breaking news
Amaravati
-
రేపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(ఫిబ్రవరి 4, బుధవారం) గుంటూరులో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇల్లు, ఆఫీసుని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.టీడీపీ గూండాలు అంబటి నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి ఓదార్చనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. -
ఎట్టకేలకు.. కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు
సాక్షి,విజయవాడ: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆదేశాలతో అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి వచ్చింది. రైల్వే కోడూరు పోలీసులు పలు సెక్షన్ల కింద అరవ శ్రీధర్పై కేసులు నమోదు చేసింది. అరవ శ్రీధర్ తనపై ఏడాదిన్నరగా దారుణానికి ఒడిగట్టారంటూ బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ తిరుపతి ఎస్పీకి ఫోన్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు చేయాలని స్పష్టం చేశారు. NHRC ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు BNS 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ‘చర్యలుండవ్’ అంటూలైంగికంగా వేధించాడని ఆధారాలతో సహా బాధితురాలు బయటకు వస్తే.. ఆ వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తోంది జనసేన పార్టీ. ఏకంగా అసెంబ్లీ నుంచే మహిళకు వీడియో కాల్స్ చేసినట్లు విషయాన్ని ఆమె బయటపెట్టింది. అయినా కూడా ‘చర్యలుండవ్’ అంటూ బహిరంగంగా చెబుతూ కమిటీ పేరిట కాలయాపన చేస్తోంది.కీచక ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలకు జనసేన ఏమాత్రం సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. వేధింపులను బాధితురాలు నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. దళిత మహిళ రోడ్డెక్కినా.. హోం మంత్రి అనిత స్పందించడం లేదు. ప్రభుత్వ ఒత్తిళ్లతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదు. అందుకే ఆమె నేరుగా హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. -
‘దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్ను ఎందుకు పంపలేదు?’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు, లోకేష్ ఆలోచనల మేరకే అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని.. ఉద్ధేశపూర్వకంగానే ఆటవిక చర్యలకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు, విజయవాడ ఎంపీల నేతృత్వంలో గూండాలు, కిరాయి మనుషులు, గంజాయి బ్యాచ్ దాడి చేశారు. పెట్రోల్ బాంబ్ విసరడంలో నైపుణ్యం సాధించిన వారితో జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వందల మంది దాడికి పాల్పడ్డారు’’ పేర్ని నాని మండిపడ్డారు.‘‘అసాంఘిక శక్తులను కంట్రోల్ చేయాల్సిన పోలీసులే ఈ దాడులకు అండగా నిలిచారు. జోగి రమేష్ ఇంటిపై దాడికి నాయకత్వం వహించిన వారితో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ చర్చలు జరిపారు. టీడీపీ గూండాలు పోలీసును కిందపడేసి దాడి చేసినా వారికి పట్టడం లేదు. ట్రైన్డ్ కిరాయి మూకలే పెట్రోల్ బాంబులను విసరగలుగుతారు. మాజీ మంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటి?. ఆటవిక చర్యలకు కొందరు అధికారులు అండగా ఉండటం చూసి కింది స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..రేపోమాపో రిటైర్ అయ్యే గుణ్ణం రామకృష్ణ ఇలా దిగజారడం బాధాకరం. జనం గుమిగూడినప్పుడు లాఠీఛార్జ్ చేయకుండా ఏం చేస్తున్నారు?. జోగి రమేష్ ఇంటి పై దాడి చేస్తామని టీడీపీ సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పోస్టులే మీకు కనిపిస్తాయా?. టీడీపీ సోషల్ మీడియా పోస్టులు మీకు కనిపించవా?. దుర్గారావు అనే ఏసీపీ నిందితులతో ముచ్చటించడమేంటి?. పోలీస్ ఉద్యోగం చేయడం మర్చిపోయారా ఏసీపీ దుర్గారావు. పెట్రోల్ బాంబులు విసిరిన వారి పై 326 సెక్షన్ ఎందుకు పెట్టలేదు?. 109 సెక్షన్ ఎందుకు పెట్టలేదు. వందల మంది దొమ్మీకి పాల్పడినందుకు 191,192 ఎందుకు పెట్టలేదు?. మారణాయుధాల సెక్షన్ ఎందుకు పెట్టలేదు?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.‘‘కేశినేని చిన్ని నాయకత్వంలోనే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశామని టీడీపీ నేతలు పోస్టులు పెట్టారు. వారిపై ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇదేనా మీ పోలీసింగ్. కేసులో లోకేష్ పేరును చేర్చాలి కదా ఎందుకు చేర్చలేదు?. దాడి జరిగిన వెంటనే క్లూస్ టీమ్ను ఎందుకు పంపించలేదు. ఒక్క పోలీస్ అధికారైనా ఘటనా స్థలాన్ని పరిశీలించాలి కదా. మీ కమిషనరేట్ పరిధిలో ఇంత పెద్ద విధ్వంసం జరిగితే మీరు రారా?. మేం చిన్న ధర్నా పెట్టుకున్నా సెక్షన్ 30 పెడతారు. ఇప్పుడెందుకు సెక్షన్ 30 అమలు కాలేదు..ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ కళ్లెదుటే అంతమంది గుమిగూడితే ఏం చేశారు?. లా అండ్ ఆర్డర్ దిగజారిపోతే మీరు కష్టపడి పాసై ఐపీఎస్ అయ్యి ఉపయోగం ఏంటి రాజశేఖర్ బాబు. మాజీ మంత్రుల ఇళ్లపై పట్టపగలు పెట్రోల్ బాంబ్లు విసిరిన పరిస్థితులు ఏపీలో ఇప్పుడే చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఇలా దాడులు చేయాలనుకోవడం సరికాదు. పోలీసులను నమ్ముకుని ఏ ప్రభుత్వం నడవలేదని చంద్రబాబు, లోకేష్ గుర్తుంచుకోవాలి. పోలీసులను అడ్డగోలుగా వాడుకున్న మీ పరిస్థితి భవిష్యత్ లో ఎలా ఉంటుందో ఊహించారా?. చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త...ఎన్నికల కోడ్ రాగానే ఇదే పోలీసులు మీతాట తీయరా. దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటే ఏడాది పాటు ఆగండి. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో అద్భుతంగా మాట్లాడతాడు. కానీ ఇప్పుడు పవన్ ఏం చేస్తున్నాడో తెలుసుగా. భయం లేనోడే మాట్లాడతాడు. వైఎస్సార్సీపీలో ఉన్నవాళ్లు పవన్ లాంటోళ్లు కాదు. బతికినా చచ్చినా షంషేర్గా ఉంటాం. ఎవడో ఏదో చేస్తాడని మేం భయపడం. వీరమరణం పొందుదామనే మేం పోరాటం చేస్తున్నాం. జగన్ ఏమవుతాడో తెలియనప్పుడే లక్షల మంది అతని వెంట నడిచారు. కష్టాన్నైనా ఆనందంగా తీసుకునేవాళ్లే జగన్ వెంట వైఎస్సార్సీపీలోకి వచ్చారు. నన్ను వేసేస్తా.. వేసేస్తా అంటున్నారు.. ఎన్నాళ్లు దాక్కుంటాం వచ్చి వేసేయండి. పేర్నినానినో.. వేరొకరో.. మరొకరో పోతే ఏమవుతుంది.. మీ పతనం మొదలవుతుంది’’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
తిరుమల లడ్డూ వివాదం.. బాబు సర్కార్ మరో డ్రామా
సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూ వివాదంపై చంద్రబాబు సర్కార్ మరో డ్రామాకు తెరతీసింది. సుప్రీంకోర్టు, సిట్ ఉండగా కమిటీ మరో కమిటీ వేయాలని నిర్ణయించింది. చంద్రబాబుకి వ్యతిరేకంగా సీబీఐ రిపోర్ట్ రావడంతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టింది. సీబీఐ చెప్పిన నిజాలను జీర్ణించుకోలేక కొత్త కమిటీ వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టు విచారణలో ఉన్న అంశంపై మరో విచారణ కమిటీ అంటూ హడావుడి చేస్తోంది.జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించగా.. సీబీఐ ఇచ్చిన నివేదిక తమకు అనుకూలంగా లేదని టీడీపీ ఫ్రస్టేషన్లో ఉంది. దీంతో సీబీఐని తప్పు పడుతూ కొద్దిరోజులుగా కుట్రపూరిత ప్రచారం చేసింది. సీబీఐ సరిగ్గా విచారించలేదంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేసింది. సీబీఐ రిపోర్ట్లో లోపాలంటూ సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారానికి తెరలేపింది. ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి తిరుమల ప్రసాదంపై టీడీపీ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టింది.దుష్ప్రచారానికి కొనసాగింపుగా మరో విచారణ కమిటీ వేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. తమ చెప్పుచేతుల్లో ఉండే అధికారులతో కమిటీ వేసేందుకు కేబినెట్ నిర్ణయించింది. తమకు నచ్చినట్టు నివేదిక రాయించుకోవడానికి ప్రభుత్వం మరో ఎత్తుగడ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తిరుమలపై దుష్ప్రచారం చేయాలని వ్యూహం రచిస్తోంది. కేబినెట్ నిర్ణయాన్ని చూసి న్యాయ నిపుణులు విస్తుపోతున్నారు. -
టీడీపీ గూండాలపై కేసులు పెట్టరా?
సాక్షి, రాజమహేంద్రవరం: ‘మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఆఫీస్, ఇంటిపై టీడీపీ గూండాలు దాడులు చేశారు. కార్లు, ఇల్లు ధ్వంసం చేశారు. ఆఫీస్ తగులబెట్టేశారు. అయినా వారిపై ఇప్పటికీ ఎందుకు కేసులు నమోదు చేయలేదు’ అని అంబటి రాంబాబు అల్లుడు ఉపేష్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబుతో ఉపేష్, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ నాయకుడు అనిల్రెడ్డి సోమవారం ములాఖత్ అయ్యారు. అనంతరం సెంట్రల్ జైలు బయట ఉపేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అంబటిపై రెండు రోజులుగా హైడ్రామా నడుస్తోంది.వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లినప్పుడు టీడీపీ గూండాలు వచ్చి రెచ్చగొట్టి ఆయనతో మాట్లాడించారు. అంబటి రాంబాబుకు 24 గంటల్లో సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హెచ్చరించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త మా ఇంటిపైకి వచ్చి భయంకరంగా దాడులు చేశారు. దారుణమైన బూతులు తిట్టారు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు కేసు పెడతారా?’ అని సీఎం చంద్రబాబును నిలదీశారు.పోలీసులు, సీఐలు వెంకటేశ్వర్లు, వంశీ అంబటిని టార్చర్ చేశారని, పెమ్మసాని చెప్పిన సినిమా చూపించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తిరుమల ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చంద్రబాబు, లోకేశ్ స్టేట్మెంట్లు ఇచ్చారని, డైవర్షన్ కోసమే హైడ్రామా సృష్టించారని దుయ్యబట్టారు. ‘గల్లా మాధవికి ఇల్లు లేదా? ఎల్లప్పుడూ మీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందా?’ అని హెచ్చరించారు. చంద్రబాబు కళ్లు తెరవాలి జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణితో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలపై దాడులు చేసి.. తిరిగి వారి పైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరవాలని హితవు పలికారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మాజీ సీఎం జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకరరెడ్డిపై బురద జల్లే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో తేలినా.. రాజకీయ ప్రయోజనాల కోసం ఫ్లెక్సీలు పెట్టడమేమిటని ప్రశ్నించారు. దీనిని తప్పుపట్టిన అంబటి రాంబాబు ఇంటిపై దాడులు చేయించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ‘మీరు ప్రారంభించిన సంప్రదాయాన్ని రేపు చక్రవడ్డీతో తిరిగి మీకు చెల్లిస్తాం’ అని జక్కంపూడి రాజా హెచ్చరించారు.సెంట్రల్ జైల్కు అంబటి గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబును సోమవారం వేకువజామున 3.45 గంటల సమయంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటికి స్నేహా బ్లాక్లో ఓ గది కేటాయించారు. -
సైబర్ నేరాల కట్టడికి కిల్ స్విచ్
సాక్షి, అమరావతి: సైబర్ నేర ముఠాలు బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టకుండా చెక్ పెట్టేందుకు కేంద్ర హోంశాఖ సరికొత్త కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. ఆన్లైన్, డిజిటల్, యూపీఐ చెల్లింపుల ప్రక్రియలో ‘కిల్ స్విచ్’ను ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాల బాధితుల బ్యాంకు ఖాతాల లావాదేవీలను తక్షణం నిలుపుదల చేసేందుకు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. సైబర్ నేరాల కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు కేంద్ర హోంశాఖ గత ఏడాది డిసెంబరులో ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించింది.కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో కేంద్ర న్యాయ, ఐటీ–టెలీ కమ్యూనికేషన్లు, వినియోగదారుల వ్యవహారాల శాఖలు, ఆర్బీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన సిఫార్సులను ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమరి్పంచింది. ‘కిల్ స్విచ్’ సాధనాన్ని అందుబాటులోకి తేవడంతోపాటు సైబర్ క్రైం నేరాలకు బీమా సౌకర్యం కలి్పంచాలని కూడా ప్రతిపాదించారు. నివేదికలోని ప్రధాన అంశాలివీ..బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, యూపీఐ చెల్లింపుల విధానంలో ఈ ‘కిల్ స్విచ్’ అనే బటన్ను ప్రవేశపెట్టాలని కేంద్ర హోంశాఖ కమిటీ ప్రతిపాదించింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి సంతృప్తి వ్యక్తంచేసింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలోని బ్యాంకింగ్ యాప్లు, యూపీఐ యాప్లలో ఈ ‘కిల్ స్విచ్’ బటన్ను ఏర్పాటుచేస్తారు. డిజిటల్ అరెస్టు, ఇతర సైబర్ నేరాల బారిన పడ్డామని గుర్తించగానే ఆ ‘కిల్ స్విచ్’ బటన్ను నొక్కితే చాలు.. వారి అన్ని బ్యాంకు ఖాతాలు వెంటనే స్తంభించిపోతాయి.ఆ ఖాతాల నుంచి ఇతర ఖాతాలకు నగదు బదిలీగానీ ఇతర లావాదేవీలుగానీ సాధ్యంకాదు. దీంతో.. సైబర్ నేర ముఠాలు బెదిరింపులకు పాల్పడి సామాన్యుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ చేయించుకోవడానికి అడ్డుకట్ట వెయ్యొచ్చని కేంద్ర హోంశాఖ కమిటీ భావిస్తోంది. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతోపాటు సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇదే అంశంపై ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించింది. సైబర్ నేరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. బ్యాంకు ఖాతాలు ఉన్నవారు బీమా చేసుకుంటే.. సైబర్ నేరాలకు గురైతే బీమా పరిహారం పొందవచ్చు. ఈ ప్రతిపాదనపై ఆర్బీఐ దేశంలోని జాతీయ బ్యాంకులు, బీమా సంస్థలతో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.సుప్రీంకోర్టు ఆగ్రహంతో కేంద్ర హోంశాఖ కార్యాచరణదేశంలో సైబర్ నేర ముఠాలు 2024–25లో దేశంలో రూ.34,771 కోట్లు కొల్లగొట్టాయి. డిజిటల్ అరెస్టులని బెదిరించి వీడియో కాల్స్లో గంటల తరబడి బంధించి రూ.3 వేల కోట్లు దోచుకున్నాయి. దీంతో.. తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపడతారో చెప్పాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఫలితంగా.. కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ‘కిల్ స్విచ్’ బటన్ ఏర్పాటు, సైబర్ నేరాలకు బీమా భద్రతతోపాటు మరికొన్ని అంశాలను ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు పరిశీలన అనంతరం కేంద్ర హోంశాఖ తదుపరి కార్యాచరణ చేపడుతుంది. -
కొత్త లైనూ లేదు.. రైలూ లేదు
సాక్షి, అమరావతి: కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చక్రం తిరగలేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రైల్వే బడ్జెట్లోనూ రాష్ట్రానికి ఈసారీ మొండిచెయ్యే మిగిలింది. ఆంధ్రప్రదేశ్కు రెడ్ సిగ్నల్ చూపిస్తూ కేంద్ర రైల్వే బడ్జెట్ బైపాస్లో వెళ్లిపోయింది. కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టుల సాధనలో మాత్రం చేతులెత్తేశారు. ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి సాధించలేకపోయారు. రాష్ట్రం నుంచి ఎన్డీఏకు చెందిన 21 మంది లోక్సభ సభ్యులు ఉన్నప్పటికీ రైల్వే ప్రాజెక్టుల సాధనలో పూర్తిగా విఫలమయ్యారు.2026–27 వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రూ10,134 కోట్లు కేటాయించినట్టు రైల్వే శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గత బడ్జెట్ కంటే ఇది కేవలం రూ.717 కోట్లు మాత్రమే అధికం. పెరిగిన వ్యయంతో పోలిస్తే.. ఆ నిధులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను నత్తనడకన సాగించేందుకే సరిపోతాయి. అంతేగానీ ప్రాజెక్టులను పూర్తి చేయడంగానీ.. కొత్త ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టడంకానీ సాధ్యం కాదనే విషయం స్పష్టమైంది. బడ్జెట్ కేటాయింపుల్లో కనికట్టు చేసేందుకు రైల్వే శాఖ యత్నించింది.2009–10 వార్షిక బడ్జెట్ కంటే పది రెట్లు అధికంగా నిధులు కేటాయించినట్టు రైల్వే శాఖ చెప్పుకోవడం విశేషం. పదేళ్ల క్రితం నాటి బడ్జెట్ కేటాయింపులతో పోలుస్తూ ప్రస్తుత బడ్జెట్లో కొత్త ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపలేదనే విషయాన్ని మరుగుపరిచేందుకు యతి్నంచింది. బడ్జెట్ కేటాయింపులను వివరిస్తూ రైల్వే శాఖ పింక్ బుక్ విడుదల చేస్తేనే కొంత స్పష్టత వస్తుంది. పాత పాటే.. కొత్తగా పాడి.. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల విషయంలో రైల్వే శాఖ ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్రంలో 73 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి అమృత్ భారత్ పథకం కింద ఆ 73 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు మూడేళ్ల క్రితమే రూ.3,418 కోట్ల వ్యయంతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయి.సూళ్లూరుపేట, రాయనపాడు (విజయవాడ శివారు), కాకినాడ టౌన్, మంగళగిరి, తుని రైల్వేస్టేషన్ల పనులు పూర్తయ్యాయి. ఆ విషయాన్నే రైల్వే శాఖ కనికట్టు చేసేందుకు యత్నించింది. 2014 నుంచి రాష్ట్రంలో 1,700 కి.మీ. మేర రైల్వే ట్రాక్లను నిర్మించినట్టు తెలిపింది. కవచ్ ప్రాజె క్టు కింద గతంలోనే ఆమోదించిన 3,137 కి.మీ. పను ల్లో 130 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మరో 2,507 కి.మీ. పనులు కొనసాగుతున్నాయని వెల్లడించింది.కొత్త రైళ్లు లేవు ⇒ రాష్ట్రానికి కొత్త రైళ్ల కేటాయింపులోనూ రెడ్ సిగ్నలే చూపించింది. ఒక్క కొత్త రైలు కూడా వేయలేదు. రాష్ట్రం మీదుగా ఇప్పటికే నాలుగు వందే భారత్ రైళ్లు, 4 అమృత్ భారత్ రైళ్లు నిర్వహిస్తున్న విషయాన్నే రైల్వే శాఖ ప్రస్తావించింది. అంటే కొత్త రైళ్లు కేటాయించడం లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టులు ప్రశ్నార్థకమే ⇒ రాష్ట్రంలో ఇతర కీలక రైల్వే లైన్ల నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో నత్తనడకను తలపిస్తున్న ఆ లైన్ల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందన్నది అగమ్యగోచరంగా మారింది. ⇒ కాకినాడ–పిఠాపురం, మాచర్ల–నల్గొండ, కంభం–ప్రొద్దుటూరు, గూడూరు–దుగరాజపట్నం, కొండపల్లి–కొత్తగూడెం, భద్రాచలం–కొవ్వూరు, జగ్గయ్యపేట–మేళ్లచెరువు రైల్వే లైన్లకు నిధుల కేటాయింపుపై కేంద్రం చిత్తశుద్ధి చూపించలేదు. ⇒అమరావతి రైల్వే లైన్ గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నది సుస్పష్టం. రూ.2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదించినట్టు 2024 అక్టోబర్లో ప్రకటించినా నిధుల కేటాయింపుపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ⇒ అత్యంత కీలకమైన కడప–బెంగళూరు (255 కి.మీ.) రైల్వే లైన్పై కూడా కేంద్ర ప్రభుత్వం మొహం చాటేసింది. ⇒ కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా రైల్వే లైన్ల గురించి కూడా పట్టించుకోలేదు.కొత్త డిమాండ్లు బేఖాతరు కొత్త ప్రాజెక్టును కూడా కేంద్రం పరిశీలించలేదు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనప్పటికీ ప్రతిపాదనల దశలోనే మగ్గిపోవాల్సిన అనివార్యత ఏర్పడిన ప్రాజెక్టులు ఇవీ.. ⇒ విజయవాడ–ఖరగ్పూర్, విజయవాడ–నాగ్పూర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు ⇒ తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు ⇒ విజయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్ నిర్మాణం ⇒ కడప–బెంగళూరు రైల్వేలైన్ అలైన్మెంట్ మార్పు -
ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారుల నుంచి స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత అదనంగా వసూలు చేసిన చార్జీలను వెనక్కి ఇచ్చేయాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ఆదేశించింది. ఇకపై కెపాసిటర్లు ఎన్ని ఉన్నా లోడ్కి ఎన్ని అవసరమో వాటినే విద్యుత్ బిల్లు వేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. విద్యుత్ పంపిణీ రంగంలో సామర్థ్యం, పారదర్శకత, విశ్వసనీయతను మెరుగుపరచడానికి ఆధునిక మీటరింగ్ సాంకేతిక పరిజ్ఞానాలకు మద్దతు ఇస్తూనే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని కమిషన్ స్పష్టం చేసింది. మేం కట్టలేం ‘‘స్మార్ట్ మీటర్లు పెడతామని ఎవరైనా వస్తే వాటిని పగలగొట్టండి అని ఎన్నికల ముందు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం, అవవసరమైతే తగ్గిస్తాం అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వినియోగదారుల సమ్మతితోనే విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటూ మాట మాచ్చారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టుకోకపోతే ఉన్న సర్వీసులు తొలగిస్తామంటూ నోటీసులు ఇస్తున్నారు. వీటికి తోడు ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్లకుపైగా విద్యుత్ చార్జీల భారం మోపారు.స్మార్ట్ మీటర్లు పెట్టడంతో విద్యుత్ బిల్లులు రెండు, మూడింతలు పెరిగిపోయాయి. ఇలా అయితే మేమెలా బిల్లులు కట్టాలి ? వినియోగించని విద్యుత్కు చార్జీలు ఎందుకు చెల్లించాలి.’’ అంటూ విద్యుత్ వినియోగదారులు ఏపీఈఆర్సీకి ఇటీవల మొర పెట్టుకున్నారు. బహిరంగ విచారణలో, ఈమెయిళ్ల ద్వారా, నేరుగానూ తమ సమస్యలను మండలికి చెప్పుకున్నారు. అందుకే ఎక్కువ బిల్లు వినియోగదారుల ఆందోళనను సీరియస్గా తీసుకున్న మండలి ఈ సమస్యకు తమ వంతు పరిష్కారాన్ని అన్వేషించింది. పాత ఎలక్ట్రోమెకానికల్, స్టాటిక్ మీటర్లతో పోలిస్తే కొంతమంది వినియోగదారులకు అధిక విద్యుత్ బిల్లులు వచ్చాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో మూడు సూచనలతో సోమవారం ఆదేశాలు జారీ చేసింది. లో టెన్షన్ (ఎల్టీ) విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్ బిల్లులు భారీగా పెరిగాయి. దీనికి కెపాసిటర్లు కారణమంటూ ఏపీఈఆర్సీకి డిస్కంలు వెల్లడించాయి. వినియోగదారులు అవసరమైన దానికంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కెపాసిటర్లను పెట్టుకోవడం వల్ల స్మార్ట్ మీటర్లు అదనపు లోడ్కి తగ్గట్టుగా యూనిట్లు లెక్కిస్తున్నాయని వివరించాయి. ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్ మీటరింగ్ ప్రోగ్రామ్కు అనుకూలమైన వాతావరణం కల్పించాల్సి ఉందని భావించినట్లు ఏపీ ఈఆర్సీ వెల్లడించింది.ఏపీఈఆర్సీ ఆదేశాలు ఇవీ ⇒ స్మార్ట్ మీటర్లలో కెపాసిటర్ల ఆధారంగా బిల్లు లెక్కింపు విధానం ఉండాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తున్నట్లు మండలి తెలిపింది.⇒ స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత లీడింగ్ రియాక్టివ్ ఎనర్జీ (కెపాసిటర్) కారణంగా వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన అదనపు బిల్లులను ఉపసంహరించుకోవాలని డిస్కంలను ఆదేశించింది.⇒ అలా వసూలు చేసిన అదనపు మొత్తాలను సంబంధిత వినియోగదారులకు తర్వాతి నెలల విద్యుత్ వినియోగ బిల్లులలో సర్దుబాటు చేయాలని సూచించింది. -
ఏపీలో అరాచక పాలన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను ఎండగట్టారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసి తగులబెట్టారని ఆరోపించారు. వందల మంది తమ పార్టీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని, ఇళ్లను దహనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు మద్దతుగా ఉందన్న ధీమాతోనే చంద్రబాబు ప్రభుత్వం ఇంతటి అరాచకానికి తెగబడుతోందని విమర్శించారు. ఏపీలో కనీసం ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రిని కోరారు. రైతులకు తీరని అన్యాయం.. పీఎం కిసాన్ను పెంచండి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, 2019 నుంచి రైతులకు ఇస్తున్న రూ.6 వేలు ’పీఎం కిసాన్’ సాయం ఏమాత్రం సరిపోవడం లేదని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కనీసం రూ.9 వేలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బాబు మోసం.. పథకాలన్నీ బంద్! గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు మొండి చేయి చూపించారని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రీమియం చెల్లించి అమలు చేసిన ’ఉచిత పంటల బీమా’ పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని, దీనివల్ల 74 శాతం మంది రైతులు బీమా అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న, సన్నకారు రైతులకు వరంలా ఉన్న ఉచిత బోరు బావుల పథకాన్ని కూడా నిలిపివేశారని, పాడి రైతులకు ఇచ్చే లీటరుకు రూ.4 బోనస్ను, కోల్డ్ స్టోరేజీల సబ్సిడీలను ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు (పీపీపీ మోడల్) చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, దీనిపై కోటి సంతకాలతో గవర్నర్కు వినతిపత్రం ఇచ్చామని, కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని ప్రైవేటీకరణను ఆపాలను పిల్లి సుభాష్ చంద్రబోస్ కోరారు. -
ఖజానాకు గండికొట్టి.. పచ్చజేబులు నింపుకొంటూ..
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కల్తీ, అక్రమ మద్యం యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లను, బెల్టుషాపులను టీడీపీ సిండికేట్, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నడుపుతున్నారు. ఈ కల్తీ, నకిలీ మద్యం పచ్చ నేతల జేబులు నింపుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. దీనికితోడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఫలితంగా మందుబాబుల ఆరోగ్యం క్షీణించడంతోపాటు రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతోంది.అదే సమయంలో పచ్చ చొక్కాల జేబులు మాత్రం కాసులతో ఫుల్గా నిండుతున్నాయి. గతంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ప్రభుత్వ ఖజానాకు ఎక్సైజ్ రాబడి ఏకంగా 13 శాతం క్షీణించడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో స్వయంగా ఆర్థిక శాఖ ప్రజెంటేషన్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.అంతే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ రాబడి పెరుగుతుండగా అందుకు పూర్తి విరుద్ధంగా రాష్ట్రంలో మద్యం ఆదాయం తగ్గిపోతోందని ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్సైజ్ రాబడులు ఝార్ఖండ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో భారీ వృద్ధి సాధించగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎక్సైజ్ ఆదాయం తిరోగమనంలో ఉంది. ‘పెద్దల’ మనసెరిగి.. ఎక్సైజ్శాఖ మౌనం మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరగకపోగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం పచ్చబాబులు కల్తీ, అక్రమ మద్యం యథేచ్ఛగా విక్రయించి సొమ్ము చేసుకోవడమేనని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పడం గమనార్హం. అయితే అక్రమ మద్యం తయారీ విషయం ఎక్సైజ్ శాఖలోని కీలక అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వ పెద్దల మనసెరిగి మౌనం వహిస్తున్నారనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఎక్సైజ్ ద్వారా రాబడి రూ.14,380 కోట్లుండగా ఈ ఆర్థిక ఏడాది (2025–26) ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్సైజ్ రాబడి రూ.13,114 కోట్లే వచ్చింది. అంటే రూ.1266 కోట్ల మేర ఖజానాకు గండిపడింది. ఈ మొత్తం పచ్చ బాబుల జేబుల్లోకి వెళ్లినట్లేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.అలాగే జీఎస్టీ రాబడులు కూడా పొరుగు రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో తక్కువగా ఉన్నట్లు ఆర్థిక శాఖ ప్రజెంటేషన్లో స్పష్టం చేసింది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జీఎస్టీ రాబడులు బీహార్, కర్ణాటక, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వృద్ధి నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం 0.04 శాతం క్షీణత నెలకొందని ఆర్థిక శాఖ పేర్కొంది. -
జంగిల్రాజ్పై జనాగ్రహం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో జంగిల్రాజ్ అరాచకాలను... అధికార మదంతో టీడీపీ గూండాలు, అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంస కాండను... తమ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు, పచ్చ మూకలు చేస్తున్న దాడులను, చంద్రబాబు ప్రభుత్వ అక్రమ అరెస్టులను వైఎస్సార్సీపీ తీవ్రంగా పరిగణించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీడీపీ గూండాల చేతిలో హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని బుధవారం పరామర్శించనున్నారు. అలాగే టీడీపీ పచ్చ మూకలు శుక్రవారం నిప్పు పెట్టిన జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు సమావేశమై టీడీపీ మూక దాడులపై మండిపడ్డారు. జంగిల్ రాజ్యాధిపతి చంద్రబాబు అరాచకాలు, ఆ పార్టీ నేతల గూండాగిరిని జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడంతోపాటు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇంకోవైపు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అరాచకాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్లపై జరిగిన దాడులను ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, కాపు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు బీసీ, ప్రజా సంఘాలు, కాపు నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. వెంటనే చంద్రబాబు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ.. టీడీపీ జంగిల్రాజ్కు వ్యతిరేకంగా, తిరుమల లడ్డూపై పచ్చ మూక చేస్తున్న దు్రష్పచారానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, బీసీ నేతలు నిరసనకు దిగారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అండ్ కో సాగిస్తున్న అసత్య ప్రచారం... బాబు అబద్ధాలకు మద్దతుగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అదేవిధంగా వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణకు సోమవారం వినతిపత్రమిచ్చారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ సిట్ నివేదిక ఇచ్చినా ఇంకా టీడీపీ నేతలు అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దు్రష్పచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నెల్లూరు నగరంలోని వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. కర్నూలు, నంద్యాలలో టీడీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పోలీసు స్టేషన్లో సీఐ వీరా నాయక్కు పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా ఆటవిక, రాక్షస పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వ పాలన ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ విమర్శించారు. దాడులు అరికట్టాలని పామర్రు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. ప్రకాశం జిల్లాలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఒంగోలులో ఇన్చార్జి చుండూరి రవిబాబు, కనిగిరిలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు నిరసనగా సోమవారం అనంతపురం జిల్లా పరిషత్ ప్రాంగణంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన చేశారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులతో అరాచకం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) అన్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అంతకుముందు నేతలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. రెడ్బుక్ పాలనే... ప్రజా పాలన లేదుతిరుపతిలో జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద బీసీ సంఘ నాయకులు ఆందోళన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షతో రెడ్బుక్ పాలనే తప్ప, ప్రజా పాలన సాగించడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ నాయకుడు తొండమల్ల పుల్లయ్య, జిల్లా అధ్యక్షులు చిన్నియాదవ్, వాసుయాదవ్ ఆరోపించారు. మాజీ మంత్రులు జోగి రమేశ్, అంబటి రాంబాబు ఇళ్లపై కూటమి గూండాలు చేసిన దాడులను ఖండిస్తూ సోమవారం తిరుపతి బాలాజీకాలనీలోని జ్యోతిరావ్పూలే విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా రాజకీయ కక్షలు మానడంలేదని, రెడ్బుక్ పాలన సాగిస్తూ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు సీబీఐ నివేదికతో పటాపంచలయ్యాయన్నారు. అందువల్లే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. -
రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’ చేశారు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ చేశారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దుర్మార్గాలను జాతీయ స్థాయిలో ఎండగడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్ నేతలు సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. పార్టీ స్టేట్ కో– ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నేతలు భేటీ అయ్యారు. రెండున్నర గంటలు జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు, అంబటిపై హత్యాయత్నం ఘటనలపై చర్చ జరిగింది.చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని నేతలు అన్నారు. చంద్రబాబు దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో పరిణామాలను జాతీయ స్థాయికీ తీసుకెళ్లాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారి భక్తుల మనసులను చంద్రబాబు గాయపర్చారని, ఆయనకు ఏ మాత్రమైనా పాపభీతి ఉంటే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తప్పులను ప్రశి్నస్తున్నందుకే వైఎస్సార్సీపీ నేతలపైన కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. మూడు రోజుల్లో ముగ్గురు మాజీ మంత్రులు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై దాడులు చేశారని, అంబటి రాంబాబుపై ఏకంగా హత్యాయత్నం చేశారని, ఇవి చాలా దారుణ ఘటనలని అన్నారు.ఇలా దాడులతో భయపెడితే ఎవ్వరూ ప్రశ్నించరని చంద్రబాబు అనుకుంటున్నారని, కానీ, అది ఆయన అవివేకమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు పూర్తిగా దెబ్బతీశారన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని తెలిపారు. రక్షణ కోసం పార్టీ నాయకులు గంటల తరబడి ఫోన్లు చేసినా పోలీసు అధికారులు స్పందించకపోవడం ఆ వ్యవస్థ దిగజారిపోయిందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇక సామాన్యులకు ఏం రక్షణ కల్పిస్తారని, పైగా బాధితులపైనే కేసులు పెడుతున్నారని చెప్పారు.అంబటి రాంబాబు ఇంటిపై ఆ స్థాయిలో దాడి జరిగినా, ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని నేతలు మండిపడ్డారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, మేరుగు నాగార్జున, కారుమూరు నాగేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్, నేతలు కరణం ధర్మశ్రీ, దేవినేని అవినా‹Ù, పూనూరు గౌతమ్ రెడ్డి, వరికూటి అశోక్ బాబు, దూలం నాగేశ్వరరావు, ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, నూరి ఫాతిమ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్షి్మ, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్ పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యనేతలు ఏమన్నారంటే.. ఇంతటి దుర్మార్గాలు ఎప్పుడూ చూడలేదు : బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. రాజకీయంగా ప్రశ్నించే వారిపై చంద్రబాబు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఎవరో ఏదో చేస్తారని భయపడే రోజులు లేవు. అలా భయపడే వారెవరూ ఇక్కడ లేరు. ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు చేపడతాం. పెట్రోలు బాంబులు వేయడం అనే విష సంస్కృతిని చంద్రబాబు మళ్లీ తెచ్చారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలను దేశమంతా తప్పుపడుతోంది. క్షమాపణ చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు బాబు అరాచకాలు ఢిల్లీలో ఎండగడతాం : సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు విడతలవారీగా ఐదున్నర గంటల పాటు దాడులకు తెగబడ్డారంటే పోలీసులు ఎంత దారుణంగా వ్యవహరించారో అర్థం అవుతోంది. మరుసటి రోజే జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. పోలీసుల సమక్షంలోనే గంటల తరబడి దాడులు జరగడం శృతి మించిన అరాచకాలకు నిదర్శనం. తిరుమల లడ్డూ విషయంలో అబద్ధాలు రుద్దడంలో ఫెయిల్ కావడంతో, డైవర్షన్ కోసం ఇలా అడ్డదారిలో బరి తెగించారు. ఇవన్నీ ఢిల్లీలో ఎండగడతాం. కేంద్ర హోం శాఖ దృష్టికి కూడా తీసుకెళ్తాం.ప్రభుత్వ దుర్మార్గాలపై పార్టీ నాయకులంతా ఒక్కటై పోరాడతారు. విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడుపై దాడుల ఘటనల్లోనూ పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వీటన్నింటిపై కోర్టుల్లో దావా వేస్తాం. జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్చార్సీ) దృష్టికి కూడా తీసుకెళ్తాం. లడ్డూ విషయంలో చంద్రబాబు క్షమాపణ చెప్పేవరకు వదిలి పెట్టేది లేదు. ఫ్లెక్సీలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు మంగళవారమూ కొనసాగుతాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన బాబు: కారుమూరు నాగేశ్వరరావు చంద్రబాబు మానవ హక్కులు హరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించి పోస్టర్లు వేస్తూ, జంతు కొవ్వు కలిసిందని వారు చేసిన ఆరోపణలు నిజమని నమ్మించే కుట్రలు చేస్తున్నారు. తిట్టకపోయినా తిట్టారనే రకం చంద్రబాబు: గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి, రోడ్డుపై వెళ్తుంటే టీడీపీ క్యాడర్ రెచ్చగొట్టిందని, ఆ ఇన్సిడెంట్లో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని రాంబాబు ఒప్పుకున్నా టీడీపీ దౌర్జన్యం చేసింది. ఏమీ తిట్టకపోయినా తనను తిట్టారంటూ రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు: మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వ తప్పిదాలు, అరాచకాలు, అవినీతిపై గట్టిగా ప్రశ్నించే వారు ఎప్పుడు దొరుకుతారా అని చంద్రబాబు, లోకేశ్ ఎదురు చూస్తున్నారు. మా పార్టీ క్యాడర్ను భయపెట్టాలనే లోకేశ్ పన్నాగం పన్నారు. అయినా మేమంతా చాలా ధైర్యంగా నిలబడ్డాం. ఇంకా నిలబడతాం. -
బాబు కుతంత్రం.. సీబీఐ తేల్చినా.. తప్పుడు ప్రచారమే!
సాక్షి, అమరావతి: బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు బరి తెగించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ దారుణమైన ఆరోపణలు చేశారు. ఇందులో ఏమాత్రం నిజం లేదని ప్రఖ్యాత ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్లు నిర్వహించిన పరీక్షల్లో నిర్థారణ కావడం.. సాక్షాత్తూ సీబీఐ కూడా దర్యాప్తులో అదే విషయాన్ని తేల్చి న్యాయస్థానానికి నివేదించడంతో దిక్కు తోచని చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్డీడీబీ) పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు చంద్రబాబు చెబుతుండటం విస్తుగొలుపుతోంది. తన రాజకీయ స్వార్థం కోసం ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.టీటీడీ నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేదని నిర్థారిస్తూ 2025 మార్చి 27న ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక ఇవ్వగా.. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీ 2025 మే 16న రిపోర్టు ఇచ్చింది. అదే విషయాన్ని తన దర్యాప్తులో నిర్థారిస్తూ, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని పేర్కొంటూ సీబీఐ ఈ ఏడాది జనవరి 23న న్యాయస్థానంలో చార్జిషీట్ను సమర్పించింది. అయినా సరే.. ఏమాత్రం పాపభీతి లేకుండా.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ సాహసించని రీతిలో చంద్రబాబు మళ్లీ అవే అబద్ధాలాడుతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ నియమించిన సిట్ తేల్చిచెప్పినా... లెక్క చేయకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.చేసిన పాపానికి క్షమాపణలు చెప్పి చెంపలు వేసుకోవాల్సిందిపోయి రాజకీయ కుట్రలతో చంద్రబాబు మరింత దిగజారి వ్యవహరిస్తుండటం పట్ల శ్రీవారి భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హైందవ ధర్మం, కలియుగ దైవం తిరుమల శ్రీవారి పట్ల ఏమాత్రం భయభక్తులు లేకుండా చంద్రబాబు అసత్యాలు వల్లిస్తుండటం.. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేందుకు కుతంత్రాలకు పాల్పడటం పట్ల కన్నెర్ర చేస్తున్నారు. ఈ దారుణమైన అబద్ధాలు, నిందలను ప్రశ్నిస్తున్న వారిపై పోలీసుల సమక్షంలోనే దాడులకు పురిగొల్పుతూ ప్రభుత్వ పెద్దలు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. ఈ అరాచకాలను స్వయంగా పర్యవేక్షిస్తూ కుట్రలకు పదును పెడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. సీబీఐ తేల్చిచెప్పినా అదే కుట్రా బాబూ! ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యా»ొరేటరీల్లో తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, గొడ్డు, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ తన చార్జిషిట్లో స్పష్టం చేసింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలె్రస్టాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ లేదని అంటే.. జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్టేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయాలను జాతీయ మీడియా కూడా ప్రముఖంగా ప్రచురించింది.రాజకీయ స్వార్థంతోనే చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారన్నది జాతీయ స్థాయిలో స్పష్టమైంది. అయితే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే నిరూపిస్తున్నారు. అందుకు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేస్తున్న దుష్ప్రచారమే తాజా తార్కాణం. 2024 అక్టోబర్లో మొదలు పెట్టిన ఈ కుతంత్రాన్ని ఏడాదిన్నరగా కొనసాగిస్తుండటం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనం. అందుకే వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఈ కేసు విచారణను చేపట్టింది. వేర్వేరు ట్యాంకర్ల నుంచి సేకరించిన నెయ్యి శాంపిళ్లను హర్యానాలోని ప్రతిష్టాత్మకమైన ‘నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్డీఆర్ఐ)లో ల్యాబరేటరీకి పంపించి పరీక్షించింది. ఆ నెయ్యిలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని ఆ పరీక్షల్లో వెల్లడైంది. ఈమేరకు శాస్త్రీయంగా విశ్లేíÙంచి ఎన్డీఆర్ఐ 2025 మే 16న సాధికారికంగా వెల్లడించిన ఆ నివేదికనే సీబీఐ నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షిట్లో స్పష్టంగా పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’ను పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ చంద్రబాబు కుట్రలడ్డూ ప్రసాదంపై తమ దు్రష్పచారం బెడిసికొట్టడంతో చంద్రబాబు కంగు తిన్నారు. దాంతో రెండు రోజుల పాటు మౌనంగా ఉన్న ఆయన మళ్లీ అదే కుట్రను పదును పెట్టడం గమనార్హం. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదిక వెల్లడించడంతోనే తాను అలా మాట్లాడానని ఆయన చెప్పుకొచ్చారు. తద్వారా ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ దు్రష్పచార కుట్రకు తెగబడుతున్నారు. వాస్తవానికి నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలసి ఉండొచ్చని ఎన్డీడీబీ నివేదిక అభిప్రాయపడింది. అంటే మొక్కల నుంచి వచ్చే వెజిటబుల్ ఫ్యాట్నే ఫారిన్ ఫ్యాట్ అని కూడా చెబుతూ నివేదికలో అభిప్రాయపడింది. అది సర్వసాధారణ అంశమే. పశువులు తినే మొక్కలు, దాణాను బట్టి అది ఆధారపడి ఉంటుందని ఆహార శాస్త్ర నిపుణులే చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.కానీ చంద్రబాబు మాత్రం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే టీటీడీ నెయ్యిపై దు్రష్పచారం కొనసాగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు, చేప కొవ్వు కలిపే అవకాశం లేనే లేదని గుజరాత్లోని ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైంది. అదే విషయాన్ని 2025 మార్చి 27న సీబీఐకి నివేదించింది. సీబీఐ ఇటీవల నెల్లూరు న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషిట్లోనూ అదే విషయాన్ని స్పష్టంగా పొందుపరిచింది. టీటీడీ నెయ్యిలో జంతు, చేప కొవ్వు కలిసే అవకాశమే లేదని చార్జీషిట్లోని 208వ పేజీలో పేర్కొంది. అయినాసరే చంద్రబాబు ఎన్డీడీబీ నివేదికను వక్రీకరిస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్పచ్రార కుట్రలను కొనసాగిస్తున్నారు. ఎన్డీడీబీ చెప్పని విషయాలను చెప్పినట్లుగా పదేపదే విష ప్రచారం చేస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అదే నిజమైతే సీబీఐ ప్రస్తావించేది కదా! లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదిక వెల్లడించి ఉంటే... సీబీఐ తన చార్జ్షిట్లో ఆ విషయాన్ని ప్రస్తావించేది కదా అని నిపుణులు చెబుతున్నారు. కానీ 219 పేజీల చార్జ్షిట్లో సీబీఐ ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. ఎన్డీడీబీ నివేదిక గురించి కూడా చార్జ్షిట్లో ప్రస్తావించింది.. కానీ టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైనట్టు ఎక్కడా పేర్కొననే లేదు. అదే సమయంలో నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఎన్డీఆర్ఐ ఇచ్చిన నివేదికనే సీబీఐ తన చార్జ్షిట్లో ప్రముఖంగా పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ జంతు కొవ్వు కలవలేదన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా ఏమాత్రం ఇష్టపడటం లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు. -
అంబటి, జోగి కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను కలవనున్నారు. బుధవారం అంబటి రాంబాబు కుటుంబాన్ని, శుక్రవారం జోగి రమేష్ కుటుంబాన్ని కలిసి పరామర్శించనున్నారు. ఇటీవల అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాలు దాడి చేసి నిప్పు పెట్టిన ఘటన పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలతో చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ ఈ పరామర్శలు చేయనున్నారు. -
అప్పుడు శ్యామలరావు.. ఇప్పుడు సింఘాల్
సాక్షి, అమరావతి/తిరుపతి, అన్నమయ్య సర్కిల్: తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎలాంటి జంతు కొవ్వులేదని, తిరుమల ప్రసాదానికి మహాపచారం జరగలేదని సీబీఐ సిట్ తేల్చిచెప్పడంతో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటూ అభాసుపాలవుతున్న సీఎం చంద్రబాబు తాము ఇప్పటివరకు చేసిన దుష్ప్రచారాన్ని నిజమని యావత్ భక్తకోటిని నమ్మించేందుకు ఆయన ఐఏఎస్ అధికారులను బలితీసుకుంటున్నారు. మొన్న టీటీడీ ఈఓ శ్యామలరావు అయితే.. తాజాగా ఆదివారం అనిల్కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు.ఇలా ఐదు నెలల వ్యవధిలోనే ఆయన ఇద్దరు టీటీడీ ఈఓలపై వేటు వేశారు. దీంతో.. తన రాజకీయ కుతంత్రాలకు చంద్రబాబు టీటీడీని వాడుకుంటూ ఐఏఎస్ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, సింఘాల్ బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం ఆదివారం హడావుడిగా జారీచేసింది. ఆయన వెంటనే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ)లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో ప్రస్తుతం సీఎం స్పెషల్ సీఎస్గా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈఓగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో ప్రభుత్వం నియమించింది. తమ ఆరోపణలు నిజమని నమ్మబలికేందుకే..19 నెలల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమించారు. అప్పట్లో.. అధికారికంగా ఏ విచారణ జరగకుండానే చంద్రబాబు ‘తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపార’ని వ్యాఖ్యానించి రాజకీయ వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో కల్తీ జరిగిందని విషప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ, సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలతో సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ విచారణానంతరం తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని నిర్థారించింది.దీంతో.. అప్పట్లో చంద్రబాబు, పవన్కళ్యాణ్ తదితరులు లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలిపారంటూ అడ్డగోలుగా చేసిన ఆరోపణలను నిజమని ఎలాగైనా నిరూపించేందుకే అప్పుడు శ్యామలరావును.. ఇప్పుడు అనిల్కుమార్ సింఘాల్ను బదిలీ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇక సాధారణంగా ఒకరి స్థానంలో మరొకరిని నియమించినప్పుడు కొత్తగా వచ్చే అధికారి వచ్చాక ఆయనకు బాధ్యతలు అప్పగించడం పరిపాటి. కానీ, సింఘాల్ను ఉన్నపళంగా తప్పుకుని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్యచౌదరికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించి ఆయన్ను ఘోరంగా అవమానించింది. రాజకీయ లబ్ధికోసమే అనిల్కుమార్ సింఘాల్ను వాడుకుని, ఇప్పుడు పక్కకు తోసేశారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.బాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే తిరుమల లక్ష్యంగా..2024 జూన్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రత అనే సాకుతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై గురిపెట్టింది. తిరుమల పవిత్రతను పట్టించుకోనందున అక్కడి పరిస్థితులను చక్కబెట్టేందుకు టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమిస్తున్నట్లు అప్పట్లో ప్రభుత్వ పెద్దలు పలుమార్లు ప్రకటించారు.అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 జూలై 6న, జూలై 12న తిరుమలకు సరఫరా అయిన నెయ్యి టీటీడీ ప్రమాణాలకు తగ్గట్లుగా లేకపోవడంతో అధికారుల స్థాయిలోనే వాటిని వెనక్కు పంపడానికి సిద్ధంచేశారు. ఆ శాంపిళ్లను పరీక్షించేందుకు టీటీడీ చరిత్రలో తొలిసారి గుజరాత్లోని ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు)కి పంపారు. జూలై 23న ఎన్డీడీబీ తన నివేదికలో నెయ్యిలో కల్తీ ఉందని వెల్లడించింది. దాంతో.. ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు.అలా నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీకి షోకాజ్ నోటీసు కూడా ఇచ్చారు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా, రెండు నెలల తర్వాత 2024 సెప్టెంబరు 18న ఎమ్మెల్యేల సమావేశంలో ‘శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదానికి నాసిరకం పదార్థాలు వాడారు.. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది’ అని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం పెను దుమారం రేపుతూనే ఉంది. బాబు వ్యాఖ్యలకు భిన్నంగా శ్యామలరావు ప్రకటనతో..అయితే, 2024 జూలై 23నే నాటి టీటీడీ ఈఓ శ్యామలరావు చంద్రబాబు వ్యాఖ్యలకు భిన్నంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నెయ్యి శాంపిళ్లలో కల్తీ ఉందని తేలింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్.. అంటే వనస్పతి కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్ను బ్లాక్లిస్ట్లో పెట్టేందుకు నోటీసులిచ్చి రెండు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం’.. అని వెల్లడించారు. ఆ తర్వాత.. 2024 సెప్టెంబరు 18 నాటి చంద్రబాబు ప్రకటన తర్వాత సెప్టెంబరు 20న శ్యామలరావు మరోసారి జంతు కొవ్వు కలిపారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు భిన్నంగా ‘అడల్ట్రేటెడ్ నెయ్యి అని తేలిన నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టాం.రిపోర్టు వచ్చిన తర్వాత వాడాలని నిర్ణయించాం. రిపోర్టు క్లియర్ కాకపోవడంతో వాటిని రిజెక్టు చేశాం. వాటిని తిప్పి పంపించేశాం, సరఫరా నిలిపివేశాం’ అని ప్రకటించి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. దీంతో.. అప్పటికప్పుడు ఆయనను బదిలీచేస్తే విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన చంద్రబాబు సర్కారు దాదాపు ఏడాది తర్వాత 2025 సెప్టెంబరులో ఆయనపై బదిలీ వేటువేసింది. ఇప్పుడు సీబీఐ సిట్ నివేదికతో ఉక్కిరిబిక్కిరి అవుతూ తమ ఆరోపణలను నిజమని ఎలాగైనా నమ్మించాలని అనిల్కుమార్ సింఘాల్ను బలిచేసింది. -
కొనసాగుతున్న జంగిల్రాజ్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో జంగిల్ రాజ్ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న వారికి సమాధానం చెప్పలేక ఆటవిక పాలనను ఎంచుకున్నారు. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడంలో సీఎం చంద్రబాబుదే తప్పు అన్న విషయం సీబీఐ సిట్ సాక్షిగా బట్టబయలు కావడంతో ప్రజల దృష్టిలో చులకనై, వారి దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తన రౌడీలను పురమాయిస్తున్నారు. శనివారం గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మరచిపోక ముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై విధ్వంసానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుపడి విధ్వంసం సృష్టించారు. వందలాది మంది రౌడీలు విధ్వంసం సృష్టిస్తుంటే నిలువరించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం విస్తుగొలుపుతోంది. వెళ్లిపోండి.. వెళ్లిపోండి.. అంటూ వారిని బతిమిలాడటం పోలీసు వ్యవస్థ దీన స్థితిని తెలియజేస్తోంది. రాష్ట్రంలో సాగుతున్నది ప్రజాస్వామ్యమా.. లేక ఆటవిక రాజ్యమా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. పైగా ఈ విధ్వంసకాండను చంద్రబాబు తనయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, సదరు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటుండటం దారుణమని, ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలహీన వర్గాల గొంతు నులిమి రాక్షసానందం పొందుతూ ప్రశ్నించే తత్వాన్ని చంపేయడమే టీడీపీ పెద్దల లక్ష్యమనే భావన అత్యధికుల్లో వ్యక్తం అవుతోంది.పక్కా ప్లాన్తోనే దాడిఆదివారం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చినబాబు డైరెక్షన్లో పక్కా ప్లాన్తో జరిగింది. బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై దాడికి ఎన్టీఆర్ జిల్లాలోని పలు ప్రాంతాలు.. ప్రధానంగా విజయవాడలోని కృష్ణలంక, అజిత్సింగ్ నగర్, భవానీపురం ప్రాంతాలకు చెందిన బ్లేడ్, గంజాయి బ్యాచ్లు, కిరాయి రౌడీలు, రౌడీ షీటర్లను భారీగా టీడీపీ నేతల డైరెక్షన్లో ఇబ్రహీంపట్నం తరలించారు. వీరు పెట్రోలు బాంబులు, బాటిళ్లతో దాడి చేసి, ఇంటికి నిప్పు పెట్టారు. ఇంట్లో సామగ్రి కాలి బూడిదైంది. ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పెట్రోల్ బాంబులతో దాడి చేయడంతో తగలబడుతున్న జోగి రమేష్ ఇల్లు ఇదే సమయంలో భారీగా గుమికూడిన టీడీపీ మూకలు.. కత్తులు, కర్రలు, బండరాళ్లతో సైర్వ విహారం చేసి ఇంటిపైన రాళ్ల వర్షం కురిపించాయి. గేటును పగలగొట్టే యత్నం చేశారు. రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడి సమయంలో జోగి రమేష్ తండ్రి జగన్మోహన్రావు, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. జోగి కుటుంబ సభ్యులను అంత మొందించాలనే కుట్రతో, పక్కా ప్రణాళికతో ఈ దాడి చేసినట్లు స్పష్టం అవుతోంది. కాగా, జోగి రమేష్ రాత్రి 11 గంటలకు ఆయన ఇంటికి వచ్చి టీడీపీ మూకలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.రోడ్డుపై బైఠాయింపుజోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావును జూపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని దేవినేని అవినాష్ పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా అరెస్టు చేసి, విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలియడంతో అక్కడికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు చేరుకుంటుండంతో, ఆయన్ను అక్కడి నుంచి సత్యనారాయణపురం పోలీసు స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఖండించారు. ఇలాంటి దాడులకు వైఎస్సార్సీపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ వద్దకు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, పార్టీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.పోలీసుల ప్రేక్షక పాత్రటీడీపీ గూండాలు జోగి రమేష్ ఇంటిపై దాడికి వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామ మాత్రంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే టీడీపీ, బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీషీటర్లు రెచ్చిపోయి దాడులు చేస్తున్నా చేష్టలుడిగి చూస్తు్తండిపోయారు. కనీసం వారిని నిలువరించ లేక, ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. మధ్యాహ్నం నుంచే జోగి రమేష్ ఇంటి వైపు వెళ్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులను నిలువరించిన పోలీసులు, టీడీపీ గూండాలకు మాత్రం పచ్చ జెండా ఊపారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు, ప్రజా సంఘాల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పోలవరానికి రూ.3,320.39 కోట్లే..
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2026–27 బడ్జెట్లో రూ.3,320.39 కోట్లు కేటాయించింది. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)కు రూ.20 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టులో 41.15 మీటర్ల (కనీస నీటిమట్టం) ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయడానికి మాత్రమే నిధులు ఇస్తామని పునరుద్ఘాటించింది. అంటే.. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని 194.6 టీఎంసీల నుంచి 119.4 టీఎంసీలకు తగ్గించడాన్ని బడ్జెట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణానికి కేటాయించిన నిధులు రాబట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యానికి ఇదే పక్కా నిదర్శనం. గత 2025–26 బడ్జెట్లో పోలవరానికి కేంద్రం రూ.5,936 కోట్లు కేటాయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రీయింబర్స్మెంట్ రూపంలో రూ.459.69 కోట్లను విడుదల చేసింది. అడ్వాన్సుగా రెండు విడతల్లో రూ.5,052.71 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. వాటిని ఎస్ఎన్ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమ చేసి.. పోలవరం ప్రాజెక్టు పనులు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మాత్రమే వ్యయం చేసి.. 75 శాతం ఖర్చు చేశాక యూసీలు(వినియోగ ధ్రువీకరణపత్రాలు) పంపితే మళ్లీ అడ్వాన్సుగా నిధులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేయకుండా, ఇతర అవసరాలకు మళ్లించింది. ఇదే అంశంపై పీపీఏ, కేంద్ర జల్ శక్తి శాఖ అనేకమార్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో విడతల వారీగా రూ.4,352 కోట్లను ఎస్ఎన్ఏ ఖాతాలో జమ చేసి.. ప్రాజెక్టు పనులకు, నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ఖర్చు చేసింది. అంటే 2024–25లో అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో ఇప్పటికీ రూ.700 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు. దాంతో కేంద్రం 2025–26 బడ్జెట్లో కేటాయించిన రూ.5,936 కోట్లలో ఒక్క పైసా కూడా ఇప్పటి దాకా విడుదల చేయలేదు. 2026–27 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. 2025–26 బడ్జెట్ అంచనాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం పోలవరానికి కేటాయింపులను రూ.3,017.20 కోట్లకు పరిమితం చేసింది. అంటే.. గతంలో కేటాయించిన నిధుల్లో రూ.2,918.80 కోట్లు కోత వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 58 రోజుల్లో ముగుస్తుంది. దీన్ని బట్టి చూస్తే... సవరించిన బడ్జెట్లో కేటాయించిన రూ.3,017.20 కోట్లను కూడా వినియోగించుకోవడం సాధ్యం కాదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తాజా బడ్జెట్లో పునరుద్ఘాటనపోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇవ్వాలని కేంద్ర కేబినెట్ తీర్మానించింది. తద్వారా పోలవరం రిజర్వాయర్ను బ్యారేజీగా మార్చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం ఆమోదించినా, ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రి కె.రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పలేదు. దాన్ని చంద్రబాబు సర్కార్ కూడా వ్యతిరేకించలేదు.41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ 2024–25, 2025–26 బడ్జెట్లోనూ కేంద్రం స్పష్టం చేసింది. తాజా బడ్జెట్లోనూ అదే అంశాన్ని పునరుద్ఘాటించింది. వాస్తవానికి 2017–18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వేను పూర్తి చేసింది. ఆ మేరకు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, భూ సేకరణకు అదనంగా రూ.22 వేల కోట్లకుపైగా అవసరమని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నాడు.. నేడు.. అదేతీరు...పోలవరంలో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తే.. వరద ప్రవాహం ఉన్నప్పుడు మాత్రమే కుడి, ఎడమ కాలువల కింద 2.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లందించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. ఇక కృష్ణా డెల్టా స్థిరీకరణ, గోదావరి డెల్టాలో రబీ పంటకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో, నాటి కర్ణాటక సీఎం దేవేగౌడను ప్రధానిని చేయడంలో ప్రధాన భూమిక పోషించి, కేంద్రంలో చక్రం తిప్పానంటూ అనేక మార్లు చెప్పుకున్నారు. అప్పట్లో కర్ణాటక సర్కార్ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 506 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు పెంచేసి రిజర్వాయర్గా మార్చేసి, ఏపీ నోట్లో మట్టి కొట్టినా అప్పట్లో చంద్రబాబు నోర మెదపలేదు. ఇప్పుడు పోలవరం రిజర్వాయర్ను బ్యారేజ్గా మార్చేసి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ఘనత కూడా చంద్రబాబే దక్కించుకున్నారంటూ సాగు నీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. సందిగ్ధత... అస్పష్టతసాక్షి, అమరావతి: కేంద్ర రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై స్పష్టత కొరవడింది. కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులను ప్రత్యేకంగా ప్రస్తావించ లేదు. ప్రధానంగా 7 కొత్త హై స్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. వాటిలో హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లు ఏపీ మీదుగా వెళతాయి. చెన్నై–బెంగళూరు హైస్పీడ్ కారిడార్ పరిధిలోకి రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని పలమనేరు ప్రాంతంలో కొంత ప్రాంతం వస్తుంది. రాష్ట్రంలోని అమరావతి రైల్వే లైన్, కడప – బెంగళూరు రైల్వే లైన్, కోటిపల్లి–నర్సాపురం, నడికుడి–శ్రీకాళహస్తి, డోన్–అంకోలా తదితర రైల్వే లైన్లకు కేటాయింపులపై స్పష్టత లేదు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు నిధుల కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది. -
నన్ను అంతం చేయడమే వారి లక్ష్యం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్)/గుంటూరు లీగల్: తనను అంతం చేయడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీస్స్టేషన్లో తనను హింసించారని తెలిపారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. దీంతో శనివారం ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు గుంటూరు మొబైల్ కోర్టులో హాజరు పరిచారు.రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అంబటి పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, దీనివల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై అంబటి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. అంబటిపై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ చెల్లదన్నారు. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే ఉన్నతాధికారుల అనుమతితో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని, దీన్ని పోలీసులు పట్టించుకోలేదన్నారు. అంబటిపై పెట్టిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్ష పడేవే కాబట్టి 41ఏ నోటీసు కూడా ఇవ్వకుండా నేరుగా అరెస్టు చేయడం తగదన్నారు. రెండు కాళ్లు పంగ చీల్చి వేధించారుఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తనను హింసించిన తీరును న్యాయమూర్తి ఎదుట వివరించారు. ‘గుంటూరు సిద్ధార్థనగర్లోని మా ఇంటి వద్ద నుంచి శనివారం రాత్రి 10.30 గంటలకు పోలీసులు నన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. లాకప్లో పడుకుని ఉండగా, రాత్రి రెండు గంటలప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి.. స్టేట్మెంట్ రికార్డు చేయాలంటూ మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లాడు. అక్కడ నల్లపాడు సీఐ వంశీధర్, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు వచ్చి పక్కన కూర్చున్నారు. తమకు పై నుంచి ఒత్తిడి ఉందని, తప్పుగా అనుకోవద్దని చెబుతూనే కానిస్టేబుళ్లకు సైగ చేశారు. కానిస్టేబుళ్లు నన్ను గోడకు అనించి కూర్చోబెట్టి, రెండు కాళ్లు ఎడం చేసి గట్టిగా లాగి పంగ చీల్చారు. నొప్పితో అరవడంతో కాసేపు ఆపి.. రెండోసారి కూడా అలాగే చేశారు. నొప్పితో తర్వాత లేచి నిల్చుని నడవలేక పోయాను. కొంచెం సేపు నెమ్మదిగా నడిపించి కిందికి పంపారు. చాలా నొప్పిగా ఉంది. నన్ను అంతం చేసేందుకే టీడీపీ నాయకులు ఈ వ్యవహారం అంతా చేస్తున్నారు’ అని న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో న్యాయమూర్తి అంబటి రాంబాబు స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. తమ విధులకు అడ్డు పడ్డారంటూ నల్లపాడు ఎస్ఐ చేత పెట్టించిన కేసులో రిమాండ్ను తిరస్కరించారు. దీంతో అంబటిని రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా, అంతకు ముందు రాత్రి 7.30 గంటలకు అంబటికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయవాదుల ఆగ్రహంకోర్టు ఆవరణలో కూడా బ్యారికేడ్లు పెట్టడం, పోలీసులు తమను పదే పదే బయటకు పంపే ప్రయత్నం చేయడంపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పోలీసుల వల్ల తమకు కోర్టులో కూడా రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అంబటిని ఏ జైలుకు తరలిస్తున్నారనే విషయం కూడా అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులకు చెప్పక పోవడం దారుణం అని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి నల్లపాడు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అంబటిని పోలీసులు ‘బాగా చూసుకున్నారు’ అని ఆమె తెలిపారు.రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపుతెల్లవారుజామున నాలుగు గంటలకునేత అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రత్యేక వాహనంలో ఎస్కార్ట్ తో సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. జైలు వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన పోలీసులు.. జైలు బయట భద్రత పెంచారు. అంబటి రాంబాబుకు తీసుకొచ్చిన దుస్తులను సంచుల్లో పంపించేందుకు సైతం అనుమతించలేదు పోలీసులు. ఈరోజు అంబటితో వైఎస్సార్సీపీ నేతలు ములాకత్ కానున్నారు.తిరుగుబాటు తప్పదుప్రభుత్వ పెద్దలు పరిపాలనను పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అహంకార ధోరణితో కక్షగట్టి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారు. తిరిగి ఆయనపైనే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గంతో కూడిన రాక్షస చర్య. రెడ్బుక్ పేరుతో తండ్రీకొడుకులిద్దరూ కలిసి వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులపై దాడులు చేయడం, తప్పుడు కేసులతో అరెస్ట్ చేయడం మినహా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్నారా? తప్పుడు కేసులకు, బెదిరింపులకు భయపడేది లేదు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రిఆటవిక రాజ్యంలో ఉన్నామా?అంబటి రాంబాబుపై దాడికి పాల్పడటం దుర్మార్గం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా? సీబీఐ–సిట్ దర్యాప్తులో లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని తేల్చింది. దీనిని డైవర్ట్ చేసేందుకు టీడీపీ గూండాలు అంబటి రాంబాబు ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని, ఆయన వాహనాన్ని ధ్వంసం చేసి ఇంటికి నిప్పు పెట్టారు. – రామసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీడైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే..లడ్డూలో కల్తీ జరగలేదని సీబీఐ నిగ్గు తేల్చడంతో డైవర్షన్ పాలిటిక్స్ను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం తమదేనన్న మదంతో అంబటి రాంబాబు ఇంటిపై పైశాచికంగా దాడులు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని దేవాలయం మెట్లు కడిగిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఈ రోజు ఏ దేవాలయం మెట్లు కడుగుతారో చెప్పాలి. చంద్రబాబు, లోకేశ్ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేరాష్ట్రంలో రాబందుల పాలనరాష్ట్రంలో రాబందుల పాలన నడుస్తోంది. టీడీపీ కూటమి అధికారంలో ఉన్నంతకాలం పక్క రాష్ట్రాలకు పారిపోయేలా చేస్తున్నారు. చంద్రబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఘటనతో ఏపీని ఆటవిక ప్రదేశ్గా మార్చేశారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడుచంద్రబాబు నేతృత్వంలో వికృత పాలనవైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసే వికృత రాజకీయ క్రీడ రాష్ట్రంలో కొనసాగుతోంది. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం వర్సిటీకి రూ.5 వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టడంతో రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రజల ఆలోచనలను మళ్లించేందుకు పథకం ప్రకారం అంబటి రాంబాబుపై దాడి చేశారు. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రిబిహార్ తరహా ఆటవిక పాలనరాష్ట్రంలో బిహార్ తరహా పాలనకు టీడీపీ కూటమి ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఇంటిపై అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయం. అంబటి ఇంటిపైన, మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్, కిరోసిన్ బాంబులతో దాడికి దిగారు. కూటమి పాలనలో రౌడీ రాజ్యానికి ఇది నిదర్శనం. – వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రిదాడులకు భయపడం రాజధాని ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. వైఎస్సార్సీపీ నాయకులపై కూటమి మూకలు దాడులు చేస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై దాడి చేయడం అమానుషం. డీజీపీ పచ్చచొక్కాను వీడి ఖాకీ చొక్కా ధరించాలి. పోలీసుల సమక్షంలోనే దాడులు జరగటం సిగ్గుచేటు. వైఎస్సార్సీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వ విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేసూ్తనే ఉంటాం. – తలశిల రఘురాం, ఎమ్మెల్సీఅమిత్షా దృష్టికి తీసుకెళ్తాం..అంబటి రాంబాబుపై జరిగిన దాడి గురించి కేంద్ర హోంశాఖకు, ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాం. కేంద్ర హోంమంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళతాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై పార్లమెంట్ వేదికగా తెలియజేస్తాం. బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులు దాడిచేసేవారికి రక్షణ కల్పించడం దుర్మార్గం. – వైవీ సుబ్బారెడ్డి, ఎంపీవ్యూహం ప్రకారమే దాడి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను బట్టి వ్యూహం ప్రకారమే అంబటిపై దాడి జరిగిందనిపిస్తోంది. ఈ కేసులో పోలీసుల్ని నిందితుల్ని చేయాలి. – పిల్లి సుభాష్చంద్రబోస్, ఎంపీపోలీసులు చోద్యం చూశారుఅంబటి రాంబాబు కారులో వస్తుండగా ఆయన్ని అడ్డగించి టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూశారు. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భర్త సమక్షంలో దాడి జరిగింది. – వైఎస్ అవినాశ్రెడ్డి, ఎంపీఅంబటిని రెచ్చగొట్టారు లడ్డూ వ్యవహారంలో అంబటి రాంబాబుపై 24 గంటల ముందునుంచే వ్యూహం పన్ని ఆయన్ని రెచ్చగొట్టారు. టీటీడీ ఈవోపై ప్రభుత్వం అభాండాలు వేస్తోంది. వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి తప్పుచేయలేదని సీబీఐ చార్్జషీట్ ద్వారా నిజం బహిర్గతమైంది. – మేడ రఘునాథరెడ్డి, ఎంపీ హత్య చేయాలని చూశారుఅంబటి రాంబాబును హత్యచేసేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నం చేశారు. వందలాదిమంది ఆయన ఇంటిపై దాడిచేసి నిప్పంటించడం అత్యంత దుర్మార్గం. దీని ఉద్దేశం ఏమిటంటే హత్యచేయాలనే కదా? అక్కడున్న పోలీసులు ఏం చేస్తున్నారు? వారు పోలీసులా? గూండాలా? దాడిచేసిన వారిపై కేసులు పెట్టకుండా అంబటి రాంబాబుపై కేసు పెట్టడం దారుణం. – గొల్ల బాబూరావు, ఎంపీ -
అదే నిప్పు మీ ప్రభుత్వాన్ని దహించేస్తుంది
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి శనివారం రాత్రి.. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఆదివారం టీడీపీ గూండాలు, అసాంఘిక శక్తులు నిప్పు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఇళ్లకు పెట్టిన నిప్పు జంగిల్రాజ్కు ప్రతీక అన్నారు. ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. మీ సర్కార్ను దహించి వేయక మానదని సీఎం చంద్రబాబును హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం వైఎస్ జగన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నిర్ధారణ చేసిన తర్వాత, మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశి్నస్తే, జీరి్ణంచుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం, చంద్రబాబు గారూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు, జంగిల్రాజ్కు ప్రతీక. ఈ నిప్పు మీ సర్కార్ను దహించి వేయక మానదని గుర్తుంచుకోండి. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు, మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి, బూడిద చేయక మానదనీ గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలను రేపే చేయీ కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు. మీరు సృష్టించిన జంగిల్ రాజ్ భూ స్థాపితం కాక తప్పదు. ఇది చరిత్ర చెప్పే సత్యం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అదే పిచ్.. కాస్త రిలీఫ్
సాక్షి, అమరావతి : ట్యాక్స్ శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయనప్పటికీ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించే పలు కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ముఖ్యంగా టీడీఎస్, టీసీఎస్ల భారం తగ్గించడంతోపాటు వ్యక్తిగత ట్యాక్స్ రిటర్నులు ఏడాదంతా మార్చుకునే వెసులుబాటు కల్పించారు. విదేశాల్లో ఉన్న ప్రకటించని ఆస్తులను వన్టైమ్ సెటిల్మెంట్ కింద ప్రకటించుకునే అవకాశాన్ని కల్పించారు. ఆదివారం నిర్మలమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన కొన్ని కీలక నిర్ణయాలు... » ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇన్కమ్ట్యాక్స్– 2025 చట్టం అమల్లోకి రానుంది. దీని ప్రకారం రూ.12 లక్షల వరకు ఆదాయంపై ఇచ్చే ట్యాక్స్ రిబేట్, రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ను పరిగణనలోకి తీసు కుంటే రూ.12.75 లక్షల ఆదాయం వరకు ఉన్నవారు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదు. » వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు ఐటీఆర్–1, ఐటీఆర్–2కింద రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీ జూలై 31, అదే ఆడిట్ అవసరం లేని సంస్థలకు గడువు తేదీ ఆగస్టు 31. » దాఖలు చేసిన రిటర్నుల్లో మార్పులు చేసుకోవడానికి ప్రస్తుతం డిసెంబర్ 31గా ఉన్న గడువును మార్చి 31 వరకు పొడిగించారు. » విదేశీ టూర్ ప్యాకేజీలపై ప్రస్తుతం విధిస్తున్న 5 శాతం , 20 శాతం టీసీఎస్ను రెండు శాతానికి తగ్గించారు. » మానవ వనరులు అందించే సంస్థలపై విధించే టీడీఎస్ను ఒకటి లేదా రెండు శాతానికి పరిమితం చేశారు.» విదేశీ ఆస్తులను ప్రకటించడానికి వన్టైమ్ డిస్క్లోజర్ స్కీంను ప్రవేశపెట్టారు» గత రిటర్నుల్లో విదేశీ ఆస్తులను ప్రకటించడంలో విఫలమైతే ఈ స్కీం కింద తక్కువ పెనాల్టీతో ప్రకటించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. » ఆస్తి విలువ రూ.20 లక్షల లోపు ఉంటే ఎటువంటి పెనాల్టీ ఉండదు. అదే కోటి రూపాయల లోపు ఉంటే మార్కెట్ విలువలో 30 శాతం చెల్లిస్తే సరిపోతుంది. » ప్రవాస భారతీయులు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీం(పీఐఎస్) కింద పెయిడప్ క్యాపిటల్లో 10 శాతం వరకూ వాటా తీసుకోవచ్చు.ఇప్పటిదాకా ఇది 5 శాతంగానే ఉండేది. స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల్లో వీరు ఇక నుంచి 24 శాతం వరకూ వాటా తీసుకోవచ్చు. ఇప్పటివరకూ ఇది 10 శాతంగా ఉండేది.» కార్పొరేట్స్పై విధిస్తున్న మినిమమ్ఆల్టర్నేటివ్ ట్యాక్స్ను (మ్యాట్) 15 నుంచి 14 శాతానికి తగ్గించారు. » ఆర్బీఐ నుంచి నేరుగా సావరిన్గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసిన వారు... కాలపరిమితి ముగిసేంత వరకూ తమ వద్దఉంచుకుంటే, వాళ్లకు మాత్రమే క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇవే బాండ్లను సెంకడరీ మార్కెట్ నుంచికొనుగోలు చేసిన వారు మాత్రం క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.మ్యాచ్ సమ్మరీపిచ్ మారలేదు. ఫీల్డ్ సెట్టింగ్ కూడా మునుపట్లానే. ఇన్కమ్ ట్యాక్స్ శ్లాబులు యథాతథం. కాకపోతే అంపైర్ నుంచి అనుకోకుండా నోబాల్ వచ్చింది. అంటే... ఓ సింగిల్ రన్తో పాటు మరో బాల్ అదనమన్న మాట. టీడీఎస్, టీసీఎస్లను తగ్గించటం సింగిల్ రన్ అదనంగా లభించటమే. అదనపు బాల్, సింగిల్ రన్ కాంబినేషన్తో కొంతయినా రన్రేట్పై ఒత్తిడి తగ్గింది. ఎన్నారైలకైతే లూజ్ డెలివరీలు పడ్డాయి. విదేశీ ఆస్తులపై వన్టైమ్ సెటిల్మెంట్ ఫ్రీ హిట్లాగామారింది. బౌండరీలు లేవు, హిట్టింగ్ లేదు. కానీ వికెట్లు కాపాడుకుంటూ స్కోర్బోర్డు ముందుకు నడిపిన ఒక క్లాసిక్ కన్సాలిడేషన్ ఓవర్ ఇది. -
ఖనిజ సంపదకు కారిడార్ వెలుగులు
సాక్షి, అమరావతి: దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించే భవిష్యత్తు ఇంధనాలుగా పిలిచే అరుదైన ఖనిజాలు ఆంధ్ర ప్రదేశ్కు వరంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ ఈ కారిడార్ను ఏర్పాటు చేయనున్నారు. ఇది కేవలం ఖనిజ తవ్వకాలకే పరిమితం కాకుండా రాష్ట్రాన్ని ఒక పారిశ్రామిక హబ్గా మార్చేందుకు దోహదపడుతుందని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. అరుదైన ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తామని నిర్మల ప్రకటించారు.దీనికోసం బడ్జెట్లో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్సీఎంఎం) కింద రూ.16,300 కోట్లను కేటాయించారు. ఈ ఖనిజాల ద్వారా తయారయ్యే పర్మనెంట్ మాగ్నెట్స్ ఉత్పత్తి కోసం గత ఏడాది ప్రకటించిన రూ.7,280 కోట్ల ఇన్సెంటివ్ స్కీమ్ను ఈ కారిడార్కు అనుసంధానం చేయనున్నారు.ఏపీలో విస్తారంగా రేర్ ఎర్త్ మినరల్స్..ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతంలో మోనజైట్ అనే ఖనిజం ద్వారా పలు అరుదైన మూలకాలు లభిస్తాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నంవంటి ప్రాంతాలు ఈ బీచ్ సాండ్ నిక్షేపాలకు ప్రధాన కేంద్రాలు. అనంతపురం జిల్లాలోని దంచెర్ల, పెద్దవడుగూరు ప్రాంతాల్లోనూ రేర్ ఎర్త్ మూలకాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైఎస్ఆర్ కడప, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో గ్రాఫైట్, కోబాల్ట్, కాడ్మియం వంటి ఖనిజాలు ఉన్నాయి. బడ్జెట్లో ప్రతిపాదించిన ఈ కారిడార్ ద్వారా కేవలం తీర ప్రాంతమే కాకుండా ఖనిజ నిక్షేపాలున్న లోతట్టు ప్రాంతాలను రవాణా పరంగా అనుసంధానించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మన ఖనిజ సంపదను ముడి రూపంలో తక్కువ ధరకు విదేశాలకు పంపించి తిరిగి వాటితో తయారైన ఖరీదైన బ్యాటరీలను, అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఈ సంస్కృతికి విడనాడాలని భావిస్తున్నారు. ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే రిఫైనరీలు, ఖనిజాలను వేరు చేసే అత్యాధునిక ల్యాబ్లు, ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లు, చిప్స్ తయారు చేసే ఫ్యాక్టరీలను ఒకే తాటిమీదకు తెస్తారు. దీంతో ఖర్చు తగ్గి, స్థానికంగా ఉపాధి పెరుగుతుంది. బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఈ కారిడార్ విజయవంతం కావాలంటే పర్యావరణ ప్రభావం, స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా చూడటం ప్రధానమని నిపుణులు చెబుతున్నారు. ఈసీఎంఎస్కు రూ.40 వేల కోట్లున్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీలో ఆత్మనిర్భరతే లక్ష్యంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ను విస్తరించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల ఆదివారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. చిప్ల తయారీరంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ పరిశ్రమల్లో ఉపకరణాల సేకరణ, ముడి సరకులు, దేశీయ డిజైన్లు, ఇతర ముడి సామగ్రి విషయంలో సముపార్జనే ధ్యేయంగా ముందుకెళ్లాలని నిర్ణయించామని నిర్మల చెప్పారు. పారిశ్రామికంగా పరిశోధన శిక్షణా కేంద్రాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టామని, ఇందుకోసం ఇండియా సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం) 2.0ను తీసుకొస్తామని నిర్మల వెల్లడించారు.‘‘ త్వరలో ఐఎస్ఎస్ 2.0ను తీసుకొచ్చి చిప్ల సంబంధ ఉపకరణాలు, మెటీరియల్స్, భారతీయ మేథోపర హక్కులున్న చిప్ డిజైన్, సరకు రవాణా గొలుసులను అభివృద్ధి చేస్తాం’’ అని నిర్మల వెల్లడించారు. ‘‘ ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్)ను 2025 ఏప్రిల్లో రూ.22,919 కోట్లతో ఆరంభించాం. ఈ పథకానికి నిధుల కేటాయింపులను రూ.40,000 కోట్లకు పెంచుతున్నాం’’ అని నిర్మల చెప్పారు. ‘‘మొత్తంగా రూ.54,567 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వద్దకు జనవరి నాటికి 46 దరఖాస్తులు చేరాయి. ఈ ప్రాజెక్టులు సాకారమైతే మరో 51,000 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని నిర్మల చెప్పారు. -
‘చంద్రబాబూ గుర్తుంచుకోండి.. చరిత్ర చెప్పే సత్యం ఇది’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్ అరాచకాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని.. ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నిర్ధారణ చేశాయి. తర్వాత మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే.. జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించానని మీరు అనుకోవడం.. చంద్రబాబూ అది మీ భ్రమే. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి చంద్రబాబూ’’ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ హెచ్చరించారు.‘‘అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకు ‘జంగిల్రాజ్’కు ప్రతీక. కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి.. చంద్రబాబూ మీ సర్కార్ను దహించివేయక మానదు. రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసే ప్రజాగ్రహ జ్వాలలు.. మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహనం చేసి, బూడిద చేయకమానదు...చంద్రబాబూ గుర్తుంచుకోండి.. ప్రజాస్వామ్యంలో హింసా జ్వాలలను రేపే చేయి కాలక తప్పదు. అరాచక, ఆటవిక పాలన అంతం కాక తప్పదు! మీరు సృష్టించిన ‘జంగిల్ రాజ్’’ భూస్థాపితం కాక తప్పదు. చరిత్ర చెప్పే సత్యం ఇది.’’ అంటూ వైఎస్ జగన్ హెచ్చరించారు.ప్రజాస్వామ్యంలో, మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబులు NDDB, NDRI నిర్ధారణ చేసిన తర్వాత, మీరుచేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లకు మీరు నిప్పు పెట్టడం, ఆ దుశ్చర్యలతో భయాన్ని… pic.twitter.com/pA288I5ZIL— YS Jagan Mohan Reddy (@ysjagan) February 1, 2026 -
మాజీ మంత్రి జోగి రమేష్కు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి జోగి రమేష్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు. జోగి రమేష్ను పరామర్శించిన వైఎస్ జగన్.. జోగి రమేష్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న ఆయన.. ప్రశ్నించేవారిని భయపెట్టడానికే చంద్రబాబు హింసాజ్వాలను రాజేస్తున్నారని మండిపడ్డారు. అవే మంటలు చంద్రబాబు సర్కార్ను దహించి వేయక తప్పదన్నారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందంటూ జోగి రమేష్కు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు.ఏపీలో టీడీపీ గూండాల అరాచకం కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ గూండాల దాడికి పాల్పడారు. ఇంట్లోకి వెళ్లేందుకు టీడీపీ గూండాల యత్నించారు. జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టారు. జోగి రమేష్ నివాసంపై దాడి వెనుక కుట్ర బట్టబయలైంది. మాజీ మంత్రి నివాసంపై టీడీపీ పథకం ప్రకారం దాడికి పురిగొల్పింది. జోగి నివాసంపై దాడికి పిలుపునిచ్చిన టీడీపీ.. ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిరసన పేరుతో ప్లాన్ అమలు చేసింది.అధికారికంగా పత్రికా ప్రకటన ఇచ్చిన ఇబ్రహీంపట్నం టీడీపీ అధ్యక్షుడు.. ఆందోళనకు పిలుపునిచ్చారు. అదే సమయంలో జోగి రమేష్ ఇంటివద్దకు చేరిన టీడీపీ నేతలు, గూండాలు.. ఆయన నివాసంపై కర్రలు, రాడ్లు, కత్తులు, పెట్రోల్ బాంబ్లతో దాడి చేశారు. -
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టులో చంద్రబాబు సర్కార్కు షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. శాంతిభద్రతలు అదుపులోకి వచ్చేంతవరకూ అంబటి ఫ్యామిలీకి 24 గంటల భద్రత ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి నిన్న (శనివారం) హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.తనతోపాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె అందులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, శాంతిభద్రతల సమస్య ఉందని పిటిషన్లో వివరించారు. తనకు 24 గంటలు భద్రత కల్పించాలని, అందుకు అనుగుణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి కోరారు. ఇవాళ (ఫిబ్రవరి 1, ఆదివారం) హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. అంబటి కుటుంబానికి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.కాగా, టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలు చేతబట్టి అంబటి రాంబాబుపై శనివారం హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తుదకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరి తెగించారు.ఈ క్రమంలో వందలాది మంది పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండి పోవడం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైనా దాడి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా గూండాలను పంపించి ఆయనపై ఉదయం నుంచి దాడి చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేసింది. -
చంద్రబాబు సర్కార్కు మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్: బుగ్గన
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగానే ఉందని, రాష్ట్రానికి దీని వల్ల ఒరిగిందేమీ లేదని మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలవరానికి కేవలం రూ.3,300 కోట్లు మాత్రమే విదిల్చారని, అంతకు మించి రాష్టానికి ఒరిగిందేమీ లేదన్నారు. అప్పులు మాత్రం జీడీపీలో 4.3 శాతానికి తగ్గించుకున్నారని, కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం గత బడ్జెట్లో చెప్పిన దాని కన్నా ఇప్పటికే రూ.16 వేల కోట్లు ఎక్కువగా అప్పులు చేసిందని ఆక్షేపించారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో అప్పులు చేస్తే శ్రీలంక అయిపోతుందన విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడేమంటారని బుగ్గన ప్రశ్నించారు. ఆయన ఇంకేమన్నారంటే..:కేంద్ర బడ్డెట్ నిరాశాజనకం:కేంద్ర బడ్జెట్ చరిత్రలోనే అతి పెద్దది. ఇందులో ఆదాయ, వ్యయ అంచనాలు రూ.53,47,315 కోట్లు కాగా, రూ.16,95,768 కోట్లు అప్పుగా చూపారు. మూలధన వ్యయం రూ.12,21,821 కోట్లుగానూ, ద్రవ్యలోటు రూ.16,95,765 కోట్లుగానూ చూపారు. జీడీపీలో గత సంవత్సరాలతో పోలిస్తే అప్పు 4.3 శాతానికి తగ్గడం ఒక్కటే ఊరట. సమగ్ర శిక్ష, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలకు భారీ కేటాయింపులు చేసినా ఖర్చు మాత్రం చేయడం లేదు. గతేడాది జల్ జీవన్ మిషన్కు రూ.67 వేల కోట్లకు పైగా కేటాయించినా, కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అందులో ఏపీలోనే ప్రభుత్వం రూ.12 వేల కోట్లు అప్పులు చేసి ఖర్చు పెట్టడం విశేషం. రోడ్లు, రైలు మార్గాలకు రూ.5,98,520 కోట్లు ఖర్చుపెడతామని ప్రకటించారు. పోలవరానికి కేవలం రూ.3,300 కోట్లు మాత్రమేఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా ప్రాజెక్టుల ఊసే లేదు.అప్పుల్లో కేంద్రానికి రివర్స్లో ఏపీ సర్కార్:కేంద్రం అప్పు తగ్గించుకుంటూ వస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అప్పులు పెంచుకుంటూ పోతోంది. ఫిబ్రవరి 3వ తేదీ నాటికి రాష్ట్ర అప్పు, కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు అన్నీ కలిపి చూస్తే ఏకంగా అది రూ.3,14,644 కోట్లు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం, ఆ 5 ఏళ్లలో రెండేళ్లు కోవిడ్ వంటి సంక్షోభం ఉన్నా కూడా రూ.3 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం మీరు రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఆ సంఖ్యను దాటేశారు. కాగ్ లెక్కల ప్రకారం కేవలం ఆర్బీఐ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.81,597 కోట్లు అప్పు చేశారు. ఇది బడ్జెట్తో పోలిస్తే రూ.10 వేల కోట్లు ఎక్కువ. మరో రూ.3,300 కోట్లు ఫిబ్రవరి 3న తీసుకుంటున్నారు. ఇలా బడ్జెట్లో చెప్పిన దాని కన్నా రూ.15 వేల కోట్లకు పైగా అదనంగా అప్పులు చేస్తున్నారు. అప్పట్లో మేం అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు. ఇప్పుడు మీ అప్పులకు రాష్ట్రం వెనెజులా అవుతుందా?.చంద్రబాబు మ్యాటర్ వీక్. పబ్లిసిటీ పీక్:ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వారా రాష్ట్ర అభివృద్ధి రుణాలు రూ.77,040 కోట్లుగా ఉన్నాయి. దానికి ఈ నెలలో తీసుకునే రూ.3,300 కోట్లు కలిపితే మొత్తం రుణం రూ.80,340 కోట్లు అవుతుంది. కాగ్ లెక్కల ప్రకారం రుణాలు రూ.77,040 కోట్లు కాగా.. డిసెంబర్ 2న రూ.3 వేల కోట్లు, డిసెంబర్ 30న రూ.4 వేల కోట్లు, జనవరి 6న రూ.6,500 కోట్లు, జనవరి 27న రూ.2,500 కోట్ల అప్పు చేయగా, ఫిబ్రవరి 3న మరో రూ.3,300 కోట్ల రుణం తీసుకుంటున్నారు. అన్నీ కలిపితే రూ.96,340 కోట్లకు చేరతాయి. అవే కాకుండా, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్నీ కలిపి రూ.89,320 కోట్లు ఉన్నాయి.ఒక్క రాజధాని పేరు మీదే ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ, ఇతర సంస్థల నుంచి రూ.47,387 కోట్లు ఇప్పటివరకూ అప్పు చేశారు. మేం ఎవరితో పోల్చుకున్నా తక్కువ అప్పులు చేశాం. అయినా పచ్చమీడియా సాయంతో మాపై దుష్ప్రచారం చేశారు. 2019 నాటికి రాష్ట్ర అప్పు రూ.2.5 లక్షల కోట్లు ఉంటే.. మేం దిగిపోయే నాటికి ఆ అప్పు రూ.3.32 లక్షల కోట్లకు పెరిగింది. మీ హయాంలో ప్రతీ సంవత్సరం 22.6 శాతం అప్పుల్ని పెంచితే, కరోనా వంటి సంక్షోభాలు ఉన్నా 13.5 శాతం మాత్రమే అప్పులు పెంచాం. అయినా వైయస్సార్సీపీ ప్రభుత్వంపై నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ‘మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్’ అని చెప్పడానికి ఇదే నిదర్శనమని బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు. -
చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్ చేయడమే: సజ్జల
సాక్షి, గుంటూరు: ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది దేనికి?.. ప్రశ్నించే గొంతులను వేధించడానికా? అంటూ చంద్రబాబు సర్కార్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ‘‘లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం హోదాలో బాబు చెప్పారు. బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడతారు?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.‘‘కల్తీ నిజమంటూ ప్లెక్సీలు వేసి దుష్ప్రచారానికి దిగారు. తప్పుడు ఫ్లైక్సీలను మా పార్టీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నేతలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు. చట్టం.. గూండాలను, అరాచకశక్తులను రక్షించింది. మా పార్టీ నేతలకు ప్రాణాపాయం జరిగితే ఎవరిది బాధ్యత?. పోలీస్ ఉన్నతాధికారులకు బొత్స ఫోన్ చేసినా స్పందన లేదు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలి. మా పోరాటం అహింసాయుతంగా ఉంటుంది. కోర్టులను ఆశ్రయిస్తాం, గవర్నర్ను కూడా కలుస్తాం’’ అని సజ్జల పేర్కొన్నారు.ఊరుపేరులేని ఫ్లైక్సీలను పోలీసులే తొలగించాలి. డీజీపీ, హోంమంత్రి సమాధానం చెప్పాలి. విడుదల రజిని, భూమన, బ్రహ్మనాయుడిపైనా దాడికి యత్నించారు. గతంలో టీడీపీ నేత పట్టాభి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారు. చంద్రబాబు లక్షణం హింసను క్రియేట్ చేయడమే. ఎమ్మెల్యే గల్లా మాధవి దగ్గరుండి దాడులు చేయించారు. టీడీపీ అరాచకాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. డిజిటల్ బుక్లో అరాచకవాదుల పేర్లు ఎక్కిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక అరాచక వాదులకు శిక్ష తప్పదు. మాజీ హోంమంత్రిని ఎస్పీ ఆఫీస్ గేట్ ఎదుట వెయిట్ చేయించారు. లోకేష్ నోటి వెంట వచ్చే ప్రతి మాట బూతే’’ అని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రేషన్ డీలర్ల ఎంపిక ఆపండి
సాక్షి, అమరావతి: రేషన్ దుకాణాల డీలర్ల ఎంపిక విషయంలో హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచి్చంది. డీలర్ల ఎంపిక నిమిత్తం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూకు రాత పరీక్షతో సమానంగా 50 మార్కులను నిర్ణయించడాన్ని తప్పుపట్టింది. కొత్త మార్గదర్శకాలు జారీ చేసేంత వరకు డీలర్ల ఎంపికను ఖరారు చేయవద్దంటూ గతంలోనే ఆదేశాలిచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇంటర్వ్యూలో 50 మార్కులను నిర్ధేశిస్తూ 2011లో జారీ చేసిన జీవో–4ను హైకోర్టు కొట్టేసినప్పటికీ ప్రభుత్వం 50 మార్కులతోనే ఎంపిక ప్రక్రియను కొనసాగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరిగిన డీలర్ల ఎంపిక ప్రక్రియ మొత్తం చట్టరీత్యా చెల్లదని తేల్చిచెప్పింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మార్కులను నిర్ణయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కేసులో పిటిషన్ను కొట్టేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కొత్తగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పునిచి్చంది. 50 శాతం మార్కులపై పిటిషన్ విజయనగరం జిల్లా సాలూరులోని షాపు నంబర్–15కు రేషన్ డీలర్ నియామకం కోసం 2012 ఫిబ్రవరి 9న పార్వతీపురం ఆర్డీవో నోటిఫికేషన్ జారీ చేశారు. 50 మార్కుల రాత పరీక్ష, 50 మార్కుల ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కోట నాగమణి అనే మహిళ 2012 ఫిబ్రవరి 26న జరిగిన రాతపరీక్షకు హాజరై 50కి 50 మార్కులు సాధించారు. అయితే.. ఇంటర్వ్యూలో అర్హత సాధించలేదు. దీంతో నాగమణి రేషన్ డీలర్ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూకు 50 మార్కులను నిర్ధేశిస్తూ 2011లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 4ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఈ పిటిషన్ను కొట్టేశారు. దీనిని సవాల్ చేస్తూ నాగమణి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం తీర్పునిస్తూ.. సాధారణ పరిస్థితుల్లో అయితే పిటిషనర్ నాగమణి ఓసారి అవకాశం తీసుకున్న తర్వాత ఎంపిక ప్రక్రియను సవాల్ చేయలేరంది. అయితే, ఇంటర్వ్యూకు 50 మార్కుల విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించినా.. జీవో–4ను కొట్టేసినా అధికారులు డీలర్ల ఎంపిక ప్రక్రియ విషయంలో ముందుకెళ్లారని ఆక్షేపించింది. ఇది కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే అవుతుందని తెలిపింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జరిగిన ఈ మొత్తం ఎంపిక ప్రక్రియ చట్టరీత్యా చెల్లదని తేల్చి చెప్పింది. కాబట్టి నాగమణి పిటిషన్ను కొట్టేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్టు తెలిపింది. కొత్తగా ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
పింఛన్లలో ‘కోత’లా..?
రాజానగరం: బోడి గుండుకు... మోకాలికి ముడి వేయడమంటే ఇదేనేమో..!! చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరు అదే రీతిలో ఉంది. సర్కారు సాయం కోసం ఎదురు చూసే అభాగ్యులను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదలడం లేదు. ఆస్తి పన్ను బకాయిల పేరిట ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల నగదులో కోత పెడుతున్నారు. లబ్ది దారులకు పింఛను సొమ్ము పూర్తిగా అందజేయకుండా పన్ను బకాయి మినహాయించుకుని మిగిలిన మొత్తం వారి చేతుల్లో పెడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో శనివారం పింఛన్ల పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో ఇంటి పన్ను బకాయిలున్న వారికి సిబ్బంది పూర్తి పింఛను చెల్లించలేదు. దీనిపై లబ్ది దారులు, స్థానికులు ప్రశ్నించడంతో పై అధికారులు చెప్పిన విధంగా తాము చేస్తున్నామని సిబ్బంది చెప్పారు. మరోవైపు గ్రామంలో ఒకచోట కూర్చుని లబ్ది దారులను తమ వద్దకు రప్పించుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను కడితేనే పింఛను ఇస్తామన్నారు ఇంటి పన్ను, కుళాయి పన్ను కడితేనే పింఛను ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయని సిబ్బంది చెప్పారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని పింఛన్లు ఇచ్చిన వారు చెబుతున్నారు. నా దగ్గర ఇంటి పన్ను బకాయి పేరుతో రూ.270 మినహాయించి మిగిలిన పింఛను అందించారు. – పి.దుర్గారావు, కలవచర్ల -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నేటి నుంచి ఈనెల 10 వరకు ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్స్లో నిర్వహించనున్నారు. గత విద్యా సంవత్సరం నుంచి ఏ కాలేజీకి ఆ కాలేజీలోనే సెంటర్లు (సెల్ఫ్ సెంటర్స్) ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,274 సెంటర్లు, ఒకేషనల్ సబ్జెక్టులకు 624 సెంటర్లను ఏర్పాటు చేశారు. కాగా, మొదటి విడత (స్పెల్–1)లో 1,570 సెంటర్లలో ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జంబ్లింగ్ విధానం ఎత్తివేత పబ్లిక్ పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షల్లోనూ మాల్ ప్రాక్టీస్ను నిర్మూలించేందుకు గతంలో జంబ్లింగ్ విధానం అమలు చేశారు. ఒక కాలేజీ విద్యార్థులు అదే కాలేజీలో ప్రాక్టికల్స్ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉండేది కాదు. దీంతో అన్ని కాలేజీల విద్యార్థులకు సమన్యాయం జరిగేది. కానీ, గత ఏడాది నుంచి జంబ్లింగ్ విధానం ఎత్తేసి, ఏ కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు.దీంతో విద్యార్థుల ప్రతిభతో సంబంధం లేకుండా మార్కుల నమోదు ప్రహసనంగా మారింది. ముఖ్యంగా కార్పొరేట్ కాలేజీలు దీనిని వరంగా మార్చుకున్నాయి. అలాగే, గతంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లెక్చరర్లను మాత్రమే ప్రాక్టికల్ విధులకు నియమించేవారు. మ్యాథమెటిక్స్ లెక్చరర్లు మాత్రం పూర్తిగా కాలేజీ విధుల్లో ఉండేలా ఇంటర్ బోర్డు స్పష్టమైన ఆదేశాలిచి్చంది. ఇప్పుడు ఈ విధానం కూడా పూర్తిగా మార్చేశారు. -
22ఏలోని భూముల్ని గీతంకు ఎలా బదలాయిస్తారు?
సాక్షి, అమరావతి : విశాఖ రూరల్ మండలం ఎండాడ, రుషికొండ పరిధిలోని నిషేధిత జాబితా 22ఏలో ఉన్న భూములను గీతం యూనివర్సిటీకి ఎలా బదలాయిస్తారని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీకి గతంలోనూ, ప్రస్తుతం ఇస్తున్న భూముల్లో 22ఏ భూములున్నాయనే విషయం రెవెన్యూ, జీవీఎంసీ అధికారులకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. జయలక్ష్మికి శనివారం మరోసారి లేఖ రాశారు. సీసీఎల్ఏ జయలక్ష్మికి రాసిన లేఖలో.. ఎండాడలో సర్వే నెంబర్లు 15/1–15/5, 16/4, 17/29, 17/30, 18/2, 20/5, 19/1, 19/2, 19/9, రుషికొండలో 37/2, 55/5 సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలిపారు. ఎండాడలో సర్వే నెంబర్ 17లో ఉన్న 67.37 ఎకరాల అదనపు ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాలో ఉన్నా 2025 జనవరి 30న గుట్టుచప్పుడు కాకుండా గీతంకు బదలాయించినట్లు శర్మ పేర్కొన్నారు. ఆ భూముల మార్కెట్ ధర రూ.1,500 కోట్లకు పైనే ఉందని, ఈ బదలాయింపు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని లేఖలో స్పష్టంచేశారు. ఎండాడ, రుషికొండ అడంగల్ రికార్డులను బట్టి ఈ సర్వే నెంబర్లే కాకుండా ఇతర సర్వే నెంబర్లలోని భూములను కూడా గీతం వర్సిటీ ఆక్రమించిందన్నారు. టూరిజం శాఖకు కేటాయించిన భూములు, అసైన్డ్ భూములు కూడా గీతం ఆక్రమణలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలను పరిశీలించకుండా వాటిని గీతంకు క్రమబద్ధీకరించేందుకు అనుమతించడం చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు. సాయిప్రసాద్కు రాసిన లేఖలోని అంశాలు.. జీవీఎంసీ సమావేశంలో గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూములు బదలాయించడానికి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించడం బాధాకరం. జీవీఎంసీ ఆమోదించిన భూముల్లో 22ఏ జాబితాలో ఉన్న భూములు కూడా ఉన్నాయి. జిల్లా రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ క్షుణ్ణంగా పరిశీలించకుండా ఈ ప్రతిపాదనను ఆమోదించడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే. 2025 జులై 16న కె. సుందరరామరాజు వర్సెస్ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన కేసులో (రిట్ పిటిషన్ నెం:8940/2017) హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ భూముల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే.. » కోర్టు తీర్పు ప్రకారం ఎండాడలో సర్వే నెంబర్ 19లోని 85 ఎకరాలు కొండ పోరంబోకు భూమిగా తేలింది. అలాంటి భూమిలో నిర్మాణాలను జీవీఎంసీ తన మాస్టర్ ప్లాన్లో నిషేధించింది. ఈ నేపథ్యంలో గీతంకు ఆ భూమిని ఇవ్వడానికి ఎలా అనుమతించారు? » ఇక ఆ సర్వే నెంబరులోని 2.5 ఎకరాల విషయంలో 2025 జులై 16న హైకోర్టు ఇచి్చన తీర్పు విషయాన్ని జీవీఎంసీకి పంపిన లేఖలో తహశీల్దార్ ఎందుకు ప్రస్తావించలేదు? » నేను గతంలో రాసిన లేఖల్లో గీతం ఆక్రమించిన భూముల్లో డీపట్టా భూములు కూడా ఉండవచ్చని.. అలాంటి భూములను ఆక్రమించడం నిషేధించారని.. దానిపైనా దర్యాప్తు చేయాలని కోరాను. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను పెద్దలకు ఎలా క్రమబద్దీకరిస్తారు? -
బాబు, పవన్, లోకేశ్కు మంచి బుద్ధి ఇవ్వాలి
సాక్షి నెట్వర్క్: తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, లోకేశ్కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు నిర్వహించి ఆలయాల్లో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల కల్తీ ఆరోపణలపై ప్రాయశి్చత్త పూజలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి నియోజకవర్గాల ఇన్చార్జిలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు పూజల్లో పాల్గొన్నారు. లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని, కల్తీ జరగలేదని సిట్ దర్యాప్తులో స్పష్టంగా తేలినా టీడీపీ కూటమి నేతలు బాధ్యతారహిత్యమైన ప్రకటనలు, వదంతులు వ్యాప్తి చేస్తుండడాన్ని నిరసిస్తూ అభిషేకాలు, పాప ప్రక్షాళన పూజలు చేశారు. తెనాలిలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతి ఇచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ 101 టెంకాయలు కొట్టారు. శ్రీవారి భక్తుల మనోభావాలను రక్షించాలని కోరుతూ అద్దంకిలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ (అనంతబాబు) శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మెట్లను కడిగి పూజలు చేశారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విశాఖ పశ్చిమంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుడిలో మెట్లు కడిగారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ఆలయాలను నాయకులు శుద్ధిచేశారు. కొన్నిచోట్ల కొబ్బరికాయలు కొట్టారు. -
ఈసారైనా కరుణించేనా..?
2024 – 25 కేంద్ర బడ్జెట్లో అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల అప్పు తప్ప రాష్ట్రానికి ఒనగూరిందేమీ లేదు. నిర్మలమ్మ వరాలన్నీ బీహార్కు ఇచ్చేస్తే సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు మౌనం వహించారు. కీలకమైన కేకే రైల్వే లైన్ లేకుండానే విశాఖ జోన్ ఏర్పాటు చేసేస్తున్నా నోరు మెదపలేకపోతున్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులూ మౌనం వహిస్తున్నారు. కీలకమైన కేకే లైన్తో కూడిన జోన్ ఏర్పాటుకు కేంద్రాన్ని డిమాండ్ చేయలేకపోతున్నారు. వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నేటికీ కేంద్ర పెద్దల నుంచి స్పష్టత సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. తరచూ ఢిల్లీ వెళ్తున్నా కేసుల ఎత్తివేతపైనే శ్రద్ధ పెడుతున్నారు తప్పా రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వైపు ఏపీ ప్రజానీకం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొండిచేయి చూపిన నిర్మలమ్మ... ఈ సారైనా రాష్ట్ర అవసరాలు తీర్చేందుకు అవసరమైన నిధులు కేటాయించి, కొత్త వరాలేమైనా ఇస్తారేమోనని ఉత్కంఠతో ఉన్నారు. తన వల్లే కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని గొప్పలు చెప్పుకునే సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులు కాపాడడంలో, నిధులు సాధించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. గతేడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగింది. అమరావతి కోసం అప్పు తప్ప సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు ఏమీ సాధించలేకపోయారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు నిత్యం ఢిల్లీ వచ్చి వెళ్తున్నా ఏపీకి ఒరిగింది శూన్యం. ఇప్పటి వరకు ప్రత్యేక విమానాల్లో 27 సార్లు ఢిల్లీకి వచ్చి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అయినా నిధులు సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ తన అనుకూల ఎల్లో మీడియాను పిలిపించుకోవడం... తనకు తోచింది చెప్పి డప్పు కొట్టించుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయింది. రాష్ట్రానికి అది వచ్చేస్తోంది... ఇది వచ్చేస్తోంది అంటూ బాబు లీకులివ్వడం... వాటిని పట్టుకుని ఎల్లో మీడియా డప్పు కొట్టడం... ఇంతకు మించి రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనాలేం లేవని మేధావులు, విద్యావంతులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. -
రెడ్బుక్ రాక్షసం.. జంగిల్ రాజ్ బీభత్సం
సాక్షి, అమరావతి: చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తాము చేసిన దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు ముఠా అసహనంతో రగిలిపోతోంది. దాంతో తిరుమల పవిత్రతను దెబ్బ తీసేందుకు తాము పన్నిన పన్నాగం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు బరి తెగించారు. అదే ముసుగులో తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలకు తెగబడటంతోపాటు.. వారిపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధించేందుకు కుతంత్రం పన్నారు. ఈ పచ్చ మూకల దారుణ బీభత్స కాండను పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చోద్యం చూస్తోంది. వరుస దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలతో రాష్ట్రంలో చంద్రబాబు ముఠా రావణకాష్టం రగిలిస్తోంది. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కళంకం తీసుకువచ్చేందుకు చంద్రబాబు చేసిన దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టింది. తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు ఇచి్చన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో స్పష్టం కావడంతో శ్రీవారి భక్తులు ఊరట చెందారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు రాజకీయ కుట్ర కోసం ఇంతగా దిగజారడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఆ అంశంపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు టీడీపీ కూటమి అత్యవసరంగా మరో కుతంత్రానికి తెరతీసింది. లడ్డూ ప్రసాదంపై టీడీపీ దుష్ప్రచారంతో లడ్డూ ప్రసాదానికి కలిగిన కళంకానికి పరిహారంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాయశి్చత్త పూజలు, యజ్ఞాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే అదనుగా డైవర్షన్ రాజకీయాల కోసం చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుతంత్రం పన్నింది. ప్రాయశ్చిత్త దీక్షలు, పూజలను అడ్డుకోవడం పేరుతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు తెగబడాలని తమ పార్టీ కార్యకర్తలు, గూండాలను రంగంలోకి దించింది. కర్రలు, రాడ్లు, రాళ్లు, ఇతర మారణాయుధాలు పట్టుకుని మరీ కనిపించిన వారిపై విచక్షణా రహితంగా దాడులతో విరుచుకు పడాలని ఆదేశించింది. పోలీసు యంత్రాంగం ఉదాసీనంగా ఉండి పరోక్షంగా సహకరిస్తారని.. టీడీపీ గూండాలు ఎవరూ వెనక్కు తగ్గవద్దని స్పష్టం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు స్వయంగా అధికార పార్టీనే పన్నాగం పన్నడం విభ్రాంతి కలిగిస్తోంది. తద్వారా లడ్డూ ప్రసాదంపై తాము చేసిన దుష్ప్రచారం నుంచి ప్రజల దృష్టిని శాంతిభద్రతల సమస్యపైకి మళ్లించాలన్నది టీడీపీ లక్ష్యం. అదే అవకాశంగా చేసుకుని తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ కీలక నేతలపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడాలన్నది లోగుట్టు. అనంతరం వారిపైనే అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయాలన్నది పన్నాగం. వెరసి తిరుమలపై చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు మరచిపోయేట్టు చేయడమే టీడీపీ కుట్ర అంతిమ లక్ష్యం. పక్కా పన్నాగంతోనే అంబటిపై హత్యాయత్నం ప్రభుత్వ ముఖ్యనేత ఆదేశాలతో టీడీపీ గూండాలు బరితెగించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పక్కా పన్నాగంతో హత్యాయత్నానికి తెగబడ్డారు. లడ్డూ ప్రసాదానికి చంద్రబాబు కలిగించిన కళంకానికి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆయన గుంటూరులోని గోరంట్లకు శనివారం ఉదయం బయలుదేరారు. అప్పటికే కర్రలు, రాడ్లు, రాళ్లు పట్టుకుని మాటువేసిన టీడీపీ గూండాలు అంబటి రాంబాబు వాహనంపై ఒక్కసారిగా ముప్పేట దాడి చేశారు. ఆయన వాహనంపైకి రాళ్లు విసిరి బీభత్సం సృష్టించారు. వాహనాన్ని కదలనివ్వకుండా అడ్డుకుని ఆయన్ని కిందకు దించి హత్య చేయాలన్నది వారి లక్ష్యం. ఆయన వాహనంపైకి టీడీపీ గూండాలు దండెత్తినా సరే పోలీసులు వారిని వారించేందుకు యత్నించనే లేదు. ఆ హత్యాయత్నం నుంచి అంబటి రాంబాబు అతి కష్టం మీద తప్పించుకుని బయటపడ్డారు. కానీ టీడీపీ గూండాలు మాత్రం శాంతించ లేదు.గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే టీడీపీ రౌడీలు అంబటి రాంబాబు నివాసంపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. విచక్షణారహితంగా రాళ్లు విసిరారు. ఆయన నివాసంలోకి చొరబడి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేసి భయోత్పాతం సృష్టించారు. ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఇంట్లో వారిపై దాడికి పాల్పడ్డారు. రాత్రికి ఆయన కారుకు, కార్యాలయానికి నిప్పు పెట్టారు.బాధితుడైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు టీడీపీ గూండాల దాడిలో బాధితుడైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు నమోదు చేసి పోలీసులు తమ ప్రభు భక్తిని చాటుకున్నారు. తనపై హత్యాయత్నానికి పాల్పడుతున్న వారిని వారించేందుకు అంబటి రాంబాబు యత్నించారు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్న వారితో ఆయన వాగ్వాదానికి దిగారు. ఆ వాగ్వాదాన్ని వక్రీకరిస్తూ టీడీపీ కార్యకర్తలు ఆయనపైనే ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆ వెంటనే నకిరేకల్ పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు గుంటూరులోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. ఆయనపై వేర్వేరు పోలీసు స్టేషన్లలో అక్రమ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. అంటే ఆయనపై అక్రమ కేసు ఒక్క నకిరేకల్ పోలీసు స్టేషన్కే పరిమితం కాదని స్పష్టమవుతోంది. తద్వారా ఆయన్ను వేధించాలన్నదే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. కాగా, తమకు భద్రత కల్పించాలని అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి రాష్ట్ర హైకోర్టులో శనివారం రాత్రి అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దాడులు, దౌర్జన్యాలతో భయోత్పాతం లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్రకు ప్రాయశ్చిత్త పూజలు చేసే వైఎస్సార్సీపీ నేతలపై దాడులతో విరుచుకుపడాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది. ఈ క్రమంలో తిరుపతిలో పరిహార హోమం నిర్వహిస్తున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై దాడికి యత్నించారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగి వస్తున్న మాజీ మంత్రి విడుదల రజినీపై టీడీపీ రౌడీ మూకలు దూషిస్తూ దాడికి యత్నించారు. వినుకొండలో పరిహార పూజలు నిర్వహించి ర్యాలీగా వస్తున్న మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడును అడ్డుకున్నారు. ఆయుధాలు పట్టుకుని రోడ్లపై తిరుగుతున్న టీడీపీ గూండాలను విడిచిపెట్టి, తమను అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో లాఠీలతో పోలీసులు విరుచకుపడ్డారు. ఈ ఘటనలో బ్రహ్మనాయుడు గాయపడ్డారు. కానీ లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ టీడీపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఇదే రీతిలో టీడీపీ దాడులు, దౌర్జన్యాలకు కొమ్ము కాస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కుట్ర, పోలీసుల అండతో టీడీపీ రౌడీ మూకలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలతో అరాచకానికి తెగబడుతున్నాయి. పోలీసు విధులేంటి? వారు చేసిందేంటి? అంబటి లక్ష్యంగా టీడీపీ గూండాల దాడి.. టీడీపీ గూండాగిరికి ప్రభుత్వ యంత్రాంగం దాసోహంరాష్ట్రంలో చంద్రబాబు రౌడీ మూకలు సృష్టిస్తున్న జంగిల్ రాజ్ అరాచకానికి పోలీసు యంత్రాంగం కొమ్ము కాస్తోంది. అంబటి రాంబాబును అంతం చేయడమే లక్ష్యంగా టీడీపీ గూండాలు శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆయన వాహనం, పార్టీ కార్యాలయం, నివాసాలపై వరుస దాడులకు తెగబడ్డారు. అయినా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విస్మయ పరిచింది. అంబటి ప్రాణాలకు ముప్పు ఉందని గుర్తించిన వైఎస్సార్సీపీ అధిష్టానం.. ముఖ్య నేతలు ఆయనకు తక్షణం భద్రత కల్పించాలని కోరేందుకు చేసిన ప్రయత్నాలను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. శాసన మండలిలో వైఎస్సార్సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రతినిధులు ఈ అంశంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడేందుకు యత్నించినా ఆయన స్పందించలేదు. ఓ మాజీ మంత్రి ప్రాణాలకు ముప్పు ఉందనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ఐదారు గంటలపాటు ప్రయత్నించినా కనీసం అందుబాటులోకి రాలేదు. శాంతి భద్రతల అదనపు డీజీ మధుసూదన్రెడ్డిని సంప్రదించేందుకు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. ఆయన కూడా వారికి అందుబాటులోకి రాలేదు. దాంతో అంబటి రాంబాబుకు భద్రత కల్పించే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ దృష్టికి తీసుకువెళ్లేందుకు బొత్స సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కనీసం గుంటూరు జిల్లా ఎస్పీతో మాట్లాడి అంబటికి పటిష్ట భద్రత కల్పించాలని కోరాలని బొత్స, వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. వారిద్దరి ఫోన్ కాల్స్కు గుంటూరు ఎస్పీ స్పందించ లేదు. ఉద్దేశపూర్వకంగా పోలీసు పెద్దల ప్రేక్షక పాత్ర వందలాది మంది టీడీపీ గూండాలు దాడితో అంబటి రాంబాబు దంపతులు ఓ గదిలో తలుపు వేసుకుని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచి్చంది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితతోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతల బృందం గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ను కలిసేందుకు శనివారం రాత్రి ఆయన కార్యాలయానికి వెళ్లింది. దాదాపు గంటపాటు ఎస్పీ కార్యాలయంలో వేచి ఉన్నా ఎస్పీ వకుల్ జిందాల్ వారిని కలవనేలేదు. గంట తర్వాత అదనపు ఎస్పీ రమణమూర్తిని కలవమని సమాచారం ఇచ్చారు. దాంతో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం అదనపు ఎస్పీ రమణమూర్తిని కలిసి పరిస్థితిని వివరించారు. రాత్రి 10.30 గంటల సమయంలో అంబటి రాంబాబును పోలీసులు ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. మరోవైపు టీడీపీ గూండాలు శనివారం అర్థరాత్రి దాటినా అంబటి రాంబాబు కార్యాలయం, నివాసాలపై దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఆయ ఇంటి ముందున్న కారుకు నిప్పంటించారు. తెల్లవారేసరికి ఆయన నివాసాన్ని నేలమట్టం చేస్తామని టీడీపీ గూండాలు బహిరంగంగా ప్రకటిస్తున్నా పోలీసులు మాత్రం వారిని అడ్డుకునేందుకు కనీసం ప్రయత్నించక పోవడం విస్మయ పరుస్తోంది. ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతోనే పోలీసు పెద్దలు ఉద్దేశ పూర్వకంగా ప్రేక్షక పాత్ర పోషించినట్లు స్పష్టమవుతోంది. కాగా, ఇటీవల వైఎస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ రౌడీ మూకలు ఇదే తీరులో విధ్వంసం సృష్టించినా పోలీసులు స్పందించలేదు. పైగా ఆయనపైనే కేసు పెట్టారు. -
మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు చేస్తారా?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వారిపై దాడులు చేస్తారా? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? అంటూ మండిపడ్డారు. మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ‘‘జంగిల్ రాజ్’’గా మారిపోయిందంటూ సీఎం చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులపై వరుసగా జరుగుతున్న దాడులు రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తున్నాయని, గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు, రాష్ట్ర గవర్నర్, కేంద్ర హోం శాఖను ట్యాగ్ చేస్తూ శనివారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో ఇంకా ఏమన్నారంటే..ఆటవిక రాజ్యాన్ని సృష్టించారు‘‘చంద్రబాబు గారూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు, ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ‘‘జంగిల్రాజ్’’గా మారిపోయింది కదా.. చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు. పోలీసులు దాడులకు కాపలా కాశారుమా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ రోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు గారూ.. మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు ఆయన ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం.తప్పులు కప్పిపుచ్చుకునేందుకే మళ్లీ కొత్త కుట్రలుతిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్లు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయ పరచినందుకు దేశ వ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా, మీ తప్పులను దాచి పెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులు. ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా, మా పార్టీ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా, మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని ఏకంగా హత్యాయత్నం చేయించడమే మీ నియంత స్వభావానికి, దుర్మార్గానికి నిదర్శనం. మీ వైఖరి అత్యంత ప్రమాదకరంచంద్రబాబు గారూ.. మీరు ఒక కరుడుగట్టిన గూండాగా, ఓ నియంతగా తయారయ్యారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మీ వైఖరి అత్యంత ప్రమాదకరం. వరుసగా మా పార్టీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని నేను కోరుతున్నాను. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. వైఎస్సార్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారు’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అంబటికి వైఎస్ జగన్ పరామర్శధైర్యంగా ఉండాలని.. పార్టీ మొత్తం అండగా ఉంటుందంటూ భరోసావైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఆయనను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఫోన్లో పరామర్శించారు. పార్టీ మొత్తం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని ఆయనకు భరోసా ఇచ్చారు. రాష్ట్రం జంగిల్రాజ్గా మారిపోయిందని, చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారంటూ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకీ పెరిగిపోయాయని అన్నారు. టీడీపీ మూకలు ఉద్దేశపూర్వకంగానే హత్యాయత్నం, దాడులకు తెగబడ్డాయని, కూటమి అరాచక పాలనను ప్రజలు సహించబోరన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జంగిల్ రాజ్.. పరాకాష్టకు చేరిన చంద్రబాబు దుర్మార్గ పాలన
సాక్షి, టాస్క్ఫోర్స్: చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో జంగిల్ రాజ్ సృష్టిస్తోంది. టీడీపీ గూండాలు బహిరంగంగా ఆయుధాలు చేతబట్టి వైఎస్సార్సీపీ నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై శనివారం హత్యాయత్నం చేయడం కలకలం రేపింది. కర్రలు, రాడ్లు, కోడిగుడ్లతో దాడి చేస్తూ అంబటి ఇంటి వద్ద టీడీపీ రౌడీలు రెచ్చిపోయారు. కార్యాలయంలోనూ విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. తుదకు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కుట్ర బెడిసి కొట్టడంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు పాలకులు బరి తెగించారు. ఈ క్రమంలో వందలాది మంది పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి ఇంటిపై దాడికి దిగినా వారు చోద్యం చూస్తూ మిన్నకుండి పోవడం విస్తుగొలుపుతోంది. వందల మంది రౌడీలు ఒకేసారి అంబటి రాంబాబు ఇంటిపైకి దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయనపైనా దాడి చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి దాటినా విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఒక పథకం ప్రకారం అంబటి రాంబాబును భౌతికంగా నిర్మూలించాలన్న తెలుగుదేశం పార్టీ కుట్రలో భాగంగా గూండాలను పంపించి ఆయనపై ఉదయం నుంచి దాడి చేయడానికి టీడీపీ ప్రయత్నాలు చేసింది. పక్కా స్కెచ్తో దాడులుశనివారం ఉదయం గుంటూరు రూరల్ మండలం గోరంట్లలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసేందుకు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నగరాల మీదుగా కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు కారును అడ్డగించి దాడికి ప్రయత్నం చేశారు. దారి పొడవునా కర్రలు పట్టుకొని కేకలు వేస్తూ రెచ్చగొట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ వందన.. అంబటి రాంబాబును ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి సిద్ధార్థనగర్లోని తన కార్యాలయానికి అంబటి చేరుకున్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఉద్దేశించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యిపై గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని చెప్పినందుకే తనపై దాడికి తెగబడ్డారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు తిట్టాలనే ఉద్దేశం లేనేలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తి లేదని, తన ఇంట్లోని కుక్కలు కూడా భయపడవని చెప్పారు. ఒకవేళ అరెస్ట్ చేసినా, జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈలోగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు అంబటి రాంబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు నల్లపాడు సీఐ వంశీధర్ అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి నోటీసు ఇవ్వడానికి వచ్చానని చెప్పి కొద్దిసేపు అక్కడి పరిస్థితులు గమనించి వెళ్లిపోయారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు లంక మాధవి అంబటి ఇంటి ముందుకు వచ్చి చెప్పు చూపించి దుర్భాషలాడారు. రండి తేల్చుకుందాం అంటూ బూతులు తిడుతూ రెచ్చగొట్టారు. కర్రలు, రాడ్లతో దాడి చేస్తూ బీభత్సంఅప్పటికే పథకం ప్రకారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, అమె భర్త గల్లా రామచంద్రరావు నేతృత్వంలో వందలాది మంది కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకుని అంబటి రాంబాబు ఇంటి చుట్టూ చేరుకున్నారు. అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో మోహరించినా, టీడీపీ గూండాలు నేరుగా అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. కార్యాలయంలో ఉన్న అంబటి రాంబాబుపై తెలుగుదేశం నేతలు అబ్బూరి మల్లి, కనపర్తి శ్రీనివాసరావు, రాయపాటి అమృతరావు, నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు, మహిళా నాయకులు దాడికి దిగారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఫర్నీచర్ పగలగొట్టారు. ఇంటిపై దాడి చేసి తలుపులు, కిటికీలు పగులగొట్టారు. అంబటి రాంబాబు భార్య, కూతురు ప్రాణభయంతో ఇంట్లోని ఓ గదిలో దాక్కున్నారు. టీడీపీ గూండాలు ఇంటి ఆవరణ, పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను రాళ్లు, కర్రలతో ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరారు. ఈ విధ్వంసకాండ అంతా పూర్తవుతుండగా అప్పుడు పోలీసులు టీడీపీ గూండాలను బతిమాలి బయటకు పంపారు. అప్పటి వరకూ అక్కడే ఉండి ఎవరిని అడ్డుకోకుండా చోద్యం చూశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. అంబటి రాంబాబు బయటకు రావాలని సవాలు విసిరారు. మీ ఇంటి కుక్క భయపడదేమో, మీరు భయపడేలా చేస్తామంటూ దాడులను ప్రోత్సహించారు. అంబటి దిష్టి బొమ్మను దహనం చేశారు. బూతులు తిడుతూ.. రెచ్చగొడుతూటీడీపీ నాయకుడు, రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు కొంత మంది వికలాంగులను సైతం తీసుకొచ్చి మైక్లో బూతులు తిట్టారు. ‘నా కొడకా.. అంబటీ బయటికి రారా..’ అంటూ రెచ్చిపోయారు. మాజీ మంత్రి అని కూడా చూడకుండా, వయసుకు గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లు బూతు పురాణం లంకించుకున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ బీభత్సం రాత్రి 10 గంటలు అయినప్పటికీ కొనసాగింది. ఫోన్లు చేసి గుంపులు గుంపులుగా తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను అక్కడికి రప్పించారు. హిజ్రాలను, దివ్యాంగులను కూడా తీసుకువచ్చి గొడవ చేయించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కూడా జనాన్ని అక్కడికి తరలించారు. అంబటి రాంబాబు కార్యాలయంలో అప్పటికే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఆళ్ల కిరణ్, పార్టీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సైదా ఖాన్ తదితరులు అంబటి కార్యాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. గొడవ విషయం తెలియగానే పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంబటి రాంబాబుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.పోలీసులే దగ్గరుండి దాడి చేయించారని సర్వత్రా చర్చఅంబటి రాంబాబు ఇంటిపై దాడి చేస్తున్న గూండాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, వచ్చిన వారికి బందోబస్తు కల్పించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇద్దరు డీఎస్పీలు, నగరంలో ఉన్న సీఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఒక్కరు కూడా దాడులకు దిగుతున్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయలేదు. ఈ దాడిని పోలీసులే దగ్గరుండి చేయిస్తున్నట్లుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కళ్లెదుటే ఫర్నీచర్ను ధ్వంసం చేస్తుంటే.. కార్లపై దాడులు చేస్తుంటే చోద్యం చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ మాత్రం దానికి అక్కడికి పోలీసులు ఎందుకొచ్చారని నిలదీస్తున్నారు. పోలీసు వ్యవస్థ పని తీరు చాలా అవమానకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు మాజీ హోం మంత్రి సుచరిత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పార్టీ సమన్వయకర్తలు బలసాని కిరణ్కుమార్, వనమా బాలవజ్రకుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఎస్పీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన అందుబాటులోకి రాలేదు. గంటకు పైగా నాయకులు ఎస్పీ ఇంటి ముందు నిలబడే ఉన్నారు. చివరికి ఎస్పీ లైన్లోకి వచ్చి తాను గుంటూరులో లేనని, అడిషనల్ ఎస్పీని కలవాలని చెప్పారు. ఐజీ కూడా ఫోన్కు అందుబాటులోకి రాలేదు. అంబటి రాంబాబు కార్యాలయానికి నిప్పు పెట్టిన తెలుగుదేశం పార్టీ గూండాలు వైఎస్సార్సీపీ బీసీ విభాగం నేతపై టీడీపీ గూండాల దాడిఅంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి తెగబడుతుండగా ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు దారం అశోక్యాదవ్పై విరుచుకు పడ్డారు. కర్రలు, రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని కారును సైతం ధ్వంసం చేశారు. తీవ్రగాయాలతో స్పృహ కోల్పోయిన అశోక్ను వైఎస్సార్సీపీ కార్యకర్తలు, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తమకు అడ్డువచ్చిన ఎవరినైనా చంపేస్తాం రండిరా అంటూ టీడీపీ గూండాలు తనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారని అశోక్ వాపోయాడు.అర్ధరాత్రి దాటినా..టీడీపీ కార్యకర్తల దిగ్బంధనంలో ఉన్న అంబటి రాంబాబు కార్యాలయంపై శనివారం రాత్రి 10 గంటల తర్వాత రెండోసారి దాడికి తెగబడ్డారు. సుత్తులతో గోడలు బద్ధలు కొట్టే ప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద దుంగలను తీసుకు వచ్చి కిటికీలను పగులగొట్టారు. నాపరాయి ముక్కలతోపాటు, పెద్ద పెద్ద రాళ్లను అంబటి రాంబాబు ఉన్న పార్టీ కార్యాలయంపై విసురుతున్నారు. కవరేజ్ చేస్తున్న మీడియాపై కూడా దాడులకు తెగబడ్డారు. ఆర్ టీవీ కెమెరామెన్తో పాటు పలువురు విలేకరులపై దాడికి ప్రయత్నించారు. కాగా, అంబటి రాంబాబుపై టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు ఒక కేసు.. సుమోటోగా మరో కేసు నమోదు చేసి, రాత్రి 10.35 గంటలకు అరెస్టు చేశారు. ఆయనపై 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయన్ను పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లిన తర్వాత తెలుగుదేశం గూండాలు పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకున్నారు. కార్యాలయానికి నిప్పు పెట్టారు. పార్టీ కార్యాలయంలో చిక్కుకుపోయిన ఇతర నేతలు, మీడియా ప్రతినిధులు అతి కష్టంగా బయటకు వచ్చారు. అంబటి ఇంటి వద్ద సాగిన దారుణకాండ యావత్తు ప్రతి నిమిషాన్ని మంత్రి లోకేశ్ పర్యవేక్షించారని టీడీపీ శ్రేణులు బహిరంగంగా చెప్పుకోవడం గమనార్హం. చంద్రబాబును ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేయలేదునగరంపాలెం (గుంటూరు వెస్ట్): సీఎం చంద్రబాబును ఉద్దేశించి తాను ఏ వ్యాఖ్యలు చేయలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. గుంటూరు సిద్ధార్థనగర్లోని ఆయన నివాసం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ శ్రేణులు వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని, అక్కడికి వెళ్లి ఇటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరైన పద్ధతి కాదని, 24 గంటల్లో ఆ ఫ్లెక్సీని తొలగించాలని చెప్పి తాను వచ్చేశానని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లింది ఫ్లెక్సీలు చించేందుకు కాదని, వాటిని తొలగించాలని చెప్పేందుకు మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు. అక్కడి నుంచి కారులో వెళుతుండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇనుపరాడ్లు, కర్రలు, రాళ్లు చేతపట్టుకుని ఒక్కసారిగా తన కారుపైకి తెగబడ్డారని చెప్పారు. టీడీపీకి చెందిన ఓ మహిళ అసభ్యకరంగా మాట్లాడటంతో తాను ప్రతిస్పందనగా వ్యాఖ్యలు చేశానని చెప్పారు. ఈలోగా చంద్రబాబూ దమ్ముంటే రావాలని అన్నానని, చంద్రబాబుని బూతులు తిట్టాలనే ఉద్దేశం తనకు లేనేలేదని స్పష్టం చేశారు. తనపై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడానికి టీడీపీ గూండాలు కారు డోరు తీశారని, తాను ప్రాణ రక్షణ నిమిత్తం అక్కడున్న వారిపై మాట్లాడానని చెప్పారు. తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం వేళ టీడీపీ నాయకురాలు (లంకా మాధవి) సిద్ధార్థనగర్లోని తన ఇంటి వద్దకు వచ్చి చెప్పు పట్టుకుని నానాయాగీ చేసినా పోలీసులు ఆమెను ఆపలేదని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ల రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడే ప్రసక్తేలేదని, తన ఇంట్లోని కుక్కలు కూడా భయపడవని చెప్పారు. తాను అరెస్ట్కు భయపడేదే లేదని, ఒకవేళ అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, బెయిల్కు కూడా దరఖాస్తు చేయనని స్పష్టం చేశారు. తన ఇంటి వద్దకు పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్పై, తనపై అభిమానంతో వచ్చారని.. అంతేతప్ప తన అరెస్ట్ను అడ్డుకునేందుకు కాదని స్పష్టం చేశారు.రారా చూసుకుందాం.. ఇక్కడే పాతేస్తాంగోరంట్లలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ‘రారా చూసుకుందాం.. నిన్ను ఇక్కడే పాతేస్తాం’ అంటూ రాయలేని పదాలతో టీడీపీ గూండాలు బూతు పురాణంతో విరుచుకుపడటంతో భక్తులు హడలిపోయారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలియుగదైవం వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలు అసత్యమని సీబీఐ సిట్ నివేదికలో వెల్లడి కావడంతో శనివారం అంబటి రాంబాబు గోరంట్లలోని శ్రీవేంకటేశ్వరాలయంలో పాపపరిహార పూజల్లో పాల్గొన్నారు. ఇది తెలిసిన టీడీపీ గూండాలు కర్రలు, ఇనుపరాడ్లు తీసుకుని అంబటిపైకి దూసుకొచ్చారు. వేలాది మంది భక్తులు చూస్తుండగా.. పోలీసుల సమక్షంలో అంబటిపై హత్యాయత్నానికి తెగబడ్డారు. టీడీపీ మహిళా గూండాలు సైతం అసభ్య పదజాలంతో రోడ్లపై కర్రలు, రాడ్లతో హల్చల్ చేశారు. టీడీపీ గూండాలను అడ్డుకోవాల్సిన పోలీసులు.. అక్కడ నుంచి వెళ్లాలని అంబటి పట్ల దురుసుగా ప్రవర్తించారు. అక్కడి నుంచి ముందుకు కదులుతున్న అంబటి కారుపై టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలతో దాడికి దిగి కారు అద్దాలను పగలగొట్టి హత్య చేయడానికి యత్నించారు. టీడీపీ గూండాల హడావుడికి అమరావతి రోడ్డులో ప్రయాణికులు సైతం భయాందోళనకు గురయ్యారు. -
మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు చేస్తారా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా?’’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు.. ఇప్పుడు ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని చూస్తారా? నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా? మీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “జంగిల్రాజ్’’గా మారిపోయింది కదా. చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా, ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు.’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపై మీ గూండాలు హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ, ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబూ.. మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు, దాడులకు కాపలా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం, అత్యంత భయంకరం...తిరుమల లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర, దేశంలోని ప్రతిష్ఠాత్మక NDDB, NDRI ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమైంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను గాయపరచినందుకు దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా, మీ తప్పులను దాచిపెట్టేందుకు మళ్లీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. దాంట్లో భాగమే ఈ హేయమైన దాడులు.ప్రతిష్ఠాత్మక ల్యాబుల నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా, మా పార్టీ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడులపై దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా, మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని ఏకంగా హత్యాయత్నం చేయించడమే మీ నియంత స్వభావానికి, దుర్మార్గానికి నిదర్శనం. ఒక కరుడుగట్టిన గూండాగా, ఓ నియంతగా మీరు తయారయ్యారు చంద్రబాబుగారూ. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు మీ వైఖరి అత్యంత ప్రమాదకరం.వరుసగా మా పార్టీ సీనియర్ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయి. రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దాడులను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే వైఎస్సార్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అంశంపై మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు..@ncbn గారూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మావారిపై దాడులు చేస్తారా? ఇన్నాళ్లుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నవారిని మీ గూండాలతో చంపాలని… pic.twitter.com/ZfmwOvD3GX— YS Jagan Mohan Reddy (@ysjagan) January 31, 2026 -
అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ ఫోన్
సాక్షి, గుంటూరు: అంబటి రాంబాబుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ చేశారు. టీడీపీ గూండాల హత్యాయత్నానికి గురైన అంబటిని పరామర్శించి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. రాష్ట్రం జంగిల్రాజ్గా మారిపోయిందన్నారు. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోయాయన్న వైఎస్ జగన్.. ఉద్దేశపూక్వకంగానే హత్యాయత్నం, దాడులకు దిగారన్నారు. ప్రజలన్నీ చూస్తున్నారు. ఈ అరాచకపాలనను ప్రజలు సహించబోరు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారు. అంబటికి పార్టీ మొత్తం అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.అంబటిపై టీడీపీ గూండాల హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేసింది. లడ్డూ విషయంలో సిట్ ల్యాబ్ రిపోర్టుల ఫలితాలతో అడ్డంగా దొరికిపోవడంతో బాబు హింసను రాజేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపించింది. దాంట్లో భాగంగానే వరుస దాడులు జరుగుతున్నాయన్న వైఎస్సార్సీపీ.. పథకం ప్రకారమే అంబటిపై హత్యాయత్నం చేశారని పేర్కొంది. అంబటిపై హత్యాయత్నాన్ని కేంద్ర హొంశాఖ దృష్టికి వైఎస్సార్సీపీ తీసుకెళ్లనుంది. కేంద్ర హోంశాఖకు వైవీ సుబ్బారెడ్డి లేఖ రాయనున్నారు. -
అంబటి రాంబాబు భద్రతపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన
అమరావతి: మాజీ మంత్రి అంబటి రాంబాబు భద్రతపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేసిన నేపథ్యంలో డీజీపీకి లేఖ రాసింది వైఎస్సార్సీపీ. అంంబటి ప్రాణానికి ముప్పు ఉందంటూ వైఎస్సార్సీపీ ఆందోళన చెందుతోంది. దీనిలో భాగంగా చీఫ్ సెక్రటరీ, డీజీపీకి లేఖలు రాసింది. అయితే చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఫోన్లు ఎత్తలేదు. దాంతో అంబటికి కట్టుదిట్టమైన భద్రత ఇవ్వాలని డీజీపీకి లేఖ రాయడంతో పాటు మెయిల్ చేసింది వైఎస్సార్సీపీ . అంబటి ఇంటివద్ద పరిస్థితి చాలా దారుణంగా ఉందని, డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలని లేఖలో పేర్కొంది. అంబటి ప్రాణానికి ముప్పు ఉందని,, మూడు గంటలకుపైగా అక్కడే ఉండి టీడీపీ శ్రేణులు రెచ్చగొడుతున్నాయని లేఖ ద్వారా స్పష్టం చేసింది. ఇవీ చదవండి:మాజీ మంత్రి అంబటిపై హత్యాయత్నం‘ఏపీలో చట్టం లేదు.. రెడ్బుక్ పాలన నడుస్తోంది’ -
అంబటిపై హత్యాయత్నాన్ని ఖండించిన ముద్రగడ
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, పార్టీ అడ్వయిజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా ఖండించారు. టీడీపీ గూండాల దాడులు అత్యంత హేయనీయం అన్నారు. అధికారం ఉందని చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని.. రాష్ట్రం మీ ఎస్టేట్ కాదు.. ప్రజలు మీ బానిసలు కాదు.. ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి అంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గుండాలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అంబటి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారని.. రాష్ట్రంలో జంగిల్ రాజు ప్రభుత్వం నడుస్తోందంటూ మండిపడ్డారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నప్పుడల్లా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. 1000 మందికి పైగా వెళ్లి హత్య చేయాలని ప్లాన్ చేశారు.రోజులన్నీ ఒకేలా ఉండవు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుంది. వడ్డీతో సహా మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాము. కర్రలు రాడ్లు పట్టుకొని అంబటి రాంబాబును చంపాలని చూస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న రాంబాబుని చంపాలని చూశారు. కాపులను చంపడం తెలుగుదేశం పార్టీకి కొత్తమీ కాదు. గతంలో వంగవీటి రంగాను చంపించారు. నేడు అంబటి రాంబాబును చంపాలని చూస్తున్నారు. గతంలో ముద్రగడ పద్మనాభం ను చంపాలని చూశారు. మీ దాడులను చూస్తూ వైఎస్సార్సీపీ ఊరుకోదు’’ అని గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. -
స్కిల్ స్కామ్ కేసులో కీలక పరిణామం
విజయవాడ: విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు చంద్రబాబును వదలడం లేదు. చంద్రబాబు స్కిల్ కేసును క్లోజ్ చేసిన కొద్దిరోజుల్లోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పిఎంఎల్ఏ కోర్ట్ లో ప్రాసిక్యూషన్ ఫిర్యాదు నమోదు చేసింది ఈడీ. స్కిల్ స్కామ్లో పాత్రధారులైన డిజైన్ టెక్ పై ఫిర్యాదు నమోదు చేసింది. వికాశ్ కన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్తో పాటు పలువురిపై అభియోగాలు మోపింది. ఈ కేసులో భారీగా నిధులు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ముకుల్ చంద్ర అగర్వాల్,సురేష్ గోయల్ సహకారంతో దారిమళ్లించినట్టు పేర్కొన్న ఈడీ..స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ నిధులు మళ్లించినట్టు గుర్తించింది. 2023లోనే రూ. 31.20 కోట్లు ఆస్తులు కూడా అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా మరింత లోతుగా దర్యాప్తు చేసినట్టు వెల్లడించింది. అదనపు విచారణలో ఢిల్లీ, ముంబయి, పూణెలో ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. నిందితులకు చెందిన మరో రూ. 23.54 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. మొత్తం రెండు దఫాలుగా 54.74 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది. తాజా దర్యాప్తు అంశాలతో కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్ని విచారణకు స్వీకరించింది కోర్టు.‘ఏపీలో చట్టం లేదు.. రెడ్బుక్ పాలన నడుస్తోంది’ -
అంబటి ఆఫీసుకు టీడీపీ గుండాల నిప్పు
31-01-2026 11.12 PMఅంబటి రాంబాబు కారుకు కూడా నిప్పు పెట్టిన టీడీపీ గుండాలుఅంబటి రాంబాబు కారు దగ్దం11.04 PMఅంబటి ఆఫీసుకు కరెంట్ కట్ చేసిన టీడీపీ గుండాలు.10:56PMకొనసాగుతున్న టీడీపీ గుండాల అరాచకం అంబటి ఆఫీసుకు టీడీపీ గుండాల నిప్పు మాజీ మంత్రి అంబటి రాంబాబు వద్ద మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ గూండాలు మళ్లీ రెచ్చిపోయి అంబటి ఇంటి వద్ద దాడికి యత్నించారు. కర్రలతో దాడికి యత్నించారు టీడీపీ గూండాలు. అంబటి ఇంట్లో ఉండగానే రాళ్లు విసురుతూ కర్రలతో నానా హంగామా చేస్తున్నారు. కర్రలు, రాడ్లతో మళ్లీ దాడులకు పాల్పడుతున్నారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో దాడులకు పాల్పడుతున్నారు. అంబటి ఆఫీస్ కిటికీలను ధ్వంసం చేశాయి టీడీపీ మూకలు. సుత్తులతో గోడలు బద్దలు గొట్టేందుకు యత్నిస్తున్నారు.అంతకుముందు అంబటిపై హత్యాయత్నం జరిగింది. ఆయన్ని హత్య చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. ఇంటిపై కర్రలు, రాడ్లతో దాడులు చేశారు. ఇంట్లో ఫర్నీచర్, కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వరంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అంబటి ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ గూండాలు.. విధ్వంసం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు రౌడీయిజం ప్రదర్శించారు.టీడీపీ గూండాల దాడిని అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు. మైక్సెట్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పచ్చ గూండాలు అరాచకం సృష్టించారు. దాడులను అడ్డుకున్న పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంబటి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు. ఎందుకు ఇంట్లోకి వచ్చారంటూ పోలీసులను అంబటి ప్రశ్నించగా.. నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ తెలిపారు.ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండంటూ అంబటి రాంబాబు అన్నారు. దీంతో పోలీసులు మళ్లీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు. అంబటి నివాసానికి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. మరోవైపు, అంబటి ఇంటి వద్ద టీడీపీ మూకలు రెచ్చిపోయారు. బూతులు తిడుతూ టీడీపీ గూండాలు వీరంగం చేశారు. దాడి చేసేందుకు టీడీపీ గూండాలు యత్నించారు. టీడీపీ గూండాలను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరారు. అయితే.. గుంటూరు సెంటర్లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు. అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు. అయితే దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్ హల్చల్ చేసింది.మరోవైపు ప్లాన్ ప్రకారమే తనపై దాడికి యత్నించారన్న అంబటి రాంబాబు.. ఇటు పోలీసుల తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారు. కూటమి వేసిన ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాయడం చూస్తుంటే.. అసలు పోలీస్ వ్యవస్థ బతికే ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. -
అంబటి రాంబాబుపై దాడిని ఖండించిన వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: గుంటూరు శివారులోని గోరంట్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో జంగిల్రాజ్ కొనసాగుతోందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన చేస్తూ.. ఏమన్నారంటే..వైఎస్సార్సీపీ ప్రభుత్వంపైనా, నాటి సీఎం వైఎస్ జగన్పైనా అసత్య ఆరోపణలు చేస్తూ, చివరకు దేవదేవుడి ప్రసాదం పేరుతో అనైతిక రాజకీయం చేశారు. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ, చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేష్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ తేల్చి చెప్పాయి. దీంతో దిక్కు తోచని స్థితిలో, కనీసం పశ్చాతాపం కూడా ప్రకటించకుండా, మళ్లీ అవే అసత్యాలతో ఎదురుదాడి చేస్తున్నారు.ఇంకా మరింత దిగజారి రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్తో పాటు, టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి ఫోటోలతో, అవే పచ్చి అబద్ధాలతో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఫ్లెక్సీలు వేస్తున్నారు. వాటిని మా పార్టీ నాయకులు తొలగిస్తే.. ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కాకుండా, మా పార్టీ వారిపై పోలీసులు చర్య తీసుకోవడం అత్యంత హేయం.కాగా, గుంటూరు శివార్లలోని గోరంట్లలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పూజలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఆ తర్వాత పక్కనే ఉన్న వివాదాస్పద ఫ్లెక్సీ వద్దకు చేరుకోగా, అప్పటికే కర్రలు, రాడ్లతో సిద్ధంగా ఉన్న టీడీపీ గుండాలు ఆయనపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది.మా పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడి ఒక ఉన్మాద చర్యశాంతియుతంగా మా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే ఇంత బరి తెగించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఏనాడూ ఇంత దారుణమైన పాలన చూడలేదు. ఇది ప్రజాస్వామ్య పాలనా? లేక ఆటవిక రాజ్యమా? ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాం. -
చంద్రబాబు, పవన్ హిందూ ద్రోహులు: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకనే నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు. మంత్రి లోకేష్ 208-211 పేజీలు చదువుకుంటే విషయాలు తెలుస్తాయన్నారు.‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అల్లర్లు సృష్టిస్తోంది. బిహార్లో ఉన్న పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కూటమి నేతలకు నిద్రలో కూడా వైఎస్ జగనే గుర్తుకువస్తున్నారు. చంద్రబాబు పవన్, లోకేష్ను చూసి హిందువులు మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ కాలినడకన తిరుమలకు వెళ్లి గుండు కొట్టించుకోవాలి. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయ్యాక తిరుమలలో అరాచకాలు పెరిగాయి’’ అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘చంద్రబాబు, పవన్ హిందూ ద్రోహులు. వారికి దేవుడిపై భక్తి లేదు. వెంకటేశ్వరస్వామిపై కూటమి నేతలు అపచారాలు ఆపాలని వేడుకుంటున్నా. బీసీ మహిళ విడదల రజినిపై దాడి చేయడం దారుణం. టీడీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీలకు పోలీసులు బందోబస్తు ఏంటీ?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి’’ అని వెల్లంపల్లి దుయ్యబట్టారు. -
అప్పుల బాబు బరితెగింపు
సాక్షి, అమరావతి: అప్పుల బాబు బరితెగించేసి వర్సిటీల నిధులపై కన్నేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికినచోటల్లా రుణాలు తీసుకున్న చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి దివాళా అంచున నెలబెట్టేశారు. ఇరవై నెలల్లో రూ.3.11 లక్షల కోట్లు మేర అప్పులు చేసినా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు యూనివర్సిటీ నిధులపై కన్నేశారు. తొలివిడతలో ఉన్నత విద్యా మండలితోపాటు వర్సిటీల నిధులు సుమారు రూ.1200 కోట్లు లాక్కునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీటిని వర్సిటీల నుంచి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు బదిలీ చేయించి ఇష్టారీతిన ఖర్చు చేసుకునేందుకు స్కెచ్ వేశారు. డిపాజిట్లు దారి మళ్లించేందుకు కుట్ర దశాబ్దాలుగా విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులతో వర్సిటీలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి. ప్రభుత్వాల సాయం కోసం ఎదురు చూడకుండా ఆ నగదును జాతీయ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ల రూపంలో భద్రపరుచుకున్నాయి. ఇప్పుడు ఆ డిపాజిట్లనే బయటకు తీయించి దారి మళ్లించేందుకు చంద్రబాబు సర్కార్ ఒత్తిడి చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ వర్సిటీలకు నష్టమే జరుగుతోందని, ఈ సారి ఏకంగా ప్రభుత్వ వర్సిటీలను ఆర్థికంగా కుదేలు చేసి శాశ్వతంగా మూసేసే కుట్రకు పాల్పడుతున్నారని విద్యావేత్తలు మండిపడుతున్నారు. డిపాజిట్లను బయటకు తీసి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్లో జమ చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌఖిక ఆదేశాలతోనే వర్సిటీలపై ఒత్తిడి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్లోనూ నిబంధనలు తుంగలో తొక్కేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం వర్సిటీల నిధుల మళ్లింపు విషయంలోనూ అదే పంథా కొనసాగిస్తోంది. నిధుల బదిలీకి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎక్కడా దరఖాస్తు చేయకుండా మౌఖిక ఆదేశాలతోనే బెదిరిస్తూ పాశవికంగా వ్యవహరిస్తోంది. కొద్ది రోజులుగా ముఖ్యనేత కార్యాలయంలోని ఓ కీలక అధికారితోపాటు, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి ఓఎస్డీ కలిసి ఉన్నత విద్యా మండలి, వర్సిటీల వర్గాలకు పదేపదే ఫోన్లు చేసి అమానవీయ రీతిలో తిడుతూ ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చేసేది లేక కొన్ని వర్సిటీల్లో డిపాజిట్ల బదిలీ ప్రక్రియ ప్రారంభించేశారు.బాబు జమానాలో వర్సిటీలకు గడ్డుకాలమే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏనాడూ విద్యారంగాన్ని, వర్సిటీలను పట్టించుకోలేదు. అటువంటి బాబు ప్రస్తుతం కూటమిగా అధికారంలోకి వచ్చాక ఉన్నత విద్యా మండలి ఖజానాలోని రూ.10 కోట్లను వాడేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా చినబాబు లోకేశ్ ఆ్రస్టేలియా పర్యటన సందర్భంగా ఏకంగా రూ.3.60 కోట్లు ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డుకు మళ్లించేశారు. మరోవైపు శతాబ్ది ఉత్సవాలతో కళకళాడాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం సైతం కళావిహీనంగా మారిపోయింది. వర్సిటీ కనీసం ప్రశ్నాపత్రాల ముద్రణకు కూడా నోచుకోవట్లేదు. ఇటీవల ఏయూ దూరవిద్య పరీక్షల నిర్వహణలో బయటపడిన డొల్లతనమే ఇందుకు నిదర్శనం. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగాల్సిన దూర విద్య పరీక్షలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఫలితంగా మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాలను ఈ మెయిల్లో పంపించడం, చేతిరాతతో ఉన్న ప్రశ్నాపత్రాన్ని జిరాక్స్ తీసి అప్పటికప్పుడు విద్యార్థులకు అందించే దుస్థితికి దిగజారింది.ఇదంతా విశాఖ తీరంలోని ఓ కార్పొరేట్ వర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకు చేస్తున్నట్టు వినికిడి. అందుకే ప్రభుత్వ వర్సిటీకి రావాల్సిన ఎన్నో విలువైన ప్రాజెక్టులు సైతం ఆ కార్పొరేట్ వర్సిటీకి తరలిపోయాయి. ఇది ఒక్క ఏయూనే కాదు.. అమరావతికి కూతవేటు దూరంలోని ఆచార్య నాగార్జున వర్సిటీ, సాక్షాత్తూ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, జేఎన్టీయూలనూ పట్టిపీడిస్తున్న సమస్య.చంద్రబాబును నమ్మితే అసలుకే ఎసరు..! అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు సర్కారు అప్పుల కోసం ఏ వ్యవస్థనూ వదలడం లేదు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సంస్థల నుంచి నిధులను లాగేస్తోంది. వాస్తవానికి జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లకు గ్యారెంటీ ఉంటుంది. నిత్యం చెల్లింపులు, ఉపసంహరణలకు అవకాశం ఉంటుంది. కానీ చంద్రబాబు ట్రాక్ రికార్డు చూస్తే వర్సిటీలు, ఉన్నత విద్యా మండలి నిధులను తిరిగిచ్చే అవకాశమే ఉండదని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం ఒక శాతం అధిక వడ్డీకి ఆశపడి జాతీయ బ్యాంకుల్లోని డిపాజిట్లను తీసుకొచ్చి నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థల్లో పెట్టడం మంచిదికాదని మండిపడుతున్నారు. పైగా ప్రభుత్వమే ఎడా పెడా అప్పులు చేస్తుంటే.. వర్సిటీలకు తిరిగి చంద్రబాబు నిధులు చెల్లిస్తారనుకోవడం భ్రమేనని తెగేసి చెబుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి జపం చేస్తున్న చంద్రబాబు అభివృద్ధిని, పేదల సంక్షేమాన్ని పూర్తిగా అటకెక్కించేశారని, ఉద్యోగులకు 10వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించడం లేదని గుర్తు చేస్తున్నారు.కొండలా పేరుకుపోయిన బకాయిలుచంద్రబాబు ఏలుబడిలో ఉన్నత విద్య అంతకంతకూ దిగజారిపోతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతోపాటు, ప్రైవేటు సంస్థలు సైతం తాము విద్యాలయాలను నడపలేమనే స్థాయికి వచ్చేశాయి. వీటన్నింటికీ ముఖ్య కారణం ‘ఫీజు రీయింబర్స్మెంట్’ చెల్లింపుల్లో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అత్యంత దుర్మార్గపు, నిర్లక్ష్యపు వైఖరేనని స్పష్టంగా తెలుస్తోంది. దాదాపు రూ.5,600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, రూ.2,200 కోట్ల వసతి దీవెన బకాయిలు కొండలా పేరుకుపోవడం ప్రభుత్వ ఆర్థిక అనిశ్చితిని బట్టబయలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నిధులను బలవంతంగా లాక్కోవడం వర్సిటీల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. -
గ్రూప్-1 ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాలను విడుదల చేసింది. 89 పోస్టులకు పరీక్షలు జరగ్గా శుక్రవారం తుది ఫలితాలను సర్వీస్ కమిషన్ వెల్లడించింది. స్పోర్ట్సు కోటాపై హైకోర్టులో ఇంకా కేసు పెండింగ్లో ఉండడంతో రెండు పోస్టులు (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డీఎస్పీ సివిల్) పక్కనపెట్టి, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈనెల 6న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు మిగిలిన 87 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో ఉంచింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో గ్రూప్–1నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 మార్చిలో ప్రిలిమ్స్ నిర్వహించారు. అదే ఏడాది మే/జూన్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా ప్రకటించారు. అయితే, ఎన్నికల ముందు ఈ పరీక్షలపై హైకోర్టులో పలు రకాల పిటిషన్లు వేయడంతో మెయిన్స్ పలుమార్లు వాయిదాపడి చివరికి 2025 మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారు. అనంతరం మెయిన్స్లో 182 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి జూన్ నెలలో ఓరల్ టెస్ట్ పూర్తి చేశారు. శుక్రవారం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పోస్టుల వారీగా విడుదల చేశారు. మొత్తం 15 రకాల పోస్టులకు కేటగిరీల వారీగా ఫలితాలను వెల్లడించారు. వివిధ కేడర్ల పోస్టులకు ఎంపిక ఇలా.. ఫలితాలు ప్రకటించిన 87 పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్లు 9 మంది, స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్–17, డీఎస్పీ సివిల్–25, జైల్స్ డిప్యూటీ సూపరింటిండెంట్–1, జిల్లా ఫైర్ ఆఫీసర్–2, ఆర్టీవో (మల్టీజోన్–1)–6, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్(మల్టీ జోన్–1)–1, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్(మల్టీ జోన్–1)–3, డిప్యూటీ రిజి్రస్టార్స్ జోన్–2లో–4, జోన్ 4లో–2, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్స్(మల్టిజోన్)–3, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటిండెంట్ (మల్టిజోన్–1)–1, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్–3, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్–4, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్(జోన్–4)–2, ఎంపీడీవో–4 పోస్టులు ఉన్నాయి.ప్రతిభకు ‘సలామ్’ ఆర్టీఓగా కార్పెంటర్ కుమారుడు నరసరావుపేట ఈస్ట్: సాధారణ కుటుంబం నుంచి గ్రూప్–1 స్థాయి అధికారిగా షేక్ యూసబ్ సలామ్ ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని వరవకట్టకు చెందిన సలామ్ తండ్రి సుభాని కార్పెంటర్. తల్లి నాసర్బీ గృహిణి. ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో సలామ్ రీజినల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యను పట్టణంలోనే పూర్తిచేసుకున్న సలామ్ బీటెక్, ఎంటెక్ చదివి తన దృష్టి సివిల్స్ వైపు మళ్లించారు. కఠోర శ్రమ చేశారు. సలామ్ తన రెండో ప్రయత్నంలో గ్రూప్–1కు ఎంపికయ్యారు. యూపీఎస్సీ పరీక్ష లక్ష్యంగా తన కృషి కొనసాగిస్తానని తెలిపారు. ‘విజయ’ పుత్రుడు తొలియత్నంలో ఏఈఎస్ కొలువు మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాల్లో మార్కాపురం పట్టణానికి చెందిన ఒద్దుల వెంకట సుజిత్ రెడ్డి సత్తాచాటారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. 2023లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయన మొదటిసారిగా గ్రూప్ వన్ పరీక్ష రాసి ఏఈఎస్గా ఎంపికయ్యారు. ఆయన తండ్రి వీరారెడ్డి, తల్లి విజయ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా సుజిత్ను హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డితోపాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.సూపర్ సురేష్.. ప్రతిభలో ‘సిద్ధ’హస్తం డిప్యూటీ కలెక్టర్గా కొలువు పెద్దతిప్పసముద్రం: మొన్న విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటిన సురేష్ శుక్రవారం రాత్రి విడుదలైన గ్రూప్–వన్ ఫలితాల్లోనూ విజయకేతనం ఎగురవేశారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం రాపూరివాండ్లపల్లి పంచాయతీ కొత్తపల్లికి చెందిన యదశంద్రం సిద్ధప్ప, సిద్ధమ్మ దంపతుల కుమారుడు సురేష్. ఈయన గత ప్రభుత్వంలో సచివాలయ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆ ఉద్యోగం చేస్తూనే గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యారు. తొలుత గ్రూప్–2 పరీక్షలు రాసి డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. అలాగే గ్రూప్–1 పరీక్షలూ రాసిన సురేష్ విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఆర్టీఓగా ‘సంతోషి'oచే రావికమతం: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన గట్రెడ్డి సంతోషి గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటి ఆరీ్టవోగా ఉద్యోగం సాధించారు. సంతోషి ఎంటెక్ చదివారు. ఆమె ప్రస్తుతం మాకవరపాలెం మండల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్–1,2 పరీక్షలకు సిద్ధమయ్యారు. మంగళవారం విడుదలైన పలితాల్లో గ్రూప్–2లో విజయం సాధించి, అమరావతిలో అసిస్టెంట్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. శుక్రవారం విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో సత్తాచాటి రీజినల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్(ఆర్టీఓ)గా ఉద్యోగం సాధించారు. సంతోషి మాకవరపాలెం మండలం సుబ్బారాయుడు గ్రామానికి చె«ందిన లగుడు సూర్యనారాయణ (లేటు), సత్యవతి కుమార్తె. తండ్రి సూర్యనారాయణ చిన్నతనంలో మరణించడంతో తల్లి ఆమెను కష్టపడి చదివించారు. ఇదిలా ఉంటే సంతోషి భర్త గోపి సాఫ్ట్వేర్ ఇంజినీర్. ‘గౌరి’వప్రద విజయం డీఎస్పీగా శివనాగగౌరి ఎచ్చెర్ల: గ్రూప్–1 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఎస్ఎం పురం గ్రామానికి చెందిన సంపతిరావు శివనాగగౌరి సత్తాచాటారు. డీఎస్పీగా ఎంపికయ్యారు. మొత్తం 25 మంది డీఎస్పీలుగా ఎంపిక కాగా శ్రీకాకుళం జిల్లా నుంచి శివనాగగౌరి ఎంపిక కావడం విశేషం. ప్రాథమిక విద్య, పదో తరగతి వరకూ శ్రీకాకుళం నగరంలోని మునసబుపేట వద్ద గల గాయత్రి స్కూల్లోనూ, ఇంటర్ విశాఖపట్నంలోని శ్రీచైతన్య విద్యాసంస్థలో చదువుకున్నారు. అనంతరం తమిళనాడులోని వీఐటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ఈమె 2017లో పోలవరం ప్రాజెక్ట్లో ఏఈఈగా ఎంపికయ్యారు. డిప్యుటేషన్పై ప్రస్తుతం వంశధార ప్రాజెక్టులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ)గా విధులు నిర్వహిస్తున్నారు. 2017లోనే ఈమె గెయిల్లో (గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ఇంజినీర్గా ఎంపికయ్యారు. ఈమె అత్తమ్మ చౌదరి ధనలక్ష్మీ గతంలో జెడ్పీ చైర్పర్సన్ పనిచేశారు. ఈమె భర్త చౌదరి అవినాష్ ప్రస్తుతం డీసీఎంఎస్ చైర్మన్. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈమె గతంలో గ్రూపు–1 పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లి విఫలమయ్యారు. అయితే పట్టు వదలకుండా రెండో సారి ప్రయత్నించి విజయం సాధించారు. ‘ఓంకార’నాదం డీఎస్పీగా ఓంకార వెంకట నాగేశ్వరరావు తెనాలి: తెనాలి నాజరుపేటకు చెందిన అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావు గ్రూప్–1లో సత్తాచాటారు. డీఎస్పీగా ఎంపికయ్యారు. నాగేశ్వరరావు తండ్రి కూరగాయల వ్యాపారి. తల్లి గృహిణి. 2010–14లో నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ చేసిన నాగేశ్వరరావు సివిల్స్ లక్ష్యంతో ఢిల్లీ వెళ్లాడు. పోటీపరీక్షలకు తయారయ్యాడు. 2019లో సచివాలయ పరీక్షలు రాసి పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో పనిచేస్తున్నారు. అయినా రాజీపడక గ్రూప్–1 పరీక్షలు రాశారు. డీఎస్పీగా ఎంపికయ్యారు. -
చంద్రబాబుదే మహాపాపం.. రాజకీయ పాతకం!
‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయి..’ – నెల్లూరు న్యాయస్థానంలో తాజాగా చార్జ్షీట్ దాఖలు చేసిన సీబీఐ సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమై స్థానంలో ఉంటూ రాజకీయ కుట్రలతో ఎంతకైనా దిగజారుతానని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు! తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు కలిసిందన్న తన నిరాధార ఆరోపణలు బెడిసికొట్టడం.. ముఖ్యమంత్రి హోదాలో మహాపచారానికి పాల్పడటంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతుండటం, దారుణమైన అబద్ధాలాడిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తుండటంతో సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీలు శాస్త్రీయంగా నిర్ధారించగా.. అదే విషయాన్ని సీబీఐ సైతం తాజాగా చార్జ్షీట్లో స్పష్టం చేయడం తెలిసిందే. దీంతో తన పాచిక పారకపోవడంతో ఇతర అంశాలను వక్రీకరిస్తూ చంద్రబాబు బృందం మరో పన్నాగం పన్నింది. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి కాంట్రాక్టులు కేటాయించారని.. చిన్నప్పన్నను వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ వక్రీకరణలకు పాల్పడుతోంది. కట్టబెట్టింది టీడీపీ హయాంలోనే.. చార్జ్షీట్లో వెల్లడించిన సీబీఐ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించేందుకు చంద్రబాబు బృందం పడరాని పాట్లు పడుతోంది. అసలు వాస్తవం ఏమిటంటే.. భోలే బాబా డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే. భోలే బాబా కంపెనీకి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారని సీబీఐ చార్జ్షీట్లో వెల్లడించడం గమనార్హం. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో పేర్కొంది. ‘లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలవనే లేదు. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయి. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయి..’ అని సీబీఐ చార్జిషీట్లో తెలిపింది. .ఆ శాంపిల్స్.. బాబు సీఎం అయ్యాక తీసినవే ఇక ప్రస్తుతం కల్తీ అంటూ చేస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశాక తీసిన శాంపిల్స్ అవి! ఆ నెయ్యి శాంపిల్స్ టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో తీసినవే. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగింది. మరి ఆ నెయ్యిలో కల్తీ ఉంటే అందుకు బాధ్యత టీడీపీ కూటమి ప్రభుత్వానిదేనన్నది సుస్పష్టం. కొనుగోలు కమిటీలో కొలుసు, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చంద్రబాబు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే... వైఎస్సార్సీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి సభ్యులుగా ఉన్నారు. నాడు టీటీడీ పర్చేజ్ కమిటీలో సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. అదంతా కల్తీయేనా బాబూ?2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి నెయ్యి కిలో రూ.276 – రూ.314 మధ్య కొనుగోలు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే అది తక్కువే. మరి దాన్ని బట్టి బాబు సర్కారు కొన్న నెయ్యి అంతా కల్తీయేనని భావించాలా? శ్రీవారి సొమ్ములు దుర్వినియోగం చరిత్ర బాబుదే..! తిరుమల శ్రీవారి నిధుల వినియోగంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిదే. అందుకు టీటీడీ తిరుపతిలో నిర్మించిన ఫ్లై ఓవరే నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఫ్లై ఓవర్ నిర్మాణ వ్యయం రూ.684 కోట్లలో టీటీడీ 67 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం వెచ్చించాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ కనీసం టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏకపక్షంగా వ్యవహరించారు. ఇది టీటీడీ నిబంధనలకు విరుద్ధమని వారించినా లెక్క చేయలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లై ఓవర్ నిర్మాణానికి టీటీడీ పాలకమండలిలో తీర్మానం చేసింది. అంతేకాదు.. నిర్మాణ వ్యయాన్ని రూ.40 కోట్లు తగ్గించి శ్రీవారి నిధులను ఆదా చేసింది. ఇక టీడీపీ హయాంలో టీటీడీ నిధులు రూ.1,300 కోట్లు ప్రైవేట్ రంగంలోని ఎస్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు బ్యాంకులో డిపాజిట్ చేయడంపై తీవ్ర విమర్శలు రేగినా చంద్రబాబు పట్టించుకోలేదు. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులో ఉన్న టీటీడీ డిపాజిట్లను ఉపసంహరించి... ప్రభుత్వ రంగంలోని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయించింది. తప్పుడు నివేదిక బాబు హయాంలోనే.. గతంలో భోలే బాబా డెయిరీ పేరు హర్ష్ ఫ్రెష్ డెయిరీ’. ఆ పేరుతోనే 2018 మేలో తొలిసారి టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. లీటరు నెయ్యి కేవలం రూ.290కే సరఫరా చేస్తామని టెండరు వేస్తే టీటీడీ సమ్మతించి కాంట్రాక్టు కట్టబెట్టింది. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వమే. హర్ష్ డెయిరీని తనిఖీ చేసేందుకు 2018 ఏప్రిల్ 17న అప్పటి టీటీడీ ఈవో నిపుణుల కమిటీని పంపారు. కానీ ఆ కమిటీ తప్పుడు నివేదిక ఇచ్చి మోసగించింది. హర్ష్ డెయిరీ రోజుకు 1,33,500 లీటర్ల ఆవు పాలు సేకరిస్తోందని... రోజుకు 4 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తోందని తప్పుడు నివేదిక ఇచ్చింది. ఆ విధంగా తప్పుడు నివేదిక ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కావడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 18న 82 వేల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు టీటీడీ పిలిచిన టెండర్లలో హర్ష్ డెయిరీ మళ్లీ పాల్గొని టెండరు దక్కించుకుంది. వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదు...ఏపీ భవన్ ఉద్యోగి తిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్ర చారం చేస్తోంది. ఈ కేసులో అరెస్టు అయిన ఆయన్ను వైవీ సుబ్బారెడ్డి పీఏగా దుష్ప్ర చారం చేయడం ద్వారా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పీఏగా పని చేశారు. ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. తిరుమల లడ్డూపై దుష్ప్ర చారం ఆపాలని, నిజాలు బయటకు తీయాలని సుప్రీంకోర్టుకు వెళ్లింది వైవీ సుబ్బారెడ్డే. అంతేగానీ టీడీపీ నేతలు కాదు. ఇక సీబీఐ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్లో వైఎస్సార్ సీపీ నేతలు సహా గత ప్రభుత్వంలో ఉన్నవారి పేర్లు ఏ ఒక్కరివీ లేవు. రాజకీయ కుట్రతో ఇంతటి బరితెగింపా బాబూ...! కేవలం రాజకీయ స్వార్థం కోసమే తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యం దెబ్బతీసే కుట్రకు చంద్రబాబు తెగబడ్డారు. సీఎం హోదాలో దుష్ప్ర చార కుట్రకు బాబు నేతృత్వం వహించగా టీటీడీ ప్రధాన కార్యాలయం కేంద్రంగానే కుట్ర రచన సాగించి అమలు చేశారు. విజయవాడ వరదల్లో సహాయ, పునరావాస చర్యల్లో తన ఘోర వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాల కోసమే ఈ మహా పాపానికి ఒడిగట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది, చేప కొవ్వులు కలిపారంటూ చంద్రబాబు దారుణమైన ఆరోపణలు చేశారు. ఏమాత్రం పాపభీతి లేకుండా శ్రీవారి ఆలయ పవిత్రతకు కళంకం తీసుకువచ్చేందుకు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీసేందుకు కుతంత్రం పన్నారు. ‘ఇది మంచి ప్రభుత్వం..’ అనే పేరుతో 2024 సెప్టెంబర్ 20న ఒంగోలులో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాన్ని దీనికి వేదికగా చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారు. ఇక నారా లోకేశ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప కొవ్వు కలిపి అపవిత్రం చేశారని దారుణమైన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిపినట్లు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడైందని పేర్కొనడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే... తిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ పరీక్షల్లో వెల్లడి కాలేదు. కేవలం రాజకీయ కుట్ర కోసమే చంద్రబాబు, ఆయన ముఠా ఎల్లో మీడియా సహకారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పక్కా పన్నాగం పన్నింది. ఇదిగో.. పంది కొవ్వు ఇంత శాతం..! ఆవు కొవ్వు ఇంత శాతం..! చేప కొవ్వు ఇంత శాతం..! అంటూ ఈనాడు, ఇతర ఎల్లో మీడియా పేజీలకు పేజీలు అవాస్తవ కథనాలతో దుష్ప్రచారం చేశాయి. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తెచ్చే కుట్రలో పాత్రధారిగా మారిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏకంగా ప్రాయశి్చత్తం డ్రామాకు తెరతీశారు. మీడియా కెమెరాల ముందు విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లు కడిగి హైడ్రామాను రక్తి కట్టించారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతారం ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు.. సీబీఐ దర్యాప్తులో వెల్లడి.. చార్జ్షీట్లో స్పష్టీకరణ తిరుమల లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర బెడిసికొట్టింది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. ఈమేరకు నెల్లూరులోని న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షీట్లో సీబీఐ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్ర చార కుట్రలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు వెంటనే ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని తేల్చి చెప్పారు. దీంతో ఆయన్ను ప్రభుత్వ పెద్దలు అమరావతికి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాతే ఆయన్ను బదిలీ చేయడం గమనార్హం. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని తాజాగా సీబీఐ నివేదిక వెల్లడించింది. దాంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. శాస్త్రీయంగా విశ్లేషణ... సాధికారికంగా నిర్ధారణ... టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తులో నిర్ధారించింది. ఆ విషయాన్ని సీబీఐ తన చార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్(ఎన్డీడీబీ)లకు పంపించి పరీక్షలు నిర్వహించినట్టు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యా»ొరేటరీలు 2025 మార్చి 27, 2025 మే 16న రెండు వేర్వేరు నివేదికల్లో నిర్ధారించాయని సీబీఐ తన చార్జ్షీట్లో పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రై గ్లిసరైడ్ ప్రొఫైల్’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలె్రస్టాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలె్రస్టాల్ ఉంటుంది. కొలె్రస్టాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. నెయ్యి కొనుగోలుకు టీటీడీలో పటిష్ట వ్యవస్థరాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలనే కుట్రతో చంద్రబాబు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. టీటీడీ అనుసరించే పటిష్ట విధానం ఇదీ... లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్ చేసిన వాటిలో ఎల్ 1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు. ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్తో పాటు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తించిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్ను కూడా సమర్పించాలి. ఓ ట్యాంకర్ నెయ్యి శాంపిల్లో 99.618 శాతం మిల్క్ ఫ్యాట్ ఉందని తేల్చుతూ ఎన్డీడీబీ కాల్ఫ్ 2024 జూలై 23న ఇచ్చిన టెస్ట్ రిపోర్టు ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని.. ఫారిన్ ఫ్యాట్ కలిసి ఉండొచ్చునని ఏఆర్ డెయిరీ ఫుడ్స్కు 2024 జూలై 27న ఇచ్చిన షోకాజ్ నోటీసులో పేర్కొన్న టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా కేజీ నెయ్యిలో 208.851 మిల్లీ గ్రాముల వెజిటబల్ ఆయిల్ కలిసిందని.. ఫారిన్ ఫ్యాట్ కూడా కలిసి ఉండే అవకాశం ఉందని 2024 జూలై 28న ఏఆర్ డెయిరీ ఫుడ్స్కు ఇచ్చిన రిజాయిండర్ షోకాజ్ నోటీసులో స్పష్టం చేసిన టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టు ఆధారంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ 2024 జూలై 6, జూలై 15న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అదే నెల 22న సీఎంకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్న టీటీడీ అప్పటి ఈవో శ్యామలరావు (ఈయనే నెయ్యిలో జూలై 23న వనస్పతి డాల్డా వంటి వెజిటబుల్ ఆయిల్ కలిసిందని తిరుమలలో ఏడుకొండలస్వామి సాక్షిగా మీడియాకు చెప్పారు) » అలా ట్యాంకర్ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు. » తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019–24లో వైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవాలు. బాబు దుష్ప్రచారంపై జాతీయ మీడియాలో విమర్శల వెల్లువ తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కుట్ర పన్నడంపై జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చార్జిషీట్లో పేర్కొనడాన్ని జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. జాతీయ టీవీ చానళ్లు, డిజిటల్ మీడియా కూడా దీనికి అత్యధిక ప్రాధాన్యమిచ్చాయి. జంతువుల కొవ్వు కలిసింది అంటూ నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ శ్రీవారి భక్తులు, వివిధ రంగాల ప్రముఖులు డిమాండ్ చేయడాన్ని జాతీయ మీడియా ప్రస్తావించింది. -
దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి వివాదంపై దర్యాప్తు చేసిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జ్ షీట్ నేపథ్యంలో తమ పార్టీ, నాయకులను నిందిస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని వైఎస్సార్సీపీ కోరింది. ఈ మేరకు డీజీపీకి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం లేఖ రాశారు. సీబీఐ సిట్ ఛార్జ్ షీట్ లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ, తమ పార్టీని నిందిస్తూ గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శితోపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతోపాటు నాయకుల పరువుకు భంగం కలిగించే విధంగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. నిజానికి సిట్ ఛార్జ్ షీట్ లో వైఎస్సార్సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిపై ఎలాంటి నేరారోపణలు చేయలేదని, అయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, వారి ఫొటోలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వివరించారు. అందుకే వాటిని ఏర్పాటు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, భవిష్యత్లో మళ్లీ అలాంటి పనులు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ, పరువుకు నష్టం కలిగించేలా ఆ ఫ్లెక్సీలు డిజైన్ చేసిన, ప్రింట్ చేసిన, వాటికి నిధులు సమకూర్చిన, రవాణా చేసిన వారితోపాటు, అవి ఏర్పాటు చేసిన వారిపైనా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ఉందని, కాబట్టి శాంతికి విఘాతం కలిగించే ఆ చర్యలను నిరోధించేలా వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఆ లేఖలో డీజీపీని కోరారు. -
వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో
అమరావతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు చెందిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే మహిళతో వీడియో చాటింగ్ చేస్తున్న వ్యవహారం తాజాగా బయటపడింది. అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చి మరీ మహిళకు వీడియో కాల్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచే మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో బాధితురాలు మీడియాకు విడుదల చేసింది. అసెంబ్లీ చరిత్రలో ఎవరూ చేయని గలీజు పని చేశారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అసెంబ్లీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా శ్రీధర్ వీడియో కాల్ చేయడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కాగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్లు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి వేళ కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న శ్రీధర్ మహిళా ఉద్యోగినికి వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాను అర్ధనగ్నంగా మారి వీడియో కాల్ చేయడమే కాకుండా.. మహిళను సైతం నగ్నంగా కనిపించాలంటూ బెదిరించారు. పత్రికల్లో రాయలేని అసభ్యకర సందేశాలను బాధితురాలికి అర్ధరాత్రి సమయంలో శ్రీధర్ పంపించినట్లు ఆ వీడియోలో ఉంది. కాగా, శ్రీధర్ తననే కాకుండా కనిపించిన ప్రతి మహిళనూ వక్ర బుద్ధితోనే చూస్తాడని బాధిత మహిళ తెలిపారు. వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు. తాజాగా ఓ మహిళతో అసెంబ్లీ వేదికగా చాటింగ్ చేస్తున్న వీడియో బయట పడటంతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మానసిక దారిద్ర్యంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇవీ చదవండిఅరవ ఆగడాలు మరిన్ని..నువ్ మోసపోయావ్.. వదిలేయ్..‘అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు’ -
తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం: ప్రొఫెసర్ నాగేశ్వర్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేసిన చంద్రబాబు.. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు భయంకరమైన ఆరోపణలు చేశారంటూ దుయ్యబట్టారు. కోట్లాది హిందువుల మత విశ్వాసాలపై దాడి కాదా? అంటూ నిలదీశారు.‘‘వాస్తవాలు గమనించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎఫ్ఐఆర్ దాఖలు కాకుండా.. కేసు పెట్టకుండా.. విచారణ జరగకుండా సీఎం ఎలా తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు సీఎం స్థాయిలో ఉండి ఆరోపణలు చేస్తారు. సిట్ విచారణలో జంతు కొవ్వులేదని తేలింది. జంతు కొవ్వు కలిసినట్టు ఆధారాలు లేవు. తిరుమల లడ్డూను అపవిత్రం చేస్తున్నారు’’ అని నాగేశ్వర్ మండిపడ్డారు.కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టం చేయడంతో చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే. -
గాంధీజీ చెప్పినట్టు సత్యమే గెలిచింది: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: సత్యమేవ జయతే అని మహాత్మా గాంధీజీ చెప్పినట్టు తిరుమల లడ్డూ విషయంలోనూ నిజమైందని.. సీబీఐ సిట్ ఛార్జిషీట్ ద్వారా కూటమి నాయకులు చేసిన కుట్రలు, చెప్పిన అబద్ధాలు ప్రజలకు తెలిసిపోయాయని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మహాత్మా గాంధీజీ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్ని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటాల నుంచి స్ఫూర్తి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలని, ఆయన చూపించిన అహింసా మార్గంలోనే సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పేద రైతు కూలీలు, కార్మికుల కోసం ప్రారంభించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై వారు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలో గాంధీజీ స్ఫూర్తితో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చారని, శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం ద్వారా వందేళ్ల తర్వాత భూ సర్వేనిర్వహించి దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించారని కొనియాడారు. వారు ఇంకా ఏమన్నారంటే..కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్, పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు వెన్నపూస రవీంద్రరెడ్డి, మలసాని మనోహర్రెడ్డి, నలమారు చంద్రశేఖర్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణ మూర్తితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.చివరికి సత్యమే గెలిచింది: లేళ్ల అప్పిరెడ్డిశాంతి, సత్యం అహింస ఆయుధాలుగా దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు మహాత్మా గాంధీజీ. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరికీ స్వాతంత్ర్య కాంక్షను రగిలించడంలో ఆయన చేసిన కృషికి కొలమానం లేదు. భారత జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించి ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన చూపిన తెగువ, మహాత్ముడు చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శం. గాంధీజీ మనదేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.రాజకీయ కక్షలు, దోపిడీ, అరాచకాలతో పాలన సాగిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడుకుంటూ నిర్వీర్యం చేశారు. పౌరుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వాన్ని విమర్శించిన వారి మీద గంజాయి, దేశద్రోహం కేసులు పెడుతున్నారు. ఆఖరుకి రాజకీయ లబ్ధి కోసం దిగజారిపోయి తిరుమల లడ్డూ గురించి విష ప్రచారం చేశారు. అయినా సరే సత్యమేవ జయతే అన్నట్టు సీబీఐ దర్యాప్తు తర్వాత లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలవలేదని తేలిపోయింది.గాంధీజీ మార్గం అనుసరణీయం: దొంతిరెడ్డి వేమారెడ్డిఆంగ్లేయుల నిరంకుశ పాలన నుంచి దేశానికి స్వేచ్ఛా ఊపిరి ఊదిన మహాత్మా గాంధీ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. దేశం కోసం నిస్వార్థంగా ఆయన చేసిన పోరాటం, త్యాగం దేశప్రజలంతా నిత్యం స్మరించుకుంటారు. ఆయన చూపించిన అహింసా మార్గంలో సమస్యలపై ప్రతిఒక్కరూ పోరాడాలి.గుంటూరు, కృష్ణా జిల్లాలతో అనుబంధం: మల్లాది విష్ణుమహాత్మా గాంధీజీకి గుంటూరు, కృష్ణా జిల్లాలతో మంచి అనుబంధం ఉంది. ఉప్పు సత్యాగ్రహం, చీరాల-పేరాల ఉద్యమం ప్రారంభించారు. ఆయన ఇక్కడి నాయకులను స్వాతంత్ర్య పోరాటంలో కార్యోన్ముఖుల్ని చేసి ముందుకు నడిపించారు. శాంతి, అహింసా మార్గంలో ఓర్పు సహనంతో బ్రిటీష్ నిరంకుశంత్వంపై పోరాడి విజయం సాధించడంలో గాంధీజీ పాత్ర గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఆయన మార్గంలోనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా అవిశ్రాంతంగా పోరాటం చేశారు. రాష్ట్రంలో వలసల నివారణకు ఆయన పేరుతోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురంలో ప్రారంభించారు. రైతు కూలీలు, కార్మికులకు అండగా నిలబడ్డారు. వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి చూపించారు. అవినీతి, పక్షపాతానికి తావులేకుండా గడప వద్దకే పాలన అందించారు.అంటరానితనంపైనా పోరాటం: గోరంట్ల మాధవ్స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారిపై యుద్ధం చేయడమే కాకుండా దేశంలో వేళ్లూనుకుని ఉన్న అస్ప్రశ్యత నివారణ కోసం దీనజనోద్ధరణ కోసం గాంధీజీ పోరాటం చేసి విజయం సాధించారు. అంటరానితనంతో వెనుకబడిన వర్గాలకు జరుగుతున్నఅన్యాయంపై గళమెత్తి వారికి అండగా నిలబడ్డారు. ఆయన చూపించిన మార్గంలోనే వైయస్ జగన్ గారు ఐదేళ్ల పాలన అందించడంతో పాటు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.అణుబాంబుల కన్నా అహింసే పవర్ఫుల్: జూపూడి ప్రభాకర్అంటరానితనాన్ని దేశం పారద్రోలాలంటే న్యాయవాద వృత్తిని వదిలేయడమే కాకుండా తన వేషధారణలో మార్పులు చేసి అతి సామాన్యుడిగా మారిపోయాడు. ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించాలని అహింసా మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప సామాజిక మేధావి గాంధీజీ. అణుబాంబుల కన్నా గొప్పదైన అహింసా శాంతి సందేశాన్ని పంపాడు. ఐదేళ్ల వైయస్సార్సీపీ పాలనలో గాంధీజీ వైయస్ జగన్ గారు గాంధీజీ అడుగుజాడల్లోనే నడిచారు.గాంధీజీ పేరును తీసేయడం దుర్మార్గం - వెలంపల్లి శ్రీనివాస్మహాత్మా గాంధీ చూపించిన అహింసా మార్గం అందరికీ అనుసరణీయం. ఆయన అడుగుజాడల్లో నడిచి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. రైతు కూలీలకు పనులు కల్పించి వారికి చేదోడుగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో దివంగత వైయస్సార్ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం ఎన్నో లక్షల కుటుంబాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చింది. ఇలాంటి పథకం నుంచి గాంధీ పేరును తీసేయడం ఆయన్ను అవమానించడమే -
సత్యం ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ..
సాక్షి, తాడేపల్లి: జాతిపిత మహాత్మా గాంధీకి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. “సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అని చెప్పడమే కాక.. తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. “సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అని చెప్పడమే కాక, తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు. నేడు జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 30, 2026 -
పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం
సాక్షి, అమరావతి/జంగారెడ్డిగూడెం: పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను గురువారం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు కలిశారు. కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు, సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ పెంపు వల్ల పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ జగన్ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. దీనివల్ల పొగాకుకు డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతాయని, కొనుగోళ్లు తగ్గి, తమ జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు.ఇప్పటికే పలు జిల్లాల్లో పొగాకు రైతులు నిరసనలు చేపడుతూ, పన్నులు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని వారు వైఎస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. పొగాకు రైతులు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభాన్ని, వారిలో నెలకొన్న ఆందోళనలను వైఎస్సార్సీపీ... కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మేలు జరిగేలా చూస్తుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వైఎస్సార్సీపీ ఎంపీలు ఈ అంశాన్ని చర్చిస్తారని తెలిపారు.వైఎస్ జగన్ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, ఎన్ఎల్ఎస్ వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు సత్రం వెంకటరావు, ఉపాధ్యక్షుడు అట్లూరి సతీష్, సెక్రటరీ సత్యనారాయణ, రైతు నాయకులు సత్తెనపల్లి వీర్రాజు, వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గుర్నాథరావు తదితరులు ఉన్నారు. -
‘క్యాన్సర్’పై బాబు బిల్డప్!
సాక్షి, అమరావతి: పాలనలో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఎవరో చేసిన పనులను తన ఘనతగా చిత్రీకరించుకుంటూ సీఎం చంద్రబాబు తన రికార్డును తనే బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ పరంపరలో భాగంగా క్యాన్సర్ను నోటిఫై చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందంటూ గురువారం ఆయన ప్రకటించారు. నిజానికి.. క్యాన్సర్ వ్యాధి నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా వైఎస్ జగన్ 2022 మే 16న క్యాన్సర్ను నోటిఫైడ్ జబ్బుల జాబితాలో చేర్చారు. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చారు.అంతేకాక.. ప్రభుత్వ రంగంలోనూ క్యాన్సర్ వైద్యసేవలను బలోపేతం చేయడంతో పాటు, 50 కి.మీ దూరంలోనే ప్రజలకు క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తేవడం, ప్రారంభ దశలోనే వ్యాధి గుర్తించడం సహా ఇతర చర్యల్లో భాగంగా కాంప్రహెని్సవ్ క్యాన్సర్ కేర్కు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా.. గుంటూరు జీజీహెచ్లో అత్యాధునిక క్యాన్సర్ ఆస్పత్రిని అందుబాటులోకి తేవడంతో పాటు, కర్నూల్ స్టేట్ క్యాన్సర్ యూనిట్ను అందుబాటులోకి తెచ్చారు. సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. సమగ్రంగా అధ్యయనం చేయడానికి క్యాన్సర్ అట్లాస్కు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వంలో నమోదయ్యే ప్రతి కేసు నమోదుకు వీలుగా జబ్బును నోటిఫైడ్ జబ్బుల జాబితాలోకి అప్పట్లోనే చేర్చారు. రాష్ట్రవ్యాప్త సర్వేకు జగన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేయగా ఇప్పుడా సర్వేను తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం నానాపాట్లు పడుతోంది. సర్వేలో గుర్తించిన వివరాలతో అట్లాస్ను ప్రారంభించి, క్యాన్సర్ను నోటిఫైడ్ జబ్బుల జాబితాలో తమ ప్రభుత్వమే చేర్చినట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. -
హైకోర్టు ఇమ్మంది.. ప్రభుత్వం పొమ్మంటోంది!
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో మెరిట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని హైకోర్టు సీరియస్గా తీసుకుంది. ప్రతిభావంతులకు అన్యాయం జరిగితే సహించబోమని ఇటీవల హెచ్చరించడంతోపాటు, వారికి రెండు నెలల్లోగా అర్హత సాధించిన పోస్టుల్లో ఉన్నతమైన పోస్టు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఇందుకు చంద్రబాబు సర్కారు ససేమిరా అంటోంది. ఇప్పటికే నియామకాలు పూర్తి చేశామని, ఇవ్వడం కుదరదని చెప్పింది. పైపెచ్చు హైకోర్టు తీర్పుపై అప్పీల్కు విద్యా శాఖ సిద్ధమవుతోంది. చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం పాట్లు పడుతోందేగానీ, హైకోర్టు ఆదేశాల ప్రకారం మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేసేందుకు మాత్రం అంగీకరించడం లేదు. డీఎస్సీ–2025 అభ్యర్థుల జీవితాలతో ఆది నుంచి ఆడుకున్న ప్రభుత్వం.. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు సమయంలోనే తొలి ప్రాధాన్య పోస్టు ఏదో అభ్యర్థులను ఎంచుకోమంది. అభ్యర్థులు తొలి ప్రాధాన్యంగా ఏ పోస్టు ఎంచుకుంటే అదే పోస్టు వస్తుందని ప్రకటించింది. ఈ విధానం గతంలో ఎప్పుడూ లేదు. కౌన్సెలింగ్ సమయంలో మాత్రమే పోస్టుల ప్రాధాన్యం అడిగేవారు. దాని ద్వారా అభ్యర్థులు తాము మెరిట్ సాధించిన వాటిలో ఉన్నత పోస్టును పొందే అవకాశం ఉండేది. ఈసారి దరఖాస్తు సమయంలోనే అడగడంతో వందలాది అభ్యర్థులు ఉన్నత పోస్టులను కోల్పోయారు. డీఎస్సీ –2025 ఫలితాలు ప్రకటించాక దాదాపు 2 వేల మంది అభ్యర్థులు ఎస్జీటీ తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్నా స్కూల్ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా సాధించారు. అయితే వారికి తొలి ప్రాధాన్యమైన ఎస్జీటీ పోస్టు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. అంతకంటే మంచి పోస్టులైన స్కూల్ అసిస్టెంట్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు అర్హత సాధించినప్పటికీ, ప్రభుత్వం వారికి ఆ పోస్టులు ఇవ్వలేదు. దీంతో 54 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.తాము ఎంతో కష్టపడి సాధించుకున్న ఉన్నతమైన పోస్టును కోల్పోతున్నామని, గతంలో కౌన్సెలింగ్ దశలో అభ్యర్థులకే పోస్టు ప్రాధాన్యం ఎంచుకునే వెసులుబాటు ఉండేదని, తమకు న్యాయం చేయాలని హైకోర్టును కోరారు. దీంతో ఉన్నత ఉద్యోగం అభ్యర్థి హక్కుగా హైకోర్టు పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వారికి ప్రాధాన్యత ఎంపిక విధానంలో కాకుండా ఉన్నత అర్హత గల ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు బేఖాతర్ హైకోర్టు తీర్పును ప్రభుత్వం పట్టించుకోకుండా ఆగస్టు 11న ఫలితాలను, 21న మెరిట్ లిస్టును ప్రకటించడంతోపాటు ఈ తీర్పుపై డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసింది. అక్కడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. అయినప్పటికీ ప్రభుత్వం హడావుడిగా గతేడాది సెపె్టంబర్లో పోస్టింగులు సైతం పూర్తి చేసింది. దీనిపై హైకోర్టు సెపె్టంబర్ 12న మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ మెరిట్ విద్యార్థులకు పోస్టులు ఇవ్వాల్సిందేనని మరోసారి ఆదేశించింది. కానీ దీన్ని కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోకుండా సెపె్టంబర్ 15న సెలక్షన్ లిస్టును విడుదల చేసి, ప్రభుత్వం మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు బెంచ్ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసి, మెరిట్కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. డిసెంబర్ 29న తుది తీర్పునిస్తూ మెరిట్కే ప్రాధాన్యమివ్వాలని ఆదేశించింది. ఇప్పటికే పోస్టింగ్స్ పూర్తయ్యాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో హైకోర్టు మండిపడింది. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను పట్టించుకోకుండా ఎలా పోస్టులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించిన 54 మంది మెరిట్ అభ్యర్థులతోపాటు ఆర్థి కారణలతో హైకోర్టుకు వెళ్లలేని వారికీ న్యాయం దొరుకుతుందని అంతా భావించారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును పాటించకుండా మరోసారి అప్పీల్కు వెళ్లే యోచన చేస్తుండడం గమనార్హం. న్యాయస్థానాన్ని సైతం లెక్క చేయని ప్రభుత్వ తీరుపై అభ్యర్థులు, యువజన సంఘాలు మండిపడుతున్నాయి. -
పంతం నెగ్గించుకున్న టీడీపీ మద్యం సిండికేట్
సాక్షి, అమరావతి: టీడీపీ మద్యం సిండికేట్ పంతం నెగ్గించుకుంది. బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్ను (ఏఆర్ఈటీ) రద్దు చేసిన తర్వాతే కొత్త బార్లకు నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని శాసించింది. సిండికేట్ చెప్పినట్లే చంద్రబాబు ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏఆర్ఈటీ రద్దు చేసిన విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో మిగిలి ఉన్న 301 బార్లకు లైసెన్సులు ఇచ్చేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 6 వరకు ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రీడ్ విధానాల్లో ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించనుంది. జిల్లా కలెక్టర్లు ఫిబ్రవరి 8న లాటరీ విధానంలో బార్లకు లైసెన్సులు కేటాయిస్తారు. ఏఆర్ఈటీ రద్దు కోసం ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో టీడీపీ సిండికేట్ పక్కాగా కథ నడిపింది. రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపు కోసం గత ఏడాది ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ టీడీపీ సిండికేట్ అన్ని బార్ల లైసెన్సుల కోసం ఉద్దేశ పూర్వకంగానే దరఖాస్తులు దాఖలు చేయలేదు. ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంది. రెండు మూడు సార్లు నోటిఫికేషన్లు జారీ చేసినా సరే.. 840 బార్లలో కేవలం 499 బార్లకే దరఖాస్తులు దాఖలయ్యాయి. వాటిని సిండికేట్ ఏకపక్షంగా దక్కించుకుంది. మరో 301 బార్లను పెండింగులో ఉండేట్టు చేసింది. ఏఆర్ఈటీ రద్దు చేస్తే తప్ప.. ఆ బార్ల లైసెన్సులకు దరఖాస్తు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయాన్ని కృత్రిమంగా సృష్టించేందుకే ఈ డ్రామాను రక్తి కట్టించింది. అంతా స్క్రిప్ట్ ప్రకారం సాగిన ఈ డ్రామాలో అసలు ఘట్టానికి ఈ నెల మొదటి వారంలో తెర తీశారు. బార్లపై 15 శాతం ఏఆర్ఈటీని రద్దు చేస్తూ మంత్రి మండలి నిర్ణయించింది. ఆ వెంటనే ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో తమ పంతం నెగ్గడంతో పెండింగులో ఉన్న 301 బార్ల లైసెన్సుల ప్రక్రియకు పచ్చ జెండా ఊపింది. ఆ బార్ల లైసెన్సులను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సన్నద్ధమవుతోంది. రూ.2 వేల కోట్ల దోపిడీకి పచ్చజెండా మద్యం సిండికేట్కు ప్రభుత్వం తలొగ్గడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడనుంది. ఎల్లో సిండికేట్ అడ్డగోలు లాభాలు సాధించేందుకు చంద్రబాబు సర్కారు మార్గం సుగమం చేసింది. బార్లకు సరఫరా చేసే మద్యంపై ప్రస్తుతమున్న 15 శాతం ఏఆర్ఈటీని ఈ నెల మొదటి వారంలో రద్దు చేసింది. దాంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.340 కోట్లు గండి పడుతుందని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కానీ వాస్తవానికి రూ.500 కోట్ల వరకు గండి పడుతుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆ ప్రకారం రానున్న నాలుగేళ్లలో రూ.2 వేల కోట్ల మేర ప్రభుత్వం నష్టపోనుంది. అంటే.. టీడీపీ సిండికేట్ గల్లా పెట్టె మరో రూ.2 వేల కోట్లతో కళకళలాడనుంది. అప్పట్లోనూ ప్రివిలేజ్ ఫీజు రద్దు దందా2014–19లో కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇదే రీతిలో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దుచేసి టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి కొమ్ము కాసింది. ఆర్థిక శాఖ అనుమతిగానీ, కేబినెట్ ఆమోదంగానీ లేకుండానే 2015లో మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 216, 217 పేరుతో రెండు చీకటి జీఓలు జారీ చేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టింది. దీనిపై బాబు మీద కూడా కేసు నమోదైంది. -
బట్టలిప్పి ఫోన్ చెయ్యి..
సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్లు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాత్రి వేళ కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్న శ్రీధర్ మహిళా ఉద్యోగినికి వీడియో కాల్ చేశారు. ‘నువ్వు వద్దంటే చచ్చిపోతాను.. నువ్వు లేకుండా ఉండలేను’ అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. మరో వీడియోలో శ్రీధర్ అర్ధరాత్రి వరకు చేసిన వాట్సాప్ మెసేజ్లు బయటపడ్డాయి. ఆమె వద్దని ఎంతగా వారించినా ఆయన ఏ మాత్రమూ వినిపించుకోలేదు. వీడియో కాల్ చేసి ఆమెను ‘నైటీ తీసెయ్’ అంటూ బలవంతం చేశారు. బాధిత మహిళ ప్రతిఘటించినా.. ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు. తాను అర్ధనగ్నంగా మారి వీడియో కాల్ చేయడమే కాకుండా.. మహిళను సైతం నగ్నంగా కనిపించాలంటూ బెదిరించారు. పత్రికల్లో రాయలేని అసభ్యకర సందేశాలను బాధితురాలికి అర్ధరాత్రి సమయంలో శ్రీధర్ పంపించినట్లు ఆ వీడియోలో ఉంది. కాగా, శ్రీధర్ తననే కాకుండా కనిపించిన ప్రతి మహిళనూ వక్ర బుద్ధితోనే చూస్తాడని బాధిత మహిళ తెలిపారు. వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్యే శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు. -
కేంద్ర ఆర్థిక ‘సర్వే’ సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం.. 'రీ సర్వే' సూపర్
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా.. పార్లమెంట్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ మరోసారి రుజువైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన భూ సంస్కరణలపై బురద చల్లుతూ చంద్రబాబు ఆడిన కపట నాటకం బట్టబయలైంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ.. ఆంగ్లేయుల తరువాత వందేళ్ల అనంతరం దేశంలో తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే యజ్ఞం ఫలితాలను తాజాగా కేంద్ర ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన కీలక మార్పులు, ప్రతి అడుగులో రైతన్నలకు తోడుగా నిలిచిన ఆర్బీకేలు, విప్లవాత్మక రీతిలో అమలు చేసిన భూ సంస్కరణలను అభినందించింది. వైఎస్ జగన్ హయాంలో నిర్వహించిన భూ రీ సర్వే ఫలితాలను వివరిస్తూ కేంద్ర ఆర్థిక సర్వే(2025–26)లో పేర్కొన్న భాగం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అమలు చేసిన సమగ్ర భూ సర్వే ఫలాలను సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాల్లో ఎలా వేసుకున్నారో దేశానికి చాటి చెప్పింది. మాజీ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన భూ సంస్కరణలు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేసి పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా తెచ్చిన ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ విధానాలకు కేంద్రం కితాబిచ్చింది. ఇక వ్యాపార వాతావరణ అనుకూల విధానాల్లో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పారిశ్రామిక అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేసిందని, 2023–24లో మహిళల నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది. ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ఆర్థిక సర్వే నివేదిక 2025–26 ప్రవేశపెట్టారు. ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిళ్లుభూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో భూముల రీ సర్వే ప్రాజెక్టును ప్రారంభించిందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. రీ సర్వేకు డ్రోన్ టెక్నాలజీని వినియోగించడంతో పాటు కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్లు (సీవోఆర్ఎస్), జీఐఎస్ సాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిళ్లను జారీ చేసినట్లు ఆర్థిక సర్వే ప్రధానంగా ప్రస్తావించింది. సమగ్ర భూ సర్వేలో భాగంగా 6,901 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారని, 81 లక్షల భూ కమతాలను రీ సర్వే చేశారని వెల్లడించింది. తద్వారా సుమారు 86,000 సరిహద్దు వివాదాలను పరిష్కారమయ్యాయని స్పష్టం చేసింది. దాదాపు 15 వేల మంది సర్వేయర్లను నియమించి రైతులకు పైసా ఖర్చు లేకుండా భూముల సమగ్ర సర్వేను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టడం తెలిసిందే. సచివాలయాల సిబ్బంది పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వే ద్వారా తొలిసారిగా డ్రోన్లు, రోవర్లు, విమానాలను వినియోగించి సర్వే చేశారు. భూములకు జియో హద్దులు నిర్ణయించి పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్లు ముద్రించారు. ట్యాంపరింగ్కు వీలులేని విధానాల ద్వారా భూ రికార్డుల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. సర్వే రాళ్లు విలక్షణంగా ఉంటేనే అందరికీ తెలుస్తుందనే ఉద్ధేశంతో 1.25 కోట్ల సర్వే రాళ్లను పాతించారు. అంతేకాదు.. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవలను సచివాలయాల్లోనే పొందే సౌలభ్యం కల్పించారు. నిర్విరామంగా ఒక మహాయజ్ఞంలా జరిగిన రీ సర్వే కార్యక్రమంలో సర్వే ఆఫ్ ఇండియా కూడా పాలుపంచుకుంది. కేరళ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలు రీ సర్వే మోడల్పై అధ్యయనం చేసి టెక్నాలజీ సాయం కోరాయి. ఆర్బీకేలతో పంటలకు మెరుగైన ధరలురైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మెరుగైన ధరలు కల్పించే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన రైతు భరోసా కేంద్రాలు, ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను కళ్లాల నుంచే నేరుగా తమకు నచ్చిన ధరకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ వైఎస్సార్ సీపీ హయాంలో ‘ఈ–ఫార్మర్ మార్కెట్’ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేస్తూ, మన పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా దీన్ని తెచ్చింది. మండీలకు ప్రత్యామ్నాయంగా రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రాసెసర్లను అనుసంధానిస్తూ దేశంలో తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు వ్యాపారులు పోటీపడి ముందుకొచ్చారు. వీరిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కూడా ఉండటం గమనార్హం.ఈ– ఫార్మర్ మార్కెట్తో ప్రయోజనాలెన్నో..⇒ దళారీల ప్రమేయం ఉండదు. ఎలాంటి ఫీజులు, రుసుములు లేకుండా కళ్లాల నుంచే అమ్ముకోవచ్చు.⇒ ఉత్పత్తి లభ్యత, పంట వివరాలు, నాణ్యత వివరాలను ఎలక్ట్రానిక్ పోర్టల్లో నమోదు చేస్తే ఇదే పోర్టల్లో వ్యాపారులు నేరుగా రైతులతో సంప్రదించి కొనుగోలు చేస్తారు. నగదు రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు.పరిశ్రమలకు సింగిల్ విండో అనుమతులుబిజినెస్ రీఫార్మ్ యాక్షన్ ప్లాన్ (బీఆర్ఎపీ) 2024 ద్వారా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు, ఆన్లైన్లో భూమి రిజిస్ట్రేషన్, పర్యావరణ అనుమతులు జారీ చేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించినట్లు కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది.తయారీ రంగంలో మహిళా యాజమాన్య సంస్థల సత్తాదేశంలో మహిళా యాజమాన్యంలోని సంస్థల వాటా పెరుగుతోందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. 2021 – 2022లో 24.2 శాతం ఉండగా 2023 – 24లో 26.2 శాతానికి పెరిగినట్లు తెలిపింది. 2023–24లో మహిళా యాజమాన్యంలోని సంస్థలకు సంబంధించి తయారీ రంగంలో వాటా అత్యధికంగా 58.4 శాతం ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ అత్యధిక వాటా కలిగిన రాష్ట్రాల్లో నిలిచింది.⇒ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కృషి చేసినట్లు కేంద్ర ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ⇒ కోవిడ్ మహమ్మారి తరువాత విదేశీ విద్యార్ధులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, 2023 గణాంకాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది. -
వైఎస్ జగన్ సంస్కరణలను కొనియాడిన కేంద్ర ఆర్థిక సర్వే
సాక్షి,న్యూఢిల్లీ: తన హయాంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక శాఖ కొనియాడింది. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు)పై కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసల వర్షం కురిపించింది.రైతులను, వర్తకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఆర్బీకేల ద్వారా ఈ-ఫార్మ్ మార్కెట్ ప్లాట్ఫామ్ను రూపొందించారని సర్వే పేర్కొంది. రైతులకు అండగా నిలిచిన ఆర్బీకేలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయని స్పష్టంగా తేల్చింది.అంతేకాకుండా, మహిళా సాధికారత కోసం జగన్ చేపట్టిన సంస్కరణలకూ సర్వే ప్రత్యేకంగా ప్రశంసలు తెలిపింది. 2023-24లో ఉత్పాదక రంగంలో మహిళల యాజమాన్యంలో ఉన్న సంస్థల వాటా గణనీయంగా పెరిగిందని, మహిళా కార్మిక భాగస్వామ్య రేటు కూడా అధికంగా నమోదైందని ఆర్థిక సర్వే వెల్లడించింది.ఇదీ చదవండి: ఏపీలో భూ రీసర్వే జగన్ విజనే.. భేష్ -
వైఎస్ జగన్ను కలిసిన ఖమ్మం వైఎస్సార్సీపీ అభిమానులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఖమ్మం వైఎస్సార్సీపీ అభిమానులు కలిశారు. ఇటీవల వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారన్న కారణంతో ఏకంగా 11 మంది వైఎస్సార్సీపీ అభిమానులపై క్రిమినల్ కేసులు పెట్టి, అందులో 8 మందిని 13 రోజుల పాటు రిమాండ్కు పంపిన వైనాన్ని అభిమానులు.. వైఎస్ జగన్ను కలిసి వివరించారు.తమపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టి నాన్బెయిలబుల్ సెక్షన్లతో జైలుకు పంపారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, క్యాడర్ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పార్టీ క్యాడర్కు అవసరమైన న్యాయ సహాయాన్ని అందించేందుకు పార్టీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ సీనియర్ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ను ఖమ్మం జిల్లా అభిమానులు ఆలస్యం సుధాకర్, మర్రి శ్రీనివాస్, యర్రా నాగరాజు రెడ్డి, గంగారపు మురళీ, సరికొండ రామరాజు, గంగరబోయిన రవి, పగిళ్ళ నాగేష్, ముదిరెడ్డి శివారెడ్డి కలిశారు. -
‘నాకు, ఎమ్మెల్యే శ్రీధర్కు మధ్యే వివాదం’
అమరావతి: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్పై మరో వీడియో విడుదల చేసింది బాధితురాలు. తనను ఎవరో రెచ్చగొట్టి పంపారనే వార్తలపై బాధితురాలు స్పందించింది. తనన ఏ పార్టీ రెచ్చగొట్ట పంపలేదన్నారు. తనకు జరిగిన అన్యాయంపైనే మీడియా ముందుకు వచ్చానని ఆమె స్పష్టం చేశారు. కూటమి నేత తాతంశెట్టి నాగేంద్ర కొంతమంది పేర్లు చెప్పి తనను బద్నాం చేస్తున్నారన్నారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం కొనసాగిస్తానన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే మోసం చేశారని, అందుకే అన్ని విషయాలు బయటపెట్టానన్నారు. తప్పు ఎవరిదైతే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు బాధిత మహిళ. తనకు ఎమ్మెల్యే నుంచి ఒక్క రూపాయి కూడా వద్దని స్పష్టం చేసింది. కాగా, బాధిత మహిళతో కూటమి పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర చెప్పిన మాటలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘ఇంక నిన్ను వాళ్లు కలుపుకోరు.. నువ్ మోసపోయావ్.. అయ్యిందేదో అయ్యింది.. నువ్ సర్దుకుపోవడం మంచిది’ అంటూ సదరు బాధిత మహిళతో నాగేంద్ర తెర వెనుక రాజీ చేసే యత్నం చేశారు. ఎమ్మెల్యే అరాచకాలు బయటకు రాకుండా ఆపేందుకు తెర వెనుక కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారనే దానికి ఇదొక ఉదాహరణ. కూటమి స్థానిక నేత తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా బాధితురాలికి నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడారు. శ్రీధర్ ఇంటిలో ఒప్పుకోవడం లేదని, జరిగింది మరచిపోయి సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. ఇంకా అతనే కావాలని వెళితే మళ్లీ మళ్లీ మోసపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నీ కొడుకు కోసం అన్నీ వదిలేసి ముందుకు వెళ్లిపోవాలంటూ సలహా ఇచ్చారు. నిన్ను దూరం చేసుకుంటున్నందుకు ఎమ్మెల్యే బాధ పడతారని తాను అనుకోవడం లేదని నాగేంద్ర అన్నారు. బెంగళూరులో తన కుమారుడు చదివే కాలేజీ అమ్మాయిలతోనూ ఎమ్మెల్యే శ్రీధర్ ఫ్లర్ట్ (లోబరుచుకునే ప్రయత్నం) చేశారని, ఆ విషయం తన కుమారుడి ద్వారా తెలిస్తే తాను ఆ విషయం బయటకు రాకుండా సర్ధి చెప్పానని ఆయన కొత్త విషయాన్ని బయటపెట్టారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు -
వివాదాస్పద ఫ్లెక్సీలపై YSRCP ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: వివాదాస్పద ఫ్లెక్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ అంటూ పలుచోట్ల టీడీపీ.. ఫ్లెక్సీలు పెట్టించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలను కూడా కూటమి నేతలు బేఖాతరు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.సీబీఐ నివేదికతో అడ్డంగా దొరికినా కూడా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ పాపపు ప్రచారం ఇంకా ఆగడం లేదు. రాష్ట్రవాప్తంగా పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శిలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి నిజం.. మహా పాపం నిజం.. అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలను వైఎస్సార్సీపీ శ్రేణులు తొలగించగా.. ఆ పార్టీ కార్యకర్తలపై ఎస్ఐ మురళి దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ శ్రేణులను అరెస్ట్ చేశారు.తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయ్యిందంటూ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలపై మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు టీటీడీ మాజీ ఛైర్మన్లు భూమన కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను వేశారు. వైఎస్సార్సీపీ హయాంలో (2019-24) మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిజనిజర్ధాణలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని న్యాయస్థానాలు కూడా తప్పుబట్టాయి. ఈ క్రమంలో.. దర్యాప్తు జరిపిన సీబీఐ నెయ్యి శాంపిల్స్లో ఎలాంటి కల్తీ జరగలేదని తేల్చింది. ఈ నేపథ్యంలో రివర్స్లో ఇలాంటి చేష్టలకు దిగడం గమనార్హం. -
తిరుమల లడ్డూపై కూటమి కుట్ర బట్టబయలు: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి వెల్లడించారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టంగా తేల్చడంతో, ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు కొత్త కుట్రలకు తెర తీశారని ఆయన మండిపడ్డారు.‘మహా పాపం నిజం’ అంటూ పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, మళ్లీ విష ప్రచారానికి దిగారని ఆక్షేపించారు. దేవుణ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, అలా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలతో చెలగాటమాడుతోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎం.మనోహర్రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..:సీబీఐ ‘సిట్’ ఛార్జ్షీట్లో ఏముంది?:తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు’ అని సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది. ఆ మేరకు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ‘తిరుమలలో వాడిన నెయ్యిలో పంది, చేప తదితర జీవుల కొవ్వు కలవనే లేదు’ అందులో తేల్చి చెప్పింది. హరియాణలోని ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్డీఆర్ఐ), గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని సిట్ తన ఛార్జ్షీట్లో పేర్కొంది.ప్రజలను మభ్యపెట్టేలా మళ్లీ కొత్త కథనాలు:తిరుమలలో వాడిన నెయ్యిపై సీబీఐ సిట్ ఛార్జ్షీట్తో తమ కుట్ర బెడిసి కొట్టడంతో, ఎదురుదాడి మొదలుపెట్టిన టీడీపీ కూటమి, మాట మార్చి కల్తీ నెయ్యి, కెమికల్ నెయ్యి అంటూ కథనాలు రాస్తోంది. ఇంకా మరో అడుగు ముందుకేసి.. ‘మహా పాపం నిజం’ అంటూ పలుచోట్ల వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, విష ప్రచారానికి దిగింది. ప్రజాక్షేత్రంలో జగన్గారిని ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వ హననంతో పాటు, వైఎస్సార్సీపీని అప్రతిష్ట పాల్జేసే కుట్ర, దురుద్దేశంతో అలా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేస్తున్నారు.అది హిందూ ధర్మంపై దాడి:దేవుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ చంద్రబాబులో ఏమాత్రం మార్పు రాలేదు. లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ సిట్లో ఆధారాలు లేకపోవడంతో ఎలాగైనా కల్తీ మకిలీని వైయస్ఆర్సీపీకి అంటించాలనే దుర్మార్గపు ఆలోచనతో కోర్టు సూచనలను, సీబీఐ నివేదికలను కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది, ఇది ప్రజల విశ్వాసంతో పాటు, హిందూ ధర్మంపై దాడి చేయడమే.ఫిర్యాదు చేస్తాం.. కోర్టునూ ఆశ్రయిస్తాం:సీబీఐ, సిట్ ఛార్జిషీట్లో లేని అంశాలను పోస్టర్ల రూపంలో ప్రచారం చేయడం చట్టవిరుద్ధం, దీనిపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేస్తాం. అంతే కాకుండా ఈ అంశంపై హైకోర్టులో న్యాయపోరాటం చేయడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఉంది. వాటన్నింటినీ కోర్టులో ప్రవేశపెట్టి నిజాలు బయటపెడతాం. ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా, దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గం. అందుకే పోలీసులకు ఫిర్యాదుతో పాటు, న్యాయ పోరాటం కూడా చేస్తామని ఎం.మనోహర్రెడ్డి స్పష్టం చేశారు. -
‘పవన్ ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారో..’
సాక్షి,నగరి: రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీసిందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంలో సీబీఐ రిపోర్టుపై గురువారం ఆమె చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడారు.తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇచ్చింది. రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీశారు. కూటమి నేతల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శిక్షించాలి. చంద్రబాబు ప్యాకేజీ అందగానే పవన్ ఊగిపోయాడు.సనాతన ధర్మం ముసుగులో ప్యాకేజీల కోసం ఆడించే డ్రామా ఆర్టిస్టులు. పవన్ ఏ గుడిమెట్లు కడుగుతారో చెప్పాలి. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?.వైఎస్ జగన్ కాళ్లు కడిగి చంద్రబాబు, పవన్ నెత్తిన చల్లుకోవాలి. ఆడవాళ్లకు అబార్షన్లు చేయించి.. రోడ్డున పడేసిన వాళ్లు.. సనాతన ధర్మాన్ని కాపాడుతారా?. తప్పుడు ప్రచారం చేసిన నోర్లను పినాయిల్తో కడగాలి. శ్రీవారి భక్తులకు చంద్రబాబు, పవన్ ఏం సమాధానం చెప్తారు.విజయవాడ మునిగినప్పుడు చంద్రబాబు, ఇతర మంత్రులు హైదరాబాద్లో ఉన్నారు. కూటమి నేతలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు’అని మండిపడ్డారు. -
ఏపీలో భూ రీసర్వే జగన్ విజనే.. భేష్
సాక్షి, ఢిల్లీ: తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తున్న కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆర్థిక సర్వేలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి విజన్ను కేంద్రం కొనియాడింది. వ్యవసాయ రంగంలో.. 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. ‘‘2021లో అప్పటి ఏపీ ప్రభుత్వం భూ రీసర్వే ప్రాజెక్టును చేపట్టింది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి జీఐఎస్ సహాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ఇచ్చారు. మొత్తం 6,901 గ్రామాల్లో ఈ రీసర్వే జరిపారు. మొత్తంగా 81 లక్షల భూముల పునః సర్వే జరిగింది. దాదాపు 86 వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయి’’ అని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో.. చంద్రబాబు అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా మరోసారి పటాపంచలు అయ్యాయి. భూ సర్వే జగన్ విజనేనంటూ కేంద్రం కూడా బాబుకి షాకిచ్చినట్లైంది. -
చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్రెడ్డి, వెంకటేష్ నాయుడులకు సైతం బెయిల్ ఇచ్చింది.వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని.. ఇందులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాత్ర కూడా ఉందంటూ జూన్17వ తేదీన సిట్ బెంగుళూరులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి కుంభకోణానికే ఆస్కారమే లేదని.. ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో భాధపడుతున్నప్పటికీ కూడా చెవిరెడ్డి సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టింది కూటమి ప్రభుత్వం. చివరకు 226 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ ద్వారా ఉపశమనం లభించింది. సిట్ అభియోగాలుడిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అందుకున్నారని.. ఆ సొమ్మును గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహరించారంటూ అభియోగం నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ-38గా, భాస్కరరెడ్డి తనయుడు మోహిత్రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొనడం గమనార్హం. -
లూథ్రాకు డబ్బే డబ్బు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదంటూ రూ.50 వేల బిల్లు కూడా చెల్లించకుండా గుత్తేదారులను ముప్పుతిప్పలు పెడుతూ వారిని హైకోర్టుకొచ్చేలా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రాకు మాత్రం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఫీజుల రూపంలో దోచిపెడుతోంది. ఆన్లైన్ లేదా భౌతికంగా కోర్టుకు అలా వచ్చి ఇలా వెళ్తే చాలు లూథ్రాకు కోట్లకు కోట్లు ఫీజుగా చెల్లిస్తోంది. వాదనలతో సంబంధంలేకుండా కోర్టుకు హాజరైతే చాలు కోట్లకొద్ది ప్రజాధనం ఆయన ఖాతాలో ఫీజుల రూపంలో జమ అవుతోంది. ఇలా ఇప్పటికే లూథ్రాకు రూ.8.62 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా ఆయనకు మరో రూ.1.92 కోట్లు చెల్లించింది. తద్వారా ఆయనకు ఇప్పటివరకు రూ.10.54 కోట్లు చెల్లించినట్లయింది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా పెట్టిన కేసులకు చంద్రబాబు ప్రభుత్వం ఇలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది లూథ్రాకు ఫీజుల చెల్లింపుల్లో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు.ఒక్కరోజు వాదనలకు రూ.10 లక్షలు..ఇక మద్యం అక్రమ కేసుల్లో సీఐడీ సిట్ తరఫున సిద్దార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. మద్యం కేసులో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 11425/2025)లో గత ఏడాది నవంబరు 25న ఒక్కరోజు వాదనలు వినిపించినందుకు లూథ్రాకు రూ.10 లక్షలను చంద్రబాబు ప్రభుత్వం ఫీజుగా చెల్లించింది. అలాగే, రిట్ పిటిషన్ నెంబర్ 32915/2025లో నవంబర్ 26, 27 తేదీల్లో వాదనలు వినిపించినందుకు రోజుకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు చెల్లించింది. సంబంధంలేని కేసులో రూ.20 లక్షలు చెల్లింపు..రిట్ పిటిషన్ నెంబర్ 12190/2025లో నవంబరు 28న వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షల చొప్పున రూ.20 లక్షలు చెల్లించింది. వాస్తవానికి.. ఈ పిటిషన్ మద్యం కేసుకు సంబంధించింది కాదు. ఇది ఓ ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన కేసు. ఈ కేసుతో సీఐడీకి ఎలాంటి సంబంధంలేదు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్దార్థ లూథ్రాకు రూ.20 లక్షలు చెల్లించడం విశేషం. మద్యం కేసులో నిందితుడు ముప్పిడి అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 10012/2025)లో సీఐడీ తరఫున వాదనలు డిసెంబరు 2న హాజరైనందుకు రూ.20 లక్షలు చెల్లించింది. ఇలా మొత్తం ఆయనకు రూ.70 లక్షలు చెల్లించింది. ఈ రూ.70 లక్షలకు 10 శాతం క్లర్కేజీ అంటే రూ.7 లక్షలు కలిపి మొత్తంగా రూ.77 లక్షలను లూథ్రాకు ధారబోసింది. ఆ మేరకు ప్రభుత్వం జీఓ ఆర్టీ–102 జారీచేసింది.ఐదు కేసులకు రూ.1.10 కోట్లు చెల్లింపు..మద్యం కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 6892/2025)లో సెప్టెంబరు 19న సీఐడీ తరఫున హాజరైనందుకు బాబు సర్కారు లూథ్రాకు రూ.10 లక్షలు చెల్లించింది. ఇదే కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ (సీఆర్ఎల్పీ 9365/2025)లో సెప్టెంబరు 23న హాజరైనందుకు రూ.10 లక్షలు.. ముప్పిడి అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 10012/2025)లో సెప్టెంబరు 24న హాజరైనందుకు రూ.50 లక్షలు.. చాణక్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (సీఆర్ఎల్పీ 9369/2025)లో సెప్టెంబరు 26న హాజరైనందుకు రూ.20 లక్షలు.. బాపనపాడు మైనింగ్ కేసులో పోలీసుల తరఫున సెప్టెంబరు 22న వాదనలు వినిపించినందుకు రూ.10 లక్షలు చెల్లించింది. ఇలా లూథ్రాకు రూ.కోటి చెల్లించింది. దీనికి 10 శాతం క్లర్కేజీ కలిపి రూ.1.10 కోట్లు చెల్లించింది. ఆ మేర జీఓ–104 జారీచేసింది. అదే రీతిలో కేసిరెడ్డి రాజశేఖర్రెడ్డి బెయిల్ పిటిషన్లో సీఐడీ తరఫున నవంబరు 18న వాదనలు వినిపించినందుకు రూ.5 లక్షలు చెల్లించింది. ఆ మొత్తానికి 10 శాతం క్లర్కేజీ రూ.50 వేలు కలిపి మొత్తంగా రూ.5.50 లక్షలు చెల్లిస్తూ జీఓ–103 జారీచేసింది. -
న్యాయాధికారులూ.. ఏఐతో జాగ్రత్త
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధస్సు (ఏఐ) అనేది కేవలం సమాచారాన్ని సమకూర్చుకోవడానికి ఉపయోగపడే సాధనం మాత్రమేనని, అది మానవ మేధస్సుకు లేదా సాక్ష్యాలను విశ్లేషించే సామర్థ్యానికి ప్రత్యామ్నాయం కానే కాదని హైకోర్టు స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు కంటే న్యాయమూర్తి తన మానవ మేధస్సుకే అధిక ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది. ఓ సివిల్ వివాదంలో అడ్వొకేట్ కమిషనర్ ఇచ్చిన నివేదికతో విభేదిస్తూ.. ఆ నివేదికను రద్దు చేయాలని గుమ్మడి ఉషారాణి, మరొకరు విజయవాడ కోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని కొట్టేస్తూ విజయవాడ కోర్టు న్యాయాధికారి గత ఏడాది ఆగస్టు 19న ఉత్తర్వులిచ్చారు. అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరం ఉంటే ట్రయల్ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్లో తేల్చుకోవాలని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో నాలుగు తీర్పులను ఉదహరించారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ గుమ్మడి ఉషారాణి, మరొకరు హైకోర్టులో సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి విచారణ జరిపారు. ముఖ్యంగా కింది కోర్టులు తమ తీర్పుల విషయంలో ఏఐ సాధనాలను ఉపయోగించే సందర్భాల్లో అత్యంత అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు న్యాయమూర్తి చెప్పారు. ఏఐ ఇచ్చే సమాచారాన్ని యథాతథంగా తీసుకోకుండా న్యాయాధికారులు తమ విచక్షణను, న్యాయపరమైన ఆలోచనను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తీర్పులు లేదా ఉత్తర్వులు ఎప్పుడూ చట్టపరమైన సూత్రాల ఆధారంగా ఉండాలే తప్ప, ఏఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉండకూడదని తేలి్చచెప్పారు. న్యాయ పరిశోధన కోసం ఏఐను ఉపయోగించే వారు, అది అందించే సమాచారాన్ని, తీర్పులను అత్యంత జాగ్రత్తగా, కఠినంగా పరిశీలించాలని సూచించారు. ‘ఏఐ సాధనాలు పైకి నమ్మకంగా, ప్రభావవంతంగా కనిపించే సమాధానాలు ఇవ్వగలిగినా అవి వాస్తవంగా, చట్టపరంగా తప్పయ్యే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏఐ అసలు ఉనికిలో లేని తీర్పులను సృష్టించడంతోపాటు సమస్యకు సంబంధం లేని తీర్పులను తప్పుగా అన్వయించవచ్చు. ఇది అత్యంత ఆందోళనకరమైన విషయం. కృత్రిమ మేధస్సు వల్ల గోప్యతకు భంగం కలగడంతో పాటు న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం దెబ్బతింటుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.అందుకే.. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం ‘ప్రస్తుత కేసులో కింది కోర్టు న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో ఏఐ సాధనాన్ని ఉపయోగించి ప్రస్తావించిన తీర్పులు అసలు ఉనికిలోనే లేవు. కానీ.. ఆ న్యాయాధికారి ఆ కేసుకు చట్టబద్ధమైన న్యాయసూత్రాన్ని మాత్రం సక్రమంగానే అన్వయించారు. సీపీసీ ప్రకారం అడ్వొకేట్ కమిషనర్ నివేదిక కేవలం ఒక సాక్ష్యం మాత్రమేనని, దానిపై అభ్యంతరాలుంటే ట్రయల్ సమయంలో క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా తేల్చుకోవచ్చని ఆ న్యాయాధికారి తన ఉత్తర్వుల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో కమిషనర్ నివేదికను కొట్టివేయాల్సిన అవసరం లేదని కూడా ఆ న్యాయాధికారి చెప్పారు. ఇదే చట్టబద్ధమైన న్యాయసూత్రం. దీనిని ఆ న్యాయాధికారి ఈ కేసుకు సరైన రీతిలో అన్వయింప చేశారు. ప్రస్తుత కేసులో కింది కోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపం గానీ, న్యాయపరిధి ఉల్లంఘన గానీ లేనే లేదు. అందువల్ల ఆ ఉత్తర్వుల్లో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోలేం’ అని తేల్చి చెప్పారు. ఉషారాణి, మరొకరు దాఖలు చేసిన సివిల్ రివిజన్ పిటిషన్ (సీఆర్పీ)ను కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరీ ఇటీవల తీర్పు వెలువరించారు. -
పేరుకుపోతున్న బకాయిలు
సాక్షి, అమరావతి: ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన వైద్యశాఖను ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తోంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలు సరఫరా చేసిన కంపెనీలకు ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు. రూ.వందల కోట్ల బిల్లులను కనీసం ప్రాసెస్ చేయకుండా ఏపీఎంఎస్ఐడీసీ స్థాయిలోనే తొక్కి పెట్టేస్తున్నారు. దీంతో మందులు, సర్జికల్స్ సరఫరా చేయలేమంటూ కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ప్రభుత్వం కంపెనీలకు ఏకంగా రూ.500 కోట్ల మేర బకాయి పడినట్టు తెలుస్తోంది. ఆ బిల్లులను రాబట్టుకోవడం కోసం సరఫరాదారులు వైద్య, ఆర్థిక, శాఖలతో పాటు ‘ముఖ్య’నేత కార్యాలయంలోని ఉన్నతాధికారులను ప్రాధేయç³డుతున్నప్పటికీ నిధులు మాత్రం రావడం లేదు. మొత్తం పెండింగ్ బిల్లుల్లో రూ.200 కోట్ల మేర ఇప్పటికే ఎంఎస్ఐడీసీ నుంచి ప్రాసెస్ చేసి సీఎఫ్ఎంఎస్కు ఎక్కించారు. రూ.150 కోట్ల మేర నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) బిల్లులు ఆగిపోయాయి. మరో రూ.150 కోట్ల మేర బిల్లులు పూర్తిస్థాయిలో ప్రాసెస్కు నోచుకోవడం లేదు. ఇంత పెద్దమొత్తంలో బిల్లులు నిలిచిపోవడంతో నాలుగో క్వార్టర్ సరఫరా చేయలేమని ఇప్పటికే పలు కంపెనీలు అధికారులకు తెగేసి చెప్పినట్టు సమాచారం. గత కొద్ది నెలలుగా బాబు గద్దెనెక్కిన నాటి నుంచి ప్రభుత్వాస్పత్రులను మందులు, సర్జికల్స్ కొరత వేధిస్తోంది. నిబంధనల మేరకు ఉండాల్సిన అన్ని మందులు, సర్జికల్స్ అందుబాటులో ఉండడం లేదు. మందులు బయట నుంచి తెచ్చుకోవాలట..ఈ నేపథ్యంలో మందులు, సర్జికల్స్ బయట కొనుక్కోవాలని రోగులకు సిబ్బంది చీటీలు రాసిస్తున్నారు. గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలోనూ డీఎంఈ ఆస్పత్రుల్లో వైద్యులు రాసిచ్చిన మందులు ఉచితంగా ఇవ్వలేదని దాదాపు 40 శాతం మేర రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇంత దుర్భర పరిస్థితులు ఉంటే సరఫరా అయిన అరకొర మందులకు కూడా ప్రభుత్వం కంపెనీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వాస్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీ నిధులను చెల్లించకపోవడంతో జీజీహెచ్లలో పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం సరఫరా చేయని మందులను జీజీహెచ్లకు వచ్చే ఆరోగ్యశ్రీ నిధులతో కొనుగోలు చేస్తుంటారు. ఆ నిధులను చెల్లించకపోవడంతో ఆస్పత్రులకు సైతం మందులు, సర్జికల్స్ ఇవ్వలేమని కంపెనీలు తేల్చి చెప్పేస్తున్నాయి. -
తిరుమల లడ్డూ కల్తీ అయిందనే చెప్పండి
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తాము చేసిన ప్రచారం తప్పని తేలిన నేపథ్యంలో బుధవారం కేబినెట్ భేటీలో చంద్రబాబు దానిపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. సిట్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిశాక చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై రాజకీయ అంశాలపై మాట్లాడారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై గతంలో తాము చేసిన ఆరోపణలను ఎలా సమర్థించుకోవాలనే దానిపైనే ఎక్కువసేపు చర్చించినట్లు సమాచారం. సిట్ ఇచ్చిన నివేదికలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని పేర్కొన్నారని, ఇది వైఎస్సార్సీపీకి ఆయుధంగా మారిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు తెలిసింది. దీనిపై బాబు స్పందిస్తూ.. సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రచారం చేయాలని, అసలు ఇంకా నివేదిక బయటకు రాలేదని చెప్పాలని సూచించినట్లు సమాచారం. గతంలో తాను చెప్పినట్లు జంతువుల కొవ్వు కలిసిందనే అంశాన్ని వదిలేసి కల్తీ జరిగిందనే విషయాన్ని మాత్రమే బయటకు చెప్పాలని.. అలాగే, పాలులేకుండా నెయ్యి తయారైందని ప్రచారం చేయాలని ఆయన సూచించారు. మరోవైపు.. సిట్ నివేదికను అధికారికంగా తెప్పించాలని, దానిపై ఇంకా ఎలా మాట్లాడాలో చూద్దామని అన్నట్లు సమాచారం. అయితే, ఇద్దరు మంత్రులు మాట్లాడుతూ.. ఇప్పటికే వైఎస్సార్సీపీ స్పీడుగా ఉందని చంద్రబాబు, టీడీపీ చెప్పినవన్నీ అబద్ధాలేననే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లారని అన్నట్లు తెలిసింది. అయినా పర్వాలేదని, సిట్ నివేదిక ఎలా ఉన్నా వెనక్కి తగ్గకుండా కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రచారం చేయాలని సీఎం సూచించినట్లు సమాచారం. సిట్ నివేదిక వైఎస్సార్సీపీకే వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుదామని, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి పీఏ అకౌంట్లో డబ్బులు జమ అయిన విషయాన్ని ఎక్కువగా మీడియాలో చెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.మంత్రుల పనితీరుపై అసంతృప్తి..చంద్రబాబు యథావిధిగా ఈ సమావేశంలోనూ మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కొందరికి తమ శాఖలపై ఏమాత్రం పట్టులేదని, తమకు సంబంధించిన సబ్జెక్టులపై కూడా మాట్లాడలేకపోతున్నారని, రాజకీయ విమర్శలను వెంటనే తిప్పికొట్టలేకపోతున్నారని చెప్పినట్లు సమాచారం. లడ్డూ విషయంలో సిట్ నివేదికపై వైఎస్సార్సీపీ దూకుడుగా వెళ్తున్నా తమ వాళ్లు ధీటుగా జవాబు ఇవ్వలేకపోయారని అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలిసింది. -
కేంద్ర కేబినెట్లో జనసేనకు చోటివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కళ్యాణ్ తన వర్గానికి పదవుల కోసం హస్తిన వేదికగా లాబీయింగ్కు తెరలేపారు. ఇటీవల సీఎం చంద్రబాబు ఇక్కడికొచ్చి తన బంధువు, రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలని కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పవన్ కూడా ఇప్పుడు అదే బాటపట్టారు. తనకు, సీఎం చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన లింగమనేని రమేష్కు రాజ్యసభ సీటు ఇవ్వాలని పైరవీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, తన పార్టీ లో కీలకంగా ఉన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలÔౌరికి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించాలని బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. లింగమనేని కోసం పవన్ ఆరాటం.. త్వరలో ఏపీకి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండడంతో వీటికోసం అటు టీడీపీ ఇటు జనసేన, బీజేపీ పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆశావహులు ఢిల్లీ వేదికగా పైరవీలు చేస్తుండగా.. సీఎం చంద్రబాబు ఇటీవల తన అస్మదీయుల కోసం అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్కు అత్యంత ఆప్తుడుగా ఉన్న కిలారు రాజేశ్కు రాజ్యసభ సీటు కేటాయించాలని చంద్రబాబు అడగ్గా.. కూటమిలో భాగస్వామిగా ఉన్న తమకు కూడా రాజ్యసభలో చోటు కల్పించాలని పవన్ తాజాగా పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయన కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏడాది క్రితం ఖాళీ అయిన రెండు స్థానాలను టీడీపీ ఒకరికి, బీజేపీ మరొకరికి పంచుకున్నాయి. అప్పట్లో పవన్ లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. అయితే, ఇప్పుడు ఖాళీ అయ్యే సీట్లలో జనసేన నుంచి లింగమనేని రమేష్కు అవకాశం కల్పించాలంటూ పవన్ అమిత్ షాను అడిగినట్లు తెలుస్తోంది. తమ పార్టీ కి మంత్రి పదవిస్తే వచ్చే ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని బీజేపీ అధిష్టానం ఎదుట పవన్ విన్నవించినట్లు సమాచారం. కాగా ఉప్పాడ సముద్ర రక్షణ కోసం గోడ నిర్మాణం, రాష్ట్రంలో పరిపాలన, ఇతర ముఖ్యమైన విషయాలపై కేంద్ర హోంమంత్రితో చర్చించినట్లు పవన్కళ్యాణ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
మరీ ఇంత మోసమా బాబూ!
సాక్షి, అమరావతి: అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని.. అవసరమైతే ఉన్న చార్జీలను తగ్గిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజలపై దాదాపు రూ.20 వేల కోట్ల చార్జీల భారాన్ని వేయడం అన్యాయమని, నమ్మినందుకు ఇంతగా మోసం చేస్తారా? అంటూ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు.2026–27 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన ఆదాయ, అవసరాల నివేదిక (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్–ఏఆర్ఆర్), రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) నాలుగు రోజులపాటు బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ నెల 20న తిరుపతిలో మొదలుపెట్టి.. 22, 23 తేదీల్లో విజయవాడ, 27న కర్నూలులో బహిరంగ విచారణల ద్వారా 71 మంది నుంచి అభిప్రాయాలను, అభ్యంతరాలను ఏపీఈఆర్సీ స్వీకరించింది. నేరుగా 32 మంది, వర్చువల్ (ఆన్లైన్) ద్వారా 39 మంది అభ్యంతరాలను వెల్లడించారు. బహిరంగ విచారణలో వచ్చిన సూచనలను పరిశీలించిన అనంతరం ఏపీఈఆర్సీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. దాని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వస్తుంది. చేస్తాం.. చూస్తాం బహిరంగ విచారణలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులపై విద్యుత్ సంస్థల సీఎండీలు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. ఏపీ ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్చంద్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి వచి్చన అభ్యంతరాలకు వివరణ ఇచ్చారు. స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని అందిన ఫిర్యాదులపై సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి స్పందిస్తూ.. కెపాసిటర్లు సరిగ్గా పెట్టుకోకపోవడం వల్లనే బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ప్రభుత్వ విభాగాల విద్యుత్ బకాయిలను, ప్రైవేటు సంస్థల బకాయిలను, కుప్పం రెస్కో బకాయిలను ఎందుకు వసూలు చేయలేదని వచ్చిన ప్రశ్నలపై ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటి స్పందిస్తూ.. వాటిలో అధిక శాతం కోర్టు కేసుల్లో ఉన్నాయని తెలిపారు. కుప్పం రెస్కోకు టారిఫ్ను నిర్ణయించాల్సిందిగా ఏపీ ఈఆర్సీని సీఎండీ కోరారు. టైమ్ ఆఫ్ డే బిల్లింగ్లో పీక్, ఆఫ్ పీక్ అవర్స్కు వేస్తున్న విద్యుత్ చార్జీలు, ఆక్వా రంగంలో విద్యుత్ సమస్యలపై వచి్చన ఫిర్యాదులకు ఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృధ్వీతేజ్ వివరణ ఇచ్చారు. వివిధ వర్గాలకు ఇస్తున్న ఉచిత, రాయితీ విద్యుత్ను గతం నుంచీ ఇస్తున్నట్టుగానే ఇకపైనా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంధన శాఖ అదనపు కార్యదర్శి కిశోర్కుమార్ తెలిపారు. ఈ మొత్తం బహిరంగ విచారణలో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, వైర్లు వంటి మెటీరియల్ కొనుగోళ్లపై ఆరోపణలు వస్తున్నాయని, భవిష్యత్లో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వచ్చే రెండు నెలల్లోగా ఏపీఈఆర్సీ నిబంధనలు (రెగ్యులేషన్) రూపొందిస్తుందని చైర్మన్ పీవీఆర్ రెడ్డి ప్రకటించారు. తొలి ఏడాదే రూ.15 వేల కోట్ల భారం వివిధ వర్గాలకు చెందిన ప్రజల నుంచి ఏపీఈఆర్సీ సభ్యుడైన పీవీఆర్ రెడ్డి ఇన్చార్జ్ చైర్మన్ హోదాలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. తొలి ఏడాదిలోనే రూ.15 వేల కోట్లకు పైగా భారం వేశారని, తర్వాత వేసిన వాటితో కలిపి ఇప్పటి వరకూ 4 విడతల్లో రూ.20 వేల కోట్లకుపైగా భారం మోపడంతో విద్యుత్ బిల్లులు రెట్టింపు అయ్యాయని, దీనిపై ఏపీఈఆర్సీ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరారు. డిస్కంలు ట్రూ అప్ పేరుతో వాస్తవ లెక్కలు కాకుండా అత్యధికంగా ప్రతిపాదనలు ఇస్తున్నారని, అది సమంజసం కాదని మండిపడ్డారు. జాతీయ రహదారులపై ఉండే వీధి దీపాలకు గ్రామాల పరిధిపి కేటగిరీ–4లో చేర్చాలని జాతీయ రహదారుల సంస్థ ప్రతినిధులు కోరారు. వాటర్ ప్లాంట్ వ్యాపారులకు విద్యుత్ బిల్లులు కేటగిరీ–2లోకి మార్చడం వల్ల బిల్లులు అధికంగా వస్తున్నాయని, వీటిని కేటగిరీ–3లోకి మార్చాలని వాటర్ ప్లాంట్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడ, కర్నూలులో విజ్ఞప్తి చేశారు. -
ఇది నారా వారి నామినేషన్.. కమీషన్లదే డామినేషన్
సాక్షి, అమరావతి : రూ.లక్షలోపు విలువైన పనులను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ).. రూ.2 లక్షలలోపు విలుౖవెన పనులను సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్ఈ).. రూ.3 లక్షలలోపు విలువైన పనులను ఛీఫ్ ఇంజినీర్ (సీఈ) నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చన్నది ప్రభుత్వ నిబంధన. అదికూడా వరదలు, కరువు వంటి పరిస్థితులు సంభవించినప్పుడు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించాలన్నది నిబంధన. ఆ పనులకు టెండర్లు పిలిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుండదు కాబట్టి నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులుబాటు కల్పించారు. ఇటీవల కాలువల మరమ్మతులు, పూడికతీత వంటి సాగునీటి సంఘా కు చెందిన రూ.10 లక్షల వరకూ విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పగించేలా నిబంధనలను సవరించారు. ఈ నిబంధనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిన ప్రభుత్వమే.. వాటికి నిలువునా పాతరేసింది.ఏకంగా రూ.247.12 కోట్ల పనులకూ ‘నామినేషన్’రూ.లక్ష కాదు.. రూ.2 లక్షలు కాదు. పోలవరం ప్రాజెక్టులో ఏకంగా రూ.247.12 కోట్ల విలువైన పనులను అస్మదీయ కాంట్రాక్టు సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేయడానికి బుధవారం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రధాన డ్యామ్ గ్యాప్–1, గ్యాప్–2లో బట్రెస్ డ్యామ్, ప్రధాన డ్యామ్ నిర్మాణానికి ఇప్పటికే తవ్విన రాయి, మట్టితోపాటు అదనంగా అవసరమయ్యే మట్టి, రాళ్లను 902 హిల్ నుంచి తవ్వి తీసుకునే పనులను ఆ ప్రాజెక్టు పనులు చేస్తున్న మేఘా సంస్థకే నామినేషన్పై కట్టబెట్టేయడం గమనార్హం. అస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో భారీ ఎత్తున పనులు కట్టబెట్టి, ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడం 2014–19 మధ్య అప్పటి ప్రభుత్వ ముఖ్యనేతలు రివాజుగా మార్చుకున్నారు. పోలవరం హెడ్వర్క్స్ పనుల్లో రూ.2,917 కోట్ల పనులను నవయుగ సంస్థకు నామినేషన్పై కట్టబెట్టడమే అందుకు పరాకాష్ట. దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. కృష్ణా పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి నీరు–చెట్టు పనుల వరకూ రూ.15 వేల కోట్లకు పైగా విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టింది.వైఎస్సార్సీపీ హయాంలో మంగళం పాడేసినా..వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామినేషన్ పద్ధతికి మంగళం పాడింది. 2019–24 మధ్య ఐదేళ్లలో నామినేషన్పై పనులు అప్పగించకుండా టెండర్ల ద్వారా పారదర్శకంగా పనులు అప్పగించింది. పోలవరం హెడ్ వర్క్స్లో చంద్రబాబు సర్కార్ నవయుగకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టిన పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసి.. వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. తక్కువ ధరకు కోట్ చేసిన మేఘా సంస్థకు అప్పగించింది. తద్వారా ఖజానాకు రూ.680 కోట్లను ఆదా చేసింది. కేంద్ర జలసంఘం సూచనల మేరకు పోలవరం ప్రాజెక్టులో స్పిల్ ఛానల్కు ఆర్సీసీ డయాఫ్రం వాల్ ఎండ్ కటాఫ్, ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో వైబ్రో స్టోన్ కాలమ్స్–డీప్ సాయిల్ మిక్సింగ్, గ్యాప్–1లో డయాఫ్రం వాల్ కటాఫ్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్, స్పిల్ వే, స్పిల్ ఛానల్కు ఇరువైపులా ఏటవాలుగా రక్షణ పనులకు 2021 మే 7న రూ.683 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.669.47 కోట్లకు మేఘాకు అప్పగించింది. తద్వారా ఖజానాకు రూ.13.53 కోట్లను ఆదా చేసింది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం వరద ఉద్ధృతి వల్ల కోతకు గురైన ప్రాంతాన్ని యథాస్థితికి తేవడం, సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు మరమ్మతులు చేసే పనులకు 2023 ఏప్రిల్ 28న 1615.75 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచింది. రివర్స్ టెండరింగ్ ద్వారా 1,599.21 కోట్లకు మేఘాకు అప్పగించింది. దీనివల్ల ఖజానాకు రూ.16.54 కోట్ల ఆదా అయ్యాయి. ఇప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణానికి అదనంగా అవసరమైన మట్టి, రాయిని 902 హిల్ నుంచి సమకూర్చుకునే పనులకు టెండర్లు నిర్వహించకుండా నామినేషన్ పద్ధతిపై బాబు సర్కార్ అప్పగించడం వెనుక కారణాలు ఏమిటన్నది బహిరంగ రహస్యమేనని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. హంద్రీ–నీవాతో షురూచంద్రబాబు సర్కార్ 2024లో అధికారంలోకి వచ్చీ రాగానే హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనుల ద్వారా నామినేషన్ దందాకు తెరతీసింది. ఈ కెనాల్ను 79.6 కి.మీ. నుంచి 220.35 కి.మీ. వరకూ వెడల్పుచేసి, ప్రవాహ సామర్థ్యం పెంచే పనులకు రూ.1,929 కోట్ల వ్యయంతో 2021 సెప్టెంబర్ 4న వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాంకేతిక అనుమతి ఇచ్చింది. ఈ పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.1,217.49 కోట్లకు ఎన్సీసీ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుని.. వాటిని పూర్తిచేయానికి 2023 ఫిబ్రవరి 1న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ పనులను ఎన్సీసీ సంస్థ ఇప్పటివరకూ పూర్తిచేయలేదు. 25 శాతంలోపు మాత్రమే పనులు పూర్తయ్యాయని అధికార వర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. వాస్తవానికి.. ఏదైనా పని పూర్తయ్యాకే ఆ పనికి కేటాయించిన నిధుల్లో ఎంత మిగిలాయన్నది తేల్చవచ్చు. కానీ.. ఇక్కడ పనులు పూర్తికాకముందే వాటికి ప్రభుత్వం ఇచ్చిన సాంకేతిక అనుమతిలో రూ.711.51 కోట్ల మేర మిగులు ఉందని తేల్చడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో రూ.480.22 కోట్ల వ్యయంతో పుంగనూరు బ్రాంచ్ కెనాల్కు 75.075 కి.మీ. నుంచి 207.80 కి.మీ. వరకూ లైనింగ్ చేసే పనులను నామినేషన్ పద్ధతిలో ఎన్సీసీ సంస్థకు అప్పగిస్తూ 2024 డిసెంబర్ 24న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అంతా బాబు దుష్ప్రచారమే.. రాజకీయ రాద్ధాంతమే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. ‘తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు..’ అని సీబీఐ స్పష్టం చేసింది. ‘పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదు..’ అని తేల్చి చెప్పింది. హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’, గుజరాత్లోని ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యి లో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసింది. అనంతరం చార్జ్షీట్ను నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానంలో ఇటీవల సమర్పించింది. మరోవైపు సీబీఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల ఎల్లో మీడియాకు లీకులు ఇచ్చి దుష్ప్రచారానికి యత్నిస్తున్నారు. కాగా అసలు సీబీఐ దర్యాప్తులో ఏం వెల్లడైందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు తాజాగా బహిర్గతమయ్యాయి. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తులో నిగ్గు తేలింది. సీబీఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారికంగా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి..టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదువైఎస్సార్ సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపిల్స్ను హర్యానాలోని ‘ఐసీఏఆర్– నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’కు పంపించి పరీక్షలు నిర్వహించినట్లు సీబీఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని వెల్లడైందని ఆ ల్యాబరేటరీలు ఈ ఏడాది మార్చి 27న నివేదించాయని సీబీఐ నివేదిక పేర్కొంది. నాలుగు నెయ్యి నమూనాలను ‘ట్రైగ్లిసరైడ్ ప్రొఫైల్’’ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షర క్రమంలో పాయింట్ల వారీగా వివరించింది. అందులో ఏడో పాయింట్ (జి) లో సీబీఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షల్లో వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ లేదని అంటే... జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్లేనని ఆహార నిపుణులు తేల్చి చెబుతున్నారు. తాము పరీక్షించిన నాలుగు నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సీబీఐ నివేదిక స్పష్టం చేసింది. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై బాబు దుష్ప్రచారంరాజకీయ కుట్రల కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు. 1994–1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఆయన భార్య లక్ష్మీ పార్వతిల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ దుష్ప్రచారం చేశారు. వైస్రాయ్ హోటల్ కుట్రతో ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు. కాగా ఈసారి ఏకంగా తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేలా చంద్రబాబు దుష్ప్రచార కుట్రలకు తెగబడటం విస్మయపరుస్తోంది. 2024 సెప్టెంబరు 18న చంద్రబాబు ఈ కుట్రకు తెరతీశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ కుట్రకు తెగబడ్డారు. అంతేకాదు ఆ మర్నాడు అంటే సెప్టెంబరు 19న ‘నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్డీడీబీ) నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేయడం విభ్రాంతి కలిగించింది. ఎందుకంటే.. అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. నిజంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారో లేదోఅని తెలుసుకునే అవకాశం ఆయనకు ఉంది. అయినా సరే కేవలం వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడం... ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకువచ్చేందుకు కూడా వెనుకాడలేదు. కాగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అప్పుడే తిప్పికొట్టారు. గత ఏడాది సెప్టెంబరు 20న ఆయన తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న ఆరోపణలను పరోక్షంగా ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. నెయ్యి ట్యాంకర్లను తిరుపతిలోనే పరీక్షించి... నాణ్యత ఉన్నవాటినే తిరుమలకు పంపిస్తామని... తగిన నాణ్యతతో లేనివాటిని వెనక్కి పంపుతామన్నారు. అది దశాబ్దాలుగా టీటీడీ కచ్చితంగా పాటిస్తున్న విధానమేనని చెప్పారు. అదే విధంగా తగిన నాణ్యతతో లేని నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కి పంపామన్నారు. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించనే లేదని... అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరుమల ఘాట్ రోడ్డులోకి కూడా ప్రవేశించనివ్వలేదన్నారు. దాంతో శ్యామలరావుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను హుటాహుటిన అమరావతికి పిలిపించడం గమనార్హం. రాజకీయ కుట్రతో తాము చేసిన నిరాధార ఆరోపణలకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ఆయన్ను మందలించినట్లు తెలుస్తోంది. అనంతరం కొంత కాలానికే టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం. బాబు కుట్రకు పవన్ వత్తాసుశ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం కలిగించేందుకు చంద్రబాబు పన్నిన కుట్రకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వత్తాసు పలికారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఆయన హైడ్రామాకు తెరతీశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి మెట్లను కడిగి చంద్రబాబు కుట్ర డ్రామాను మరింత రక్తి కట్టించేందుకు యత్నించారు. ఇక టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగాలు లడ్డూ ప్రసాదంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి తెగబడ్డాయి. రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు యత్నించాయి. దేవుణ్ని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం దేవుణ్ణి అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేయటాన్ని మందలించినట్లేనని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.వరద సహాయక చర్యల్లో వైఫల్యం...డైవర్షన్ కుట్రతోనే లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారంవిజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ డైవర్షన్ కుట్రకు పాల్పడ్డారు. 2024 సెప్టెంబరులో విజయవాడను బుడమేరు వరద ముంచెత్తింది. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా టీడీపీ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. కనీసం లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేయలేదు. సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు. దాంతో జల ప్రళయం విజయవాడను ముంచెత్తింది. కేవలం చంద్రబాబు సర్కారు వైఫల్యంతో 50మందికి పైగా దుర్మరణం చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాంతో ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారానికి తెగబడ్డారు. తద్వారా ప్రజల దృష్టి విజయవాడ వరదల నుంచి మళ్లించేందుకు యత్నించారు.కుట్రతోనే ‘పచ్చ’ సిట్... అడ్డుకున్న సుప్రీంకోర్టుతమ రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం సిట్ను నియమించింది. టీడీపీ వీరవిధేయుడిగా ముద్రపడిన వివాదాస్పద అధికారి గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ను నియమించింది. మరో టీడీపీ వీరవిధేయ అధికారి, విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టిని అందులో సభ్యుడిగా నియమించింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య అల్లుడే గోపీనాథ్ జెట్టి. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న తమ దుష్ప్రచారానికి రాజముద్ర వేయాలనే ఆ ఎత్తుగడ వేసింది. కాగా ఈ యత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఆ సిట్ ఏర్పాటు చెల్లదని చెప్పింది. ఆ స్థానంలో సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు చార్జ్షీట్ను సమర్పించింది. -
కూటమి పాలనలో ఆటవిక రాజ్యం
చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారంటే.. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు అతడు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే.. ఆ అమ్మాయి అన్ని సాక్ష్యాధారాలతో సహా స్వయంగా బయట పెడితే, ఏ చర్యా లేదు. రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడితనం కనిపిస్తోంది. ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే జైల్లో పెట్టాల్సింది పోయి సాక్షాత్తూ చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, ఆయన ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పాలనలో మనం ఉన్నాం. జంగిల్ రాజ్యం అంటే ఇదే. – వైఎస్ జగన్ మండిపాటుసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి నేతల అవినీతి, విచ్చలవిడితనం, బరి తెగింపు చూస్తుంటే అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని.. ఇలాంటి ఆటవిక రాజ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండమంటూ చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలూ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూస్తుంటే విస్మయం కలుగుతోందన్నారు. ‘మొబైల్ రికార్డింగ్ డ్యాన్స్లు.. కొత్తపేటలో వ్యాన్లపై రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహించారు. మొబైల్ వ్యాన్లలో మద్యం అమ్మారు. వాటి కోసం ప్రతి నియోజకవర్గంలో వేలం పాటలు పాడారు. మా పులివెందులలో కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి వేలం పాట నిర్వహించారు. రూ.3 కోట్లకు అమ్ముకున్నారు. ఎక్కడి నుంచో వచ్చి 8, 9 సెంటర్లు పెట్టి నిర్వహించుకున్నారు. ప్రభుత్వమే దగ్గరుండి ఇదంతా చేయిస్తోంది..’ అని మండిపడ్డారు. ‘భీమవరం డీఎస్పీ మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. ఆయన యూనిఫామ్లో ఉండి.. ‘ఊపేయ్.. కుదిపేయ్!’ అంటున్నాడు. అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఏం జరుగుతోంది? ఇది ఆటవిక రాజ్యం కాక మరేమిటి?’ అంటూ ధ్వజమెత్తారు. ‘ఇది జంగిల్ రాజ్యం. దోచుకున్న సొత్తు.. పైనుంచి కింది వరకు, చంద్రబాబు, లోకే‹Ô మొదలు కిందిస్థాయి నాయకుడి వరకు.. చివరకు పోలీసులు కూడా మీకింత, నాకింత అని పంచుకున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ పార్టీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తొలుత ఏలూరు నియోజకవర్గంతో ఈ సమావేశాలు మొదలు కాగా రెండో సమావేశం భీమవరం కార్యకర్తలతో నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. భీమవరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడుతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..కూటమి ప్రజా ప్రతినిధుల బరితెగింపు..కూటమి నేతలు, ప్రజా ప్రతినిధుల బరి తెగింపునకు అడ్డు లేకుండా పోయింది. అవినీతి, విచ్చలవిడితనం ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారంటే.. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు అతడు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే.. ఆ అమ్మాయి అన్నీ సాక్ష్యాధారాలతో సహా స్వయంగా బయటపెడితే, ఏ చర్యా లేదు. ఆమదాలవల ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక ఒక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా కూడా ఏ చర్యా లేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళను బలాత్కారం చేసి, చివరకు అధికార దుర్వినియోగంతో కేసును క్లోజ్ చేయించుకున్నాడు. ఎంత దారుణం? మంత్రి సంధ్యారాణి పీఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే.. అతడిని అరెస్టు చేయాల్సింది పోయి, ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకు పంపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఫోన్లో ఒక మహిళతో మాట్లాడుతూ, అశ్లీలంగా ప్రవర్తించాడు. ఒక మంత్రి వాసంశెట్టి సుభాష్ అశ్లీల రికారి్డంగ్ డ్యాన్సులు వేశాడు. స్టేజీపై డ్యాన్సర్లతో కలిసి చిందులు వేశాడు. రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడితనం కనిపిస్తోంది. ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే జైల్లో పెట్టాల్సింది పోయి సాక్షాత్తూ చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, ఆయన ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పాలనలో మనం ఉన్నాం. జంగిల్ రాజ్యం అంటే ఇదే. ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర నుంచి అంతా విచ్చలవిడితనం, దోపిడీ కనిపిస్తోంది. పథకాలు రద్దు.. హామీలిచ్చి మోసాలుచంద్రబాబు వచ్చిన తరువాత జరిగింది ఏమిటంటే.. మన పథకాలన్నీ ఒకవైపు రద్దయ్యాయి. మరోవైపు ప్రజలను మభ్యపెడుతూ, మోసగిస్తూ ఆయన చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అబద్ధాలుగా తేలిపోయాయి. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. విపరీతంగా ప్రచారం చేశారు. ప్రకటనలు ఇచ్చారు. చివరకు ఇంటింటికీ బాండ్లు కూడా పంపారు. దానిపై చంద్రబాబు, పవన్కళ్యాణ్ సంతకాలు కూడా చేశారు. పథకాల ద్వారా ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ఎంతెంత వస్తుందనేది చెప్పారు. కానీ ఏదీ నిలబెట్టుకోలేదు. ఒక మనిషి ఈ స్థాయిలో అబద్ధాలు చెబుతారా? మోసాలు చేస్తారా? అనేది ఊహకు కూడా అందదు. ఎవరైనా ఇలాంటి అబద్ధాలు చెప్పి మోసం చేస్తే 420 అని కేసు పెట్టి జైల్లో వేస్తారు. కానీ ఒక్క చంద్రబాబు, ఆయన కూటమిలో మాత్రమే కేసులు లేకుండా బయట ఉన్నారు. అన్ని వర్గాలకు బాబు మోసాలు..ఆరోజు ఇంటింటికీ వెళ్లి ఏం చెప్పారు? ఏమన్నారు..? ఆ ఇంట్లో ఎవరైనా పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఎవరైనా ఒక యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, కండువా కప్పుకుని రైతు కనిపిస్తే నీకు రూ.26 వేలు అని, ఇంకా పెద్దవాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు ఇస్తాం అని చెప్పారు. ఆ తర్వాత పచ్చి మోసం చేశారు. చివరకు గ్యాస్ సిలిండర్లలో కూడా మోసం చేశారు. ఏటా మూడు సిలిండర్ల చొప్పున రెండేళ్లకు కలిపి మొత్తం ఆరు సిలిండర్లు ఇవ్వాలి. కానీ, ఇచ్చింది ఒకటి రెండు మాత్రమే. అది కూడా అందరికీ ఇవ్వలేదు. చివరకు అక్కడా, అలా పచ్చి మోసం చేశారు.ఆ డబ్బంతా ఏమైంది?.. అంతా డీపీటీ!మన హయాంలో ఐదేళ్లలో.. రెండేళ్లు కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా మనం చేసిన అప్పు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. ఆ అప్పులో వివిధ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఆ డబ్బు ఎవరికి పోయింది అనే వివరాలు, వారి బ్యాంక్ అక్కౌంట్ల నెంబర్లు, వారి ఆధార్తో సహా ఇవ్వగలిగే విధంగా మన పాలన సాగింది. చంద్రబాబు ఇప్పటికే 20 నెలల్లోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే మన హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పులో 95 శాతం ఇప్పటికే దాటాడు. మరి ఆ డబ్బంతా ఏమైంది? ఎవరికి పోయింది? అన్న దానికి సమాధానం లేదు. అంతా దోచుకో.. తినుకో.. పంచుకో! అదే డీపీటీ! అది మన కళ్ల ఎదుట కనిపిస్తున్న వాస్తవం. రెడ్బుక్ రాజ్యాంగం..మరోవైపు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తప్పు చేయకపోయినా.. తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. అసలు తప్పు చేసిన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పైగా ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు అదే పని చేస్తున్నారు. అంతా విచ్చలవిడి దోపిడీ, రెడ్బుక్ రాజ్యాంగం. పోలీసులు ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారు. వ్యవస్థలన్నీ పతనమయ్యాయి. మరోవైపు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయి. హామీలు ఏవీ అమలు కాలేదు. అన్నీ మోసాలే. పథకాలు పోయాయ్..పథకాల అమలు లేదు. విద్యాదీవెన 8 త్రైమాసికాలు బాకీ. మన ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్కు పిల్లల తల్లుల ఖాతాలో జమ చేశాం. 2024 జనవరి–మార్చి త్రైమాసికం మొదలు.. గత డిసెంబరు వరకు 8 త్రైమాసికాలకు సంబంధించి రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. రూ.4,900 కోట్లు బాకీ. ఇక వసతి దీవెన ఏటా రూ.1100 కోట్లు. మొత్తం రూ.2200 కోట్లు బాకీ పెట్టారు. నాడు–నేడు పనులు లేవు. గోరుముద్ద నాణ్యత పడిపోయింది. పిల్లలు చనిపోతున్నారు. టోఫెల్ శిక్షణ, ఇంగ్లిష్ మీడియం, ట్యాబ్లు ఆగిపోయాయి. మన హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈరోజు ఆ సంఖ్య 33 లక్షలే. అంటే 10 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఇవ్వాలి. రూ.6 వేల కోట్లకుగానూ రూ.2 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.4 వేల కోట్లు బాకీ పెట్టారు. దీంతో ఆస్పత్రులు వైద్యం అందించడం లేదు. వైద్యం పడకేసింది. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకం దారుణం. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చివరకు యూరియా కూడా బ్లాక్లో కొనాల్సి వస్తోంది. రైతు భరోసా కింద రూ.40 వేలకు బదులు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. మా హయాంలో ఆక్వా విద్యుత్ సబ్సిడీ రూ.3,620 కోట్లు ఇచ్చాం. ఈరోజు పైసా ఇవ్వడం లేదు. మేం యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇచ్చాం. ఇవాళ విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు నిర్వీర్యం అయ్యాయి. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ..ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోంది. పార్టీ కార్యకర్తలు గొప్ప యజ్ఞం చేస్తున్నారు. ప్రతి కష్టంలోనూ ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మనపై ఉంది. మనం ప్రజలకు ఎన్నో చేశాం. మరి ఏమీ చేయని చంద్రబాబుకు ఈసారి ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు. మనం ప్రజల పక్షాన ఇలాగే నిలబడాలి. చూస్తుండగానే రెండేళ్లు అయిపోయాయి. ఇంకా మూడేళ్లు మాత్రమే మిగిలి ఉంది. అందులో మరో ఏడాదిన్నర గడిస్తే.. నా పాదయాత్ర మొదలవుతుంది. దాదాపు 150 నియోజకవర్గాల్లో నేను పర్యటిస్తా. అలా ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటా.« ఆ యాత్రలో ప్రతి మూడో రోజు బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రజా ఉప్పెనను చూపుతూ, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ, చంద్రబాబు తప్పుడు పాలనను ప్రజలకు వివరిస్తాం. వాటిని ఎండగడతాం.ప్రతి ఇంటా చర్చ జరగాలి... మీరు చొరవ చూపాలిఇప్పుడు మీరంతా కలిసికట్టుగా నిలిచి పోరాడాలి. చంద్రబాబు దారుణ పాలనపై ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా చొరవ చూపాలి. మన పాలన, ఈ పాలన మధ్య తేడాను స్పష్టంగా ప్రజలకు వివరించాలి. వాటిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఆ దిశగా మీరంతా కలసికట్టుగా కృషి చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలన్నీ స్ట్రీమ్లైన్ చేయాలి. అన్నీ వ్యవస్థీకృతం కావాలి. చంద్రబాబు అన్యాయ పాలనను ప్రజల్లో బలంగా ఎండగట్టాలి. ఆ దిశగా మీరు చొరవ చూపాలి. అందరూ కలిసి పని చేయాలి.ఏ ఒక్క వర్గానికైనా ఒక్కటైనా మంచి జరిగిందా?చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లు. ఫిబ్రవరి 11న మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్లు మాత్రమే మిగిలింది. మరి ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికైనా కనీసం ఒక్కటైనా మంచి జరిగిందా? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే.. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్లం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ మాదిరిగా భావించేవాళ్లం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తపన పడేవాళ్లం. కోవిడ్ సంక్షోభం లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజూ, ఏ హామీని ఎగ్గొట్టాలని అనుకోలేదు. ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు ఉన్నా, వాటి కంటే ప్రజల సమస్యలే ఎక్కువని భావించి చిరునవ్వుతో స్వీకరించాం. అన్ని హామీలూ అమలు చేశాం. ప్రజలకు ఏ ఇబ్బందీ లేకుండా చూశాం. అంతా కలసి పంచుకుంటున్నారు..ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దోపిడీ, అవినీతి. అది ఏ స్థాయిలో ఉందంటే.. అసలు పాలకులు ఉన్నారా? అనిపించే పరిస్థితి. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావడం లేదు. అదంతా తగ్గుతోంది. మరి, అదంతా ఎక్కడికి పోతోంది అంటే.. చంద్రబాబు మొదలు కింది స్థాయి వరకు ఇంత అని పంచుకుంటున్నారు. మద్యం మాఫియా. ప్రైవేటు షాపులన్నీ లాటరీలో వాళ్ల మనుషులకే ఇచ్చుకున్నారు. గ్రామస్థాయిలో బెల్టు షాప్లు వేలం పాట పాడి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు కొట్టుకోకూడదు కాబట్టి! అక్కడ పోలీసుల సహకారంతో మద్యం అమ్ముతున్నారు. మద్యం షాప్ పక్కనే పర్మిట్ రూమ్లు, అక్కడ పెగ్గుల్లో అమ్మకం. అక్కడా దోపిడీ. వైన్ షాప్ల్లో కూడా ఎక్కువ ధరకు అమ్మకాలు. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. ఎమ్మార్పీపై రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక ప్రతి నాలుగైదు బాటిళ్లకు ఒకటి నకిలీ.అలా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదోవ పడుతోంది. ఈరోజు ఇసుక ఫ్రీ అంటున్నా ఎక్కడా ఫ్రీగా లేదు. ఎక్కడ చూసినా లారీలు, మిషన్లతో దోచేసుకుంటున్నారు. ధర చూస్తే గతంలో కంటే డబుల్ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఐదేళ్లకు కలిపి దాదాపు రూ.3,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు ఆ ఆదాయం రావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఇసుక తరలిస్తున్నారు. ఏ ఒక్క గని వదలడం లేదు. సిలికా, మైకా, లేటరైట్, క్వార్ట్జ్.. ఏదీ వదలకుండా అన్నీ దోచుకుంటున్నారు.జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం..జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. అదీ నా హామీ. క్రితంసారి కోవిడ్ వల్ల పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. జగన్ 2.0 లో కార్యకర్తలకు టాప్ ప్రయారిటీ. వారి ద్వారానే మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీ ద్వారానే చంద్రబాబు అన్యాయ, దారుణ పాలన ప్రజల్లో ఎండగడతాం. చిత్తశుద్ధితో కూడిన మంచి పాలన అంటే ఎలా ఉంటుంది? అనేది మనం చూపిస్తే.. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం ఎలా అన్నదానికి చంద్రబాబు పాలనే ఉదాహరణ. -
తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లయ్ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్లోని నేషనల్ డెయిరీ డవలప్మెంట్ బోర్డు(NDDB) ద్వారా నెయ్యి శాంపిల్స్ను సీబీఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని సీబీఐ వెల్లడించింది. సీబీఐ దర్యాప్తుతో టీడీపీ, పచ్చ మీడియా ప్రచారాలు తప్పని అని తేలింది.తిరుమల లడ్డూపై సీబీఐ ఇచ్చిన సంచలన రిపోర్ట్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చెంపపెట్టులా మారింది. చంద్రబాబు, పవన్లు చేసింది తప్పుడు ప్రచారమేనని నిర్థారణ అయ్యింది. సీబీఐ రిపోర్ట్తో చంద్రబాబు అబద్ధాల పుట్ట బద్ధలైంది. తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన చంద్రబాబు, పవన్.. రాజకీయ దురుద్ధేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం చేశారు. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.తిరుమల లడ్డూపై విషం చిమ్మిన కూటమికి దిమ్మతిరిగేలా సీబీఐ నివేదిక ఇచ్చింది. 2024లో జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్లో మిగిలి ఉన్న శాంపిల్స్ మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. -
ఇదేనా మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం బాబూ?: తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా మండిపడ్డారు. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన మహిళకు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేతిలో జరిగిన అన్యాయంపై స్వయంగా బాధితురాలే చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.మహిళా లోకానికి మీ దృష్టిలో విలువ లేదా బాబూ?ఒక మహిళ మీ వద్దకు వచ్చి.. మీ ఎమ్మెల్యే నన్ను వేధిస్తున్నాడు, న్యాయం చేయండి అని మొరపెట్టుకుంటే కూడా స్పందించరా చంద్రబాబు? ఇదేనా మీ 40 సంవత్సరాల అనుభవం? ఇదేనా మహిళా లోకానికి మీ దృష్టిలో ఉన్న విలువ?. రాష్ట్రంలో చంద్రబాబు పాలన కీచక పర్వంగా మారింది. అరవ శ్రీధర్ పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా, వచ్చినది టీడీపీ నుంచే. ఆదిమూలం నుంచి అరవ శ్రీధర్ వరకు కీచకత్వం కొనసాగుతూనే ఉంది.3 హత్యలు, 6 మానభంగాలు.. ఇదేనా మీ పాలన?రాష్ట్రంలో పరిపాలన పక్కదారి పట్టింది. 10 విహారయాత్రలు, 3 హత్యలు, 6 మానభంగాలు… ఇదే ఈ రోజు రాష్ట్ర పాలన పరిస్థితి. రైల్వే కోడురు బాధిత మహిళ చేసిన ఆరోపణలు జుగుప్సాకరం. హోంశాఖను ‘వర్క్ ఫ్రమ్ హోం’ శాఖగా మార్చేశారు, హోం మంత్రి పోలీస్ వ్యవస్థను పాతాళానికి తొక్కేశారు.మీ ఇంట్లో మహిళ అయితే ఇలాగే మౌనంగా ఉంటారా?సంక్రాంతి సందర్భంగా నారావారి పల్లెలో ముఖ్యమంత్రికి బాధిత మహిళ స్వయంగా వెళ్లి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక వివాహిత మహిళ జీవితానికి సంబంధించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి ఇలాగేనా వ్యవహరించేది. అదే మీ ఇంట్లో మహిళ గురించి ఏమీ అనకపోయినా రాద్ధాంతం చేసే మీరు… రైల్వే కోడూరులో బాధిత మహిళపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?ఇది దద్దమ్మ ప్రభుత్వంకుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనను పంచాయితీ చేసి పక్కదారి పట్టించారు. అమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేసులోనూ చర్యలు లేవు. ఇదే టీడీపీ పాలన. ముఖ్యమంత్రిగా, టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు తన పాలన చూసి సిగ్గుపడాలి. బాధిత మహిళ గోడు వెళ్లబోసుకుంటే మాటల దాడులు చేయిస్తారా? ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిస్తారా? అరవ శ్రీధర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరిగినా పట్టించుకోని దద్దమ్మ ప్రభుత్వం ఇది.శాంతిభద్రతలు కాపాడలేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు? దేశంలోనే ఏపీ పోలీస్ శాఖ 36వ స్థానానికి పడిపోయింది. అయినా గొప్ప ప్రభుత్వం అని స్టిక్కర్లు వేసుకుంటున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి స్పందించకపోతే బాధిత మహిళ స్వయంగా బయటకు వచ్చి మాట్లాడుతుంది. సుగాలి ప్రీతికి జరిగిన ఘోరం, ఇవాళ రైల్వే కోడూరులో మహిళకు జరిగింది. బాధితురాలికి న్యాయం చేయాల్సిందే. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదుకోకపోతే ప్రతిపక్షంగా మేమే ఆమెకు అండగా నిలుస్తాం” అని తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. రైల్వే కోడూరు ఘటనపై తక్షణమే చర్యలు తీసుకుని బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఏపీలో మళ్లీ భారీ అప్పుకి కేబినెట్ ఆమోదం
సాక్షి,విజయవాడ: ఏపీలో మళ్లీ భారీ అప్పుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈసారి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి భారీ మొత్తాన్ని సమీకరించేందుకు నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర కేబినెట్ తాజాగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా రూ.11,850 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ మొత్తాన్ని బాండ్ల రూపంలో తెచ్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులను ఈ విధంగా సమీకరించాలని కేబినెట్ తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా రూ.2,500 కోట్ల అప్పును నిన్నే సమీకరించింది. ఈ కొత్త నిర్ణయంతో అప్పుల భారం మరింత పెరగనుంది. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత 19 నెలల్లో రాష్ట్ర అప్పులు 3.11 లక్షల కోట్లను దాటాయి. ఈ సంఖ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. సంక్షేమ పథకాల కోసం నిధులు సమీకరించడంలో ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని ప్రధాన ఆధారంగా చేసుకోవడం, రాష్ట్ర ఆర్థిక వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్లో అప్పుల భారం రోజురోజుకీ పెరుగుతుండగా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి కొత్త అప్పులు తెచ్చుకోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యం
సాక్షి, విజయవాడ: కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా.. కానీ పోలీసులు స్పందించలేదు. ఈనెల 26న డీజీపీకి బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై దళిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ ఫిర్యాదుపై కనీసం ఎఫ్ ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్టు ఆమె వెల్లడించారు. రైల్వే కోడూరు పోలీసులు, తిరుపతి ఎస్పీ ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాల వాపోయింది. బాధితురాలు ఫిర్యాదును తీసుకోకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేపై డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యల్లో తాత్సారం చేశారు. డీజీపీకి చేసిన ఫిర్యాదును బాధిత మహిళ విడుదల చేశారు.ఎమ్మెల్యే శ్రీధర్ శారీరక, మానసిక వేధింపులపై బాధితుల ఫిర్యాదు చేసింది. కొట్టి, తిట్టి తనను లైంగికంగా ఎమ్మెల్యే శ్రీధర్ లోబర్చుకున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఐదు సార్లు తనకు అబార్షన్ చేయించినట్టు డీజీపీకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ దారుణంపై సాక్షి కథనాలతో రాజకీయ ప్రకంపనలు రేపాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంతో దూమారం రేగింది. మహిళను వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. డైవర్షన్ కోసం కాలయాపన కమిటీని జనసేన తెరపైకి తీసుకొచ్చింది. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ప్రకటించింది. దళిత మహిళను వేధించిన ఎమ్మెల్యేలకు చర్యలకు పూనుకోని ప్రభుత్వం.. ఉద్యోగిని మోసం చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జనసేన దృష్టికి బాధిత మహిళ ముందే ఈ విషయాన్ని తీసుకెళ్లిన కానీ పట్టించుకోలేదు. -
‘బాధితురాలినే నిందితురాలిగా చేసేందుకు కూటమి కుట్రలు’
సాక్షి, తాడేపల్లి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ని వెంటనే అరెస్టు చేయాలని.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తప్పు చేసిన ఎమ్మెల్యేని అరెస్టు చేసే దమ్ము చంద్రబాబుకు లేదా? అంటూ నిలదీశారు. కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, కూన రవికుమార్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. తిరుపతిలో కిరణ్ రాయల్పై కేసు నమోదు చేసే ధైర్యం కూడా ప్రభుత్వం చేయలేదని దుయ్యబట్టారు.‘‘అరవ శ్రీధర్ చేసిన పనితో ఆడపిల్లలకు రాష్ట్రంలో రక్షణ లేదని అర్థం అవుతుంది. జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు కీచకులుగా మారారు. పోలీసు వ్యవస్థ ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు?. కూటమి ఎమ్మెల్యేపై చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నారు.?..హోంమంత్రి అనితకు పబ్లిసిటీ, రీల్స్పై ఉన్న శ్రద్ధ మహిళ భద్రతపై లేదు. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ కనీసం స్పందించ లేదు. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయారు.?. ఎమ్మెల్యేపై పార్టీ కమిటీ వేయడం ఏంటి? పోలీసుల విచారణ వుండదా?. మంత్రి సంధ్యారాణి కొడుకు పేకాట అడుగుతూ దొరికిపోయారు’’ అంటూ వరుదు కల్యాణి మండిపడ్డారు. -
వైఎస్ జగన్ని కలిసిన ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు బుధవారం (జనవరి 28) కలిశారు. మంగళగిరి నియోజకవర్గం చినకాకాని ప్రాంతంలో అంజుమన్ ఇస్లామియా సంస్ధకు చెందిన సుమారు 71.57 ఎకరాల వక్ఫ్ భూమిని చంద్రబాబు ప్రభుత్వం ఐటీ పార్క్ నిర్మాణం పేరుతో డీ-నోటిఫై చేశారని, దీనిని రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.సానుకూలంగా స్సందించిన వైఎస్ జగన్, రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని, ముస్లిం, మైనారిటీ వర్గాలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ షేక్ నూరి ఫాతిమా, ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దిన్, జనరల్ సెక్రటరీ సర్ధార్ ఖాన్, ట్రెజరర్ అబ్ధుల్ కలాం, ప్రతినిధులు ఆసిఫ్, మౌలా బేగ్, అబ్ధుల్ అజీజ్, ఇబ్రహీం, హుస్సేన్, సద్దాం ఖాన్, సర్తాజ్, నసీమా, మునావర్ ఉన్నారు. -
తూచ్.. అదేం లేదు.. జనసేన యూ టర్న్?
సాక్షి, అమరావతి: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఓ ఒంటరి మహిళను బెదిరించి శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారం బయటకు రావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని కవర్ చేస్తూ జనసేన, ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా జనసేన పార్టీ శ్రీధర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సదరు మహిళ ఆరోపణలపై విచారణ చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణల విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కమిటీలో టి. శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, కమిటీ మహిళ ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందించనుంది. అనంతరం, నివేదికను పరిశీలన చేసి, తుది నిర్ణయం వెలువడే వరకు శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అందులో స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో, ఇంత దారుణంగా ఆధారాలతో సహా ఎమ్మెల్యే లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చినా కూటమి పెద్దలు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అంశాన్ని, పవన్ కళ్యాణ్ను సేవ్ చేయడానికి జనసైనికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే అరవ శ్రీధర్ను జనసేన నుంచి సస్పెండ్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేశారు. ఇక, తాజాగా పార్టీ ప్రకటనతో జనసైనికులకు భంగపాటు ఎదురైంది. అయితే, జనసేన కమిటీ ఏర్పాటుపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఇదంతా డైవర్షన్లో భాగంగానే జరుగుతోందని.. శ్రీధర్ను కాపాడే ప్రయత్నమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
నువ్ మోసపోయావ్.. వదిలేయ్
సాక్షి, అమరావతి : ‘‘ఇంక నిన్ను వాళ్లు కలుపుకోరు.. నువ్ మోసపోయావ్.. అయ్యిందేదో అయ్యింది.. నువ్ సర్దుకుపోవడం మంచిది’ అంటూ రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే బాధిత మహిళతో కూటమి పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర చెప్పిన మాటలివి. ఎమ్మెల్యే అరాచకాలు బయటకు రాకుండా ఆపేందుకు తెర వెనుక కూటమి నాయకులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా అదే ప్రాంతానికి చెందిన కూటమి స్థానిక నేత తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా బాధితురాలికి నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడారు. శ్రీధర్ ఇంటిలో ఒప్పుకోవడం లేదని, జరిగింది మరచిపోయి సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. ఇంకా అతనే కావాలని వెళితే మళ్లీ మళ్లీ మోసపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నీ కొడుకు కోసం అన్నీ వదిలేసి ముందుకు వెళ్లిపోవాలంటూ సలహా ఇచ్చారు. నిన్ను దూరం చేసుకుంటున్నందుకు ఎమ్మెల్యే బాధ పడతారని తాను అనుకోవడం లేదని నాగేంద్ర అన్నారు. బెంగళూరులో తన కుమారుడు చదివే కాలేజీ అమ్మాయిలతోనూ ఎమ్మెల్యే శ్రీధర్ ఫ్లర్ట్ (లోబరుచుకునే ప్రయత్నం) చేశారని, ఆ విషయం తన కుమారుడి ద్వారా తెలిస్తే తాను ఆ విషయం బయటకు రాకుండా సర్ధి చెప్పానని ఆయన కొత్త విషయాన్ని బయటపెట్టారు. -
ఆవు చేలో మేస్తే అరవ శ్రీధర్ గట్టున మేస్తాడా?
ఓ ఒంటరి మహిళను బెదిరించి కూటమి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారం బయటకు రావడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని కవర్ చేస్తూ జనసేన నేతలు చేస్తున్న ప్రయత్నాలు, వాటికి నెటిజన్ల కౌంటర్లతో సోషల్ మీడియా మారుమోగుతోంది. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి..ఆవు చేలో మేస్తే అరవ శ్రీధర్ గట్టున మేస్తాడా?Arava Sreedhar a genuine JanaSainik who follows his leader not just in words, but in actions. pic.twitter.com/DDc57K3BNn— Pandu (@PanduPrabhas__) January 27, 2026 హలో సేఫ్ హ్యాండ్స్ సాయి @IamSaiDharamTejమీ మామ చెప్పిన సేఫ్ హ్యాండ్స్ ఇదా?లుంగీ తీసి అంగం చూపించడమామీ మామ చెప్పిన మగతనం ఇదా?లుంగీ తీసి అంగం చూపించడమామీ మామ చెప్పిన ఆడబిడ్డకు రక్షణ ఇదా?లుంగీ తీసి 5 సార్లు అబార్షన్ చేయించడమా#aravasridhar #PawannKalyan#Kaamasena #YSRCPSM https://t.co/oYe0OSbrIg pic.twitter.com/7cMZzyprHi— దర్శన్–𝐃𝖆 𝐑ֆ𝖍𝖆η😎ツ (@Darshan_Ysj) January 27, 2026 ఇంత దారుణంగా ఆధారాలతో సహా ఎమ్మెల్యే లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చినా కూటమి పెద్దలు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?కూటమి ఎమ్మెల్యేలు ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా కాపాడుకునే యత్నంలో భాగంగా ముందుగానే లేఖలు విడుదల చేస్తున్నారా?చిన్న చిన్న వాటికే అతిగా స్పందించే పచ్చ మీడియా.. ఓ ఎమ్మెల్యే విషయంలో ఇంత జరుగుతున్నా..ఎందుకు స్పందించడం లేదు? NDA-Alliance @JanaSenaParty MLA caught in rape allegations. Railway Koduru MLA and Government Whip Arava Sridhar exposed for exploiting a woman government employee by misusing his political power, through threats, coercion, and sustained sexual abuse. The victim has reportedly… pic.twitter.com/klwWggPRID— YSR Congress Party (@YSRCParty) January 27, 2026@JanaSenaParty కామసేనాని ప్రొడక్షన్సీన్ -1 టేక్ -4 #SaveApSisters pic.twitter.com/x5GA71biqv— Andhra Now 📰 (@AndhraXpress) January 27, 2026 View this post on Instagram A post shared by వై.యస్.ఆర్ కుటుంబం (@_ysrkutumbam) -
‘కారుణ్య’ అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించరాదు
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకం అనేది హక్కు కానప్పటికీ, దరఖాస్తుదారుడి అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించడానికి వీల్లేదని, న్యాయబద్ధంగా పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కారుణ్య నియామకంపై అధికారులు నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు యాంత్రికంగా కాకుండా, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. దరఖాస్తు చేయడంలో జాప్యం ఉందన్న కారణంతో కారుణ్య నియామకాన్ని తిరస్కరించడానికి వీల్లేదంది. ఐదేళ్ల జాప్యం అన్నది అసాధారణ జాప్యం కానే కాదంది. తనకు, తన తండ్రికి రైల్వే శాఖలో కారుణ్య నియామకానికి సంబంధించిన నిబంధనల గురించి తెలియదని పిటిషనర్ చెప్పిన దాంతో హైకోర్టు ఏకీభవించింది. కారుణ్య నియామకం కోసం పిటిషనర్ నారాయణమ్మ పెట్టుకున్న దరఖాస్తును మూడు నెలల్లో పరిగణనలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. అసలు కేసు ఏంటంటే..! విజయనగరం జిల్లా, కొత్తవలస గ్రామానికి చెందిన బి.రాములు రైల్వేశాఖలో గ్యాంగ్మెన్గా పనిచేసేవారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యంతో గ్యాంగ్మెన్గా ఉద్యోగం చేసే పరిస్థితిలో లేకపోవడంతో 1999లో రాములుకు రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఉద్యోగాన్ని (డీ కేటగిరైజేషన్) ఇవ్వదలిచారు. అయితే రాములు 2000లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. రూ.1895లను పెన్షన్గా, రూ.1.50 లక్షలను పీఎఫ్, గ్రాట్యుటీ కింద రైల్వే అధికారులు చెల్లించారు. ఇదిలా ఉండగా 2006లో రాములు కుమార్తె నారాయణమ్మ కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్నారు. రాములు కుటుంబ ఆరి్థక ఇబ్బందులను గుర్తించిన డివిజినల్ రైల్వే అధికారులు కారుణ్య నియామకం కోసం నారాయణమ్మ దరఖాస్తును ఉన్నతాధికారులకు సిఫారసు చేయగా, వారు దానిని తిరస్కరించారు. నిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు దరఖాస్తు చేయలేదంటూ నారాయణమ్మ దరఖాస్తును వారు తోసిపుచ్చారు. దీనిపై ఆమె కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. క్యాట్ ఆమె పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ధర్మాసనం అధికారులు నారాయణమ్మ దరఖాస్తును ఏకపక్షంగా తిరస్కరించడాన్ని తప్పుబట్టింది. ఉద్యోగి మరణం.. ఆ కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదని వ్యాఖ్యానించింది. క్యాట్ తీర్పును రద్దు చేసింది. నారాయణమ్మ దరఖాస్తును మూడు నెలల్లో పరిగణనలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ధర్మాసనం ఆదేశించింది. -
జడ్జి అనుమతి లేకుండా కోర్టులోకొచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు?
సాక్షి, అమరావతి: ఒక కేసులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని జడ్జి అనుమతి లేకుండానే కోర్టు హాల్లోకి చొరబడి ఎలా అరెస్టు చేస్తారని హైకోర్టు పోలీసు అధికారులను ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, కర్నూలు రేంజ్ డీఐజీ, డీఎస్పీ తదితరులను ఆదేశించింది. చిప్పగిరి ఎస్ఐ సతీష్కుమార్, పత్తికొండ ఎస్ఐ ఆర్.విజయ్కుమార్ నాయక్, చిప్పగిరి కానిస్టేబుళ్లు షబ్బీర్, రామోజీలకు వ్యక్తిగత నోటీసులు జారీచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని జడ్జి అనుమతి లేకుండానే కోర్టు హాల్లోకి చొరబడి మరీ బలవంతంగా అరెస్ట్ చేయడమే కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన న్యాయవాదులను తోసేసి వెళ్లిపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పోలీసుల దౌర్జన్యంపై వీడియో ఆధారాలున్నాయి పిటిషనర్ తరఫున న్యాయవాది కె.వి.రఘువీర్ వాదనలు వినిపించారు. ‘చిప్పగిరి మండలం డేగులపాడుకి చెందిన శివయ్య గంజాయి సాగుచేస్తుండటంతో అతడిపై చిప్పగిరి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో అతడు లొంగిపోయేందుకు గతనెల 24న పత్తికొండ కోర్టుకు వచ్చారు. తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ పిటిషన్పై జడ్జి నిర్ణయం కోసం శివయ్య కోర్టులో వేచిచూస్తుండగా పోలీసులు మఫ్టీలో కోర్టు హాల్లోకి దూసుకొచ్చి బలవంతంగా శివయ్యను లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. దీన్ని అడ్డుకోబోయిన న్యాయవాదులను సైతం తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా సర్క్యులేట్ అయింది. కోర్టు హాల్లోకి ప్రవేశించేందుకు ఆ కోర్టు న్యాయాధికారి అనుమతి తీసుకోలేదు. దౌర్జన్యపూరితంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పత్తికొండ న్యాయవాదుల సంఘం సమర్పించిన వినతిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని రఘువీర్ నివేదించారు. పోలీసులు ఏమైనా చేస్తారు ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. పోలీసులు ఇదేరీతిలో హైకోర్టులోకి వచ్చి నిందితులను అరెస్ట్ చేయగలరా? రిజిస్ట్రీ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేస్తారా? మరి కింది కోర్టులో కూడా జడ్జి అనుమతి లేకుండా నేరుగా కోర్టు హాల్లోకి వచ్చి మరీ ఎలా అరెస్ట్ చేస్తారు?.. అని ప్రశ్నించారు. బాధ్యులైన పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? వారిని బదిలీ చేశారా లేదా? అని అడిగారు. ఇలాంటివాటిని అనుమతిస్తే పోలీసులు ఏమైనా చేస్తారు.. అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసుల తరఫున ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ) స్పందిస్తూ.. ఆ పోలీసులకు చార్్జమెమోలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై సంబంధిత కోర్టు మేజిస్ట్రేట్ జిల్లా ఎస్పీకి రాసిన లేఖ ఆధారంగా బాధ్యులైన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు.బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేశారా? లేదా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి.. సస్పెండ్ చేసి ఉండరులే అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కోర్టు హాల్లోకి చొరబడి మరీ అరెస్ట్ చేసిన పోలీసులకు వ్యక్తిగత నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
కల్యాణ వైభోగమే!
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఫిబ్రవరి (మాఘ మాసం) నుంచి పెళ్లి బాజాలు మోగించేందుకు ముహూర్తాలు ఖరారయ్యాయి. దాదాపు రెండు నెలలకుపైగా విరామం అనంతరం ముహూర్తాలు కుదరడంతో వధూవరుల తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయ్యారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 5 నుంచి పెళ్లి సందడి ప్రారంభం కానుంది. వేసవి కాలంలో అత్యధిక ముహూర్తాలు ఉండటంతో పెళ్లి సందడి మోత మోగనుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అత్యధికంగా ముహూర్తాలు ఉన్నాయి. జూలై 11 తర్వాత నవంబర్ 20 వరకు చాతుర్మాస విరామం కావడం (ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు) ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి బాజాలకు నాలుగు నెలల విరామం ఉంటుంది. హిందూ సంప్రదాయం ప్రకారం చాతుర్మాసంలో శుభకార్యాలు నిర్వహించరు. ఈ ఏడాది చివరలో నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మధ్య తిరిగి పెళ్లి బాజాలు మోగనున్నాయి.2026లో వివాహ ముహూర్తాలు ఇలా..ఫిబ్రవరి: 5, 6, 8, 10, 12, 14, 19, 20, 21, 24, 25, 26 తేదీలు మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12 ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29 మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14 జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29 జూలై: 1, 6, 7, 11 తేదీలు నవంబర్: 21, 24, 25, 26, 27, 30 డిసెంబర్: 1, 2, 3, 4, 6, 11, 12, 13 చాతుర్మాసం కారణంగా ఆగస్ట్, సెపె్టంబర్, అక్టోబర్ నెలల్లో వివాహ ముహూర్తాలు లేవుపెళ్లంటే.. పెద్ద ఆడంబరమేపెళ్లి అంటే అదే పెద్ద ఆడంబరం. వివాహ నిశ్చయ తాంబూలాల నుంచి ప్రీ వెడ్డింగ్, పెళ్లి, పెళ్లి తర్వాత తంతు అంటూ అనేక రకాలుగా వివాహ సంబరం అంబరాన్ని తాకేలా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 46 లక్షల నుంచి 48 లక్షల వరకు వివాహాలు జరిగే అవకాశం ఉందని సీఏఐటీ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్) అంచనా వేసింది. ఈ వివాహాల ద్వారా సుమారు రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని భావిస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు సుమారు నాలుగు లక్షల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వివాహ వేడుకల సంఖ్య, వాటి సంబంధించిన సందడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో అతిపెద్ద ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. పెళ్లిళ్లు కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఎందరికో జీవనోపాధి కల్పిస్తూ.. అతి పెద్ద ఆరి్థక వ్యవస్థను నడిపిస్తాయి. ముహూర్తాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి చోట్ల ఫంక్షన్ హాళ్లు ఇప్పటికే అడ్వాన్స్గా బుక్ అయినట్టు సమాచారం. ఉభయ గోదావరి, ఏజెన్సీ, విశాఖ తీరాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఆలవాలంగా మారాయి. దుస్తులు, బంగారం(జ్యువెలరీ), క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగాల్లో రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పటినుంచే ముహూర్తం ముందరున్నది అంటూ పెళ్లి వారు ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. -
మా భూములు ఇవ్వం
మార్టూరు: పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తేలేదని బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి తండావాసులు అధికారులకు స్పష్టం చేశారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న తమ భూముల్ని ఇవ్వబోమని మంగళవారం ముక్తకంఠంతో చెప్పారు. దీంతో గ్రామసభ నుంచి అధికారులు మౌనంగా వెనుదిరిగారు. తండా రెవెన్యూ పరిధిలోని 445, 453, 476 సర్వేనంబర్ల లోని 89.61 ఎకరాల కొండ పోరంబోకు భూమిలో తండాకు చెందిన 91 మంది రైతులకు గత ప్రభుత్వ హయాంలో పట్టాలు పంపిణీ చేశారు. వాస్తవానికి ఈ భూమిని ఆ రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం పట్టాలు, పాసుపుస్తకాలు పంపిణీ చేయడంతో వారికి ఆ భూమిపై శాశ్వతహక్కు ఏర్పడింది. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఈ భూమి అనువుగా ఉంటుందని మండల రెవెన్యూ అధికారులు గతవారం కలెక్టర్ వినోద్కుమార్కు చూపించారు. ఈ క్రమంలో తండావాసులు 20 మంది ఇటీవల బాపట్లలో కలెక్టర్ను కలిసి పార్కు నిర్మాణం కోసం తమ భూములు ఇవ్వబోమని చెప్పారు. దీంతో కలెక్టర్ బలవంతంగా భూమి సేకరించబోమని వారికి తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినప్పుడు అభిప్రాయాలు చెప్పుకోవచ్చని సూచించారు. దీన్లో భాగంగా మంగళవారం ఏపీఐఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.ఫణి, ఆర్డీవో గ్లోరియా, తహసీల్దార్ ప్రశాంతి సిబ్బందితో కలిసి తండాలో గ్రామసభ నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించారు. పట్టాలు పొందిన రైతులంతా తమ భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు, పాసుపుస్తకాల వలన బ్యాంకు లోన్లు, సంక్షేమ పథకాలు పొందగలుగుతున్నామని, తమ కడుపు మీద కొట్టవద్దని పేర్కొన్నారు. తండా పరిధిలోని సర్వేనంబర్ 475లో గల 53 ఎకరాల్లో కొత్తగా పట్టాలిస్తామని, ఈ భూమిని పార్కు కోసం వదిలేయాలని అధికారులు అడిగారు. ఆ భూమిని పదేళ్ల కిందటే పార్కు ఏర్పాటు కోసం అధికారులు ప్రతిపాదించగా ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా మా భూమిలో పార్కు నిర్మిస్తామనటం ఏమిటని రైతులు ప్రశ్నించారు. ఆ 53 ఎకరాల్లోనే పార్కు ఏర్పాటు చేసుకోవచ్చుగదా అని నిలదీశారు. ఒకదశలో అధికారులు రైతులను పట్టా, పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ జిరాక్స్ కార్డులను ఇవ్వాలని అధికారులు కోరారు. దీనికి రైతులు నిర్ద్వందంగా తిరస్కరించారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు రైతులు అధికారులకు అర్జీ సైతం ఇచ్చారు. దీంతో అధికారులు తిరుగుముఖం పట్టారు. -
కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలనలో విచ్చలవిడిగా సాగుతున్న అకృత్యాలు, అరాచకాలతో సామాన్యులకు, ముఖ్యంగా మహిళల భద్రతకు దిక్కులేకుండా పోయింది. సాక్షాత్తూ కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులే కీచకులుగా మారిపోయి పశువుల మాదిరిగా బరి తెగించి మహిళలపై నిర్భీతిగా లైంగిక దాడులకు తెగబడటం నివ్వెరపరుస్తోంది. తాజాగా తిరుపతి జిల్లా రైల్వేకోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వం సర్వత్రా కలకలం రేపుతోంది. బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కామ పిశాచిలా మారిపోయి ఓ వివాహితను దారుణంగా వేధించి దౌర్జన్యాలకు తెగబడటం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా ఈ అకృత్యాన్ని భరిస్తూ వచ్చిన బాధితురాలు ఇక తట్టుకోలేక ఈ దారుణాన్ని సెల్ఫీ వీడియో ద్వారా మంగళవారం బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనతో జరిపిన నికృష్టమైన చాటింగ్లు, అసహ్యం పుట్టించే నగ్న వీడియోలను సాక్ష్యాధారాలుగా చూపించారు. ఈ కీచక పర్వంపై బాధితురాలు వెల్లడించిన వివరాలు ఇవీ.. జుట్టు పట్టుకుని కొట్టి.. కారులో రేప్ చేశారు! నేను రైల్వే కోడూరు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నా. ఎన్నికల అనంతరం 2024 జూన్ 14న స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు అభినందనలు తెలుపుతూ ఫేస్బుక్ ద్వారా ఓ మెసేజ్ పెట్టా. టెలిగ్రామ్ యాప్లో మాట్లాడదామంటూ ఆయన నాకు అందులో మళ్లీ మెసేజ్ చేశారు. నా గురించి వివరాలు తెలుసుకున్నారు. నా ఫోన్ నెంబర్ తీసుకుని, ఆయన నెంబర్ నాకు ఇచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, నువ్వు ఒంటరివి కాదు.. నీకు నేనున్నానంటూ హామీ ఇచ్చారు. మొదటి రోజే రెండు మూడు గంటలు పాటు మాట్లాడారు. రెండు రోజులకే వీడియో కాల్ చేసి నగ్నంగా చూపించాలని (న్యూడ్స్) నన్ను అడిగారు. అది కరెక్ట్ కాదని చెప్పినా వినకుండా బెదిరించి, బలవంతం చేశారు. నువ్వొక చిన్న ఉద్యోగివి.. నీమీద ఎంక్వైరీ వేస్తాం.. నీ కుమారుడితో ఒంటరిగా ఉంటున్నావు.. నీ కుమారుడికి ఏమైనా అయితే తరువాత నన్ను అడగొద్దు.. జాగ్రత్త! అంటూ భయపెట్టారు. నీ భవిష్యత్తు నాశనం కాకూడదంటే నన్ను కలిసి తీరాల్సిందేనని హెచ్చరించారు. దీంతో నేరుగా కలసి ఆయనకు అర్థం అయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో 2024 జూలై 9న మొదటిసారి కలిశా. మా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను కారులో తీసుకెళ్లారు. కడప మార్గంలో రాజంపేట దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి నన్ను లైంగికంగా వేధించారు. నేను వద్దంటూ వారించి, విడిపించుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేసినా, కారు డోర్ తెరిచి తప్పించుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. నేను అరుస్తుంటే జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టి కారులోనే రేప్ చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. ఆ తరువాత మళ్లీ మళ్లీ నన్ను కలుస్తూనే ఉన్నారు. ఐదుసార్లు గర్భం తీయించారు.. ఆగస్టులో నాకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల గర్భం రావడంతో అబార్షన్ చేయించుకోమని చెప్పారు. రెండు మూడు రోజులు బెదిరించిన తరువాత నా భర్తకు విడాకులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించారు. రెండు నెలలు వరకూ అబార్షన్ చేయించుకోకపోవడంతో ఇంటికి వచ్చి నన్ను బాగా కొట్టేవారు. ఆ తరువాత అబార్షన్ చేయించుకున్నా. అలా ఏడాదిన్నరలో ఐదుసార్లు అబార్షన్ చేయించారు. నాకు ఇష్టం లేదని చెప్పినా వినకుండా బయటకు తీసుకువెళ్లడం లేదా ఇంటికి వచ్చి నన్ను లైంగికంగా వాడుకున్నారు. నేను ఇంటి తలుపులు తెరవకపోతే ఎమ్మెల్యే అని కూడా మర్చిపోయి గుమ్మం ముందు నిలబడే ఉండేవారు. అంతేకాకుండా నా భర్త, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నెంబర్లు తెలుసుకుని వారికి ఫోన్లు చేశారు. నాకు విడాకులు ఇవ్వాలని నా భర్తకు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అందరూ నా నుంచి దూరమైపోయారు. నా బిడ్డ కూడా గత ఆరు నెలలుగా నాతో లేడు. ఇలా నన్ను అన్ని విధాలుగా ఒంటరిని చేసిన తరువాత.. నన్ను పెళ్లి చేసుకోవడం కుదరని, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించారు. ఏడాదిన్నరగా నన్ను వేధించి, వాడుకుని ఇప్పుడు వదిలేస్తానంటున్నారు. ఆయన స్నానం చేస్తున్నప్పుడు కూడా నేను వీడియో కాల్ చేయాలనేవారు. నన్ను నగ్నంగా చూడాలనేవారు. నాతోనే కాకుండా ఆ ఎమ్మెల్యే ఇలా చాలా మంది మహిళలను వేధించారు. నాకు న్యాయం కావాలి! -
అరవ అ‘రాస’కత్వాలెన్నో..
సాక్షి, అమరావతి: రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకత్వం అంతా ఇంతా కాదని, అతని చేతిలో లైంగిక వేధింపులకు ఎందరో గురయ్యారని బాధిత మహిళా ఉద్యోగిని విమర్శించారు. శ్రీధర్ తల్లి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. శ్రీధర్ తననే కాకుండా మరికొందరు కాలేజ్ అమ్మాయిలనూ లైంగికంగా వేధించారని, వారిని లోబరుచుకోవడానికి యత్నించారని ఆమె వెల్లడించారు. ఆ విషయాన్ని కూటమి నేత తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా తనతో ఫోన్లో చెప్పారని, ఇప్పుడు అదే నేత తనను తప్పుపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. శ్రీధర్ తల్లి, కూటమి నేత తాతంశెట్టి నాగేంద్ర విలేకరుల సమావేశం పెట్టి, నేను చూపించిన వీడియోలు డీప్ ఫేక్ అని అంటున్నారు. ఇదే నాగేంద్ర నాలుగు రోజల కిందట నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల గురించి మరిన్ని వివరాలు నాగేంద్ర నాతో చెప్పారు. ‘‘శ్రీధర్ నిన్ను మోసం చేశాడు. నిన్నే కాదు నా కొడుకు చదివే కాలేజీలో ఉండే అమ్మాయిలు కూడా కంగ్రాట్స్ చెప్పడానికి మెసేజ్ చేస్తే వాళ్లతో కూడా రాంగ్ ట్రాక్ నడిపాడు. డీప్ ఫ్లర్ట్ చేశాడు’’ అని అన్నారు. నా దగ్గర ఆ కాల్ రికార్డింగ్ ఉంది. అంతేకాదు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయాలని నాకు మెసేజ్ కూడా చేశారు. శ్రీధర్ కూడా అవన్నీ ఫేక్ వీడియోలు అని కౌంటర్ వేశారు. నా సెల్ఫోన్ను తీసుకుని అందులో ఉన్న ఈ వీడియోలు ఒరిజనల్ అవునో కాదో పోలీసులు పరిశీలిస్తే తేలుతుంది. ఏడాదిన్నరగా బయటకు రాకపోవడానికి కారణం.. ముందు నేను శ్రీధర్ తల్లిదండ్రులు, మాజీ ఎమ్మెల్యే రూపానంద రెడ్డితో మాట్లాడాను. కానీ నేను ఏం చెప్పినా వారు అతనిని మందలించకుండా, అతనిని కాపాడటం కోసం నన్ను తప్పుపడుతున్నారు. ఎలాంటి విచారణకైనా నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు న్యాయం జరిగే వరకూ పోరాడతాను.అరెస్టు చేసే దమ్ముందా? అమ్మా.. హోంమంత్రి అనితమ్మా.. ఈ దారుణమైన మీ కూటమి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని అరెస్ట్ చేసే దమ్ముందా? లేదా? ఈ బాధితురాలికి న్యాయం చేసే బాధ్యత మీకు ఉందా? లేదా? – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సీఎం, డిప్యూటీ సీఎం నోరు విప్పాలిరాష్ట్రంలో మహిళలకు, మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందనడానికి కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగినిపై చేసిన లైంగిక దాడి ప్రత్యక్ష నిదర్శనం. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఏం సమాధానం చెబుతారు. వారు నోరు విప్పాలి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం మహిళలకు రక్షణ లేదు ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అని మాట్లాడిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకటి మాత్రం వాస్తవం. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. – విడదల రజిని, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అకృత్యాలపై మౌనమేల? ప్రజాప్రతినిధులే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో ఎంతటి దుస్థితి నెలకొందో చెప్పాల్సిన పనిలేదు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అకృత్యాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఎందుకు మౌనంగా ఉన్నారు? – రోజా, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత -
భగ్గుమన్న పొగాకు రైతులు
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పొగాకు రైతులు భగ్గుమన్నారు. సిగరెట్లపై 70 శాతానికిపైగా పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని తక్షణమే ఉపసంహరింపచేయాలని ఆందోళన చేశారు. నెల్లూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన 400 మందికిపైగా పొగాకు రైతులు తరలివచ్చి కార్యాలయం బయట ఆందోళన చేశారు. కేంద్రం తీసుకున్న పెంచిన సుంకాలను తక్షణమే ఉపసంహరింప చేయకపోతే పొగాకు రైతులతోపాటు పరిశ్రమపై ఆధారపడిన లక్షలాదిమంది జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా పొగాకు సంఘాల ప్రతినిధులు సీఎంను కలిశారు. ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల పరిశ్రమకు కలిగే నష్టాలను వివరించారు. ఇప్పటికే మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వల్ల ధర లేక ఈ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోయారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెంచిన ఎక్సైజ్ సుంకం ప్రభావం వలన పొగాకు మార్కెట్ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. మార్కెటింగ్ సీజన్కు ముందే ఈ ప్రభావం క్షేత్ర స్థాయిలో కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచడం వలన అక్రమ సిగరెట్ల వ్యాపారం, అక్రమ రవాణా పెరిగిపోతోందన్నారు.పన్నులు చెల్లించని, నియంత్రించని ఉత్పత్తులు మార్కెట్ను ఆక్రమించడమే కాక, నాసిరకం ఉత్పత్తుల కారణంగా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయన్నారు. సుంకం పెంపు వల్ల ఎఫ్సీవీ పొగాకును అత్యధికంగా ఉత్పత్తి చేసే ఆంధ్రప్రదేశ్కు అపార నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. తక్షణమే కేంద్రం సుంకం పెంపును వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రైతు ప్రతినిధులు చంద్రబాబును డిమాండ్ చేశారు. అనంతరం పొగాకు రైతులు మీడియాతో మాట్లాడుతూ సీఎం సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని వివరించారు. -
కామ‘కూటమి’
సాక్షి, అమరావతి: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి పార్టీల నేతలు కామకూట విషం గక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలనే బెదిరించి.. బ్లాక్ మెయిల్ చేసి.. విశృంఖలంగా లైంగిక దాడులు కొనసాగిస్తుండటం చూస్తుంటే ఇక సామాన్య మహిళల సంగతేమిటంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విప్ పదవిలో ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఐదుసార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించినట్లు బాధితురాలు స్వయంగా చెప్పిన వీడియో మంగళవారం ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూసినా కూటమి పెద్దల నుంచి కనీస స్పందన లేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి కూటమి నేత కిరణ్ రాయల్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి మద్దతుదారు జానీ మాస్టర్.. ఇలా ఎంతో మంది దురాగతాలు బట్టబయలు కావడం కలకలం రేపింది. ఇక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల ద్వితీయ శ్రేణి నేతల ఆగడాలు, మహిళలపై వేధింపులు తరచూ బయట పడుతూనే ఉన్నాయి. స్థానిక నేత తనను మోసం చేశారంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం పోలీసు స్టేషన్లో పది రోజుల క్రితం ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడేంత కఠినంగా చట్టాలు అమలు చేస్తామన్న ఆయా పార్టీల పెద్దలు.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఇలా మహిళలను దారుణంగా వేధిస్తున్నా.. బహిరంగ వీడియోల్లో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికినా.. బెదిరించి గర్భవతులను చేసి అబార్షన్లతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నా కనీసం కట్టడి చేయక పోవడంపై జనం నివ్వెరపోతున్నారు. కిరణ్ రాయల్ వికృత చేష్టలు తిరుపతి కూటమి నేత కిరణ్ రాయల్ వికృత చేష్టలు గత ఏడాది ఫిబ్రవరి 8న బాధిత మహిళ రిలీజ్ చేసిన వీడియో ద్వారా బయపడ్డాయి. తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన ఆమెతో కిరణ్రాయల్ చనువు పెంచుకుని డబ్బులు అడిగేవారని, కిరణ్ రాయల్కు అప్పులు చేసి మరీ రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత డబ్బులు అడిగితే రాయల్ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ తరువాత కూటమి పెద్దలు ఆమెకు, కిరణ్ రాయల్ మధ్య బలవంతంగా రాజీ కుదిర్చారు. ఆదిమూలం.. అరాచకం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కూడా కేవీబీపురం మండలంలో ఓ మహిళా నేతను బెదిరించి రాసలీలలు సాగించారు. ఆనక ఆమెను మోసం చేసి బెదిరింపులకు గురిచేశారు. అరాచకాలకు తెగబడ్డారు. ఈ వ్యవహారంపై బాధితురాలు బయటకు వచ్చి చెప్పడంతో ఆయన అసలు రంగు బయటపడింది. మంత్రి సుభాష్ అశ్లీల నృత్యాలు సంక్రాంతి సంబరాల పేరుతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బహిరంగంగా చేసిన అశ్లీల నృత్యాలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలోని ఏఎస్ఎన్ కాలేజీలో సంక్రాంతి సంబరాల పేరిట ఇటీవల మ్యూజికల్ నైట్లు, డ్యాన్స్లు నిర్వహించారు. బుల్లితెర నటులు, జబర్దస్త్లో మహిళా క్యారెక్టర్లు వేసే నటులతో కలిసి మంత్రి సుభాష్ పండగ మూడు రోజులూ పలు పాటలకు అసభ్యంగా చిందులు వేశారు. ఈ వీడియోలు సామాజికమాధ్యమాల్లో చక్కెర్లుకొట్టడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా మంత్రి తన నృత్యాలను సమర్థించుకున్నారు. ‘నేను మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా నేను నేనుగానే ఉంటాను. ఇలానే ఉంటాను’ అంటూ వింత వాదనకు దిగారు. కూన రవి వేధింపులకు దళిత ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక ఓ దళిత మహిళా ఉద్యోగి, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య గతేడాది ఆగస్టు 18న ఆత్మహత్యకు యత్నించారు. అంతకు ముందు ఆమె శ్రీకాకుళం తిలక్నగర్లోని తన నివాస గృహంలో ఓ ఎల్రక్టానిక్ మీడియాకు రవి వేధింపులపై ఇంటర్వ్యూ ఇచ్చారు. అనంతరం తన గదిలోకి వెళ్లి బీపీ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మాట్లాడుతూ.. పక్కకు తూలిపోవడంతో ఆమెను వెంటనే రిమ్స్కు తరలించారు. వైద్యులు 48 గంటల పర్యవేక్షణలో ఉంచారు. ఎమ్మెల్యే వేధింపుల వల్లే తనకీ దుస్థితి వచ్చిందని, ఆయన తన కార్యకర్తల చేత తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిస్తున్నారని, తరచూ వీడియో కాల్లో మాట్లాడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వల్ల తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బెత్తంతో కొట్టి తోలు తీసే చట్టాలేవి? ఈవ్ టీజింగ్కు పాల్పడేవారిని, ఆడపిల్లలను అభద్రతా భావానికి గురిచేసే వారిని పది మంది చూస్తుండగా వాతలు తేలిపోయే బెత్తంతో కొట్టి తోలు తీసే చట్టాలు రావాలని కూటమి పెద్దలు పలు సందర్భాల్లో చెప్పారు. అధికారంలో లేనప్పుడైతే.. తమకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని, రాష్ట్రంలో 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారంటూ ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు వారే ప్రభుత్వ పెద్దలుగా కొనసాగుతుండడంతో పాటు కేంద్రంలోని ఎన్డీఏలో మిత్రపక్షంగానూ ఉన్నారు. మరి రాష్ట్రంలో మహిళలపై కూటమి నేతల అఘాయిత్యాలు, కీచక పర్వాలపై నిఘా వర్గాల నుంచి ముందస్తు సమాచారం లేదా? లేదంటే తెలిసీ మౌనంగా ఉన్నారా? అనే ప్రశ్నలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. కాగా, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరలో ఐదుసార్లు గర్భవతిని చేసి, అబార్షన్లు చేయించారన్న బాధితురాలి వీడియో వెలుగులోకి రావడానికి ముందు కూటమి పెద్దల్లో ఒకరు విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది. కొందరి వివాహేతర సంబంధాలను పార్టీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆ ప్రకటనలో చెప్పుకొచ్చారు. తద్వారా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంపై వారికి ముందుగానే సమాచారం ఉందా? అని విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాధితురాలిపైనే ఎదురు దాడికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.ఇందులో పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. -
‘జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను సస్పెండ్ చేయాలి’
సాక్షి,తాడేపల్లి: మహిళపై దారుణానికి ఒడిగట్టిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆయన్ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేదు. మహిళలపై బరి తెగించి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. మహిళల జీవితాలతో అడుకుంటున్నారు. తప్పు చేస్తే శిక్షిస్తారనే భయం లేకుండా పోయింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేశాడు.అతనిపై ఇంకా ఎందుకు కేసులు పెట్టలేదు?. తప్పుడు పనులు చేసే వారికే ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. రాప్తాడులో పద్నాలు మంది టీడీపీ కార్యకర్తలు లైంగిక దాడి చేస్తే కేసు లేదు. కిరణ్ రాయల్ అనే జనసేన నేత లక్ష్మి అనే మహిళ జీవితాన్ని రోడ్డున పడేశాడు. కోట వినూత మీద టీడీపీ ఎమ్మెల్యే స్పై చేస్తే చర్యలు లేవు. తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస రావు వలన మహిళా వీఆర్వోపై దాడి చేసినా చర్యలు లేవు.ఇప్పుడు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళకు ఐదుసార్లు అబార్షన్ చేయించాడు. లొంగక పోతే ఆమె కొడుకుని చంపుతానని బెదిరించాడు. పవన్ కళ్యాణ్ కనీసం ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తారా?. మహిళపై చేయి వేస్తే అదే చివరి రోజు అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు?. మహిళా హోంమంత్రి అనితకు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు కనపడటం లేదా?. మంత్రి సంధ్యారాణి పీఏ మహిళను అన్యాయం చేస్తే తిరిగి బాధితురాలి మీదే కేసు పెట్టారుఅధికారమదంతో ఉన్న ఇలాంటి వారి వల్ల మహిళలకు రక్షణ ఉంటుందా?. అసలు రాష్ట్రంలో మహళా కమిషన్ ఏం చేస్తోంది?. సుమోటోగా ఎందుకు కేసు పెట్టలేదు?.బలహీనతలు ఉంటే బయటకు రానీయవద్దని ప్రకటన చేసిన పార్టీ జనసేన. తప్పులు చేయవద్దని చెప్పకుండా వీడియోలు బయటకు రానీయవద్దన్న ఏకైక పార్టీ జనసేన’అని మండి పడ్డారు. -
‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అత్యంత దుర్మార్గం’
సాక్షి,ఢిల్లీ: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గం. పేద ప్రజలను వైద్య విద్యకు దూరం చేసేందుకు చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గళం విప్పుతాం’అని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో మంగళవారం ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్లు మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడారు. ‘అమరావతికి మేము వ్యతిరేకం కాదు.అమరావతికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడాలని బిల్లులో పెడితే మద్దతు ఇస్తాం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం అత్యంత దుర్మార్గం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో గళం విప్పుతాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు మూలన పడేశారు. దానికి నిధులు కేటాయించకుండా రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారు. ఏపీ అప్పుల కుప్పగా మారిపోయింది.నిర్దేశించిన సీలింగ్కు మించి 69 శాతం ఎక్కువగా అప్పులు చేశారు.అప్పుల తెచ్చిన నిధులను ఏం చేస్తున్నారు. కనీసం సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయడం లేదు. 8 త్రైమాసిక ఫీజులు చెల్లించలేదు. కనీసం హాస్టల్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉంటున్నారు. రైతులకు పంటల భీమా అమలు చేయడం లేదు.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి తగ్గించిన నిధులను కేంద్ర నుంచి తీసుకురావాలి.కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ... నిధుల లోటును పూడ్చేలా కృషి చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
సేవలు పూర్..అయినా టాప్ స్కోర్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారైంది. పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా మారడంతో వార్డులు కంపుకొడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఐవీఆర్ఎస్ సర్వేలోనే డీఎంఈ ఆస్పత్రుల్లో పరిశుభ్రతపై 47.37 శాతం... అంటే దాదాపు సగం మంది రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పారిశుద్ధ్య పనులు నిర్వహించే కాంట్రాక్ట్ సంస్థలకు పనితీరుకు 100కు 96 స్కోర్లు ఇచ్చేస్తోంది. అధ్వానంగా సేవలు అందిస్తున్న కాంట్రాక్టు సంస్థలకు భారీ స్కోర్లు ఇచ్చి, కాంట్రాక్ట్ నిబంధనలు సైతం తుంగలో తొక్కి 100 శాతం బిల్లులు చెల్లించడం ద్వారా కమీషన్లు దండుకోవడానికి అధికార పార్టీ నేతలు, అధికారులు మాయ చేస్తున్నారు. సీఎం బంధువు సంస్థ సేవల్లో ఘోరం.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గతేడాది ప్రభుత్వాస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ నిర్వహణకు టెండర్లు పిలిచారు. కోరినంత కమీషన్లు ఇవ్వడానికి ముందుకొచ్చిన, పక్క రాష్ట్రాల్లో టెర్మినేట్ అయిన సంస్థలకు సైతం ప్రభుత్వ పెద్దలు కాంట్రాక్ట్లు కట్టబెట్టేశారు. డీఎంఈలో జోన్–3 (రాయలసీమ)లోని ఆస్పత్రుల పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్ట్ను సీఎం బంధువుకు చెందిన పద్మావతి సంస్థకు ఇచ్చారు. తొలుత శానిటేషన్, సెక్యూరిటీ నిర్వహణకు ఉమ్మడి టెండర్ పిలిచారు. అయితే, దానికి పద్మావతి సంస్థ దాఖలు చేసిన బిడ్కు అర్హత లేదని తేలింది. దీంతో ఏకంగా టెండర్నే రద్దు చేసి పారిశుద్ధ్యం, సెక్యూరిటీకి వేర్వేరుగా ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.ఇప్పుడు పద్మావతి సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్పత్రుల్లో పరిశుభ్రతపై ఏకంగా 45 శాతం మంది వరకు రోగులు, వారి బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అయినా సీఎం బంధువు సంస్థ కావడంతో సేవలు ఎలా ఉన్నా సరే పనితీరుకు ఏకంగా 96 స్కోర్లు ఇచ్చేస్తున్నట్టు వెల్లడైంది. గత డిసెంబర్ నెలలో ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో అనంతపురం జీజీహెచ్లో పరిశుభ్రతపై 43.8 శాతం రోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. అయినా ఆ నెల పద్మావతి సంస్థ పనితీరుకు 96 స్కోర్ ఇచ్చారు.ఇంత స్కోర్ దక్కించుకున్న సంస్థ అటెండెన్స్ పర్సంటేజ్ గమనిస్తే డిసెంబర్ నెలలో 58.71 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. రోగుల సంతృప్తి, కాంట్రాక్ట్ సంస్థ సిబ్బంది హాజరు 60 శాతం దాటకపోయినా... సీఎం బంధువు సంస్థ కావడంతో అధ్వాన పనితీరుకు కూడా 96 మార్కులు ఇచ్చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే నెలలో తిరుపతి రుయా, కడప మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో 40 శాతం చొప్పున, కడప జీజీహెచ్లో 42.31 శాతం మంది రోగులు పద్మావతి పనితీరును చీదరించుకోగా, ఆ సంస్థ పనితీరుకు ప్రభుత్వం మాత్రం ఏకంగా 90 నుంచి 96 స్కోర్లు ఇచ్చేసింది. జోన్–2లోనూ అదే దుస్థితి.. ఏపీలో టెండర్లు కొనసాగుతున్న సమయంలోనే పక్క రాష్ట్రంలో టెర్మినేట్ అయిన ఆల్ సర్వీసెస్ సంస్థకు ప్రభుత్వం జోన్–2 ఆస్పత్రుల శానిటేషన్ కాంట్రాక్ట్ను కట్టబెట్టింది. ఇప్పుడు ఆ సంస్థ సేవలు అందిస్తున్న నెల్లూరు జీజీహెచ్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని 36 శాతం మంది రోగులు అసంతృప్తి వ్యక్తంచేయగా, ప్రభుత్వం మాత్రం అద్భుతంగా పని చేస్తోందని 96 స్కోర్ ఇచ్చింది. విజయవాడ జీజీహెచ్లో 37 శాతం మంది రోగులు పారిశుద్ధ్య నిర్వహణ బాగాలేదని తెలియజేసినా 93 స్కోర్ ఇవ్వడం గమనార్హం.నిబంధనలు తుంగలో తొక్కి శానిటేషన్లో 20, సెక్యూరిటీలో 9 ప్రమాణాలకు 100 చొప్పున స్కోర్లు ఉంటాయి. వీటికి 95 మేర స్కోర్లు ఉండటంతోపాటు ఎఫ్ఆర్ఎస్ (ఫేస్ రికగ్నేషన్ సిస్టం) అటెండెన్స్ 95 శాతం చొప్పున ఉంటేనే కాంట్రాక్ట్ సంస్థలకు 100 శాతం బిల్లులు ఇవ్వాలని నిబంధనలున్నాయి. వీరికి వంద శాతం బిల్లులు వస్తేనే తమకు ఎక్కువ కమీషన్ ఇస్తారని ముఖ్య నేతల ఒత్తిళ్లతో ఆస్పత్రుల్లో అధికారులు శానిటేషన్, సెక్యూరిటీపై పర్యవేక్షణ గాలికొదిలేసి, అధ్వానమైన పనితీరుకు కూడా ఏకంగా 96 శాతం మేర స్కోర్లు ఇచ్చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.మరోవైపు బిల్లుల చెల్లింపుల్లో టెండర్ నిబంధనలను సైతం ఉన్నతాధికారులు తుంగలో తొక్కేసినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ సంస్థలు ఆస్పత్రుల్లో పనులు మొదలు పెట్టిన రోజు నుంచే ఎఫ్ఆర్ఎస్ 95 శాతం సహా ఇతర నిబంధనలు అమలవ్వాలి. అయితే గతేడాది జూన్, జూలైలో కొత్త కాంట్రాక్ట్ సంస్థలు పనులు మొదలు పెట్టాయి. వీరికి బిల్లుల చెల్లింపుల్లో గతేడాది డిసెంబర్ వరకు ఉన్నతాధికారులు నిబంధనల్లో పలు సడలింపులు ఇచ్చారు. ఇది టెండర్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని విమర్శలు వినిపిస్తున్నాయి. -
పోగు బంధం అంధకారం
‘మేం అధికారంలోకి వస్తే చేనేత బతుకుల్లో వెలుగులు నింపుతాం.. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం..ఇదీ నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ.. గద్దె నెక్కిన తరువత ఆ హామీ తూచ్ అన్న చందంగా మారింది. బాబు హామీల అమలుకు ప్రతిపక్షాల ఒత్తిడితో తూతూ మంత్రంగా చేనేతకు ఉచిత విద్యుత్ జీఓ.. ఏడాదిగా అమలులోకి రాని గవర్నమెంట్ ఆర్డర్. వెరసి నెలానెలా పెరుగుతున్న విద్యుత్ చార్జీలతో చేనేత బతుకుల్లో చీకట్లు అలుమున్నాయి. పెట్టుబడులు భరించలేక నేత పనులు సాగక.. పండుగపూటా పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. వెంకటగిరి(సైదాపురం): ఉచిత విద్యుత్ జీఓ ఇచ్చి ఏడాది కావస్తున్నా అమలు కాకపోవడంతో కాంతి లేని సంక్రాంతిని జరుపుకోవాల్సి వచ్చిందని నేతన్నలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవర్ లూమ్స్కు మంచి రోజులు వస్తాయని నేతన్నలు ఆశించారు. అయితే ప్రభుత్వం కొలువు దీరి రెండేళ్లు కావస్తున్నా విద్యుత్ బాదుడు కొనసాగుతూనే ఉంది. కంటి తుడుపుగా జీఓ ఇచ్చి చేతులు దులుపుకోవడంపై నేతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఓ అమలుపై ఇప్పటికే విద్యుత్ అధికారులకు వినతులు ఇచ్చిన నేత కార్మికులు ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. ఉచిత విద్యుత్ జీఓతో నేతన్న జీవితాల్లో కొత్త వెలుగులు విరజిమ్మాతాయనుకుంటే గాఢాందకారం అలుముకుంది. కొత్త ఏడాదిలోనైనా చంద్ర కాంతులతో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలన్న నేతన్నలకు నిరాశే మిగిలింది. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద రంగం చేనేత రంగం. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితి ఎదుర్కొంటోంది. లయబద్ధంగా వినడే పవర్లూమ్స్ ధ్వని వినిపించడం తగ్గిపోతుంది. ఇందుకు వివిధ సుంకాల పేరిట పెరిగిన విద్యుత్ చార్జీలే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. చాలీ చాలని కూలీలతో తమ జీవితాలు అప్పుల పాలవుతన్నాయనని నేత కార్మీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మార్చి 26వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత విద్యుత్ జీఓ నంబర్ 44కు ఏడాది కావస్తున్న అమలు కాలేదు. ఒత్తిడి తెచ్చినా... అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో దిగివచ్చిన బాబు ప్రభుత్వం గత ఏడాది మార్చిలో జీఓను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల వాస్తవ సంఖ్యను పవర్ లూమ్ యానిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా నూలు, పట్టు చేనేత కుటుంబాలు 2.79 లక్షల మంది ఉండగా కేవలం 93 వేల మందిగా చూపించారు. అలాగే మరగ్గాలు 81 వేలు ఉండగా 10,534 ఉన్నట్లు చూపారు. ఈ లెక్కల ప్రకారం చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు పవ్లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు జీఓలో స్పష్టం చేశారు. ఇందుకు ఏడాదికి సుమారు రూ. 125 కోట్లు ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. జీవో అమలుకు డిస్కామ్ సంస్థలు బడ్జెట్ మంజూరు చేయాలని ప్రతిపాదించాయి. అయితే నిధులు విడుదల కాకపోవడంతో నేటికీ జీఓ అమలకు నోచుకోలేదు. ప్రతి నెలా యథావిధిగా పెరిగిన విద్యుత్ చార్జీలు బిల్లును అందుకుంటున్న నేతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఇంధన శాఖకు తగిన బడ్జెట్లో నేత కార్మీకులకు ఉచిత విద్యుత్ జీఓ విడుదలతోపాటు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఏడాది గడిచినా జీఓ అమలు కావడంలేదు. దీనిపై అధినేతను అడగలేక అడుగుతున్నవారికి సమా«ధానాలు చెప్పలేక స్థానిక నేతులు తికమక పడుతున్నారు.గత ప్రభుత్వంలో ఆదుకున్న నేతన్న నేస్తంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందించింది. అంతేగాకుండా విద్యుత్చార్జీలు నుంచి 96 పైసల యూజర్స్ చార్జీలను తగ్గించి వెసులుబాటు కలి్పంచింది. గత ఎన్నికల సమయంలో ప్రతి పక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు బహిరంగ సభల్లో చేనేత పవర్లూమ్స్ కార్మీకులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామంటూహామీ ఇచ్చారు. దీనిని గుడ్డిగా నమ్మిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేత కార్మీకులు కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన బాబు మాత్రం నాటి ఎన్నికల హామీకి ఎగనామం పెట్టడంతో పాటు వివిధ సుంకాలపేరిట విద్యుత్ చార్జీలను పెంచి నేత కార్మీకుల నడ్డి విరుస్తున్నారు.ఉచిత విద్యుత్ అమలు చేయాలి ఉచిత విద్యుత్ పేరిట జీఓ ఇచ్చి ఏడాదవుతున్నా అమలు చేయకపోవడం దారుణం. పెరిగిన విద్యుత్ చార్జీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 15 ఏళ్లుగా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. ఇక్కడ మా పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఉచిత విద్యుత్ జీఓను వెంటనే అమలు చేయండి. – బాలాజీ, నేత కార్మీకుడు, వెంకటగిరినేతన్న నేస్తం అమలు చేయాలిగత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అమలుచేయాలి. ఈ పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ. 24వేలు ఆర్థిక సాయం అందడంతో మా కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఉచిత విద్యుత్తోపాటు నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలి. –రవి, నేత కార్మీకుడు, వెంకటగిరిప్రత్యేకపోరాటానికి సిద్ధం ఉచిత విద్యుత్పై గత ఏడాది మార్చిలో జీఓ విడుదల చేసినప్పటీకీ పథకం అమలు చేయకపోవడం నేత కార్మీకుల ను మోసం చేయడమే. దీనిపై ఇప్పటికే పలుచోట్ల అధికారులకు వినతి పత్రం సమర్పించాం. అయినా ఫలితం శూన్యం. విధిలేక అన్నీ కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పారీ్టలతో కలసి ప్రత్యక్ష పోరాటానికి నేత కార్మికులు సిద్ధమవుతున్నారు. – కూన మల్లిఖార్జునరావు -
స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలు
సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధన కోసం పది సూత్రాల ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. 77వ గణతంత్ర దిన రాష్ట్ర స్థాయి వేడుకలను రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడులో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు బలగాల పరేడ్ను తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు.అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో తొలిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించడం ద్వారా ఈ గణతంత్ర వేడుకలు చారిత్రక ఘట్టంగా నిలిచాయన్నారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధన కోసం పేదరిక నిర్మూలన(జీరో పావర్టీ), ఉపాధి కల్పన–నైపుణ్యాభివృద్ధి, జనాభా నిర్వహణ–మానవ వనరుల అభివృద్ధి, నీటిభద్రత, రైతు–అగ్రిటెక్, లాజిస్టిక్స్–మౌలిక సదుపాయాలు, ఇంధనం–పరిశ్రమలు, ఏపీ బ్రాండ్, స్వచ్ఛాంధ్ర–సురక్షాంధ్ర, డీప్టెక్–స్మార్ట్ ఆంధ్రా వంటి పది సూత్రాలను ప్రభుత్వం నిర్దేశించుకుందని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుందని గవర్నర్ తెలిపారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తోపాటు వివిధ ప్రాంతాల్లో ఎల్రక్టానిక్ టాయ్, సోలార్, డ్రోన్, స్పేస్, బల్క్ డ్రగ్ సిటీలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 2027 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ చెప్పారు. అదే ఏడాది జూన్ నాటికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు పూర్తి చేసి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. నదుల అనుసంధానం ద్వారా ప్రతి సాగు భూమికి నీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాయలసీమను దేశానికే హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. గుంతలు లేని రోడ్ల లక్ష్యంతో పనులు వేగవంతం చేశామన్నారు.జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందని, రామాయపట్నం సహా 4 కొత్త పోర్టుల నిర్మాణం జరుతోందని అన్నారు. 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యంతో గ్రీన్ హైడ్రోజన్ క్యాపిటల్గా రాష్ట్రం ఎదుగుతుందన్నారు. ‘మన మిత్ర’ ద్వారా వాట్సాప్లోనే 119 ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన.. మొదటి స్థానంలో సాంస్కృతిక శాఖ శకటం గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందేమాతరం రచించి 150 సంవత్సరాలైన అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. మహిళా సంక్షేమం, పరిశ్రమల శాఖ శకటాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చాయి. కవాతులో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఇండియన్ ఆర్మీ కంటింజెంట్కు మొద టి స్థానం, విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలి యన్ రెండోస్థానం పొందాయి. కేరళ రాష్ట్ర పోలీస్ కంటింజెంట్కు ప్రోత్సాహక బహుమతి లభించింది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
నమ్మక ద్రోహం.. రూ. 20 వేల కోట్ల భారం
సాక్షి, అమరావతి: ‘ఓట్లేసి గెలిపించండి.. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం.. అవసరమైతే తగ్గిస్తాం’ అని ఎన్నికల ముందు నమ్మించి గద్దెనెక్కిన చంద్రబాబు ఆనక మాట తప్పారు. కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ బిల్లులు పెంచి, జనం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పదవి చేపట్టిన 18 నెలల్లోనే ఏకంగా రూ.20,136 కోట్ల భారం వేశారు. బాబు నిర్వాకంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడింతలు పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారు. బాబు నమ్మించి నిండా ముంచారని మండిపడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో కరెంట్ చార్జీలు పెరగలేదని గుర్తు చేస్తున్నారు. తాము అధికారంలోకి వచి్చన తర్వాత అసలు విద్యుత్ చార్జీలే పెంచలేదని, పైగా తగ్గించామని సీఎం చంద్రబాబుతో పాటు, రాష్ట్ర మంత్రులు కూడా బుకాయిస్తుండటం విస్తుగొలుపుతోంది. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలతో ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024 నవంబర్లో రూ.6,072.86 కోట్లు, 2025లో రూ.9,412.50 కోట్లు, 2024–25 ఆర్థిక ఏడాదిలో రూ.1,863.64 కోట్లు, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ.2,787 కోట్లు వడ్డించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) తప్పు పట్టింది. ఇందులో రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతిస్తూ, మిగతా రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. దానినే యూనిట్కు రూ.0.13 పైసలు చొప్పున వినియోగదారులకు వెనక్కు ఇస్తున్నారు. అంతేగానీ ఇదేమీ చంద్రబాబు ప్రభుత్వం ఊరకే ఇస్తున్నది కాదు. ప్రభుత్వం దానం చేస్తున్నదీ కాదు. అయితే ఇదంతా కూడా తమ దయాదాక్షిణ్యమేనని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఎల్లో మీడియా ద్వారా తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటోంది. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యూనిట్కు అదనంగా రూ.0.40 పైసలు చొప్పున వసూలు చేసేస్తున్నారు. చంద్రబాబు నిర్వాకం.. మరో రూ.14,186 కోట్ల భారం మార్కెట్లో విద్యుత్ తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు అంతకన్నా తక్కువ ధరకు తీసుకుంటే తప్పా? లేక తక్కువ ధరకు వచ్చేదానిని కాదని ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయడం తప్పా? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి యూనిట్ రూ.2.49 చొప్పున సౌర విద్యుత్ కొనడం మంచిదా.. లేక ప్రైవేటు రంగ సంస్థ యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి యూనిట్ రూ.4.60 చొప్పున తీసుకోవడం మంచిదా? సౌర విద్యుత్ కొనుగోలుకు తమతో ఒప్పందం చేసుకుంటే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహకంగా అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎస్టీఎస్)ల నుంచి మినహాయింపు వస్తుందని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) చెప్పినా, సెకీతో కుదుర్చుకునే పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలకు అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల్చినా చంద్రబాబుకు పట్టలేదు. సెకీ ఒప్పందాలకు పాతికేళ్ల పాటు విద్యుత్ ప్రసార చార్జీలు ఉండవని కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ) స్పష్టం చేసినా చెవికెక్కలేదు. చివరికి ‘సెకీ’, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిన విద్యుత్ సరఫరా ఒప్పందంలోనూ ఐఎస్టీఎస్ చార్జీలు వంద శాతం మాఫీ అని స్పష్టంగా ఉన్నా పట్టించుకోలేదు. కేవలం గత ప్రభుత్వంపై బురద జల్లాలి.. జగన్పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం కక్కాలి.. ఇవే అజెండాగా రోజుల తరబడి టీడీపీ, దాని అనుబంధ మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియాలో అసత్య కథనాలు రాశాయి. కానీ చంద్రబాబు నిర్వాకం వల్ల పాతికేళ్ల పాటు 400 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ద్వారా ఏకంగా రూ.14,186 కోట్ల భారం పడుతుంది. సెకీతో ఒప్పందం చేసుకోవడం వల్ల అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు వస్తుంది. కానీ యాక్సిస్తో పీపీఏలకు ఆ మినహాయింపు కూడా రాదు. పైగా పవన, సౌర హైబ్రీడ్ విద్యుత్ ఇప్పుడు మార్కెట్లో యూనిట్ రూ.2.90 కంటే తక్కువకే దొరుకుతోంది. అలాంటప్పుడు ప్రైవేట్ డెవలపర్ నుంచి యూనిట్ రూ.4.60కి కొనాల్సిన అవసరం ఏమిటో, దాని వెనుక అసలు కారణాలేమిటో చంద్రబాబు సర్కారే చెప్పాలి. జగన్ హయాంలో రూ.5,448.93 కోట్ల ప్రయోజనం⇒ గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు, తీసుకువచి్చన వినూత్న విధానాల వల్ల 2019–24 మధ్య విద్యుత్ సంస్థల నిర్వహణ ఖర్చులు భారీగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆ మిగులును కొంత ప్రజలకు వెనక్కు కూడా ఇచ్చి, మిగతాది తమ ఇతర ఖర్చుల్లో సర్దుబాటు చేసుకున్నాయి. దానివల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం తప్పింది. ⇒ 2019–20 నుంచి 2023–24 వరకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) రూ.1,974.75 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) 2020–21 నుంచి 2023–24 వరకు రూ.1400 కోట్లు ఖర్చులు మిగిల్చాయి. ఈ మొత్తం రూ.3,374.75 కోట్లను ట్రూ డౌన్ చేశాయి. ఈ డబ్బులను 2024–25 వార్షిక ఆదాయ వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)లో డిస్కంలు సర్దుబాటు చేశాయి. అంటే వాటి రెవిన్యూ గ్యాప్ను భర్తీ చేసుకోవడానికి వినియోగించుకున్నాయి. తద్వారా బకాయిల భారాన్ని తగ్గించుకున్నాయి. వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం రాలేదు. ⇒ 2019–20 నుంచి 2023–24 మధ్య నాలుగవ నియంత్రణ కాలానికి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్కో)కు చెందిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను వినియోగించుకున్నందుకు ముందుగా ఆమోదించిన దానికంటే తక్కువగా డిస్కంలు వెచ్చించాయి. తద్వారా డిస్కంలు రూ.1,059.75 కోట్లు మిగిల్చాయి. ఇందులో ఏపీఈపీడీసీఎల్లో రూ.383.84 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్లో రూ.428.57 కోట్లు, ఏపీసీపీడీసీఎల్లో రూ.247.35 కోట్లుగా ఉంది. వీటిని కూడా ఏఆర్ఆర్ (యాన్యువల్ రెవిన్యూ రిక్వైర్మెంట్)లో సర్దుబాటు చేశారు. దీనికి అదనంగా మరో రూ.818.43 కోట్లు ఆదా అయినట్లు ఏపీఈఆర్సీ తాజాగా తేల్చింది. ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ పంపిణీ కోసం చేసిన ఖర్చుల్లో రూ.1,878.18 కోట్లు మిగిలాయి. ఆ మేరకు డిస్కంలకు ఏపీ ట్రాన్స్కో తిరిగి ఇస్తోంది. ఈ మొత్తంలో ఇప్పటికే చాలా వరకూ ‘సర్దుబాటు’ చేయగా, మిగిలిన రూ.134.08 కోట్లను వెనక్కు ఇచ్చేందుకు ఏపీఈఆర్సీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ⇒ 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 మధ్య కాలానికి డిస్కంలు వసూలు చేసిన ట్రూ అప్ చార్జీలు ఏపీఈపీడీసీఎల్ రూ.126 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్ రూ.70 కోట్లు చొప్పున మొత్తం రూ.196 కోట్లను ట్రూ డౌన్ చేసి వినియోగదారులకు డిస్కంలు వెనక్కి ఇచ్చాయి. అది కూడా కలిపి గత ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగదారులకు మొత్తంగా రూ.5,448.93 కోట్ల ప్రయోజనం చేకూరింది. -
జాతీయ ప్రాధాన్యతగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం
సాక్షి, అమరావతి: అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దే క్రమంలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని అమలుచేయడం జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశంగా రాష్ట్రాలకు సూచించాలని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తిచేశారు. ప్రపంచంలో భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారుచేయడానికి ఇది అత్యావశ్యకమని తెలిపారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని కేంద్రమే సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం, నాడు జగన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లాయి. ఇంత గొప్ప చట్టంపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం నిర్వహించి ఈ చట్టం అమలును సమీక్షించాలని ప్రధాని కోరారు. లేనిపక్షంలో ఒక కాన్ఫరెన్స్ ద్వారా ఈ అంశాన్ని చర్చించడానికి ఆదేశించాల న్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రాధాన్యత, వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఏపీలో అది అమలుకావడం, దాని ప్రాధాన్యతను గుర్తించకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాన్ని రద్దుచేయడం తదితర అంశాలపై సోమవారం ధర్మాన ప్రధానికి లేఖ రాశారు. అందులో ఆయన పేర్కొన్న అంశాలు.. దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా మీరు ప్రారంభించిన ఆత్మనిర్భర్, వికసిత్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక పథకాలు ప్రజలకు వరంగా నిలు స్తున్నాయి. ఆ లక్ష్యసాధన దిశగా 2020 ఏప్రిల్ 24న రూ.566.23 కోట్లతో స్వామిత్వ పథకాన్ని ప్రారంభించి 1.61 లక్షల గ్రామాల్లో 2.42 కోట్ల ప్రాపర్టీ కార్డుల పంపిణీ, 3.20 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే విజయవంతంగా పూర్తిచేశారు. జాతీయ భూ రికార్డుల ఆధునీకరణ, మోడరనైజేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేశారు. నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో భూమి అనే అంశంపై మీరు చేసిన కృషి గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. రాష్ట్రాలకు ముసాయిదా చట్టం.. దేశ, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి, వివాదాల శాతాన్ని తగ్గించడానికి.. భూ రికార్డులను ఆధునీకరించాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. నీతి ఆయోగ్తో కలిసి ముసాయిదా చట్టాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపించింది. ప్రస్తుతమున్న భావనాత్మక హక్కుల (ప్రిజెంటివ్) స్థానంలో నిర్ధారిత హక్కుల (కన్క్లూజివ్) వ్యవస్థను తీసుకురావడానికి రాష్ట్రాలను ప్రోత్సహించింది. భూ సమస్యలు, వివాదాలు పరిష్కరించి దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి మీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.జగన్ చట్టం తెస్తే చంద్రబాబు రద్దుచేశారుమీ ప్రభుత్వ లక్ష్యాలు, దార్శనికతకు అనుగుణంగా ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023 (యాక్ట్ ఆఫ్ 27 ఆఫ్ 2023) అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, 2024లో చంద్రబాబు ప్రభుత్వం ఈ చట్టం అవసరాన్ని విస్మరిస్తూ దాన్ని ఉపసంహరించుకుని రద్దుచేసింది. తద్వారా వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వేలో మన దేశం 154వ స్థానంలో ఉందనే సత్యాన్ని.. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్, వికసిత్ భారత్ వంటి ప్రతిష్టాత్మక పథకాలకు ఇలాంటి ప్రగతిశీల చట్టం అవసరాన్ని విస్మరించింది.ప్రస్తుతం నీతి ఆయోగ్ సూచించిన ఈ ముసాయిదా బిల్లును చట్టంగా చేయడానికి 12 రాష్ట్రాలు సంసిద్ధతను వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. ఆస్తి యాజమాన్యపు హక్కుకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే టోరెన్స్ విధానంలో కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ప్రతిపాదించిన ఈ ముసాయిదా చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేయాల్సిన అవసరం ఉంది. ఈ చట్టంపై రాష్ట్రాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలి. అంతర్జాతీయ మేటి రాజనీ తిజు్ఞనిగా అవతరిస్తున్న మన దేశ ప్రధానికి సహకరించడమంటే ఈ చట్టం అమలుచేయడమే. -
పంచాయతీ నిధులపై సర్కారు కన్ను..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఏటా వచ్చే దాదాపు రూ.2,500 కోట్లను మళ్లించేందుకు చంద్రబాబు సర్కారు కుటిల పన్నాగం పన్నుతోంది. ఆ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రాధాన్యత అవసరాలకు మళ్లించే కుట్రకు తెర లేస్తోంది. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం రెండు నెలల్లో ముగిసిపోనుండగా.. పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు లేదా పర్సన్ ఇన్చార్జిల పాలన తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. పంచాయతీల ఆదాయంపైనే గురి పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరిగి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలు ఎనుకున్న సర్పంచ్, వార్డు సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటైతే.. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతోపాటు స్థానికంగా పన్నుల ద్వారా వసూలైన సొమ్మును కూడా పూర్తిగా గ్రామ అవసరాలకు వినియోగించుకునే అవకాశం 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు ఉంది. ఆ నిధులు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించే అవకాశం మాత్రమే అధికారులకు ఉంటుంది. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ల)కు కేంద్ర ప్రభుత్వం ఏటా నేరుగా రూ.2,100 కోట్ల వరకు నిధులు విడుదల చేస్తోంది.ఇందులో 70 శాతం అంటే రూ.1,500 కోట్లు, గ్రామ పంచాయతీలకే కేటాయించాలనే నిబంధన ఉంది. దీనికి తోడు పంచాయతీలు ఏటా ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో వసూలు చేసే దాదాపు మరో రూ.1,000 కోట్లు సైతం పంచాయతీ పాలకవర్గాలు స్థానిక అవసరాల కోసం వినియోగించుకుంటాయి. ఇలా ఏటా రూ.2,500 కోట్లను పంచాయతీ తీర్మానాల మేరకు సర్పంచ్ల ఆధ్వర్యంలో స్థానిక అవసరాలకు ఖర్చు చేస్తుంటారు. పాలకవర్గాలు లేకుండా చేసి.. రాష్ట్రంలో ప్రస్తుత సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగిస్తుంది. అంటే సుమారు 2 నెలలు మాత్రమే పంచాయతీ పాలకవర్గాలు మనుగడలో ఉంటాయి. ఆ తరువాత పంచాయతీలకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహించి.. కొత్త పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు జరగని పక్షంలో ప్రత్యేకాధికారుల పాలన.. లేదంటే పర్సన్ ఇన్చార్జిలను నియమించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరపకుండా ప్రత్యేకాధికారులు/పర్సన్ ఇన్చార్జిల పాలన తెచ్చేందుకు సన్నద్ధమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 13 వేలకు పైగా పంచాయతీ సర్పంచ్, లక్షన్నర వార్డు పదవులకు సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గత ఏడాది సెపె్టంబర్లోనే ప్రణాళిక రూపొందించి జనవరి నాటికే ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేలా సూచనలిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, ప్రభుత్వం ఆ ప్రక్రియను చేపట్టకకుండా కాలయాపన చేస్తూ వస్తోంది. బీసీ రిజర్వేషన్లు సైతం తేల్చలేదు పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ తేల్చలేదు. సర్పంచ్ పదవులకు మండల ప్రాతిపదికన, వార్డు సభ్యుల పదవులకు పంచాయతీల ప్రాతిపదికన ఏ గ్రామ సర్పంచ్ పదవి, ఏ వార్డు పదవి ఎవరి కేటాయించాలన్నది ఇప్పటికే ఖరారు చేయాల్సి ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. బీసీ రిజర్వేషన్ ఖరారు చేయాలంటే.. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమరి్పంచాల్సి ఉంటుంది. ఇంతవరకు పంచాయతీల వారీగా ప్రభుత్వానికి ఆ నివేదిక కూడ అందలేదు.రిజర్వేషన్ల ప్రక్రియను ఏప్రిల్ 2వ తేదీ నాటికి పూర్తిచేస్తే తప్ప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఆ లోగా బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే ఏప్రిల్ 2 తర్వాత సర్పంచ్ల స్థానంలో ప్రత్యేకాధికారులను కూర్చోబెట్టి పంచాయతీల్లోనూ ప్రభుత్వమే పాలన చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తద్వారా పంచాయతీల నిధులను ఇష్టానుసారం ఖర్చుచేసే కుటిలయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. 2018లో పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగిసినా అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు 2019 జూన్ వరకు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారు. ఇప్పుడు కూడా అదే పంథాలో వెళ్తున్నారు.ఉన్న నిధులూ ఖర్చు పెట్టకుండా ఆంక్షలుకేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రస్తుత పాలకవర్గాలు గ్రామాల అవసరాల నిమిత్తం ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లోనే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా అక్టోబర్లోనే రూ.1,026 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు మరో రూ.1,000 కోట్ల వరకు రెండో విడత నిధులు ఈ మార్చిలోపే విడుదలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్లో కేంద్రమిచ్చిన నిధులను 10 రోజుల్లోనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం గడచిన డిసెంబర్ 18 వరకు తన అవసరాలకు వాడుకుంది. ఆ తరువాత నిధులను గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది.అంతకుముందు కూడా 8 నెలలపాటు ప్రభుత్వ అవసరాలకు నిధులను మళ్లించి.. ఆ తరువాత ఆలస్యంగా ఆ నిధులను స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసింది. ఆలస్యంగా విడుదల చేసిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ రూపంలో తెలియజేసిన పనులకే ఖర్చు పెట్టేలా చర్యలు చేపట్టాలంటూ డిసెంబర్ నెలాఖరున రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇంటి పన్నుల రూపంలో వసూలు చేసుకునే పంచాయతీ సాధారణ నిధులపైనా సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా ఆంక్షలు అమలు చేస్తోందని సర్పంచ్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, ఆ శాఖ అధికారులను కలిసి సంఘాల ప్రతినిధులు వినతిపత్రాలు సమరి్పంచినా.. ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని సర్పంచ్ల సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
‘కంది’పోతున్న రైతు
సాక్షి, అమరావతి: కందిరైతు కందిపోతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటుధర లేక కుదేలవుతున్నాడు. మద్దతుధరకు కొనేవారులేక రైతులు దళారులకు అడిగినకాడికి అమ్ముకుంటున్నారు. రిటైల్ మార్కెట్లో కందిపప్పు నాణ్యతను బట్టి కిలో రూ.130 నుంచి రూ.150కి పైనే పలుకుతోంది. కానీ పండించే రైతుకు మాత్రం కనీస మద్దతుధర దక్కడం లేదు. గత ఖరీఫ్ సీజన్లో 10 లక్షల ఎకరాల్లో కంది సాగవుతుందని, 3.54 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. వాస్తవానికి 8 లక్షల ఎకరాల్లోనే కంది సాగైంది.2023–24 సీజన్లో మార్కెట్ ధర గరిష్టంగా క్వింటాకు రూ.9,400–రూ.9,800 పలికింది. 2024–25 సీజన్లో కేంద్రం కనీస మద్దతు ధర రూ.7,550 ప్రకటించగా మార్కెట్లో రూ.6,500 నుంచి రూ.7,200 వరకు కొనుగోళ్లు జరిగాయి. కేంద్రం ఈ ఏడాది క్వింటాకు రూ.8,000 మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది పూత, పిందె దశలో భారీవర్షాలతో దిగుబడులు పడిపోయాయి.ఆరేడుసార్లు మందులు పిచికారీ చేయాల్సిరావడంతో ఎకరాకు రూ.2 వేలకుపైగా అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచి్చంది. ఎకరాకు 8–9 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 3–4 క్వింటాళ్లకు మించలేదు. తీరా పంట చేతికొచ్చేసరికి ధర నేలచూపులు చూస్తుండడంతో రైతులకు దిక్కుతోచటంలేదు. మద్దతుధర క్వింటాకు రూ.8 వేలు కాగా ప్రస్తుతం మార్కెట్లో రూ.6,500 నుంచి రూ.7 వేల మధ్య కొంటున్నారు. వ్యాపారులు సిండికేటై ధర పెంచడంలేదు.కర్ణాటకలో 9.67 లక్షల టన్నుల సేకరణకు అనుమతి కంది రైతులకు మద్దతుధర దక్కకపోయినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. పక్కనున్న కర్ణాటకలో 9.67 లక్షల టన్నుల కందిని కనీస మద్దతుధరకు సేకరించేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పాలనలోని ఏపీలో మాత్రం కేవలం 1.17 లక్షల టన్నుల సేకరణకే అనుమతి ఇచి్చంది. కందులతో పాటు మొక్కుబడిగా 28,440 టన్నుల మినుములు, 903 టన్నుల పెసల సేకరణకు ఓకే చెప్పింది. మార్క్ఫెడ్ జనవరి రెండోవారంలో కొనుగోళ్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పంట లేనిచోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్దతు ధర కల్పనలో ప్రభుత్వం విఫలమవడంతో రైతులు అయినకాడకి దళారులకు అమ్ముకుంటున్నారు. పొగాకు, మామిడి, ఉల్లి రైతులకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూసిన అన్నదాతలు పంటలను ప్రభుత్వ కేంద్రాల్లో అమ్ముకోవాలంటేనే భయపడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించుకుంటూ నష్టపోతున్నారు. కంది రైతులను ఆదుకోవాలి.. నేను 20 ఎకరాల్లో కంది సాగుచేశా. కౌలుతో సహా ఎకరాకు రూ.45 వేలు పెట్టుబడి పెట్టాను. వర్షాలతో చీడపీడలు ఎక్కువయ్యాయి. వాస్తవానికి ఒకసారి మందు కట్టలు వేయాలి. ఆరుసార్లు నీలిమందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. సాధారణంగా 8–9 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. 3 క్వింటాళ్లు మాత్రమే వచి్చంది. ప్రభుత్వం క్వింటా రూ.8 వేలు ప్రకటించగా, మార్కెట్లో రూ.6,500కు మించి కొనడం లేదు. – వెంపరాల నరసింహారావు, గనిఆత్కూరు, కంచికచర్ల, ఎన్టీఆర్ జిల్లా మద్దతు ధర కల్పనలో విఫలం ఈ ఏడాది ఒకటి రెండు తప్ప ప్రధాన పంటల్లో ఆశించిన దిగుబడి రాలేదు. మార్కెట్లో ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. మద్దతుధర కల్పనలో ప్రభుత్వం విఫలం కావడంతో రైతులు అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. మొక్కజొన్న, సజ్జల పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే కంది రైతులూ పంటను కూడా క్వింటా రూ.6,500 నుంచి రూ.7 వేలకు అమ్ముకుని నష్టపోతున్నారు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ -
‘వీసీ’ 420 వేషాలు!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు ఉన్నత విద్యా వ్యవస్థను సైతం భ్రష్టు పట్టిస్తోంది. అస్మదీయులకు అడ్డగోలుగా వైస్ చాన్సలర్ పదవులు కట్టబెట్టి యూనివర్సిటీలను సర్వ నాశనం చేస్తోంది. 420గా ముద్రపడిన మోసగాళ్లు, అత్యంత వివాదాస్పదులను వీసీ పోస్టులో కూర్చోబెట్టడం విభ్రాంతి కలిగిస్తోంది. విద్యా వేత్తలకు ఇవ్వాల్సిన ఉన్నత పదవిని ఓ నేర చరితుడికి ఇవ్వడం విస్తుగొలుపుతోంది. కాకినాడ జేఎన్టీయూ వీసీ నియామకమే దీనికి నిదర్శనం. డాక్టర్ అల్లం అప్పారావు లాంటి ప్రముఖ విద్యావేత్తలు సారథ్యం వహించిన కాకినాడ జేఎన్టీయూ వీసీగా సీఎస్ఆర్కే ప్రసాద్ను గతేడాది ఫిబ్రవరిలో కూటమి ప్రభుత్వం నియమించింది. ఆయనపై అవినీతి, ఫోర్జరీ లాంటి తీవ్రమైన కేసులు ఉన్నప్పటికీ వీసీగా ఎంపిక చేయడం చంద్రబాబు సర్కారు బరితెగింపునకు తార్కాణం. ఫోర్జరీ పత్రాల నిందితుడికి వీసీ పోస్టు!కాకినాడ జేఎన్టీయూ వీసీగా నియమించిన సీఎస్ఆర్కే ప్రసాద్పై తెలంగాణలోని పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాల్లో పలు సెక్షన్ల కింద కుప్పలు తెప్పలుగా కేసులు నమోదయ్యాయి. తప్పుడు పత్రాలతో కోర్టును ఉద్దేశపూర్వకంగా మోసం చేశారనే అభియోగంతో ఇటీవలే హనుమకొండ మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఏకంగా 415, 416, 418, 420, 464, 468, 469, 471 సెక్షన్ల కింద సమన్లు ఇవ్వడం కేసు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ సెక్షన్లను పరిశీలిస్తే.. దారుణమైన మోసం, వేరొకరిలా నటించి మోసం చేయడం, ఎదుటి వ్యక్తికి నష్టం కలుగుతుందని తెలిసీ మోసానికి పాల్పడటం, నకిలీ సంతకాలతో మోసగించడం, తప్పుడు పత్రాలు సృష్టించడం, ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసేలా ఫోర్జరీ పత్రాలు తయారీ, నకిలీ పత్రాలను నిజమైనవిగా నమ్మించి వినియోగించడం వంటి నేరాల్లో నిందితులుగా లెక్క. వీటిల్లో అధిక సెక్షన్లలో నేరం రుజువైతే ఏకంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎంపికలో దారుణ వైఫల్యం..విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకాలను అత్యంత పారదర్శకంగా చేపట్టాలి. విద్యావంతులు, భవిష్యత్తు సమాజానికి దిక్సూచిగా వ్యవహరించే మేధావులకు పెద్దపీట వేయాలి. కానీ టీడీపీ పెద్దలు తమ అస్మదీయుడనే ఒకే ఒక అర్హతతో కొందరికి వీసీ పోస్టులు కట్టబెట్టేశారు. ఇందులో భాగంగానే అవినీతి, ఫోర్జరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎస్ఆర్కే ప్రసాద్ను కాకినాడ జేఎన్టీయూ వీసీగా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. దీంతో వీసీల ఎంపికలో సెర్చ్ కమిటీల పాత్ర మరోసారి ప్రశ్నార్థకమైంది. సెర్చ్ కమిటీలను టీడీపీ కూటమి ప్రభుత్వం కీలుబొమ్మలుగా మార్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన పేర్లతో సెర్చ్ కమిటీ జాబితా సిద్ధం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపుతోంది. ఇక వీసీల నియామకాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదిక తూతూమంత్రంగా మారింది. ఇవీ సీఎస్ఆర్కే ప్రసాద్ నిర్వాకాలు..!వరంగల్ నిట్ ప్రొఫెసర్గా ఉన్న సమయంలో సీఎస్ఆర్కే ప్రసాద్పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్ఐటీ వరంగల్ ఆలూమ్ని అసోసియేషన్ (నిట్వా) అందించిన నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు ఆ తప్పును కప్పిపుచ్చేందుకు యత్నించారు. ప్రతిభావంతులకు మేలు చేసేందుకు నిట్లోని ఓ భవనాన్ని లీజుకు తీసుకుని ప్రస్తుత, పూర్వ విద్యార్థులను అనుసంధానించేందుకు నిట్వా రూ.1.30 కోట్లు సమీకరించింది. అయితే భవనం ఆధునికీకరణలో రూ.40 లక్షలు దారి మళ్లాయని, సీఎస్ఆర్కే ప్రసాద్కు అత్యంత సన్నిహితులు ఇందులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక సీఎస్ఆర్కే ప్రసాద్ ఒత్తిడితో అప్పటి ఐఆర్ఏఏ డీన్ 2022లో నిట్వా ఎన్నికల్లో తమ అనుకూల వర్గాన్ని గెలిపించేందుకు అక్రమంగా ఓట్లు జొప్పించారు. ఈ కేసు ఇప్పటికీ తెలంగాణ హైకోర్టులో ఉంది.కోర్టు కళ్లు గప్పేందుకు యత్నించి..!ఎన్నికల్లో అక్రమాలపై నిట్వా మాజీ అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సీఎస్ఆర్కే ప్రసాద్ అప్పటి డైరెక్టర్పై ఒత్తిడి చేసి ఇందులో చేర్చారు. అనంతరం ఆ డైరెక్టర్ బదిలీపై వెళ్లిపోగా సీఎస్ఆర్కే ప్రసాద్ న్యాయస్థానాన్ని మోసం చేసే కుట్రకు తెర తీశారు. గత డైరెక్టర్ సంతకాలు, పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) లేకుండానే ఆయన అథారిటీ ఇచ్చినట్లుగా కేసును నడిపించారు. పాత న్యాయవాది నుంచి నో అబ్జెక్షన్ లేకుండానే మరో న్యాయవాదితో వకాలత్ వేయించి మరో తప్పు చేశారు. ఈ విషయం బయటపడటంతో తాను ఎవరికీ ఆథరైజేషన్ ఇవ్వలేదని అప్పటి డైరెక్టర్ రాత పూర్వకంగా కోర్టుకు నివేదించారు. సీఎస్ఆర్కే ప్రసాద్ ఫోర్జరీ, అవినీతి బాగోతంపై ‘నిట్వా’ మాజీ అధ్యక్షుడు ఎన్ఐటీ డైరెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు.ఇక 2025 ఫిబ్రవరిలో ఖాజీపేట పోలీసు స్టేషన్లో సీఎస్ఆర్కే ప్రసాద్పై ఫిర్యాదు చేయగా సివిల్ కేసుగా పరిగణించారు. దీంతో గత ఆగస్టులో కోర్టులో కేసు వేయగా న్యాయస్థానం స్వీకరించి నిందితుడు సీఎస్ఆర్కే ప్రసాద్కు 8 రకాల ఐపీసీ సెక్షన్లు కింద సమన్లు జారీ చేసింది. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు కరెస్పాండెంట్ అనుమతి లేకుండా సీఎస్ఆర్కే ప్రసాద్ దొంగ సంతకాలతో నడిపించడం గమనార్హం. ఎన్ఐటీ పూర్వ విద్యార్థి, నిట్వాలో సభ్యుడు అయినప్పటికీ అసోసియేషన్కు నష్టం చేకూర్చేలా వ్యవహరించారు. ఆయన జేఎన్టీయూ కాకినాడ వీసీగా వచ్చినప్పటి నుంచి పాలనా వ్యవస్థను గందరగోళంలోకి నెట్టి అనర్హులకు పెద్దపీట వేయడం, అవినీతిని ప్రోత్సహిస్తుండడంపై వర్సిటీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
‘ఓపెన్’ చేసేశారు!
సాక్షి, అమరావతి: దూరవిద్యలో పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు అందించే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) టీడీపీ అనుయాయులకు అడ్డాగా మారుతోంది. అర్హతలు లేకున్నా, పార్టీకి సేవలు చేస్తామంటే చాలు కీలకమైన పోస్టులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఏకంగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ కార్యాలయం నుంచే ఫైళ్లు కదులుతున్నట్టు వినికిడి. కార్యాలయం ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఆగమేఘాలపై ఫైల్ పెట్టడం విస్తుగొల్పుతోంది. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో కీలకమైన జిల్లా సమన్వయకర్త పోస్టులను టీడీపీ వర్గానికి చెందిన టీచర్స్ యూనియన్ నేతలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే తమవారికోసం కొత్తగా అసిస్టెంట్ కో ఆర్డినేటర్ పోస్టులను సైతం సృష్టించడం గమనార్హం.ఈ పోస్టులకు ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్లలో ఐదేళ్ల సర్వీసుతో పాటు 50 సంవత్సరాల వయసు గల స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను మాత్రమే కింద నియమించాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా 58 నుంచి 60 ఏళ్ల వయసు గల మున్సిపల్ ఉపాధ్యాయులను ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్లుగా నియమిస్తుండడం గమనార్హం. పైగా టీడీపీ వర్గానికి చెందిన ఉపాధ్యాయ సంఘం నాయకులను ఈ పోస్టుల్లో నియమిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. యూనియన్ నాయకులకే పోస్టులు నిబంధనల ప్రకారం ఏదైనా ఉపాధ్యాయ సంఘంలో కీలక పదవుల్లో ఉన్న ఉపాధ్యాయులు, పీఈటీలు, మున్సిపల్ టీచర్లకు ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్లుగా నియమించకూడదు. ప్రస్తుతం వీటన్నింటినీ ఉల్లంఘించి ఒక ఉపాధ్యాయ సంఘానికి చెందిన ఆరుగురు నాయకులను జిల్లాల కో ఆర్డినేటర్లుగా నియమిస్తున్నారు. వీరిలో ఒకరు ఇప్పటికే ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్గా పనిచేస్తుండగా, ఆయన పదవి కాలపరిమితిని పొడిగిస్తున్నారు. ఆయన గతంలో పీఆర్టీయూ నాయకుడిగా ఉన్నప్పుడు దరఖాస్తును తిరస్కరించి, ఆ పదవికి రాజీనామా చేసిన అనంతరం కో ఆర్డినేటర్ పోస్టు ఇచ్చారు.ఆయనే ఇప్పుడు కొత్తగా టీడీపీ అనుకూల టీచర్స్ యూనియన్ను ఏర్పాటు చేసి రాష్ట్ర కార్యవర్గంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మిగిలిన ఐదుగురు కూడా ఇదే యూనియన్ నాయకులు కావడం గమనార్హం. 2021లో ఐదుగురు జిల్లా, ఏడుగురు స్టేట్ కో ఆర్డినేటర్లను నియమించారు. అప్పుడు ఐదేళ్ల కనీస సర్వీసుతో పాటు 50 ఏళ్లలోపు వయసు గల ప్రభుత్వ, జెడ్పీ స్కూల్ అసిస్టెంట్లను మాత్రమే నియమించారు. మున్సిపల్ టీచర్లు, పీఈటీలకు అర్హత లేదని ప్రకటించారు. ఏడాది కిందట కూడా ఈ పోస్టుల్లో ఉపాధ్యాయులకు అర్హత లేదని విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లను నియమించారు. కానీ ఇప్పుడు ఏకంగా ఉపాధ్యాయ యూనియన్ నాయకులనే నియమిస్తుండడం విస్తుగొల్పుతోంది.రాజకీయ ప్రయోజనాలతో నియామకాలుతాజాగా ఆరుజిల్లాల్లో పోస్టుల భర్తీకి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో పూర్తిగా రాజకీయ ప్రయోజనాలతో తమ వర్గానికి చెందిన యూనియన్ నేతలను నియమించేందుకు రంగం సిద్ధం చేశారు. తుది జాబితాలో ఉన్న ఉపాధ్యాయుల అర్హతలను పరిశీలిస్తే.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని జెడ్పీ హైస్కూల్ ప్లస్లో పనిచేస్తున్న డాక్టర్ జయప్రకాష్నాయుడు వయస్సు 58 ఏళ్లు. వయసు రీత్యా ఆయనకు అర్హత లేకపోయినా జిల్లా కోఆర్డినేటర్గా నియమిస్తున్నారు.వైఎస్సార్ కడప జిల్లా కాజీపేట మండలం సి.కొత్తపేట జెడ్పీ హైస్కూల్లో పీఈటీగా పనిచేస్తున్న ఎ.బి. రామకృష్ణరాజు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాండవ ఎంపీయూపీ స్కూల్ ఎస్జీటీ పి.వి.సత్యనారాయణరాజు, విజయవాడ పటమట మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు జె.శ్రీనివాసరావు, గుంటూరు వేణుగోపాలనగర్లోని మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయుడు బి.హైమారావులకు ఈ పదవులకు అర్హత లేదు. ఈ నలుగురి కోసం కొత్తగా అసిస్టెంట్ కో ఆర్డినేటర్ పోస్టులను సృష్టించారు. అనకాపల్లి జిల్లా కొలకలపూడి జెడ్పీ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ టి.వెంకటరమణ జాబితాలో ఉన్నారు. అనర్హులకు పోస్టులు ఇవ్వడం, లేని పోస్టును సృష్టించడం ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మురుగుడు హనుమంతరావు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారన్నారు. అంబేద్కర్ తలపెట్టిన ఆశయాలకు అనుగుణంగా అందరూ పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘అంబేద్కర్ స్ఫూర్తికి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి. స్వార్థం, అవినీతితో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయి. రాష్ట్రం ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది’’ అని బొత్స పేర్కొన్నారు.వైఎస్సార్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ప్రతిపక్షంగా ప్రజల కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది. పేద ప్రజల శ్రేయస్సు కోసం పని చేయాలన్నది పార్టీ అధినేత జగన్ నిర్ణయం. ఆ మేరకు కేడర్ పని చేయాలి’’ అని బొత్స పిలుపునిచ్చారు. -
దావోస్ దారి ఖర్చులూ కలిసిరాలేదట.. నిజమేనా?
‘‘టీమ్ 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా? మేము పెట్టుబడులు తెస్తుంటే ఏడుస్తున్నారు...’’ -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ వ్యాఖ్య..‘‘దావోస్ వెళ్లింది పెట్టుబడుల కోసమా? లేక చెత్త ఏడుపు గొట్టు రాజకీయం చేయడానికా? అదేదో ఇక్కడే చేస్తే రాష్ట్రానికి కొన్ని కోట్లు అయినా మిగిలేవి కదా రాజా!..’’ - సోషల్ మీడియా ప్రముఖుడు పి.వి.ఎస్.శర్మ జవాబు.‘‘ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు. ఆయన రేర్ పీస్. చంద్రబాబును మనం అంతా బ్లైండ్గా ఫాలో కావాలి. ఆయనకు విజన్ ఉంది’’- లోకేశ్ ప్రసంగంలో ఇంకో భాగం.‘‘నిజమే.. పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు ఇస్తున్నారు కదా! చంద్రబాబు బ్రాండ్ విలువ ఇంతేనా’’- సోషల్ మీడియాలో పలువురు సంధించిన వ్యంగ్యాస్త్రం..‘‘పరిశ్రమలు తేవడానికి లోకేశ్ బాగా కృషి చేస్తున్నారు. ఆయన చొరవ వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది’’ - చంద్రబాబు నాయుడు ప్రశంస..‘‘విశాఖలో జగన్ తీసుకువచ్చిన అదానీ డేటా సెంటర్ను గూగుల్గా మార్చి క్రెడిట్ చోరీ చేసి, అదేదో తన కుమారుడి ఘనతగా నిత్యం ప్రచారం చేసుకుంటున్నారుగా’’- నెటిజన్ల వ్యాఖ్య..పెట్టుబడుల కోసం ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్లు అక్కడ తెలుగు వారితోనో, తెలుగుదేశం వారితోనో ఒక సమావేశం నిర్వహించి ఒకరినొకరు పొగుడుకుంటూ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు. సహజంగానే ఈ మాత్రం దానికి దావోస్ వరకు వెళ్లడం దేనికన్న చర్చ వస్తుంది. ఏపీకి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు కూడా వస్తాయని చంద్రబాబు ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు విస్మయంతో ‘‘23 లక్షల కోట్లా’’ అని అనగానే.. వెంటనే ఒకసారి 20 లక్షల కోట్లు అని, మరోసారి ప్లస్ 22 లక్షల కోట్లు అని చంద్రబాబు అర్థం పర్థం లేకుండా మాట్లాడడం విమర్శలకు గురైంది.వయోభారం వల్లో, తడబాటు వల్లో లేక ఇంకో కారణమో తెలియదు కానీ.. కొన్నేళ్లుగా చంద్రబాబు మాటల్లో పొంతన ఉండటం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. టీడీపీ బ్రిటిష్ వారితో పోరాడిందని చెప్పడం.. హైదరాబాద్ను నిర్మించింది, అభివృద్ధి చేసిందీ, ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యేందీ తన వల్లనేనని పదే పదే చెప్పుకుంటూండటం.. సెల్ ఫోన్లు రావడానికి తానే కారణమని, ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొదట ప్రమోట్ చేసింది తానేనని, 1984 నుంచి ఈ దేశంలో ఐటీకి మారుపేరు తానేనని, రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రారంభించి, తానే పూర్తి చేశానని, త్వరలో ఏపీకి డ్రోన్ టాక్సీలు వస్తున్నాయని, ఒలింపిక్స్లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని.. చిత్రవిచిత్రమైన ప్రకటనలు చేశారీయన.అసత్యాలు మాట్లాడడంలో చంద్రబాబు దిట్ట అని ఒకప్పుడు రాజకీయ నేతలు అనుకునేవారు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగానే ఎద్దేవ చేశారు. ఇప్పుడు అబద్ధాలకు పొంతనలేని అతిశయోక్తులు, అసందర్భ వ్యాఖ్యలు తోడయ్యాయి. సోషల్ మీడియా బలంగా ఉన్న ఈ కాలంలో ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసిపోతూండటం కొసమెరుపు. మభ్యపెట్టేందుకు, బాబే తోపు అనేందుకు ఎల్లో మీడియా బాకాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉండనే ఉన్నాయి.చిత్రమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఇప్పుడ తండ్రి బాట పడుతున్నారు. రెడ్బుక్ అంటూ ఇప్పటికే అరాచకాలు సృష్టిస్తున్న లోకేశ్, అహంభావ పూరిత వ్యాఖ్యలు, అబద్దపు ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్న విమర్శలూ ఎదుర్కొంటున్నారు. తల్లి, చెల్లి అంటూ అసందర్భంగా అసత్యపు వ్యాఖ్యలు చేస్తూ వికృతానందం పొందుతున్నారని వారు అంటున్నారు. సోషల్ మీడియా లేని రోజుల్లో పత్రికలు, టీవీ చానళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు తన బురద రాజకీయాన్ని నడిపి ఉండవచ్చునేమో కానీ.. లోకేశ్ కూడా అదే పంథాలో వెళ్లడం ప్రజలలో చులకనయ్యేందుకు దగ్గరి దారి అవుతుందన్నది స్పష్టం.ఆంధ్రప్రదేశ్కు నిజంగా పెట్టుబడులు వస్తుంటే, పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతుంటే ఎవరూ కాదనరు. మంచిదే.కాని రాని పెట్టుబడులు వచ్చినట్లు చూపించే యత్నం చేయడం, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయన్న భ్రమ కల్పించడం లోకేశ్కు దీర్ఘకాలంలో నష్టం చేసేవే. తండ్రి 23 లక్షల ఉద్యోగాలని, కొడుకేమో 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని తోచిన అంకెలు చెబుతున్నారు. ‘‘99 పైసలకే భూములు ఇచ్చేస్తానని, అది తన ఇష్టం’’ అని అహంభావ దోరణితో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేశ్లు బ్రాండ్ ఇమేజీతో కాకుండా బ్యాండ్ మేళంతో దావోస్ వెళ్లినట్లు ఉందని చమత్కరించారు.అందులో వాస్తవం ఉందన్న భావన కలుగుతుంది అదేకాదు.. ఏదో కంపెనీ పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఈ మెయిల్ పంపి రావద్దని సూచించారంటూ లోకేశ్ అబద్దం చెప్పారని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. డెబ్బై ఐదేళ్ల వయసులో చలిని లెక్కచేయకుండా రాష్ట్రం కోసం పనిచేస్తున్న వ్యక్తి చంద్రబాబు అని లోకేశ్ చెప్పడం విడ్డూరమే. ఇలాంటి అతిశయోక్తులతో అమాయక జనాన్ని నమ్మిస్తారేమో కాని, కాస్త విజ్ఞత ఉన్నవారంతా నవ్వుకుంటున్నారు. ఇక మాజీ సీఎం జగన్ను దూషించడానికి దావోస్ వరకు వెళ్లవలసిన అవసరం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.ఈ క్రమంలో చంద్రబాబును ఆయన మామ ఎన్.టి.రామారావు ఏ విధంగా దూషించింది వివరిస్తూ సంబంధిత వీడియోలతోసహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విదేశాలకు వెళ్లినప్పుడైనా హుందాగా ఉండవలసిన చంద్రబాబు, లోకేశ్లు అది మాని ఏపీ బ్రాండ్ను బాగు చేస్తున్నారా? లేక చెడగొడుతున్నారా అన్నది వారే ఆలోచించుకోవాలి. తన దావోస్ పర్యటనలో గత ముఖ్యమంత్రి జగన్ హుందాగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకుంటున్నారు.. టీమ్ 11 ముఖం చూసి పెట్టుబడులు పెడతారా అని లోకేశ్ అంటున్నారని, మరి టీమ్ 164 ముఖం చూసి ఎవరూ ఎందుకు ముందుకు రాలేదని ఒక విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యకు జవాబిస్తారా! అంటే దారి ఖర్చులు కూడా రాలేదా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘వెలిగొండ’నూ కొట్టేద్దాం!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్నారు. విశాఖలో డేటా సెంటర్, భూముల సమగ్ర రీ సర్వే, గత ప్రభుత్వం చేపట్టిన ఇతరత్రా కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకోవడానికి పాట్లు పడుతున్న ఆయన చూపు తాజాగా ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రికార్డు సమయంలో రెండు టన్నెల్స్ పనులన్నీ పూర్తయినప్పటికీ, నల్లమలసాగర్కు నీటిని తరలించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు గత ప్రభుత్వం కృషినంతటినీ తన ఘనతగా చెప్పుకునేందుకు సన్నద్ధమవుతోంది. త్వరలో సీఎం చంద్రబాబు వెలిగొండ సందర్శించి.. పూర్తయిన పనులన్నీ తన ఘనతేనని చాటుకునేందుకు సిద్ధమైపోయారు. వాస్తవానికి దశాబ్దాల స్వప్నం వెలిగొండ సాకారమైందని.. శ్రీశైలం నుంచి జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలు నల్లమలసాగర్కు చేరడంతో తమ కష్టాలు కడతేరుతాయనుకున్న ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల ప్రజల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం అడియాశలు చేసింది. ఈ ప్రాజెక్టులో అత్యంత సంక్లిష్టమైన జంట సొరంగాలను (ఆసియాలోనే అతి పొడవైనవి) రికార్డు సమయంలో నాటి సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి.. 2024 మార్చి 6న జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్ టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు పరిహారం చెల్లించి, రూ.992 కోట్లు వ్యయం చేసి, పునరావాసం కల్పించి 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. కేవలం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే దుర్బుద్ధితోనే నల్లమలసాగర్ నిర్వాసిత కుటుంబాలకు 20 నెలలుగా పునరావాసం కల్పించకుండా చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తోందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై ఆది నుంచి సీఎం చంద్రబాబుకు ఉన్న కపట ప్రేమ మరోసారి నిరూపితమైందని ఎత్తిచూపుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2024–25లో 1,439 టీఎంసీలు, 2025–26లో 1,936.79 టీఎంసీల ప్రవాహం వచ్చి.. ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి 2024–25లో 848.96 టీఎంసీలు, 2025–26లో 1,652.12 టీఎంసీలు కలిశాయని ఎత్తి చూపుతున్నారు. టీడీపీ హయాంలో నాసిరకంగా పనులు వైఎస్సార్సీపీ సర్కార్ తయారు చేసిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2025 ఖరీఫ్ సీజన్లో కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా ఒడిసిపట్టి.. నల్లమలసాగర్కు తరలించి ఉంటే తమ ప్రాంతాలు సుభిక్షం అయ్యేవని రైతులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2025లో కురిసిన భారీ వర్షాలకు టీడీపీ సర్కార్ పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్ చానల్ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్ వాల్, మిగతా ప్రాంతాల్లో కాంక్రీట్ లైనింగ్ చేసే పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. వాటిని అస్మదీయ కాంట్రాక్టర్కు కట్టబెట్టడం గమనార్హం. వెలిగొండ టన్నెల్స్ నుంచి నల్లమలసాగర్కు నీటిని తరలించే కాలువ చంద్రబాబు సర్కార్ దోపిడీని కడిగేసిన కాగ్ ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు ఆ ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలు మాత్రమే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసం వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు ఎత్తి చూపుతున్నారు. విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా, పనుల్లో ఏమాత్రం ప్రగతి కన్పించక పోవడమే చంద్రబాబు సర్కార్ చేసిన దోపిడీకి నిదర్శనం. జీవో–22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింç³#)ను వర్తింపజేసి.. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి.. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతు చేయకపోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం. 2017, 2018, 2019 నాటికి పూర్తి చేస్తామంటూ ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు. వెలిగొండ ప్రాజెక్టులో చంద్రబాబు దోచేయడాన్ని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగి పారేసింది. ఇంజినీరింగ్ అద్భుతం.. నల్లమలసాగర్ ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల(గ్యాప్)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తుతో సుంకేశుల డ్యామ్.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తుతో గొట్టిపడియ డ్యామ్.. 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తుతో కాకర్ల డ్యామ్లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజ సిద్ధంగా రూపు దిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగు నీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపున ఉన్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్–1 ద్వారా 3001 క్యూసెక్కులు, టన్నెల్–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవి్వ.. ఫీడర్ ఛానల్ ద్వారా నల్లమలసాగర్కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీల పొడవున తవి్వన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతి పెద్ద నీటి పారుదల సొరంగాలు కావడం గమనార్హం. -
పేదరికం నుంచి ప్రపంచ స్థాయికి..
సాక్షి, అమరావతి/మచిలీపట్నం టౌన్/కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్ మరణ శాసనం కాదు... సరైన సమయంలో గుర్తిస్తే ఆ మహమ్మారిని జయించవచ్చని నిరూపించి అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచిన తెలుగుతేజం, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ‘పద్మ’ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. వైద్య విభాగంలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడును పద్మభూషణ్కు ఎంపిక చేసింది. దీంతో ఆయన చిన్న వయసు నుంచి నడయాడిన కృష్ణాజిల్లా మచిలీపట్నం, మంటాడ, తోట్లవల్లూరు ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.నోరి దత్తాత్రేయుడు మంటాడ గ్రామంలో 1947 అక్టోబరు 21న జన్మించారు. తల్లిదండ్రులు కనకదుర్గ, సత్యనారాయణ. జిల్లాలోని తోట్లవల్లూరులో ప్రాథమిక విద్యాభ్యాసం, ఉన్నత, పీయూసీ, బీఎస్సీ విద్యను మచిలీపట్నంలోని జైహింద్ హైస్కూల్, ఆంధ్ర జాతీయ కళాశాలలో పూర్తిచేశారు. ఆ తర్వాత కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాల నుంచి 1971లో ఎంబీబీఎస్ పట్టా తీసుకున్న ఆయన... ఉస్మానియా మెడికల్ కళాశాలలో పీజీ పూర్తిచేశారు. 1962లో ప్రీ–యూనివర్సిటీ, 1965లో బీఎస్సీ, ఉస్మానియాలో ఎండీ చేసినప్పుడు అత్యధిక మార్కులు రావడంతో మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చారు.ఫిబ్రవరి 1972 నుంచి ఏడాదిపాటు గాంధీ ఆస్పత్రిలో పనిచేశారు. 1973 నుంచి 1976 వరకు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రేడియం ఇన్స్టిట్యూట్ అండ్ క్యాన్సర్ ఆస్పత్రిలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేశారు. అనంతరం అమెరికా వెళ్లారు. తల్లిదండ్రులకు 12 మంది సంతానంలో ఆఖరివాడైన నోరి దత్తాత్రేయుడు నాలుగో ఏటలోనే తండ్రిని కృష్ణా వరదల్లో కోల్పోయారు. అనంతరం.. అత్యంత పేదరికం అనుభవిస్తూ తన తల్లి కష్టాన్ని గుర్తెరిగిన ఆయన ప్రపంచంలోనే టాప్ ఆంకాలజిస్టుల్లో ఒకరిగా ఎదిగారు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి నాలుగు పుస్తకాలు, 200లకు పైగా పేపర్ ప్రజెంటేషన్లు చేశారు. ప్రస్తుతం న్యూయార్క్లోని ప్రెస్ బైటేరియన్ హాస్పిటల్లో రేడియేషన్ ఆంకాలజీ విభాగం వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ అవార్డులు.. క్యాన్సర్ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టడంలో నోరి దత్తాత్రేయుడు కీలకపాత్ర పోషించి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారు. క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ థెరపీలో రేడియేషన్ మోతాదును అత్యంత కచి్చతంగా లెక్కించడం కోసం బ్రాకీ థెరపీని కంప్యూటర్ సాఫ్ట్వేర్తో అనుసంధానం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చేపట్టిన అనేక క్లినికల్ ట్రయల్స్కు ఆయన ప్రధాన పరిశోధకుడిగా ఉన్నారు. ఆయన మెమోరియల్ స్లోన్–కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ అలూమ్ని సొసైటీ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు పొందారు.సలహాదారునిగా నియమించిన జగన్ సర్కార్ క్యాన్సర్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిపెట్టిన గత వైఎస్ జగన్ ప్రభుత్వం డాక్టర్ నోరిని సలహాదారునిగా నియమించింది. ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్ సంరక్షణ)గా 2021లో నియమితులయ్యారు. గత ప్రభుత్వంలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ రూపకల్పన, అమలులో డాక్టర్ నోరి సలహాలు, సూచనలు ఇచ్చారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేస్తే మరణాలు, వ్యాధి భారాన్ని నియంత్రించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలోనూ ఆయన సలహాదారునిగా ఉన్నారు.నోరి దత్తాత్రేయుడు అందుకున్న అవార్డులు⇒ 1984లో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వారు క్లినికల్ ఫెలోషిప్ ఫ్యాకల్టీ అవార్డు ఇచ్చారు. ⇒ 1990లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ ఫెలోషిప్కు ఎంపికయ్యారు. ⇒ 1994లో అలూమిని సొసైటీ, మెమోరియల్ స్లాన్–కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విష్డ్ అలునినస్ అవార్డు అందుకున్నారు. ⇒ 2000లో ఇప్పటివరకు కాస్టల్ అండ్ కానల్లే పబ్లికేషన్ వారి అమెరికా బెస్ట్ డాక్టర్, లేడీస్ హోం జర్నల్ నిర్వహించే సర్వేలో మహిళల క్యాన్సర్ నివారణలో ఉత్తమ డాక్టర్గా ఎంపిక. ⇒ 2014లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారం.. ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ హానర్. ⇒ 2015లో భారతదేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ ⇒ 1995లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. ⇒ 2003లో అమెరికన్ కాలేజీ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ ఫెలోషిప్ అందుకున్నారు. ⇒ అనేక ఏళ్లుగా అమెరికాలో క్యాన్సర్ బాధితులకు అందిస్తున్న ఉన్నత సేవలకుగాను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నోరి దత్తాత్రేయుడికి ‘ట్రిబ్యూట్ టు లైఫ్’ గౌరవంతో సత్కరించింది. ⇒ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి బసవతారకం, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వంటి ప్రముఖులకు నోరి దత్తాత్రేయుడు క్యాన్సర్ చికిత్స చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు పద్మభూషణ్ రావడంపట్ల కేఎంసీ పూర్వ విద్యార్థులు, వైద్యులు హర్షం వ్యక్తంచేశారు. -
తీరం..సొగసు చూడతరమా..!
రేపల్లె: సహజ సౌందర్యానికి చిరునామాగా నిలుస్తున్న బాపట్ల జిల్లా రేపల్లె తీర ప్రాంతం పర్యాటక అభివృద్ధికి అపార అవకాశాలను కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓ వైపు కృష్ణానది, మరోవైపు సముద్రం కలిసి రమణీయ దృశ్యాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. నదీ ప్రవాహం మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన చిన్న చిన్న దీవులు ఈ ప్రాంత ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. చారిత్రక ప్రాధాన్యం కలిగిన పెనుమూడి రేవు సందర్శకులకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. పర్యాటకులను ఆకర్షిస్తున్న దిండి, నిజాంపట్నం బీచ్లు విహారయాత్రలకు అనువుగా ఉన్నాయి. రమణీయంగా విస్తరించిన మడ అడవులు ఈ ప్రాంతానికి మరింత సహజ సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి. ఇన్ని ప్రత్యేకతలతో రేపల్లె తీర ప్రాంతం భవిష్యత్తులో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు ఆపార అవకాశాలు కలిగిఉంది. పెనుమూడి రేవు ప్రత్యేక ఆకర్షణ: చారిత్రక ప్రాధాన్యం కలిగిన పెనుమూడి రేవు పర్యాటకులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది. ఒకప్పుడు వాణిజ్యానికి కీలకంగా ఉన్న ఈ రేవు ప్రస్తుతం పర్యాటక దృష్ట్యా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. అలాగే దిండి, నిజాంపట్నం బీచ్లు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రశాంత వాతావరణం, విస్తారమైన సముద్ర తీరం విహారయాత్రలకు అనువుగా ఉన్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన దీవులుపెనుమూడి–పులిగడ్డ మధ్యలో సహజంగా ఏర్పడిన చిన్న చిన్న దీవులు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణమ్మ కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే హంసలదీవిలో కలిసే ముందు కృష్ణా జిల్లా పులిగడ్డ–బాపట్ల జిల్లా పెనుమూడి మధ్యలో మూడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ పాయల మధ్యలో సహజ సిద్ధంగా ఉన్న దీవులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సూర్యాస్తమయ దృశ్యాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. ఆకర్షించే బీచ్లు తీరంలో సరైన మౌలిక వసతులు, బీచ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే గమ్యస్థానాలుగా మారడం ఖాయం. ప్రకృతి– అభివృద్ధి సమన్వయానికి ప్రతీకగా నిలువగల ఈ తీరప్రాంతాల అభివృద్ధి ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజాంపట్నంహార్బర్లో గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.451 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులతో కొంత వరకు రూపురేఖలు మారాయి. సినిమా షూటింగ్లకు కేంద్రంఈ ప్రాంతంలోని సహజ దృశ్యాలు ఇప్పటికే పలు సినిమా షూటింగ్లకు వేదికయ్యాయి. వెండితెరపై కనిపించిన తీరం అందాలు పర్యాటక ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. గతంలో పెనుమూడి రేవు, కృష్ణానది వారధిపై జయ జానకీ నాయక, పండుగాడు ఫొటో స్టూడియో వంటి సినిమాల షూటింగులతో పాటు పలు టెలిఫిలింల చిత్రీకరణ జరిగాయి. అభివృద్ధిపై ఆశలుజాతీయ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం పర్యాటక అభివృద్ధిపై సమగ్ర దృష్టి సారించి రేపల్లె తీర ప్రాంతంలో మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలు, వసతి ఏర్పాట్లు మెరుగుపరిస్తే రేపల్లె తీర ప్రాంతం రాష్ట్ర స్థాయిలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఎదగగలదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పర్యాటక రంగం విస్తరిస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మడ అడవుల రమణీయతతీర ప్రాంతంలో విస్తరించిన మడ అడవులు పర్యావరణ పరిరక్షణకు కీలకంగా నిలుస్తూనే ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తున్నాయి. జీవ వైవిధ్యంతో కళకళలాడే ఈ అడవులు ఎకో టూరిజానికి అనువైన ప్రాంతాలుగా గుర్తింపు పొందుతున్నాయి. పక్షి జాతులు, సముద్ర జీవులు సమృద్ధిగా ఉండటంతో ప్రకృతి ప్రేమికులకు ఇది అనుకూల ప్రాంతంగా మారింది. -
వివాహేతర సంబంధం మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది
చేబ్రోలు: వివాహేతర సంబంధం నేపథ్యంలో రేగిన చిచ్చు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా సుద్దపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట మల్లేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా కొడుకుతో కలిసి తెనాలిలోని సీఎం కాలనీలో ఉంటున్న కొల్లా దుర్గ(28)తో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. కొంతకాలంగా మల్లేష్కు, దుర్గకు మధ్య మనస్పర్థలొచ్చాయి. ఇవి కేసుల వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మల్లేష్ ఇంటికి వెళ్లిన కొల్లా దుర్గతో అతని కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. ఆవేశంలో దుర్గతోపాటు మల్లేష్ కుటుంబ సభ్యులు పరస్పరం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో దుర్గకు 80శాతం శరీరం కాలిపోయింది. మల్లేష్ భార్య, పిల్లలతో సహా తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ కొల్లా దుర్గ ఆదివారం ఉదయం మరణించింది. కేసును పక్కదారి పట్టిస్తున్నారు తన కుమార్తె దుర్గది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి ప్రతివాడ చిన్ని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ ఫిర్యాదును తీసుకోవడం లేదని ఆరోపించారు. మృతురాలి తల్లి, అక్కచెల్లెళ్లు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ దుర్గపై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా చంపారని కన్నీరుమున్నీరయ్యారు. -
రీ సర్వేతో భూ తగాదాలన్నీ సమసిపోతున్నాయి
సాక్షి, అమరావతి: ‘పాత రోజుల్లో ఒక గ్రామం సర్వే చేయాలంటే రెండు సంవత్సరాలు పట్టేది. సర్వేయర్ అక్కడ క్యాంపులో ఉంటాడు. ఒకరోజు ఉంటాడు.. ఒకరోజు ఉండడు.. చాలా సమయం తీసుకునేవారు. పాత రోజుల్లో చెయిన్ వేసేవాళ్లు. అది కొద్దిగా లూజుగా అటూ ఇటూ వదిలితే పక్కకు జరిగేది. ఆ మేర భూమిని తగ్గించేసేవారు. ఇప్పుడు అవన్నీ పోతాయి. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ (అక్షాంశాలు, రేఖాంశాలు) ఆధారంగా కచ్చితమైన పాయింట్ (ల్యాట్ లాంగ్) స్పష్టంగా వచ్చేస్తుంది. ఆ పథకం పేరు కూడా కచ్చితంగా సరిపోతుంది. ఓ వ్యక్తి చనిపోయి 15 ఏళ్లు అయినప్పటికీ అతని పేరుపై ఉన్న భూమి కొడుకు పేరుపైకి ఎక్కదు. మా వాళ్లు ఎక్కించి ఉండరు. భూమి కొనుకున్న వాళ్ల పరిస్థితి కూడా ఇంతే. కొత్త వివరాలు రికార్డుల్లోకి ఎక్కవు. ఇలాంటివన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. భయాలు, వివాదాలకు తావు లేకుండా కచ్చితంగా హద్దుల నిర్ధారణ జరుగుతోంది’ అని 2022 ఆగస్టు 2వ తేదీన నాటి సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో అప్పటి రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ స్పష్టం చేశారు. 2022లో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన చీఫ్ కమిషనర్గా భూముల రీ సర్వే ఆయన నేతృత్వంలోనే జరిగింది. వారంలో రెండుసార్లు ఆయన జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించి సర్వే వేగంగా జరగడానికి అవసరమైన చర్యలు తీసుకునే వారు. ప్రతి రోజూ రీ సర్వే స్టేటస్ రిపోర్టు తయారు చేయించేవారు. రీ సర్వే అద్భుతంగా జరుగుతోందని, ఎంతో ముందు చూపుతో ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన చాలా సందర్భాల్లో ప్రశంసించారు. ఎల్లో మీడియా రీ సర్వేకు వ్యతిరేకంగా పని గట్టుకుని కథనాలు రాసినప్పుడు ఆయన మీడియా సమావేశాలు పెట్టి బాగా జరుగుతోందని, దీని వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పేవారు. సాయిప్రసాద్ 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన పేషీలో పని చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కూడా ఆయనే. త్వరలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉంటారని గతంలోనే ప్రభుత్వం జీఓ జారీ చేసింది. రీ సర్వే బాగా జరిగిందని చంద్రబాబు అంగీకరించినట్లే » వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో విప్లవాత్మకంగా ప్రారంభమై విజయవంతంగా అమలవుతున్న భూముల రీ సర్వేపై చంద్రబాబు రెండు నాల్కల ధోరణి చర్చనీయాంశంగా మారింది. జగన్ హయాంలో జరిగిన రీ సర్వేను అన్ని రకాలుగా తప్పు పట్టిన చంద్రబాబు.. అప్పట్లో ఆ కార్యక్రమాన్ని అమలు చేసిన అప్పటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్కు ఇప్పుడు తన ప్రభుత్వంలో అదే రెవెన్యూ శాఖను అప్పగించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.» పైగా తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన్ను ఎంపిక చేయడాన్ని ఎత్తి చూపుతున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్.. రీ సర్వే బాగా జరుగుతోందని పలుమార్లు సమీక్షా సమావేశాల్లో వెల్లడించారు. ఇప్పుడు ఆయనకు అత్యున్నత స్థాయి పోస్టింగ్ ఇవ్వడం ద్వారా గతంలో ఆయన మాట్లాడిన మాటలు, చేసిన కార్యక్రమాలను.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన రీ సర్వేను అంగీకరించినట్లేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. » ఇటీవల దావోస్లో జరిగిన సదస్సులో ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) ఎండీ గీతా గోపీనాథ్ సైతం గత ప్రభుత్వంలో రాష్ట్రంలో చేపట్టిన రీ సర్వేను ప్రశంసించారు. సీఎం చంద్రబాబు అక్కడ ఉండగానే ఆమె ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం గమనార్హం. ఇలాంటి భూ సంస్కరణలు అత్యంత ఆవçశ్యకమని ఆమె కొనియాడటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎంతో మంది ఐఏఎస్ అధికారులు సైతం రీ సర్వేను మెచ్చుకుంటున్నారు. ఇది అత్యంత సాహసోపేత కార్యక్రమమని, వందేళ్ల తర్వాత చేపట్టిన మహా యజ్ఞమని చెబుతున్నారు. తమ జీవితంలో చాలా సంతృప్తిని ఇచ్చిన కార్యక్రమమని.. రీ సర్వేలో పాలు పంచుకున్న అధికారులందరూ వ్యక్తిగత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. » వీటన్నింటినీ బట్టి చూస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి పక్కా ప్రణాళికతోనే రీ సర్వేపై దుష్ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. ప్రజల్లో విషం నింపి రాజకీయ లబ్ధి కోసం బరితెగించారని ఇట్టే తెలుస్తోంది.నేను రెవెన్యూ శాఖలో (ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టింగ్ ఇవ్వక ముందు) చేరక ముందే తూర్పుగోదావరి జిల్లాలోని పాలగుమ్మి గ్రామానికి వెళ్లి రీ సర్వే ఎలా జరుగుతుందో చూశాను. మూడు గంటలు అక్కడే ఉండి పరిశీలించాక అక్కడి నుంచే సిద్ధార్థ జైన్కు ఫోన్ చేసి బాగా చేస్తున్నారని చెప్పా. ఒక సెంటు అటూ ఇటూ అవుతుందేమోనన్న భయంతో పాటు అనుమానాలు ఉండేవి. కానీ అలాంటిదేమీ జరగలేదు. దీని వల్ల చాలా మేలు జరుగుతోందని సిద్ధార్థ్కు చెప్పాను. రెవెన్యూ శాఖలో జాయిన్ అయ్యాక గుంటూరు జిల్లాలో రెండు మూడు గ్రామాలకు వెళ్లి రైతులతో రీ సర్వే గురించి మాట్లాడాను. చాలా బాగుందని చెప్పారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. – 2022 మార్చి 31న రీ సర్వేపై సమీక్షలో రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ -
చిన్న పరిశ్రమలు ఢమాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లు తీవ్రమైన గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. బడా బాబులకు రాయితీల జల్లులు కురిపిస్తున్న చంద్రబాబు సర్కారు అత్యధికమంది ఆధారపడిన ఎంఎస్ఎంఈ రంగాన్ని గాలికి వదిలేయడంతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయాయి. తమకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్లు ఇవ్వడానికి దిక్కులేదు కానీ ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్పడంపై ఎంఎస్ఎంఈల యజమానులు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గడచిన 18 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 3,041 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతపడినట్టు కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ స్వయంగా రాజ్యసభకు తెలియచేశారు. ఈ యూనిట్లు మూత పడటం ద్వారా 39,327 మంది ఉపాధి కోల్లోయినట్లు తెలిపారు. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో మూతపడిన యూనిట్లలో ఏపీ వాటా 3.73 శాతం ఉండగా.. 7.44 శాతం మంది ఉపాధి కోల్పోయారు. కోవిడ్ కాలంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉపాధి కోల్పోవడం ఇదే ప్రథమం అని అధికారులు వెల్లడిస్తున్నారు. కోవిడ్ వంటి సంక్షోభం వచ్చినప్పుడు కూడా ఈ స్థాయిలో యూనిట్లు మూతపడలేదన్న విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా తర్వాత నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో 873 యూనిట్లు మూతపడటంతో 5,075 మంది ఉపాధి కోల్పోయారు. అంటే గత ప్రభుత్వ నాలుగేళ్ల కాలంతో పోలిస్తే ఈ 18 నెలల కాలంలోనే ఏకంగా 774 శాతం అధికంగా 39,327 మంది ఉపాధి కోల్పోవడం రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల దుస్థితికి అద్దం పడుతోంది. విద్యుత్ బిల్లుల షాక్ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే బిల్లుల రూపంలో ఎంఎస్ఎంఈలకు భారీగా షాకిచి్చంది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలోని ఎంఎస్ఎంఈలపై విద్యుత్ బిల్లుల భారం విపరీతంగా పెరిగిపోయింది. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఒక ఎంఎస్ఎంఈకి సగటున యూనిట్ ఛార్జీ రూ.13.55 చేస్తుండగా.. తమిళనాడులో సగటున యూనిట్ ధర రూ.7–8గా ఉంది. అంటే యూనిట్కు దాదాపు రూ.6 అదనం. ఈ స్థాయిలో విద్యుత్ బిల్లులు బాదితే ఇతర రాష్ట్రాలతో ఎలా పోటీపడాలని ఆ సంస్థ ప్రతినిధి వాపోయారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం, మానవ వనరుల కొరత, ముడి సరుకుల ధరలు పెరుగుదల, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వంటి కారణాలు ఎంఎస్ఎంఈలు మూతపడేలా చేస్తున్నాయి. ఇంకోపక్క ఎంఎస్ఎంఈలు తయారు చేస్తున్న ఉత్పత్తులను ప్రభుత్వ శాఖలు కూడా కొనుగోలు చేయకపోవడం, ప్రభుత్వ అసమర్థ విధానాలతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోవడం వంటివి ఎంఎస్ఎంఈ యూనిట్లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే విధంగా చేస్తున్నాయి. ఇలాగైతే ఇంటికో భిక్షగాడు ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తున్నామంటూ గల్లీ నుంచి అమెరికా వరకు ప్రతీ వేదికపైనా సీఎం చంద్రబాబు చెబుతున్న మాటలకు భిన్నంగా రాష్ట్రంలో పరిస్థితులు తయారయ్యాయి. మాకివ్వాల్సిన ప్రోత్సాహకాలనిచ్చి ఆందుకోండి మహాప్రభో అని ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలు 4 నెలలుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా కూడా లేదు. కేవలం ఎంఎస్ఎంఈలకు రూ.1,900 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. విశాఖ పెట్టుబడుల సమావేశం ముందు కేవలం రూ.438 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకున్నారు. ఇందులో కూడా అత్యధిక శాతం కియా, పరిశ్రమల మంత్రి టీజీ భరత్కు చెందిన కంపెనీలకే చెల్లించడం పట్ల దళిత పారిశ్రామికవేత్తల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ సమయంలో వైఎస్ జగన్ సర్కారు కులం, మతం, పార్టీ చూడకుండా ఎంఎస్ఎంఈ యూనిట్లకు రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించి ఆదుకుంటే.. ప్రస్తుత ప్రభుత్వం నిబంధనలను లుఉల్లంఘిస్తూ కేవలం ఆ పార్టీ మద్దతుదారులకు మాత్రమే ప్రోత్సాహకాలను విడుదల చేస్తోందని దళిత పారిశ్రామికవేత్తల జేఏసీ ఆరోపిస్తోంది. ఈ విధంగా చేస్తే రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏమొస్తాయని నిలదీస్తున్నారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టు ఇంటికో పారిశ్రామికవేత్త సంగతి దేవుడెరుగు.. ఇంటికో భిక్షగాడు తయారవుతారంటూ ఎద్దేవా చేస్తున్నారు. -
పద్మ పురస్కార విజేతలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: పద్మ పురస్కార విజేతలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 2026గానూ కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా.. తమ విశిష్ట సేవలతో దేశానికి, తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిన విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. వివిధ రంగాల్లో మీరు సాధించిన అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు లభించాయి. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన నలుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. -
మామూలిస్తేనే మంజూరు.. బిల్లుల్లో బేరసారాలు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి రోజురోజుకు పెచ్చరిల్లుతోంది. కమీషన్లే లక్ష్యంగా కొత్త విధానాలు తెస్తోంది. రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణ బిల్లుల మంజూరులోనూ అక్రమాలకు తెరలేపింది. గృహ నిర్మాణ శాఖలో ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణ బిల్లుల మంజూరుకు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టడంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణ పురోగతి ఆధారంగా ఆన్లైన్లోనే బిల్లులు నమోదు చేసి, వివిధ దశల్లో ఆన్లైన్ వెరిఫికేషన్ అనంతరం నిర్మాణ ఏజెన్సీలకు నిధులు మంజూరు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితికి పూర్తి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నిమిషాల్లో అయ్యే పనికి రోజులు.. పేదల ఇంటి నిర్మాణం పురోగతి ఆధారంగా వివిధ దశలుగా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుంది. బేస్మెంట్, లింటెల్, స్లాబ్ ఇలా ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా బిల్లు మంజూరు కోసం క్షేత్ర స్థాయిలో పనిచేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఆన్లైన్లో నమోదు చేస్తూ ఉంటారు. గతంలో అయితే ఆన్లైన్లో నమోదు చేసిన అనంతరం డివిజన్, జిల్లా, గృహ నిర్మాణ సంస్థలోని ఇంజినీరింగ్, ఫైనాన్స్ ఇలా వివిధ దశల్లో ఆన్లైన్లో బిల్లులను పరిశీలించి, ధ్రువీకరించిన అనంతరం చెల్లింపులు ఆటోమేటిక్గా అయిపోయేవి. ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం లేఅవుట్ల వారీగా బిల్లులను డివిజినల్, జిల్లా, గృహ నిర్మాణ సంస్థలో వివిధ దశల్లో అధికారులు ఫిజికల్గా సర్టిఫై చేయాలనే వింత నిబంధన తెచి్చంది. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో అధికారుల చుట్టూ తిరిగి, వారితో సంతకాలు చేయించుకోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నామని ఏజెన్సీల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. కొందరు అధికారులు బిల్లులు సర్టిఫై చేయడానికి లంచాలు డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిమిషాలు, గంటల వ్యవధిలో అయిపోయిన బిల్లుల వెరిఫికేషన్ ప్రక్రియ.. ఇప్పుడు ఒక్కో దశకి 10 రోజుల పైనే పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుకు సాగని నిర్మాణాలు.. కమీషన్లు, లంచాల కోసం వింత విధానాలతో పచ్చనేతలు బిల్లులను పెండింగ్లో పెట్టేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.50 కోట్ల మేర నిర్మాణ సంస్థలకు బకాయి పడింది. పెద్ద ఎత్తున బిల్లులు నిలిచిపోవడంతో సంస్థలు ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆపేశాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో 31.19 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. జగనన్న కాలనీల్లో 19 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలు చేపట్టారు. ఉచితంగా స్థలం ఇచ్చి, ఆర్థిక సాయం చేసినప్పటికీ ఇంటిని నిరి్మంచుకోలేని పేదల కోసం ఆప్షన్–3 విధానం ప్రవేశపెట్టారు. ఈ విధానంలో 2.68 లక్షల మందిని ఎంపిక చేసి, ఏజెన్సీల ద్వారా ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆప్షన్–3 విధానం చంద్రబాబు గద్దెనెక్కాక పూర్తిగా పక్కదారి పట్టింది. కమీషన్ల కోసం పచ్చ గద్దలు నిర్మాణ సంస్థలను వేధింపులకు గురిచేస్తున్నాయి. ఏజెన్సీల యజమానులతో టీడీపీ నాయకులు కమీషన్లు డిమాండ్ చేస్తున్నారు. వీరు డిమాండ్ చేసినంత కమీషన్ ఇవ్వడానికి సిద్ధమైన వారికే బిల్లులు విడుదల చేయాలంటూ అధికారులకు సిఫార్సులు చేస్తున్నారు. -
పెద్దలు పెరిగిపోతున్నారు
సాక్షి, అమరావతి: దేశంలోని సగం రాష్ట్రాలు వృద్ధాప్యం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు వృద్ధాప్య రాష్ట్రాల కేటగిరీలోకి వెళ్లిపోయాయి. ఏపీ 2031 నాటికి వృద్ధాప్య కేటగిరీలోకి వెళ్లనుంది. ఫలితంగా పనిచేసే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోనుంది. దేశంలో జనాభా పరివర్తన–రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఆర్బీఐ నివేదిక విడుదల చేసింది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న జనాభా వాటా 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రాన్ని వృద్ధాప్య రాష్ట్రంగా వర్గీకరిస్తారు. 60 ఏళ్ల వయసు జనాభా 10 శాతం నుంచి 15 శాతం మధ్య ఉంటే ఇంటర్మీడియెట్ రాష్ట్రంగా.. 10 శాతం కంటే తక్కువ ఉంటే యువ రాష్ట్రంగా వర్గీకరిస్తారని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది. 2026లో ఏపీలో వృద్ధుల జనాభా 14.1 శాతం ఉండగా.. 2031 నాటికి 16.4 శాతానికి, 2036 నాటికి 18.9 శాతానికి పెరుగుతుందని అంచనా. 2016లో దేశంలోని అన్ని రాష్ట్రాలు యువ లేదా ఇంటర్మీడియట్ కేటగిరీలో ఉండగా.. 2026 నాటికి కేరళ, తమిళనాడు 60 ఏళ్లు పైబడిన జనాభాలో 15 శాతం కంటే ఎక్కువ మందితో వృద్ధాప్య వర్గంలోకి ప్రవేశించాయి.2036 నాటికి వృద్ధాప్యవర్గంలోకి మరిన్ని రాష్ట్రాలు..2036 నాటికి దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు వృద్ధాప్య వర్గంలోకి వెళ్లిపోతాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు ఇంటర్మీడియెట్ కేటగిరీలోకి వెళ్లిపోతాయని, ఏ ఒక్క రాష్ట్రం యువత కేటగిరీలో ఉండదని నివేదిక పేర్కొంది. బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, హర్యానా వంటి రాష్ట్రాలు యువ జనాభాతో నిండి ఉన్నాయని నివేదికలో తెలిపింది. ఈ రాష్ట్రాల్లో పనిచేసే వయసు వారి జనాభా వాటా 2031 నాటికి దాటి పెరుగుతూనే ఉంటుందని పేర్కొంది. ఈ గణాంకాల ప్రకారం తెలంగాణ పదో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాలు జాతీయ ఆర్థిక వ్యవస్థకు, కార్మిక సరఫరాకు ప్రధాన వనరుగా కూడా పనిచేస్తాయని వివరించింది. జనాభా వయసు ప్రభుత్వ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, యువత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో, ఎక్కువ మంది ఉద్యోగులు సమర్థవంతంగా పని చేస్తే, ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లను పెంచే పెద్ద పన్ను ఆధారాన్ని సృష్టించవచ్చని తెలిపింది. పెరిగిన పట్టణీకరణ వల్ల, వ్యవసాయం వంటి పన్ను విధించని రంగాల నుంచి వైదొలగడం ద్వారా ఈ రాష్ట్రాల్లో పన్ను ఆధారాన్ని మరింత పెంచుతుందని నివేదిక పేర్కొంది. అయితే దీనికి విరుద్ధంగా, వృద్ధాప్య రాష్ట్రాల్లో, క్రమంగా తగ్గిపోతున్న శ్రామిక శక్తి దీర్ఘకాలిక వృద్ధి రేటును తగ్గిస్తుందని, తద్వారా పన్ను ఆధారాన్ని, ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయ పన్నులను పాక్షికంగా క్షీణింపజేస్తుందని వివరించింది. యువ రాష్ట్రాలు స్థిరంగా బలమైన ఆదాయ సమీకరణను ప్రదర్శిస్తాయని, ఇది అధిక స్థాయి రెవెన్యూ రశీదులు, పన్ను ఆదాయాలు, కేంద్ర బదిలీలలో ప్రతిబింబిస్తాయని, మధ్యస్థ రాష్ట్రాలు సాపేక్షంగా స్థిరమైన ఆదాయ పనితీరును నిర్వహిస్తాయని తెలిపింది. తద్వారా రెవెన్యూ రశీదులు, పన్ను ఆదాయాలు, కేంద్ర బదిలీలలో మిత ఫలితాలు ఉంటాయని పేర్కొంది. వృద్ధాప్య రాష్ట్రాలు బలహీనమైన పనితీరును ప్రదర్శిస్తాయని, అలాగే కేంద్రం నుంచి తక్కువ బదిలీలు ఉంటాయని పేర్కొంది. యువ రాష్ట్రాలు మానవ మూలధన పెట్టుబడులను బలోపేతం చేయడం ద్వారా వారి జనాభా లాభాలను ఉపయోగించుకోవచ్చని, ఇంటర్మీడియెట్ రాష్ట్రాలు వృద్ధాప్యానికి ముందస్తు తయారీతో వృద్ధి ప్రాధాన్యతలను సమతుల్యం చేసుకోవచ్చని తెలిపింది. వృద్ధాప్య రాష్ట్రాలు ఆరోగ్య సంరక్షణ, పెన్షన్, శ్రామికశక్తి విధాన సంస్కరణలతో పాటు ఆదాయ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని ఆర్బీఐ నివేదిక సూచించింది. -
ఎక్కడ ఉంటున్నారు.. ఏం తింటున్నారు?
సాక్షి, అమరావతి: జనగణనకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ సారి కుటుంబ వివరాలతో పాటు నివాసం, జీవన స్థితిగతులు, కులం వంటి సమగ్ర వివరాలు సేకరించనున్నారు. 2027లో ప్రారంభం కానున్న జనాభా లెక్కల్లో ఎన్యూమరేటర్ సేకరించాల్సిన 33 అంశాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. 2011లో దేశ జనాభా గణన చేపట్టారు. 2021లో ప్రారంభం కావాల్సిన జనాభా లెక్కలు కరోనా వంటి కారణాలతో వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు 2027లో జనగణన చేపట్టడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ సారి ప్రతీ ఇంటికి 20 నిమిషాల నుంచి అరగంటకు పైగా సమయం వెచ్చించాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సెల్ ఫోన్ టు మరుగుదొడ్డి వరకూ.. ఈ సారి సర్వేలో ప్రతి కుటుంబం పూర్తి వివరాలు సేకరించనున్నారు. వాడుతున్న సెల్ ఫోన్ నుంచి మరుగుదొడ్డి .. నివసిస్తున్న ఇల్లు, ఇంట్లో సౌకర్యాలు, వాహనాలు వంటి సమస్త వివరాలు సేకరిస్తారు. ఆఖరికి ఇంటి గోడ దేనితో నిరి్మంచారు, పైకప్పు ఏంటి... ఫ్లోరింగ్ ఏ విధంగా ఉంది, ఎన్ని ల్యాప్ట్యాప్లు.. ఎన్ని స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.. ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఎలాంటి మరుగుదొడ్లు వినియోగిస్తున్నారో కూడా సేకరించనున్నారు. కులం, ఆదాయ మార్గాలు, ఎంతమంది నివసిస్తున్నారు..సొంతిల్లా.. అద్దె ఇల్లా వంటి 33 రకాల వివరాలు సేకరిస్తారు. ఈ వివరాలన్నీ కేవలం జనాభా లెక్కల కోసమేనని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. -
కౌలు రైతు కకావికలు
సాక్షి, అమరావతి: కౌలు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటినా ఏ ఒక్క కౌలు రైతునూ ఆదుకున్న పాపాన పోలేదు. కనీసం గుర్తింపు కార్డులు లేవు. పంటల బీమా లేదు. నష్టపరిహారం అసలే లేదు. ఉచిత బీమాకు మంగళం పాడారు. పంట రుణాల నుంచి పెట్టుబడి సాయం వరకు ఏదీ అందక సాగు వేళ వారు పడరాని పాట్లు పడుతున్నారు. చివరికి వారు పండించిన పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనే వారూ లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పంట కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వారికి ఏ ఒక్క సంక్షేమ ఫలాలు అందడం లేదు. కనీసం గుర్తింపు కార్డులకు కూడా నోచుకోని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీలో సైతం కౌలు రైతులకు చోటు లేకుండా పోయింది. ఇటీవల ‘పీపుల్స్ పల్స్’ సంస్థతో కలిసి కౌలు రైతు సంఘాలు నిర్వహించిన ఓ సర్వే ఫలితాలు.. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత కౌలు రైతులు పడుతున్న కష్టాలకు అద్దం పట్టాయి. 87.7 శాతం మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులకు నోచుకోలేదని వెల్లడైంది. 92.7 శాతం మందికి పంట రుణాలు, 91.4 శాతం మందికి మద్దతు ధర లభించడం లేదని సర్వేలో తేలింది. కనీసం 14 శాతం మంది కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ పంట ఉత్పత్తులను అమ్ముకోలేక పోయారని స్పష్టమైంది. పైగా ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేయడం వల్ల నూరు శాతం కౌలు రైతులకు రక్షణ లేకుండా పోయిందని సర్వేలో వెల్లడైంది. ఈ రెండేళ్లలో ఎరువులు.. ప్రధానంగా యూరియా కొరత, పురుగు మందుల కొరత వేధించిందని తేటతెల్లమైంది. యూరియా కోసమైతే రైతులు ఊరూరా ఆందోళనకు దిగారని స్పష్టమైంది. పెట్టుబడి సాయం రూపాయి కూడా లేదుభూ యజమానుల ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు జారీ చేసేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త కౌలు చట్టాన్ని తెస్తామని నమ్మబలికి.. కౌలు రైతుల ఓట్లు దండుకున్న చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత కొత్త చట్టం కోసం కొద్దిరోజులు హంగామా చేశారు. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఉన్న సీసీఆర్సీ (క్రాప్ కల్టివేటెడ్ రైట్స్ కార్డ్) చట్టానికి తూట్లు పొడుస్తూ.. వారికి ఏ ఒక్క సంక్షేమ పథకం అందకుండా మోకాలొడ్డారు. భూ యజమానులతో పాటే ప్రతి కౌలు రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో హామీ ఇచ్చారు. తొలి ఏడాదిలో దీన్ని పూర్తిగా అటకెక్కించిన ప్రభుత్వం.. రెండో ఏడాది రూ.10 వేలతో సరిపెడుతూ.. రూ.30 వేలు ఎగ్గొట్టింది. కౌలు రైతుల విషయానికి వస్తే ఆ రూ.10 వేలు కూడా ఇవ్వకుండా సాంకేతిక కారణాలంటూ మొండి చేయి చూపుతోంది. ఇప్పటి దాకా రెండేళ్లకు సంబంధించి ఏ ఒక్క కౌలు రైతుకు కూడా రూపాయి పెట్టుబడి సాయం అందించలేదు. పంట రుణాల కోసం ఎదురు చూపుచంద్రబాబు ప్రభుత్వం 2024–25, 2025–26 సీజన్లలో కౌలు రైతులకు కనీసం సీసీఆర్సీ కార్డులు కూడా ఇవ్వడం లేదు. 2024–25లో 30 లక్షల మంది కౌలు రైతుల్లో కనీసం 2.58 లక్షల మందికి వ్యక్తిగతంగా రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా ఇచ్చింది కేవలం 41,205 మందికి మాత్రమే. 2025–26 సీజన్లో కనీసం 5 లక్షల మంది కౌలు రైతులకు రూ.8 వేల కోట్ల పంట రుణాలిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. లక్ష్యం మేరకు కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేక పోయామని ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీసీఎల్సీ సమావేశంలో బ్యాంకర్లే అధికారికంగా ప్రకటించారు. దీంతో రుణాల కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అధిక వడ్డీలు కట్టలేక, ప్రభుత్వ ఆసరా లేకపోవడంతో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత 19 నెలల్లో 300 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టగా, వారిలో 90 శాతానికి పైగా కౌలు రైతులే ఉన్నారంటే పరిస్థితి ఎంత దనీయంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.ఆ ఐదేళ్లూ అన్నదాతలకు అన్ని విధాలా భరోసాభూ యజమానుల హక్కులకు భంగం కలగని రీతిలో కౌలుదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో సీసీఆర్సీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో గ్రామ స్థాయిలో సీసీఆర్సీ మేళాలు నిర్వహించి, నిర్ధేశించిన లక్ష్యం మేరకు కార్డులు జారీ చేసేవారు. పైగా భూ యజమానులను ఒప్పించి మరీ కౌలుదారులకు గుర్తింపు కార్డులిచ్చేవారు. ఇలా ఏటా అర్హులైన కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేశారు. వీటి ప్రామాణికంగా సకాలంలో పంట రుణాలు, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్ట పరిహారం వంటి సంక్షేమ ఫలాలు నేరుగా అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేసేవారు. పైగా వారు పండించిన వంట ఉత్పత్తులను కల్లాల నుంచే కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేసి అండగా నిలిచారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సాయం అందలేదని.. గత వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుందని.. తమ పాలిట అది స్వర్ణయుగమని కౌలు రైతులు గుర్తు చేసుకుంటున్నారు.ఇలాగైతే వ్యవసాయం మానేయాల్సిందే..ఇతని పేరు గుప్తాల సూర్యనారాయణ. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం స్వగ్రామం. ఇతనికి సొంతంగా సెంటు భూమి కూడా లేదు. ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఖరీఫ్లో బొండాలు (స్వర్ణ రకం వరి) వేశాడు. తుపాను దెబ్బకు ఎకరాకు 15 బస్తాలు కూడా దిగుబడి రాలేదు. తేమ శాతం అధికంగా ఉండడంతో మద్దతు ధర కూడా దక్కలేదు. కనీసం పెట్టుబడి మేర కూడా చేతికందలేదు. ఇప్పుడు సీసీఆర్సీ కార్డు ఇవ్వలేదు. దీంతో పంట రుణమూ ఇవ్వడం లేదు. పంట దెబ్బతిన్నా పైసా పరిహారం అంద లేదు. 19 నెలలైనా పైసా పెట్టుబడి సాయం అందలేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు. బ్యాంకులో రుణం ఇవ్వక పోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో అప్పు తెచ్చుకుని పంట సాగు చేశాడు. ఉచిత పంటల బీమా ఎత్తివేయడంతో బీమా పరిహారం అందకుండా పోయింది. తనలాగే ఎంతో మంది కౌలు రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, ఇలాగైతే వ్యవసాయం మానేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు.పెట్టుబడి సాయం పైసా అందలేదు మాకు వ్యవసాయమే జీవనాధారం. సొంత భూమి లేదు. రెండెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఖరీఫ్లో 1061 రకం వరి సాగు చేశాను. తుపాను, అధిక వర్షాల వల్ల 75 సెంట్లల్లో పంట పూర్తిగా నేలవాలింది. మిగిలిన 1.25 ఎకరాల్లో పంట నిలబడినప్పటికీ ఎకరాకు 26 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. వ్యాపారులకు క్వింటా రూ.1,600 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. దెబ్బతిన్న పంటకు పైసా పరిహారం రాలేదు. 19 నెలల్లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. కౌలు కార్డులున్న వాళ్లకు సైతం బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. ఉచిత పంటల బీమా ఎత్తివేయడంతో ఆర్థిక భారం తట్టుకోలేక బీమా కూడా చేయించుకోలేక పోతున్నాం. ఈ ప్రభుత్వంలో కౌలు రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. – వెంట్రప్రగడ మరియదాసు, గొడవర్రు, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లాసర్కారు సాయం కాగితాలకే పరిమితంనా సొంత భూమి 20 సెంట్లతో పాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. షావుకార్ల దగ్గర రూ.3 వడ్డీకి అప్పు చేసి, ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టి.. ఖరీఫ్లో 1061 రకం వరి సాగు చేశా. తుపాను దెబ్బకు పూత పూర్తిగా రాలిపోయి పంట పాలిపోయింది. అధికారులు వచ్చినప్పుడు పంట నష్టం వివరాలు నమోదు చేయాలని ఎంతగా బతిమిలాడినా వినిపించుకోలేదు. ఎకరాకు 30 బస్తాలకు పైగా దిగుబడి వస్తాదని ఆశిస్తే, కేవలం 18 బస్తాలే వచ్చింది. 16 బస్తాలు కౌలు కింద ఇచ్చేశా. కనీసం పెట్టుబడి కూడ మిగల్లేదు. ఈ 19 నెలల్లో పెట్టుబడి సాయం కాదు కదా.. పంట నష్ట పరిహారం కూడా పైసా అందలేదు. బ్యాంకులకు వెళ్తే రుణాలు ఇచ్చే వారు కూడా లేరు. వ్యవసాయం చాలా కష్టంగా ఉంది. సాయం చేస్తామన్న ప్రభుత్వం మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. – బద్దా రమేష్, పాండువ గ్రామం, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లాపంట రుణాలివ్వడంలో విఫలంఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలైనా కొత్త కౌలు చట్టం కార్యరూపం దాల్చలేదు. భూ యజమానులతో పాటు కౌలు రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం కూడా లేదు. కౌలుదారులకు పంట రుణాల మంజూరు కాగితాలకే పరిమితమైంది. 2025–26 సీజన్లో 8 వేల కోట్ల పంట రుణాలిస్తామని ప్రకటించారు. కానీ డిసెంబర్ నాటికి రూ.1,490 కోట్లు మాత్రమే ఇచ్చారు. కౌలు రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఇంతకంటే వేరే చెప్పనవసరం లేదు. ష్యూరిటీతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకు రూ.2 లక్షల వరకు పంట రుణాలివ్వాలి. ఉచిత పంటల బీమాను అటకెక్కించడంతో పూర్తిగా నష్టపోతున్నది కౌలు రైతులే. – పీ.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం -
‘గీతం’కు ప్రభుత్వ భూమి ఇవ్వడం చట్ట విరుద్ధం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం రూరల్ మండలం రుషికొండ, ఎండాడ గ్రామాల్లో అత్యంత విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి ఉదారంగా సమర్పించడం చట్ట విరుద్ధమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి ఈఏఎస్ శర్మ స్పష్టంచేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని తెలిపారు. ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, బాధ్యులైన అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మికి వేర్వేరుగా లేఖలు రాశారు. పేదల గుడిసెలు తొలగించి.. పెద్దలు ఆక్రమించిన భూములు క్రమబద్ధీకరిస్తారా? అదే అధికారులు విశాఖ నగరానికి జీవనోపాధి కోసం వలస వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిని, వీధి వ్యాపారుల బళ్లను పోలీసు బలగాల సహాయంతో పొక్లెయిన్లు తీసుకువచ్చి నిర్దాక్షిణ్యంగా తొలగించారని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం, నిస్సహాయులకు మరొక న్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన భూమిని ఈ నెల 30న జరిగే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో క్రమబద్దీకరణ చేయడానికి చూస్తున్నారని పత్రికల్లో వార్తలు చూశానని తెలిపారు. ఈ విషయంలో విశాఖ రూరల్ మండలం తహసీల్దారు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రెవెన్యూ అధికారులు ఏ నియమం కింద ఇటువంటి క్రమబద్దీకరణకు అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ నిబంధనల్లో బీఎస్వో (బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్)24 కింద గానీ, రెవెన్యూ శాఖ 2012 సెప్టెంబర్ 14న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 571 కింద గానీ ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదని వివరించారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమే.. స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని సుప్రీంకోర్టు జగపాల్ సింగ్ (కేస్ నంబర్ 1132/2011) కేసులో 2011 జనవరి 28న అన్ని రాష్ట్రాలను ఆదేశించినట్లు ఈఏఎస్ శర్మ ఆ లేఖలో స్పష్టంచేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లేనని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ భూముల ధరల ప్రకారమే రుషికొండ, ఎండాడ ప్రాంతంలో ఎకరం రూ.22 కోట్లు ఉందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అంత విలువైన భూమిని లాభాలు గడించే ప్రైవేటు సంస్థకు కేటాయిస్తే, సుప్రీంకోర్టు 2జీ స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం ఆ నిర్ణయాలకు సహకరించిన అధికారులు, రాజకీయ నాయకుల మీద 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అసైన్డ్ భూములను గీతం కొనుగోలు చేసింది గతంలో గీతం సంస్థ రుషికొండ, ఎండాడ గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా పేదలకు కేటాయించిన డీ పట్టా భూములను కూడా చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేసిందని శర్మ తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి ఆ ప్రైవేటు సంస్థల మీద చర్యలు తీసుకుని ఆ కొనుగోళ్లను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిందారీ సంస్థలు కావని అవి ప్రజాస్వామ్య విధానాలు, చట్టాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. తాను సూచించిన అంశాలపై దర్యాప్తు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై రాజకీయ ఒత్తిడి ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలన్నారు. అందుకే ఈ లేఖను కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా పంపుతున్నట్లు ఆయన తెలిపారు. -
బంగారు కొండ..'భారత్'.. జీడీపీని దాటేసిన భారతీయుల బంగారం
సాక్షి, అమరావతి: బంగారం... భారతీయుల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసింది. అంతర్జాతీయంగా పరుగులు తీస్తున్న బంగారం ధరలతో భారతీయుల సంపద కూడా అంతే వేగంతో పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని అధిగమించేసిందంటే ఏ స్థాయిలో ప్రజల వద్ద బంగారం ఉందో అర్థం చేసుకోవచ్చు. భారతీయుల వద్ద ఉన్న బంగారం విలువ తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల (రూ.450 లక్షల కోట్ల) మార్కును దాటేసింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం... ప్రస్తుతం భారతదేశ జీడీపీ 4.1 ట్రిలియన్ డాలర్ల (రూ.387 లక్షల కోట్లు) వద్దే ఉంది. 2025లో బంగారం 65 శాతం పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.1.40 లక్షలకు చేరినప్పుడు.. భారతీయుల బంగారం విలువ 5 ట్రిలియన్ డాలర్లను దాటినట్లు మోర్గాన్స్టాన్లీ నివేదిక వెల్లడించింది. ఇప్పుడు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1.55 లక్షలు దాటడంతో ఈ విలువ మరింత పెరిగింది. భారతీయుల వద్ద ఆభరణాలు, తదితరాల రూపంలో 34,600 టన్నుల బంగారం ఉందని.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,500 డాలర్లు అధిగమించడం ద్వారా భారతీయుల బంగారం విలువ దేశ జీడీపీని అధిగమించిందని మోర్గాన్స్టాన్లీ పేర్కొంది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,987 డాలర్లు అధిగమించింది. ఇది కాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వద్ద 880 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. గత రెండేళ్లలో ఆర్బీఐ 75 టన్నుల బంగారం కొనుగోలు చేసింది. మొత్తం విదేశీ మారక నిల్వల్లో ఆర్బీఐ బంగారం వాటా సుమారు 14 శాతానికి సమానమట. అయితే మొత్తం 34,600 టన్నుల బంగారంలో 80 శాతం ఆభరణాల రూపంలోనే ఉందని నివేదిక వెల్లడించింది. ఇప్పుడిప్పుడే బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా భారతీయులు భావించడం మొదలు పెట్టారని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో బంగారం కడ్డీలు, నాణేల కొనుగోళ్లలో 24 శాతం పైన వృద్ధి నమోదవ్వడమే ఇందుకు సంకేతం. -
ఉద్యోగులకు బాబు సర్కారు మరణశాసనం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు మరణ శాసనం రాస్తోందని, ఒత్తిడికి గురిచేసి వారి మరణాలకు కారణమవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులపై వేధింపులు ఎక్కువైపోయాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లు, టెలీకాన్ఫరెన్స్లు, అసాధ్యమైన సర్వే టార్గెట్ల పేరుతో ఉద్యోగులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని విమర్శించారు. గత పది రోజుల్లోనే పని ఒత్తిడితో నలుగురు ఉద్యోగులు గుండెపోటుతో మరణించడం ప్రభుత్వ వేధింపులకు నిదర్శనమని మండిపడ్డారు. పది రోజుల్లో ఒక తహసీల్దార్, ఒక ఎస్ఈ, ఇద్దరు సచివాలయ ఉద్యోగులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని, వీరంతా 30 నుంచి 40 ఏళ్లలోపు వారే కావడం బాధాకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే వలంటీర్లను తొలగించేసి వారు చేయాల్సిన పనిని సచివాలయ ఉద్యోగులకు అప్పగించి వారిపై ఒత్తిడి పెంచిందని దుయ్యబట్టారు. సచివాలయ ఉద్యోగులను పగలూ రాత్రీ, సెలవు రోజులు అని తేడా లేకుండా ఇంటింటికీ తిరిగి సర్వేలు చేయాలని అమానవీయమైన ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రాత్రిపూట సర్వే చేయాలని ఇచ్చిన ఆర్డర్లను ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి ఉదహరించారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల మరణాలపై స్పందించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ఉద్యోగులతో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గౌరవంగా నడుచుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి మారకుంటే ఉద్యోగుల తరఫున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులూ అధైర్యపడకుండా ఓపికతో ఉండాలని, మంచి రోజులు మళ్లీ వస్తాయని కాకర్ల వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టాభిపై హత్య కేసు నమోదు చేయాలి‘గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి విశాఖపట్నం జోనల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి.., జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవిందరావుపై రెచి్చపోయి, గదమాయిస్తూ తీవ్రంగా అందరి ముందు అవమానించారు. డంపింగ్ యార్డ్లో చెత్త నిల్వల తరలింపునకు పాత కాంట్రాక్టర్ను తొలగించి కొత్త కాంట్రాక్టర్కు బాధ్యతలు అప్పగించినట్లు ఎస్ఈ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా.. ఏం తమాషా చేస్తున్నావా అంటూ పట్టాభి మండిపడ్డారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన గోవిందరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అందుకే ఎస్ఈ మృతికి ముమ్మాటికీ పట్టాభిదే బాధ్యత. ఒక ఉన్నతాధికారికే రక్షణ లేకపోతే, ఇక చిన్న ఉద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో ఎంత దయనీయంగా ఉంటుందో అందరూ ఆలోచించాలి. ఇటీవల ఒక తహసీల్దార్ మృతి, పలువురు సచివాలయాల ఉద్యోగులు ఆత్మహత్యలకు అధికార పార్టీ వేధింపులే కారణం. ఒక ఎస్ఈ ప్రాణాలు బలిగొన్న పట్టాభిపై వెంటనే హత్య కేసు నమోదు చేయడమే కాకుండా, ఆయన్ను కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. లేకుంటే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తాం’ అని వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. -
‘విద్యుత్’ధర్మానికి బాబు సర్కారు తూట్లు
సాక్షి, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి ఓ రాష్ట్ర హైకోర్టుకు ఉన్నంత అధికారం ఉంటుంది. కానీ బాబు సర్కారు ఏపీఈఆర్సీ విద్యుక్తధర్మానికి తూట్లు పొడిచింది. స్వతంత్ర అధికారాలకు మంగళం పాడింది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండా చేసింది’’ అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు(ఏపీఈపీడీసీఎల్),మధ్య(ఏపీసీపీడీసీఎల్), దక్షిణ(ఏపీఎస్పీడీసీఎల్) విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన ఆదాయ, అవసరాల నివేదిక (ఆగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్–ఏఆర్ఆర్), రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహిరంగ విచారణ నిర్వహించింది. వివిధ వర్గాల ప్రజల నుంచి ఏపీఈఆర్సీ సభ్యుడైన పీవీఆర్ రెడ్డి, ఇన్చార్జ్ చైర్మన్ హోదాలో అభిప్రాయాలను స్వీకరించారు. లేఖలిస్తే సరా..డబ్బులివ్వరాప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఇవ్వాల్సిన సబ్సిడీ సొమ్ము 2025 సెప్టెంబర్ నాటికి రూ.12,718 కోట్లు ఉందని, పూర్తిగా డిస్కంలకు సర్కారు చెల్లించడం లేదని విద్యుత్ వినియోగదారుల ఐక్య వేదిక కన్వీనర్ ఎంవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రూ.4,495 కోట్లు కూడా సబ్సిడీ బకాయిలకు కలిశాయని పేర్కొన్నారు. ప్రభుత్వం లేఖ ఇస్తే సరిపోదని, డబ్బులూ సకాలంలో ఇవ్వాలని, అలా ఇవ్వకపోవడం వల్ల డిస్కంలు అప్పుల పాలవుతున్నాయన్నారు. దీనికి తోడు బిల్లుల బకాయిల రూ.15137 కోట్లు 2025 మార్చినాటికి ఉన్నాయన్నారు. ఇందులో ప్రైవేటు సంస్థలవి రూ.6,288 కోట్లు కాగా, మిగిలినవి ప్రభుత్వ సంస్థలవేనని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని చంద్రబాబు, లోకేశ్సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం, తగ్గిస్తాం అని హామీ ఇచ్చారని, కానీ గడిచిన 18 నెలల్లో భారీగా చార్జీలు పెంచారని సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు విమర్శించారు. అదే విధంగా స్మార్ట్ మీటర్లు పెడతామని ఎవరైనా వస్తే పగలగొట్టాలని చెప్పిన మంత్రి లోకేశ్ ఇప్పుడు బలవంతంగా మీటర్లు పెట్టిస్తున్నా.. నోరు మెదపరేమని దుయ్యబట్టారు. విద్యుత్ బిల్లులోని క్యూఆర్కోడ్ పనిచేయడం లేదని, అడ్డగోలు చార్జీలతో ప్రజల నడ్డి విరుస్తున్నారని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు వేధిస్తున్నారని పారిశ్రామికవేత్తలు ఫిర్యాదు చేశారు. ఆ చార్జీలను తొలగించాలి ఇక శుక్రవారం మ«ద్యాహ్నం నుంచి ఆన్లైన్ (వర్చువల్) విధానంలో ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ట్రూ అప్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీలను తొలగించాలని, విద్యుత్ అధికారులు, వినియోగదారులకు సమన్వయ సమావేశాలను ప్రతి నెలా నిర్వహించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో డిస్కంల సీఎండీలు పి.పుల్లారెడ్డి, శివశంకర్ లోతేటి, ఏపీఈఆర్సీ జాయింట్ డైరెక్టర్ డి.రమణయ్యశెట్టి, కార్యదర్శి పి.కృష్ణ, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, సీజీఎంలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 27న కర్నూలులో ప్రజాభిప్రాయసేకరణ జరగనుంది. -
మాంసం, చేపల దుకాణాలకూ ఈ–వేలమేనా!?
సాక్షి, అమరావతి : ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటున్న అధికారులు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడంలేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. మాంసం, చేపల దుకాణాల కేటాయింపునకు సైతం ‘ఈ–వేలం’ నిర్వహించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. కంప్యూటర్పై కనీస పరిజ్ఞానం కూడా లేని చిన్న వ్యాపారులకు షాపులు కేటాయించే విషయంలో సాంప్రదాయ బహిరంగ వేలం కాకుండా ఈ–వేలం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పుబట్టింది. ఇందులో పాల్గొనాలంటే పలు డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ఆ డాక్యుమెంట్లు ఏవనే విషయంపై కూడా ఆ చిరు వ్యాపారులకు అవగాహన ఉండదని, వారిలో చాలా మంది పెద్దగా చదువుకుని ఉండరని తెలిపింది. క్షేత్ర స్థాయి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా, అధికారులు ఏసీ రూముల్లో కూర్చొని ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. పైపెచ్చు ఈ–వేలం టెండర్ నోటిఫికేషన్ను ఇంగ్లిష్ లో ప్రచురించడాన్ని కూడా హైకోర్టు తప్పుబట్టింది. తెలుగు పత్రికలో తెలుగు భాషలో నోటిఫికేషన్ను ఇవ్వాలని నిబంధనలు చెబుతుంటే, తెలుగు పత్రికలో ఇంగ్లిష్ లో నోటిఫికేషన్ ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఏం ప్రయోజనాలు ఆశించి ఇలా చేస్తున్నారని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను నిలదీసింది. విజయవాడ మహంతి మార్కెట్లో షాపుల కేటాయింపు నిమిత్తం ఈనెల 6న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ఈ–వేలం నోటిఫికేషన్ను తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిలిపేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కార్పొరేషన్ను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ–వేలంపై పిటిషన్మహంతి మార్కెట్లో మాంసం, చేపల దుకాణాల కేటాయింపు కోసం ఈ–వేలానికి ఈ నెల 6న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ అదే మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తున్న హరి మాణిక్యం శంకరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం విచారణ జరిపారు.పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ–వేలం నోటిఫికేషన్ గురించి అధికారులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తెలుగు పత్రికలో ఇంగ్లిష్లో నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. పిటిషనర్తో సహా ఇతర వ్యాపారుల్లో చాలా మంది నిరక్ష్యరాస్యులు, కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారున్నారని.. దీంతో నోటిఫికేషన్కు స్పందించలేకపోయారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలే తప్ప, క్లిష్టతరంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. -
ఉదయం ఇడ్లీ.. రాత్రి చికెన్
సాక్షి, అమరావతి: బెజవాడ వాసుల ఆహారపు అలవాట్లు భలే ఉన్నాయి. ఉదయం ఇడ్లీ, వెజ్ దోశ వంటి సాత్విక ఆహారంతో దైనందిన కార్యకలాపాలు ప్రారంభిస్తున్న వారికి చీకటి పడితే చికెన్ ముక్క గొంతు దిగాల్సిందేనట. 2025లో వచ్చిన ఆర్డర్ల ఆధారంగా విజయవాడ వాసుల ఆహారపు అలవాట్లపై ఆన్లైన్ ఫుడ్ యాప్ సంస్థ స్విగ్గీ ప్రత్యేక నివేదికలో వెల్లడించింది. చికెన్ వంటకాలకు క్రేజ్ ఆ సంస్థకు వచ్చిన ఫుడ్ ఆర్డర్లలో 7.78 లక్షల ఆర్డర్లతో చికెన్ బిర్యానీ తొలిస్థానంలో నిలిచింది. 3.2 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ రెండో స్థానంలో, 2.7 లక్షల ఆర్డర్లతో వెజ్ దోశ 3వ స్థానంలో నిలిచాయి. బ్రేక్ ఫాస్ట్లో ఇడ్లీ.. దోశ పోటాపోటీ ఉదయం వేళల్లో వచ్చిన ఆర్డర్లలో సింహ భాగం ఇడ్లీదే. 1.43 లక్షల ఆర్డర్లతో ఇడ్లీ అగ్రస్థానంలో నిలవగా.. తదుపరి స్థానంలో 1.12 లక్షల ఆర్డర్లతో వెజ్ దోశ నిలిచింది. వీటితోపాటు ఉల్లి దోశ, పూరీ, వెజ్ వడలు ఉదయం వేళ అత్యధికంగా ఆర్డర్ చేశారు. పెరుగుతున్న అర్ధరాత్రి ఆర్డర్లు అర్ధరాత్రి ఆర్డర్లు ఇచ్చే సంస్కృతి విజయవాడలో వేగంగా విస్తరిస్తోందని స్విగ్గీ ఆ నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే రాత్రి 12 నుంచి రెండు గంటల్లోపు ఇచ్చే ఆర్డర్లు 47.7 శాతం పెరిగాయి. అర్ధరాత్రి ఇచ్చే ఆర్డర్లలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఉండగా, ఆ తర్వాత చికెన్ బర్గర్లు, చికెన్ ఫ్రై, చికెన్ పిజ్జా, చికెన్ నగ్గెట్స్ వంటి నాన్వెజ్ వంటకాలు ఉన్నాయి. బెంగాలీ.. పంజాబీ వంటకాలపై మోజు విజయవాడ వాసులు బెంగాలీ, పంజాబీ వంటకాలను అత్యధికంగా ఇష్టపడుతున్నారని వెల్లడించింది. గతేడాదిలో పోల్చితే బెంగాలీ వంటకాల ఆర్డర్లు 35 శాతం, పంజాబీ వంటకాల ఆర్డర్లు 30 శాతం పెరిగాయి. బయట తినేద్దాం విజయవాడలో బయట భోజనాలు చేసే అలవాటు పెరుగుతోందని వెల్లడించింది.అత్యధికంగా మదర్స్డే నాడు బయట హోటల్స్లో తినగా.. ఇందులో ఒక కుటుంబం రూ.30,079 బిల్లు చేసినట్లు పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బయట తినేవారి సంఖ్య 276 శాతం పెరిగినట్టు స్విగ్గీ పేర్కొంది. స్విగ్గీ డైన్ అవుట్ ద్వారా నగరం సమష్టిగా రూ.90 లక్షలు ఆదా చేసిందని, ఒక కస్టమర్ సింగిల్ బుకింగ్లో రూ. 15,109 అత్యధికంగా ఆదా చేశారని స్విగ్గీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సిద్ధార్థ్ భాకూ తెలిపారు. ఫుడ్ ఆన్ ట్రైన్కు కూడా డిమాండ్ బాగాపెరుగుతోందని, విజయవాడ జంక్షన్లో ఫుడ్ ఆన్ ట్రైన్ ద్వారా చేసే ఆర్డర్లు 233 శాతం పెరిగినట్లు తెలిపింది. కొనసాగుతున్న బిర్యానీ హవా ఇక దేశవ్యాప్తంగా బిర్యానీ తన రాజసాన్ని కొనసాగిస్తోంది. 2025లో దేశవ్యాప్తంగా 93 మిలియన్ బిర్యానీల ఆర్డర్లు వచ్చాయి. నిమిషానికి 194, ప్రతీ సెకనుకు 3.25 బిర్యానీలు లాగించేస్తున్నారు. -
చంద్రబాబు ప్రత్యేక విమానాల ఖర్చు.. ఏడాదికి రూ.54.63 కోట్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న ప్రత్యేక హెలికాప్టర్, విమానాల అద్దె ఖర్చు రూ.54.63 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సీఎం చంద్రబాబు (వీవీఐపీ) వినియోగించిన ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దె చెల్లించేందుకు రూ.13,65,75,000 విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగు త్రైమాసికాలకు కలిపి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెకు రూ.54.63 కోట్లు అయినట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఇప్పటికే మూడు త్రైమాసికాలకు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దె చెల్లింపునకు రూ.40.97 కోట్లను విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్లినా ప్రత్యేక హెలికాప్టర్తోపాటు ప్రత్యేక విమానం వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయన తరచూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణం చేస్తున్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్నారు. అందువల్లే ఏడాదిలోనే రూ.54.63 కోట్లు అద్దెల రూపంలో చెల్లించాల్సి వచ్చిందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్, విమానాల అద్దె వ్యయం ఇలా..తొలి త్రైమాసికం రూ.19,12,05,000 రెండో త్రైమాసికం రూ.10,92,60,000మూడో త్రైమాసికం రూ.10,92,60,000 నాలుగో త్రైమాసికం రూ.13,65,75,000 పవన్, లోకేశ్ ప్రత్యేక విమానాల ఖర్చు ఎంతో?ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లనే వినియోగిస్తున్నారు. వీరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల పర్యటనలకు, తరచూ హైదరాబాద్కు ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు.అయినా పవన్కళ్యాణ్, లోకేశ్ తిరుగుతున్న ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెల వ్యయం గురించి ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. వీరిద్దరి ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాల అద్దెలకు ఎంత ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. -
‘ల్యాండ్ టైట్లింగ్’ ఆదర్శం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన భూ సంస్కరణలకు దావోస్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సమావేశంలోనే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. తద్వారా ఎన్నికలకు ముందు ఎల్లో మీడియా చేసిందంతా దుష్ప్రచారమేనని తేటతెల్లమైంది. జగన్పై కక్షతో చంద్రబాబు విపరీతంగా దుష్ప్రచారం చేసి, అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయడం తెలిసిందే. అయితే ల్యాండ్ టైట్లింగ్ అన్నది ఆదర్శనీయమని..దీనిపై అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాలని ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) ఎండీ గీతా గోపీనాథ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇటీవల జరిగిన దావోస్ సదస్సులో భారత ఆర్థిక వ్యవస్థపై ఆమె కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రముఖులతో కలిసి ఒక చర్చాగోష్టిలో మాట్లాడారు. ‘భారతదేశంలో చాలా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఉన్న ఆర్థిక స్థిరత్వం చాలా ముఖ్యమైంది. కేవలం వృద్ధి రేటు మాత్రమే కాకుండా, ద్రవ్యోల్బణం కూడా తక్కువగా సింగిల్ డిజిట్లోనే ఉండటం భారత్కు కలిసి వచ్చే అంశం’ అని గీతా గోపీనాథ్ అన్నారు. అయితే భూసేకరణ, డీ రెగ్యులేషన్ వెనక్కు నెడుతున్నాయని ఆమె గతంలో చెప్పిన విషయాలను వ్యాఖ్యాత ఉటంకించగా, ఆమె స్పందిస్తూ ‘భూసేకరణ, సమస్యలు గందరగోళంగా ఉన్నాయనడం కంటే అది చాలా పెద్ద సమస్య అనడం కరెక్ట్. ఇది వృద్ధికి, తయారీ రంగానికి ఒక పెద్ద సవాలు. అయితే భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు కొత్త పద్ధతులతో ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూ వినియోగం, భూ సంబంధిత విషయాల్లో సృజనాత్మకమైన పద్ధతులను అనుసరిస్తూ మంచి పనితీరు కనబరుస్తోందని నేను భావిస్తున్నాను. ల్యాండ్ టైట్లింగ్ అంశంపై గట్టిగా ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం’ అని స్పష్టం చేశారు. విస్తృత అధ్యయనం తర్వాతే అమలు యత్నం గీతా గోపీనాథ్ చెప్పిన అంశాలు జగన్ హయాంలో జరిగినవే. ఆమె ఉదహరించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం వస్తే భూముల వ్యవస్థ సమూలంగా మారిపోతుందని ప్రపంచం మొత్తం నమ్ముతోంది. అందుకే దానిపై విస్తృతమైన అధ్యయనం చేశాక దేశంలోనే తొలిసారిగా వైఎస్ జగన్ దాన్ని ఏపీలో అమలు చేసేందుకు చట్టాన్ని చేశారు. కేంద్రం ఆమోదం కూడా తీసుకున్నాక అమలు చేసేందుకు ప్రయత్నించారు. కానీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చట్టం వస్తే మీ భూములు పోతాయని, జగన్ ప్రజల భూములన్నీ లాగేసుకుంటాడని ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారు. దానిపై దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా.. ఎల్లో మీడియా పత్రికలో ఒక ఫుల్ పేజీ వ్యతిరేక ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వడాన్ని బట్టి ఏ స్థాయిలో తప్పుడు ప్రచారం చేశారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర గతిని మార్చే చట్టాన్ని ఎన్నికల్లో వివాదాస్పదంగా మార్చిన చంద్రబాబు.. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు రేకెత్తించారు. అప్పటికి ఆ చట్టం ఇంకా అమల్లోకి రాకపోయినా అది అమలై పోతున్నట్లు, భూములు పోయినట్లు ప్రచారం చేసి తాను అధికారంలోకి వస్తే ఆ చట్టాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రయోజనాల కంటే తన సొంత ప్రయోజనాలే ప్రధానమని దేశానికే రోల్ మోడల్గా మారిన చట్టాన్ని రద్దు చేశారు. అయితే దాంతో ముడిపడి ఉన్న భూముల రీ సర్వేను మాత్రం కొనసాగిస్తూ యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు అదే రీ సర్వే క్రెడిట్ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దావోస్లో గీతా గోపీనాథ్ చేసిన వ్యాఖ్యలు జగన్ అమలు చేసిన విప్లవాత్మకమైన భూ సంస్కరణలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. చంద్రబాబు అదే దావోస్కు వెళ్లి తన పాలన గొప్పగా జరుగుతున్నట్లు ఎన్ని మైకుల్లో ఉదరగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ జగన్ ఎప్పుడూ దావోస్కు వెళ్లకపోయినా, ఆయన చేసిన మంచి పనులు, భూ సంస్కరణలు అక్కడ చర్చకు వచ్చాయి. దీన్నిబట్టి ఎవరి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ స్వార్థం కోసం మంచి చట్టాలు, మంచి పనుల్ని చంద్రబాబు రద్దు చేసినా.. వాటి ఫలితం, ప్రభావం ఎలా ఉంటుందో దావోస్ వేదికగా బయట పడింది. చంద్రబాబు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పొందుదామనుకున్న క్రెడిట్ను జగన్.. తన హయాంలో చేసిన మంచి పనుల ద్వారా సాధించడం గమనార్హం. -
సైనా నెహ్వాల్ను అభినందించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు.. సైనా నెహ్వాల్ రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా బాడ్మింటన్ క్రీడకు ఆమె చేసిన సేవలను కొనియాడారు. బ్యాడ్మింటన్ క్రీడతో దేశానికి మంచి కీర్తిప్రతిష్టలు తెచ్చారు. లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartiest congratulations @NSaina on a truly stellar career. Your decision to retire from competitive badminton marks the close of an era defined by grit, discipline and excellence. You brought immense pride to the nation and inspired millions of young people. Wishing you success… pic.twitter.com/qFDznAgzrq— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2026 -
ఏపీ పోలీసులకు సైబర్ నేరగాళ్ల సవాల్
సాక్షి, విజయవాడ: ఏపీ పోలీసులకు సైబర్ నేరగాళ్ల సవాల్ విసిరారు. సుమారు 80 మంది పోలీసు అధికారులు నుంచి డబ్బులు వసూళ్లు చేశారు. లిక్కర్ కేసు సిట్లో ఉన్న కీలక అధికారి పేరుతో వసూళ్లు చేసినట్లు సమాచారం.లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న ఏఎస్పీ.. సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. డీజీ స్థాయి అధికారి, డీఐజీ స్థాయి అధికారులు నుండి డబ్బులు వసూళ్లు చేశారు. ఒకేసారి పెద్ద మొత్తంలో పోలీసులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. సైబర్ దాడితో ఏపీ పోలీసుల్లో కలకలం రేగుతోంది. -
వైఎస్ జగన్ హయాంలో భూ సంస్కరణలకు ప్రశంసలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ హయాంలో భూ సంస్కరణలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ప్రశంసల జల్లు కురిసింది. క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం వైఎస్ జగన్ కృషి చేశారని డిబేట్లో ఇండియన్ అమెరికన్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ అభినందించారు. ఏపీ క్లీన్ ల్యాండ్ టైటలింగ్ కోసం కృషి చేసిందని గీతా కితాబునిచ్చారు.చాలా మంచి భూ సంస్కరణలు తీసుకొచ్చారని.. ఆంధ్రప్రదేశ్ చాలా బాగా చేసింది.. చాలా క్రియేటివ్ గా చేసిందన్న గీతా గోపినాథ్.. ల్యాండ్ కన్వర్షన్ కోసం మంచి విధానాలు అవలంభించారని పేర్కొన్నారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం చర్చా గోష్టిలో కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ సమక్షంలోనే గీతా గోపినాథ వెల్లడించారు. కాగా, వైఎస్ జగన్ ల్యాండ్ టైటిల్ సంస్కరణలపై చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేయగా.. వైఎస్ జగన్ పారదర్శక విధానానికి ప్రశంసలు రావడంతో చంద్రబాబు అండ్ కో అభాసుపాలైంది. -
రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం
సాక్షి, గుంటూరు: రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. గతంలో సీఆర్డీఏ కేటాయించిన అభ్యంతరకరమైన ప్లాట్లపై అధికారులు మళ్లీ లాటరీ నిర్వహించారు. ఈ లాటరీలో ఈసారి కూడా తమకు వీధి శూల ప్లాట్లు వచ్చాయంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధానికి భూములు ఇచ్చి ప్లాట్ కోసం మీ చుట్టూ 11 ఏళ్ల నుంచి తిరుగుతున్నామని రైతులు మండిపడుతున్నారు. తాము కేటాయించిన ప్లాట్లే తీసుకోవాలని.. ఇష్టం ఉంటే తీసుకోండి.. లేకపోతే లేదని చెబుతున్నారంటూ సీఆర్డీఏ అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహంతో ప్లాట్ల లాటరీ నిలిచిపోయింది. -
తాడిపత్రిలో హైటెన్షన్..మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసులు
సాక్షి,అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తన ఇంటి వద్దకు తరలిరావాలని టీడీపీ శ్రేణులకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న (గురువారం) రాత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న జేసీ వర్గీయులు కుప్పలుగా రాళ్లు వేసి ఉద్రిక్తత సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని రాళ్లను తొలగించారు. పరిస్థితి అదుపులో ఉంచేందుకు తాడిపత్రి పట్టణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద, జేసీ వర్గీయుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు మొహరించారు. ఈ క్రమంలో తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం. -
తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుంది
సాక్షి, అమరావతి: ఒక వ్యక్తి కులంతో అధికారులు విభేదిస్తున్నప్పుడు, అతడు ఫలానా కులానికి చెందిన వ్యక్తి కాదని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఆ అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యక్తి తన కులాన్ని రుజువు చేసే డాక్యుమెంట్లు సమర్పించలేదన్న కారణంతో అతడు ఫలానా కులానికి చెందినవాడుకాదని చెప్పలేరని పేర్కొంది. తండ్రిది ఏ కులమైతే పిల్లలకు అదే కులం వర్తిస్తుందని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు గతంలోనే స్పష్టంగా చెప్పాయని గుర్తుచేసింది. పిటిషనర్ అట్లపాకాల రామకృష్ణ తండ్రి, నాయనమ్మ కొండకాపు కులానికి చెందిన వారనేందుకు ఆధారాలున్నా.. భూ రికార్డులను మాత్రమే ఆధారంగా చేసుకుంటూ రామకృష్ణ కొండకాపు కులానికి చెందినవ్యక్తి కాదంటూ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. రామకృష్ణ కొండకాపు (ఎస్టీ) కులస్తుడు కాదు, కాపు అంటూ సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లాస్థాయి పరిశీలన అధికారి హోదాలో తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పు చెప్పారు. ఏకపక్షంగా కులధ్రువీకరణ రద్దుపై పిటిషన్ కొండకాపు (ఎస్టీ) కులానికి చెందిన అట్లపాకాల రామకృష్ణ పూర్వీకులు తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో నివశించారు. వారు ఎస్టీగానే చెలామణి అయ్యారు. రామకృష్ణ విద్యాభ్యాసం మొత్తం ఎస్టీగానే సాగింది. రామకృష్ణ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చదువుతున్న సమయంలో అధికారులు అతడి కులధ్రువీకరణపై విచారణ జరిపారు. అతడు ఇచి్చన డాక్యుమెంట్లను కాకుండా 1938 సంవత్సరానికి చెందిన భూ రికార్డులను ఆధారంగా చేసుకుని రామకృష్ణ కొండకాపు కులస్తుడు కాదంటూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి తెలిపారు.తరువాత రామకృష్ణకు నోటీసు కూడా ఇవ్వకుండానే అతడి ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని 2005లో కలెక్టర్ రద్దుచేశారు. దీనిపై రామకృష్ణ అప్పీలు చేయగా.. కలెక్టర్ ఉత్తర్వులను సమర్థిస్తూ సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి 2009లో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తుది విచారణ జరిపారు.ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ తండ్రి, నాయనమ్మ కొండకాపులంటూ 1966లోనే అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పొందుపరిచారని తెలిపారు. గిరిజన సంక్షేమ డిప్యూటీ కలెక్టర్ 2004లో జారీచేసిన ఉత్తర్వుల్లో కూడా రామకృష్ణ తండ్రి, నాయనమ్మలను గిరిజనులుగా పేర్కొన్నారని చెప్పారు. ఈ ఆధారాలన్నీ చూపినా అధికారులు పట్టించుకోకుండా, కేవలం 1938 నాటి రెవెన్యూ రికార్డును ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుబట్టారు. రామకృష్ణ కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ జాయింట్ కలెక్టర్, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వులను రద్దుచేశారు. -
చంద్రబాబు కబంధ హస్తాల్లో ఏపీఈఆర్సీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ముఖ్యమంత్రి చంద్రబాబు కబంధహస్తాల్లో బందీ అయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖలో దోపిడీకి తెరలేపిన పాలకులు తమకు అనుకూలంగా ఆదేశాలు వెలువరించేందుకు వీలుగా ఏపీఈఆర్సీని భ్రషు్టపట్టిస్తున్నారు. రూ.వేలకోట్ల విద్యుత్సంస్థల లావాదేవీలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వంటి ఆరి్థక విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తీర్పులు ఇవ్వడం ఈ కమిషన్పై ఉన్న అతిపెద్ద బాధ్యత. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఏపీఈఆర్సీకి ఇప్పుడు పెద్దదిక్కు లేకుండా పోయింది. ఏడాదికిపైగా చైర్మన్ లేరు. 11 నెలలుగా ఒకే ఒక్క సభ్యుడితో నెట్టుకొస్తోంది. చైర్మన్ వస్తే కష్టమని.. చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండే ఏపీఈఆర్సీకి 2024 అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి చైర్మన్ లేరు. గతేడాది ఫిబ్రవరిలో మరో సభ్యుడు కూడా పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి ఒకే ఒక్కరు ఇన్చార్జ్ చైర్మన్గా, సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది జూలైలో ఒక సభ్యుడి నియామక ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం దాన్ని కూడా సాగదీస్తోంది. చట్టబద్ధమైన సంస్థకు చైర్మన్ను నియమించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తిని ఏపీఈఆర్సీకి చైర్మన్గా నియమించాల్సి ఉంది. అయితే ఆ స్థాయివారు చైర్మన్గా ఉంటే తామనుకున్న పనులు జరగవని కూటమి నేతలు భావిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతకాలం కిందట ఈ విషయంపై సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కలుగజేసుకుంది. ఏపీఈఆర్సీ చైర్మన్ను ఎప్పటిలోగా నియమిస్తారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయినా చంద్రబాబు సర్కారులో చలనం లేదు. గత ప్రభుత్వంలో ఏపీఈఆర్సీకి వెలుగు 1999 మార్చిలో హైదరాబాద్ కేంద్రంగా ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబే. కానీ మండలి హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తూ వచ్చింది. అప్పుడు ఏపీకి తీసుకురాలేకపోయారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని 2023 ఆగస్టు 25న నోటిఫికేషన్ను విడుదల చేశారు. కమిషన్కు రెండెకరాల స్థలంలో రూ.25 కోట్లకుపైగా నిధులు వెచి్చంచి 15 వేల చదరపు అడుగుల కార్యాలయ భవనం, 5వేల చదరపు అడుగుల అతిథిగృహం నిరి్మంచింది. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయాన్ని గత ప్రభుత్వ హయాంలోనే 2023 ఆగష్టు 18న ప్రారంభించారు. అన్నిటికీ ఒక్కరే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమర్పించిన ఆదాయ, అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లపై ఈ నెల 20 నుంచి ఏపీఈఆర్సీ విజయవాడ, కర్నూలు, తిరుపతిల్లో బహిరంగ విచారణ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని సైతం ఇన్చార్జి చైర్మన్గా ఉన్న సభ్యుడితోనే పూర్తి చేయిస్తోంది. ఆ క్రమంలోనే అనతి కాలంలోనే పలు ప్రైవేటు సంస్థలతో అత్యధిక ధరలకు కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు మండలి నుంచి ఆమోదం తెచ్చుకుంది. సాంకేతిక పరిశీలన వంటివి లేకుండానే విద్యుత్ సంస్థల పిటిషన్లను యథాతథంగా అంగీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చే పరిస్థితి తెచి్చంది. బహిరంగ విచారణలు సైతం మొక్కుబడిగానే అరకొరగా జరుగుతున్నాయి. అదికూడా ఆన్లైన్ విధానంలోనే. విచారణకు వస్తున్నవారు కూడా పదిమందికి మించి ఉండటం లేదు. తమకు మేలు చేయాల్సిన ఏపీఈఆర్సీని చంద్రబాబు ఇష్టానుసారం నడిపిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. -
దళితులను కొట్టి.. ధనికులకు పెట్టి..
సాక్షి, అమరావతి: మంత్రిగారి కంపెనీకి సబ్సిడీ ఇవ్వడానికి రూ.కోట్లుంటాయి. కానీ, ప్రభుత్వం సాయం చేస్తుందని నమ్మి చిన్నాచితకా వ్యాపారాలు చేసుకునే దళితులకు ఇవ్వడానికి పైసా ఉండదు. పేదలకు అందులోనూ ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను కూడా పదవిని, పార్టీని చూసి పంచేసే దుర్మార్గం చరిత్రలో ఇదే మొదటిసారి. ‘మా రాయితీలు మాకు ఇప్పించండి మహాప్రభో’ అంటూ వారంరోజులుగా గజగజ వణికిస్తున్న చలిని సైతం లెక్కచేయకుండా గత నవంబరులో ఏపీఐఐసీ కార్యాలయం ముందు దళిత కుటుంబాలు ధర్నా చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. పైగా.. ‘ఖజానాలో డబ్బుల్లేవు, ఇక్కడి నుంచి వెళ్లకపోతే ఈ టెంట్ కూడా పీకించేస్తా’మంటూ మంత్రిగారి బెదిరింపులు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? ఇదేనా ఈ ప్రభుత్వానికి దళితుల మీద ఉన్న ప్రేమ? కాళ్లరిగేలా తిరుగుతున్న దళిత పారిశ్రామికవేత్తలకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వకుండా డబ్బులొచ్చినప్పుడు ఇస్తామంటూ ఒకపక్క పరిశ్రమల మంత్రి టీజీ భరత్ చెబుతూనే తన కుటుంబానికి చెందిన కంపెనీలకు ఏకంగా రూ.36.68 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు విడుదల చేసుకోవడంపై దళిత పారిశ్రామికవేత్తలు రగిలిపోతున్నారు. అధికారంలోకి రాగానే పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించడంతోపాటు, సకాలంలో ఎప్పటికప్పుడు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చిన బాబు సర్కారు.. అధికారం చేపట్టిన తర్వాత బడుగులను నిండా ముంచేసింది. 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలను ఉల్లంఘించి పారిశ్రామికవేత్తలపై రాజకీయముద్ర వేస్తూ ప్రోత్సాహకాలు విడుదల చేయడంపై వీరు మండిపడుతున్నారు.నిధులన్నీ వాళ్ల వాళ్లకే..పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద సుమారు రూ.12,000 కోట్లు చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నవంబరులో సీఐఐ పెట్టుబడుల సదస్సు ముందు మొక్కుబడిగా రూ.1,174.76 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకుంది. వాస్తవంగా 17,116 క్లెయింలకు సంబంధించి రూ.2,194.30 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేయడానికి పరిపాలన అనుమతి తీసుకున్నా కేవలం రూ.1,174.76 కోట్లతోనే సరిపెట్టేశారు. ఇందులో కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (ఫిఫో) విధానంలో ఇన్నాళ్లు ప్రోత్సాహకాలు విడుదల చేస్తున్న పరిశ్రమల శాఖ.. తొలిసారిగా ఆ నిబంధనలను ఉల్లంఘించింది. చంద్రబాబు సర్కారు విడుదల చేసిన ప్రోత్సాహకాల జాబితా పరిశీలిస్తే ఎన్ని అవకతవకలు జరిగాయో తెలుస్తుంది. అప్పుల్లో కూరుకుపోయిన దళిత పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన చిన్న మొత్తాలను చెల్లించకుండా భారీ లాభాలు ఆర్జించే కంపెనీల నుంచి లంచాలు తీసుకుని వారికి చెల్లించారని బాధిత పారిశ్రామికవేత్తలు ఆరోపిస్తున్నారు. ఉదా.. » మంత్రి టీజీ భరత్ కంపెనీకి రూ.36.68 కోట్లు.. » టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజా గ్రూపులకు రూ.15.60 కోట్లు.. » అదే పార్టీకి చెందిన మరో ఎంపీ బీద మస్తాన్రావుకు చెందిన బీఎంఆర్కు రూ.3.47 కోట్లు.. » అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అవంతీ ఫీడ్స్కు రూ.2.53 కోట్లు.. » వల్లభనేని సుధాకర్ చౌదరికి చెందిన మోహన్ స్పిన్టెక్స్కు రూ.60.50 కోట్లు చెల్లించేశారు. » ఇక కొరియాకు చెందిన కియా మోటార్స్కు అయితే ఏకంగా రూ.175 కోట్లు చెల్లించారు.. ఈ విధంగా మొత్తం జాబితా పరిశీలిస్తే తనకు కావాల్సిన వారికి బాబు సర్కారు ఏ విధంగా నిధులు అడ్డుగోలుగా చెల్లించిందో అర్ధంచేసుకోవచ్చు.8,000 మంది దళిత పారిశ్రామికవేత్తలు బజారుపాలు..పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఆశతో కారు, జేసీబీ, బస్సులు కొనుగోలు చేసి వ్యాపారం చేసుకుంటున్న దళితుల వెన్నును చంద్రబాబు సర్కారు విరిచేసింది. సుమారు 8,000 మంది దళిత పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన రూ.600 కోట్ల బకాయిలను చెల్లించకుండా వారిని బజారుకు లాగేసింది. ఇందులో కనీసం రెండువేల మందికి ఇంతవరకు ఒక్కపైసా కూడా చెల్లించలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు చెందిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు ముందుగా చెల్లించాల్సి ఉంది. కానీ, వీరికి కాకుండా అస్మదీయులకు ప్రస్తుత ఏడాది ప్రోత్సాహకాలను సైతం విడుదల చేశారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్ధంచేసుకోవచ్చు. ఉదా.. శ్రీ పాలెతమ్మె తల్లి ట్రాన్స్పోర్టుకు 2025–26కు సంబంధించి రూ.1,44,000 చెల్లించారు. జ్యోతీ ఇండస్ట్రీస్కు రూ.36,566, ఆరాధ్య ఇండస్ట్రీస్కు రూ.17,71,137 చెల్లించడానికి డబ్బులు వస్తే అంతకుముందు సంవత్సరాలకు సంబంధించిన తారేకేశ్వర స్పిన్నింగ్, సినర్జీ రెమిడీస్, ఎన్జీ ఫెర్టిలైజర్స్, అమృతవర్షిణి గ్రానైట్, సునీతా పాలిమర్స్ వంటి కంపెనీలకు డబ్బులు లేవంటూ ఆపేశారు. నిర్దాక్షిణ్యంగా జైలుకు..పిల్లలకు తిండి కూడా పెట్టలేకపోతున్నాం.. అప్పులు పుట్టడంలేదు, ఈఎంఐలు కట్టలేకపోతున్నామంటూ దళిత పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ ఎదుటే ధర్నా చేస్తుంటే బాబు సర్కారు కనికరం చూపించకపోగా నిర్దాక్షిణ్యంగా వీరిని జెలుకు పంపుతోంది. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడం అటుంచితే.. బాబు సర్కారు ఇంటికో భిక్షగాడిని తయారుచేస్తోందంటూ వీరు ఆరోపిస్తున్నారు. దళితులకు ఇవ్వడానికి డబ్బులుండవుగానీ, ఎన్నారై పారిశ్రామికవేత్తలకు రూ.50 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుచేస్తున్నానంటూ చంద్రబాబు దావోస్లో చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. -
ప్రస్తుత నీటి వాడకానికి రక్షణ కల్పించాలి
సాక్షి, అమరావతి: కృష్ణాబేసిన్ లోపల, వెలుపలి ప్రాంతాల్లోని ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం తాము చేస్తున్న నీటివినియోగానికి రక్షణ కల్పించాలని బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ట్రిబ్యునళ్ల సాధారణ నిబంధనలు, హెల్సింకీ నియమాలు, బెర్లిన్ నియమాలు, జాతీయ జలవిధానం, అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టం, ఏపీ పునర్విభజన చట్టం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ట్రిబ్యునల్ ఎదుట ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్గుప్తా, న్యాయవాది ఉమాపతి వాదనలు వినిపించారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలో ఎస్.తాళపత్ర, జస్టిస్ రామ్మోహన్రెడ్డి సభ్యులుగా ఏర్పాటైన ట్రిబ్యునల్ ఎదుట ఏపీ తరఫున తుది వాదనల్ని వీరు రెండోరోజు గురువారం కొనసాగించారు. బేసిన్ వెలుపల, బయట అనే తేడా లేకుండా ప్రస్తుత వినియోగానికి రక్షణ కల్పించాల్సిందేనని ట్రిబ్యునల్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. కావేరి ట్రిబ్యునల్లో చర్చ తర్వాత ప్రస్తుత వినియోగానికి రక్షణ కల్పిస్తూ తీర్పువచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యామ్నాయ జలవనరులున్నా కృష్ణా జలాలను వాడుకుంటున్న ఏపీలోని బేసిన్ వెలుపలి ప్రాంతాలతో పోలిస్తే.. అత్యంత నీటి ఆవశ్యకత ఉన్న తెలంగాణలోని బేసిన్ లోపలి ప్రాంతాలే నీటికేటాయింపులకు అర్హత కలిగి ఉంటాయని తెలంగాణ చేస్తున్న వాదనను ట్రిబ్యునల్ గుర్తుచేయగా.. బేసిన్ వెలుపలి ప్రాంతాలకు ప్రత్యామ్నాయ జలవనరులు ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవమని జైదీప్గుప్తా స్పష్టం చేశారు. రాయలసీమలో సరిపడ నీటిలభ్యత ఉందని పేర్కొంటూ ఆ ప్రాంతానికి కేటాయించిన జలాలను తెలంగాణకు పునఃకేటాయించాలని ఆ రాష్ట్రం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చాలని కోరారు. కృష్ణాజలాలను ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు పంపిణీ చేస్తూ కృష్ణా ట్రిబ్యునల్–2 గతంలో ఇచ్చిన తుది నివేదికకు తెలంగాణ సైతం కట్టుబడి ఉండాల్సిందేనని.. లేకుంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీకి తిరిగి కేటాయింపులు చేయాల్సి ఉంటుందని వాదించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించాలని కోరారు. తుది వాదనలను శుక్రవారం కూడా జైదీప్గుప్తా, ఉమాపతి కొనసాగించనున్నారు. -
ప్రజల గొంతుక వినిపించండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమస్యను పార్లమెంట్ వేదికగా ఉభయ సభలలో సమర్థవంతంగా.. ధైర్యంగా లేవనెత్తాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు, సమస్యలు, ఆకాంక్షలను జాతీయ స్థాయిలో వినిపించే బాధ్యత వైఎస్సార్సీపీ ఎంపీలదేనని గుర్తుచేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్లమెంటు ఉభయసభలలో వ్యవహరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతులు, యువత, మహిళలు, కార్మీకులు, పేదలు, బడుగు–బలహీన వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, ఆయా వర్గాలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలు, అన్యాయం, నిర్లక్ష్యాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ టీడీపీ కూటమి సర్కారు నిర్విర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.దీంతోపాటు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, అప్పులు చేయడంలో యథేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీంతో ఏపీ భయంకరమైన రుణభారంలో కూరుకుపోతుండటాన్ని ప్రస్తావించాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. టీడీపీ అమలు చేస్తున్న రెడ్బుక్ పాలన కారణంగా రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు పెరిగిపోయాయని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయన్నారు.ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులను టీడీపీ కూటమి నాయకులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సాల్మన్పై జరిగిన దాడి, హత్య ఘటనను ప్రస్తావించిన వైఎస్ జగన్.. రాష్ట్రంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ఈ ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయం జరిగే వరకు పోరాటమే.. ఏపీలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ను కలసి సమగ్ర నివేదికతో వినతిపత్రం అందజేయాలని పార్టీ ఎంపీలను వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపులపై రాజ్యాంగబద్ధ సంస్థలు తక్షణమే స్పందించి జోక్యం చేసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపవద్దని ఎంపీలకు స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ను ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగించుకోవాలని, కేంద్రంపై నిరంతర ఒత్తిడి తెచ్చే విధంగా పని చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని.. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం అంకితభావంతో పని చేస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
నాడు దుష్ప్రచారం.. నేడు క్రెడిట్ చోరీ
సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన మా నాన్నకు సమకాలికుడు. ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీ పడలేకపోతున్నారు. నేను చేసిన దానిపై క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు. ప్రజలను నమ్మించేందుకు ఒక అబద్ధాన్ని ఈ స్థాయిలో గోబెల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాటమాడటం న్యాయమేనా? చంద్రబాబు ఒకసారి తన గుండెలపై చేయి వేసుకొని ఆలోచించాలని కోరుతున్నా. రీ సర్వే ప్రక్రియ చేపట్టడానికి అత్యున్నత కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియాతో 2020 డిసెంబర్ 9న ఒప్పందం చేసుకున్నాం. యూరప్, అమెరికాలో వాడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం రీ సర్వేలో వినియోగించాం. రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా సీవోఆర్ఎస్లు (కంటిన్యూయస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్) పెట్టాం. లక్ష్యాన్ని చేరుకోవడానికి 3,640 గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ రిసీవర్స్ అందుబాటులోకి తెచ్చాం. కచ్చితత్వం కోసం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను వాడిన ప్రభుత్వం మాది.సమగ్ర రీ సర్వే కోసం రెండు విమానాలు, నాలుగు హెలికాప్టర్లు, 200కు పైగా హైఎండ్ డ్రోన్స్ను తొలిసారిగా వినియోగించాం. దీని మీద అవగాహన కోసం సచివాలయాల్లోని 40 వేల మంది సిబ్బందికి 70 సార్లు శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించాం. ఇదెప్పుడూ గతంలో జరగలేదు. ఇంత గొప్ప యజ్ఞం చేశాము కాబట్టే 5 సెంటీమీటర్లు కూడా తేడా లేకుండా కొలతలు వేశాం. అందుకే దీన్ని మహా యజ్ఞం అంటున్నాం.చంద్రబాబు అనే వ్యక్తికి చిత్తశుద్ధి, బాధ్యత ఉండదు. ఎవరైనా చేస్తే ఆ క్రెడిట్ కొట్టేయడానికి మాత్రం ప్రయత్నిస్తాడు. సాధారణంగా ఆయనకు అవగాహన తక్కువ. సర్వే మీద కూడా అవగాహన తక్కువే. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఇలాంటి సర్వే చేయాలని తపన, తాపత్రయ పడలేదు. సర్వే రాళ్లు లేకుండా సర్వే ఎలా పూర్తవుతుంది? కొన్ని కోట్ల సర్వే రాళ్లను గ్రామాలకు తరలించారని బుద్ధి, అవగాహన, జ్ఞానం లేకుండా మాట్లాడారు. రైతు, భూ యజమానికి సరిహద్దులు తెలిసేలా రాళ్లను పాతితేనే సర్వే పూర్తయినట్లు. ఆ భూమిలో సర్వే అయినట్టు ప్రత్యేక (డిస్టింక్ట్) రాయి ఉండాలి. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి.. ఇదే సర్వే రాయి అంటే సరిహద్దులు ఎలా ఉంటాయి? అలా చేస్తే కథ మళ్లీ మొదటికి రాదా? అందుకే ప్రత్యేక (డిస్టింక్ట్) తరహాలో సర్వే రాళ్లను ఉచితంగా ప్రభుత్వం రైతులకు సరఫరా చేసింది. ఆ రాళ్ల మీద శాశ్వత భూ హక్కు ృ భూ రక్ష పేరు పెట్టాం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో 1923లో బ్రిటీష్ వాళ్లు పెట్టిన రాళ్లు కనిపిస్తాయి. (బ్రిటీష్ హయాంలో పెట్టిన సర్వే రాళ్లు చూపించారు) చంద్రబాబు ఏమో రాళ్లెందుకు అంటాడు. మేం సంకల్పంతో పని చేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలు రైతులు, భూ యజమానులకు అందకూడదని, జగన్కు మంచి పేరు వస్తుందని రాక్షసులకన్నా దారుణంగా చంద్రబాబు, ఆయన ఎల్లో గ్యాంగ్ వ్యవహరించారు. యజ్ఞం భగ్నం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రధాన రాక్షసుడు.. ఆయన లెఫ్ట్, రైట్లో ఉండే ఈనాడు, ఆంధ్రజ్యోతి పిల్ల రాక్షసుల పాత్ర పోషించారు. మీ భూమి మీది కాదు.. కాళ్ల కింది నేల కదిలిపోతోంది! అంటూ అబద్ధాలు, వక్రీకరణలు చేశారు. 2024 మే 13న పోలింగ్ అయితే మే 10వ తేదీన ఈనాడులో ‘మీ భూమి మీకు కాకుండా పోతుంది’ అంటూ ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఢిల్లీలోని గుర్గావ్ నుంచి లక్షలాదిగా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించారు. వైఎస్సార్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుందని విషపూరిత, తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ చర్యలతో చంద్రబాబు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొంది ఉండొచ్చు. కానీ, అబద్ధాలు ఎంతో కాలం దాగవు. నిజాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. భూముల సర్వే విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా భూ యజమానులు, రైతులకు జరిగే మేలు భూములు ఉన్నంత వరకూ నిలిచిపోతాయి. రీ సర్వేలో ఏపీ ప్లాటినమ్ గ్రేడింగ్ సాధించిందని డిసెంబర్ 2023లో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. రూ.400 కోట్లు ఎప్పుడు వచ్చాయో తెలుసా? 2025 ఫిబ్రవరి 19న వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం చేసిన పనికి కేంద్రం ఈ డబ్బులు ఇచ్చిందని క్రెడిట్ చోరీకి పాట్లు పడుతున్నారు. మాకు నాలుగేళ్లు సమయం పడితే.. చంద్రబాబు ఆరు నెలల్లో చేసిన పనికి ప్లాటినమ్ గ్రేడింగ్ ఇచ్చారట! మరి ఎన్నికల ముందు వరకు ఆయన చేసిన ఆరోపణలు ఏమైపోవాలి? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మహోన్నత సంకల్పంతో మేం సమగ్ర భూ రీసర్వే మహా యజ్ఞాన్ని చేపడితే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాక్షసుడిలా విషం చిమ్మి.. ఇప్పుడు ఆ రీసర్వే నీ ఘనతే అంటూ క్రెడిట్ చోరీకి పాల్పడతావా? అంటూ సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. భూ మండలంలో అత్యంత దారుణంగా క్రెడిట్ చోరీకి పాల్పడే వారు నిన్ను మించి ఎవరైనా ఉంటారా.. నిన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర భూ రీ సర్వేపై చంద్రబాబు చెబుతున్న అబద్ధాల వెనుక దాగిన నిజాలను సాక్ష్యాధారాలతో వివరించారు. ‘‘జగనన్న భూ హక్కు – భూరక్ష’’ పథకం అమలు తీరును ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్లాటినమ్ గ్రేడింగ్ ఇవ్వడాన్ని.. ఈ సర్వే దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందంటూ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ స్పష్టం చేయడాన్ని, వివిధ రాష్ట్రాలు భూ సర్వేను ప్రశంసిస్తూ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని ఉద్ఘాటించడాన్ని, నీతి ఆయోగ్ అత్యంత పారదర్శకంగా కచ్చితత్వంతో భూ రీ సర్వే చేశారంటూ కితాబు ఇచ్చిన అంశాలను సాక్ష్యాధారాలతో గుర్తు చేశారు. అప్పట్లో ఈ మహాయజ్ఞంపై ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు చిమ్మిన విషాన్ని.. నాడు చేసిన భూసర్వేను ప్రశంసిస్తూ కేంద్రం రూ.400 కోట్లు రాయితీ ఇస్తే అది తన ఘనతేనని చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఏనాడైనా రీసర్వే ఆలోచనైనా చేశావా? ఈ మధ్య కాలంలో భూముల రీ సర్వేపై చంద్రబాబు మాటలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రీ సర్వే క్రెడిట్ అంతా తనదేనంటూ చెబుతున్న మాటలు వింటుంటే.. ఈ భూ మండలం మీద ఇంత దారుణంగా క్రెడిట్ చోరీ చేసే వ్యక్తి ఇంకొకరు ఎవరైనా ఉంటారా.. అనిపిస్తోంది. చివరకు ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి బహుశా సిగ్గు పడుతుందేమో! అంతటి దారుణమైన మోసాలు.. అబద్ధాలు. నాలుగుసార్లు సీఎం అని చెప్పే చంద్రబాబుకు భూములు రీ సర్వే చేయాలనే కనీస ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించాలని ఏనాడైనా తపన పడ్డావా? ఈ రోజు క్రెడిట్ చోరీ చేస్తూ మాట్లాడుతున్న మాటలకు నిజంగా ఈ పెద్దమనిషి సిగ్గుపడాలి. 6,800 గ్రామాల్లో అన్ని రకాల సర్వే పూర్తి మా ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద వ్యవస్థను సృష్టించి, డ్రోన్ సర్వే కూడా పూర్తి చేశాం. ఆర్థోరెక్టిఫైడ్ రాడార్ ఇమేజెస్ (ఓఆర్ఐ) అన్ని జిల్లాలకు పంపేశాం. ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో అన్ని రకాల సర్వే పూర్తి చేసేశాం. రైతుల భూ సరిహద్దులను ఖరారు చేశాం. సర్వే రాళ్లను పాతడం పూర్తయింది. ఈ గ్రామాల్లో రికార్డులన్నింటినీ అప్డేట్ చేసి, సబ్ డివిజన్స్, మ్యుటేషన్లు పూర్తి చేసి, ప్రతి భూ కమతాకు విశిష్ట నంబర్ (యూనిక్ నంబర్) ఇచ్చాం. భూ కమతా మ్యాప్ను కూడా జియో ట్యాగింగ్ చేసి, పాస్బుక్లో పొందుపరిచి, 30 లక్షల మంది రైతుల సమస్యలు మొబైల్ మెజిస్ట్రేట్లతో పరిష్కరించాం. వివాదాలు లేని విధంగా క్యూ ఆర్ కోడ్తో, అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. ఈ క్యూ ఆర్ కోడ్ ప్రజలు స్కాన్ చేస్తే మొత్తం భూమి, యజమాని వివరాలు కనిపిస్తాయి. మీ భూమి పోర్టల్ అప్గ్రెడేషన్ పూర్తి చేశాం. జియో ట్యాగింగ్ చేసిన క్రమంలో అక్షాంశాలు, రేఖాంశాలతో సహా మొత్తం భూమి వివరాలు వచ్చేస్తాయి. రియల్ టైమ్ అలర్ట్లతో.. మీ భూమి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి, భూ రికార్డులపై ఆటోమేటిక్గా మీకు అలర్ట్లు వచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చాం. దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న పథకం ఇది. ఇందులో 40 వేల మంది ఉద్యోగుల నాలుగేళ్ల శ్రమ, కష్టం ఉంది. అందుకే ఈ పథకానికి ‘జగనన్న భూ హక్కు – భూరక్ష’ అని పేరు పెట్టాం. ఇలా ఏనాడైనా చేశావా బాబూ? చంద్రబాబూ.. ఇలా ఎప్పుడైనా, ఎక్కడైనా జరిగిందా? మీరు ఎప్పుడైనా చేశారా? రైతు, భూ యజమాని నష్టపోకూడదని, అన్ని రకాలుగా మంచి జరగాలని మీరెప్పుడైనా తాపత్రయ పడ్డారా? ఇంత చేసిన మా గురించి ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఎవరు దొంగలో ఇప్పుడు చెప్పండి. ప్రజల ఆస్తులను కొల్లగొట్టాలని అనుకునే ఎవరైనా ప్రత్యేక (డిస్టింక్ట్) రాళ్లు పాతి, భూ కమతాల నలుమూలలా జియో ట్యాగింగ్ చేసి, క్యూ ఆర్ కోడ్తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టాదార్ పాసు పుస్తకాలు ఇస్తారా? చెడు ఉద్దేశాలుంటే ఈ విధంగా మంచి చేస్తారా? అబద్ధాలకు ఒక హద్దు ఉండాలి. మాపై బాబు చేసిన విష ప్రచారం అంతా ఇంతా కాదు. ఒకసారి పాత, కొత్త పాస్ పుస్తకాలను అందరూ గమనించాలి. పాత వాటిలో భూ వివరాలన్నీ చేతితో రాసి ఉంటాయి. ఆ పాత పుస్తకంలో ఎక్కడా మ్యాప్లు లేవు. అక్షాంశాలు, రేఖాంశాలతో జియో ట్యాగింగ్ లేదు. మేం సబ్ డివిజన్, మ్యూటేషన్ చేశాక, విశిష్ట భూ కమతా నంబర్, ఏ మాత్రం తేడాలేని కొలతలతో కూడిన జియో ట్యాగింగ్ చేసి, క్యూ ఆర్ కోడ్లతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం. పాస్బుక్ చివరలో రైతులకు సూచనలు చేస్తూ వెబ్సైట్ను అప్గ్రేడ్ చేసి, రైతుల వివరాలు అప్డేట్ చేసి, రియల్ టైమ్ అప్డేట్స్తో అందుబాటులోకి తెచ్చాం. సర్వే పూర్తయిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చాం. దాన్ని పూర్తిగా వదిలేశారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ఎందుకంత ముఖ్యమంటే.. కళ్ల ఎదుటే గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతూ, రికార్డులు అప్డేట్ అవుతున్నప్పుడు, మోసాలకు ఏ మాత్రం ఆస్కారం ఉండదు కాబట్టి. నీతి ఆయోగ్ కొనియాడింది.. మేం చేపట్టిన రీసర్వే గొప్పగా జరిగింది కాబట్టే నీతి ఆయోగ్ కొనియాడింది. కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. మహారాష్ట్ర వచ్చి ప్రశంసలు కురిపించింది. అసోం బృందం ఏపీలో పర్యటించి, ఏపీ ప్రభుత్వ సహకారం కోరింది. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ మా ప్రభుత్వ తీరును మెచ్చుకున్నారు. (వీడియో ప్లే చేసి చూపించారు). క్రెడిట్ కోసం పడరాని పాట్లు సమగ్ర భూ సర్వేతో భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని నాడు చంద్రబాబు విష ప్రచారం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో భాగస్వామిగా ఉండీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా మా ప్రభుత్వంలో సర్వే చేశామని కేంద్రం రూ.400 కోట్లు రాయితీ ఇస్తే ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని ట్వీట్ చేయడం, చంద్రబాబు థ్యాంక్యూ అని రీ ట్వీట్ చేయడం ఆశ్యర్యంగా ఉంది. క్యూ ఆర్ కోడ్ తానే తెచ్చానంటూ చంద్రబాబు సొల్లు మాటలు చెబుతున్నారు. సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు. మేమిచ్చిన పుస్తకాలకే రంగు మార్చి.. మేం ఇచ్చిన 30 లక్షల పాస్ బుక్లు వెనక్కి తీసుకొని, వాటికే చంద్రబాబు రంగు మార్చి ఇస్తున్నారు. రంగు మార్చి ఇస్తున్న వాటిలో తేడా ఏముందో చూస్తే.. అదే క్యూ ఆర్ కోడ్, అదే ఫార్మాట్. జీయో కో ఆర్డినేట్స్తో భూ కమతా నంబర్, జియో కో ఆర్డినేట్స్ ల్యాండ్ మ్యాప్ ఇలా అన్ని ఒకే విధంగా ఉన్నాయి. చివరి పేజీల్లో చూస్తే వైఎస్సార్సీపీ హయాంలో అప్గ్రేడ్ చేసిన మీ భూమి పోర్టల్ను కాపీ కొట్టి ముద్రించారు. మేం ఇచ్చిన పుస్తకాలకు రంగు మార్చడం తప్ప ఈ 19 నెలల్లో చంద్రబాబు చేసిందేమీ లేదు. రంగు మార్చి ఇచ్చే పుస్తకాల్లోనూ తప్పుల తడకలే. పేర్లు, ఫొటోలు, ఐడీ నంబర్లు, విస్తీర్ణం అన్నింట్లో తప్పులు వస్తున్నాయి. వాటిని సరిచేసుకోవడానికి రైతులు మళ్లీ లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. పేర్లు చెరిపేయడానికి రూ.15 కోట్లు రీ సర్వే చేసి కొన్ని కోట్ల సర్వే రాళ్లను మేము పాతాం. ఆ రాళ్ల మీద ఉండే వైఎస్సార్, జగనన్న భూ హక్కు – భూ రక్ష పేరును రూ.15 కోట్ల డబ్బు ఇచ్చి మెషీన్లు పెట్టి తుడిచేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము వెచ్చించి, ఇంత పనికిమాలిన పని ఎవరైనా చేస్తారా? ఈయన కొత్తగా రాళ్లు ఇవ్వకపోగా, మేం పాతిన రాళ్లపై పేర్లను చెరిపేస్తున్నారు. అంటే అవి భూ రక్ష రాళ్లు కాదని చూపడానికి, అందులో ఉండే ప్రత్యేకతను(డిస్టింక్ట్) దగ్గరుండి తీసివేసే కార్యక్రమం చేస్తున్నాడు. పనికి మాలిన పని కాకపోతే ఇదేంటి? బుద్ధి ఉన్నోడు ఎవడైనా ఇలా చేస్తాడా? విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహం దగ్గర కూడా ఇంతే. విగ్రహం నిర్మాణం ప్రారంభించి, పూర్తి చేసి, ఆవిష్కరించిందీ నేనే. అదే పనిగా అధికారులను పంపి నా పేరును తీయించారు. ఇటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. నా పేరు తీసేస్తే మాత్రం ఆ అంబేడ్కర్ విగ్రహం ఎవరు కట్టారో తెలియదా? రీ సర్వే ఎవరు చేయించారో తెలియదా? ట్యాంపర్కు వీల్లేని పాస్ పుస్తకాలు ఎప్పుడు వచ్చాయో తెలియదా? చంద్రబాబు వయసేమో 80 ఏళ్లు. మా నాన్నతో సమకాలికుడు. మా నాన్నతో పోటీ దేవుడెరుగు, ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీకి అవస్థ పడుతున్నారు. కమీషన్ కోసం దేన్నీ వదలడం లేదు⇒ మా హయాంలో రూ.55.79కు పట్టాదారు పాస్బుక్ ఇచ్చాం. కలర్ మార్చి రూ.76కు చంద్రబాబు ఇస్తున్నారు. అంటే రూ.20 కమీషన్. కమీషన్ కోసం దేనినీ వదలడం లేదు. ఇంకో ఆశ్చర్యం చంద్రబాబు 22–ఏ గురించి మాట్లాడటం. 22–ఏ గురించి 2016–17లో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి, నిషేధిత జాబితా కింద పెట్టి, రైతులను, పేదలను, భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత ఆయనది. తప్పులన్నీ ఆయన చేసి, బురద మాత్రం వేరేవాళ్ల మీద చల్లుతారు. ⇒ మేం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా 20.24 లక్షల మంది పేదలు, రైతులకు ఏకంగా 35.44 లక్షల ఎకరాలపై హక్కులు లభించాయి. ఇందులో ప్రధానంగా అసైన్డ్ ల్యాండ్ పొంది 20 ఏళ్లు దాటితే, వారి భూముల మీద పూర్తి హక్కులు కల్పించిన ఘనత మా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది. ఒరిజినల్ అసైనీలకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపజేస్తూ మేము తీసుకొచ్చిన చట్టం ద్వారా ఏకంగా 15,21,160 మంది అసైన్డ్ నిరుపేదలకు 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు వచ్చాయి. ⇒ చుక్కల భూములకు సంబంధించి మరో 97 వేలకు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలకు మేం హక్కులు కల్పించాం. షరతులు కలిగిన భూములకు సంబంధించి 22 వేల మంది రైతులకు మరో 35 వేలకు పైగా ఎకరాల భూమి మీద హక్కులు వచ్చాయి. విలేజ్ సర్వీస్ ఇనాం భూముల కింద 1.58 లక్షల ఎకరాలకు సంబంధించి మరో 1.61 లక్షల మందికి మేలు కలిగిస్తూ హక్కులు కల్పించాం. ⇒ చంద్రబాబు సృష్టించిన కష్టాల నుంచి మేము పేదలను, రైతులను బయటకు వేశాం. ఇప్పుడేమో ఆ పెద్ద మనిషి 22–ఏ మా హయాంలో పెట్టామని మాట్లాడుతున్నాడు. అబద్ధాలు చెప్పడానికి బుద్ధి, జ్ఞానం ఉండాలి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క సెంటు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మా ప్రభుత్వ హయాంలో 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు కొత్తగా మేము పంపిణీ చేశాం. గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద 1.54 లక్షల గిరిజన కుటుంబాలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కు కల్పించాం. చంద్రబాబు క్రెడిట్ చోరీలో భాగంగా, 22ఏ మేము పెట్టామని అంటున్నాడు. ఇంత కచ్చితమైన గ్రామ మ్యాప్స్ దేశంలో తొలిసారిభారత్లో భూ రికార్డులు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. గ్రామాల్లో పట్వారీ ఉపయోగించే మ్యాప్స్ను నిజంగా మ్యాప్లు అని కూడా అనలేం. అవి కచ్చితత్వం లేని, తప్పులతో కూడిన మ్యాప్స్. ఈ పరిస్థితిని సరిచేయడానికి 2008లో ఎన్ఎంఎల్ఆర్పీ అనే ఒక పథకం వచ్చింది. కానీ ఆ పథకం ద్వారా జరగాల్సిన స్థాయిలో సంస్కరణలు జరగలేదు. ఏపీలో దూరదృష్టి కలిగిన సీఎం వైఎస్ జగన్ సంస్కరణల దిశగా అడుగులు వేశారు. భూ రికార్డులను సంపూర్ణంగా సరిచేయాలన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వచ్చారు. మొదటగా 10 వేల మందికిపైగా గ్రామ సర్వేయర్లను నియమిస్తూ అడుగులు వేశారు. రీసర్వే అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూఏవీలు, డ్రోన్స్, హెలికాప్టర్లు, విమానాల సహాయంతో గ్రామాల మ్యాపింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు గ్రామాల్లో ఉన్న మ్యాప్స్తో పోలిస్తే, ఇకపై రైతులకు లభించే వివరాలు, మ్యాప్లు అత్యంత కచ్చితంగా ఉంటాయి. ఇది దేశంలోనే ఒక మైలు రాయి. ఇంత కచ్చితమైన గ్రామ మ్యాప్స్ను రూపొందించడం దేశంలో ఇదే తొలిసారి. 17 వేల గ్రామాలకుగాను ఇప్పటికే 7 వేలకు పైగా గ్రామాల్లో సర్వే పూర్తయింది. ఇంత పెద్ద స్థాయిలో జరుగుతున్న పథకాన్ని సీఎం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. – 2022 నవంబర్ 23న నరసన్నపేటలో సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎస్.వి.సింగ్ (ఈ వీడియోను మీడియా సమావేశంలో ప్రదర్శించారు) -
వందేళ్ల తర్వాత చేపట్టిన మహాయజ్ఞం అది
సాక్షి, అమరావతి: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో అత్యాధునిక ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ఇదివరకెన్నడూ లేని విధంగా సమగ్ర భూ రీ సర్వేను విప్లవాత్మక రీతిలో చేపట్టడం వల్లే మహా యజ్ఞం అంటున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... వందేళ్ల తర్వాత మహా యజ్ఞం2019కి ముందు చేపట్టిన నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రే భూముల రీ సర్వేకు మూలం. భూములకు సంబంధించిన సమస్యలతో రైతులు, ప్రజలు పడే ఇబ్బందులను పాదయాత్రలో కళ్లారా చూశాను. ఆ రోజుల్లో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ పరిస్థితి ఎంతో దారుణంగా ఉండింది. సరిపడా సర్వేయర్లు, సిబ్బంది లేరు. పరికరాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అంతకన్నా లేవు. భూముల క్రయవిక్రయాలు, కుటుంబాల మధ్య భూ పంపిణీ జరిగితే సబ్ డివిజన్, మ్యుటేషన్ ఊసే ఉండేది కాదు. దీనికి తోడు చంద్రబాబు ఎప్పుడు పడితే అప్పుడు భూములను ఎడాపెడా 22–ఏ జాబితాలో పెడుతున్న దుస్థితి అప్పట్లో ఉంది. ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారంగా సమగ్ర భూ సర్వే, సమగ్ర భూ సంస్కరణలు చేయాలనే ఆలోచన పుట్టుకొచ్చింది. జియో కో ఆర్డినేట్స్ ఆధారంగా రీ సర్వేను అత్యంత పారదర్శకంగా, అత్యంత కచ్చితత్వంతో చేపట్టాం.పారదర్శకంగా భూముల సర్వే» ప్రజలు, రైతులకు వివాదాలు లేకుండా పారదర్శకంగా భూముల సర్వే చేయడంతో పాటు, భూ రికార్డులు అన్నింటినీ అప్డేట్ చేయడం. » ట్యాంపర్ చేయడానికి ఏ మాత్రం ఆస్కారం లేని విధంగా భౌతికంగా, డిజిటల్ రూపంలో రికార్డులను భద్ర పరచడం. » భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాకుండా, ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వమే గ్యారంటీగా నిలబడుతుంది.అత్యాధునిక ప్రమాణాలు(అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్), క్యూఆర్ కోడ్తో పట్టాదారు పాస్ పుస్తకాలను ఇచ్చాం. » భూముల క్రయవిక్రయాలు జరిగినా, లేదంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు, అన్నదమ్ముల మధ్య భూ పంపిణీ ద్వారా యాజమాన్య హక్కులు మారిన సందర్భాల్లో ఆటోమేటిక్ సబ్ డివిజన్, ప్రొటోకాల్ మ్యుటేషన్ జరిగేలా చేశాం. » ఇందుకు సంబంధించిన రికార్డులు అన్నీ కూడా ఆ గ్రామ సచివాలయంలోనే ఉంటాయి. సచివాలయాల్లోనే రికార్డులన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా, అక్కడే రిజి్రస్టేషన్ సేవలు ప్రారంభించాం. » భూముల లావాదేవీలపై రియల్ టైమ్ అలర్ట్స్ను మొబైల్ ఫోన్కు పంపేలా ప్రభుత్వ పోర్టల్ను అభివృద్ధి చేశాం. » ఈ స్థాయిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, భూ సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేసి, ట్యాంపర్ చేయడానికి వీల్లేని పత్రాలు చేతిలో పెట్టి, తర్వాత కూడా వ్యవస్థను నిర్వహించాలని తపనపడ్డ మా వంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. » ఇలా ఎంతో లోతుల్లోకి వెళ్లాం. అందుకే దీన్ని మహాయజ్ఞం అంటున్నాం. అసలు ఎంత లోతుల్లోకి మేం వెళ్లాం.. చిత్తశుద్ధి చూపామనడానికి నాడు చేసి సమీక్షలే నిదర్శనం. (31.03.2022న సమీక్ష వీడియో ప్రదర్శించారు) ఎప్పుడైనా ఇలాంటివి విన్నావా.. చూశావా.. చేశావా.. 80 ఏళ్ల వయసున్న చంద్రబాబూ? » ఇవన్నీ చేయని చంద్రబాబు ఏ రకంగా రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటారు? క్రెడిట్ చోరీకి ఎలా పాల్పడతారు? వీటిలో ఏ ఒక్కటీ ఆయన హయాంలో జరగలేదు. మరి క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గుండాలి. ప్రతి ప్రయత్నం ఓ రికార్డు» సమగ్ర భూ సర్వేలో మేం చేసిన ప్రతీ ప్రయత్నం ఓ రికార్డు. 15 వేల గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. ఇది ఒక రికార్డు. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగుల చొప్పున ఒకే ఒక నోటిఫికేషన్తో 1.34 లక్షల ఉద్యోగులను నియమించాం. ఇది ఎవ్వరూ ఎప్పుడూ అధిగమించలేని సూపర్ రికార్డు. ప్రతి సచివాలయంలో వీఆర్వో (గ్రామ రెవెన్యూ అధికారి), సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్ చొప్పున దాదాపు 40 వేల మంది రీ సర్వేలో పాల్గొన్నారు. సర్వే కోసం విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించాం. » రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికల సందర్భంగా మా మేనిఫెస్టోలో సుపరిపాలన అంశంలో రాష్ట్రంలోని భూములన్నింటినీ సమగ్ర రీ సర్వే చేయించి, శాశ్వత భూ యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చాం. చెప్పిన మేరకు 2020 డిసెంబర్ 21న రీసర్వే అనే మహా యజ్ఞాన్ని ప్రారంభించాం. అంతకు ముందు వందేళ్ల కిందట 1923లో బ్రిటీష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వేను మా ప్రభుత్వం చేపట్టింది. గొప్ప వ్యవస్థను సృష్టించాం చంద్రబాబులా మేమెప్పుడూ కబుర్లు చెప్పలేదు. గొప్ప వ్యవస్థను సృష్టించి, అత్యాధునిక సాంకేతికతను దత్తత చేసుకుని గొప్పగా అడుగులు వేశాం. అంతటితో ఆగిపోలేదు. ఎక్కడికక్కడ వివాదాల పరిష్కారం కోసం మండలానికి ఇద్దరు అధికారుల చొప్పున 1,358 మండల మొబైల్ మేజిస్ట్రేట్ లను అందుబాటులోకి తెచ్చాం. రియల్ టైమ్ అప్డేట్స్తో ఏపీ ప్రభుత్వ ‘మీ భూమి’ వెబ్ పోర్టల్ను అప్గ్రేడ్ చేశాం. ల్యాండ్ పార్సిల్స్ (భూ కమతాలు)కు సంబంధించి ఏ లావాదేవీ జరిగినా, యజమానులకు రియల్ టైమ్ అలెర్ట్ వచ్చే విధంగా పోర్టల్ను తీర్చిదిద్దాం. చంద్రబాబు అనే వ్యక్తికి చిత్తశుద్ధి, బాధ్యత ఉండదు. ఎవరైనా చేస్తే ఆ క్రెడిట్ కొట్టేయడానికి మాత్రం ప్రయత్నిస్తాడు. రైతు, భూ యజమానికి సరిహద్దులు తెలిసేలా రాళ్లను పాతితేనే సర్వే పూర్తయినట్లు. ఆ భూమిలో సర్వే అయినట్టు ప్రత్యేక (డిస్టింక్ట్) రాయి ఉండాలి. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి.. ఇదే సర్వే రాయి అంటే సరిహద్దులు ఎలా ఉంటాయి? అందుకే ప్రత్యేక (డిస్టింక్ట్) తరహాలో సర్వే రాళ్లను ఉచితంగా ప్రభుత్వం రైతులకు సరఫరా చేసింది. రాళ్ల మీద శాశ్వత భూ హక్కు – భూ రక్ష పేరు పెట్టాం. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో 1923లో బ్రిటీష్ వాళ్లు పెట్టిన రాళ్లు కనిపిస్తాయి. (బ్రిటీష్ హయాంలో పెట్టిన సర్వే రాళ్లు చూపించారు) చంద్రబాబు ఏమో రాళ్లెందుకు అంటాడు? -
ఆ బాధ్యత మీదే.. ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమస్యను పార్లమెంట్ ఉభయ సభల్లో సమర్థవంతంగా, ధైర్యంగా లేవనెత్తాలని వైఎస్సార్సీపీ ఎంపీలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రజల కష్టాలు, సమస్యలు, ఆకాంక్షలను జాతీయ స్థాయిలో వినిపించే బాధ్యత వైఎస్సార్సీపీ ఎంపీలదేనని ఆయన గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వైఎస్సార్సీపీ ఎంపీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..ఏపీలో రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పేదలు, బడుగు–బలహీన వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్న వైఎస్ జగన్.. ఈ వర్గాలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, అన్యాయాన్ని పార్లమెంట్ వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు చెప్పారు. దీంతోపాటు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, అప్పులు చేయడంలో యధేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీంతో రాష్ట్రం భయంకరమైన రుణభారంలో కూరుకుపోతుందన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అమలు చేస్తున్న “రెడ్ బుక్ పాలన” కారణంగా రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పెరిగిపోయిందని, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు కూటమి నాయకులు కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల వైఎస్సార్సీపీకి చెందిన దళిత కార్యకర్త మందా సల్మాన్పై జరిగిన దాడి, హత్య ఘటనను ప్రస్తావించిన వైఎస్ జగన్.. రాష్ట్రంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎంపీలు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ను కలసి సమగ్ర నివేదికతో కూడిన వినతిపత్రం అందజేయాలని వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపులపై రాజ్యాంగబద్ధ సంస్థలు తక్షణమే స్పందించి జోక్యం చేసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపవద్దని ఎంపీలకు స్పష్టం చేశారు.పార్లమెంట్ను ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగించాలని, కేంద్రంపై నిరంతర ఒత్తిడి తీసుకువచ్చే విధంగా ఎంపీలు పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
మన ఆక్వాకు మరో ముప్పు 'బ్రూడర్స్' బెడద!
సాక్షి, అమరావతి: మన ఆక్వా రంగానికి మరో ముప్పు ముంచుకొస్తోంది! ఆగ్నేయాసియా దేశాల నుంచి తల్లి రొయ్యల (బ్రూడర్స్) దిగుమతికి చాపకింద నీరులా జరుగుతున్న సన్నాహాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ ప్రతీకార పన్నుల విధింపుతో ఆక్వా రైతులు విలవిలలాడుతుండగా ఇక నిరంతర మరణాలకు దారితీసే వైరస్లు, తెగుళ్లకు కేంద్రమైన ఆగ్నేయాసియా దేశాల నుంచి తల్లి రొయ్యల దిగుమతికి అనుమతినిస్తే ఆక్వా రంగం అతలాకుతలం అవుతుందని హెచ్చరిస్తున్నారు. దీనిపై గురువారం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కారు తక్షణమే స్పందించి బ్రూడర్స్ దిగుమతిని అడ్డుకోవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏటా రూ.1,800 కోట్లకుపైగా వ్యాపారం మత్స్య ఉత్పత్తుల సాగు, దిగుబడులు, ఎగుమతుల్లో నంబర్ వన్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం గత రెండేళ్లుగా తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. జాతీయ స్థాయిలో 8.64 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుండగా, అందులో ఏపీలో 6.50 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం, చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటా కలిగిన ఏపీలో దాదాపు 26 లక్షల మందికి పైగా ఆక్వా రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దేశవ్యాప్తంగా 585 హేచరీలుంటే 423 ఒక్క ఏపీలోనే ఉన్నాయి. ఏటా 2 లక్షల తల్లి రొయ్యలను (ఆడ, మగ కలిపి) హవాయ్ నుంచి మన దేశీయ కంపెనీలు దిగుమతి చేసుకుంటుండగా వీటిలో 70 శాతం మన రాష్ట్ర పరిధిలోని హేచరీలే దిగుమతి చేసుకుంటున్నాయి. ఒక్కొక్క తల్లి రొయ్య ఖరీదు రూ.9 వేలు ఉంటుంది. తల్లి రొయ్యల దిగుమతులపై ఏటా రూ.1,800 కోట్ల వ్యాపారం జరుగుతోంది. వెనామీ తల్లి రొయ్య ద్వారా 3–5 లక్షల సీడ్ ఉత్పత్తి చేస్తుండగా టైగర్ తల్లి రొయ్య నుంచి 4–8 లక్షల సీడ్ ఉత్పత్తి జరుగుతుంది. సీడ్ కోసమే ఎకరాకు రూ.ఐదారు లక్షలకు పైగా రైతులు ఖర్చు చేస్తుంటారు. దిగజారిన ఎగుమతులు, సాగు ఇప్పటికే వైట్ స్పాట్, వెబ్రియా లాంటి వైరస్లకు తోడు ట్రంప్ ప్రతీకార దిగుమతి సుంకం పెంపు (50శాతం) నేపథ్యంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ట్రంప్ సుంకాల ప్రభావంతో ఏటా రూ.12 వేల కోట్లకుపైగా భారం పడుతోంది. కంపెనీల మాయాజాలంతో కౌంట్ ధరలు పడిపోయి ఎగుమతులు దిగజారిపోయాయి. వైరస్ల ప్రభావంతో దిగుబడులు, సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు గోదావరి, కృష్ణా జిల్లాల్లో మెజార్టీ రైతులు ఆక్వా సాగు సమ్మె దిశగా అడుగులు వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆగ్నేయాసియా దేశాల నుంచి తల్లి రొయ్యల దిగుమతి వార్త ఆక్వా పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నేడు ఢిల్లీలో కీలక సమావేశం తాజాగా మరోసారి ఆయా దేశాల నుంచి తల్లి రొయ్యలను దిగుమతి చేసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 22వ తేదీన ఈ అంశంపై అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. వీటి దిగుమతుల ద్వారా భారీగా విదేశీ మారక ద్రవ్యం రానుండడంతో కేంద్రం మొగ్గు చూపుతోంది. తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ఉపద్రవాన్ని అడ్డుకోవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2022లో అడ్డుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం థాయ్లాండ్, వియత్నాం లాంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి తల్లి రొయ్యల దిగుమతులను 2013లోనే ఆక్వా సాగు చేసే మెజార్టీ దేశాలు నిషేధించాయి. అక్కడి తల్లి రొయ్యల ద్వారా ఉత్పత్తి చేసే సీడ్లో రన్నింగ్ మారా్టలిటీ సిండ్రోమ్ (ఆర్ఎంఎస్), ఎర్లీ మారా్టలిటీ సిండ్రోమ్ (ఈఎంఎస్) లాంటి వైరస్లే కారణం. ఈ వైరస్ల నియంత్రణపై మందుల ప్రభావం పెద్దగా ఉండదు. పెద్దగా వ్యాధి నిరోధక శక్తి లేని ఈ సీడ్ వేసిన 20–30 రోజుల్లోనే చనిపోతాయి. కనీసం 20–30 శాతం సీడ్ కూడా బతికే పరిస్థితి ఉండదు. పంట కాలం ముగిసే సరికి భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తాయి. కనీస దిగుబడులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. పెరుగుదల పూర్తిగా మందగిస్తుంది. చైనా, మెక్సికో, మలేషియా లాంటి దేశాల్లో ఈ వైరస్ల వల్ల ఆక్వా పరిశ్రమ కుదేలైంది. 2022లో ఈ దేశాల నుంచి తల్లిరొయ్యల దిగుమతికి జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరగగా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం అడ్డుకుని కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచి్చంది. పలుమార్లు లేఖలు రాయడంతోపాటు ప్రత్యేక బృందాలను పంపి వీటి దిగుమతి వల్ల కలిగే దు్రష్పరిణామాలను వివరించడంతో కేంద్రం వెనుకడుగు వేసింది. అడ్డుకోకుంటే మనుగడ ఉండదు ఆగ్నేయాసియా దేశాల నుంచి తల్లిరొయ్యల దిగుమతులను అడ్డుకోకపోతే దేశీయంగా ఆక్వా పరిశ్రమకు మనుగడ ఉండదు. తక్షణమే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి 22వ తేదీన జరిగే సమావేశంలో మన వాదన బలంగా వినిపించాలి. ఈ ప్రయత్నాలను కచ్చితంగా అడ్డుకోవాలి. లేదంటే ఆక్వా రంగం ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతుంది. –దుగ్గినేని గోపీనాథ్, రొయ్య రైతుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు -
వచ్చే ఏడాది ప్రజల్లోకి.. ప్రజల మధ్యే ఉంటాను: వైఎస్ జగన్
చూస్తుండగానే దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో మూడో బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంటే ఈ ప్రభుత్వానికి మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. మిగిలింది మూడేళ్లు మాత్రమే. ఇకపై వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని పార్టీ కేడర్తో సమావేశం అవుతాను. ఇదే క్రమంలో ప్రజల తరఫున గట్టిగా యుద్ధం చేద్దాం. ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలు పెడతాను. అలా దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజల్లోనే ఉంటాను. ఈ దుర్మార్గ పాలనను, శిశుపాలుడిని తెర మరుగు చేసే రోజు దగ్గర్లోనే ఉంది.జగన్ ఉన్నప్పుడే బాగుండేది.. ఆయన ప్రతి నెలా బటన్ నొక్కేవాడు.. చెప్పింది చేసే వాడు.. మాట నిలబెట్టుకునేవాడు.. అన్నీ ఇచ్చేవాడు.. అని ప్రజలంతా, ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు. అదే చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్ కూడా లేకుండా చేశారని అంతా బాధ పడుతున్నారు. మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది చేసి చూపాం. మాట నిలబెట్టుకున్నాం. ఇదే విషయంపై ఈ రోజు ప్రజల్లో, ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత ప్రజలు అన్ని వాస్తవాలు గమనించారు. -వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి.. ఇలాగే మరో మూడేళ్లు అయిపోతాయి.. ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో ప్రజల తరఫున జెండా పట్టుకుని పోరాడుతున్నాం.. ఇంకో ఏడాదిన్నర గట్టిగా యుద్ధం చేస్తే నా పాదయాత్ర మొదలవుతుంది.. అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను. శిశుపాలుడు తెరమరుగయ్యే రోజు దగ్గర్లోనే ఉంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతానని, ఇదే పోరాట స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. బుధవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలను శ్రేణులకు వివరించారు. ‘నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో గతంలో సమావేశమయ్యాం. మళ్లీ ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెడుతున్నాం. ఇకపై వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశం అవుతాం. చూస్తుండగానే దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంటే ఈ ప్రభుత్వానికి మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. అలాగే మిగిలింది మూడేళ్లు మాత్రమే. ఇక నుంచి ప్రతి వారం కార్యకర్తలతో భేటీలు.. ప్రజల తరఫున పోరాటాలు.. ఇలా ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది’ అని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ప్రతి ఇంట్లోనూ అదే చర్చరాష్ట్రంలో ఈ రోజు పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండ కావరంతో వ్యవహరిస్తున్నారు. పాలనంతా అబద్ధాలు, మోసాలు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది.. ఆయన ప్రతి నెలా బటన్ నొక్కేవాడు.. చెప్పింది చేసే వాడు.. మాట నిలబెట్టుకునేవాడు.. అన్నీ ఇచ్చేవాడు.. అని ప్రజలంతా, ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు. అదే చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్ కూడా లేకుండా చేశారని అంతా బాధ పడుతున్నారు. మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్. అన్ని కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం. మాట నిలబెట్టుకున్నాం. ఇదే విషయంపై ఈ రోజు ప్రజల్లో, ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.మోసం.. దగా.. అదే బాబు పాలనమనం ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత, ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ప్రపంచంలోనే ఉండరని అందరూ గ్రహించారు. ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. సూపర్ సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు. అన్నీ మోసాలే. ఏదీ అమలు కాలేదు. మరో వైపు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. గవర్నమెంటు స్కూళ్లు పూర్తిగా కళ తప్పాయి. మన హయాంలో గవర్నమెంటు స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడే స్థితి ఉంటే.. ఇప్పుడు అంతా రివర్స్ అయింది. నాడు–నేడు మనబడి లేదు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు లేవు. పిల్లలకు టోఫెల్ క్లాస్లు లేవు. గోరుముద్ద కూడా క్వాలిటీ లేకుండా పోయింది. పిల్లల ప్రాణాలు పోతున్నాయి. నాడు గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేల నుంచి కూడా రికమెండేషన్లు ఉండేవి. ఆ స్థాయిలో గవర్నమెంటు స్కూళ్లకు డిమాండ్ ఉండేది. అదే ఇప్పుడు దాదాపు 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంటు స్కూళ్ల నుంచి చదువు మానేశారు. నాడు మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్లలో దాదాపు 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈ రోజు కేవలం 33 లక్షల మంది మాత్రమే చదువుతున్నారు.వ్యవస్థలు నిర్వీర్యం.. అన్నీ బకాయిలే⇒ ఫీజు రీయింబర్స్మెంట్ ఏకంగా ఎనిమిది క్వార్టర్లు పెండింగ్. ఒక త్రైమాసికం అయిపోగానే, దానికి సంబంధించిన డబ్బులు జమ చేసే వాళ్లం. 2024 ఎన్నికలకు ముందు జనవరి నుంచి మార్చి వరకు ఇవ్వాల్సిన త్రైమాసిక చెల్లింపు, ఏప్రిల్లో ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో, అప్పటి నుంచి ఫీజుల చెల్లింపు లేకుండా పోయింది. ఒక్కో క్వార్టర్కు రూ.700 కోట్లు. అలా ఎనిమిది క్వార్టర్లకు సంబంధించి రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.700 కోట్లు ఇచ్చారు. అలా రూ.4,900 కోట్లు బకాయి పడ్డారు. వసతి దీవెన కింద మనం పిల్లలకు కోర్సును బట్టి ఏటా రూ.20 వేల వరకు ఇచ్చే వాళ్లం. అలా ప్రతి ఏప్రిల్లో రూ.1,100 కోట్లు ఇచ్చే వాళ్లం. ఈ ప్రభుత్వం రెండేళ్ల నుంచి ఇవ్వక రూ.2,200 కోట్లు బకాయి పడింది. అలా చదువుల రంగం పూర్తిగా నాశనం అయింది. ఇక్కడ చదవాలంటే పిల్లలు భయపడుతున్నారు. ⇒ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేశారు. నెలకు రూ.300 కోట్లు దానికి కావాలి. మన హయాంలో 3,300 ప్రొసీజర్లకు విస్తరించి, రూ.25 లక్షల వ్యయం వరకు ఉచిత వైద్యం అందించాం. దాదాపు 20 నెలల నుంచి నెలకు రూ.300 కోట్ల చొప్పున దాదాపు రూ.6 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే.. రూ.4 వేల కోట్లకు పైగా బకాయి పడ్డారు. 108, 104 సర్వీసులు నిర్వీర్యం చేశారు. కోవిడ్ టైమ్లో కూడా అన్ని సదుపాయాలతో మనం కొత్త వాహనాలు ప్రవేశ పెడితే.. ఇవాళ వాటిని పడకేయించారు. ఇప్పుడు టీడీపీ డాక్టర్ల వింగ్కు చెందిన వారికి ఆ సర్వీసులు అప్పగించారు. ఇప్పుడు ఆ సర్వీసుల కోసం ఫోన్ చేస్తే, రెండు మూడు గంటలైనా రావడం లేదని ప్రజలు వాపోతున్నారు.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్కామ్మన ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. పూర్తయిన 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం అచ్చంగా ప్రైవేటీకరిస్తోంది. అంతే కాకుండా ఆ మెడికల్ కాలేజీల్లోని ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. ఒక మెడికల్ కాలేజీలో జీతాలకు ఏటా రూ.60 కోట్లు కావాలి. అలా రెండేళ్లకు రూ.120 కోట్లు ఖర్చవుతాయి. అంటే కాలేజీ ప్రభుత్వానిది. అలాగే ప్రభుత్వ స్టాఫ్. నిర్వహణ ఖర్చు కూడా ప్రభుత్వానిదే. కానీ, లాభాలు మాత్రం ప్రైవేటువారికి. ఇలాంటి స్కామ్కు పాల్పడిన వారిపై మేము రాగానే రెండు నెలల్లోనే చర్య తీసుకుంటామనగానే.. ఆ కాలేజీలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.నాలుగు రంగాలు నాశనంవ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేశారు. చివరకు ఎరువులు కూడా బ్లాక్లో కొనాల్సి వస్తోంది. నాడు గ్రామాల్లో ప్రతి అడుగులో రైతుల చేయి పట్టుకుని నడిపించిన ఆర్బీకేలు ఇప్పుడు పని చేయడం లేదు. ఉచిత పంటల బీమా లేదు. సున్నా వడ్డీ పంట రుణాలు లేవు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. పంటలకు మద్దతు ధర లేదు. చివరకు రైతు భరోసాలో కూడా మోసం. రూ.40 వేలకు బదులు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. అత్యంత కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నాశనం అయ్యాయి. తాజాగా నాలుగో వ్యవస్థ శాంతి భద్రతలు. దాన్నీ నాశనం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. ఎక్కడా పోలీసింగ్ వ్యవస్థ కనిపించడం లేదు. ఇంకా మొత్తం ప్రైవేటీకరణ.. అలాగైతే చివరకు సీఎం పదవిని కూడా ప్రైవేటుకు ఇవ్వొచ్చు కదా?జనంతో వైఎస్సార్సీపీ మమేకం‘అన్నింటా విఫలమైన ప్రభుత్వం.. ప్రశ్నించే గొంతును నొక్కుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కేసులతో వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రజలకు తోడుగా నిలబడుతోంది. విద్యార్థులు, యువత, రైతులు, అక్క చెల్లెమ్మలు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా, వారందరి తరఫున జెండా పట్టుకుని నిలబడుతున్నాం. గట్టిగా పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగాలి. ఆ దిశలో మీరంతా కలిసికట్టుగా పని చేయాలి. ఏలూరులో మన పార్టీ నాయకుడు జేపీ (జయప్రకాష్)కి మీ అందరి సహకారం కావాలి. మీరంతా ఆయనకు తోడు కావాలి’ అని జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త జయప్రకాష్, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కారుమూరి సునీల్తో పాటు, దాదాపు 200 మంది ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
కోర్టు హాల్లో పోలీసుల దౌర్జన్యంపై ‘న్యాయ’ పోరాటం!
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగంతో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై న్యాయవాదులు న్యాయ పోరాటానికి దిగారు. ఇటీవల ఓ కేసులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని జడ్జి అనుమతి లేకుండానే కోర్టు హాల్లోకి చొరబడి పోలీసులు అరెస్టు చేయడం.. అడ్డుకునేందుకు యత్నించిన న్యాయవాదులపై పోలీసులు దౌర్జన్యానికి దిగటాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సరెండర్ పిటిషన్ దాఖలు చేసి కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న నిందితుడిని పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లడంపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ కర్నూలు జిల్లా పత్తికొండ న్యాయవాదుల సంఘం హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. చిప్పగిరి పోలీస్స్టేషన్ ఎస్ఐ సతీష్ కుమార్, కానిస్టేబుళ్లు షబ్బీర్, రామోజీ, పత్తికొండ ఎస్ఐ ఆర్.విజయ్కుమార్ నాయక్పై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని పత్తికొండ న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.భాస్కర్ తన పిటిషన్లో హైకోర్టుకు నివేదించారు.జడ్జి అనుమతి లేకుండా కోర్టు హాలులోకి చొరబడి నిందితుడిని అరెస్ట్ చేసిన ఘటనపై జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్ లేదా జిల్లా జడ్జి సూచించిన అధికారి లేదా ఏదైనా స్వతంత్ర సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరారు. పోలీసుల దౌర్జన్యంపై వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యాయని పిటిషన్లో నివేదించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీసులు దూకుడుగా వ్యవహరించారన్నారు. మేజి్రస్టేట్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైకోర్టుకు విన్నవించారు. కోర్టు హాల్లోకి దూసుకెళ్లిన పోలీసులు.. చిప్పగిరి మండలం డేగులపాడుకి చెందిన శివయ్య గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో లొంగిపోయేందుకు గత నెల 24న పత్తికొండ కోర్టుకు వచ్చిన నిందితుడు తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై న్యాయాధికారి నిర్ణయం కోసం శివయ్య కోర్టులో నిరీక్షిస్తుండగా పోలీసులు మఫ్టీలో కోర్టు హాల్లోకి చొరబడి శివయ్యను లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. దీన్ని అడ్డుకోబోయిన న్యాయవాదులను తోసివేశారు. కోర్టు హాలులోకి ప్రవేశించేందుకు సంబంధిత న్యాయాధికారి అనుమతి తీసుకోకపోవడం, పోలీసుల దౌర్జన్యంపై పత్తికొండ కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ, డీఐజీలకు ఈ నెల 5న పత్తికొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. -
నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై మీడియాతో వైఎస్ జగన్ మాట్లాడతారు. -
రాహు - కేతువులనూ మింగేస్తున్నారు!
సూర్య, చంద్రులను గ్రహణం రోజున రాహువు లేదా కేతువు కొంత సమయం పాటు మింగేస్తారనేది పురాణ ప్రశస్తి. అంతటి రాహు కేతువులనూ శ్రీకాళహస్తిలో టీడీపీ కూటమి శ్రేణులు మింగేస్తున్నారు. వెండి ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో నాగ పడగల రూపంలో ఆలయానికి దక్కాల్సిన వెండిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదు. పాలకమండలికి చెప్పినా వినిపించుకోవడం లేదు.సాక్షి టాస్క్ ఫోర్స్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు పూజలకు ఉపయోగించే వెండి నాగ పడగలను టీడీపీ కూటమి నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొంతకాలంగా వెండి ధరలు పెరిగిపోతుండటంతో ఆలయంలో రూ.500 పూజా టికెట్లు కొని.. తద్వారా వచ్చే నాగ పడగలను బయట మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో నిత్యం రాహు–కేతు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పూజలు చేయించుకునే భక్తుల కోసం ఆలయంలోనే రూ.500, రూ.750, రూ.2,500, రూ.5,000 డినామినేషన్లలో టికెట్లు విక్రయిస్తారు. రూ.500, రూ.750 టికెట్లు తీసుకునే భక్తులకు టెంకాయ, నల్లగుడ్డ, ఎర్రగుడ్డ, మినుములు, ఉద్దులు, పసుపు, కుంకుమ, తమలపాకు, వక్కతోపాటు 5 గ్రాముల బరువు గల రెండు (రాహు–కేతు) వెండి నాగపడగల్ని కూడా ఆలయ కౌంటర్లో భక్తులకు అందజేస్తారు. రూ.2,500, రూ.5 వేల టికెట్లు కొన్నవారికి పూజా సామగ్రితోపాటు ఒక్కొక్క టికెట్పై 10 గ్రాముల బరువైన రెండు వెండి నాగపడగల్ని ఇస్తారు. భక్తుల ముసుగులో రూ.500 టికెట్లు కొనుగోలు చేస్తున్న టీడీపీ కూటమి నేతలు ఆలయ కౌంటర్లలో ఇచ్చే నాగపడగల్ని జ్యూవెలరీ వ్యాపారులకు, పూజాసామగ్రిని ఆలయం బయట ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ఆగడాల కారణంగా ఆలయానికి దక్కాల్సిన వెండి పక్కదారి పడుతుండగా.. కూటమి శ్రేణుల జేబులు నిండుతున్నాయి. ఇలా కొట్టేస్తున్నారు: కొన్ని రోజులుగా వెండి ధర పరుగులు పెడుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.3.18 లక్షలు పలుకుతోంది. గ్రాము రూ.300 దాటింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కూటమి శ్రేణులు రూ.500 రాహు–కేతు పూజల టికెట్ కొనుగోలు చేసి, దానితోపాటు కౌంటర్లో ఇచ్చే రెండు నాగపడగల (ఒక్కొక్కటి రెండున్నర గ్రాములు) 5 గ్రాముల వెండిని బయట విక్రయించడం ప్రారంభించారు. ప్రస్తుతం గ్రాము వెండికి రూ.300 చొప్పున 5 గ్రాముల్ని జ్యూవెలరీ వ్యాపారులకు విక్రయించి రూ.1,500 పొందుతున్నారు. అంటే రూ.500 టికెట్పై ఇచ్చే నాగపడగలకు రూ.1,500 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ప్రతి టికెట్పై వచ్చే నాగపడగలకు రూ.1,000 చొప్పున ఆదాయం పొందుతున్నారు. రోజుకు ఒక్కొక్క నాయకుడు కనీసం 10 నుంచి 20 వరకు టికెట్లు కొనుగోలు చేసి తద్వారా వచ్చే నాగపడగల్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కొక్క నాయకుడు రోజుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. దీంతోపాటు టికెట్లపై ఇచ్చే పూజా సామగ్రిని తక్కువ ధరకు ఆలయం వెలుపల వ్యాపారులకు విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా నాగపడగల ద్వారానే టీడీపీ కూటమి శ్రేణులు రోజుకు రూ.6–7 లక్షల వరకు వెనకేసుకుంటున్నారు. సుమారు మూడు నెలలుగా ఈ దందా సాగుతోంది.తరిగిపోతున్న వెండి కొండలుశ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహు–కేతు పూజలు చేసుకుంటే సకల దోషాలు, పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి సుమారు 2 వేల కిలోల వెండి ఉంది. ప్రస్తుతం దీని విలువ సుమారు రూ.60 కోట్లు. ఈ వెండితోనే క్షేత్రంలోని మింట్లో వెండి పడగలు తయారు చేస్తారు. భక్తులు పూజలో ఉంచిన వెండి పడగల్ని పూజ ముగిసిన అనంతరం ఆలయ హుండిలోనే వేసేస్తారు. అలా వచ్చిన వెండి పడగల్ని ఏరోజుకారోజు సేకరించి 6 నెలలకు ఒకసారి హైదరాబాద్ తరలించి అక్కడ కరిగిస్తారు. తరుగు పోగా మిగిలిన వెండిని కడ్డీల రూపంలోకి మారుస్తారు. తిరిగి ఆ వెండి కడ్డీలను ఆలయంలోని మింట్కు తీసుకొచ్చి నాగపడగల్ని తయారు చేసి టికెట్ తీసుకున్న భక్తులకు కౌంటర్ల ద్వారా ఇస్తారు. భక్తులు పూజలో వినియోగించిన అనంతరం హుండీలో వేయడం ద్వారా తిరిగి ఆలయానికే వస్తుంది. కాగా.. కూటమి నేతలు భక్తుల ముసుగులో టికెట్లు తీసుకుని.. వాటిపై ఇచ్చే నాగపడగల్ని ప్రస్తుత మార్కెట్ ధరకు వ్యాపారులకు విక్రయిస్తుండటంతో ఆలయానికి చెందిన వెండి క్వింటాళ్ల కొద్దీ బయటకు పోతోంది. ఇప్పుడు వెండి ధర రోజురోజుకూ పెరిగిపోతుండటంతో కూటమి నేతలు దీనిపై దృష్టి సారించారు. ఆలయానికి రావాల్సిన వెండిని కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నారు.టికెట్ కౌంటర్లను మార్చడంతోగతంలో ఆలయ ఆవరణలోని టికెట్ కౌంటర్ల వద్ద రాహు–కేతు పూజల టికెట్లు విక్రయించేవారు. వీటిపై అక్కడి సిబ్బంది, సెక్యూరిటీ నిఘా ఉండేది. కానీ.. ఇటీవల ఆలయ రెండో గేటు, సన్నిధి వీధి వద్ద ఓ టికెట్ల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ సుమారు 10 కౌంటర్లు ఉన్నాయి. టీడీపీ నేతలకి ఇదే ప్రధాన కేంద్రమైంది. కౌంటర్లలో టికెట్ మాత్రమే ఇచ్చి వెండి పడగలు, పూజా సామగ్రి పూజా మండపాల్లోనే ఇచ్చి, వాటిని మండపాల్లోనే హుండీలో వేయిస్తే తప్ప ఈ చోరీని అరికట్టడం కష్టమని చెబుతున్నారు. దళారుల దోపిడీ అధికారులకు తెలిసిందా?!శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజల కోసం కొందరు దళారులు పూజా సామగ్రి తీసుకుని.. పూజలు నిర్వహించకనే వెండి నాగ పడగలను బయట మార్కెట్లో విక్రయిస్తున్నారన్న సమాచారం అధికారుల దృష్టికి వచ్చినట్టుంది. ఈ క్రమంలో బుధవారం రాహుకేతు పూజా టికెట్లను కౌంటర్లో విక్రయించి, వెండి నాగపడగలను మాత్రం రాహు కేతు పూజా మండపాల్లోనే భక్తులకు అందజేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఒక్కరికి ఒక పూజా టికెట్ మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. దీంతో బుధవారం రూ.500 టికెట్ల రాహు కేతు పూజలు అతి తక్కువగా జరిగాయి. వెయ్యి లోపే రాహు కేతు పూజలు జరిగినట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. గడచిన రెండు నెలల్లో రూ.500 టికెట్ల రాహు కేతు పూజలు అతి తక్కువగా నిర్వహించింది బుధవారమే. మరోవైపు, బుధవారం మొదటిసారి రాహు కేతు పూజా టికెట్లను కౌంటర్లో విక్రయించి, పూజా సామాగ్రిని మండపాల్లో అందజేశారు. -
జనాభా ఆధారిత యూనిట్ విధానంలో పార్టీ కమిటీలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కమిటీల నిర్మాణంలో ఇకపై జనాభా ఆధారిత యూనిట్ విధానం అనుసరించాలని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. మున్సిపల్ వార్డు, కార్పొరేషన్ డివిజన్, పంచాయతీ పరిధిలో 2,500 కంటే ఎక్కువ జనాభా ఉన్న సందర్భాల్లో ఆ పరిధిలోని ప్రతి సచివాలయ పరిధిని ఒక ప్రత్యేక యూనిట్గా తీసుకోవాలని.. ఆ యూనిట్కు ఒక కోర్ కమిటీ, ఏడు అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటుచేయాలని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ సభ్యులు, పార్లమెంట్ పరిశీలకులతో బుధవారం సజ్జల జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మార్పుతో పార్టీ సంస్థాగత బలాన్ని కిందిస్థాయిలో మరింత పటిష్టం చేయడం, కార్యకర్తలకు స్పష్టమైన బాధ్యతలు, మెరుగైన సమన్వయం కల్పించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పారు. పార్టీ టెక్నికల్ టీం అవసరమైన మ్యాపింగ్, డిజిటల్ సపోర్ట్ అందిస్తూ కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ యూనిట్ విధానం పట్టణ ప్రాంతాలైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీలకు వర్తిస్తుందని సజ్జల చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 25లోగా కమిటీల నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారం కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. ఉగాది రోజు పార్టీ కేడర్కు ఐడీ కార్డులు అందించే ఆలోచనలో ఉన్నందున నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. -
1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు..
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ఆ పని చేయలేకపోగా ప్రజల నడ్డి విరుస్తూ పెను భారాలను మోపడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను మరోసారి భారీగా పెంచి జనం నెత్తిన బండ మోపేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం స్థిరాస్తుల మార్కెట్ విలువలు సవరించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మంగళవారం రాత్రి మెమో జారీ చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచిన మార్కెట్ విలువలు అమల్లోకి వస్తాయని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం ఖరారైంది. ఎంత మేర పెంచుతున్నారనే దానికి సంబంధించిన లాంఛనాలు మాత్రమే మిగిలాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం కనీసం 40 నుంచి 50 శాతం మేర పెంపు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విలువలు దాదాపుగా ఖరారైనట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆమోదం తీసుకోవడమే మిగిలి ఉంది. దీనిపై డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు తుది కసరత్తు చేస్తున్నారు. గత 15 రోజుల నుంచి ప్రభుత్వం ఇదే పని మీద వారిపై ఒత్తిడి తెస్తోంది. రెండు మూడు రోజుల్లో అన్ని జిల్లాల్లో మార్కెట్ విలువల సవరణ ప్రతిపాదనలకు అధికారుల కమిటీలు ఆమోదం తెలపనున్నాయి. వాటి ప్రకారం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్కెట్ విలువలు పెరగనున్నాయి. అదే రోజు నుంచి పెరిగిన విలువల ప్రకారం రిజిస్ట్రేషన్ల ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ముసుగుకేవలం అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే మార్కెట్ విలువల సవరణ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా దాని వెనుక కుయుక్తి కనబడుతోంది. అర్బన్ ప్రాంతాలు అంటే కేవలం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో మాత్రమే విలువలను సవరించాలి. అధికారికంగా జారీ చేసిన మెమోలో అదే విషయాన్ని పేర్కొన్నా వాస్తవానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో విలువలు సవరిస్తున్నారు. అంటే దాదాపు 90 శాతం ఏరియాపై పెంపు ప్రభావం ఉండనుంది. ప్రభుత్వం చెబుతున్న అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే పెంపు ఉంటే సీఆర్డీఏ పరిధిలో కేవలం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని విజయవాడ, గుంటూరు, తెనాలి, గుడివాడ లాంటి పట్టణాల్లో మాత్రమే పెంపు ఉండాలి. కానీ సీఆర్డీఏ పరిధి అంతటా మార్కెట్ విలువలు సవరిస్తుండడంతో పెద్దగా ఆదాయం రాని మారుమూల గ్రామీణ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్ విలువలు పెరగనున్నాయి.రాష్ట్రంలో 90 శాతం ప్రాంతంపై ప్రభావం..సీఆర్డీఏ పరిధిలో ఉన్న 27 నియోజకవర్గాల్లో మార్కెట్ విలువలు పెంచుతున్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) పరిధిలో విశాఖ నగరంతోపాటు భీమునిపట్నం, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, పాయకరావుపేట, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాలున్నాయి. ఆ ఏరియా మొత్తం మార్కెట్ విలువలను సవరించనున్నారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) పరిధిలో తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరితోపాటు చిత్తూరు జిల్లాలోని నగరి, గంగాధర నెల్లూరు జిల్లా కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో మార్కెట్ విలువలు పెరగనున్నాయి. రాష్ట్రంలోని 90 శాతం ప్రాంతంలో, అది కూడా ఆదాయం వచ్చే ప్రాంతాల్లో మార్కెట్ విలువలను సవరిస్తుండటం గమనార్హం. మిగిలిన ప్రాంతాల్లో మార్కెట్ విలువలు సవరించినా, సవరించకపోయినా ఒకటే. ఎందుకంటే అక్కడ రిజిస్ట్రేషన్ల ఆదాయం నామమాత్రంగానే ఉంటుంది. అందుకే ఆ ప్రాంతాలను వదిలేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పెంచలేదని ప్రచారం చేసుకోవడానికి దీన్ని వినియోగించుకుంటున్నారు.జగన్ హయాంలో ఒక్కసారి సాధారణ రివిజన్చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2014–19 మధ్య వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒక ఒకసారి మాత్రమే సాధారణ రివిజన్ చేసింది. 2020లో మాత్రమే మార్కెట్ విలువలను రాష్ట్రమంతా సవరించింది. 2022లో కొత్త జిల్లా కేంద్రాలు ఏర్పడడంతో అక్కడ చాలా నామమాత్రంగా, 2023లో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ప్రత్యేకంగా విలువల సవరణ జరిగింది. ఆ ఐదేళ్లలో ఒకసారి మాత్రమే రాష్ట్రమంతా సాధారణ రివిజన్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే రెండోసారి సాధారణ రివిజిన్ చేస్తోంది. రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోవడంతో స్థిరాసుల క్రయవిక్రయాలపై ప్రభుత్వానికి వచ్చే రిజిస్ట్రేషన్ల ఆదాయం క్షీణించింది. దాన్ని కవర్ చేసుకునేందుకే వరుసగా రెండో ఏడాది కూడా మార్కెట్ విలువల్ని సవరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
రేపు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, తాడేపల్లి: రేపు(జనవరి 22, గురువారం) వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు సహా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేత తదితర అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.ఇవాళ(జవనరి 21, బుధవారం) ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. -
శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ పూడ్చివేతకు కమిటీ
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ను పూడ్చివేసి, ఆప్రాన్ను యథాస్థితికి తెచ్చే పనులు చేపట్టేందుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సాంకేతిక నిపుణుల బృందం(టీఈజీ) ఏర్పాటు చేసింది. సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్(డిజైన్స్) వివేక్ త్రిపాఠి అధ్యక్షతన సీడబ్ల్యూసీ డైరెక్టర్లు సోమేష్కుమార్, సమర్థ్ అగర్వాల్, డిప్యూటీ డైరెక్టర్లు అరుణ్ ప్రతాప్సింగ్, మధుకంఠ్ గోయల్, సీఎస్ఎంఆర్ఎస్(సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) శాస్త్రవేత్త మనీష్ గుప్తా, సీడబ్ల్యూపీఆర్ఎస్(సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) శాస్త్రవేత్త ఎంకే వర్మ, జీఎస్ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) డైరెక్టర్ శైలేంద్ర సింగ్ సభ్యులుగా సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసింది.ఈ బృందంలో సభ్యుడిగా చేర్చేందుకు ఇంజినీర్–ఇన్–చీఫ్, సీఈ స్థాయికి తక్కువ కాకుండా ఒక అధికారిని ప్రతిపాదించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. కృష్ణా బోర్డు నుంచి డైరెక్టర్ స్థాయికి తక్కువ కాకుండా ఒక అధికారిని ఈ బృందంలో సభ్యుడిగా చేర్చేందుకు ప్రతిపాదించాలని పేర్కొంది. ఈ నిపుణుల బృందానికి సీడబ్ల్యూసీ డైరెక్టర్ సమర్థ్ అగర్వాల్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. కృష్ణా నదికి వచ్చే భారీ వరదల ఉధృతి ప్రభావం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు ఆప్రాన్ కోతకు గురై పెద్ద గొయ్యి(ప్లంజ్ పూల్) ఏర్పడింది.ఇది శ్రీశైలం ప్రాజెక్టు భద్రతకు సవాల్గా మారింది. తక్షణమే ప్లంజ్ పూల్ను పూడ్చి వేసి, ఆఫ్రాన్ను యథాస్థితికి తేవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ మేరకు సాంకేతిక నిపుణుల బృందాన్ని సీడబ్ల్యూసీ చైర్మన్ నిరుపమ్ ప్రసాద్ ఏర్పాటు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను, డాక్యుమెంట్లను క్షేత్రస్థాయి పర్యటనకు వచి్చనప్పుడు సాంకేతిక నిపుణుల బృందానికి అందించాలని.. ప్రత్యేకమైన అధ్యయనాలు నిర్వహించడానికి యువ అధికారులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక సాంకేతిక నిపుణుల బృందం చేసిన సూచనల మేరకు నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని షరతు విధించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్ అసహనం ప్రాజెక్టు భద్రతపై 2025, మార్చి 6న నిర్వహించిన సమీక్షలో ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్.. మే 31లోగా ప్లంజ్ పూల్, స్పిల్ వేకు మరమ్మతులు చేయాలని ఏపీ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 2025 జూలై 28–29న శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన తక్షణం చేపట్టాల్సిన మరమ్మతులు చేయకపోవడాన్ని ఆక్షేపించారు. ప్లంజ్ పూల్ను శాశ్వతంగా పూడ్చడానికి.. ప్రాజెక్టుకు శాశ్వతంగా మరమ్మతులు చేయడానికి చేయాల్సిన అధ్యయనాలపై సూచనలు చేశారు. కానీ ప్రభుత్వం ఆ పనులను చేపట్టలేదు. -
రాయితీలు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యం
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన రాయితీలను తక్షణం విడుదల చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని చంద్రబాబు ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు అల్టిమేటం జారీ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయం ఎదుట 100 శాతం రాయితీల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. గతంలో మూడుసార్లు సచివాలయాన్ని ముట్టడించినా, అనేకసార్లు ఏపీఐఐసీ ఎదుట ధర్నాలు నిర్వహించినా.. రాయితీలు విడుదల చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పుతూ, మభ్యపెడుతూ కాలయాపన చేస్తోందని వారంతా మండిపడ్డారు.చావనైనా చస్తాం కానీ.. రాయితీలు విడుదల చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం స్థానికంగా ఉండే పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వకుండా విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టే వారికి రాయితీలు ఇస్తామనడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. కాగా, ధర్నా సందర్భంగా ఏపీఐఐసీ కార్యాలయం వద్ద టెంట్లు వేసుకునేందుకు అవకాశం ఇవ్వకుండా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా ‘మాట తప్పిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్.. మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం’, ‘పోలీసుల దౌర్జన్యం నశించాలి’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.నిధులిచ్చే వరకు వెళ్లంఈ సందర్భంగా ఏపీ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనాబాబు మాట్లాడుతూ నూటికి నూరు శాతం నిధులు విడుదల చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. శాంతియుతంగా తలపెట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. అసోసియేషన్ కార్యదర్శి పెనుమాల నాగకుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ భారత రాజ్యాంగం అమలవుతుందా.. రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుందో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అసోసియేషన్ మహిళా ప్రతినిధి కారెం సత్యనారాయణమ్మ మాట్లాడుతూ.. నూరు శాతం రాయితీ నిధులు విడుదల చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట ఇచ్చి తప్పడం వల్ల తాము తిరిగి ధర్నాకు పూనుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాలా నాగలక్ష్మి, జంగా త్రిమూర్తులు, చిన్న మౌలాలి, వరికూటి నీరజ, డాక్టర్ మద్దాల బిందు, కనపర్తి విజయరాజు, సరిహద్దు దయాకర్, కొడాలి రాంబాబు, జగదీష్, వి.భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు. -
పెల్లుబికిన విద్యుదావేశం
సాక్షి,అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చరిత్రలో ఎన్నడూ ఇలా ఒకే ఒక సభ్యుడు వేదికపై ఉండి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం చూడలేదు. ప్రతిసారీ చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండి బహిరంగ విచారణ చేపట్టేవారు. ఈసారి ఒక్కరే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే.’’ అంటూ ప్రజలు, నాయకులు ఏకిపారేశారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమరి్పంచిన 2026–27 ఆదాయ, అవసరాల నివేదికలు,టారిఫ్ ప్రతిపాదనలపై బహిరంగ విచారణ మంగళవారం తిరుపతిలో మొదలైంది.ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీఈఆర్సీ సభ్యుడైన పీవీఆర్ రెడ్డి, ఇన్చార్జ్ చైర్మన్ హోదాలో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు. వేదికపై ఆయన ఒక్కరే కూర్చుని సమస్యలను, సూచనలను వినడంపై అక్కడికి వచ్చిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గడిచిన 20 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని తాము చూడలేదని, రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ చైర్మన్ను, సభ్యుడిని నియమించే తీరిక ఎందుకు లేదని వారంతా ప్రశ్నించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రజలను లోనికి అనుమతించకపోవడంతో ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి ప్రజలను అనుమతించకుండా, అంతా అధికారులే ఉండి విచారణ జరపడం ఏమిటని వారు నిలదీశారు. దీంతో చైర్మన్(ఇన్చార్జి) కల్పించుకుని అందరినీ లోనికి అనుమతించాల్సిందిగా ఆదేశించారు. చార్జీలు పెంచేశారు.. ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వరు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఏపీఈఆర్సీ సాధించిన లక్ష్యాలను, ఇచ్చిన ఆదేశాలను చైర్మన్(ఇన్చార్జి) పీవీఆర్ రెడ్డి వివరించారు. ఆ వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యుత్ వినియోగదారుల నుంచి వినతులను స్వీకరించారు. పలువురు నేతలు పేదల గుడిసెలకు విద్యుత్ సర్విసులు మంజూరు చేయడం లేదని, మీటర్ల కోసం నిరీ్ణత రుసుమును కూడా కట్టించుకున్నారని ఫిర్యాదు చేశారు. అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు పెట్టబోమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు బలవంతంగా పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.వ్యవసాయ విద్యుత్ సర్విసు కోసం దరఖాస్తు చేస్తే నెలలు, సంవత్సరాలు కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్ ఇవ్వకపోవడం వల్ల పంటలు కోల్పోయి రూ.లక్షలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలు భారీగా పెంచేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.4495 కోట్ల భారం ప్రజలపై పడకుండా చేశామని, ఇప్పుడు వసూలు చేస్తున్న ట్రూ అప్ చార్జీలు త్వరలోనే పూర్తవుతాయని, భవిష్యత్తులో ఇక ఉండవని చైర్మన్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడొస్తున్న చార్జీ గతంలో వాడిన దానిపై వేస్తున్నారని వివరించారు. అభిప్రాయసేకరణకు ముందు మూడు డిస్కంల ప్రగతి నివేదికలను సీఎండీలు పి.పుల్లారెడ్డి, ఐ.పృథ్వీతేజ్, శివశంకర్ లోతేటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.యూనిట్ రూ.2.49 ఎక్కువని రూ.4.60కి ఎలా కొంటారు? గత ప్రభుత్వం సెకీతో యూనిట్ రూ.2.49 కి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంటే అది తప్పని సీఎం చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో మాట్లాడి యాక్సిస్ నుంచి రూ.4.60కి యూనిట్ చొప్పున కొనడానికి ఏవిధంగా ఒప్పందం చేసుకుంటారంటూ సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యుడు కందరాపు మురళి ప్రశ్నించారు. ట్రూ డౌన్ చేశామంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ.17 వేల కోట్లు విద్యుత్ భారాలు ప్రజలపై వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టైమ్ ఆఫ్ డే విధానంలో మార్పుల వల్ల 12 శాతం విద్యుత్పై అధిక ధరలు పడతాయని, దానిని మరోసారి పరిశీలించాలని పారిశ్రామిక వేత్త కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. అసలు ఆదాయ లోటు ఎందుకు వస్తోందని, లోపం ఎక్కడుందని విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాలరావు ప్రశ్నించారు. అందరి అభిప్రాయాలనూ ఇన్చార్జ్ చైర్మన్ నమోదు చేసుకున్నారు. -
ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టుకు రావొచ్చు
సాక్షి, అమరావతి: జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీ చేసే ఉత్తర్వులను సవాలు చేస్తూ అధికరణ 226 కింద తమ ముందు దాఖలు చేసే వ్యాజ్యాలకు విచారణార్హత ఉందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్జీటీ చట్టం సెక్షన్ 22 కింద ఉన్న ప్రత్యామ్నాయం ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని, అయితే ఈ సెక్షన్ కింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పింది. సెక్షన్ 22 కింద ఉన్న ప్రత్యామ్నాయం హైకోర్టు తన న్యాయ పరిధి ఉపయోగించకుండా అడ్డుకోలేదంది.చట్ట నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి పర్యావరణ అనుమతులు (ఈసీ) లేకుండా జరిపే మైనింగ్ కార్యకలాపాల వల్ల ప్రభావితమయ్యే ఏ వ్యక్తి అయినా ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 16లో పేర్కొన్న ‘బాధిత వ్యక్తి’ నిర్వచన పరిధిలోకి వస్తారని తెలిపింది. ఎలాంటి కాలుష్యానికి తావు లేకుండా గాలి, నీరు పొందడమన్నది పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కని హైకోర్టు పేర్కొంది. ఈ హక్కుకు భంగం కలిగితే ఏ వ్యక్తి అయినా అందుకు సంబంధించిన చర్యలను సవాలు చేయవచ్చునని పేర్కొంది.ముఖ్యంగా పర్యావరణ అంశాల్లో సంబంధిత గ్రామానికి చెందిన వ్యక్తి ఎవరైనా కూడా ఎన్జీటీ ముందు అప్పీల్ దాఖలు చేయవచ్చునని తేల్చి చెప్పింది. పొట్టిశ్రీరాములు జిల్లా మోమిడి గ్రామంలో సిలికా మైనింగ్ విషయంలో శ్రీకుమారస్వామి మైనింగ్ సంస్థకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పును, చట్ట నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, వాటికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.పర్యావరణ అనుమతులను తాత్కాలికంగా నిలిపేస్తూ ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీకుమారిస్వామి మైనింగ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు వెలువరించింది.


