మీరు వ్యవసాయం దండగ అంటున్నారు కదా.. మీరు ఏం తిని బతుకుతున్నారు? ఇనుప ముక్కలు తిని బతుకుతున్నారా? రైతులు ఒక్కసారి పంటలు వేయకపోతే.. ప్రజలు ఏం తింటారు? వారికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది?’ అని సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.పిల్లలకూ తప్పని కష్టాలుఫీజు రీయింబర్స్మెంట్ కోసం పిల్లలతో కలిసి పోరాడుతున్నాం. డిసెంబర్ వస్తే 8 త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటాయి. ఒక్కో క్వార్టర్కు దాదాపు రూ.700 కోట్లు. అంటే ఏకంగా రూ.5,600 కోట్లు బకాయిలు. ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. అంటే దాదాపు రూ.4,900 కోట్లు బకాయిలు. మరో రూ.2,200 కోట్లు వసతి దీవెన బకాయిలు. ఏటా ఏప్రిల్లో రూ.1,100 కోట్ల చొప్పున ఇవ్వాలి. అదీ ఇవ్వడం లేదు. దీంతో రెండూ కలిపి రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. చదువుకునే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి కూడా రాలేదునాకున్న ఆరు ఎకరాల భూమిలో దాదాపు రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టి అరటి పంటను సాగు చేశాను. ఎరువులు, మందులు వాడటంతో పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది. కాయ కూడా నాణ్యంగా ఉంది. అయితే మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో వ్యాపారులు తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేయడం లేదు. దీంతో తోటలోనే పండ్లు మాగి కింద పడిపోతున్నాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాను. పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అరటి రైతులను ఆదుకోవాలి.– శ్రీనివాసరెడ్డి, బ్రాహ్మణపల్లి, పులివెందులఅరటి పంటను అడిగే నాథుడే లేడు ఎంతో కష్టపడి వేలకు వేలు పెట్టుబడి పెట్టి అరటి పంట సాగు చేసి మంచి దిగుబడి వచ్చిందన్న సమయంలో కొనుగోలు చేసే నాథుడే లేడు. అరటి చెట్లకే పండ్లు మాగి కిందపడిపోతున్నాయి. గతంలో రూ.20 వేల నుంచి రూ.32 వేల వరకు టన్ను అరటి కాయల ధర పలికింది. ప్రస్తుతం టన్ను రూ.2 వేలకు అమ్ముదామన్నా కొనే వారు లేరు. ప్రభుత్వం రైతులను పట్టించుకొని అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుందనుకుంటే రైతుల వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం దారుణం.– రామతులశమ్మ, బ్రాహ్మణపల్లి, పులివెందులపంటను దున్నేయాల్సిన దుస్థితిచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. గతంలో అరటి పంటకు మంచి ధరలు ఉన్నాయని ఆశించి ఈ ఏడాది భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేశాం. తీరా పంట దిగుబడి వచ్చి మార్కెట్లో అమ్ముదామనుకున్న సమయంలో వ్యాపారులు, ప్రభుత్వం కూడబలుక్కున్నట్లు స్పందించడం లేదు. దీంతో అరటి కాయలు చెట్లకే మాగిపోతున్నాయి. అరటి పంటను ట్రాక్టర్లతో దున్నుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పటికైనా అరటి రైతుల సమస్యలను గుర్తించి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి.– రామచంద్రారెడ్డి, బ్రాహ్మణపల్లి, పులివెందులఏ పంటకూ గిట్టుబాటు ధర లేదుఆరుగాలం కష్టపడి పంటలను సాగు చేస్తే, తీరా పంట దిగుబడి వచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక తల్లిడిల్లిపోతున్నాం. నేను, నా స్నేహితుడు ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అరటి, టమాట పంటలను సాగు చేశాం. దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడులు పెట్టాం. కనీసం ఒక్కరూపాయి కూడా మాకు డబ్బు రాలేదు. టమాట పంటను అమ్మడానికి మార్కెట్కు పోతే కొనేనాథుడు లేక మార్కెట్ వద్ద పారబోశాను. ఆటో బాడుగ కూడా చేతి నుంచి పడింది. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి.– బాబురెడ్డి, ఇనగలూరు, తొండూరు మండలం -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ (YSRCP ) కేంద్ర కార్యాలయంలో ఘనంగా దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ నేతలు డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హాజరైన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, మంగళగిరి ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, తదితరులుతిరుపతి: మాజీ మంత్రి పెద్దిరెడ్డి క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నేత మల్లారపు మధు భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ అమలు దినోత్సవం వేడుకల దేశం అంతా ఘనంగా జరుపుకుంటున్నాం. బి.ఆర్. అంబేద్కర్ చిరస్మరణీయుడు, అట్టడుగు వర్గాలు ,బలహీన వర్గాలకు రక్షణ కల్పించేలా భారత రాజ్యాంగం నిర్మించారు. బి.ఆర్.అంబేద్కర్ పూర్తి తెలివితేటలు,సమాజ అవసరాలు కలిపి రాజ్యాంగం రాయడం జరిగింది భావితరాలకు భారత రాజ్యాంగం ద్వారా సమాజంలో సమతుల్యత చేకూరుస్తోందని ఆయన అన్నారు.విశాఖపట్నం: వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించిన ఎంపీ గొల్ల బాబురావు, వరుదు కళ్యాణి, కేకే రాజు, వాసుపల్లి, మోల్లి అప్పారావు, కొండ రాజీవ్ గాంధీ. ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ఆర్ధిక, సామాజిక రాజకీయ రుగ్మతలను రాజ్యాంగం తొలగించింది. ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన రాజ్యాంగం మనది. రాష్ట్రంలో నేడు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు కూటమి పాలనలో అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.కేకే రాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. అంబేద్కర్ ఆశయాలను కూటమి ప్రభుత్వం కాలరాస్తోంది. అంబేద్కర్ రాజ్యాగాన్ని కాదని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలను వైఎస్ జగన్ అమలు చేశారు. బడుగు బహిన వర్గాల వారికి వైఎస్ జగన్ రాజ్యాధికారం కల్పించారు అని అన్నారు.విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్. వైఎస్ఆర్సిపి నాయకులు కార్పొరేటర్లు, పాల్గొన్నారు. -
అన్నంలో పురుగులు.. కూరగాయల్లో ఎలుకలు
గోరంట్ల: నాసిరకం కూరగాయలు, పురుగుల బియ్యం, తిరుగుతూ పారాడుతున్న ఎలుకలు, వాలుతున్న ఈగలు... చంద్రబాబు సర్కార్ పర్యవేక్షణ లోపం.. గిరిజన సంక్షేమ అధికారుల నిర్లక్ష్యం... బీసీ సంక్షేమ శాఖ మంత్రి సొంత ఇలాకాలో గిరిజన గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినుల ప్రాణాల మీదకు తెస్తోంది. నాణ్యత లేని సరుకులతో వండిన భోజనం తిని మంగళవారం రాత్రి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ పదో తరగతి వరకు 400 మంది చదువుతున్నారు. ప్రిన్సిపల్ విజయ్కుమార్ ఇటీవల బదిలీ కాగా, హిందూపురం ప్రిన్సిపాల్ తులసికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. కొంతకాలంగా రెగ్యులర్ వంట మనిషి లేరు. నైట్ వాచ్ ఉమెన్ వంట చేస్తున్నారు. నిర్వహణ సరిగా లేక శిథిలావస్థలోని వంట గది దుర్వాసన వస్తోంది. అపరిశుభ్రత తాండవిస్తోంది. అయినా, నాసిరకం పదార్థాలతోనే వంట వండి విద్యార్థులకు పెడుతున్నారు. మంగళవారం రాత్రి భోజనం చేసిన అనంతరం వైష్ణవి (9వ తరగతి), వైష్ణవి (10వ తరగతి), భానుప్రియ (6వ తరగతి), జాహ్నవి (8వ తరగతి) వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వైస్ ప్రిన్సిపాల్ చంద్రకళ సమాచారం ఇవ్వడంతో ఏఎన్ఎం వచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. అయినా తగ్గకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పురుగుల అన్నం.. కుళ్లిన కూరగాయాలతో వండుతున్న ఆహారంపై గతంలోనే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా అధికారుల్లో చలనం రాలేదు. పదుల సంఖ్యలో విద్యార్థినులు విషజ్వరాల బారిన పడ్డారు.హాస్టల్ అన్నంలో పురుగులుప్రత్తిపాడు: ‘‘అన్నంలో పురుగులు వస్తున్నాయి. తింటే వాంతులవుతున్నాయి. అదేమని అడిగితే మమ్మల్ని హాస్టల్ నుంచి వెళ్లమంటున్నారు’’ అంటూ హాస్టల్ విద్యార్థినులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన కుంచాల నాగమణి మూడేళ్లుగా ఫిరంగిపురంలో నివాసం ఉంటుంది. ఆమె తన కుమార్తెలు కుంచాల అఖిల (6వ తరగతి), కుంచాల అక్షయ (5వ తరగతి)లను ఈ ఏడాది ప్రత్తిపాడు ఎస్సీ బాలికల వసతి గృహంలో చేరి్పంచింది. కొద్దిరోజుల కిందట హాస్టల్లో పెట్టిన భోజనంలో పురుగులు రావడంతో అఖిల వాంతులు చేసుకుంది. దీంతో ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తోటి పిల్లలు కూడా కొడుతున్నారని, వచ్చి తీసుకుని వెళ్లాలని ఫోన్లో రోదించింది. దీంతో ఆదివారం తల్లి నాగమణి హాస్టల్కు వచ్చి అఖిలను ఇంటికి తీసుకువెళ్ళింది. తిరిగి మంగళవారం హాస్టల్కు వచ్చింది. ‘‘మీ పాపను హాస్టల్లో చేర్చుకోం.. మీతో తీసుకువెళ్లిపోండి. మీ పిల్ల వల్ల మిగిలిన వారు ఇబ్బంది పడుతున్నారు. మీ పాప ఆరోగ్యం సరిగా లేదు. మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని వస్తేనే చేర్చుకుంటా.’ అంటూ వార్డెన్ నాగమణికి చెప్పింది. స్టేషన్ మెట్లు ఎక్కిన హాస్టల్ విద్యార్థినులు దీంతో ఏమి చేయాలో పాలుపోని నాగమణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రత్తిపాడు పోలీస్స్టేషన్కు వెళ్లింది. ఎస్ఐ నరహరి ఎదుట వాపోయింది. మిగిలిన పిల్లలు మమ్మల్ని కొడుతున్నారని, మా పుస్తకాలను లాక్కుని బయట పడేస్తున్నారని ఎస్ఐకి పిల్లలు వివరించారు. హాస్టల్లో డీడీ విచారణ.. హాస్టల్ విద్యార్థినులు స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటన జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ యు.చెన్నయ్య దృష్టికి వెళ్లడంతో ఆయన రాత్రి హాస్టల్కు చేరుకున్నారు. భోజనం, సదుపాయాలను పరిశీలించారు. బాధిత విద్యార్థినులతోపాటు మిగిలిన విద్యార్థినులతో మాట్లాడారు. బాధిత విద్యార్థినులు డీడీ చెన్నయ్య ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం డీడీ మీడియాతో మాట్లాడుతూ.. హాస్టల్లో ఉన్న బియ్యాన్ని మారుస్తామన్నారు. -
తిరుమలలో చిరుత సంచారం కలకలం
సాక్షి,తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగుల నివాసాల వద్ద చిరుత సంచరించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీలో ఎంప్లాయిస్ క్వార్టర్స్ దగ్గర చిరుత నాటు కోళ్ల షెడ్డుపై దాడికి ప్రయత్నించింది. అనంతరం, అక్కడి నుంచి వేగంగా వెళ్లినట్లు కనిపిస్తోంది.అంతేకాదు, నివాసాల వద్దకు చేరుకున్న చిరుత కొద్ది నిమిషాలు అక్కడే తిరుగాడి సమీప అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చిరుత సంచారం విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ సిబ్బంది, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ బృందాలు అక్కడికి చేరుకుని చిరుత జాడను గుర్తించేందుకు చర్యలకు ఉపక్రమించారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ..‘తిరుమల అటవీ ప్రాంతం విస్తారంగా ఉండటం, ఆహార వనరులు అందుబాటులో ఉండటం వల్ల చిరుతలు అప్పుడప్పుడు మానవ నివాస ప్రాంతాలకు చేరుతుంటాయి. జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రత్యేక బృందాలు మోహరించాం’అని తెలిపారు.ఉద్యోగులు మాత్రం భయాందోళనలో ఉన్నారు. పిల్లలను బయటకు పంపడానికి భయపడుతున్నామని, రాత్రివేళల్లో బయటకు రావడం మానేశామని వారు తెలిపారు. చిరుతను పట్టుకునే వరకు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు. తిరుమలలో గత కొంతకాలంగా చిరుతల సంచారం పెరుగుతుండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇళ్ల లెక్క.. తిక్క తిక్క
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వలేదు. ఒక్క ఇల్లు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మించిన 3 లక్షల ఇళ్లను మేమే కట్టేశామని గొప్పలకు పోయిన చంద్రబాబు సర్కారు నవ్వులపాలైంది. పైగా, లక్షల్లో ఇళ్లు నిర్మిస్తామని డాబుసరి ప్రకటనలిస్తున్నారు. అందులోనూ గందరగోళమే. పేదల ఇళ్ల నిర్మాణంపై సీఎం ఒకలా, ఆయన మంత్రివర్గంలోని గృహ నిర్మాణ శాఖ మంత్రి మరోలా ప్రకటనలు చేసి అభాసుపాలయ్యారు. వచ్చే మూడేళ్లలో 17 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించేస్తామని ఈ నెల 21న గృహ నిర్మాణ శాఖపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. ఈ ప్రకటన చేసి జస్ట్ నాలుగు రోజులయిందో లేదో.. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం మీడియా ముందుకు వచ్చి ఐదేళ్లలో 15.59 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, మంత్రి పార్థసారథి చేసిన భిన్న ప్రకటనలు పేదల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేమికి అద్దం పడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అసలైతే అంతా బూటకమే! పేదల ఇళ్ల నిర్మాణంలో వాస్తవాల్లోకి వెళితే సీఎం, మంత్రి ఇరువురి ప్రకటనలు బూటకమేనని స్పష్టం అవుతుంది. రాష్ట్రంలోని పేదలందరి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ హయాంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద 31.19 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ రికార్డు స్థాయిలో 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. గతేడాది జూన్ నాటికి నిర్మాణం పూర్తయిన, తుది దశలో నిర్మాణంలో ఉన్న 3 లక్షల ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసేసి తామే కట్టేశామని బాబు ప్రచారం చేసుకున్నారు. ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంజూరు చేసి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లనే పూర్తి చేసినట్టు కలరింగ్ ఇవ్వాలని ఇప్పుడు బాబు సర్కార్ స్కెచ్ వేసుకుంది. అంతే తప్ప కొత్తగా నిర్మించేవి, ఇచ్చేవి ఉండవని అధికారవర్గాలే అంటున్నాయి.15.59 లక్షల ఇళ్లు పూర్తే లక్ష్యం: మంత్రిఐదేళ్లలో 15.59 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై–1 పథకం అమలు గడువును మరో ఏడాది పాటు పొడిగించిందని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలకు దరఖాస్తుల కోసం నిర్వహిస్తున్న సర్వేలో ఇప్పటి వరకు 81 వేల మందిని గుర్తించినట్టు తెలిపారు. దాదాపు 1.15 లక్షల మంది ప్రభుత్వ, పోరంబోకు స్థలాలలో ఉంటున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. -
కృష్ణా జలాల పునఃపంపిణీ చట్టవిరుద్ధం
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాలను పంపిణీ చేస్తూ బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) ఇచ్చిన తీర్పు (అవార్డు)ను పునఃసమీక్షించడం చట్ట విరుద్ధమని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ)–1956లో సెక్షన్–6(2) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీం కోర్టు డిక్రీతో సమానమని వివరించారు. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను యథాతథంగా కొనసాగించాల్సిందేనని.. లేదంటే పరిస్థితి తలకిందులు అవుతుందని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ 2013 నవంబర్ 29న కేడబ్ల్యూడీటీ–2 కేంద్రానికి ఇచి్చన తుది నివేదికలో వెల్లడించిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునరి్వభజన చట్టం–2014లో సెక్షన్–89 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు యథాతథంగా కొనసాగించాల్సిందేనన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్, కేడబ్ల్యూడీటీ–2 పంపిణీ చేసిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పునఃపంపిణీ చేసేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తాళపత్ర సభ్యులుగా కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ మంగళవారం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా తుది వాదనలు వినిపించారు. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించిందన్నారు. అప్పట్లోనే ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసిందన్నారు. కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంపిణీ చేస్తూ కేంద్రానికి కేడబ్ల్యూడీటీ–2 కూడా 2010 డిసెంబర్ 31న ఇచ్చిన తొలి నివేదిక.. 2013, నవంబర్ 29న తుది నివేదికలోనూ బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను యధాతథంగా కొనసాగించిందని వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసిందన్నారు. ఆ కేటాయింపులను కొనసాగించాలని కోరారు. కావేరి ట్రిబ్యునల్ దిగువ పరివాహక రాష్ట్రమైన తమిళనాడు హక్కులను పరిరక్షిస్తూ నీటి కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చిoదని, ఇదే విధంగా కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు అదనంగా నీటిని కేటాయించాలని కోరారు, తెలుగు గంగ, ఆర్డీఎస్ కుడి కాలువలకు కేడబ్ల్యూడీటీ–2 నీటి కేటాయింపులు చేసిందని, వాటితోపాటు హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని కోరారు. బుధవారం, గురువారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు కొనసాగనున్నాయి. ట్రిబ్యునల్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలవనరుల విభాగాల అధికారులు హాజరయ్యారు. -
‘బిడ్డా’.. తప్పుకో!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)లో టెండర్ల ప్రక్రియ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ నచ్చినోళ్లకు నచ్చినట్టు రూ.కోట్ల విలువైన కాంట్రాక్టులను కట్టబెట్టే తంతు యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా సింహాచలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం మెరుగైన సాంకేతిక సేవలు అందించేందుకు తలపెట్టిన ‘స్పిర్చువల్ డిజిటల్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు (డీఐపీ–డిప్)’ కాంట్రాక్టునూ అడ్డగోలుగా దోచిపెట్టేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రసాద్ పథకంలో భాగంగా రూ.2 కోట్లతో అధునాతన మల్టీమీడియా సేవలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్ రూపకల్పన, నిర్వహణకు ఏపీటీడీసీ ఆసక్తి వ్యక్తీకరణ (ఆర్ఎఫ్పీ) బిడ్లను ఆహ్వానించింది. అయితే,ఏడాదిన్నరగా మూడు సార్లు బిడ్ల ప్రక్రియ రద్దవగా.. ఇప్పుడు నాలుగో సారి సైతం గందరగోళంగా మారింది. అమాత్యులు చెప్పారని బెదిరింపులు..టెండర్ల ప్రక్రియలో అనర్హ కాంట్రాక్టు సంస్థలకు ఈడీ స్థాయి అధికారులు కొమ్ముకాస్తుండటం వ్యవస్థ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తోంది. వాస్తవానికి ‘డిప్’ ప్రాజెక్టులో అమాత్యుని అనుకూల వ్యక్తులకు టెండర్లు దక్కకపోవడంతో మూడు సార్లు రద్దు చేసినట్టు సమాచారం. ఇప్పుడు నాలుగోసారి మళ్లీ అర్హులను.. అనర్హులుగా చిత్రీకరించి అమాత్యుని అనుయాయుడికే టెండర్ కట్టబెట్టేందుకు పావులు కదుపుతుండటం అవినీతికి పరాకాష్టగా మారింది. నాలుగు కంపెనీలు బిడ్లు వేయగా అందులో రాజమహేంద్రవరానికి చెందిన ఓ కంపెనీకి ప్రాజెక్టు దక్కేలా ప్రణాళిక రూపొందించడం చర్చనీయాంశమైంది. పైగా మిగిలిన మూడు కాంట్రాక్టు సంస్థలకు స్వయంగా ఏపీటీడీసీ అధికారులు ‘మంత్రిగారి తాలూకా మనిషికి’ టెండర్ దక్కుతోందని, మీరు తప్పుకోవాలని ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతుండటం దిగజారిన పరిస్థితికి అద్దం పడుతోంది. వాస్తవానికి ఇదే రాజమహేంద్రవరం కంపెనీకి అనుబంధంగా ఉన్న మరో మౌలిక వసతుల కంపెనీకి అన్నవరం, అఖండగోదావరి వంటి ప్రాజెక్టులను ఇలానే బెదిరింపు ధోరణిలో కట్టబెట్టినట్టు విమర్శలొస్తున్నాయి.అన్నింటా అనర్హ సంస్థే!రాజమహేంద్రవరానికి చెందిన కంపెనీకి టెండర్ నిబంధనల ప్రకారం ఏడాదికి రూ.2 కోట్ల టర్నోవర్ లేదు. గత మూడేళ్లలోనూ సదరు సంస్థ ఎన్నడూ రూ.2 కోట్ల మార్కును చేరుకోలేదు. పైగా సంస్థ సమర్పించిన ఆర్థిక లావాదేవీలకు, చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చిన నివేదికలో తీవ్ర వ్యత్యాసం ఉన్నట్టు సమాచారం. సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత ముఖ్యమైన, ప్రాథమికంగా టెండర్ దరఖాస్తుల్లో సమర్పించాల్సిన ‘ఐఎస్ఓ’ సర్టిఫికెటూ లేదు. ఇన్ని లోపాలు ఉన్న సంస్థకు టెండర్ కట్టబెట్టాలని అధికార యంత్రాంగం ఉవ్విళ్లూరుతోంది. ఏపీటీడీసీ రూపొందించిన నిబంధనల్లో సాంకేతిక బిడ్లో టెండర్ రేటును ప్రస్తావిస్తే బిడ్డును తిరస్కరిస్తామని పేర్కొంది. ఇక్కడే సదరు రాజమహేంద్రవరం సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సాంకేతిక బిడ్లో టెండర్ రేటును కోట్ చేసినప్పటికీ క్వాలిఫై చేయడం అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. వాస్తవానికి రూ.2 కోట్ల ప్రాజెక్టు చేపట్టే కంపెనీలకు ఏడాదికి రూ.6కోట్ల వరకు టర్నోవర్ ఉండాలనే నిబంధన ఉంటుంది. కానీ, ఏపీటీడీïసీ అధికారులు మాత్రం ఆ పద్ధతికి తిలోదకాలు ఇస్తూ రూ.2కోట్ల నుంచి రూ.6కోట్ల వరకు టర్నోవర్ని బట్టి కంపెనీలకు మార్కులు నిర్ణయించింది. అంటే, తాము అనుకున్న సంస్థకు రూ.2 కోట్ల టర్నోవర్ ఉంటే టెండర్లలోకి తీసుకొచ్చే యత్నం చేసింది. మరోవైపు సాంకేతిక మూల్యాంకనంలో ప్రెజంటేషన్కు 50 మార్కులు పెట్టింది. ఇక్కడ మూల్యాంకనం కమిటీ ప్రెజంటేషన్ బాగోలేదని మార్కులు తగ్గించి తాము అనుకున్న సంస్థకు అధిక మార్కులు వేసే ఎత్తు్తగడ వేసింది. తద్వారా నచ్చిన సంస్థకు టెండర్ను కట్టబెట్టేందుకు రాచమార్గాన్ని వేసుకోవడం గమనార్హం. -
వైఎస్సార్సీపీపై కక్ష సాధింపే టీడీపీ కూటమి టార్గెట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీపై కక్షసాధింపే టీడీపీ కూటమి సర్కారు టార్గెట్ అని, ఆ నినాదాన్ని భుజానికెత్తుకుని తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆరి్డనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆ దిశలోనే కన్ఫెషన్ స్టేట్మెంట్స్తో కాన్సిపిరసీ థియరీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆక్షేపించారు. అందులో నుంచి వచ్చినవే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి , పరకామణి, లిక్కర్ వంటి కేసులు అని వెల్లడించారు. ఏ ఆధారాలు లేకుండానే అక్రమంగా కేసులు నమోదు చేసి ఎవరో ఒకరిని అరెస్టు చేయడం, బెదిరించడం.. ఆ తర్వాత వాంగ్మూలాలు నమోదు చేయడం.. వాటి ఆధారంగా టార్గెట్ లిస్ట్లో ఉన్న వారిపై కేసులు పెడుతూ, వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధిస్తున్నారని.. అదే సీఎం చంద్రబాబు నమ్ముకున్న కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీ అని సజ్జల మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. నెయ్యిపై ఏ ఆధారాలతో సిట్ విచారణ?..2019లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, మేము కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నట్లుగా కన్ఫెషన్, కాన్సిపిరసీ థియరీని అమలు చేసి ఉంటే, అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలకే ఆయన్ను అరెస్ట్ చేసే వాళ్లం. కానీ, ఏనాడూ మేము కక్షపూరితంగా వ్యవహరించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంటూ, ఏ ఆధారాలతో సిట్ ద్వారా విచారణ చేయిస్తుందో అర్థం కావడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాపై విచారణ చేస్తున్న సిట్, 2014–19 మధ్య జరిగిన నెయ్యి సరఫరాపైనా విచారణ చేస్తే అసలు నిజాలు తెలుస్తాయి. 2019 –24 మధ్య కేజీ నెయ్యి రూ.320 చొప్పున సేకరిస్తేనే కల్తీ అన్న నాయకులు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కేజీ నెయ్యి రూ.270కే సేకరించినప్పుడు కల్తీ జరిగినట్లు కాదా? ప్రభుత్వాలు మారినా టీటీడీలో దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవస్థల ప్రకారమే టెండర్ల నిర్వహణ, క్వాలిటీ చెకింగ్ జరుగుతుంది. పరకామణి చోరీ అంటూ కేసు పెట్టి, వైఎస్సార్సీపీ నాయకులను ఇరికించే ఉద్దేశంతోనే విచారణ పేరుతో ఏవీఎస్వో సతీష్ కుమార్ను సిట్ వేధించింది. ఆ బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని మేం మాట్లాడితే.. ఆధారాలు లేకుండానే హత్యగా ప్రచారం చేసిందే కాకుండా వైఎస్సార్సీపీ నాయకులే చంపించారని మాపై బురదజల్లారు.రిజెక్ట్ చేసిన నెయ్యిని ఎలా వాడారు?..‘‘టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలైలో క్వాలిటీ చెక్ తర్వాత నాలుగు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి వెనక్కి పంపారని చెబుతున్నారు. వెనక్కి పంపిన నెయ్యిని తిరిగి తీసుకొస్తే వాడినట్టు సిట్ రిపోర్టులో ఉంది. అలాంటప్పుడు రిజెక్ట్ చేసిన నెయ్యినే కూటమి ప్రభుత్వంలో ఎలా వాడారు? టీడీపీ హయాంలో జరిగిన తప్పునకు చంద్రబాబు బాధ్యత తీసుకోరా? లిక్కర్ కేసులో ఇన్నాళ్లుగా విచారణ చేస్తున్న ప్రభుత్వం ఏం సాధించినట్టు? న్యాయస్థానాల దగ్గర విచారణ పేరుతో మా నాయకులను అదుపులోకి తీసుకుని నెలల తరబడి జైలుపాలు చేశారు.’’ అని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.ఎస్ బ్యాంకులో టీటీడీ నిధుల జమ నియమాలకు విరుద్ధం కాదా?‘‘ప్రైవేట్ బ్యాంకులో 10 శాతానికి మించి టీటీడీ నిధులు డిపాజిట్ చేయకూడదనే నిబంధన ఉంది. కానీ టీటీడీ హయాంలో నిబంధనలు ఉల్లంఘించి ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంకులో రూ.1300 కోట్లకు పైగా జమ చేశారు. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాక దాన్ని జాతీయ బ్యాంకుల్లోకి మార్చారు. ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన దానికి చంద్రబాబే కారణమని మేం ఆరోపించామా? కుట్ర రాజకీయాలు చేశామా?’’ అని సజ్జల ప్రశ్నించారు. లాయర్కు రూ.8 కోట్ల ఫీజు!‘‘చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం వాదించిన లాయర్ సిద్దార్థ లూథ్రాని తీసుకొచ్చి వైఎస్సార్సీపీ నాయకుల మీద బనాయించిన అక్రమ కేసులన్నీ ఆయనకే అప్పజెప్పారు. ఈ కేసులకు ఆయనకు ఇప్పటి వరకు రూ.8 కోట్లకు పైగా జనం సొమ్మును ఫీజు కింద చెల్లించారు’’ అని సజ్జల విమర్శించారు. కేసుల క్లోజర్ కుట్ర!‘‘సీఎం చంద్రబాబు అధికార దుర్వినియోగంతో కేసులు క్లోజ్ చేయించుకునే కుట్ర చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంతోపాటు, బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు కేసులను మాఫీ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బాబుపై ఉన్న అన్ని కేసులూ మళ్లీ బయటకు తీస్తాం.’’ అని రామకృష్ణారెడ్డి తేల్చిచెప్పారు.ఎందుకంత కడుపు మంట?‘‘తెలంగాణలో బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం మాకేంటి. వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారు. 2014 తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తే వైఎస్సార్సీపీకి 7శాతం ఓట్లు వచ్చాయి. అయినా తెలంగాణ రాజకీయాలు వద్దనుకుని వచ్చిన మాకు బలనిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్కు జనాదరణ పెరుగుతుంటే టీడీపీ, ఎల్లోవీుడియాకు ఎందుకంత కడుపుమంట?’’ అని సజ్జల ప్రశ్నించారు.కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన‘‘వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొచి్చన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందుకే వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో భారీగా పాల్గొని సర్కారుపై గళమెత్తుతున్నారు. కోటి సంతకాల సేకరణ గొప్ప ప్రజా ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోతుంది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఒక్క ఇల్లు కట్టించకపోయినా క్రెడిట్ చోరీ..‘‘వైఎస్సార్సీపీ హయాంలో పూర్తి చేసిన 3 లక్షల ఇళ్లను కూటమి ప్రభుత్వంలో ఇచ్చినట్టు చెప్పుకోవడం దారుణం. పేదల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా క్రెడిట్ చోరీకి పాల్పడటం సిగ్గుచేటు.’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే..‘‘చంద్రబాబు తల్లి అమ్మణమ్మ చెప్పిన కథలో నక్క చంద్రబాబే. లోకేశ్ పక్కనే ఉన్నారు కాబట్టి ఆ కథనే చాగంటి మరో రకంగా చెప్పారు. గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి అదానీ పేరెత్తితే వైఎస్ జగన్ కి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు కిక్కురుమనడం లేదు. విశాఖలో అనామక కంపెనీలకు బాబు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారు. అదే హెరిటేజ్ ఆస్తులైతే అంత తక్కువ ధరకు ఇస్తారా?’’ అని సజ్జల నిలదీశారు. -
అమ్మకానికి భవానీ ద్వీపం!
సాక్షి, అమరావతి: కృష్ణమ్మ ఒడిలో ప్రకృతి రమణీయత మధ్య హాయిగా ఆహ్లాదాన్ని పంచే కీలక పర్యాటక ప్రాజెక్టు ‘భవానీ ద్వీపం’పై చంద్రబాబు సర్కార్ కన్నుపడింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత దాదాపు 230 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రకృతి స్వర్గధామం విలువ అక్షరాలా రూ.4,600 కోట్లు! ఇప్పటికే కృష్ణా నదికి అటు వైపు రాజధాని ప్రాంతం అమరావతిలో వేల ఎకరాలు బినామీల పేరుతో కొల్లగొట్టిన ఎల్లో గ్యాంగ్.. నది నడి మధ్యలో ఉన్న భవానీ ద్వీపాన్ని కూడా చెరబట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకు సీఎం చంద్రబాబు తనకు అలవాటైన పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) విధానాన్ని పక్కా పన్నాగంతో తెరపైకి తెచ్చారు. ఆ విధానం ముసుగులో తన బినావీులకు భవానీ ద్వీపాన్ని ధారాదత్తం చేసేందుకు కుతంత్రాన్ని వేగవంతం చేశారు. మార్కెట్ అంచనాల ప్రకారం భవానీ ద్వీపంలో ఎకరా భూమి విలువ పుష్కరకాలం కిందటే రూ.4 కోట్లకుపైగా ఉంది. ప్రస్తుతం రాజధాని నేపథ్యంలో ఎకరం రూ.20 కోట్లు పైగా పలుకుతోంది. ఈ లెక్కన రూ.4,600 కోట్లు చేస్తుంది. ఇంతటి ఖరీదైన భూమిని చంద్రబాబు ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడికి అప్పనంగా దోచి పెడుతోంది. సూత్రధారి బాబు.. నారాయణ, గంటా పాత్రధారులుగతంలో కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వం.. అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష అసోసియేట్స్ ఫిషింగ్ లిమిటెడ్ మౌలిక సదుపాయాలు–పెట్టుబడుల సంస్థకు భవానీ ద్వీపాన్ని 55 ఏళ్ల పాటు లీజు రూపంలో కట్టబెట్టేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని నాటి ప్రతిపక్ష పార్టీలైన వైఎస్సార్సీపీతోపాటు టీడీపీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రభుత్వ పెద్దే సూత్రధారిగా.. నాటి పాత్రధారులను తెరపైకి తెచ్చి ఈ భారీ భూ దోపిడీకి కుతంత్రం రచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతిలో తన దోపిడీ భాగస్వామి మంత్రి నారాయణ, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ద్వారానే కథ నడిపిస్తుండటం గమనార్హం. గంటా శ్రీనివాసరావు బినామీగా గుర్తింపు పొందిన కాశీ విశ్వనాథ్కు చెందిన విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేటు లిమిటెడ్, విశ్వనాథ్ అవెన్యూస్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను తెరపైకి తెచ్చింది. ఆ సంస్థలకు ’అడ్వెంచర్ థ్రిల్ సిటీ’ పేరుతో భవానీ ద్వీపాన్ని దశల వారీగా కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది. ఇప్పటికే పది ఎకరాలను కట్టబెడుతూ కనీసం సర్వే నంబర్లు కూడా లేకుండా ఈ నెల 13వ తేదీన జీవో జారీ చేయడం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. అంతేకాకుండా ఏకంగా 99 ఏళ్లకు లీజుకు కట్టబెట్టడం ప్రభుత్వ బరితెగింపును బట్టబయలు చేస్తోంది. కాశీ విశ్వనాథ్ కేవలం ముసుగు అన్నది బహిరంగ రహస్యం. నిర్లక్ష్యం మాటున కబ్జా కుట్ర! ప్రపంచంలోనే మంచి నీటి సముదాయ ద్వీపంగా విశేష గుర్తింపు పొందిన భవానీ ద్వీపాన్ని కొల్లగొట్టడం కోసమే చంద్రబాబు ప్రభుత్వం దానిని పర్యాటకపరంగా అభివృద్ధి చేయకుండా ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. గత ఏడాది వరదల్లో దెబ్బతిన్న భవానీ ద్వీపంలో కనీస మౌలిక సదుపాయాలను పునరుద్ధరించనే లేదు. 230 ఎకరాల్లో భవానీ ద్వీపం భూములను నోటిఫై చేయగా, 30 ఎకరాల్లో భవానీ ఐలాండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (బీఐటీసీ) ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇందులో ఏపీటీడీసీకి చెందిన 45 గదుల కాటేజీల ద్వారా ఆతిథ్య సేవలను అందిస్తోంది. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రి కింద ఉన్న అత్యంత విలువైన, ఏపీటీడీసీకి కీలక ఆదాయ వనరుగా ఉన్న బెరంపార్కు హోటల్తో పాటు ద్వీపంలోని 45 గదులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ టెండర్ ప్రక్రియ ముగిసి ప్రైవేటు వ్యక్తులకు వీటిని కట్టబెడితే.. అదే బెరంపార్కులో నుంచి భవానీ ద్వీపానికి వెళ్లే మార్గంలో సామాన్యులు అడుగు పెట్టలేని దుస్థితి దాపురిస్తుంది.గత ప్రభుత్వంలో పర్యాటక వెలుగులువైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24లో భవానీ ద్వీపాన్ని రాజధాని ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిది్దంది. పర్యాటక శాఖ ద్వారానే మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. దాంతో సందర్శకుల ద్వారా భారీగా పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. 2022–23లో రికార్డు స్థాయిలో రూ.3.13 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది 2023–24లో రూ.4 కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వంలోనే దుర్గగుడి సమీపం నుంచి భవానీ ద్వీపానికి రోప్వే కూడా మంజూరైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం పడిపోయింది.4 వేల ఎకరాల్లో ద్వీప సముదాయం!కృష్ణానదిలో భవానీ ద్వీపంతో పాటు గుంటూరు జిల్లాలోనూ విస్తరించిన ద్వీప సముదాయాలన్నీ కలిపితే సుమారు 4 వేల ఎకరాలు ఉంటుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇందులో 700 ఎకరాల భూమిని అనువైనదిగా గుర్తించి వినియోగంలోకి తీసుకొచ్చేలా కాన్సెప్ట్ ప్లాన్ను రూపొందించింది. వాటిని నాలుగు జోన్లుగా విభజించి ప్రైవేటుకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిని అప్పట్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు తాజాగా పర్యాటక ప్రాధికార సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 3,913.96 ఎకరాల పర్యాటక భూములను నోటిఫై చేసి.. అనుయాయులకు అప్పనంగా కట్టబెట్టేలా కుట్రలు చేస్తోంది. -
బాబు పాలనలో దారుణంగా పతనమైన అరటి ధరలు
సాక్షి, అమరావతి: అరటి రైతు ఆక్రందన.. అరణ్యరోదనగా మారింది. ఓ పక్క చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పాతాళానికి దిగజారిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ముందెన్నడూ లేని సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్న అరటి రైతును ఆదుకునేందుకు కనీస చర్యలూ తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇలాంటి విపత్తు వేళ నిజంగా రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి, మానవత్వం పాలకుల్లో ఉంటే యుద్ధ ప్రాతిపదికన స్వయంగా రంగంలోకి దిగాలి. అన్నదాతకు అండగా నిలవాలి. ఆపన్న హస్తం అందించాలి. తక్షణమే జోక్యం చేసుకొని కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ఉన్న అరటిని కొనుగోలు చేసి ప్రభుత్వమే స్వయంగా మార్కెటింగ్ చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మొక్కుబడి సమీక్షలు, కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది తప్ప రైతులను ఆదుకునే దిశగా ఒక్క అడుగూ ముందుకేసిన పాపాన పోలేదు. మిరప.. పొగాకు.. మామిడి.. ఉల్లి తరహాలోనే అరటి రైతుల జీవితాలతోనూ బాబు సర్కారు చెలగాటమాడుతోంది. టన్ను రూ.1,000కు దిగజారిన ధర..రాష్ట్రంలో 2.77 లక్షల ఎకరాల్లో అరటి సాగవుతోంది. వైఎస్సార్ కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోనే లక్ష ఎకరాలకుపైగా సాగవుతోంది. ఇక్కడ మాత్రమే సాగయ్యే జీ–9 వెరైటీకి అంతర్జాతీయంగా డిమాండ్ ఎక్కువ. ఇది పూర్తిగా ఎక్స్ పోర్ట్ క్వాలిటీ. ఎకరాకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులవుతున్నాయి. దాదాపు 70 లక్షల టన్నులకు పైగా దిగుబడులు వస్తున్నా యి. టిష్యూకల్చర్ ద్వారా నాటిన మొదటి పంట దిగుబడులు అనంతపురం, నంద్యాల జిల్లాలలో డిసెంబర్ నుంచి మార్చి వరకు, వైఎస్సార్ కడప నుంచి జనవరి నుంచి మే వరకు కొనసాగుతుంది. రెండో పంట పిలకల ద్వారా వచ్చే పంట (రెండో పంట) జూలై నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. 2023–24లో టన్ను రూ.30వేలకు పైగా పలికింది. అలాంటిది చంద్రబాబు సర్కారు అసమర్థ విధానాల వల్ల ప్రస్తుతం టన్ను రూ.1,000 పలకడం గగనమైపోయింది.సంక్షోభానికి కారణమిదే..ఈ ఏడాది మహారాష్ట్రలో ఉన్న సాగు విస్తీర్ణం 30నుంచి 40 శాతం పెరిగింది. మరొక వైపు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లో కొత్తగా అరటి సాగు మొదలైంది. సాధారణంగా మహారాష్ట్రలో ఏటా అక్టోబర్ కల్లా పంట కోతలు పూర్తయ్యేవి. దీంతో నవంబర్ నుంచి ఢిల్లీ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ మార్కెట్కు వచ్చేవారు. ఈసారి మహారాష్ట్రలో ఏరియా పెరగడం వలన కోతలు కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి ఉత్తర భారతదేశానికి ఏపీతో పోలిస్తే రవాణా ఖర్చులు తక్కువ. ఉదాహరణకు ఒక లారీ ట్రాన్స్పోర్టు చేయాలంటే ఏపీ నుంచి ఢిల్లీకి రూ.60 వేల నుంచి రూ.70వేలు ఖర్చవుతుండగా, మహారాష్ట్ర నుంచి రూ.30 వేల నుంచి రూ.40వేలు ఖర్చవుతుంది. పంట ఉన్నంత కాలం అక్కడ నుంచే కొనుగోలు చేసేందుకు ఢిల్లీ వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పిలక ద్వారా వచ్చే రెండో పంట (రెటూన్ క్రాప్) కోతకొచ్చింది. ధరల పతనాన్ని ముందుగానే పసిగట్టిన అధికారులు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా అక్టోబర్ రెండో వారం వరకు కిలో రూ.8 నుంచి రూ.10 వరకు పలికిన ధర కాస్తా ఆ తర్వాత క్రమేపి క్షీణించి రూపాయికి దిగజారింది.చంద్రబాబుకు నిజంగా మానవత్వం ఉండి ఉంటే..వైఎస్ జగన్ హయాంలో కరోనా విపత్తు వేళ కూడా ఇదే రీతిలో ధరలు పతనమవుతున్న సందర్భంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని అరటి రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొని అండగా నిలిచింది. ఈ విధంగా దాదాపు 16వేల టన్నులకుపైగా అరటిని కొనుగోలు చేసి సబ్సిడీ ధరపై వినియోగదారులకు అందజేసింది. ఒక్క అరటే కాదు.. ఆ తర్వాత బత్తాయికి ధర లేనప్పుడు కూడా ఇదే రీతిలో చొరవ తీసుకుని 4,109 టన్నుల బత్తాయిని రైతుల నుంచి మద్దతు ధరకు సేకరించి డ్వాక్రా సంఘాల సభ్యులకు సబ్సిడీపై అందజేసింది. కిలో రూపాయికి కూడా కొనేవాడు లేకపోవడంతో రేయింబవళ్లు కంటికిరెప్పలా పెంచిన పచ్చని అరటి తోటలను తమ చేతులతోనే నేలకూల్చేస్తూ..పంటలను దున్నేస్తుంటే సీఎం చంద్రబాబు కనీసం మానవత్వం చూపడం లేదు. నిజంగా పాలకులకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈపాటికే చొరవ తీసుకుని రైతుల నుంచి కనీసం కిలో రూ.15 నుంచి రూ.20 మధ్య కొనుగోలు చేసి రైతు బజార్ల ద్వారా వినియోగ దారులకు సబ్సిడీపై పంపిణీ చేయడం లేదా కనీసం మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందించే ఆలోచన చేసేవారు. కానీ అలా చేయలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష చేసినప్పుడు ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. కానీ చంద్రబాబు మాత్రం మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతున్నారు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించండి.. ఢిల్లీ వ్యాపారులతో అనుసంధానం చేయండి అంటూ ఆదేశాలివ్వడం తప్ప రైతులను ఆదుకునే దిశగా ఎలాంటి ప్రత్యక్ష చర్యలూ తీసుకున్న పాపాన పోవడం లేదు. ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చందంగా ఇప్పుడు ఢిల్లీ వ్యాపారులతో ట్రేడర్స్ మీట్స్ అంటూ హంగామా చేస్తున్నారు.బహిరంగ మార్కెట్లో కిలో రూ.40–100రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని బహిరంగ మార్కెట్లో అరటి నాణ్యతను బట్టి కిలో రూ.40 నుంచి రూ.60 పలుకుతున్నాయి. కాస్త పెద్ద సైజు (ఎక్స్పోర్టు క్వాలిటీ) అయితే కిలో రూ.60 నుంచి రూ.80 కూడా పలుకుతున్నాయి. హైపర్ మార్కెట్లలో అయితే కిలో రూ.100 కూడా పలుకుతున్నాయి. చివరికి అరటి పంట ఎక్కువగా ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లోనూ కిలో రూ.40కు తక్కువ అమ్మడం లేదు. కానీ అరటి పండించే రైతుకు మాత్రం కిలో రూపాయికి మించి పలకడం లేదు. మధ్యలో ఈ సొమ్ములంతా దళారుల మాటున అధికార టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి. కారణం ప్రధాన అరటి మార్కెట్లతోపాటు సీమలోని మార్కెట్ యార్డులన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం చేయాలంటే పచ్చ ముఠాలకు మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. దీంతో ఇక్కడి టీడీపీ నేతలు వ్యాపారులతో కుమ్మక్కై.. రైతులకు ధర లేకుండా చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. -
కొత్తగా మరో మూడు జిల్లాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా పోలవరంతోపాటు మార్కాపురం, మదనపల్లె జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత పోలవరం ప్రాంతంలో ఎలాంటి మార్పులు చేయకుండా ఏలూరు జిల్లాలోనే కొనసాగించనుంది. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు కలిపి కొత్తగా పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు సచివాలయంలో మంగళవారం చర్చించి ఖరారు చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే ఈ మూడు జిల్లాలతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 29కి పెరగనుంది. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. అనకాపల్లి జిలా్లలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లె జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివాణం మండలాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.3.49 లక్షల జనాభాతో పోలవరం జిల్లాపాడేరు కేంద్రంగా ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాను విడగొట్టి పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో 3.49 లక్షల అతి తక్కువ జనాభాతో ఈ జిల్లా ఏర్పాటవుతోంది. రాష్ట్రంలో అతి చిన్న జిల్లా ఇదే కాబోతోంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు.. చింతూరు డివిజన్లోని యెటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. ప్రకాశం జిల్లాను విడగొట్టి కొత్తగా మార్కాపురం జిల్లా ప్రకాశం జిల్లాను విభజించి మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది. యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండనున్నాయి. మార్కాపురం రెవెన్యూ డివిజన్లోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు.. కనిగిరి డివిజన్లోని హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు కొత్త జిల్లాలో ఉండనున్నాయి. 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లతో మదనపల్లె జిల్లామదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండనున్నాయి. మదనపల్లె రెవెన్యూ డివిజన్లోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పీటీ సముద్రం, బీరొంగి కొత్తకోట, చౌడేపల్లె, పుంగనూరు మండలాలు.. పీలేరు డివిజన్లోని సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారి పల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఈ జిల్లాలో ఉండనున్నాయి. చెదిరిపోతున్న 17 జిల్లాలుఈ పునర్వ్యస్థీకరణతో 17 జిల్లాలు చెదిరిపోతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా ఏర్పాటైన జిల్లాల స్వరూపం చాలా వరకు మారిపోనుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలను ఈ నెల 28వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నారు.డివిజన్లు, మండలాల్లో మార్పులు» శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లోని నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్లో కలపనున్నారు.» అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లోని మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది.» కాకినాడ డివిజన్లోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లో కలుపుతున్నారు.» అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో కలపనున్నారు.» పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం పేరు వాసవీ పెనుగొండ మండలంగా మారనుంది.» బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. అద్దంకి, దర్శి నియోజకవర్గాలతో కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. » కనిగిరి రెవెన్యూ డివిజన్లో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు.» కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. » నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూర్, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో కలపనున్నారు.» పలమనేరు డివిజన్లోని బంగారుపాళ్యం మండలాన్ని చిత్తూరు డివిజన్లో కలుపుతున్నారు. » సదుం, సోమల, పీలేరు, గుర్రం కొండ, కలకడ, కేబీ పల్లి, కలికిరి, వాల్మీకిపురం మండలాలతో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది.» పలమనేరు డివిజన్లోని చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లె రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు.» వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు. » శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయనున్నారు.» కదిరి డివిజన్లోని ఆమడగూరు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్లో విలీనం చేయనున్నారు. పుట్టపర్తి డివిజన్లో ఉన్న గోరంట్ల మండలాన్ని పెనుకొండ డివిజన్లో కలపనున్నారు. » నంద్యాల జిల్లా డోన్ రెవెన్యూ డివిజన్లోని బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల.. నంద్యాల డివిజన్లోని సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి,అమరావతి: అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది ఉత్తరవాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
దోపిడీ నాదే.. దర్యాప్తూ నాదే!.. బాబు అక్రమాలకు ‘పచ్చ’ తర్పణం!
సాక్షి, అమరావతి: చంద్రబాబు బరితెగించి సాగించిన అవినీతి దందాను చాప చుట్టేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. అధికారంలో ఉండగానే ఆ అవినీతి కేసులను క్లోజ్ చేసేయాలన్న కుతంత్రమే ఏకైక అజెండాగా చెలరేగిపోతోంది. తనపై నమోదైన అవినీతి కేసులకు సంబంధించి దర్యాప్తు అధికారులతో చంద్రబాబు కొద్ది నెలల క్రితం సమీక్షా సమావేశం నిర్వహించడం గమనార్హం. అంటే ఆ కేసులను ఎలా క్లోజ్ చేయాలో ఆయనే దిశానిర్దేశం చేసినట్లు అప్పుడే స్పష్టమైంది.అనంతరం చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు ఆ కేసుల మూసివేత బాధ్యతను ప్రత్యేకంగా అప్పగించారు. మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రస్తుత డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ ద్వారా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. గతంలో చంద్రబాబు అవినీతిపై సీఐడీకి ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ మధుసూదన్ రెడ్డి, అప్పటి సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్... ఇలా అందరూ ప్రభుత్వ వేధింపులకు తలొగ్గారు.గతంలో తాము చేసిన ఫిర్యాదులు, ఇచ్చిన వాంగ్మూలాలకు విరుద్ధంగా అబ్బే..! దర్యాప్తు అవసరం లేదని న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి భిన్నంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు. అలా సామ దాన బేధ దండోపాయాలను ప్రయోగించి మరీ చంద్రబాబుపై అవినీతి కేసులు అర్ధాంతరంగా మూసివేతకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా సాగిస్తున్న కుతంత్రాన్ని క్లైమాక్స్కు తెచ్చింది. బరితెగించి అడ్డగోలుగా సాగించిన అవినీతి కేసుల్లో అసలు ఆధారాలే లేవని చంద్రబాబు గూటి చిలుక సీఐడీ ఇప్పటికే నివేదించినట్లు సమాచారం. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అని పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.దర్యాప్తును అటకెక్కించిన కూటమి సర్కారుచంద్రబాబే ప్రధాన నిందితుడుగా ఉన్న స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తును టీడీపీ కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది. స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్నెట్, అసైన్డ్ భూముల కుంభకోణం కేసుల చార్జిషీట్లను సీఐడీ గతంలోనే న్యాయస్థానానికి సమర్పించింది. అయితే కొన్ని వివరణలు కోరుతూ న్యాయస్థానం వాటిని గత ఏడాది మేలో సీఐడీకి పంపింది.అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాటిని కేస్ స్టడీలతో సీఐడీ అధికారులకు అందచేశారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ కేసులను నీరుగార్చేలా టీడీపీ పెద్దలు సీఐడీపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సీఐడీ ఆ చార్జిషీట్లను న్యాయస్థానానికి సమర్పించనే లేదు. కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు ప్రయత్నించలేదు. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేస్తూ చార్జ్షీట్లను తొక్కిపెట్టింది. సాక్షులకు బెదిరింపులు.. తప్పుడు వాంగ్మూలాలుచంద్రబాబుపై అవినీతి కేసులను నీరుగార్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం వేధింపులకు బరి తెగించింది. గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతా«దికారులు, ఇతరులను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించింది. సాక్షులను బెదిరించి దారికి తెచ్చుకోకపోతే చంద్రబాబును ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేయడం సాధ్యం కాదని తేలడంతో పోలీసు, సీఐడీ అధికారులు కుట్రపూరితంగా చెలరేగిపోతున్నారు. చంద్రబాబు అవినీతిపై గతంలో ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్రెడ్డి తదితరులను పోలీసులు బెదిరించి వేధించారు.ఇప్పటికే గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చిన వాసుదేవరెడ్డి... తాజాగా చంద్రబాబు హయాంలో మద్యం దోపిడీకి సంబంధించిన కేసులో గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదుకు విరుద్ధంగా స్పందించినట్టు సమాచారం. తద్వారా ఆ కేసు మూసివేతకు ఆయన సహకరించారని తెలుస్తోంది. అదే రీతిలో మధుసూదన్రెడ్డి కూడా పోలీసుల వేధింపులకు తలొగ్గి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసినట్లు సమాచారం.ఇక అసైన్డ్ భూముల కేసులో గతంలో చంద్రబాబు అవినీతిపై న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ వాంగ్మూలం ఇచ్చిన అప్పటి సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఇప్పటికే ప్లేటు ఫిరాయించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, పోలీసు ఉన్నతాధికారుల వేధింపులతో ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధమైన వాంగ్మూలాన్ని గుంటూరు కోర్టులో నమోదు చేశారు. ఇన్నర్రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసు, ఇసుక కేసు, స్కిల్ స్కామ్లలో కూడా టీడీపీ పెద్దలు ఇదే రీతిలో ఫిర్యాదుదారులు, సాక్షులను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. అటూ ఇటూ బాబే... ఇక మూసివేతే! ఇలా చంద్రబాబు అవినీతి కేసులను అర్ధాంతరంగా మూసివేసే కుట్రను టీడీపీ కూటమి ప్రభుత్వం క్లైమాక్స్కు తెచ్చింది. అందుకు అవసరమైన న్యాయపరమైన ప్రక్రియను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు పాల్పడిన అవినీతి కేసుల్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్కిల్ స్కామ్, అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు, ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం, మద్యం దందా, ఇసుక మాఫియా... ఇలా అన్ని కేసుల్లోనూ ప్రధాన నిందితుడు చంద్రబాబే. ఆ అవినీతి బాగోతం కేసులపై దర్యాప్తు చేసి న్యాయస్థానానికి ఆధారాలు సమర్పించి నిందితులకు శిక్షపడేలా చేయాల్సింది దర్యాప్తు సంస్థ సీఐడీ, పోలీసు శాఖలే.కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబే పోలీసు, సీఐడీ విభాగాలకు బాస్గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎస్ అధికారుల పోస్టింగులు, పదోన్నతులు అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆ రెండు విభాగాలూ ఆయన చెప్పినట్లు వినాల్సిందే. దీంతో తనపై అవినీతి కేసులను వెంటనే క్లోజ్ చేయాలని ఆయన ఆదేశించగానే పోలీసు, సీఐడీ విభాగాలు అమలు చేస్తున్నాయి. గతంలో చంద్రబాబు అవినీతిపై అప్పటి ప్రభుత్వ అధికారులు పోలీసులు, సీఐడీకి ఫిర్యాదు చేశారు. వారిపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది.చంద్రబాబు అవినీతిపై ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నమోదు చేసిన కేసుల్లో నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు కోసం పట్టుబట్టకూడదని వేధిస్తోంది. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక ఆ అధికారులు అందుకు తలొగ్గుతున్నారు. దీనిపై ఎవరైనా తటస్థ వ్యక్తులు, సామాజికవేత్తలు ప్రశ్నిస్తే .. సాంకేతిక కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు.చంద్రబాబు అవినీతి కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ల కాపీల కోసం పాత్రికేయుడు బాలగంగాధర్ తిలక్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ‘మీరు ఫిర్యాదుదారుడు కాదు.. బాధితుడు కూడా కాదు కదా.. !’అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారులైన అప్పటి అధికారులు ప్రస్తుతం కూటమి సర్కారు వేధింపులతో మౌనం దాలుస్తున్నారు. టీడీపీ పెద్దల కుట్రలకు వంతపాడుతున్నారు. దాంతో అటు దొంగ... ఇటు పోలీసు రెండూ బాబే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీన్నే అవకాశంగా చేసుకుని చంద్రబాబుపై అవినీతి కేసులను గుట్టుచప్పుడు కాకుండా మూసివేసేందుకు పావులు చకచకా కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది.కేసుల మూసివేతకు పక్కా పన్నాగం.. లూథ్రా గుప్పిట్లో పోలీసు శాఖచంద్రబాబే సూత్రధారి, లబ్ధిదారుగా సాగిన కుంభకోణాల కేసుల మూసివేత కుతంత్రానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెరతీసింది. ఈ అవినీతి బాగోతంపై గతంలో సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు సూత్రధారిగా పాల్పడిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం, అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ ప్రాజెక్టులో నిధులు కొల్లగొట్టడంతోపాటు మద్యం, ఇసుక కుంభకోణాల్లో భారీ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడైంది. వీటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పూర్తి ఆధారాలతో నివేదించింది.అందులో స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయగా.. ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. 52 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మిగిలిన ఐదు కేసులు కూడా సీఐడీ విచారణలోనే ఉన్నాయి. కాగా ఆ కేసులను అడ్డగోలుగా మూసివేయించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా కుతంత్రాన్ని సాగిస్తోంది. అందుకోసం చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను ప్రత్యేకంగా పురమాయించారు. యావత్ పోలీసు, న్యాయ శాఖలను ఆయన గుప్పిట్లో పెట్టారు.ఈ క్రమంలో ఆయన కొన్ని నెలల క్రితం విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం. అవినీతి కేసుల ఎఫ్ఐఆర్ల నుంచి చంద్రబాబు పేరును తప్పించడం.. అనంతరం ఆ కేసులను మూసివేయడం.. అందుకు ఆ కేసుల్లో సాక్షులను ఎలా వేధించాలి..? ఎలా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయాలి..? న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఎలాంటి అడ్డదారులు తొక్కాలి..? అనే విషయాలను ఆయన పోలీసు, సీఐడీ అధికారులకు అంశాలవారీగా వివరించారని తెలుస్తోంది.న్యాయ విచారణకు సహాయ నిరాకరణన్యాయస్థానాల్లో కొనసాగుతున్న చంద్రబాబు అవినీతి కేసుల విచారణకు న్యాయ శాఖ సహాయ నిరాకరణ చేస్తోంది. స్కిల్స్కామ్ కేసులో 2023లో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు, హైకోర్టు విధించిన షరతులను చంద్రబాబు నిర్భీతిగా ఉల్లంఘించారు. దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ.. రెడ్బుక్ పేరిట హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షరతులు ఉల్లంఘించినందున చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని సీఐడీ 2023 డిసెంబర్లోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ కొనసాగుతోంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఐడీ రూటు మార్చేసింది. సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్పై విచారణకు సహకరించడం లేదు. సుప్రీం కోర్టులో సీఐడీ వాదనను వినిపించాల్సిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. అది సరి కాదని సుప్రీం కోర్టు హితవు పలికినా తీరు మారడంలేదు. -
అప్పుడు.. ఇప్పుడు రైతులకు బాసటగా..
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హయాంలో రైతులకు కొండంత అండగా నిలిచారు. రైతుకు భరోసా దగ్గర్నుంచీ రైతు మద్దతు ధర వరకూ అన్నింటా తోడుగా ఉన్నారు. ముందెన్నడూ లేని విధంగా తొలిసారిగా రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు.. కొన్ని నిర్దేశిత పంటలకు గనక ధర పడిపోతే... జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ నిధి సాయంతో వాటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. పొగాకుతో సహా ప్రధాన వ్యవసాయ వాణిజ్య పంటలైన జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పత్తి, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంటలకు మార్కెట్ జోక్యంతో కనీస మద్దతు ధరలు దక్కేలా చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.(What YS Jagan Did For Farmers)కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ పంటలకు దేశంలో కనీస మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వమేదైనా ఉందీ అంటే... అది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. రైతులకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో... వారి పంటలను దారుణమైన పరిస్థితుల్లో కూడా తక్కువకు అమ్ముకోరాదన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా గత జగన్ ప్రభుత్వం కొన్ని పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్రమే. కాకుంటే చాలా పంటలను కేంద్రం కొనుగోలు చేయదు. అలాంటి పంటలు వేసే రైతులకూ గిట్టుబాటు ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మూడున్నరేళ్ల కిందట ఇతర పంటలకు ఉదారంగా గిట్టుబాటు ధరలు ప్రకటించింది. అంతకన్నా ఎక్కువ ధరలుంటే రైతులు మార్కెట్లోనే విక్రయించుకుంటారు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ అనుకోని విపత్కర పరిస్థితులు తలెత్తి కొన్ని ప్రత్యేక పంటలకు గనక మార్కెట్లో ధర పడిపోతే... వారిని ఆదుకోవటానికి రాష్ట్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ఉంటుంది.2014 నుంచి 2019 వరకూ ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వివిధ పంటల కొనుగోలు కోసం చేసిన ఖర్చు కేవలం రూ.3,322 కోట్లు. మరి వైఎస్ జగన్ ప్రభత్వం మూడున్నరేళ్లలోనే ప్రభుత్వం వివిధ పంటల కొనుగోలు కోసం ఎంత వెచ్చించిందో తెలుసా? అక్షరాలా ఏడువేల నూటయాభై ఏడు కోట్లు. ఐదేళ్లలో ధాన్యం కొనుగోలు కోసం చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.43,134 కోట్లయితే... మూడేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 48,793 కోట్లు వెచ్చించింది. అంటే సగటున చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి రూ.8,600 కోట్లు ధాన్యం సేకరణకు వెచ్చిస్తే... ఈ ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.16,200 కోట్లు వెచ్చించింది. విత్తనాలు, పురుగు మందులు దగ్గర నుంచి..రైతుకు విత్తనాలు, పురుగు మందులు అందించే దగ్గర నుంచి... వారి నుంచి పంట కొనుగోలు చేసేందుకు కూడా వీలుగా గ్రామ స్థాయిలో ఏకంగా 10,778 ఆర్బీకేలను ఏర్పాటయ్యాయి. పైపెచ్చు ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేయటం... రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం... కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వటం... నాణ్యతకు పెద్దపీట... నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలూ నిక్కచ్చిగా అమలు చేశారు. . దీన్నిబట్టి వైఎస్ జగన్ ఎంత విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారో వేరుగా చెప్పాల్సిన పనిలేదు.(YS Jagan Reforms In Agriculture)అప్పుడు కనీస మద్దతు ధరకన్నా మార్కెట్ ధర భేష్..గత వైఎస్సారసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మిన్నగా మార్కెట్లో ధర పలికింది. దీంతో వాటిని కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా రాలేదు. తొలి మూడేళ్లలో ధరలు పడిపోయినపుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1789 కోట్ల విలువైన పత్తిని సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ రకమైన భరోసా ఇవ్వటంతో మార్కెట్లో ధరలు స్థిరంగా నిలిచాయి.మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఏది?వ్యవసాయరంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10వేలమందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పగా వారి ఎల్లో మీడియాలో రాయించుకుంటున్న చంద్రబాబు సర్కార్.. అదే నోటితో కనీసం 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారన్నది ప్రధానంగా చూడాలి.ఇక ధరలు పతనమై, దీన స్థితిలో ఉన్న రైతన్నను ఆదుకుంటూ ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరుచేసి, రైతుల్ని ఆదుకునే చర్యలను ఎందుకు చేపట్టడంలేదనేది ఆ చంద్రబాబు సర్కారుకే తెలియాలి. ఇప్పుడు కూడా ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి ధరలు దారుణంగా పడిపోయినా, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ధరలు పడిపోయినా పట్టనట్లే వ్యవహరించింది చంద్రబాబు సర్కార్.ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న దాఖలాలు లేవు. రైతులకు ఏ కష్టం వచ్చినా, ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు స్పందించి ఆదుకున్న సందర్భం కూడా ఎక్కడా రాలేదు.రైతులు, వారి తరఫున వైఎస్ జగన్ పోరాటాలు చేస్తే, దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేయడం.. రైతుల పరామర్శకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారు. రైతులను ఆదుకోవడానికి హడావిడి ప్రకటనలు చేయడం తప్పితే, ఆచరణ వరకూ వచ్చేసరికి ఏమీ లేదు. మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి పంటల విషయంలో చంద్రబాబు వ్యహరించిన తీరు దీనికి నిదర్శనం. నష్ట పరిహారం ఊసే లేదు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత, భరోసా, గ్యారంటీలను పూర్తిగా తొలగించడమో నిర్వీర్యం చేయడమే చంద్రబాబు సర్కారు పెట్టుకున్న పని. ఉచిత పంటల బీమా లేదు.. తుపాను సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన, బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారో కనీసం ఊసైనా చెప్పడం లేదు. ఉచిత పంటల బీమాను రద్దుచేశారు, తుపాను సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన, బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు ఏంచేస్తారో చెప్పడంలేదు. పోనీ వారికి ఇన్సూరెన్స్ లేకపోయినా మీరే పంట నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారో మాటమాత్రమైనా చెప్పలేకపోతున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడిస్తారు? పోనీ నిన్నటి తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడంలేదు. మంచి విషయాల కోసం చంద్రబాబు కనీసం ఆలోచన కూడా చేయరన్నది ప్రస్తుతం మనకు కళ్లకు కనిపిస్తున్న వైనం.కర్షక బంధువు వైఎస్ జగన్..అప్పుడు.. ఇప్పుడు రైతులకు బాసటగా నిలవాలన్నది వైఎస్ జగన్ సంకల్పం. (How YS Jagan Helped Farmers) ప్రభుత్వంలో ఉండగా రైతులకు ఎంత మేలు చేసిన వైఎస్ జగన్.. ఇప్పుడు కూడా అదే సంకల్పంతో పోరాడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూనే ఉన్నారు. రైతుకు కష్టమొస్తే అక్కడకు వెళ్లి వారికి భరోసా, ధైర్యాన్ని ఇస్తున్నారు వైఎస్ జగన్. పులివెందుల వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో అరటి పంటలను నష్టపోయిన రైతులను జగన్ పరామర్శించనున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దాన్ని అధిగమించి రైతులకు అండగా నిలుస్తూ కర్షక బంధువు అనిపించుకుంటున్నారు వైఎస్ జగన్. -
ఇస్తానన్న రూ.20 వేలు చంద్రబాబు ఇవ్వలేదు
అదునులో విత్తనాలు ఇవ్వలేదు.. సీజన్కు ముందు పెట్టుబడి సాయం అందించలేదు... అయినా అష్టకష్టాలు పడి నాట్లు వేస్తే ఎరువులు కరువు.. అప్పు చేసి వారం పది రోజులు దుకాణాల ముందు తిప్పలు పడి ఎరువులు తెచ్చి పంటలు పండించినా... పంట చేతికొచ్చే సమయంలో విపత్తులు అన్నదాతల వెన్నువిరిచాయి. ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా మాయమాటలతో మోసం చేసింది. ఫలితంగా 18నెలల నుంచి ఒక్క పంటకు గిట్టుబాటు ధరలేదు. రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఆపద వేళ అండగా నిలవని చంద్రబాబు... ఇప్పుడు ‘రైతు కోసం’ అంటూ సరికొత్త దొంగ జపానికి తెరతీశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మోసానికి... రైతుల కష్టాలకు ప్రతీక ఈ కింది దృశ్యాలు.. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది పల్ప్ ఫ్యాక్టరీలు, దళారీలు కలిసి ధరలు భారీగా తగ్గించేయడంతో తిరుచానూరు మండీలో రైతులు పారబోసిన మామిడి కాయలు (ఫైల్) 30 ఏళ్లలో ఏనాడూ ఇంత నష్టం చూడలేదునేను 30 ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నా. ఏటా నాకు ఉన్న మూడు ఎకరాల మామిడి తోటకు రూ.70వేల వరకు పెట్టుబడి పెడతాను. ఎకరానికి 5 టన్నుల వరకు మామిడి దిగుబడి వచ్చేది. మూడు ఎకరాలకు 15 టన్నులు విక్రయిస్తే సుమారు రూ.3లక్షల వరకు ఆదాయం వచ్చేది. గతేడాది టన్ను రూ.4వేలు కూడా పలకలేదు. మామిడి దిగుబడి పల్ప్ ఫ్యాక్టరీలకు తోలేందుకు కూడా గిట్టుబాటు కాలేదు. చేసేదేమి లేక మూడు ఎకరాల్లో ఉన్న మామిడి చెట్లను పూర్తిగా కొట్టేయాల్సి వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చింది. – దొరస్వామిరెడ్డి, గోకులాపురం, రామచంద్రాపురం మండలం, తిరుపతి జిల్లా క్వింటా రూ.200లకు కూడా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోనే రైతులు పడేసిన ఉల్లిపాయలు (ఫైల్) చంద్రబాబు ఇస్తానన్న రూ.20వేలు ఇవ్వలేదుఈ ఏడాది ఖరీఫ్లో రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. సాగు ఖర్చులు రూ.1.50 లక్షలు అయ్యాయి. ఉల్లి పెరికి గడ్డలు కోయడానికి ఎకరాకు రూ.40 వేల వరకు ఖర్చు అవుతోంది. ఎకరాకు 40 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు క్వింటా ఉల్లి రూ.200 నుంచి రూ.300కు కొంటామని చెప్పారు. క్వింటాలు రూ.300 ప్రకారం అమ్మినా వచ్చేది రూ.12,000 మాత్రమే. ఉల్లిగడ్డలు కోయడానికి, గోతాలకు రూ.40 వేలు ఖర్చవుతుంది. ఉల్లి కోసి అమ్మడం వల్ల మరో రూ.28వేలు ఖర్చవుతుంది. అందువల్లే ఉల్లి పంటను టిల్లర్తో భూమిలోనే కలిపేశాను. ఎకరాకు రూ.20 వేలు పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పినా పైసా ఇవ్వలేదు. – పులికొండ, రైతు, చిన్నహుల్తి గ్రామం, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా అరటి ధరలు భారీగా పతనమవడంతో మార్కెట్కు తీసుకెళ్తే రవాణా ఖర్చులు దండగని అనంతపురం జిల్లా యాడికి మండలం చందన గ్రామంలో మేకలు, గొర్రెలకు మేతగా వదిలేసిన అరటి గెలలు (ఫైల్) ప్రభుత్వం పట్టించుకోవడం లేదునేను ఏడు ఎకరాల్లో అరటి సాగు చేశాను. పెట్టుబడి కింద రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశాను. 140 టన్నులకు వరకు దిగుబడి వచ్చింది. అందులో 20 టన్నులు మాత్రమే కొన్నారు. మిగతాది కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అరటి రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దిక్కుతోచక పంటను వదిలేయాల్సి వస్తోంది. కూలీ ఖర్చులు కూడా దండగే. – నాగమునిరెడ్డి, కేశవరాయునిపేట, యాడికి మండలం, అనంతపురం జిల్లా పత్తికి ధర లేకపోవడంతో పల్నాడు జిల్లా పెదకూరపాడులో పత్తిపంటను దున్నేస్తున్న రైతు మాబు(ఫైల్) భగవంతుడే కాపాడాలినా పేరు జూపూడి బాబు. వీరులపాడు మండలం నందలూరు గ్రామంలో 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట సాగుచేశా. మోంథా తుపాను వల్ల పత్తి పూర్తిగా దెబ్బతింది. కేవలం మూడు క్వింటాళ్ల మాత్రమే దిగుబడి వచ్చింది. కూలీల ఖర్చులు కూడా రాలేదు. భూ యజమానికి కౌలు కొంత మాత్రమే చెల్లించా. పూర్తిగా చెల్లిద్దామంటే వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం పత్తి పంట దెబ్బతిన్న రైతులకు నష్ట పరిహారం ఇస్తామంది. ఇంత వరకు ఒక్క రూపాయి రాలేదు. అధికారులను అడిగితే మాకేం తెలియదు అంటున్నారు. ఏం చేయాలో తోచటం లేదు. ఆ భగవంతుడే కాపాడాలి. – జూపూడి బాబు, కౌలు రైతు నందలూరు గ్రామం వీరులపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా పొగాకు ధరలు దిగజారిపోవడంతో ఖర్చులకు కూడా వచ్చే పరిస్థితి లేదంటూ జూన్ 26వ తేదీన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై పొగాకును తగలబెట్టి, నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు (ఫైల్) 70 క్వింటాలకు ఒకటిన్నర క్వింటా మాత్రమే కొన్నారునేను గత సీజన్లో నాలుగున్నర ఎకరాల్లో నల్ల బర్లీ పొగాకు సాగు చేశా. 70 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. రైతు భరోసా కేంద్రంలో నా దగ్గర అమ్మకానికి 70 క్వింటాళ్లు ఉన్నట్లు రాయించా. నా పేరుతో 20 క్వింటాలు కొనుగోలు చేస్తామని మెసేజ్ వచ్చింది. ఎంతో ఆశతో 20 క్వింటాలు తీసుకొని కొనుగోలు కేంద్రానికి వెళితే ఒకటిన్నర క్వింటా మాత్రమే కొన్నారు. ఆకు బాగా లేదంటూ తిప్పి పంపారు. ఆకు మంచిది అయినా కొనలేదు. అధికార పార్టీ నాయకులు సిఫారసు చేసిన రైతుల దగ్గర నాసిరకం ఆకు కూడా కొన్నారు. – కాసు సుబ్బారెడ్డి, పొగాకు రైతు, పావులూరు గ్రామం, ఇంకొల్లు మండలం, పర్చూరు నియోజకవర్గం, బాపట్ల జిల్లామార్కెట్లో 25 కిలోల బాక్సు రూ.100కు కూడా కొనుగోలు చేయడం లేదని పొలాల్లోనే పశువులకు వదిలేసిన టమాటా పంట (ఫైల్) అప్పులే మిగిలాయిరెండు ఎకరాల్లో టమాట సాగు చేశా. పెట్టుబడికి రూ.70 వేలకు పైగా ఖర్చు అయ్యింది. దిగుబడి బాగా రావడంతోపాటు కాయలు కూడా నాణ్యతతో ఉన్నాయి. మంచి ధర వస్తే అప్పులు తీరిపోతాయని, కాస్త డబ్బులు చేతికి వస్తాయని ఎంతో ఆశించా. సెపె్టంబర్ 15వ తేదీ ప్యాపిలి టమాటా మార్కెట్కు సరుకును తీసుళ్లగా, 25 కిలోల బాక్సు కేవలం రూ.100కి తీసుకున్నారు. రూ.70 వేలు ఖర్చు చేస్తే కేవలం రూ.10 వేలు చేతికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం టమాటా రైతులను ఏమాత్రం ఆదుకోలేదు. – రామాంజనేయులు, కలచట్ల, ప్యాపిలి మండలం, నంద్యాల జిల్లాప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం, మార్కెట్లో ధర లేకపోవడంతో నంద్యాల జిల్లా ఆత్మకూరులో రోడ్డు పక్కనే ఆరబెట్టిన మొక్కజొన్న పంట (ఫైల్) నాడు ఎరువులు అందక... నేడు పంటను కొనక..ఆరు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ఎకరాకు రూ.20 నుంచి రూ.30వేల వరకు పెట్టుబడులు పెట్టాను. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించలేదు. అయినా అష్టకష్టాలు పడి పంటలు సాగు చేశా. కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను మోంథా తుపాను తడిసి ముద్దచేసింది. కళ్లాల్లో ఉన్న మొక్కజొన్నకు రెండు రోజుల్లోనే మొలకలు వచ్చాయి. మార్కెట్లో కొనేవారు లేక, ప్రభుత్వం సాయం అందక అల్లాడుతున్నాం. – దూదేకుల మస్తాన్, గడివేముల, నంద్యాల జిల్లాతోటలే కొట్టేస్తున్నారు ప్రస్తుతం చీనీ(బత్తాయి) కాయలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఎన్నో ఏళ్లుగా మా గ్రామంలో చీనీ తోటలను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నాం. గతంలో కంటే ప్రస్తుతం చీనీకి పెట్టుబడి పెరిగిపోయింది. కానీ మార్కెట్లో మాత్రం గిట్టుబాటు ధర లేదు. ఒక్కసారిగా ధర తగ్గిపోతుండడం, పెట్టుబడులు కూడా రాకపోవడంతో ఇప్పటికే చాలామంది ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కొన్నిచోట్ల తోటలను కొట్టేస్తున్నారు. – సుదర్శన్రెడ్డి, కోమటికుంట్ల గ్రామం, పుట్లూరు మండలం, అనంతపురం జిల్లాపెట్టుబడి ఖర్చులూ రాలేదుఈ ఖరీఫ్ సీజన్లో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని ఎంటీయూ 1010 రకం వరి సాగు చేశా. ఎకరాకు రూ.30 వేలు చొప్పున సుమారు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట దెబ్బతిని 27 పుట్ల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. అయినా 1010 రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని వ్యవసాయ శాఖాధికారులు చెప్పడంతో దళారులకు పుట్టి రూ.14,500 లెక్కన అమ్ముకోవాల్సి వచ్చింది. కౌలుకు కొంత ధాన్యం ఇవ్వగా 17 పుట్లు అమ్మాను. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాలేదు. – గురించర్ల వెంకటరమణారెడ్డి, మనుబోలు గ్రామం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సాక్షి నెట్వర్క్ -
Chandrababu: ‘‘రైతన్న కోసం’’.. మరో మాయ వేషం!
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెడ్బుక్ రాజ్యాంగం అమలే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఎన్నికల హామీలకు తూట్లు పొడిచి ప్రతి వర్గాన్ని దారుణంగా వంచించారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. సూపర్ సిక్స్ లేవు.. సెవెన్లూ లేవు.. జగన్ ఇచి్చన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారని పేర్కొంటున్నారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకూ ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తామని సూపర్ సిక్స్లో హామీలిచ్చి రెండేళ్లలో రూ.36 వేలు ఎగ్గొట్టారు. గ్యాస్ సిలిండర్లు ఏటా మూడు ఉచితంగా ఇస్తామని చెప్పి గతేడాది ఇచ్చింది ఒక్కటి మాత్రమే. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణమని ఊరించి వారిని జిల్లా దాటనివ్వడం లేదు. అమ్మ ఒడి పేరు మార్చేసి తల్లికి వందనం అంటూ 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఆ ఇచ్చిన వారికి కూడా కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.9 వేలే ఇచ్చారు. వలంటీర్ల వేతనం రూ.10 వేలకు పెంచుతామని నమ్మబలికి ఏకంగా ఆ వ్యవస్థనే రద్దు చేశారు. అవ్వాతాతల పింఛన్లు ఎగరగొడుతూ దాదాపు ఐదు లక్షల పెన్షన్లు కుదించారు. కొత్తవి ఒక్కటీ ఇవ్వలేదు. ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులను నిరీ్వర్యం చేసి ఎడాపెడా అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. పప్పు బెల్లాల మాదిరిగా తమ సన్నిహితులకు కేటాయిస్తున్నారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ‘చంద్రబాబూ..! ఈ 18 నెలల్లో రైతులకు ఒక్కటైనా మేలు చేశారా? అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లలో పెట్టుబడి సాయం కింద రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే రూ.పది వేలు మాత్రమే విదిల్చి ఏకంగా రూ.30 వేలు ఎగ్గొట్టారు! ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. అదే ఉండి ఉంటే.. రైతులకు న్యాయం జరిగేది. నష్టపోయిన ప్రతి ఎకరానికి రైతులకు కనీసం రూ.20 నుంచి రూ.25 వేల వరకు పరిహారం అందేది. విపత్తుల సమయంలో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు ఎగ్గొట్టారు. ఇవాళ ఏ పంటకి చూసినా గిట్టుబాటు ధర లేదు.. విపత్తు వస్తే ఆదుకునే దిక్కు లేదు.. మరి ఏ మొహం పెట్టుకుని వస్తున్నావ్ చంద్రబాబూ? రైతులకు తీవ్ర అన్యాయం చేసిన ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో మిగిలిపోవడం ఖాయం...!’ అంటూ అన్నదాతలు చంద్రబాబు సర్కారుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు మాయమాటలు నమ్మి నిలువునా మోసపోయామంటూ ఆక్రోశిస్తున్నారు. 18 నెలలుగా ఏ ఒక్క రైతుకూ ఒక్క మేలు కూడా చేయని చంద్రబాబు నేటి నుంచి ‘రైతన్నా మీకోసం..’(How Chandrababu Cheated AP Farmers)‘పంచ సూత్రాలు..’ అంటూ తమను మరోసారి వంచించేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎరువులకూ కరువే.. బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మళ్లీ క్యూలలో నిలబడాల్సిన దుస్థితి కలి్పంచారని మండిపడుతున్నారు. సాగు వేళ అదునుకు విత్తనాలు, ఎరువులు దొరక్క పడరాని పాట్లు పడ్డాం. ఆర్బీకేల ద్వారా నాన్సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపి వేశారు. సబ్సిడీ విత్తనాల్లో కూడా అడ్డగోలుగా కోత పెట్టారు. విత్తనాల నాణ్యతకు భరోసా లేదు. ప్రకృతి వైపరీత్యాల కంటే చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం వల్లే దారుణంగా నష్టపోయామంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (Farmers Struggles In Andhra Pradesh)అన్నదాతా సుఖీభవ పథకం కింద సామాజిక వర్గాలకతీతంగా కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామన్న హామీకి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఏడాదిన్నరగా ఒక్క కౌలుదారుడికీ రూపాయి సాయం చేసిన పాపాన పోలేదు. ఏడాదిలో దాదాపు 16 సార్లు వైపరీత్యాల బారిన పడి పంటలు దెబ్బ తింటే చివరికి కరువు సాయం కూడా నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది వాస్తవం కాదా? అని నిలదీస్తున్నారు. నయ వంచనకు పాల్పడిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలను ఎక్కడికక్కడ నిలదీసేందుకు అన్నదాతలు, రైతు సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే.. రూ.30 వేలు ఎగ్గొట్టారు అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు చొప్పున రెండేళ్లలో మొత్తం రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా.. చంద్రబాబు సర్కారు రూ.పది వేలు మాత్రమే ఇచ్చి ఏకంగా రూ.30 వేలు ఎగ్గొడుతోంది! తొలి ఏడాది అన్ని పథకాల మాదిరిగానే దీనికి కూడా పూర్తిగా ఎగనామం పెట్టారు. అర్హులైన 53,58,366 మంది రైతులకు రెండేళ్లలో రూ.21,433.46 కోట్లు పెట్టుబడి సాయం కింద అందించాలి. కానీ 46,85,838 మంది రైతులకు రెండు విడతల్లో కలిపి చంద్రబాబు సర్కారు ఇచ్చింది కేవలం రూ.4,685.54 కోట్లు మాత్రమే. అంటే ఏడు లక్షల మంది రైతులకు ఎగ్గొట్టింది అక్షరాలా ఏకంగా రూ.16,746 కోట్లు. మరి ఆ బాకీ సంగతి ఏమిటి? మిగతా రూ.30 వేలు ఇవ్వాల్సిందే అని రైతులు నిలదీస్తున్నారు.ఒక్కరికైనా పంటల బీమా పరిహారం ఇచ్చారా? అన్నదాతలపై పైసా భారం పడకుండా ఐదేళ్ల పాటు అండగా నిలిచిన డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే మంగళం పాడేసింది. జూన్ 2024లో చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండా చేశారు. ఉచిత పంటల బీమా పథకాన్ని రబీ నుంచి పూర్తిగా ఎత్తివేశారు. ఖరీఫ్–2024 సీజన్లో కొనసాగించిన ఉచిత పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా చెల్లించాల్సిన రూ.838.57 కోట్ల ప్రీమియం మొత్తం చెల్లించకపోవడంతో నేటికీ ఖరీఫ్–24 సీజన్లో దెబ్బతిన్న రైతులకు పంటల బీమా పరిహారం అందకుండా చేసింది వాస్తవం కాదా? రబీ 2024–25 సీజన్ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో శ్రీకారం చుట్టిన ఫసల్ బీమాలో ప్రీమియం భారం భరించలేక కేవలం 6.75 లక్షల మంది రైతులు 9.90 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలకే బీమా కవరేజ్ పొందగలిగారు. ప్రస్తుత ఖరీఫ్–2025లో కేవలం 12.36 లక్షల మంది రైతులు బీమా రక్షణ పొందగా 19.60 లక్షల ఎకరాలకు మాత్రమే బీమా కవరేజ్ లభించింది. గడిచిన ఖరీఫ్తో పోలిస్తే 51.57 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా కవరేజ్, 73.47 లక్షల మంది రైతులు బీమా రక్షణ దక్కలేదన్నది వాస్తవం కాదా?ఏ ఒక్క పంటకైనా ‘మద్దతు’ దక్కిందా?రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ధాన్యం, మిరప, పొగాకు, కోకో, కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, టమాటా, ఉల్లి, అరటి, బత్తాయి.. ఇలా ఏ పంట చూసినా మద్దతు ధర దక్కని పరిస్థితి. చివరికి పూలు, కూరగాయలకు కూడా ధర లేని దుస్థితి. మద్దతు ధర దక్కక పొగాకు, మిరప, పొగాకు, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు అన్నదాతలు నిప్పు పెట్టగా.. మామిడి, అరటి, బత్తాయి తదితర పంటలను దున్నేసిన పరిస్థితులు దేశంలో ఎక్కడైనా ఉన్నాయేమో చంద్రబాబు చెప్పాలి. ధాన్యం రైతులకు సైతం మద్దతు ధర దక్కలేదు. గడిచిన ఖరీ‹ఫ్ సీజన్లో కనీస మద్దతు ధర ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా ఏ ఒక్క రైతుకూ రూ.1,150–1,450కి మించి దక్కలేదు. మద్దతు ధర కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం రైతులు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేసిన ఘటనలు ఎప్పుడైనా చూశామా? ఉల్లి, టమాటా, చివరికి అరటికి కూడా కిలో రూపాయికి మించి దక్కని పరిస్థితులు నెలకొన్న మాట వాస్తవం కాదా? అని అన్నదాతలు నిలదీస్తున్నారు.(Agriculture Crisis In AP)ఏడాదిలో 300 మంది బలవన్మరణాలు..చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం మొదలుకొని మామిడి, కోకో, పొగాకు, మిరప, ఉల్లి, టమాటా, పత్తి, అరటి, మొక్కజొన్న, కంది, శనగ.. ఇలా ఏడాదిన్నరగా ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర దక్కలేదు. వరుస వైపరీత్యాలతో పంటలు దెబ్బ తినడంతో రూ.వేల కోట్ల పెట్టుబడిని నష్టపోయారు. చేతికొచ్చిన కొద్దిపాటి పంటను అమ్ముకునేందుకు నానా అగచాట్లు పడ్డామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన అప్పులు తీర్చే దారిలేక గడిచిన ఏడాదిలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది.పరిహారం పైసా అయినా ఇచ్చారా? 2024–25 సీజన్కు సంబంధించి ఖరీఫ్, రబీలో 1.51 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా సాగైంది 1.24 కోట్ల ఎకరాల్లో మాత్రమే. 2025–26 ఖరీఫ్లో సాగైంది కేవలం 69 లక్షల ఎకరాలే. మరోవైపు వరుస వైపరీత్యాల బారిన పడి ఈ మూడు సీజన్లలో దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా 12 లక్షల ఎకరాల్లో పంటలు కరువు బారిన పడి బీడు వారాయి. ఖరీఫ్–24లో 100 మండలాలు, రబీ 2024–25లో 80 మండలాలు, ఖరీఫ్–2025 సీజన్లో 65 మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపుగా ఖరీఫ్–24లో 54, రబీ 2024–25లో 51, ఖరీఫ్–2025లో 37 చొప్పున మాత్రమే కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకొంది. ఒక్క రూపాయి కూడా కరువు సాయం అందించిన పాపాన పోలేదు. వరుస వైపరీత్యాలు, కరువు సాయంతో కలిపి దాదాపు 10 లక్షల మంది రైతులకు రూ.1,350 కోట్లకు పైగా పంట నష్టపరిహారం (మోంథా తుపానుతో కలిపి ఇన్పుట్ సబ్సిడీ) చెల్లించాల్సి ఉండగా, కృష్ణా వరదలకు సంబంధించి కేవలం 1.85 లక్షలమందికి రూ.285 కోట్లు మాత్రమే జమ చేసింది. దాదాపు రూ.1,100 కోట్లకుపైగా పంట నష్ట పరిహారాన్ని ఎగ్గొట్టింది.బాధిత కుటుంబాలకు పైసా సాయం చేశారా? అందలం ఎక్కింది మొదలు అన్నదాతపై కక్ష కట్టినట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుండటంతో సాగు నష్టాలు భరించలేక, భరోసా కరువై రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తుపానులు, వరదలు, వర్షాభావం.. ఒకదాని తర్వాత ఒకటిగా వైపరీత్యాలు ముప్పేట దాడి చేయడంతో పంటను అమ్ముకునే పరిస్థితి లేక, మద్దతు ధర దక్కక దిక్కు తోచని స్థితిలో ఉన్న అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. టమాటా నుంచి పొగాకు వరకు పంట ఉత్పత్తులను కొనే వారు లేక, చేసిన అప్పులు తీర్చే దారిలేక ఇప్పటికే 300 మందికిపైగా రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఈ ప్రభుత్వం పైసా సాయం చేసిన పాపాన పోలేదని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఆక్వా, పాడి రైతులను నిండా ముంచేశారు తాము అధికారంలోకి రాగానే నాన్ ఆక్వా జోన్తో పాటు 10 ఎకరాలకు పైబడి సాగు చేస్తున్న ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీ వర్తింప చేస్తానంటూ ఎన్నికల్లో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చి 18 నెలలైనా హామీని నెరవేర్చలేదు. సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామని ఒక్కరికీ ఇవ్వలేదు. ఆక్వా రైతులకు కోల్డ్ స్టోరేజ్లు అంటూ ఊరించి ఒక్కటీ నిరి్మంచలేదు. ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణాన్ని అటకెక్కించారు. మరోవైపు అమూల్ ప్రాజెక్టును అటకెక్కించి ప్రైవేటు డెయిరీల దోపిడీకి తలుపులు బార్లా తెరిచారు. పాడి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నా ఆదుకునేందుకు చర్యలు తీసుకోలేదు.ఏం ముఖం పెట్టుకొని వస్తారు..?కర్నూలు జిల్లా అస్పరి మండలం వలగొండ గ్రామానికి చెందిన కె.నాగేంద్రయ్య ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎకరాకు రూ.60 వేలు చొప్పున రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వర్షాలకు దెబ్బతినడంతో మూడుసార్లకు బదులు ఒకే తీతతో సరిపెట్టాల్సి వచి్చంది. తేమ శాతం 8–12 శాతం మధ్య ఉన్నప్పటికీ ఆదోని మార్కెట్ యార్డుకు తీసుకెళితే రూ.37,200 వచ్చింది. రూ.2.63 లక్షల వరకు నష్టపోయాడు. ఖరీఫ్లో యూరియా దొరక్క చాలా ఇబ్బంది పడ్డామని, కాంప్లెక్స్ ఎరువు బస్తా కూడా రూ.2 వేలకు బ్లాకులో కొన్నట్లు ఆయన వాపోతున్నాడు. మరి ఏం ముఖం పెట్టుకుని మా గ్రామాలకు వస్తారు? అని నాగేంద్రయ్య మండిపడుతున్నారు.రైతు ఆత్మహత్య చేసుకుని 8 నెలలైనా సాయం ఊసేలేదు రామాంజనేయులు.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఐరన్బండ గ్రామానికి చెందిన సన్నకారు రైతు. ఈయనకు సొంత భూమి 1.80 ఎకరాలు ఉండగా, మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి, మిరప, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. రెండేళ్లుగా సాగు కోసం బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.12లక్షలు అప్పు తెచ్చారు. పంటలు పండకపోవడం, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఏడాది ఏప్రిల్ 11న పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. రామాంజనేయులుకు భార్య వీరేశమ్మ, కూతురు మమతాంజలి (16), కుమారుడు ప్రవీణ్కుమార్(14) ఉన్నారు. తండ్రి చనిపోవడంతో పిల్లల చదువులు అస్తవ్యస్తంగా మారాయి. సాయం చేయాలని వీరేశమ్మ కలెక్టర్ను కలిసినా ప్రయోజనం లేదు. రామాంజనేయులు మృతిచెంది 8 నెలలైనా ఇప్పటికీ త్రీ మెన్ కమిటీ విచారణ పెండింగ్లోనే ఉంది. ఈ కుటుంబానికి అన్నదాతా సుఖీభవ సాయం కూడా దక్కలేదు. దీంతో పెద్ద దిక్కును కోల్పోయి, ప్రభుత్వ సాయం అందక ఈ కుటుంబం అల్లాడుతోంది.ఒడిశా నుంచి ఎరువులు తెచ్చుకున్నాం..అనుకున్న సమయానికి ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో పక్కనున్న ఒడిశా నుంచి వెయ్యి రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాం. నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నా. కేవలం ఎరువుల కోసమే సుమారు రూ.20వేలు ఖర్చయింది. ప్రభుత్వం సకాలంలో విత్తనాలు కూడా సరఫరా చేయకపోవడంతో అధిక ధరలకు ప్రైవేటు మార్కెట్లో కొనుగోలు చేశాను. నేనే కాదు ఇచ్ఛాపురం మండలంలోని వందలాది మంది రైతులు ఒడిశా నుంచే యూరియా కొనుగోలు చేశారు. – తిప్పన కృష్ణారెడ్డి, రైతు, హరిపురం, ఇచ్ఛాపురంఅధికారులు మా వైపు కన్నెత్తి చూడలేదుఎకరం తోటలో బొబ్బాయి పంట వేశాను. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాను. రూ.70 వేల పెట్టుబడి పెట్టాను. బొప్పాయి మొక్కలు ఏపుగా పెరిగాయి. దిగుబడి బాగా వస్తుందనుకున్న సమయంలో తుపాను, వరదలు వచ్చి దాదాపు 850 మొక్కలు విరిగిపడి చనిపోయాయి. పెట్టుబడులు, ఇతర ఖర్చులు కలిపి సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లింది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. కనీసం ప్రభుత్వ అధికారులెవ్వరూ మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. నష్టపరిహారం వివరాలు నమోదు చేయలేదు. ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అప్పుల పాలైపోయాం. – వాకపల్లి వీరబాబు, బొబ్బాయి రైతు, వలసలతిప్ప శివారు కొత్తలంక, ముమ్మిడివరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లారూ.40 వేలు ఇవ్వాలి.. రూ.10 వేలే ఇచ్చారుఅన్నదాతా సుఖీభవ కింద ఒక్కో రైతుకు రూ.20 వేలు చొప్పున ఆరి్థక సహాయం చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయడం లేదు. చంద్రబాబు ఇచి్చన హామీ మేరకు గత రెండు ఖరీఫ్లకు కలిపి చంద్రబాబు ప్రభుత్వం నాకు రూ.40 వేలు ఇవ్వాలి. తీరా చూస్తే గత సంవత్సరం కేంద్రం ఇచ్చినది రూ.5 వేలు, ఈ ఏడాది రూ.5 వేలు ఇచ్చి గొప్పలు చెప్పుకొంటున్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఇచి్చన ప్రకారం ఏటా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 రైతుల ఖాతాలకు జమ చేశారు. ఈ ప్రభుత్వం అలా ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. – తుంపాల చక్రబాబు, కాండ్రేగుల, జగ్గంపేట మండలం, కాకినాడ జిల్లానాడు పంటల బీమా ధీమా.. నేడు ఆ బీమా బరువునేను రెండెకరాలున్న చిన్న రైతును. పంటల బీమా ప్రీమియం భారంగా మారడంతో ఈసారి బీమా చేయించుకోలేకపోయాను. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వమే రైతుల పేరిట బీమా ప్రీమియం చెల్లించడంతో ధీమాగా ఉండేవాళ్లం. విపత్తులు సంభవిస్తే దెబ్బ తిన్న పంటలకు ప్రభుత్వం బీమా పరిహారం సకాలంలో అందింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించుకోవాలని చెప్పారు. ఎలా బీమా చేసుకోవాలో అవగాహన లేకపోవడం, ఆరి్థక భారం కారణంగా ప్రీమియం చెల్లించలేదు. దీంతో ఇటీవల తుపాను వల్ల పంటలు దెబ్బతిన్నాయి. బీమా లేకపోవడం ఇప్పుడు పెద్ద భారంగా మారింది. – గుడిమెట్ల లక్ష్మణరెడ్డి, రైతు, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లాపిడుగు పడి పాడి గేదె మృతిచెందినా పరిహారం లేదుమా కుటుంబం పాడి గేదెలను పోషించుకుని జీవనం సాగిస్తోంది. సొంత పొలం కూడా లేదు. అక్టోబర్ 22న ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంలో పిడుగుపాటుకు గురై మూడు నెలల సూడి గేదె మృత్యువాత పడింది. రూ.85వేలకు కొనుగోలు చేసిన కొన్ని రోజులకే ఇంటి దగ్గర చెట్టుకు కట్టేసిన సూడి గేదె పిడుగుపడి చనిపోయింది. గ్రామ రెవెన్యూ అధికారి, పశు వైద్యుడు రిపోర్టు రాసుకొని వెళ్లారు. కానీ ఇప్పటివరకు పరిహారం అందలేదు. కనీసం ఏమైందన్న సమాచారం రాలేదు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – లేళ్ల సత్యనారాయణ, పాడి రైతు, ఉయ్యందన గ్రామం, క్రోసూరు మండలం, పల్నాడు జిల్లాఆధార్ లింకు కాలేదని విద్యుత్ సబ్సిడీ ఎత్తేశారునేను 15 ఏళ్లుగా చేపలు, రొయ్యల చెరువులు చేస్తున్నా. మొదట్లో డీజిల్ ధర తక్కువగా ఉండటంతో ఆయిల్ ఇంజిన్లతో ఏరియేటర్ల ద్వారా రొయ్యలు, చేపలకు ఆక్సిజన్ అందించేవాళ్లం. డీజిల్ ధరలు పెరగడంతో పదేళ్లుగా విద్యుత్ వినియోగిస్తున్నాం. 2018 నుంచి వనామీ రొయ్యలకు వైట్ స్పాట్, విబ్రియో, ఈహెచ్పీ, వైట్ గట్ తదితర వైరస్లు సోకటంతో తీవ్ర నష్టాలు వచ్చి అప్పులపాలయ్యాం. కరెంటు కూడా యూనిట్కు రూ.3చొప్పున నెలకు సుమారు రూ.40వేలు బిల్లు వచ్చేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019లో మా ఆక్వా రైతుల కష్టాలను చూసి యూనిట్ విద్యుత్ను సబ్సిడీపై రూ.1.50లకే ఇచ్చారు. దీంతో నాలాంటి ఆక్వా రైతులకు చాలా మేలు కలిగింది. చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయ్యాక నా ఆధార్తో విద్యుత్ కనెక్షన్ లింకు కాలేదని సబ్సిడీ ఎత్తేశారు. ఒకవైపు యూనిట్కు రూ.3లు చొప్పున విద్యుత్ భారం, మరోవైపు చేపలు, రొయ్యల ధరలు, లీజులు పెరిగిపోయి మళ్లీ అప్పులే మిగులుతున్నాయి. –పెచ్చెట్టి నాగ పెంటయ్య, ఆక్వా రైతు, ఎల్వీఎఎన్ పురం, పశి్చమగోదావరి జిల్లాఆస్పత్రిలో డాక్టర్ లేరు.. మందుల్లేవు.. గొర్రెలకు నేనే నాటు వైద్యం చేస్తున్నామాది ప్రకాశం జిల్లా మర్రిపూడి. గొర్రెలు మేపుకొని జీవనం సాగిస్తున్నా. ఇటీవల జీవాలకు జబ్బు చేయడంతో మర్రిపూడిలోనే ఉన్న పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లా. అక్కడ డాక్టర్ లేరు. సిబ్బంది మాత్రం జీవాలను చూసి మందులు లేవని చెప్పారు. అందువల్ల నేనే జీవాలకు నాటు వైద్యం చేస్తున్నా. కాళ్లకు పుండ్లు పడి నడవలేని స్థితిలో ఉన్న గొర్రెలను ఇంటి వద్దే వదిలేసి నేను పొలం పనులకు వెళ్తున్నా. జీవాలకు జబ్బు చేయడంతో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. నాకు 80 గొర్రెలు ఉన్నాయి. గత నెల రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోయాయి. రేపు ఏమవుతుందో అని భయంతో బతుకున్నా. ఎన్నిసార్లు పశువుల ఆస్పత్రికి వెళ్లినా మందుల్లేవంటున్నారు. – దుద్దుకుంట వెంకటేశ్వరరెడ్డి, గొర్రెలకాపరి, మర్రిపూడి, ప్రకాశం జిల్లాఅమూల్ లేక నెలకు రూ.6వేలు నష్టంనాకున్న ఐదు ఆవులు పూటకు 20 లీటర్ల పాలిస్తాయి. ఉదయం, సాయంత్రం కలిపి 40 లీటర్ల పాలు అమ్ముతాను. ఎంతోకాలం హెరిటేజ్, శ్రీజ వంటిæ డెయిరీలకు అమ్మినా ఒక లీటరు పాలకు రూ.35 పైన ఎప్పుడూ ఇవ్వలేదు. అంత తక్కువ ఇస్తే ఎలాగని అడిగితే పాలలో వెన్న శాతం తక్కువగా ఉందన్నారు. అదే పాలను అమూల్ డెయిరీ డెయిరీ వాళ్లకు ఇచ్చినప్పుడు లీటరుకు రూ.38 నుంచి రూ.40 ఇచ్చారు. అమూల్ వల్ల ఒక లీటరుకు రూ.3 నుంచి రూ.5 వరకు అదనంగా రావడంతో 40 లీటర్లకు రోజుకు రూ.200 వరకు అదనపు లాభం వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక అమూల్ను లేకుండా చేయడంతో రోజుకు రూ.200 లెక్కన నెలకు రూ.6 వేలు వరకు నష్టపోతున్నా. అయినా ఏమీ చేయలేక శ్రీజ డెయిరీ వాళ్లకు పాలు అమ్ముకుంటున్నా. – రాజమ్మ, మహిళా పాడిరైతు, చిన్నగొట్టిగల్లు, తిరుపతి జిల్లాఅన్నదాతా సుఖీభవ.. రెండో ఏడాదీ మొండి చెయ్యిమా ఊళ్లో 1.40 ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్నాను. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏటా వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు గత ఏడాది అన్నదాతా సుభీభవ పథకం డబ్బులు పడలేదు. వ్యవసాయ శాఖ, సచివాలయ అధికారులను అడిగితే, నా భూమికి సంబంధించిన పత్రాలు అడిగారు. అవి అందజేసినా గత ఏడాది రావాల్సిన రూ.7 వేలు రాలేదు. ఇటీవల విడుదల చేసిన అన్నదాతా సుఖీభవ–పీఎం కిసాన్ పథకం సొమ్ము కూడా నాకు రాలేదు. వ్యవసాయాధికారులను అడిగితే సరైన సమాధానం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుకు ఏదైనా సమస్య వస్తే మా ఊరిలోనే సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో పరిష్కారం చూపేవారు. ప్రస్తుతం జిల్లా అధికారులను అడిగినా ప్రయోజనం కనిపించడం లేదు. – ఇనకొండ సత్యనారాయణ, రైతు, సిరివాడ, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లాఅప్పుల బాధ భరించలేక మా ఆయన ఉరి పోసుకున్నాడుమాకున్న 4 ఎకరాలతోపాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మా ఆయన సాగు చేశాడు. సాగు ఖర్చుల కోసం రూ.10 లక్షల వరుకు అప్పులు తెచ్చారు. సాగు చేసిన మిర్చి తెగుళ్ల వల్ల దెబ్బతింది. కాస్త పంట చేతికొచి్చనా గిట్టుబాటు ధర రాలేదు. బ్యాంకులవారు, అప్పులు ఇచి్చనవారు వెంటనే అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో మా ఆయన ఈ ఏడాది జూలై 2వ తేదీన మా ఇంటి పక్కన షెడ్డులో ఉరిపోసుకుని చనిపోయాడు. కొనకొండ్ల గ్రామం కెనరా బ్యాంకులో రూ.4 లక్షల అప్పుతోపాటు గుంతకల్లు మణప్పరంలో గోల్డ్ లోన్లో బంగారు తాకెట్టు పెట్టి రూ.2 లక్షలు తెచ్చారు. బయట వ్యక్తుల వద్ద రూ.4 లక్షల వరుకు అప్పులు ఉన్నాయి. నాకు ఇద్దరు కుమారులు. బాగా బతికిన మా కుటుంబం పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. – ఉప్పర శంకరమ్మ, రైతు ధనంజయ భార్య, కొనకొండ్ల గ్రామం, వజ్రకరూర్ మండలం, అనంతపురం జిల్లాజింక్ కొనుగోలు చేస్తేగాని యూరియా ఇవ్వలేదునాకు రెండున్నర ఎకరాల భూమి ఉంది. అందులో ఖరీఫ్లో వరి పంట వేశాను. ఎరువుల కోసం పడరాని పాట్లు పడ్డాం. జింక్ సల్ఫేట్ కొనుగోలు చేస్తేగాని యూరియా ఇవ్వలేదు. జింక్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వచి్చంది. – రొంగలి సత్యం, రైతు, ఉయ్యడవలస, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా -
మాకు కాదు.. మీకు భయం..!
వైఎస్ జగన్.. జనం నుంచి వచ్చిన.. వారి కోసం పుట్టిన జననేత. జగన్ వెంట నడిచే జన ప్రభంజాన్ని చూస్తే ఈ విషయం తేటతెల్లం. కానీ ఇదే జనసంద్రం కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంది! చంద్రబాబుకు గుటకలు.. లోకేష్కు గుబులు.. పవన్ కళ్యాణ్కు నేల చూపులు మిగులుస్తాయి.అధికారంలో ఉన్నా తమ వెంట జనం నిలవడం లేదన్న వాస్తవం కూటమి నేతల్లో భయం పుట్టిస్తోంది. ఈ అక్కసునే వారు జగన్ పర్యటనపై ఆంక్షలు, ప్రతిబంధకాల రూపంలో తీర్చుకుంటున్నారు. అయితే కూటమి పప్పులు ఎన్నడూ ఉడికింది లేదు. గోడకేసి కొట్టిన బంతి ఎంత వేగంగా వెనక్కు వస్తుందో.. జగన్ పర్యటనలకు ఆంక్షలు ఎక్కువైన కొద్దీ జన ప్రవాహం అంతకంత పెరిగింది. (YS Jagan Following In Public) )జగన్ వెంట ఎంతమంది నడవాలో కూడా వారే నిర్ణయిస్తారు.అంతే ఆంక్షలు అమల్లో పెడతారు. పోలీసుల్ని ఉపయోగించుకుంటూ ఫ్లెక్సీల ద్వారా కూడా .జగన్ పర్యటనలకు జనం వెళ్లకండనే ప్రచారం చేయిస్తారు స్థానిక నాయకులు. మరి ఇవన్నీ తమ జననేతను చూడటానికి వచ్చే ప్రజలకు తెలియవు. అభిమాన నాయకుడు వస్తున్నాడంటే జనహోరు హుషారెత్తుంది. జగన్ అంటే మీకు భయం.. మాకు కాదు అని ఎలుగెత్తుతుంది జగన్ పర్యటన ఉన్న ప్రాంతం. కూటమి నాయకులకు ఇవన్నీ స్వీయ అనుభవాలే. వైఎస్ జగన్ తాజా పులివెందుల నియోజక వర్గం పర్యటన కూడా కూటమి నేతల్లో టెన్షన్ పెంచేసే ఉంటుంది.జగన్ పర్యటనలపై కూటమి నేతల భయాన్ని అభిమానుల మాటల్లో చెప్పాలంటే....జగన్ వస్తున్నాడంటే మీకు భయం.. రోడ్లన్నీ జన నంద్రం అయిపోతాయనిజగన్ వస్తున్నాడంటే మీకు భయం .. ఊరూ-వాడా, మిద్దె-మేడా అంతా ఏకమవుతాయని...జగన్ వస్తున్నాడంటే మీకు భయం.. సందు-గొందు కిక్కిరిసిపోతాయని...జగన్ వస్తున్నాడంటే మీకు భయం... రహదారులన్నీ జై జగన్ నినాదాలతో హోరెత్తిపోతాయనిజగన్ వస్తున్నాడంటే మీకు భయం.. మీ మాట వినేవారు ఒక్కరూ మిగలరనిజగన్ వస్తున్నాడంటే మీకు భయం.. సామాన్యుడికి కొండంత భరోసా దక్కుతుందని, ఆప్యాయమైన పలకరింపులు దొరుకుతాయని!జగన్ వస్తున్నాడంటే మీకు భయం.. ఏ ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తాడోనని!-మణిశ్రీ -
రాజకీయ పునర్విభజన
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిపై అతి వ్యామోహంతో ఇతర ప్రాంతాలను గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు... గత వైఎస్ జగన్ హయాంలో పక్కాగా జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పట్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సరిగా జరగలేదంటూ వాటిని సొంత రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేందుకు చూస్తోంది. ఇందుకోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సైతం రూపొందించారు.నిజానికి రాష్ట్ర విభజన తర్వాత పాలనను గాడిలో పెట్టడానికి 2014–19 మధ్యనే జిల్లాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. తెలంగాణలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినా చంద్రబాబు ఆ ఊసే లేకుండా ఐదేళ్లు పాలన సాగించారు. అప్పుడు ఎక్కడికక్కడ డిమాండ్లు రావడంతో వైఎస్ జగన్ తాము అధికారంలోకి వస్తే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. గెలిచాక ప్రణాళిక ప్రకారం హామీ నెరవేర్చి రాష్ట్రానికి సమగ్ర స్వరూపం తెచ్చారు.వాస్తవాలు దాచి రాజకీయ క్రీడపార్లమెంటు నియోజకవర్గాల వారీగా శాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటవగా, పునర్వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా జరిగిందనే అబద్ధాన్ని ప్రచారంలో పెట్టి ఆ ముసుగులో రాజకీయ ప్రయోజనాల కోసం మరికొన్ని కొత్త జిల్లాలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పలు జిల్లాల్లో సరిహద్దుల మార్పునకు సిద్ధమవుతున్నారు. కొత్తగా మదనపల్లె, మార్కాపురం జిల్లాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమై.. టీడీపీకి రాజకీయ ప్రయోజనం ఉండేలా మార్పులు ఉండాలని తొలుత ఇచ్చిన నివేదికను తిరస్కరించారు. ఆయన రాజకీయ అజెండాకు తగినట్లుగా కమిటీ కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తాజా పునరి్వభజన వల్ల చంద్రబాబుకు ఆయన పార్టీకి తప్ప రాష్ట్రానికి, ప్రజలకు, పరిపాలనకు ఎటువంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 2022 ఏప్రిల్లో 13 జిల్లాలను 26గా విభజించారు. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు గాను... అరకు పరిధి ఎక్కువగా ఉండడంతో దాన్ని రెండుగా చేశారు. ఉన్నతాధికారులతో కమిటీలు వేసి విస్తృత అధ్యయనం చేశారు. పూర్తి శాస్త్రీయంగా ఆయా ప్రాంతాల భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలకు రూపం ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చిన 17,500 సూచనలు, సలహాలు, అభ్యంతరాలను పరిశీలించి, 284 అంశాలుగా విభజించి తగినట్లుగా నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త 13, పాత 13 జిల్లాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం సగటున 18 నుంచి 20 లక్షల జనాభా ఉండేలా చూశారు. సాధ్యమైనంత వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాలోనే ఉంచారు. ప్రతి జిల్లాలోనూ కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు చేశారు. దీంతో రెవెన్యూ డివిజన్లు 51 నుంచి 76కి పెరిగాయి.⇒ ఈ ప్రక్రియ జరిగినప్పుడే ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని మన్నించి కుప్పంను రెవెన్యూ డివిజన్ చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును విజయవాడ జిల్లాకు పెట్టారు. తమకు తరతమ బేధాలు లేవని నిరూపించారు. చంద్రబాబు ఎక్కువ కాలం అధికారంలో ఉన్నా... ఎన్టీఆర్ను, ఆయన పేరును రాజకీయంగా ఉపయోగించుకోవడమే తప్ప గౌరవం దక్కే ఒక్క పని కూడా చేయలేదు. వైఎస్ జగన్ మాత్రం ఎన్టీఆర్ను గౌరవించారు. ⇒ కొత్త జిల్లాలకు ఆయా ప్రాంతాల ప్రాశస్త్యం, స్థానిక సంప్రదాయాలు, సంస్కృతుల ఆధారంగా పేర్లు పెట్టారు. అరకుకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అమలాపురానికి అంబేడ్కర్ కోనసీమ, నర్సరావుపేటకు పల్నాడు, రాజంపేటకు అన్నమయ్య, విజయవాడకు ఎన్టీఆర్, హిందూపురం పార్లమెంటుకు శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేశారు. ఇవన్నీ అందరికీ ఆమోదయోగ్యంగా చెలామణీ అవుతున్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలు పాడేరు, పార్వతీపురం, నరసరావుపేట, బాపట్ల, రాయచోటి, పుట్టపర్తి అభివృద్ధి కేంద్రాలుగా మారాయి. -
ఎల్ఎఫ్ఎల్గా పీఎస్ హెచ్ఎంలు !
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలపై చంద్రబాబు సర్కారు చేపట్టిన చిత్రవిచిత్ర ప్రయోగాల పరంపర కొనసాగుతోంది. ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్ హెచ్ఎం)లను ఎల్ఎఫ్ఎల్ (లో ఫిమేల్ లిటరసీ) హెచ్ఎంగా మార్చాలని ఆదేశాలు జారీ చేయడంతో స్కూల్ అసిస్టెంట్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ బోధనను రద్దు చేసిన సర్కారు ఆ స్కూల్ అసిస్టెంట్లను సర్ప్లస్ చేసింది. మిగులు ఎస్ఏలు ఆందోళన చేయడంతో కొత్తగా 9,620 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి వాటిల్లో 4,800 పాఠశాలల్లో మిగులు స్కూల్ అసిస్టెంట్లను పీఎస్ హెచ్ఎంలుగా బలవంతంగా నియమించింది. వారికి పీఎస్ హెచ్ఎం/ఎస్ఏ డిజిగ్నేషన్ ఇచి్చంది. మిగిలిన 4,820 స్కూళ్లలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలను నియమించింది.అయితే ఇప్పుడు పీఎస్ హెచ్ఎం/ఎస్ఏ కేడర్ను మరీ తగ్గించి ఎల్ఎఫ్ఎల్గా మార్చేందుకు సర్కారు పూనుకుంది. ఎలాంటి జీవోలు లేకుండా కేవలం నోటి మాటతో మొత్తం ప్రక్రియను మార్పు చేయడంపై పీఎస్ హెచ్ఎం/ఎస్ఏల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి స్కూల్ అసిస్టెంట్లు ప్రైమరీ స్కూళ్లలో హెచ్ఎంలుగా పనిచేసేందుకు నిబంధనలు లేకపోవడంతో వారి డిజిగ్నేషన్ పీఎస్ హెచ్ఎం/ఎస్ఏగానే ఉంటుందని సర్కారు తొలుత ప్రకటించింది. అదేవిధంగా జూన్ నెలలో చేపట్టిన బదిలీ ఉత్తర్వుల్లోనూ పేర్కొంది. జూన్ నుంచి యూడైస్లోనూ వీరు పీఎస్ హెచ్ఎం/ఎస్ఏగానే కొనసాగుతున్నారు.ఇప్పుడు ఉన్నట్టుండి వారి డిజిగ్నేషన్ను పీఎస్ హెచ్ఎం/ఎస్ఏ నుంచి తగ్గించి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా యూడైస్లో మార్చేందుకు సర్కారు సిద్ధపడింది. అన్ని జిల్లాల్లోనూ పీఎస్ హెచ్ఎంలు అంతా వెంటనే యూడైస్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా తమ డిజిగ్నేషన్లను మార్చుకోవాలని ఎంఈఓ కార్యాలయాలు, ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తోంది. కొన్నిచోట్ల ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండానే యూడైస్లో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా డిజిగ్నేషన్ మార్పు చేసినట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. దీనివల్ల తాము బదిలీల్లో తిరిగి స్కూల్ అసిస్టెంట్లుగా వెళ్లే అవకాశం ఉండదని, యూడైస్ వివరాలనే లీప్ యాప్, టీఐఎస్లో ప్రామాణికంగా తీసుకుంటారని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. గ్రామీణ బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు 1998 ఆగస్టులో తీసుకొచి్చన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం విధానాన్ని ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లకు ఆపాదించడం విమర్శలకు దారితీస్తోంది. -
ప్రొవిజినల్ అసైన్మెంట్పైనా పూర్తి హక్కులు
సాక్షి, అమరావతి: ఎక్స్ సర్విస్మెన్ కోటా కింద సైనికోద్యోగులకు ప్రొవిజినల్ (తాత్కాలికం) అసైన్మెంట్ ద్వారా కేటాయించిన భూమిపై వారికి సర్వ హక్కులు ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రొవిజినల్ అసైన్మెంట్ కింద పొందిన భూమిని సాగు చేస్తుంటే డీఫాం పట్టా జారీ అన్నది కేవలం లాంఛనం మాత్రమేనని స్పష్టం చేసింది. డీఫాం పట్టా ఆలస్యంగా జారీ అయిందన్న కారణంతో ఎక్స్ సర్విస్మెన్ కోటా కింద సైనికోద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలను దక్కకుండా చేయలేరని పేర్కొంది. గత 40 ఏళ్లుగా అప్పిలెట్ తనకు కేటాయించిన భూమిని సాగు చేసుకుంటున్న నేపథ్యంలో, ఆ భూమిని అమ్ముకునేందుకు అతనికి హక్కులు ఉన్నాయని తెలిపింది.అలాగే ఇసుక దిబ్బల పోరంబోకు భూమిని అసైన్మెంట్ కింద ఇవ్వడానికి వీల్లేదన్న ప్రభుత్వ వాదనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఇదే సర్వే నంబర్లోని ఇసుక దిబ్బల పోరంబోకు భూమిని ప్రభుత్వం ఇతరులకు సైతం అసైన్మెంట్ కింద ఇచ్చిందని, వారు ఆ భూమిని వీఎంఆర్డీఏకి అప్పగించి, అందుకు ప్రతిగా ప్లాట్లు పొందారని హైకోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు అప్పిలేట్కి కేటాయించిన ఇసుక దిబ్బ భూమిపై ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెబుతుందో అర్థం కావడం లేదని పేర్కొంది.ఎక్స్ సర్విస్మెన్ కోటా కింద అసైన్మెంట్ భూమి పొందేందుకు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, సర్విసులో ఉన్న సైనికోద్యోగులు కూడా అర్హులేనని తేల్చి చెప్పింది. ప్రస్తుత కేసులో మాజీ సైనికోద్యోగి అప్పారావు భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు వారాల్లో నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ విశాఖపట్నానికి చెందిన వీసీ అప్పారావు నౌకాదళంలో పనిచేసి 1989లో పదవీ విరమణ చేశారు. సర్వీసులో ఉండగానే ఆయనకు ఎక్స్ సర్విస్మెన్ కోటా కింద ప్రభుత్వం 1978లో భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 75–2లో 5.10 ఎకరాల భూమిని అసైన్మెంట్ కింద ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన ఈ భూమిని సాగు చేసుకుంటున్నారు. కొంతకాలం తర్వాత ప్రభుత్వం ఈ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. ఈ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ను కోరగా తిరస్కరించారు. దీంతో అప్పారావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపారు. కలెక్టర్ అభ్యంతరాలపై వివరణ ఇస్తూ తిరిగి ఆయనకు వినతిపత్రం ఇవ్వాలని అప్పారావును ఆదేశించారు.ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పారావు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం విచారణ జరిపింది. అప్పారావు తరఫు న్యాయవాది జీఎల్ నరసింహారెడ్డి వాదనలు వినిపించారు. సర్విసులో ఉండగా ఇచ్చిన అసైన్మెంట్ను ఎక్స్ సర్వీస్మెన్కు ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందని, దానిని 10 ఏళ్ల తర్వాత అమ్ముకునేందుకు హక్కు ఉంటుందని వివరించారు. కలెక్టర్ ఏకపక్షంగా అప్పారావు భూమిని నిషేధిత భూముల జాబితాలో చేర్చారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం, అప్పారావు భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ను ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. -
హద్దూ‘పొద్దూ’ లేకుండా ఇసుక అక్రమ రవాణా
ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతోంది. టీడీపీ కూటమి నేతలే ప్రత్యేక ఏజెంట్లుగా, రూట్ ఆఫీసర్లుగా అవతారమెత్తి ఇసుక లారీలను చెక్పోస్టులు దాటిస్తున్నారు. రూ.కోట్లు దండుకుంటున్నారు. ఉమ్మడి గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది.సాక్షి, నరసరావుపేట/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని రూ.కోట్లు సంపాదిస్తున్నారు. నిత్యం ఇసుక లారీలను పల్నాడు జిల్లా సరిహద్దుల మీదుగా చెక్పోస్టులను దాటించి తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నారు. రూ.కోట్లు దండుకుంటున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నా.. జిల్లాలోని మైనింగ్, విజిలెన్స్, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారపార్టీ నేతలు ఇస్తున్న మామూళ్లకు అలవాటుపడి మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏపీ చెక్పోస్టులలో రైట్.. రైట్ గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని తుళ్లూరు, అమరావతి మండలాల పరిధిలోని ఇసుక రీచ్ల నుంచి ఇసుకను లారీల్లోకి లోడ్ చేస్తున్నారు. సాధారణంగా లారీకి 18–22 టన్నుల ఇసుకను రవాణా చేస్తారు. అయితే హైదరాబాద్, నల్లగొండ, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు అక్రమంగా వెళ్తున్న లారీలలో ఏకంగా 40 టన్నుల వరకు ఇసుక లోడ్ చేస్తున్నారు. ఇసుక రీచ్ ఉన్న స్థానిక అధికారపార్టీ నేతలకు లారీకి రూ.10 వేల దాకా ముట్టజెబుతున్నారు. లారీలు అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల మీదుగా రాత్రి పూట పల్నాడు జిల్లా సరిహద్దు చెక్పోస్టులైన పొందుగల, తంగెడల నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ చెక్పోస్టుల మీదుగా ఇసుక లారీలు వెళ్తున్నా పట్టుకుంటున్న దాఖలాలు లేవు. ఒక్కో లారీ సరిహద్దు దాటేందుకు స్థానిక పోలీసులు, చెక్పోస్టుకు రూ.7 వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం. తెలంగాణ చెక్పోస్టులలో చెక్ ఆంధ్రా సరిహద్దు చెక్పోస్టుల నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న ఇసుక లారీలను తెలంగాణ చెక్పోస్టుల వద్ద లారీలను పట్టుకుంటున్నా.. టీడీపీ నేతలు బేరసారాలు సాగిస్తున్నారు. దాచేపల్లి మండలం పొందుగల చెక్పోస్టు నుంచి దర్జాగా వెళ్లిన అక్రమ ఇసుక లారీలను వందల మీటర్ల దూరంలో కృష్ణానది అవతల ఉన్న తెలంగాణ పరిధిలోని వాడపల్లి చెక్పోస్టులో అక్కడి అధికారులు పట్టుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీల మధ్య ఏకంగా ఏడు లారీలను వాడపల్లి చెక్పోస్టులో పట్టుకొని కేసులు నమోదు చేశామని వాడపల్లి ఎస్సై శ్రీకాంత్రెడ్డి మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే టీడీపీ నేతలు రంగంలోకి దిగి బేరసారాలు ఆడుతున్నట్టు సమాచారం.చెక్పోస్టు దాటించేందుకు ఏజెంట్లుఇసుక రీచ్ మొదలు నల్లగొండ వరకు వయా పల్నాడు జిల్లాలో ప్రయాణిస్తున్న లారీలను ఏ చెక్పోస్టులోనూ అడ్డుకోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు పనిచేస్తున్నారు. వీరి పని ఇసుక లారీలను అంతరాష్ట్ర సరిహద్దు దాటించేవరకు వీరు రూట్ ఆఫీసర్లుగా పనిచేస్తారు. పోలీసులతో సన్నిహితంగా ఉంటూ వారికి నెల వారీ మామూళ్లు అప్పగించి లారీలను ఆపకుండా చూడటం ఈ ఏజెంట్ పని. స్థానిక టీడీపీ నేతలు ఏజెంట్లుగా పనిచేసి నెలకు రూ.లక్షలు సంపాదిస్తున్నారు.గోదావరి పరీవాహకం నుంచీ..గోదావరి పరీవాహకం నుంచి కూడా ఇసుక తెలంగాణకు యథేచ్ఛగా తరలిపోతోంది. తెలంగాణలో తరచూ కేసులు నమోదు చేస్తున్నా దందా ఆగడం లేదు. ఉమ్మడి పశ్చిమగోదావరిలోని ఏజెన్సీకి ఓ కూటమి ప్రజాప్రతినిధి అనుచరులే ఈ దందా నిర్వహిస్తున్నారు. వీరు మూడు జిల్లాలు, రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు దాటించి మరీ ఇసుక లారీలను తెలంగాణకు తరలిస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, అంతకు ముందు సత్తుపల్లి పోలీసులు లారీలను ఆపి కేసులు నమోదు చేయడం గమనార్హం.కొవ్వూరు నుంచి అనధికారికంగా..ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇసుక ర్యాంపులు పూర్తిగా మూతపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతం నుంచి ఇసుకను అనధికారికంగా తీసుకువచ్చి కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీకి చెందిన ఓ కూటమి ప్రజాప్రతినిధి అనుచరులు మరో అడుగు ముందుకేసి సొంత టిప్పర్లతో ఇసుకను సులువుగా సరిహద్దులు దాటిస్తున్నారు. నిత్యం 30 నుంచి 50 లారీల్లో ఓవర్ లోడ్తో ఇసుకను తరలిస్తున్నారు.ప్రధానంగా ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం మేడిశెట్టివారిపాలెం నుంచి సరిహద్దు చెక్పోస్టు దాటుకుని తెలంగాణ జిల్లాలోని సత్తుపల్లికి, జీలుగుమిల్లి మండలం నుంచి సరిహద్దు చెక్పోస్టు దాటి అశ్వారావుపేట మండలానికి తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం 16 టన్నులు లోడింగ్ చేసుకుని ఆ మేరకు బిల్లుతో కేవలం జిల్లా పరిధిలోనే సరఫరా చేయాలి. టీడీపీ ఇసుక మాఫియా మాత్రం లారీకి సగటున 35 నుంచి 40 టన్నుల లోడ్ చేసుకుని ఎటువంటి వేబిల్లూ లేకుండా తెలంగాణకు తరలించి సగటున రూ.60 వేల నుంచి రూ.80 వేలకు విక్రయిస్తున్నారు.తెలంగాణలో ఇసుక సీజ్కొవ్వూరు నియోజకవర్గంలోని ప్రక్కిలంకలో ఉన్న ఇసుక ర్యాంపు నుంచి తెలంగాణకు 200కు పైగా లారీల్లో ఇసుకను అక్రమార్కులు తరలించారు. మూడు రోజుల క్రితం ప్రక్కిలంక ర్యాంపు నుంచి గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మీదుగా తెలంగాణలోని అశ్వారావుపేటలోకి ప్రవేశించిన మూడు లారీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అడ్డుకని 105 టన్నుల ఇసుకను సీజ్ చేశారు.చింతలపూడి మీదుగా సత్తుపల్లికి తరలించి అక్కడి నుంచి ఖమ్మం, మహబూబ్నగర్, గద్వాల్ జిల్లాలో విక్రయిస్తున్నారు. ఈ ఏడాది సెపె్టంబర్ 23న దమ్మపేట మండలం నాగుపల్లిలో ఇదే తరహాలో వాహనాలను సీజ్చేసి కేసులు నమోదు చేశారు. ఏపీ 39డబ్ల్యూహెచ్7666, ఏపీ 13డబ్ల్యూజీ 9666 నంబర్లు గల రెండు టిప్పర్లు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కూటమి ప్రజాప్రతినిధి అనుచరులవే. ఈ రెండు టిప్పర్లలో తరచూ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ రెండు వాహనాలు తరచూ పట్టుబడుతున్నా.. రోజుల వ్యవధిలో మళ్లీ అవే వాహనాల్లో దందా సాగించడం కొసమెరుపు. -
AP: 30 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశంతోపాటు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
సునీత పిటిషన్లన్నీ రాజకీయ ప్రేరేపితమే..
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత పిటిషన్లన్నీ రాజకీయ ప్రేరేపితమని ప్రతివాదులు సీబీఐ కోర్టుకు విన్నవించారు. వివేకా హత్యను కూడా గత ఎన్నికల సమయంలో ప్రచారాస్త్రంగా ప్రత్యర్థులు వినియోగించుకునే యత్నం చేశారని, సాక్ష్యాలు, ఆధారాలు లేకున్నా ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా పనిచేశారని కోర్టుకు తెలియజేశారు. ఆమె వెనుక ఉన్న కొన్ని రాజకీయ శక్తుల వల్ల ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేస్తూ.. అసలు దోషులు బయట తిరిగేందుకు తోడ్పడుతున్నారని వివరించారు.ఇప్పుడు అదే శక్తులు వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణ పూర్తి కాకూడదని కుయుక్తులు పన్నుతున్నారని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఇందులో భాగంగానే సునీత తాజా పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురామ్ సోమవారం ప్రతివాదుల వాదనలు విన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.అంతకుముందు శివశంకర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్రెడ్డి తరఫు న్యాయవాది సాయి ఉమామహేశ్వర్రావు వాదనలు వినిపించారు. వాదనల్లో ముఖ్యాంశాలు.. ‘అన్ని అంశాలు పరిశీలించాం, వందల మందిని విచారించాం, కాల్ రికార్డులు, వీడియోలు.. ఇలా అన్నింటిపై దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ చెబుతోంది. అయినా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగించాలని కోరడం సరికాదు. ఇది కేసు విచారణను ఆలస్యం చేయడమే. దాదాపు నాలుగేళ్ల పాటు దర్యాప్తు కొనసాగించినంత కాలం సీబీఐ విచారణపై సునీత నోరు మెదపలేదు.నిరాధారంగా కొందరిని నిందితులుగా చేర్చడాన్ని ఆమె ‘ఎంజాయ్’చేశారు. చార్జ్షీట్, అదనపు చార్జ్షీట్ దాఖలు చేసినప్పుడూ తను అనుకున్నట్లే దర్యాప్తు సాగుతోందని మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మరికొందరిని చేర్చాలన్న ఉద్దేశంతో పిటిషన్ వేశారు. కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి హత్య చేసింది ఎవరో చెప్పిన తర్వాతా నిందితులకు తోడ్పడేలా ఆమె పిటిషన్లు వేశారు. షేక్ దస్తగిరి (ఏ–4) తానే గొడ్డలితో నరికానని నేరుగా సీబీఐ కార్యాలయానికి వెళ్లి చెప్పినా అరెస్టు చేయలేదు.క్రిమినల్ కేసుల దర్యాప్తు చరిత్రలో ఓ కరుడుగట్టిన హంతకుడు నేరం ఒప్పుకున్నా అరెస్టు చేయకపోవడం ఇదే తొలిసారి. అతన్ని సమరి్థస్తూ సునీత పలు పిటిషన్లు వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దస్తగిరి యథేచ్ఛగా బయట తిరుగుతున్నా బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయని సునీత ఎలాంటి ఆధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వారి బెయిల్ రద్దుకు పిటిషన్లు వేయడం విస్తుగొలిపే విషయం. సునీత పిటిషన్ సమర్థనీయం కాదు. కొట్టివేయండి’ అని న్యాయవాదులు వాదనలు వినిపించారు. -
శెట్టిబలిజలకు మంత్రి సుభాష్ వెన్నుపోటు
సాక్షి, అమరావతి: మెమోకు, జీవోకు తేడా తెలియని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.. శెట్టిబలిజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాల కృష్ణ తేల్చి చెప్పారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవో నెంబరు 16 తోపాటు శెట్టి బలిజలకు ఎవరేం చేశారన్న దానిపై కుల పెద్దలు, మీడియా సమక్షంలో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరితే.. మంత్రి ఎందుకు తోక ముడిచారని నిలదీశారు.చంద్రబాబు హయాంలో 1997లోనే జీవో నంబరు 16 విడుదల కాగా.. దాన్ని ఏ ప్రభుత్వాలూ అమలు చేయలేదని, తిరిగి కూటమి ప్రభుత్వం హయాంలో 2025 జూలై 30 నుంచి శెట్టిబలిజ సరి్టఫికెట్లో గౌడ అని చేర్చి అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. దాన్ని కప్పిపుచ్చిన మంత్రి.. వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేయడాన్ని తప్పుపట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆ నిర్ణయం తీసుకుంటే తాను క్షమాపణలు చెబుతానన్న చెల్లుబోయిన వేణు.. కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినట్లు తేలితే క్షమాపణలు చెప్తారా అని మంత్రిని నిలదీశారు. వేణు ఇంకా ఏమన్నారంటే.. మంత్రి నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి ‘‘రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇటీవల వనభోజనాల్లో వైఎస్సార్సీపీపైనా, నా పైన చేసిన ఆరోపణల మీద చర్చకు నేను సిద్ధమని ప్రకటిస్తే.. ఆయన పత్రికా ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. నాపై చేసిన ఆరోపణలు నిజమని మంత్రి నిరూపిస్తే శెట్టిబలిజ సామాజిక వర్గానికి క్షమాపణ చెబుతాను. నిరూపించలేకపోతే మంత్రి నాకు, శెట్టిబలిజ జాతికి క్షమాపణ చెప్పాలి. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకోవడం మంత్రికి అలవాటు.’’ అని చెల్లుబోయిన ధ్వజమెత్తారు. మంత్రి చర్చకు రావాలి మంత్రి సుభాష్ శెట్టిబలిజల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఆయన ఘనకార్యం వల్లే సామాజిక ధ్రువీకరణ పత్రాల్లో బ్రాకెట్లో శెట్టిబలిజకు ముందు గౌడ అని పేర్కొంటున్నారు. దీనిపై నేను చర్చకు సిద్ధం. చర్చకొస్తే ఈ విధానం అమలుకు కారకులెవరో తేలిపోతుంది. కుల పెద్దలు, మీడియాను న్యాయనిర్ణేతలుగా పెట్టి చర్చిద్దాం. శెట్టిబలిజలను మంత్రి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెడుతున్నారు. గతంలో మంత్రి మీద కేసులు ఎత్తివేయించిందే నేను. ఇంతవరకు ఓపిక పట్టాను. ఇక సహించేది లేదు. రామచంద్రాపురం నియోజకవర్గంలో శెట్టిబలిజలకు ఎవరేం మేలు చేశారో బహిరంగంగా చర్చిద్దాం. జీవోకి, మెమోకి తేడా తెలియని మంత్రులను కేబినెట్లో పెట్టుకుంటే ఇంతకంటే ఏం ఆశించలేం. ఇంకోసారి నాపై మంత్రి అవాకులుచెవాకులు పేలితే సహించేది లేదు’’ అంటూ చెల్లుబోయిన హెచ్చరించారు. -
వైద్యరంగాన్ని నిర్విర్యం చేస్తున్న చంద్రబాబు
పులివెందుల: వైద్య విద్యార్థులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, వైద్యరంగాన్ని నిర్విర్యం చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆయన్ని సోమవారం ఆంధ్రప్రదేశ్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఆ సభ్యుల్లో ఒకరైన పులివెందులకు చెందిన గాజుల జయప్రకాష్ ఎంపీతో మాట్లాడుతూ తన కుమారుడు చరణ్సాయికి నీట్లో 470 మార్కులు వచ్చాయని తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో 471 మార్కుల కటాఫ్ కారణంగా ఒక్క మార్కు తేడాతో తన కుమారుడు వైద్యసీటు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారితో ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పులివెందుల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దని లేఖ రాశారని చెప్పారు. పాడేరు వైద్య కళాశాలకు రావాల్సిన 50 సీట్లను కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కోల్పోయామన్నారు. ఈ రెండు కళాశాలలకు మంజూరైన సీట్లు వచ్చి ఉంటే చరణ్సాయి వంటి విద్యార్థులకు మెడికల్ సీట్లు లభించేవని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు వైద్యవిద్య అందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. -
నేడు పులివెందులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి 3 రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటించింది.పర్యటన షెడ్యూల్.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం బ్రాహ్మణపల్లి చేరుకుని అరటి తోటలను పరిశీలించి.. రైతులతో మాట్లాడుతారు.ఆ తర్వాత పులివెందుల చేరుకుని లింగాల మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి వేల్పులలోని లింగాల రామలింగారెడ్డి నివాసానికి వెళ్తారు. అనంతరం పులివెందుల చేరుకుని క్యాంప్ ఆఫీస్లో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలోనే బస చేస్తారు. గురువారం ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు పయనమవుతారు. -
వైద్య విద్య పీజీ సీట్లు సెల్ఫ్ ఫైనాన్సే..!
ప్రభుత్వం వైద్య కళాశాలల్లో మెడికల్ సీట్లను అమ్ముకోవడం చాలా దురదృష్టకరం. ఆరి్థకంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన సీట్లను డబ్బులకు అమ్ముకోవడం అన్యాయం. – 2023 అక్టోబర్ నాలుగో తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలుసెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ప్రభుత్వమే ఎంబీబీఎస్ సీట్లను అమ్మడం దారుణం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఆ సీట్లను అందజేస్తాం. అధికారంలోకి వచ్చాక మొదటి వంద రోజుల్లో జీవోలను రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతిభావంతులైన విద్యార్థులకు సీట్లను అందేలా చూస్తాను. – 2023 ఆగస్టు 16న నారా లోకేశ్ యువతకు ఇచ్చిన హామీసాక్షి, అమరావతి: కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామనే హామీతో గద్దెనెక్కిన చంద్రబాబు యువతకు మరోవెన్నుపోటు పొడిచారు. రేవు దాటక తెప్పతగలేసినట్టు.. యువతకు ఇచ్చిన హామీకి తిలోదకాలు ఇచ్చేశారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాల ల ఏర్పాటులో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను వైఎస్ జగన్ సర్కార్ ప్రారంభించింది.ఈ కళాశాలలకు మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, అనస్థీíÙయా, గైనిక్ విభాగాల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మంజూరు చేసింది. కొత్త కళాశాలలకు ఈ విద్యా సంవత్సరం సీట్లు మంజూరైన క్రమంలో ఫీజులు, సీట్ల భర్తీపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీజీ సీట్లకు సెల్ఫ్ఫైనాన్స్ విధానం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.అడుగడుగూ అబద్ధమే..! ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త వైద్య కళాశాలలను నిర్వహించడం, వాటిని స్వయం సమృద్ధిగా మార్చడం అన్న లక్ష్యంతో గత ప్రభుత్వంలో ఎంబీబీఎస్ కోర్సులకు మాత్రమే కొన్ని సీట్లకు సెల్ఫ్ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని నాడు టీడీపీ తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. ఆందోళనలు చేసింది. తాము గద్దెనెక్కగానే సెల్ఫ్ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేసేస్తామని వైద్య విద్యా ఆశావహులకు నమ్మబలికారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోగా, పీజీ సీట్లకు కూడా అదే విధానాన్ని వర్తింపజేస్తుండటం గమనార్హం. సీట్ల భర్తీ తీరిది...! పీజీ అడ్మిషన్లలో ప్రభుత్వ కళాశాలల్లోని సగం సీట్లను ఆలిండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సగం సీట్లు రాష్ట్ర కోటా కింద కన్వీనర్ కోటాలో భర్తీ చేయాల్సి ఉంటుంది. కాగా, రాష్ట్ర కోటాలోని 50 శాతం సీట్లను కనీ్వనర్ కోటా కింద భర్తీ చేసి, మిగిలిన 50 శాతంలో 35 శాతం సెల్ఫ్ఫైనాన్స్, 15 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. విద్యార్థుల తెల్లకోటు కల ఛిద్రంఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కొత్త కళాశాలల్లో సెల్ఫ్ఫైనాన్స్ విధానం ఎత్తేయకపోగా, ఏకంగా 10 కళాశాలలను బాబు సర్కార్ ప్రైవేట్కు దారాదత్తం చేసేస్తున్న విషయం తెలిసిందే. కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం మంజూరైన పులివెందుల వైద్య కళాశాల 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా కుట్రపూరితంగా రద్దు చేయించారు. వైఎస్ జగన్ సర్కార్ ప్రణాళిక ప్రకారం 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో వైద్య కళాశాలలు ప్రారంభం అవ్వకుండా ఉద్దేశపూర్వకంగా మోకాలడ్డి రెండేళ్లలో 2,450 మంది విద్యార్థుల తెల్లకోటు కలను ఛిద్రం చేశారు. కళాశాలలు ప్రైవేట్పరం చేస్తుండటంపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమానికి ప్రజా, విద్యార్థి సంఘాలు, మెధావులు, సాధారణ ప్రజలు మద్దతుగా నిలిచారు.


