Amaravati
-
తమిళనాడు ఫలితాలు.. పవన్ ఫీలవుతాడా?
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేరళంలో యూడీఎఫ్ గెలుపు కాస్తా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మరింత గుర్తింపు తెచ్చేందుకు ఉపయోగపడవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్లు డీఎంకేని గెలిపించ లేకపోవడం తండ్రి కొడుకుల పాలనపై ప్రజల అసమ్మతికి నిదర్శనంగా అది ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్లకు ఆందోళన కలిగించే విషయం అవుతుంది. కాగా ప్రముఖ నటుడు విజయ్ రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా, ఒంటరిగా పోటీచేసి అనూహ్యంగా విజయం వైపు దూసుకు వెళుతూండటం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొంత ఇబ్బందికరం అవుతుంది. ఇకపై పవన్ను అందరూ విజయ్తో పోల్చడం.. అతడి విజయం.. ఈతడి ధోరణిపై ప్రశ్నలూ తలెత్తుతాయి. తమిళ ఎన్నికల ఫలితం వైఎస్సార్ కాంగ్రెస్కూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే చంద్రబాబు తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసినా ఎన్డీయేని గెలిపించలేకపోయారని, అదే సమయంలో కొన్ని సభల్లో జగన్ ఫొటోను ప్రదర్శించిన టీవీకే పార్టీ నేత విజయ్ గెలుపు బాటలో ఉండటం వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.జగన్ మాదిరిగా విజయ్ కూడా ఒంటరిగా పోటీలోకి దిగడం ఇంకో సారూప్యత. గట్టిగా కృషి చేస్తే పశ్చిమబెంగాల్లో మాదిరిగా తామూ గెలిచే అవకాశం ఉందన్న ఆశ ఈ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి కలిగిస్తాయి. అదే టైమ్ లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉన్న బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల ద్వారా తన వ్యూహాలను పునఃసమీక్షించుకునే అవకాశం ఉంది. అసోంలో బీజేపీ గెలుపు అన్నది ఊహించిందే. పశ్చిమబెంగాల్ లో పై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆ స్థాయిలో కేంద్రీకృతం చేసిన తర్వాత, ఓట్ల జాబితా ప్రత్యేక సవరణ హడావుడి తర్వాత అక్కడ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నది బహిరంగ రహస్యమే.ఈ వ్యూహాలను గుర్తించి కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్ పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉందో లేదో తెలియదు. కాని ఆ వైపు ఆలోచించి ఉంటే ఎలా ఉండేదో! కేరళంలో ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు ఛాన్స్ ఉందని ఊహించిన పరిణామమే. కాగా అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీయే తిరిగి వస్తుందన్న అంచనాకు తగినట్లే జరిగింది. అన్నిటికన్నా సంచలనం తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీచేసి డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కు నెట్టేయడం. అందరి సలహాలను కాదని విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగడం ఒక రకంగా సాహసమే.దేశ రాజకీయాలలో బీజేపీ హవా కొనసాగే విధంగానే ఈ ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. మోడీ, అమిత్ షా ల కాంబినేషన్ కు ఇప్పట్లో తిరుగులేదన్న అభిప్రాయం కలుగుతుంది. కేరళంలో కూడా బీజేపీ తన వంతు ప్రయత్నం చేసినా, వారికి ఓట్లశాతం పెరుగుతుందే తప్ప సీట్లు పెద్దగా రావని అందరికి తెలుసు. దేశంలో ఉన్న ఏకైక వామపక్ష రాష్ట్రం కేరళంలో ఈసారి సీపీఎం ఆధ్వర్యంలోని ఆధ్వర్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ ఓడిపోవడం వామపక్షవాదులకు నిరాశ కలిగిస్తుంది. అక్కడ గెలిచిన యూడీఎఫ్ వల్ల కాంగ్రెస్ ఆశలు కొద్దిగా చిగురిస్తాయి. కాని తమిళనాడులో మిత్రపక్షం డీఎంకే పరాజయం చవిచూడడం ఇండియా కూటమికి పెద్ద దెబ్బ అవుతుంది.పశ్చిమబెంగాల్లో మూడు టర్మ్లుగా అధికారంలో ఎన్న టీఎంసీపై వ్యతిరేకత ఏర్పడటం సహజం. బీజేపీ అగ్ర నాయకత్వం కూడా ప.బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, ఎన్నికల సంఘం తన వంతు పాత్ర పోషించడం వంటివి కూడా కలిసిరావడంతో బీజేపీ కల నిజమవుతోందని చెప్పాలి. ఎంత పోరాడినా మమత బెనర్జీ ఆమె పార్టీ చివరికి ఓడిపోక తప్పలేదు. ఏపీలో జనసేనను స్థాపించిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ సొంత అజెండా అనేది ఏదీ లేకుండా.. తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్న వైనం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తుంది.విజయ్కు ఉన్న ధైర్యం పవన్కు లేకుండా పోయిందని, సీఎంను అవుతానంటూ కాపు సామాజికవర్గాన్ని ఊరించిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత చంద్రబాబుకు అతి విధేయుడుగా మారిపోవడం ఆ వర్గానికి అంతగా రుచించడం లేదు. పైగా ఇప్పుడు ఏకంగా 15 ఏళ్లు టీడీపీని భుజాన మోస్తానని చెబుతున్న వైనం మద్దతుదారులకు విసుగు తెప్పిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అంతగా నచ్చవు. పైకి బీజేపీని అభినందించినా, లోపల మనసులో మాత్రం బీజేపీ బెంగాల్ ఓడిపోయి ఉంటే,తమ ప్రాధాన్యత పెరిగి ఉండేదని టీడీపీ నేతలు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధాని మోడీని, హోం మంత్రి అమిత్ షాను మరింతగా పొగడక తప్పదని లోలోపల మథన డుతూండవచ్చు. మరో కీలకమైన అంశం ఏమిటంటే తమిళనాడులో స్టాలిన్ ఉదయనిధిలు ఏపీలో మాదిరి రెడ్బుక్ అరాచకాలు చేయకపోయినా డీఎంకే ఓటమిపాలైంది. ఒక రకంగా ఆలోచిస్తే జనం కుటుంబ పాలనను వ్యతిరేకించారన్నమాట. ఇక ఏపీలో పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలను అమలు చేయలేని స్థితిలో ఉన్నారు. పాలనా వైఫల్యంతో చంద్రబాబు ఉంటే, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ షాడో సీఎంగా వ్యవహరిస్తూ రెడ్ బుక్ అంటూ పోలీసులతో అరాచకాలు చేయిస్తున్నారు. అలాగే అత్యంత విలువైన విశాఖ భూములను తమ ఇష్టారీతిన 99 పైసలకే కట్టబెడుతున్న తీరుపై టీడీపీ వీర మద్దతుదారుగా పేరొందిన మాజీ పోలీసు అధికారి ఎ బి వెంకటేశ్వరరావు వంటివారు మండిపడుతున్నారు.అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీపై అంతా విస్తుపోతున్నారు. స్టాలిన్, ఉదయనిధిలు అరాచకాలు, విపక్షంపై వేధింపులు వంటివి చేయకపోయినా ఓటమిపాలయ్యారని, అలాంటిది ఏపీలో ఇంత దారుణమైన పరిస్తితులు ఉంటే జనం సహిస్తారా అన్నది చర్చగా ఉంది. అంతేకాక వచ్చే మూడేళ్లలో తెలుగుదేశంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో చెప్పలేం. జూనియర్ ఎన్టీఆర్ వంటివారిని ఇంతకాలం దూరంగా ఉంచిన నేపథ్యంలో టీడీపీని మళ్లీ నందమూరి వంశం అధీనంలోకి తీసుకురావాలని ఒక వేళ ఆయన ఆలోచన చేస్తే రాజకీయాలు ఎటు మళ్లుతాయో ఇప్పటికిప్పుడు ఊహింలేం.కేరళం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుతో రేవంత్కు ఉత్సాహం రావచ్చు.కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో ఆయన ప్రాధాన్యత పెరుగుతుంది. కాని బెంగాల్ లో విజయంతో బీజేపీ తెలంగాణలో ఏ గేమ్ ఆడుతుందో అన్న భయం ఉండవచ్చు. తమిళనాడు ఫలితాలు మాత్రం చంద్రబాబు, లోకేశ్ లకు నిద్ర లేకుండా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరీ అంత సీరియస్ రాజకీయాలు చేయడం లేదు కనుక, సొంత వ్యక్తిత్వంతో రాజకీయ పార్టని నడపాలన్న లక్ష్యంతో లేరు కనుక ఆయన పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. జగన్ కు మాత్రం తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరింత ఆత్మ విశ్వాసాన్ని నింపే అవకాశం ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
రూ.5 వేల కోట్ల కొండను కొట్టేస్తున్నారు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మాటలకు, చేతలకు సంబంధం ఏమాత్రం లేదని మరోమారు స్పష్టమైంది. ప్రకృతి వనరులను అడ్డగోలుగా దోచుకో.. పంచుకో.. అంటూ బరితెగిస్తోంది. నట్టనడి అడవిలో విలువైన ఖనిజాలను కొల్లగొట్టడానికి ఏమాత్రం ఆలోచించకుండా అడ్డగోలుగా అనుమతులిచ్చేస్తోంది. ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగోలేని, కనీసం ఫైన్ చెల్లించని సంస్థకు పెద్దపీట వేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ అటవీ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మైనింగ్ కుంభకోణాలకు అడ్డాగా మారింది.తాజాగా చాగానం, మొలకలపొండ్ల గ్రామాల సరిహద్దుల్లోని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన మైకా, క్వార్ట్జ్ ఖనిజాలను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు రంగం సిద్ధం చేశారు. పర్యావరణ అనుమతులు (ఈసీ) రాకముందే, అధికారికంగా లీజు ఒప్పందం కుదరకముందే అక్కడ ఖనిజాలను యంత్రాలతో యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం వేలం నిర్వహించకుండా ఈ అక్రమ తవ్వకాలకు తెరలేపారు. అక్రమాలను సక్రమం చేసుకునేందుకు పదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న దరఖాస్తును ఇప్పుడు హడావుడిగా బయటకు తీసి, ఆగమేఘాల మీద క్లియర్ చేయించారు. అటవీ భూములను కాపాడాల్సిన వారే వాటిని అక్రమార్కులకు అప్పగించడం వెనుక భారీ కుట్ర దాగి ఉంది. పదేళ్ల నిద్ర.. పది రోజుల్లో మేల్కొలుపు పదేళ్లు పెండింగ్లో ఉన్న ఈ లీజు ఫైలుకు ఉన్నట్టుండి కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే గ్రీన్ సిగ్నల్ రావడం వెనుక కీలక నేత హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. సైదాపురం మండలం చాగానంలో సర్వే నంబర్ 505, మొలకొలపొండ్లలో సర్వే నంబర్ 528లో 10.02 హెక్టార్లలో (25 ఎకరాలు) క్వార్ట్జ్, మైకా లీజు కోసం ది కృష్ణా మైనింగ్ కంపెనీ (మేనేజింగ్ పార్టనర్ భరత్) 2014 అక్టోబర్ 9న దరఖాస్తు చేసుకుంది. ఇది అటవీ భూమి కావడం, పర్యావరణ నిబంధనల ప్రకారం అక్కడ ఖనిజ తవ్వకాలకు అనుమతి లేకపోవడంతో ఈ దరఖాస్తు అప్పటి నుంచి పెండింగ్లోనే ఉంది.కానీ 2024 అక్టోబర్ తర్వాత దీనికి అకస్మాత్తుగా రెక్కలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మైకా, క్వార్ట్జ్ వంటి ఖనిజాలను మేజర్ మినరల్స్ జాబితాలోకి చేర్చి వాటికి బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజులు ఇవ్వాలని గెజిట్ ఇచ్చిన సమయంలోనే కూటమి ప్రభుత్వం తన పరిధిని వాడుకుంటూ పాత దరఖాస్తును క్లియర్ చేయడం గమనార్హం. 2025 నవంబర్ 3న జీఓ ఎంఎస్ నెంబర్ 64 జారీ చేసి అటవీ భూమి మళ్లింపునకు తుది అనుమతులు ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ తరహా దరఖాస్తులు లెక్కనేనన్ని పెండింగ్లో ఉన్నప్పటికీ, ఈ ఒక్క దరఖాస్తుకు మాత్రమే క్లియరెన్స్ లభించడం ఇందుకు తార్కాణం. గతంలో పట్టుబడ్డ అక్రమార్కుడికే మళ్లీ పట్టం సాధారణంగా ప్రభుత్వానికి బకాయిలు ఉన్న కంపెనీలకు కొత్త లీజులు ఇవ్వకూడదు. కానీ కృష్ణా మైనింగ్ కంపెనీ గతంలోనే అక్రమ తవ్వకాలు జరపడంతో ప్రభుత్వం రూ.11.66 కోట్ల జరిమానా విధించింది. ఆ డబ్బు ఇప్పటికీ కట్టలేదు. అలాంటి బ్లాక్ లిస్టు కంపెనీకి మళ్లీ 10.02 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని అప్పగించడం వెనుక నెల్లూరు జిల్లా అధికార పార్టీ పెద్దలతో పాటు ఉండవల్లి, మంగళగిరి పెద్దల హస్తం ఉన్నట్లు సమాచారం. 2025 డిసెంబర్ 16న జీఓ ఆర్టీ నెంబర్ 229 ద్వారా ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించి కొత్తగా మారిన కేంద్ర చట్టాలను పక్కన పెట్టి పాత మైనర్ మినరల్ నిబంధనల కిందే వెసులుబాటు కలి్పంచారు. లీజు రాకుండానే లూటీ నిబంధనల ప్రకారం లీజు ఖరారైన తర్వాతే తవ్వకాలు జరగాలి. కానీ ఈ కంపెనీ ఇప్పటికే 20 వేల టన్నుల నుంచి 30 వేల టన్నుల ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించేసినట్లు తెలుస్తోంది. మైనింగ్ ప్రాంతంలో ఉన్న లోతైన గుంతలే ఇందుకు నిదర్శనం. ఎన్జీటీ నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలు చేస్తున్నట్లు తెలిసింది. అటవీ భూముల మళ్లింపునకు అనుమతి ఇచ్చినా ఇంకా పర్యావరణ అనుమతులు (ఈసీ) రాలేదు. త్వరలో ఈసీ అనుమతి కోసం పబ్లిక్ హియరింగ్ జరగనుంది. కానీ ఈలోపే అక్రమార్కుల యంత్రాలు అడవిని తవ్వేస్తున్నాయి. వందల దరఖాస్తులు పెండింగ్.. ఈ ఒక్కటి మాత్రమే క్లియర్ రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూముల్లో మైనింగ్ కోసం దాదాపు 200 దరఖాస్తులు పెండింగ్లో ఉంటే, అందులో ఒక్క నెల్లూరు జిల్లావే 80 దరఖాస్తులున్నాయి. ఇవి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఒక్క సంస్థ దరఖాస్తును మాత్రమే అత్యవసరంగా క్లియర్ చేశారు. అసలు అడవిని తవ్వడానికి తాను ఏమాత్రం ఒప్పుకోనని, పర్యావరణం అంటే తనకు ప్రాణమని లెక్చర్లిచ్చే నేత ఈ దందాకు ఎలా అంగీకరించారని సదరు శాఖలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. భారీగా ముడుపులు అందడం తప్ప మరేమీ కాదని ప్రచారం జరుగుతోంది.వేల కోట్ల సంపద.. నామమాత్రపు లీజులు సైదాపురం ప్రాంతంలో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ఖనిజ సంపదకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. ప్రస్తుతం చాగానం, మొలకొలపొండ్లలో ఉన్న ఖనిజం విలువ రూ.వేల కోట్లలోనే ఉంటుంది. కానీ గనుల శాఖ కేవలం రూ.9 లక్షల ప్రీమియం మాత్రమే కట్టాలని ఆ సంస్థకు డిమాండ్ నోటీసు ఇచి్చంది. ఈసీ రాక ముందే అటవీ భూమిని మళ్లించడం, వ్యవస్థలన్నీ ఆ కంపెనీ కోసం ఏకమై పని చేయడం చూస్తుంటే ఈ అక్రమాల వెనుక ఎంత పెద్ద లాబీయింగ్ ఉందో అర్థం చేసువకోవచ్చు. అటవీ భూమిని ఈ సంస్థకు దారాదత్తం చేయడం వెనుక రూ.100 కోట్లు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంస్థ నుంచి ఈ లీజును చేజిక్కించుకున్న నెల్లూరు ఎంపీ ప్రధాన అనుచరుడు తెర వెనుక చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ‘ఉప’ నేతకు కూడా డబ్బు కొట్టి ఒప్పించినట్లు తెలిసింది. -
కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల్లేవు
సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెండు నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సర్వీసు కాలం ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగిసింది. సర్వీసు కాలాన్ని పొడిగించకుండా ఆర్థిక శాఖ తాత్సారం చేస్తుండడంతో వేతనాలు నిలిచిపోయాయి.సర్వీసు కాలం పొడిగిస్తూ ఆర్థిక శాఖ జీఓ జారీ చేస్తేగానీ వీరికి వేతనాలు రావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు నిధి పోర్టల్లో వీరి వివరాలు నమోదు కాలేదనే సాకుతో ఆర్థికశాఖ మార్చి నెల వేతనాలు కూడా చెల్లించలేదు. గతంలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పొడిగిస్తూ ఆర్థికశాఖ జారీ చేసిన గడువు మార్చితో ముగిసింది. దీంతో ఏప్రిల్ వేతనాలనూ చెల్లించలేదు.సాధారణంగా ఏటా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్థికశాఖ జీఓలు జారీ చేస్తుంది. గతంలో జారీచేసిన జీఓ గడువు మార్చి నెలాఖరుతో ముగిసినప్పటికీ మే వచ్చినా వారి సర్వీసు పొడిగింపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేయలేదు. రెండు నెలల నుంచి జీతాలు లేకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారు. -
మనోడైతే ఇచ్చేద్దాం
సాక్షి, అమరావతి: ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగులైనా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన సంస్థ ఉద్యోగులైనా పదోన్నతి కల్పించడానికి, వేతనాలు పెంచడానికి వారి అర్హత, పనితీరే కొలమానం. కానీ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్)లో మాత్రం అందుకు భిన్నంగా నడుస్తోంది. అధికార పార్టీకి సానుభూతిపరులైతే చాలు.. అర్హత లేకున్నా పనితీరు తీసికట్టుగా ఉన్నా.. ప్రతిభ లేకపోయినాసరే పదోన్నతి ఇచ్చేస్తున్నారు. వేతనాలు భారీగా పెంచేస్తున్నారు.అర్హత ఉండి.. మెరుగైన పనితీరు కనబరుస్తూ.. లక్ష్యాల సాధనలో ప్రతిభ చాటుతున్న ఉద్యోగులకు పదోన్నతి, వేతనాలు పెంచడానికి ముడుపులు వసూలు చేస్తున్నారు. ఏమిటీ అన్యాయమని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై సీఈవో, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించి సస్పెండ్ చేయిస్తున్నారు. పదోన్నతి కల్పించకుండా, వేతనాలు పెంచకుండా వేధింపులకు గురిచేస్తున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టిల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు పెట్టుబడులను ఆకర్షించడం.. వాటిని నిర్వహించడమే లక్ష్యంగా 2016లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏపీయూఐఏఎంఎల్ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 49 శాతం కాగా.. ఐఎల్అండ్ ఎఫ్ఎస్ వాటా 51 శాతం. నష్టాలు వచ్చిన విభాగాల్లో పదోన్నతులు, వేతనాల పెంపు రాష్ట్రంలో 8 విభాగాల్లో ఏపీయూఐఏఎంఎల్ సేవలందిస్తోంది. 243 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే సంస్థలో కొత్త పదవి సృష్టించి.. అందులో టీడీపీ సానుభూతిపరుడిని నియమించారు. నెలకు వేతనం రూ.3,94,240 చెల్లిస్తున్నారు. ఐఏఎస్ అధికారికి కూడా ఈ స్థాయి వేతనం ఉండదు. దీంతోపాటు టీడీపీ సానుభూతిపరులైన ముగ్గురు ఉద్యోగులకు సీఈవో కార్యాలయం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల్లో పోస్టింగ్లు ఇచ్చారు. వారికి వరుసగా నెలకు రూ.2,46,400, రూ.1.90 లక్షలు, రూ.1.75 లక్షల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు.ఈ నలుగురు కలిసి ఉద్యోగులు టీడీపీ సానుభూతిపరులైతే అర్హత లేకున్నా.. పనితీరు సక్రమంగా లేకున్నా పదోన్నతి కల్పించి, వేతనాలు పెంచేలా చక్రం తిప్పుతున్నారు. ఎకనమిక్ డెవలప్మెంట్ (ఈడీ), అర్బన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ (యూఐడీ), పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విభాగాల్లో మాత్రమే ఈ సంస్థలకు లాభాలు వస్తున్నాయి. మిగతా 5 విభాగాల్లోనూ నష్టాలే. 2025–26లో ఈ సంస్థకు రూ.19.99 కోట్ల ఆదా యం వస్తే.. ఖర్చులు రూ.12.48 కోట్లు పోగా రూ.7.51 కోట్లు లాభాలు వచ్చాయి.ఈడీ విభాగంలో రూ.7.81 కోట్ల లాభం రాగా.. యూఐడీలో రూ.1.29 కోట్లు, పీపీపీ విభాగంలో రూ.61.65 లక్షల లాభాలు వచ్చాయి. ఇందులో తక్కువ లాభం వచ్చిన పీపీపీ విభాగంలో ఓ ఉద్యోగికి వేతనాలు పెంచి నెలకు రూ.4,63,050 చొప్పున ఇస్తున్నారు. టీడీపీ సానుభూతిపరుడనే ఏకైక కారణంతో ఇటీవల బీడీడీ విభాగంలో ఓ ఉద్యోగిని తీసుకుని నెలకు రూ.3,85,714 చొప్పున వేతనం ఇస్తున్నారు. టీడీపీ సానుభూతిపరులైన ఉద్యోగులకు లేదా ముడుపులు ఇచ్చిన వారికి నెలకు గరిష్టంగా రూ.4.63 లక్షల నుంచి కనిష్టంగా రూ.1.42 లక్షల చొప్పున వేతనాలు ఇస్తున్నారు.అన్యాయాన్ని ప్రశ్నిస్తే సస్పెన్షన్ నజరానా తమకు అప్పగించిన విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచి.. తమ ప్రతిభ ఆధారంగా లాభాలు తెచ్చిన ఉద్యోగులకు పదోన్నతి కల్పించకుండా, వేతనాలు పెంచకుండా వేధిస్తున్నారని వాపోతున్నారు. ఏమిటీ అన్యాయమని ఎవరైనా ప్రశ్నిస్తే... సీఈవోకు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించి వారిపై సస్పెన్షన్ వేటు వేయిస్తున్నారు. లేదంటే మెమోలు ఇప్పించి వేధిస్తున్నారు. కన్సల్టెంట్గా పనిచేస్తున్న షేక్ అజీమ్ అహ్మద్పై ఇదే రీతిలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి సస్పెన్షన్ వేటు వేయించారని ఉద్యోగులు తెలిపారు.తమ మాట వినకుండా ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వకుండా, వేతనాలు పెంచకుండా ఆ నలుగురూ మోకాలడ్డుతున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయ సంస్థ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. కానీ.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ అయిన ఏపీయూఐఏఎంఎల్ సిబ్బందికి మాత్రం ప్రభుత్వ నిధులతో ప్రతినెలా ఠంఛనుగా జీతాలు ఇస్తుండటం గమనార్హం. -
చరిత్రలో శాశ్వత వెన్నుపోటుదారు ఏబీఎన్ రాధాకృష్ణ
సాక్షి, అమరాతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి నిప్పులు చెరిగారు. రాధాకృష్ణను ఉద్దేశించి ఆదివారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ‘రాధాకృష్ణా నీ బాస్కి, నీకు, రామోజీకి వెన్నుపోటుదారులనే బిరుదు చరిత్ర పుటల్లో శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు హీరోలంటూ ఎంత కలరింగ్ ఇచ్చుకున్నా లాభం లేదు. ఎందుకురా బతుకంతా అబద్ధాలతో బతుకుతారు. ఛీకొట్టినా మీ బతుకులంతే. ఒక్క ప్రశ్న అడుగుతాను. నేను చేసిన తప్పేమిటి? ఒక్క రుజువు చూపించారా.పోనీ.. ఎమ్మెల్యేలు ఎన్టీఆర్కు వ్యతిరేకం అయితే టీడీఎల్పీ మీటింగ్ పెట్టి అందులో తమ నాయకుడిని ఎన్నుకోవచ్చు కదా? కనీసం అసెంబ్లీలో ఎన్టీఆర్ గారు ఏం చెప్పేవారో ఆయనను మాట్లాడనివ్వొచ్చు కదా? ఎన్నికల ముందే మీ సీబీఎన్ ఎమ్మెల్యే కాండిడేట్స్కు డబ్బులెందుకు పంచారు. వైశ్రాయ్ హోటల్లో లిక్కర్ సిండికేట్తో కుమ్మక్కయి ఎమ్మెల్యేలతో బేరాలు చేసింది ఎవరు? ఎన్టీఆర్ గారు హోటల్ దగ్గరకు వస్తే చెప్పులేసింది ఎందుకు? జర్నలిస్టులందరికీ నువ్వు(రాధాకృష్ణ) డబ్బు పంపిణీ చేసి తప్పుడు రాతలు రాయించలేదా? పార్టీ నుండి ఎన్టీఆర్ను సస్పెండ్ చేసింది మీ చంద్రబాబే కదా?. ఎన్నికల్లో రాష్ట్రమంతా నేను, ఎన్టీఆర్ ఇద్దరమే కదా తిరిగాము. ప్రజలు 256 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు.ఎనిమిది నెలలు తిరగకముందే నన్ను బూచిగా చూపించి ఆయన పదవి లాగేసిన నీచులు మీరు కదా? కష్టపడిన మా ఇద్దరి జీవితాలు నాశనం చేసిన దుర్మార్గులు మీరే కదా? నా తప్పేమిటో ఆ రోజే మీటింగ్లో పెట్టి ఉంటే తెలిసేది. అప్పుడు ఎన్టీఆర్ మీద, ఇప్పుడు జగన్ మీద మీ అబద్ధాల చెత్త పలుకులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ముందు నీ చెత్తపలుకులో ఎన్టీఆర్ జామాత దశమ గ్రహం క్యాసెట్ మీద, ధర్మపీఠంలో స్వయంగా చెప్పిన వీడియో మీద ఒక పలుకు పలికితే జర్నలిస్ట్గా కొంచెమైనా న్యాయం పాటించిన వాడివి అవుతావు. ధైర్యం ఉంటే నా ఈ లెటర్ నీ పేపర్లో వెయ్యి. అయినా మీలాంటి వెన్నుపోటుదారులకు నిజాయితీ ఎక్కడుంటుంది. మీ పాపాలు పండే సమయం దగ్గర్లోనే ఉంది. అప్పుడు రాద్దువుగాని సరికొత్త పలుకు’ అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. -
సరళంగా నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం
సాక్షి, అమరావతి: దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన అర్హత పరీక్ష నీట్ యూజీ–2026 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఏడాది నీట్ ప్రశ్నపత్రం సరళంగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. గత ఏడాది పేపర్ కఠినంగా ఉందని, దానితో పోలిస్తే ఈ దఫా సులభంగా ఉందని పేర్కొన్నారు. దీంతో 2025తో పోలిస్తే ఈసారి కటాఫ్ పెరగనున్నట్టు తెలుస్తోంది. నీట్ యూజీ రాయడానికి దేశ వ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి దేశ వ్యాప్తంగా 5432 కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్ష నిర్వహించింది. ఊరటనిచ్చిన ఫిజిక్స్ గత రెండేళ్లుగాఫిజిక్స్ విద్యార్థులను భయపెడుతుండగా, ఈసారి మాత్రం కొంత ఊరటనిచ్చింది. ఫిజిక్స్ విభాగంలో ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్టు సబ్జెక్టు నిపుణులు తెలిపారు. గతేడాది అన్ని ప్రశ్నలూ కఠినంగా రాగా, ఈ సారి పది ప్రశ్నలు మాత్రమే కఠినంగా ఉన్నట్టు చెబుతున్నారు. జువాలజీ కూడా ఈ సారి తేలికగా ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. బయాలజీలో ప్రశ్నలను సులభం నుంచి మధ్యస్థంగా వర్గీకరించారు. ప్రశ్నలన్నీ పూర్తిగా ఎన్సీఈఆర్టీ పరిధి నుంచే వచ్చాయి. అయితే, గతంలోలా నేరుగా అడిగే ప్రశ్నల కంటే మ్యాచింగ్, అసెర్షన్–రీజనింగ్ ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ప్రతి ఆప్షన్ను నిశితంగా పరిశీలించాల్సి వచ్చిందని విద్యార్థులు వెల్లడించారు. ఇది తమ సమయాన్ని కొంత హరించిందని అభిప్రాయ పడ్డారు. కెమిస్ట్రీలో ఆర్గానిక్, ఇన్–ఆర్గానిక్ ప్రశ్నలు నేరుగా వచ్చాయి. కానీ, ఫిజికల్ కెమిస్ట్రీలో కొన్ని లెక్కలు సంక్లిష్టంగా ఉండటంతో సగటు విద్యార్థికి సమయం సరిపోలేదని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద మలి్టపుల్ స్టేట్మెంట్ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. స్వల్పంగా కటాఫ్లు పెరుగుతాయి గత ఏడాదితో పోలిస్తే పేపర్ తేలికగా ఉంది. ఈ క్రమంలో కటాఫ్లు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. పేపర్ మధ్యస్థంగా ఉన్నప్పుడు, ఎక్కువ మంది విద్యార్థులు ఒకే రకమైన మార్కులు సాధిస్తారు. దీంతో కటాఫ్లు పెరిగే అవకాశం ఉంది. – కె.రవీంద్ర కుమార్, నీట్ కో–ఆర్డినేటర్, ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఆలస్యం.. విషం ‘నీట్’ రాయకుండానే వెనుదిరిగిన విద్యార్థిని ఏఎన్యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకోవడంతో ఓ విద్యార్థిని పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకే విద్యార్థిని పరీక్ష కేంద్రానికి చేరుకుంది. పరీక్ష 2 గంటలకు అని సిబ్బంది చెప్పడంతో ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థిని 10 నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకుంది. అప్పటికే ప్రధాన ద్వారం మూసేశారు. లోపలికి పంపాలని సిబ్బందిని ఆ విద్యార్థిని, ఆమె తండ్రి ప్రాథేయపడ్డారు. అయినప్పటికీ పరీక్షకు అనుమతించకపోవడంతో విద్యార్థిని కన్నీరుమున్నీరుగా విలపించింది. -
వెలగపూడి ప్యాలెస్లో ‘భూ’మాయాజాలం!
సాక్షి, అమరావతి: రాజధానికి భూ సమీకరణ కింద భూమి ఇచ్చిన తనకు అభివృద్ధి చేసిన నివాస స్థలం (రెసిడెన్షియల్ ప్లాటు), వాణిజ్య స్థలం (కమర్షియల్ ప్లాటు) ఇస్తామని చెప్పి.. చెరువులో పల్లపు ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్లాటు ఇచ్చారని.. మరో చోట తనకు ప్లాటు కేటాయించాలని పదే పదే కోరుతున్నా సీఆర్డీఏ స్పందించడం లేదని 2025 డిసెంబర్ 26న మందడంలో నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ కుప్పకూలి కన్నుమూశారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన అనేక మంది రైతులదీ ఇదే పరిస్థితి. కానీ.. సీఎం చంద్రబాబు కుటుంబం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలకు మాత్రం వారు ఎలా కావాలంటే అలా ప్లాట్లను సీఆర్డీఏ కేటాయించడం.. అందులో మార్పులు చేయడం చేసేస్తోంది. దీనికి తార్కాణం రాజధాని ప్రధాన ప్రాంతం (కోర్ కేపిటల్ ఏరియా)లో శాశ్వత సచివాలయం టవర్లు, శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవంతులు నిర్మిస్తున్న ప్రాంతానికి కూత వేటు దూరంలో, వెలగపూడికి సమీపంలో అత్యాధునిక వసతులతో రూ.వందల కోట్ల వ్యయంతో సీఎం చంద్రబాబు కుటుంబం 25 వేల గజాల్లో (5.17 ఎకరాలు) నిర్మిస్తున్న ప్యాలెస్సే అందుకు తార్కాణం. రాజధానిలోని వెలగపూడిలో కంచెర్ల సాంబశివరావుకు చెందిన సర్వే నంబరు 142–బీ, 142–సీ, 89లోని 4.41 ఎకరాలు, కంచెర్ల శాంతికిరణ్కు చెందిన సర్వే నంబరు 136–సీ, 160, 163–బీ, 184–బీలోని 11.10 ఎకరాలు, కంచెర్ల ఓంకార్కు చెందిన సర్వే నంబరు 136–సీ, 85, 89లోని 14.01 ఎకరాలు.. మొత్తం 29.52 ఎకరాలను భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ఇందుకుగానూ రాజధాని ప్రధాన ప్రాంతం వెలగపూడిలో సర్వే నంబరు 111, 112, 113, 122, 150, 152, 239లోని 5.16 ఎకరాలను (25 వేల చదరపు గజాలు) కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల శాంతికిరణ్, కంచెర్ల ఓంకార్, కాట్రగడ్డ గీతాశ్రీలకు సీఆర్డీఏ రిటర్నబుల్ ప్లాట్ల కింద ఇచ్చింది. ఆ ప్లాట్లను సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి ట్రస్టీగా ఉన్న నివాస ట్రస్టు పేరు మీద రూ.18.75 కోట్లకు 2025 ఏప్రిల్ 2న కొనుగోలు చేశారు. ఆ మేరకు మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కొనుగోలు చేసిన భూమికి ఉత్తరం వైపున పాసివ్ జోన్ (హరిత ప్రాంతం), దక్షిణం వైపున రెసిడెన్షియల్ ఖాళీ స్థలం, తూర్పు వైపున 17 మీటర్ల రోడ్డు, పశ్చిమ వైపున 25 మీటర్ల రోడ్డును హద్దులుగా పేర్కొన్నారు. రెసిడెన్షియల్ ఖాళీ ప్రాంతాన్ని హరిత ప్రాంతంగా ఎవరి కోసం మార్చారు? నారా బ్రాహ్మణి 25 వేల గజాలను కొనుగోలు చేశాక ఆ ప్లాటు హద్దులు మారిపోయాయి. దక్షిణం వైపున రెసిడెన్షియల్ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా సీఆర్డీఏ మార్చేసింది. 3,670 గజాల రెసిడెన్షియల్ ఖాళీ స్థలం హరిత ప్రాంతంగా మారిపోయింది. ఎవరి ఒత్తిడితో ఇలా చేశారని రాజధాని రైతులు నిలదీస్తున్నారు. ఆ భూమి రెసిడెన్షియల్ ఖాళీ ప్రాంతంగా ఉండి ఉంటే.. ఎకరం చొప్పున రాజధానికి భూములు ఇచ్చిన ముగ్గురు రైతులకు వెయ్యి గజాల చొప్పున రెసిడెన్షియల్ ప్లాట్లు కేటాయించే అవకాశం ఉండేదంటున్నారు. చెరువుల్లో, ముంపు ప్రాంతంలో రైతులకు కేటాయించిన రెసిడెన్షియల్ ప్లాట్లను.. ఆ ఖాళీ స్థలంలోకి మార్చే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. దీని వల్ల తమకు తీవ్రంగా అన్యాయం జరిగిందని రైతులు మండి పడుతున్నారు. ఇక భూ సమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ఇచ్చిన నివాస స్థలాలు (రెసిడెన్షియల్ ప్లాట్) గజం రూ.50 వేలు పలుకుతుందని ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలో సీఆర్డీఏ లెక్కగట్టింది. వాణిజ్య (కమర్షియల్) ప్లాట్ ధర రూ.2.70 కోట్లుగా చూపింది. ఎకరం భూమిని సమీకరణ కింద ఇచ్చిన రైతులకు.. పదేళ్లపాటు కౌలు కింద రూ.7,25,000, నివాస స్థలం (వెయ్యి గజాలు.. గజం రూ.50 వేల చొప్పున) రూ.5 కోట్లు, వాణిజ్య స్థలం రూ.2.70 కోట్లు వెరసి రూ.7,77,25,000 ప్రయోజనం చేకూరుతుందని సీఆర్డీఏ లెక్కలు వేసింది. ఈ లెక్కన 3,670 గజాల రెసిడెన్షియల్ ఖాళీ స్థలాన్ని హరిత ప్రాంతంగా మార్చేయడం వల్ల సీఆర్డీఏకు రూ.18.35 కోట్ల మేర నష్టం వాటిల్లిందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవ ధర గజం రూ.7,500 లేనా? లేక మోసం చేశారా?వెలగపూడిలో సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి 25 వేల గజాలను రూ.18.75 కోట్లకు కొనుగోలు చేశారంటే గజం ధర రూ.7,500. అక్కడ రెసిడెన్షియల్ స్థలం ధర వాస్తవంగా గజం రూ.7,500లేనా అని మేధావులు, రైతులు ప్రశ్నిస్తున్నారు. లేదంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేశారా? అని నిలదీస్తున్నారు. ఒకవేళ ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ఉంటే.. రిజిస్ట్రేషన్ ఫీజు ఎగ్గొట్టినట్లేనని స్పష్టం చేస్తున్నారు. ఆ క్రమంలో ఆదాయపు పన్ను కూడా ఎగ్గొట్టినట్లేనని తేల్చి చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కోడలు కొనుగోలు చేసిన భూమి ధరను బట్టి చూస్తే.. ప్రధాన రాజధాని ప్రాంతంలో ఎకరం ధర రూ.3.63 కోట్లే. రాజధాని నిర్మాణ పనుల కోసం ఇప్పటికే రూ.47,387 కోట్లను చంద్రబాబు సర్కార్ అప్పు చేసింది. ఈ లెక్కన ఆ అప్పును వడ్డీతో సహా తీర్చాలంటే కనీసం 15 వేల ఎకరాలు అమ్మాల్సి ఉంటుందని ఆర్థిక వేత్తలు లెక్కలు వేస్తున్నారు. కానీ.. రాజధాని ప్రాంతంలో అంత భూమి అందుబాటులో లేదు. ఈ లెక్కన అప్పు తీర్చాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి.. అంటే ప్రజలు చెల్లించే పన్నుల నుంచి నిధులు కేటాయించాల్సిందే. అలాంటప్పుడు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్ సిటీ ఎలా అవుతుందని మేధావులు, ఆర్థిక వేత్తలు నిలదీస్తున్నారు. ఆ ఎకరం శ్మశానమే.. వెలగపూడిలో సర్వే నంబరు 163–బీలో ఎకరం శ్మశానం భూమి. ఇప్పటికీ ఆ భూమిలో సమాధులు ఉన్నాయి. రాజధాని భూ సమీకరణ కోసం వెలగపూడిలో 2015 జనవరి 3న సీఆర్డీఏ జారీ చేసిన నోటిఫికేషన్లోనూ 163–బీలో ఎకరం శ్మశానంగా స్పష్టం చేసింది. కానీ.. ల్యాండ్ పూలింగ్ స్కీం కింద భూమిని సమీకరిస్తూ జారీ చేసిన 9.22 ఫార్మ్లో మాత్రం ఆ భూమి కంచెర్ల శాంతి కిరణ్దిగా పేర్కొనడం గమనార్హం. ఎవరి ఒత్తిళ్లతో శ్మశానం భూమిని శాంతి కిరణ్కు చెందినదిగా మార్చారని వెలగపూడి రైతులు నిలదీస్తున్నారు. 163–బీలో శ్మశానం ఉన్న ఎకరం భూమి కంచెర్ల శాంతికిరణ్దిగా చూపుతూ.. దానికిగాను కేటాయించిన వెయ్యి గజాల రెసిడెన్షియల్ స్థలంతోపాటు 25 వేల గజాలను కంచెర్ల శాంతికిరణ్ కుటుంబ సభ్యుల నుంచి సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కొనుగోలు చేయడం గమనార్హం. -
గత ప్రభుత్వ సంస్కరణల వల్లే ‘పది’లో ప్రభంజనం
సాక్షి, నెట్వర్క్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరిశారు. వైఎస్ జగన్ పాలనలో చేపట్టిన విద్యా సంస్కరణలు నేడు మంచి ఫలితాలనిస్తున్నాయి. నాడు–నేడు కార్యక్రమం వల్ల సమకూరిన మౌలిక వసతుల వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. పేదింటి బిడ్డలు వెలుగులు విరజిమ్మారు. 2014–19 మధ్య రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలంటే అందరికీ చిన్నచూపే. చిన్నపాటి వర్షానికే కారే భవనాలు.. కుక్కలు, పందులతో పాఠశాల ప్రాంగణాలు.. తెల్లగా మారిపోయిన బ్లాక్ బోర్డులు.. చివరకు చాక్పీస్లకూ కొరతే.. పిల్లలకు బెంచీలుండవు.. అయ్యవార్లకు కుర్చీలుండవు.. పిల్లలకు కనీసం తాగడానికి మంచినీరు దొరికేది కాదు.అలాంటి దుస్థితిలో ఉన్న పాఠశాలలను 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. ఇదివరకెన్నడూ లేనివిధంగా వేల కోట్ల రూపాయలతో నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేసింది. సీబీఎస్ఈ స్కూళ్లు, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ఐబీ సిలబస్, విద్యార్థులకు ట్యాబ్లు, పిల్లలకు మధ్యాహ్నం గోరుముద్ద పేరుతో రుచికరమైన భోజనం, జగనన్న విద్యాకానుక కింద యూనిఫాం, పుస్తకాలు, షూ, బెల్ట్, బ్యాగ్ తదితరాలన్నీ సమకూర్చింది.వీటిన్నింటితో పాటు సకల సౌకర్యాలతో పాఠశాలలను తీర్చిదిద్దింది. అత్యాధునిక ల్యాబ్, లైబ్రరీ, ఫర్నిచర్, డెస్్కలు, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్, వాటర్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు క్యూ కట్టారు. ఓ దశలో పలు పాఠశాలల్లో హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు. వీటన్నింటికీ తోడు పిల్లలను బడులకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు అమ్మ ఒడి పేరిట తల్లుల ఖాతాల్లో జమ చేశారు. దశ తిరిగింది.. దిశ మారింది వైఎస్ జగన్ ప్రభుత్వ సంస్కరణల ఫలితంగా 2022 నుంచి ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు పదో తరగతి ఫలితాల్లో గుత్తాధిపత్యం గల కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫలితాలు రావడం మొదలైంది. దిగువ మధ్యతరగతి, పేదింటి పిల్లలు సైతం అత్యుత్తమ మార్కులు సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ప్రతి పాఠశాలలోనూ పిల్లలు మంచి మార్కులు సాధించారు. పలువురు విద్యార్థులు 596 మార్కులు సాధించారంటే ఇందుకు కారణం గత ప్రభుత్వ సంస్కరణలే అని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెబుతున్నారు. ట్యాబుల వల్లే మంచి మార్కులు సాధించా.. నాన్న శ్రీనివాసరావు గ్యాస్ డెలివరీ చేస్తారు. అమ్మ వెంకట అనంతలక్ష్మి గృహిణి. అమ్మ బీకామ్ చదివింది. క్లాస్లో టాప్లో ఉండాలని చెబుతుంటారు. జగన్ ప్రభుత్వంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్పీ)లు వచ్చిన తరువాత మాకు ల్యాబ్ లేదన్న కొరత తీరింది. పాఠాలు చెప్పడం, వెంటనే వీడియోలో ప్లే చేయడం, ట్యాబ్లలో స్లిప్ టెస్టులు, స్పెషల్ టెస్టులు పెట్టేవారు. ఐఎఫ్పీలు, ట్యాబ్ల వల్ల మాకు క్విక్ రివిజన్ అయ్యేది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన నాడు–నేడు, నూతన విద్యావిధానం మాకెంతో ఉపయోగపడింది. మంచి బోధనా వసతులే కారణంనాన్న కోలా కులశేఖర్. అమ్మ సరోజమ్మ. మాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు భారం కాకూడదని నాగలగుట్టపల్లె జెడ్పీ హైసూ్కల్లో చదివా. పదో తరగతిలో 595 మార్కులు సాధించా. ఉన్నత చదువులకు పేదరికం, ఆరి్థక సమçస్య అడ్డు గోడగా ఉంటోంది. కష్టపడి చదివి తొలుత డాక్టర్ వృత్తి చేపడతా. సివిల్స్కు ప్రిపేర్ అయి కలెక్టర్ అవుతా. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలో కల్పించిన మంచి బోధనా వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణం బాగా చదవడానికి దోహదపడింది. నాడు–నేడు పథకంలో ప్రతి తరగతి గదికి ఇచ్చిన ఐఎఫ్పీ ప్యానల్ బోర్డు ద్వారా కల్పించిన విద్యాబోదన కూడా విజయానికి దోహదపడింది. గత ప్రభుత్వం వల్లే అధిక మార్కులుటెన్త్లో 600 మార్కులకు 595 మార్కులతో టాపర్గా నిలిచాను. మా పాఠశాలను గత ప్రభుత్వం ‘నాడు–నేడు’లో అన్నివిధాలుగా అభివృద్ధి చేసింది. మా స్కూల్లో ప్రశాంత వాతావరణం కల్పించడంతో చదువుపై దృష్టి పెట్టాను. డిజిటల్ తరగతి గదులు, అత్యంత ఆధునికత ఉట్టిపడేలా టేబుళ్లు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ స్కూళ్లలో లక్షలు ఖర్చు చేస్తే కానీ చదవలేం. కానీ ప్రభుత్వ పాఠశాలలోనే కార్పొరేట్ వసతులు కల్పించారు. మా వంటి పేద విద్యార్థులకు ఇంతకంటే ఏం కావాలి. నాన్న రవికిశోర్ అకౌంటెంట్. అమ్మ ఉషారాణి గృహిణి. టీచర్ కావాలన్నదే నా ఆశయం. ‘సాక్షి’ మెటీరియల్ అద్భుతం మాది వ్యవసాయ ఆధారిత మధ్య తరగతి కుటుంబం. నాన్న కొర్రకూటి వెంకటేశ్వర్లు. అమ్మ లక్ష్మి గృహిణి. ఆరి్థక స్తోమత లేని కారణంగా ఊళ్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో తెచ్చిన పటిష్టమైన విద్యా ప్రమాణాలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. టెన్త్లో 600 మార్కులకు గాను 595 మార్కులొచ్చాయి. జగన్ ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్ నా చదువుకు ఎంతో దోహదపడింది. ఉపాధ్యాయుల బోధనతో పాటు ‘సాక్షి’ మీడియా అందించిన స్టడీ మెటీరియల్ కూడా మంచి మార్కులు సాధించేందుకు సహకరించింది. సివిల్స్ సాధనే లక్ష్యంగా ఎంచుకున్నాను. వైఎస్ జగన్ ఉజ్వల భవితకు బాట వేశారునాన్న హరిప్రసాద్కు వ్యవసాయమే ప్రపంచం. సాధారణ గృహిణి అయిన అమ్మ రాజ్యలక్షి్మకి ఇల్లే ప్రపంచం. ఆకలి బాధతో చదువుకునే విద్యార్థులు మెరుగైన లక్ష్యాలను అందుకోలేరన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో ఎన్నో మార్పులు తెచ్చింది. ఎంతోమంది విద్యార్థుల ఆకలి బాధను పౌష్టికాహారంతో తీర్చి మంచి మార్కులతో ఉజ్వల భవిష్యత్ను తీర్చిదిద్దుకునేలా బాటలు వేసింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ర్యాంక్ సాధించడానికి గత ప్రభుత్వ విధానాలే బాటలు వేశాయి. 4వ తరగతి వరకు కొల్లూరులోని ప్రైవేట్ స్కూల్లో చదివాను. ఐఐఐటీ పూర్తి చేసి సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నా. జగన్ ప్రభుత్వం ముందు చూపు వల్లే..నాన్న దూళ్ల శ్రీనివాస్ వ్యవసాయ పనులకు వెళ్తారు. అమ్మ వీరవేణి గృహిణి. మాది మధ్యతరగతి కుటుంబం. నేను టెన్త్ ఫలితాల్లో 600 మార్కులకు 596 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచాను. దీనికి ప్రధాన కారణం నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పాఠశాలలను ‘నాడు–నేడు’లో అభివృద్ధి చేయడమే. చక్కటి అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు, ట్యాబ్లు, ఫుట్పాత్, చక్కటి మొక్కలు, సమావేశపు ప్రాంగణం, టేబుల్స్ వంటి మౌలిక వసతులతో సంపర జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. పాఠశాలను అత్యంత ఆధునిక వసతులతో తీర్చిదిద్దడంతో బాగా చదవుకోగలిగాను. పాఠశాలలో కల్పించిన ఆధునిక వసతులు ఎంతో ప్రేరణగా నిలిచాయి. మా చెల్లి కూడా ఇదే పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. భవిష్యత్లో సీఏ చదవాలనుకుంటున్నాను. నాడు–నేడు నా జీవితాన్నే మార్చింది నాన్న చక్రపాణి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. అమ్మ పద్మావతి గృహిణి. నేను పాణ్యం మండలం నెరవాడ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నా. టెన్త్లో 596 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలవడానికి కారణం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం. ఇది ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేసింది. ఐదో తరగతిలో చేరినప్పుడు పాఠశాలలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి. కిందనే కూర్చుని పాఠాలు వినేవాళ్లం. విద్యుత్ సౌకర్యం ఉండేది కాదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మంచి టేబుల్స్, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేసింది. డిజిటల్ విద్య అందుబాటులోకి వచ్చింది. ఐఎఫ్బీ ప్యానెల్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే ఉపాధ్యాయులు బోధన చేసేవారు. 8వ తరగతిలో ట్యాబులు ఇచ్చారు. వీటిద్వారా ఎప్పటికప్పుడు సబ్జెక్టులలో వచ్చే అనుమానాలు నివృత్తి చేసుకునే దాన్ని. భవిష్యత్లో గైనకాలజిస్ట్ కావాలనుకుంటున్నాను. నాడు– నేడుతో బడి బాగుగత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అనుసరించిన విధానాలతో మా ఊరితోపాటు పాఠశాల బాగు పడింది. విద్యార్థులకు అమ్మ ఒడి, విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వడంతోపాటు నాడు–నేడు పథకంలో మా పాఠశాలని కూడా బాగుచేయడం ఎంతో నచ్చింది. ఐఎఫ్పీలు, ట్యాబ్ల వల్ల మాకు క్విక్ రివిజన్ అయ్యేది. దీనివల్ల ఒత్తిడి ఉండేది కాదు. దీనివల్ల మేం ముందుకు సాగాం. చదివింది, విన్నది, చూసినది అన్నీ చక్కగా గుర్తుపెట్టుకోగలిగాను. 10వ తరగతి పరీక్షల్లో కంగారు లేకుండా బాగా రాయటానికి ఇవన్నీ దోహదపడ్డాయి. మొత్తంగా టెన్త్లో 596 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలబడటానికి గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విధానాలే కారణం. నాన్న వెంకట దుర్గారావు పెయింటింగ్ వర్కర్. తల్లి నాగలక్ష్మి బీఏ, బీఈడీ చేసి గృహిణిగా స్థిరపడ్డారు. యూపీఎస్సీలో మంచి ర్యాంకు సాధించడమే నా గోల్. వైఎస్ జగన్ హయాంలోనే కొత్త భవనాలు మాది పీలేరు. నాన్న ఆర్డీ మునిరాజ్ కడపలోని జగదీశ్వర ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో మేనేజర్. అమ్మ శైలజ గృహిణి. నేను 5వ తరగతి వరకు మదనపల్లె విజయభారతి ఇంగ్లీషు మీడియం స్కూల్లో చదివా. తరువాత జెడ్పీ హైసూ్కల్లో చేరా. టెన్త్లో 595 మార్కులు సాధించా. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కొత్త భవనాలు వచ్చాయి. డిజిటల్ బోర్డులపై విద్యాబోధన కూడా చాలా బాగా అర్థమైంది.అప్పటి ప్రభుత్వం అందించిన ట్యాబ్లు చాలా అద్భుతంగా ఉపయోగపడ్డాయి. పాఠశాల రూపురేఖలు కూడా మార్చేశారు. చూస్తే బిల్డింగ్లతోపాటు వివిధ రంగులలో ఉన్న బెంచీలు, ఇతర పరిసరాలు బాగా ఉన్నాయి. అప్పట్లో మాకు ఇచ్చిన అన్ని వస్తువులు బాగా ఉపయోగపడ్డాయి. మాకున్న లాంగ్వేజ్లతోపాటు మిగతా సబ్జెక్టులు ఏవీ కష్టంగా భావించలేదు. ఇంటర్లో ఎంపీసీ తీసుకుని ఐఐటీ సాధన దిశగా ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నా. డిజిటల్ విద్యతో ఉత్తమ ఫలితాలు గత ప్రభుత్వం ‘నాడు–నేడు’ పథకంలో భాగంగా కాకినాడ శ్రీనగర్లో ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టిన డిజిటల్ విద్య పదో తరగతి పరీక్షల్లో 595 మార్కులు సాధించేందుకు ఎంతగానో దోహదపడింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండగా 2023లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేశారు. డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు కూడా ఇచ్చారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఉత్తమ ఫలితాలు సాధించాను. సుద్ద ముక్కలు, బ్లాక్ బోర్డులు అవసరం లేకుండా మా పాఠశాలలో జరిగిన డిజిటల్ బోధన, కార్పొరేట్ పాఠశాలల్లో లేనివిధంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలను ‘నాడు–నేడు’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయడం కలిసొచ్చింది. మా నాన్న రామలింగరాజు ప్రైవేట్ ఉద్యోగి. తల్లి శ్వేత గృహిణి. వారిద్దరూ నాకెంతో స్ఫూర్తిని కలిగించారు. ఇంటర్లో ఎంఈసీ గ్రూపు తీసుకుని చార్టర్డ్ అకౌంటెంట్గా స్థిరపడాలనేది నా ఆశయం. ప్యానల్స్ బాగా ఉపయోగపడ్డాయి టెన్త్లో 595 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. నాన్న బ్రహా్మనందం చిన్న షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అమ్మ సౌజన్య గృహిణి. వైఎస్ జగన్ హయాంలో నాడు–నేడు పథకాన్ని మా పాఠశాలలో బాగా అమలు చేశారు. తరగతి గదులలో టైల్స్ వేశారు. ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్పీ)ల ద్వారా విద్యాబోధన మరింత మేలు చేసింది. పాఠాలు వినడంతో పాటు వీడియోలు కూడా చూడటం వల్ల మాకు మరింతగా అర్థమయ్యాయి. ట్యాబ్లు అందుబాటులో ఉండటం వల్ల మాకు తరచూ స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఈ కారణంగానే మాకు మంచి మార్కులు వచ్చాయి. భవిష్యత్లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేస్తాను. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ యూజీ)–2026ని ఆదివారం దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా సెంటర్లలోకి అనుమతించరు. ఆఫ్లైన్ (పెన్ను, పేపర్) విధానంలో దేశవ్యాప్తంగా 552 నగరాలు, పట్టణాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 29 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 22.80 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తారని అధికారుల అంచనా. గతేడాది ఏపీ నుంచి 57,934 మంది విద్యార్థులు నీట్ రాయగా, 36,776 మంది అర్హత సాధించారు. ఈసారి కూడా 55వేల మందికి పైగా విద్యార్థులు నీట్ రాసే అవకాశం ఉందని తెలుస్తోంది.డ్రెస్ కోడ్⇒ విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరించాలి.⇒ పూర్తి చేతుల చొక్కా (ఫుల్ స్లీవ్స్), ఉన్ని దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీల కోసం పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవాలి.⇒ సంప్రదాయ, మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన వస్తువులను ధరించేవారు క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి వీలుగా పరీక్ష కేంద్రంలో ముందుగానే రిపోర్ట్ చేయాలి.⇒ స్లిప్పర్స్ లేదా ఎత్తు తక్కువ ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి.నిబంధనలు ఇవే...పరీక్ష కేంద్రంలోకి అనుమతించేవి⇒ అడ్మిట్ కార్డ్, పాస్పోర్ట్ సైజు ఫొటో, ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, వంటి ధ్రువీకరణ పత్రాలు).⇒ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్.నిషేధిత వస్తువులు⇒ మొబైల్ ఫోన్లు⇒ స్మార్ట్ వాచీలు⇒ ఎలక్ట్రానిక్ పరికరాలు⇒ క్యాలిక్యులేటర్లు⇒ ఇతర కాగితాలుబయోమెట్రిక్పై ఆందోళన వద్దుఏ కారణంతో అయినా బయోమెట్రిక్ నమోదుకాకపోతే విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బయోమెట్రిక్ నమోదు కాని విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించి, లిఖితపూర్వకంగా అండర్టేకింగ్ తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన నమూనాను ప్రతి పరీక్ష కేంద్రానికి పంపినట్లు ఎన్టీఏ ప్రకటించింది. -
‘పది’ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తులకు 7 వరకు గడువు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్ కోరే విద్యార్థులు ఈ నెల ఏడో తేదీలోగా తమ పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఎస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్కు రూ .500, రీ–వెరిఫికేషన్కు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి జవాబు పత్రాలను రీ–వెరిఫికేషన్ కోసం పాఠశాల లాగిన్తో పాటు వాట్సప్ గవర్నెన్స్(మన మిత్ర)ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించినట్టు తెలిపారు. -
విద్యుత్ కోతలకు ‘సాంకేతిక’ సాకులు
సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని తెలిసినా అందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. దీంతో విద్యుత్ను సక్రమంగా అందించలేకపోతోంది. సాంకేతిక సాకులు చూపించి జనానికి కోతలు తప్పవని సంకేతాలిస్తోంది. విద్యుత్ కోతలపై శనివారం మంత్రి రవికుమార్ చేపట్టిన సమీక్షలో అధికారులు చెప్పిన సాంకేతిక కారణాలే దీనికి తార్కాణం. ‘‘అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి..అకాల వర్షాల కారణంగా సమస్యలు తలెత్తి ఫీడర్లు ట్రిప్ అవుతున్నాయి. అందుకే విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.’’ అని విద్యుత్ పంపిణీ సంస్థలు సమాధానం చెప్పడం విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు అమలు చేయడంపై ‘సాక్షి’ కథనాలకు స్పందించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం డిస్కంల సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. విద్యుత్ కోతలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదన్నారు. గత ప్రభుత్వంలో ఇబ్బంది లేదే 2023 మే నెలలో భానుడి భగభగలు, వర్షాలు, ఈదురుగాలులు వంటి విపత్తుల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎండల వల్ల అవుట్డోర్ వర్క్స్ ఆపేశారు. ఇళ్లల్లో ఏసీలు, ఎయిర్ కండిషనర్ల వినియోగం వల్ల ట్రాన్స్ఫార్మర్లపై ఊహించని భారం పడింది. రోజుకి విద్యుత్ వినియోగం 255 మిలియన్ యూనిట్లకు చేరింది. అయినా అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. కరెంట్ వాడకం రోజురోజుకూ పెరిగినా గ్రిడ్ వ్యవస్థ దాదాపు స్థిరంగా ఉండేలా చూసింది. వేసవిలో విద్యుత్ డిమాండ్ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందే ఊహించి ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచింది. దీంతో వేసవిలో కూడా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించింది. -
కొండపై సొరంగాలు..
సాక్షి, టాస్క్ఫోర్స్: అటవీ భూముల్లో లభించే సహజ సంపదను కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నాయకులు దోచేస్తున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరపురం గ్రామ సమీపంలో రంగురాళ్లు (క్రిస్టల్, క్వార్ట్జ్) కోసం కొండను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి రంగురాళ్లు తీసి హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్, పుణే, ముంబయి తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల సహాయ సహకారాలు, టీడీపీ ముఖ్య నేతల అండదండలతో ఆ పార్టీ స్థానిక నాయకులు రంగురాళ్ల అక్రమ వ్యాపారంతో రూ.కోట్లకు పడగలెత్తారన్నది జగమెరిగిన సత్యం. పచ్చని కొండను టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. కొండపై సొరంగాలు తవ్వి రంగురాళ్ల సేకరణ దాచేపల్లి నగర పంచాయతీ సమీపంలో శంకరపురం అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఎక్కువగా సుగాలీలు నివసిస్తుంటారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూముల్లో రంగురాళ్లు నిక్షిప్తమైన కొండ ఉంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొండకు కన్నం వేయాలని టీడీపీ నాయకులు ప్రణాళికలు రచించారు. ముఖ్యనేతలు రంగంలోకి దిగి కొండపై అక్రమంగా తవ్వకాలు జరిపేలా స్కేచ్ వేశారు. శంకరపురంతోపాటుగా భట్రుపాలెం, కాట్రపాడు, మాదినపాడు, సారంగపల్లి అగ్రహారం, కొత్తూరు, దాచేపల్లి గ్రామాల్లో ఎంపిక చేసుకున్న కూలీలను కొండపైకి తరలిస్తున్నారు.కొండ లోపలికి దిగి తవ్వకాలు జరిపేందుకు వీలుగా జనరేటర్లు, టార్చిలైట్లు కూడా ఏర్పాటు చేశారు. రోజూ కొండపై రంగురాళ్ల కోసం కూలీలతో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో కూలీలు కొండకు కన్నం వేసి వందల కిలోల రంగురాళ్లను బయటకు తీస్తున్నారు. కొండపై సుమారుగా 100 అడుగుల లోతులో కూడా సొరంగాలు తవ్వారంటే ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. సొరంగాల్లోకి వెళ్లిన కూలీలకు బ్లోయర్స్ ద్వారా కొండపై నుంచి ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. లోపలి భాగంలో దాగి ఉన్న రంగురాళ్లు కనిపించేలా లైట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదభరితంగా సొరంగాలు శంకరపురం కొండపై ఉన్న సొరంగాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇక్కడ కూలీలు తీసిన సొరంగాల్లోకి వెళ్లిన పలువురు గాయాలపాలయ్యారు కూడా. కొందరు కూలీలు ఊపిరాడక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇవేవీ బయటకు రాకుండా చేస్తున్నారు. సొరంగాల్లో తవ్వకాలు జరిపే కూలీల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కూలీలను బెదిరించి... దోచుకుంటున్న టీడీపీ నేతలు శంకరపురం కొండను కొల్లగొట్టి రంగురాళ్లు తవ్వుకుని టీడీపీ నాయకులు భారీగా సంపాదిస్తున్నారు. కొండలో లభించే రంగురాళ్లలో నాణ్యతను బట్టి కేజీ రూ.1,000 నుంచి రూ.20 వేల వరకు ధర పలుకుతోంది. రూ.10 వేలు విలువ చేసే రాయి దొరికితే... టీడీపీ నాయకులు కూలీలను భయపెట్టి నామమాత్రపు డబ్బులు ఇచ్చి వారి శ్రమను దోచుకుంటున్నారు. వచ్చిందంతా మాదే అంటూ భయపెడుతున్నారు. మాకు తెలియకుండా రంగురాళ్లను అమ్మితే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని బెదిరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక పొట్టకూటి కోసం కూలీలు టీడీపీ నాయకులు ఇచ్చింది తీసుకుంటున్నారు. ఆ నాయకులేమో హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, పుణే, గుజరాత్ తదితర ప్రాంతాలకు రంగురాళ్లను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడి వ్యాపారులు ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అక్రమ మార్గంలో సొమ్ము చేసుకుంటున్నారు. వారంలో నాలుగు రోజులపాటు రంగురాళ్ల అమ్మకాలు జోరుగా జరుగుతుంటాయని కూలీలు చెబుతున్నారు. దాచేపల్లిలోని ఓ గొడౌన్లో టీడీపీ నేతలు భద్రపరచిన రంగురాళ్లను శుక్రవారం రాత్రి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. ఇక్కడ లభించిన రంగురాళ్ల విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులు కొండకు కన్నం వేసి కోట్లకు పడగలెత్తుతున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శనమని పలువురు అంటున్నారు.అక్రమార్కులతో అటవీశాఖ సిబ్బంది చెట్టాపట్టాల్ శంకరపురం కొండపై టీడీపీ నాయకుల పర్యవేక్షణలో రేయింబవళ్లు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతుండగా అటవీశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో కూలీలు కొండపై తవ్వకాలు జరుపుతుంటే ఆ శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. కొండ కింద తనిఖీల కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ బాక్స్ ఎప్పుడూ తాళం వేసినట్లుగానే కనిపిస్తుంది.కొండపైన తవ్వకాలు జరుగుతున్నా ఇక్కడి సిబ్బంది తనిఖీలు కూడా చేయకుండా వదిలేశారు. టీడీపీ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని అటవీశాఖ సిబ్బంది తిరుగుతుండటం వల్లే కొండపై తవ్వకాలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారనే విమర్శలున్నాయి. తనిఖీలు చేసినా... నామమాత్రంగా చేసి చేతులు దులుపుకుంటున్నారు. రంగురాళ్ల తవ్వకాల్లో అటవీశాఖ సిబ్బందికీ వాటాలున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కొండపై అక్రమ తవ్వకాలను అటవీశాఖ అధికారులు అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
వ్యవసాయ యాంత్రీకరణలో కమీషన్ల దందా
సాక్షి, అమరావతి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ పథకంగా మారిపోయింది. అధికారులతో కుమ్మక్కై ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు బేరసారాలు సాగిస్తున్నారు. తొలి ఏడాది మొక్కుబడి తంతుగా అమలు చేసిన ఈ పథకాన్ని రెండోఏడాది పూర్తిగా అటకెక్కించేశారు. 2025–26 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఒక్కటంటే ఒక్క పరికరం పంపిణీ చేయలేదు. గతేడాది మంజూరైన కేంద్ర నిధులతోనే ఈ ఏడాది పథకం అమలు పేరిట పర్సంటేజ్లు దండుకుంటున్నారు. మరోవైపు సామర్థ్యం లేని చైనా పరికరాలను అధిక ధరలకు కోట్చేసి ఎడాపెడా దోచుకుంటున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం(స్మామ్) కింద 2024–25లో రూ.343 కోట్ల కేంద్ర నిధులతో దాదాపు లక్షమందికి వ్యక్తిగత పరికరాలు, సీహెచ్సీ గ్రూపులకు వెయ్యి కిసాన్ డ్రోన్లు, క్లస్టర్ స్థాయిలో 100 కంబైన్డ్ హార్వెస్టర్లు ఇస్తామని ప్రకటించారు. ఆచరణకు వచ్చేసరికి రూ.129 కోట్లతో 25 వేల వ్యక్తిగత పరికరాలు, 875 డ్రోన్లు పంపిణీ చేశారు. కమీషన్ల కోసం అవసరం లేని పరికరాలను అంటగట్టారని రైతుల నుంచి విమర్శలు రాగా, టెండర్ నిబంధనలను తారుమారుచేసి అస్మదీయ కంపెనీలకు కిసాన్ డ్రోన్ల కాంట్రాక్టు కట్టబెట్టారంటూ అర్హతగల కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. తొలి ఏడాది బిల్లుల చెల్లింపులో 15–20 శాతం కమీషన్ (రూ.25 కోట్లకుపైగా) అధికారులతో కలిసి అచ్చెన్న బృందం దండుకుందన్న ఆరోపణలు వచ్చాయి.కమీషన్ల కోసం చైనా ఉత్పత్తులకు పచ్చజెండా 2025–26 సీజన్లో రూ.240 కోట్లతో ఎఫ్పీవోలు, ఎస్హెచ్జీ గ్రూపులకు వెయ్యి, ఇంజనీరింగ్ పట్టభద్రులకు 75 కిసాన్ డ్రోన్లు, సీహెచ్సీలకు 164 హైకాస్ట్ మిషనరీ, 1,050 ట్రాక్టర్లతో పాటు 40 వేలకు పైగా వ్యక్తిగత పరికరాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంపెనీల నుంచి పర్సంటేజ్లు వసూలు చేసి ఇవ్వాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించిన ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్ను బదిలీచేసి విజిలెన్స్ నివేదికను తొక్కిపెట్టేశారు. నోడల్ ఏజెన్సీగా ఏపీ ఆగ్రోస్ను తప్పించి వ్యవసాయశాఖకు అప్పగించారు. తొలి ఏడాది పరికరాల పంపిణీకి ముందు కమీషన్లు దండుకోగా, రెండో ఏడాది ఎంపానల్మెంట్కు ముందుగానే కంపెనీలతో బేరసారాలు సాగించారు. డ్రోన్లతోపాటు వ్యక్తిగత పరికరాల విలువలో 20–25 శాతం ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఓ బినామీ డీలర్ ద్వారా కంపెనీల నుంచి కమీషన్ దండుకుంటున్నారని సమాచారం. ఈ పథకం కింద అనేక ఉత్పత్తులను చైనా నుంచి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా సరఫరా చేసేందుకు పచ్చజెండా ఊపారు. దేశీయ ఉత్పత్తులతో పోలిస్తే వీటి సామర్థ్యం, ధర తక్కువే అయినా.. భారతీయ ఉత్పత్తుల ధరలకే కోట్చేసిన కంపెనీలతో ఎంపానల్మెంట్ చేసుకున్నారు. వీటిలో ప్రధానంగా బ్యాటరీ స్ప్రేయర్లు, హైప్రెజర్ నాప్సాక్ స్ప్రేయర్లు, పవర్ వీడర్/రీపర్, బ్రష్ కట్టర్, హార్వెస్టర్, రోటో టిల్లర్, బేలర్లు, చాప్ కట్టర్లు వంటివి ఉన్నాయి. పవర్ వీడర్లు పూర్తిగా చైనా నుంచే వస్తున్నాయి. చైనాకు చెందిన పవర్ వీడర్ ఎమ్మార్పీ రూ.36 వేలు కాగా, స్మామ్లో రూ.57,500గా, రూ.18 వేలున్న బ్రష్కట్టర్ ధరను రూ.25 వేలుగా నిర్దేశించారు.పనితీరుతో పనిలేదురైతులకు పంపిణీ చేసే పరికరాల పనితీరును తప్పనిసరిగా పరీక్షించాల్సి ఉన్నా అలాంటిదేమీ జరగడం లేదు. మన హార్వెస్టర్ల ద్వారా వరికోతలు చేస్తే ధాన్యం నష్టం 1.5 శాతం నుంచి 2 శాతం ఉంటే.. చైనా హార్వెస్టర్ ఉపయోగిస్తే ఈ నష్టం 7.5 శాతం ఉంటుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నా చైనా పరికరాలకే మొగ్గుచూపుతున్నారు. రైతులు డిమాండ్ చేస్తున్నారనే సాకుతో సామర్థ్యం లేని పరికరాలను నేరుగా చైనా నుంచి డెలివరీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తగ్గిన జీఎస్టీ మేరకు కంపెనీలు కోట్చేసే ధరలు తగ్గాలి. కానీ అలా జరగడం లేదు. ఉదాహరణకు ఏపీ ఆగ్రోస్ ద్వారా ఇటీవల పిలిచిన టెండర్లో స్ప్రేయర్లకు 12 శాతం జీఎస్టీతో ఎల్1 కోట్చేసిన ధర రూ.23 వేలు. ఇదే స్ప్రేయర్లను నేడు 5 శాతం జీఎస్టీతో కలిపి కమిటీ ఆమోదించిన ధర రూ.26 వేలు. ఇలా అడ్డగోలుగా ధరలు పెంచడం వెనుక భారీ కుంభకోణం ఉంది. ఈసారి రూ.80 కోట్ల వరకు దండుకోవాలన్న లక్ష్యంతో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. యాంత్రీకరణ పేరిట జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటూ పలు దేశీయ కంపెనీలు ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశాయి. కాగా, ఆన్లైన్లో పిలవాల్సిన టెండర్లను పూర్తిగా ఆఫ్లైన్లో పిలిచారు. ఇక్కడ పరీక్ష నివేదికలు, ధరల కొటేషన్లు, స్పెసిఫికేషన్లు వంటి పత్రాలను అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకునే వీలు కల్పించారు. అదే ఆన్లైన్లో పిలిస్తే ఒకసారి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు చేయడం సాధ్యం కాదు. తమకు పర్సంటేజ్లు భారీగా ఇచ్చే కంపెనీలకు మేలు చేసేందుకే ఈ విధంగా ఆఫ్లైన్లో టెండర్లు పిలిచారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
సింగిల్ బిడ్కే సై..
సాక్షి, అమరావతి: వడ్డించే వాడు మనోడైతే.. అన్నట్లుగా ఉంది రాష్ట్రంలో కాంట్రాక్టుల కేటాయింపుల తీరు. ఎన్ని నిబంధనలున్నా మనోళ్లయితే ప్రభుత్వ పెద్దలు ముందూవెనుకా ఆలోచించకుండా అస్మదీయ కంపెనీలకు పీపీపీ ప్రాజెక్టుల రూపంలో ప్రజా సంపదను దోచిపెడుతున్నారు. వైద్య వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన కాంట్రాక్టు కథాకమామిషు ఏమిటంటే.. 2014–19 మధ్య పదేళ్ల కాలపరిమితితో వైద్యశాఖలో కాంట్రాక్టులు కట్టబెట్టిన సంస్థలకు, ఇప్పుడు మరో పదేళ్లకు కట్టబెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ‘ముఖ్య’నేత సతీమణి సిఫార్సుతో ఇప్పటికే పలు జీజీహెచ్ల్లో పీపీపీ క్యాథ్ల్యాబ్ సేవలు అందిస్తున్న ఓ సంస్థకు మరిన్ని జీజీహెచ్ల్లోనూ క్యాథ్ల్యాబ్ కాంట్రాక్టును కట్టబెట్టబోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి జీజీహెచ్ల్లో పీపీపీ క్యాథ్ల్యాబ్లకు ఇటీవల వైద్యశాఖ టెండరు పిలిచింది. కాకినాడ జీజీహెచ్కు గత ప్రభుత్వంలోనే దాదాపు రూ.7 కోట్లతో క్యాథ్ల్యాబ్ను సమకూర్చారు. అంటే కాకినాడలో ప్రైవేట్ సంస్థ దీన్ని ఆపరేషన్, మెయింటెనెన్స్ చేస్తే చాలు.. మిగిలిన చోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థే క్యాథ్ల్యాబ్ సమకూర్చి సేవలు అందించాలి. జనవరిలో తొలిసారి టెండరు పిలిచి రద్దుచేశారు. రెండోసారి పిలిచిన టెండరులో ఇప్పటికే పలు జీజీహెచ్ల్లో క్యాథ్ల్యాబ్ సేవలు అందిస్తున్న సంస్థ మాత్రమే బిడ్ వేసింది. బిడ్ను వైద్యశాఖ ఆమోదించింది. ఇక కాంట్రాక్టు అవార్డ్ చేయడమే తరువాయి.అస్మదీయుడికి మేలు చేసేందుకు..కాకినాడ జీజీహెచ్లో రూ.కోట్ల విలువైన పరికరాన్ని గత ప్రభుత్వమే సమకూర్చింది. ఇలా అప్పట్లో అనంతపురం, కర్నూలు జీజీహెచ్లకు సమకూర్చిన క్యాథ్ల్యాబ్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. వీటిలో రోగులకు అందించే సేవలకు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. గుండె సమస్యల బాధితులకు యాంజియో, స్టెంట్లు వేయడం, వివిధ రకాల చికిత్సలకు రూ.1.50 లక్షల వరకూ బిల్లులు వస్తున్నాయి. ఇలా కర్నూలులో మూడునెలలకు రూ.కోటి వరకూ నిధులు సమకూరుతున్నాయి. అనంతపురంలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంటోంది. ఈ లెక్కన పరిశీలిస్తే ఒక్కోచోట నెలకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ ఆదాయమే ఉంటోంది. అయితే, కాకినాడ క్యాథ్ల్యాబ్ను ప్రభుత్వమే నిర్వహించడానికి ఎంతో మెరుగైన అవకాశాలున్నప్పటికీ దీనితో పాటు, మిగిలిన చోట్ల పీపీపీలో అస్మదీయ సంస్థకు కట్టబెట్టాలని ప్రభుత్వం పెద్దలు నిర్ణయించారు. దీంతో ‘ముఖ్య’నేత కార్యాలయం డైరెక్షన్ మేరకు వైద్యశాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసినట్లు తెలిసింది. డీఎంఈలో తొలుత రూపొందించిన ప్రతిపాదనల్లో కాకినాడ కాంట్రాక్టు దక్కించుకునే సంస్థ ఫెసిలిటీ చార్జ్ కింద నెలకు రూ.6 లక్షల మేర ఆస్పత్రికి చెల్లించాలని, ఇతర నిబంధనలు కఠినంగా రూపొందించారు. అయితే, ఆ నిబంధనలు కాంట్రాక్టర్కు మేలు చేసేలా లేవని, నిబంధనల్లో పెద్దఎత్తున మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్, మెయింటెనెన్స్ చేస్తూ ఆస్పత్రికి కాంట్రాక్టు సంస్థ నెలకు రూ.3 లక్షలు చెల్లిస్తే చాలని మార్చడంతో, అస్మదీయ సంస్థ రూ.వెయ్యి మేర అదనంగా కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఏఎస్ఆర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల నుంచి రోగుల తాకిడి ఎక్కువగా ఉండే కాకినాడ జీజీహెచ్లో నెలకు రూ.30 లక్షలకు పైగానే విలువైన క్యాథ్ల్యాబ్ సేవలు అందించే వీలుంటుందని వైద్యలు అభిప్రాయపడుతున్నారు. ఇలా పదేళ్లకు రూ.40 కోట్ల మేర కాంట్రాక్టు సంస్థకు ఆదాయం సమకూరే అవకాశం ఉంటే, కేవలం 10 శాతంలోపే ఆస్పత్రికి ఫెసిలిటీ చార్జ్ చెల్లించనుంది.సింగిల్ బిడ్ వచ్చినా ఆమోదం..ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ పెద్దలు వైద్యారోగ్య శాఖను ఆదాయ వనరుగా మార్చేసుకున్నారని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. అస్మదీయ, కమీషన్ల డీల్ కుదుర్చుకున్న సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. సాధారణంగా సింగిల్ బిడ్ వస్తే టెండరును రద్దుచేసి, మళ్లీ టెండరుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ, ఇందుకు విరుద్ధంగా ప్రస్తుత క్యాథ్ల్యాబ్ టెండరులో అస్మదీయ సంస్థ దాఖలు చేసిన ఒక్క బిడ్నే ఆమోదించి కాంట్రాక్టును అవార్డు చేయడానికి ప్రభుత్వం చకచకా పావులు కదుపుతోంది. ఇప్పుడు వైద్య వర్గాల్లో ఈ బాగోతం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. -
‘చేనేత’లో అవినీతి మేత!
సాక్షి, అమరావతి: రాష్ట్ర చేనేత, జౌళి శాఖలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయింది. నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపుల నుంచి బదిలీలు, డిప్యుటేషన్ల వరకు అంతా అధికారులు, అధికార నాయకుల ఇష్టారాజ్యంగా జరుగుతోంది. ఈ తతంగంపై పలువురు ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. టీడీపీ నేత గుజ్జుల శ్రీనివాసులు ఆప్కో చైర్మన్గా పనిచేసిన సమయంలో అక్రమంగా పవర్లూమ్ క్లాత్ను హ్యాండ్లూమ్ పేరుతో సరఫరా చేయడంపై సీఐడీ విచారణ జరిగింది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా కోట్లాది రూపాయలు చెల్లింపులు జరపడం వెనుక కీలక అధికారుల నుంచి పలువురు నాయకుల వరకు వాటాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బదిలీలకు వసూళ్లు.. ఇవ్వలేదంటే వేధింపులు! అలాగే, ఉద్యోగులు, సిబ్బంది బదిలీలు, డిప్యుటేషన్లకు కూడా చేనేత, జౌళి శాఖలోని ఓ కీలక అధికారి యథేచ్ఛగా వసూళ్ల దందా సాగిస్తున్నట్లు సమాచారం. అలా వసూలు చేసిన మొత్తాలను అవుట్సోర్సింగ్లో నియమించిన వ్యక్తిగత సహాయకులు, బంధువుల ఖాతాల్లో జమ చేయించినట్లు తెలిసింది. అడిగిన సొమ్ము ఇవ్వకపోతే వేధింపులు తప్పవని సిబ్బంది వాపోతున్నారు. రాయలసీమ జిల్లాల్లోని ముగ్గురు అధికారులకు రావాల్సిన న్యాయమైన పదోన్నతులు ఇచ్చేందుకు కూడా రూ.2 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం.బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఒక జిల్లా స్థాయి అధికారిని బదిలీ చేయడం, మరో జిల్లా అధికారిని కలెక్టర్ సిఫారసులకు కూడా వక్రభాష్యం చెప్పి బదిలీతో పాటు సస్పెండ్ చేయించడం వంటి చర్యలు ఆ శాఖలో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటి వరకు ఏకంగా ఐదుగురు జనరల్ మేనేజర్లను మార్చడం, 23 మంది సిబ్బందిని సస్పెండ్ చేయడం వంటి దారుణాలకు పాల్పడ్డారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. నిధులూ పక్కదారి..? ఇక, ఆప్కో ప్రధాన కార్యాలయం ఆధునీకరణ పేరుతో భారీగా నిధులు మింగేసినట్లు ఆరోపణలున్నాయి. జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచి్చన నిధులను సైతం జిల్లా స్థాయిలో కార్యక్రమాలకు సరిగ్గా విడుదల చేయకుండా ‘వెనకేసినట్లు’ తెలిసింది. రూ.8 కోట్ల విలువైన చేనేత వస్త్రాలను హైదరాబాద్లోని వ్యాపారికి బిల్లు, ఇన్వాయిస్ లేకుండా అప్పగించడంతో.. ఆ సొమ్ము ఇప్పటికీ ఆప్కోకు జమకాలేదని సిబ్బంది చెబుతున్నారు. చేనేత, జౌళి శాఖ, ఆప్కోలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు పలువురు 37 కీలక ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
స్వామికే శఠగోపం.. అయినోళ్లకు ‘కోట్లు’ ప్రసాదం
సాక్షి, అమరావతి: భక్తులు గుళ్లలో కానుకలుగా సమర్పించే కోట్ల రూపాయలను తమకు కావాల్సిన వారికి దోచి పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే దేవదాయ శాఖలో టెండరు నిబంధనలను పూర్తిగా మార్చేసి, రాష్ట్రంలో ఏటా అధిక ఆదాయం వచ్చే ఏడు ప్రధాన ఆలయాల్లో క్లీనింగ్ పనుల నిర్వహణ, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సరఫరా కాంట్రాక్టుకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించింది. ప్రభుత్వ ముఖ్య నేతకు బంధువుగా ప్రచారంలో ఉన్న భాస్కరనాయుడికి సంబం«ధించిన పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థకు ఆ పనులు కట్టబెట్టింది. ఇప్పుడు మరో 15 పెద్ద ఆలయాల్లో క్లీనింగ్ పనులను కూడా అదే తరహాలో ఆ సంస్థకు అప్పగించేందుకు సిద్ధమైంది. ఆ 15 ఆలయాలకు కూడా ఉమ్మడిగా టెండర్లు పిలిచేందుకు రెండు రోజుల క్రితం దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆలయాల ఈవోలతో సమావేశం నిర్వహించారు. తొలి విడతలో ఏడు గుళ్లలో క్లీనింగ్ పనుల కోసం ఉమ్మడిగా టెండర్లు నిర్వహించడం ద్వారా రెండేళ్ల కాలానికి దాదాపు రూ.100 కోట్ల విలువైన పనులను దక్కించుకున్న ఆ సంస్థకు సగానికి సగం మిగులుతుందని అధికార వర్గాల్లో చర్చ ఉంది. తాజాగా 15 గుళ్లకు కూడా ఉమ్మడి టెండర్లు ద్వారా మరో రూ.వంద కోట్లకు పైబడి పనులను ఆ సంస్థకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నాడు నిబంధనలు మార్చి కట్టబెట్టేశారు – గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ గుడిలో క్లీనింగ్ పనుల టెండర్లు ఆ గుడి స్థాయిలో వేర్వేరుగా జరిగేవి. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ విధానాన్ని మార్చి.. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించాలని నిర్ణయించింది. – ఈ ఏడు ప్రధాన ఆలయాలు రూ.60 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వార్షికాదాయం కలిగి, జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడిగా టెండర్ల నిర్వహణకు కసరత్తు చేస్తున్న 15 ఆలయాలకు ఏటా రూ.10 కోట్లకు పైబడి ఆదాయం ఉంటోంది. ఇవి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఒకే సంస్థకు ఇలా ముఖ్యమైన ఆలయాల క్లీనింగ్ పనులు అప్పగించడం చూస్తుంటే ఇది ప్రభుత్వ పెద్దల పనే అని స్పష్టమవుతోంది. – తొలుత ఏడు ఆలయాలను అప్పగించేందుకు గత ఏడాది మే నెలలో దేవదాయ శాఖ టెండర్లు నిర్వహించింది. ఆ టెండర్లలో పేర్కొన్న నిబంధనలు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన ఆ సంస్థకు అనుకూలంగా లేవని తేలడంతో ఏకంగా ఆ టెండరునే రద్దు చేశారు. తిరిగి నిబంధనలు సవరించి, జూన్లో మళ్లీ టెండర్లు పిలిచారు. అందులో పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థనే ఎల్–1గా నిలిచింది. – మరోవైపు.. అప్పుడు ఏడు గుళ్లకు కలిపి ఉమ్మడిగా టెండర్లు నిర్వహించే ప్రక్రియలో కేవలం పెద్ద సంస్థలు మాత్రమే టెండరులో పాల్గొనే అవకాశం ఉండేలా నిబంధనలు మార్చడంతో అంతకు ముందు ఆయా గుళ్లలో వేర్వేరుగా క్లీనింగ్ పనులు నిర్వహించిన సంస్థలు పోటీలో పాల్గొనే అర్హత కోల్పోయాయి. ఉమ్మడి టెండర్ల విధానంలో పోటీ తగ్గడం వల్ల పెద్ద సంస్థలు అధిక ధరకు పనులు పొందేలా ప్రభుత్వమే మార్గ నిర్దేశం చేస్తోంది. – గుళ్లలో పారిశుద్ధ్య పనుల్లో నాణ్యత పెంచేందుకే ఉమ్మడి టెండర్లు నిర్వహించినట్టు ప్రభుత్వం చెప్పుకుంటుండగా.. వాస్తవానికి పనుల నాణ్యత తగ్గిపోయిందని దేవదాయ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. 20 రోజుల క్రితం విజయవాడ దుర్గ గుడి పరిధిలోని వాష్రూంలో ఒక వ్యక్తి చనిపోతే నాలుగు రోజుల తర్వాత ఆ విషయం గుర్తించడం గమనార్హం. అంటే నాలుగు రోజుల పాటు అక్కడ పారిశుధ్య పనులే చేపట్టలేదని స్పష్టమవుతోంది. సరైన పర్యవేక్షణ ఉండి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టి ఉంటే వెంటనే ఆ ఘటన వెలుగు చూసేదని భక్తులు చెబుతున్నారు. – ఇప్పటికే కట్టబెట్టిన ఏడు ఆలయాలతో పాటు కొత్తగా మరో 15 ఆలయాల్లో పారిశుద్ధ్య పనులను ఒకే సంస్థకు అప్పగిస్తే పనుల పర్యవేక్షణ తగ్గిపోతుందని అధికార వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలను కాదనలేక ఈ విషయంలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బాలికల ఎన్రోల్మెంటే ఎక్కువ
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో అన్ని స్థాయిల్లో బాలికల స్థూల నమోదు (ఎన్రోల్మెంట్) నిష్పత్తి ఎక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో మూడేళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మహిళలు–పురుషులు–2025 నివేదిక వెల్లడించింది.జాతీయ స్థాయిలో మూడేళ్లుగా పునాది స్థాయిలో బాలురు, బాలికల స్థూల నమోదు నిష్పత్తి తక్కువగా ఉండగా ప్రాథమిక, మధ్య, ద్వితీయ స్థాయిల్లో బాలురు కన్నా బాలికల స్థూల నమోదు అత్యధికంగా నమోదు అవుతోందని నివేదిక స్పష్టం చేసింది. పునాది స్థాయి మినహా మిగతా స్థాయిల్లో ప్రాథమిక విద్యలో బాలురు కన్నా బాలికల స్థూల నమోదు మూడేళ్లుగా ఎక్కువగా ఉండటం విశేషం. -
సూరీడు సలసల
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఎండల తీవ్రత కొనసాగింది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో గరిష్టంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 45.1, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 45, నెల్లూరు జిల్లా కలిగిరిలో 44.4, పల్నాడు జిల్లా నూజెండ్లలో 44.3, చిత్తూరు జిల్లా తవణంపల్లె, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 44.1, వైఎస్సార్ కడప జిల్లా కలసపాడులో 43.9, బాపట్ల జిల్లా కారంచేడులో 43.7, కర్నూలు జిల్లా మంత్రాలయంలో 43.2, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42.8, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పులో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.239 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. వైఎస్సార్ కడప జిల్లాలో 34 మండలాలు, నెల్లూరులో 32, తిరుపతిలో 29, పల్నాడులో 26, ప్రకాశంలో 25, మార్కాపురంలో 21, నంద్యాలలో 20, కర్నూలులో 17, చిత్తూరు జిల్లాలోని 10 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపిందని తెలిపింది. ఆదివారం గుంటూరు జిల్లా మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టిచెరుకూరు మండలాలకు తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది.మరోవైపు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
‘రాజధాని అమరావతి ఓ భ్రమ’
అనంతపురం: రాజధాని అమరావతి ఓ భ్రమ అని ప్రొఫెసర్, ఆర్థిక విశ్లేషకులు సి.రామచంద్రయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడం కోసమే అమరావతి పేరుతో రాజధాని ఎపిసోడ్ను తీసుకొచ్చారన్నారు. అనంతపురంలో జరిగిన ఓ సదస్సులో ప్రొఫెసర్ సి. రామచంద్రయ్య ప్రసంగిస్తూ.. రాజధాని అమరావతి అనేది భ్రమ తప్పితే ఏమీ లేదన్నారు. ‘తాత్కాలిక నిర్మాణాల పేరిట వందల కోట్లు వృథా చేశారు. 2014-19 మధ్య 33 వేల ఎకరాలతోనే సింగపూర్ తరహా రాజధాని చేస్తానన్నారు. ఇప్పుడు 33 ఎకరాలు ఉంటే మున్సిపాలిటీ అంటున్నారు. మరో 50 వేల ఎకరాలు కావాలంటూ రైతులకు ద్రోహం చేస్తున్నారు. అమరావతి నిర్ణయాలు రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని హెచ్చరించారు. -
మళ్లీ పెరిగిన ఏపీ అసెంబ్లీ నిర్మాణ వ్యయం
సాక్షి, విజయవాడ: అసెంబ్లీ నిర్మాణ వ్యయం మళ్లీ పెరిగింది. రూ. 798 కోట్లు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం మరింత పెరగనుంది. ఇప్పటికే అత్యధిక ధరకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే.కరకట్ట అభివృద్ధికి 443 కోట్ల నిధులను కేటాయిస్తూ.. పరిపాలనా అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మట్టికట్ట ద్వారా అభివృద్ధికి 443 కోట్లు ఖర్చు చేయాలని, కృష్ణా రైట్ బ్యాక్ని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ గ్రామం సదుపాయాలకు 580 కోట్లు కేటాయించింది. అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, సీవరేజ్, విద్యుత్ , ఎస్టీపీ కోసం ఖర్చుచేయాలని నిర్ణయించింది.అమరావతి సచివాలయానికి భారీగా నిధులు ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 2540 కోట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హంగులు, అద్దాల కోసం భారీగా ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అద్దాలు, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కనోపి స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్ కోసం భారీగా ఖర్చు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ టవర్, టవర్ 1,2,3,4 లలో హంగుల కోసం నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. క్వాంటమ్ టవర్స్ కోసం 1208 కోట్లు ఖర్చు చేయాలని పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
కుట్ర ‘పన్ను’.. కొల్లగొట్టు!.. రవాణాలో ‘ట్యాక్స్’ డీల్
సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ ఖజానా నిండితే నాకేంటీ... నా సొంత ఖజానా కళ కళలాడాలి గానీ’ అని ప్రభుత్వంలో ఓ కీలక నేత భావించారు. రాయలసీమకు చెందిన ఆయన అందుకే ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్తో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ ప్రైవేట్ ట్రావెల్స్పై పన్నులు తగ్గించేందుకు పచ్చ జెండా ఊపారు. ప్రతిగా రూ.18కోట్ల డీల్ సెటిల్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో తమ బస్సుల రిజిస్ట్రేషన్ను రాష్ట్రానికి మార్చాల్సిన అనివార్యతను ఏపీ ప్రయోజనాలకు అనుకూలంగా అమలు చేసి, రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని తెచ్చే సదవకాశాన్ని కాలరాశారు. రవాణా శాఖలో చర్చనీయాంశంగా మారిన వ్యవహారం ఇదిగో ఇలా ఉంది...ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్... ఏపీలో సర్వీసులురాష్ట్రంలో సర్వీసులు నిర్వహిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవనే విషయం బహిరంగ రహస్యం. ఆంధ్రప్రదేశ్తోపాటు ప్రధాన రాష్ట్రాల్లో పన్నుల కంటే ఈశాన్య రాష్ట్రాల్లో పన్నులు తక్కువగా ఉండటమే అందుకు కారణం. ప్రైవేట్ బస్సుల్లో ఒక్కో సీటుకు త్రైమాసికానికి రూ.4వేలు చొప్పున పన్ను చెల్లించాలి. ఆ లెక్కన ఒక్కో బస్సుకు మూడు నెలలకు రూ.1.50 లక్షల చొప్పున ఏడాదికి రూ.6 లక్షలు చెల్లించాలి. కాగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్లో బస్సుకు రూ.56 వేలు, అరుణాచల్ ప్రదేశ్లో రూ.50 వేలు మాత్రమే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు.అందుకే రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఏపీలో సర్వీసులు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో చేసిన విధాన నిర్ణయాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వన్ నేషన్.. వన్ పర్మిట్ కింద కేంద్ర ప్రభుత్వానికి రూ.90 వేలు చెల్లిస్తే చాలు ఏ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసినా దేశవ్యాప్తంగా సర్వీసులు నిర్వహించుకోవచ్చు. రాష్ట్రంలో సర్వీసులు నిర్వహిస్తున్న 2,200 ప్రైవేటు బస్సుల్లో 1,800 బస్సులకు పైగా ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసినవే కావడం గమనార్హం. ఈ విధానంతో రాష్ట్ర ఖజానా ఏటా రూ.100కోట్ల మేర నష్టపోతోంది.కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ట్రావెల్స్ దందాకు చెక్రాష్ట్ర అధికారులు కచ్చితంగా వ్యవహరిస్తే చాలుకాగా అఖిల భారత పర్మిట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తన విధాన నిర్ణయాన్ని సవరించింది. ఏ రాష్ట్రంలో బస్సులను రిజిస్ట్రేషన్ చేస్తారో... ఆ రాష్ట్రంలో నెలలో కనీసం అయిదు రోజులపాటు సర్వీసులు నిర్వహించాలని పేర్కొంది. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్ సిండికేట్ దందాకు చెక్ పడింది. ఎందుకంటే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసిన బస్సులను నెలలో అయిదు రోజులపాటు ఆ రాష్ట్రాల్లో తిప్పాలి. ఆ రాష్ట్రాలకు వెళ్లి వచ్చేందుకు కనీసం మరో అయిదు రోజులు పడుతుంది. అంటే నెలలో పది రోజులపాటు ఆంధ్ర ప్రదేశ్కు వెలుపల బస్సులు ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ రాష్ట్రాలకు ప్రయాణికులు దాదాపు ఉండరు. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులకు ఆర్థికంగా పెనుభారంగా మారుతుంది.పది రోజుల సర్వీసుల రాబడి కోల్పోవడంతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి వచ్చేందుకు అయ్యే ఖర్చుతో తడిసిమోపెడవుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ పన్నులతో వచ్చే మిగులు కంటే ఈ ఆర్థిక భారం అధికం. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమ బస్సుల రిజిస్ట్రేషన్ను ఆంధ్రప్రదేశ్కు మార్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. రాష్ట్ర రవాణా శాఖ అధికారులు చేయాల్సింది... కేంద్రం తాజాగా జారీ చేసిన నిబంధనలను ట్రావెల్స్ యజమానులు కచ్చితంగా పాటిస్తున్నారా లేదా అంటే.. నెలలో అయిదు రోజులపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సర్వీసులు నిర్వహిస్తున్నారా లేదా అని విస్తృతంగా తనిఖీలు చేయడమే. నిబంధనలను పాటించని బస్సులపై జరిమానాలు విధించడమే. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు తమ బస్సుల రిజిస్ట్రేషన్ను ఆంధ్రప్రదేశ్కు మారుస్తారు.కీలక నేత రూ.18 కోట్ల డీల్ ... ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.100 కోట్ల గండిఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రైవేట్ బస్సులపై పన్నులు తగ్గించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్కుగానీ ఇతర దక్షిణ భారత రాష్ట్రాలకు ఏమాత్రం లేదు. ప్రస్తుతం ఉన్న పన్నుల విధానం కొనసాగిస్తే చాలు.. ఖజానాకు ఆదాయం వస్తుంది. ఇదే విషయాన్ని రవాణా శాఖ అధికారులు ప్రభుత్వానికి చెప్పారు. కానీ ‘ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తే నాకేంటీ అని ప్రభుత్వంలో ఓ కీలక నేత భావించారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి తన సొంత ఖజానా నింపుకునే పనిలో పడ్డారు. అదే విషయాన్ని తనతో సంప్రదింపులు జరిపిన ట్రావెల్స్ సిండికేట్కు స్పష్టం చేశారు. తనకు భారీగా ముడుపులు ముట్టజెప్పితే ట్రావెల్స్ బస్సులపై పన్నులు తగ్గిస్తానని ఆఫర్ ఇచ్చారు. ఒక్కో బస్సుకు రూ.లక్ష చొప్పు¯]∙ఇస్తే.. ఒక్కో సీటుపై పన్నును రూ.4వేల నుంచి రూ.2,500కు తగ్గిస్తామని ఆయన తన రేటు స్పష్టం చేశారు.అందుకు ట్రావెల్స్ సిండికేట్ సమ్మతించింది. ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్తో రాష్ట్రంలో దాదాపు రూ.1,800 ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. బస్సుకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.18కోట్లకు డీల్ను సూత్రప్రాయంగా ఆమోదించారు. దీంతో పన్ను రేట్లు తగ్గిస్తూ ప్రతిపాదనలు రూపొందించాలని కీలక నేత రవాణా శాఖ అధికారులను మౌఖికంగా ఆదేశించారు. ఇక పన్ను రేట్లు తగ్గిస్తూ ఉత్తర్వులు వెలువడటం.. కీలక నేతకు రూ.18కోట్లు ముడుపులు ముట్టడమే మిగిలింది. కానీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం ఏటా రూ.100 కోట్ల గండి పడనుంది. -
‘బండ’ బాదుడు
సాక్షి, అమరావతి : వాణిజ్య సిలిండర్ ధర అమాంతంగా పెరిగిపోయింది. ఒక్కసారిగా రూ.993 పెరిగింది. గడిచిన 22 నెలల్లో ఈ గ్యాస్ ధర మూడుసార్లు పెరిగినట్లయింది. తాజా పెరుగుదలతో 19 కిలోల వాణిజ్య సిలిండర్ రూ.3,315 పలుకుతోంది. కాగా, రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం, వాణిజ్య గ్యాస్ రేట్ల భారీ పెంపుతో హోటల్ రంగం కుదేలయ్యిందని స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితులతో హోటళ్ల యజమానులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.హోటల్ వ్యవస్థను కాపాడుకోవడానికి మెనూ ధరల్లో 10 శాతం పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి పన్ను రాయితీలు, సబ్సిడీలిచ్చి హోటల్ రంగాన్ని ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడటానికి, హోటళ్లను ఆర్థిక నష్టాల నుంచి బయటపడేయటానికి గత్యంతరంలేని పరిస్థితుల్లో రేట్లు పెంచుతున్నామన్నారు. వంట నూనెలు, నిత్యావసరాలు, ప్యాకింగ్ మెటీరియల్ ఖర్చులు భారీగా పెరిగాయన్నారు. -
రోడ్డుపై లారీలను పరిశీలించే విధులూ సచివాలయ ఉద్యోగులకే..
సాక్షి, అమరావతి: సచివాలయ వ్యవస్థ లక్ష్యానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లుపొడుస్తోంది. ఉద్యోగులకు సంబంధం లేని బాధ్యతలు అప్పగిస్తూ చిన్నచూపుచూస్తోంది. మొన్నటికి మొన్న పల్నాడు జిల్లాలో సచివాలయ ఉద్యోగులకు పెట్రోల్ బంకుల వద్ద విధులు వేసిన ఘటన మరువక ముందే అనకాపల్లి జిల్లాలో వింత విధులు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీపీసీ యార్డు నుంచి ఫ్లైయాష్ నింపుకొని వచ్చి పోయే లారీలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పైఅధికారులకు సమాచారమిచ్చేందుకు కాపలా కాసే బాధ్యత కూడా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల నెత్తినే పడింది.అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం ఫ్లై ఓవర్ వద్ద గత నెల 30 నుంచి ఈ నెల 8 వరకు ఈ పనిచేసేందుకు 18 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు.. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరొకరు చొప్పున రోజుకు ఇద్దరు సచివాలయ ఉద్యోగులకు విధులు అప్పగించారు.సచివాలయ ఉద్యోగులకు లారీలను పరిశీలించే విధులు అప్పగిస్తూ పరవాడ ఎంపీడీవో జారీ చేసిన ఉత్తర్వులు ఫ్లై యాష్ లోడుతో వెళ్లే లారీలపై టార్పాలిన్ లేకపోతే ఆ లారీ వివరాలు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నివేదించాలని పరవాడ ఎంపీడీవో ఆదేశాలు జారీ చేశారు. ఫ్లై యాష్ రవాణాతో ప్రజలు, జంతువులకు ఇబ్బంది కలుగకుండా, ప్రమాదాలను నివారించేందుకే సచివాలయాల ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించామనిఎంపీడీవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు దారుణం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకుడు, విలేజీ సర్వేయర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వలంటీర్లు లేని లోటును భర్తీ చేయడానికి 1.32 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను అడ్డంగా వాడుకుంటున్నారే తప్ప, కనీస హక్కులను పట్టించుకోవడం లేదన్నారు. ఇంక్రిమెంట్లు, కనీసం బేసిక్ పే సవరణ కూడా లేకుండా పోయిందని పేర్కొన్నారు.మరోవైపు డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉద్యోగంలో చేరిన తమకు మరుగుదొడ్లు, పెట్రోల్ బంకుల వద్ద డ్యూటీలు వేయడం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు. సమస్యలు చెప్పుకుందామంటే ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అవకాశమే ఇవ్వడం లేదని పేర్కొన్నారు.పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలని, పదోన్నతులు కల్పించాలని.. సచివాలయ ఉద్యోగులను ఇతర శాఖల్లోకి డిప్యుటేషన్ మీద కాకుండా, శాశ్వత ప్రాతిపదికన విలీనం చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధమవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఉద్యోగులు ‘చలో విజయవాడ’, నిరాహార దీక్షలకు పూనుకుంటామని పేర్కొన్నారు. -
అసెంబ్లీ అద్దాలకు రూ.2,540 కోట్లా!?
సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో ప్రజల కష్టార్జితాన్ని చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకుంటోందని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ భవనాల అద్దాల కోసం ఏకంగా రూ.2,540 కోట్లు కేటాయించడంపై విస్మయం వ్యక్తంచేశారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ.18,500 వరకు ఖర్చుచేయడం ఏ రకమైన పాలనని ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు తన అస్మదీయులకు సంపద సృష్టించేందుకు వేసిన నిరంతర దోపిడీ ప్లాన్ అని ఆరోపించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్కు ప్రజల్లో వస్తున్న సానుకూలతను తట్టుకోలేకే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులతో జర్నలిస్టులను, ప్రతిపక్ష నేతలను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని సజ్జల హెచ్చరించారు. ఆయనింకా ఏమన్నారంటే..చ.అడుగుకి రూ.18,500అమరావతిలో భవిష్యత్తులో కట్టబోయే అసెంబ్లీ బిల్డింగుల అద్దాల కోసమే రూ.2,540 కోట్లతో కాంట్రాక్టుకు రెడీ అయ్యారు. బిల్డింగ్ వర్క్, ప్లంబింగ్, డ్రైనేజీ వంటి పనులకు చదరపు అడుగుకి రూ.12 వేల నుంచి రూ.14 వేలు అనుకుంటే.. మున్ముందు ఇది ఎంతకు పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. రాజధానిలో నిర్మాణం చేపడుతున్న 52 లక్షల చదరపు అడుగులకి ఈ నిర్మాణ ఖర్చు కూడా కలుపుతుంటే.. చదరపు అడుగుకి రూ.18,500 వరకు ఖర్చవుతుంది. అలాగే, పాలవాగును టవర్స్ మధ్యలో తిప్పుతూ కృష్ణానదిలో కలిపేలా డిజైనింగ్ చేస్తారట. ఆ డిజైనింగ్కు మరో రూ.వందో, రెండు వందల కోట్లో ఇస్తారు.రైతుల సందేహాలకు సమాధానంలేదుఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఖర్చుపెడితే నాలుగైదేళ్లలో పూర్తయ్యే కొత్త మెడికల్ కాలేజీలకు డబ్బుల్లేవని చెబుతూ మరోవైపు.. అమరావతి కోసం ఇష్టారాజ్యంగా బరితెగిస్తున్నారు. మెడికల్ కాలేజీలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, రైతులకు మద్దతు ధరల కోసం నిధుల్లేవని చెబుతూ అమరావతి దోపిడీకి మాత్రం భారీగా నిధులు విడుదల చేయడం విడ్డూరం. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే.. రెండో దశ భూములు తీసుకునే ప్రక్రియలో కూడా దోపిడీకి తెరలేపారు. కానీ, రైతులు తమ సందేహాలను అడిగితే వాటికి సమాధానంలేదు. పైగా.. తమకు కావాల్సిన వాళ్లకు, దగ్గరి వాళ్ల లేఅవుట్లకు మాత్రం ఎడాపెడా అనుమతులిచ్చేస్తున్నారు.అరెస్టులతో అణచివేయలేరుపూడి శ్రీహరిని సంబంధంలేని వ్యవహారంలో అరెస్టుచేశారు. ఈ విషయంలో చంద్రబాబు, లోకేశ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయలేరు. మిమ్మల్ని రాజకీయంగా సమాధిచేసే శక్తి వైఎస్సార్సీపీకి మాత్రమే ఉంది. ఇక పేదలకు కేటాయించిన 50 వేల ఇళ్ల పట్టాలను నిర్దాక్షిణ్యంగా రద్దుచేయడం చంద్రబాబుకు పేదలపై ఉన్న కక్షను తెలియజేస్తోంది. కాగా, మెంబర్షిప్, ఎస్ఐఆర్పై వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ఫోకస్ పెంచాలని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పార్టీ కీలక నేతలతో శుక్రవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. -
అవినీతిలో అ‘ధర’హో!
రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు దోపిడీకి సరికొత్త దారులు వెతుకుతోంది.. పూటకో నిర్ణయంతో రాజధాని నిర్మాణ వ్యయాన్ని కనీవినీ ఎరుగని రీతిలో ఇష్టారాజ్యంగా పెంచేస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టుకు ఇచ్చిన పనిని మళ్లీ ముక్కలు ముక్కలుగా చేసి అదనంగా దోచి పెడుతోంది.. ప్రజల సొమ్మును అందినకాడికి దండుకోడానికి ఇంతగా బరితెగించడం నిర్మాణ రంగ నిపుణులను విస్మయ పరుస్తోంది.. ఇంతటి అవినీతి బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండదని అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి.సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయాన్ని చంద్రబాబు సర్కార్ మళ్లీ పెంచేసి సరికొత్త రికార్డు సృష్టించింది. డయాగ్రిడ్ విధానంలో 39 అంతస్తులతో నిర్మిస్తున్న నాలుగు టవర్లు.. 49 అంతస్తులతో నిర్మిస్తున్న మరో టవర్కు అద్దాలను అమర్చడం (గ్లాస్, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కాలమ్ క్లాడింగ్, స్కైలైట్), ఫొటో వోల్టాయిక్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు, బిల్డింగ్ మెయింటెనెన్స్ యూనిట్ (బీఎంయూ)లు ఏర్పాటు చేసే పనులు చేపట్టేందుకు రూ.2,540 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు మూడు ప్యాకేజీల కింద టెండర్లు పిలవడానికి అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏజీఐసీఎల్)కు అనుమతి ఇచ్చింది.దాంతో.. డిజైన్లతో కలిపి శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). దీన్ని బట్టి శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.18,413.68కు చేరిందని స్పష్టమవుతోంది. ఇక అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ) పేరుతో సచివాలయం టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను నిర్మిస్తున్న 1,575 ఎకరాల లేవుట్లో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే పనులను రూ.1057.62 కోట్లతో చేపట్టింది. దీన్ని కూడా కలుపుకుంటే.. సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.20,439.58కు చేరుకుంది.బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్తో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.4,500కు మించడం లేదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. సంప్రదాయ పద్దతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా, నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణ వ్యయం ఇంతింతై.. అన్నట్లుగా నానాటికీ పెరుగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.అప్పులు తెచ్చి.. నీకింత–నాకింతరాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2016లో తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,350తో మొదలై.. పూర్తయ్యే సరికి రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంతకు చేరుతుందోనని లెక్కలు వేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి రాజధాని నిర్మాణానికి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి.. వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచిపెడుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్య నేత పంచుకుతినేలా కుట్ర పన్నారంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.అప్పుడు, ఇప్పుడు అదే కాంట్రాక్టర్శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోల్చితే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాలి్సనంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోల్చితే టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ నాడు ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్ (విద్యుత్ సరఫరా), హెచ్వీఏసీ (వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది.దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. టవర్ల డిజైన్ల పనులను రూ.401.54 కోట్లకు పోస్టర్ పార్టనర్స్–హాఫీజ్ కాంట్రాక్టర్, జెనిసిస్ ప్లానర్స్కు అప్పగించారు. తాజాగా అద్దాలు అమర్చే పనులను రూ.2,540 కోట్లతో చేపట్టారు. దాంతో శాశ్వత సచివాలయ టవర్ల నిర్మాణ వ్యయం రూ.9,612.85 కోట్లకు చేరుకుంది.గూడుపుఠాణీ కాక మరేంటి?⇒ సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2025లో చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 టవర్లను కూడా బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది.⇒ 1, 2 టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487.11 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.81 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో షాపూర్జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.830.35 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.⇒ 3, 4 టవర్ల నిర్మాణ పనులను 4.54 శాతం అధిక ధరకు అంటే రూ.1,303.85 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.55 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఎల్ అండ్ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే 3, 4 టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.760.93 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది.⇒ జీఏడీ టవర్ నిర్మాణ పనులను 4.53 శాతం అధిక ధరకు అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1 నిలిచిన ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు సీఆర్డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోల్చితే ఇప్పటికే జీఏడీ టవర్ కాంట్రాక్టు వ్యయం రూ.492.01 కోట్లు పెరిగింది.⇒ నాడు, నేడు టెండర్లలో ఒకే కాంట్రాక్టర్కు పనులు దక్కాయి. టెండర్లలో గూడుపుఠాణీ జరిగిందనడానికి ఇదే తార్కాణమని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.17,356.54అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 3 అంతస్తుల్లో (బీ+జీ+3) 11,21,975 చదరపు అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్ను కూడా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ సంస్థే రూపొందించింది. ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617.33 కోట్లకు కోట్ చేసిన ఎల్ అండ్ టీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది.జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. ఇటీవల ఈ భవనంలో ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ పనులు చేపట్టేందుకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అసెంబ్లీ భవనంలో స్పైర్, పార్కింగ్ రింగ్, రింగ్ రూఫ్ వంటి సివిల్ స్ట్రక్చర్ పనులు చేపట్టడానికి మరో రూ.798 కోట్లతో అనుమతి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం రూ.1,947.36 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగు రూ.17,356.54కు చేరుకుంది. -
పోలవరం పనులపై కేంద్రం అసంతృప్తి
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనుల నత్త నడకపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులని కేంద్రం ప్రశ్నించింది. నిర్మాణ పనులకు డీజిల్ దొరకడం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జవాబు ఇవ్వడంతో అందుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. పోలవరం పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష నిర్వహించించింది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో సమావేశం జరగ్గా ఏపీ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. -
పూడి శ్రీహరికి హైకోర్టులో ఊరట
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గుంటూరు కోర్టులలో ఊరట లభించింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సూచించింది. నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గుంటూరు కోర్టులోనూ పూడి శ్రీహరికి ఊరట దక్కింది. కొత్తపేట పీఎస్లో నమోదైన కేసులో పూడి శ్రీహరికి బెయిల్ ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. తనపై గుంటూరు జిల్లా నల్లపాడు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు తేలేందత వరకు ఆ కేసుల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆయన గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. ఒకే అంశానికి సంబంధించి బహుళ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కావాలనే కేసులు పెట్టారు. ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అందుకు నన్ను బాధ్యుడిని చేయడం తగదు’అని శ్రీహరి తన వ్యాజ్యాల్లో పేర్కొన్నారు.పూడి శ్రీహరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, గుంటూరు కోర్టులు తీర్పును వెలువరించాయి. నమోదైన కేసుల్లో పూడి శ్రీహరిని అరెస్ట్ చేయొద్దని 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఆదేశించాయి. -
వైఎస్ జగన్ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది. ఇదే గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశం. ఆ మహనీయుడు చెప్పిన మాటలు నేటికీ ఆచరణీయం. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ``మన ఆలోచనలను సరిచేసుకుంటే, మన జీవితం మారుతుంది``. ఇదే గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశం. ఆ మహనీయుడు చెప్పిన మాటలు నేటికీ ఆచరణీయం. గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు.#BuddhaPurnima pic.twitter.com/3IOxAULn6O— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2026 -
కార్మికులకు వైఎస్ జగన్ మే డే శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: కార్మికులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు.. సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారు. దేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. అభివృద్ధి వెలుగులకు జీవం పోసే కనిపించని హీరోలు నా శ్రామికులు. కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కార్మికులు..సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారుదేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారుఅభివృద్ధి వెలుగులకు జీవం పోసే కనిపించని హీరోలు నా శ్రామికులు.కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.#InternationalWorkersDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2026 -
రైతులకు విత్తన విపత్తు
అనంతపురం అగ్రికల్చర్: జూన్ నుంచి ఖరీఫ్–2026 ప్రారంభం కానుంది. అంతలోపు అంటే మే నెలలోనే రైతులకు రాయితీతో విత్తనం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు ఏప్రిల్ రెండో వారం నుంచి విత్తన సేకరణ ప్రక్రియ మొదలు పెట్టాలి. కానీ నాలుగో వారం వచ్చినా విత్తనానికి సంబంధించి చడీ చప్పుడు కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ‘అనంత’ రైతులకు విత్తన విపత్తు తప్పేపరిస్థితి కానరావడం లేదు. గత ఏడాది ఇలా.. ఖరీఫ్–2025లో కూడా రైతులకు విత్తన వేరుశనగ సకాలంలో అందలేదు. దాదాపు నెల రోజులు ఆలస్యంగా అంటే జూన్ 5 నుంచి రాయితీ విత్తన పంపిణీ మొదలు పెట్టారు. గతేడాది మొదట లక్ష క్వింటాళ్ల వేరుశనగ అన్నారు. తర్వాత 50 వేల క్వింటాళ్లకు కొర్రీ వేశారు. పంపిణీ బాగా ఆలస్యం చేయడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే రబీలో కూడా రాయితీ విత్తన పప్పుశనగ పంపిణీ పంట వేసుకున్న తర్వాత మొదలు పెట్టడంతో రైతులకు ఉపయోగం లేకుండా పోయింది.రాష్ట్ర క్యాబినెట్లో కీలకమంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ స్వంత నియోజకవర్గం ఉరవకొండ ప్రాంతంలోనే పప్పుశనగ సాగు అధికంగా ఉన్నా సకాలంలో విత్తనం ఇవ్వలేని దుస్థితి కల్పించారు. జిల్లాకు 14 వేల క్వింటాళ్లు కేటాయించినా చివరకు 2 వేల క్వింటాళ్లు మాత్రమే అందించి చేతులు దులుపుకున్నారు. అది కూడా 25 శాతం రాయితీ కల్పించడంతో రైతులకు ఏ మాత్రమూ ప్రయోజనం కలగలేదు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం గత రెండేళ్ల ఖరీఫ్, రబీలో రాయితీ విత్తనం కంటితుడుపుగా ఇవ్వడంతో పంట సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విత్తన సేకరణకు ససేమిరా.. ఏపీ సీడ్స్ ద్వారా గత ఖరీఫ్, రబీలో విత్తనం సరఫరా చేసిన ఏజెన్సీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు పూర్తి చేయలేదు. దీంతో ఈసారి విత్తన సేకరణకు ఏజెన్సీలు మొగ్గు చూపే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాదికి సంబంధించి రూ.110 కోట్లు బకాయిలు చెల్లిస్తే కానీ తాము విత్తనం సమకూర్చలేమని ఇటీవల జేడీఏ దగ్గర మొరపెట్టుకున్నారు.కనీసం రైతుల నుంచి వసూలు చేసిన నాన్సబ్సిడీ సొమ్ము కూడా తమకు ఇవ్వకుండా వాడేసుకోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారి కూడా సకాలంలో రైతులకు విత్తనం అందడం కష్టంగానే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇలా జాప్యం చేయడం వల్ల జిల్లాలో రబీలో రైతులు పండించిన నాణ్యమైన వేరుశనగ వ్యాపారులు, దళారులు ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రభుత్వం మేల్కొనేలోపు చివరకు నాసిరకం, కల్తీ సరుకు అంటగట్టే పరిస్థితి ఉంటుందని రైతులు వాపోతున్నారు. జగన్ ప్రభుత్వంలో అవార్డులువైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు హయాంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ద్వారా ఖరీఫ్, రబీ మొదలు కాకమునుపే గ్రామ స్థాయిలో రైతులకు రాయితీ విత్తనాలు విజయవంతంగా అందించారు. ఫలితంగా ఏపీ సీడ్స్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకుంది. 2021–22 అలాగే 2022–23 జాతీయ అవార్డులు తీసుకుంది. అలాగే 2022 ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు కూడా అందుకుంది. ఖరీఫ్, రబీలో రైతులకు అవసరమైన నాణ్యమైన అన్ని రకాల విత్తనాలు సకాలంలో అందించిన ఏపీ సీడ్స్ ఇప్పుడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయితీ తగ్గించడంతో పాటు విత్తన కేటాయింపులకు కూడా సగానికి సగం మేర కొర్రీలు వేసింది. దీంతో రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాన్ని నమ్ముకోలేక బయట ప్రాంతంలో స్వంతంగా సమకూర్చుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. -
‘ముఖ్య’నేత సన్నిహితుల లేఅవుట్లకు రైట్ రైట్.. ‘పూలింగ్’.. పక్కా ప్లానింగ్!
సాక్షి, అమరావతి: రాజధాని రెండో విడత భూసమీకరణలో చంద్రబాబు సర్కార్ మాయాజాలానికి ఇదో తార్కాణం! 2015లో రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి కారుచౌకగా రైతుల నుంచి భారీ ఎత్తున భూములు కాజేసిన పచ్చ ముఠా.. ఇప్పుడు రెండో విడత భూసమీకరణలోనూ అక్రమాలకు పాల్పడుతోందని రైతులు మండిపడుతున్నారు. సమీకరణ కింద ఇస్తే ప్రయోజనం స్వల్పమే..ఉమ్మడి గుంటూరు జిల్లాలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 29 గ్రామాల్లో 53,749.49 ఎకరాలను రాజధానిగా 2015లో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 37,941.58 ఎకరాలను రైతుల నుంచి సమీకరిస్తామని పేర్కొంది. అయితే 29 గ్రామాలకే పరిమితమైతే రాజధాని చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందంటూ మలి విడతలో మరో 44 వేల ఎకరాలను సమీకరిస్తామని చంద్రబాబు 2024లో లీకులు ఇచ్చారు. రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో విడతల వారీగా సమీకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాల సమీకరణకు 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు జారీ అయ్యాయి. భూసమీకరణ కింద ఎకరం భూమి ఇస్తే.. మెట్ట భూమికైతే అభివృద్ధి చేసిన వెయ్యి గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య ప్లాటు.. అదే జరీబు భూమి అయితే వెయ్యి గజాల నివాస, 450 గజాల వాణిజ్య ప్లాటు సీఆర్డీఏ ఇస్తుంది.పూలింగ్ నుంచి మినహాయిస్తే భారీగా లబ్ధి..భూసమీకరణతో ప్రయోజనం స్వల్పమే.. అదే మినహాయింపు లభిస్తే భారీగా లబ్ధి పొందవచ్చు. దీంతో భూసమీకరణ పథకం నిబంధనలను అడ్డు పెట్టుకుని భారీ ఎత్తున ప్రయోజనం పొందేందుకు ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులైన ప్రజాప్రతినిధులు, నేతలు లేఅవుట్లను తెరపైకి తెస్తున్నారు. మలి విడత భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను 2025 జూలై 1న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. ఆ విధి వి«ధానాల ప్రకారం గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏడు గ్రామాల పరిధిలో 20,494 ఎకరాలను సమీకరించడానికి సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇస్తూ 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు జారీ చేశారు.అంటే.. అప్పటి ఆ గ్రామాల పరిధిలో లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ.. ల్యాండ్ పూలింగ్ స్కీం–2025లో పదో నిబంధనను అడ్డుపెట్టుకుని లేఅవుట్లకు మినహాయింపు పొందడం ద్వారా భారీ ఎత్తున ప్రయోజనం పొందడానికి ముఖ్యనేత సన్నిహితులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలం పెదపరిమిలో 9.798 ఎకరాల్లో లేఅవుట్ వేయడానికి అనుమతి కోసం సమర్పించిన దరఖాస్తును ఆ గ్రామంలో భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి వారం ముందు సీఆర్డీఏ కమిషనర్ ఆమోదించారు. లేఅవుట్కు ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల.. ఆ లేవుట్లో ప్లాట్ల విస్తీర్ణం 21,623.12 చదరపు మీటర్లు(25,861.04 చదరపు గజాలు) పుట్టి రామచంద్రరావుకు వస్తుంది.ఒకవేళ అదే భూమిని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి ఉంటే.. ఆయనకు 9,798 గజాల ఇంటి స్థలం, 1,959.6 గజాల వాణిజ్య స్థలం, పదేళ్లపాటు కౌలు వస్తుంది. ఇక మల్లవరపు లక్షి, మల్లవరపు సాల్మన్ రాజు నుంచి జీపీఏ పొందిన భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావు పెదపరిమిలో 3.8301 ఎకరాల్లో లేఅవుట్ అనుమతి కోసం అందచేసిన దరఖాస్తుపై ఏప్రిల్ 6న సీఆర్డీఏ కమిషనర్ ఆమోదముద్ర వేశారు. దీనివల్ల వారికి 9,408.91 చదరపు మీటర్లు (11,252.97 చదరపు గజాలు) విస్తీర్ణం కలిగిన ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. అదే వారు భూసమీకరణ కింద సీఆర్డీఏకు అప్పగిస్తే.. 3,830.1 చదరపు గజాల ఇంటి స్థలం, 766 గజాల వాణిజ్య స్థలం, పదేళ్లపాటు కౌలు వచ్చేది.రాజధాని నిర్మాణానికి అదనంగా భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ స్కీం(భూసమీకరణ పథకం)– 2025 విధి విధానాలను 2025 జూలై 1న ప్రభుత్వం జారీ (జీవో ఎంఎస్ నెంబరు 118) చేసింది.పల్నాడు జిల్లాలో అమరావతి మండలం వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి.. గుంటూరు జిల్లాలో తుళ్లూరు మండలం వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాల్లో 20,494 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 విధి విధానాల ప్రకారం సమీకరించేందుకు సీఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇస్తూ 2025 డిసెంబరు 2న ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెంబరు 252) జారీ చేసింది.గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో భూసమీకరణ యూనిట్–1 కింద 3,072.23 ఎకరాలు.. భూసమీకరణ యూనిట్–2 కింద 3,056.72 ఎకరాలను సమీకరించేందుకు ఏప్రిల్ 13న సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ..పెదపరిమి భూసమీకరణ నోటిఫికేషన్ జారీకి సరిగ్గా వారం ముందు అంటే ఏప్రిల్ 6న అదే గ్రామంలో సర్వే నెంబరు 447/1బీ(పీ), 447/1సీ(పీ), 447/2లో 9.798 ఎకరాలలో పుట్టి రామచంద్రరావు వేసిన లేఅవుట్కు.. సర్వే నెంబరు 82/బీ(పీ)లో 3.8301లో మల్లవరపు లక్ష్మి, మల్లవరపు సాల్మన్ రాజు నుంచి జీపీఏ తీసుకున్న సన్ సిరి ప్రాజెక్ట్స్ గ్రీన్ డిలైట్ కేపిటల్ మేనేజింగ్ పార్టనర్లు భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావుæ వేసిన లేఅవుట్కు సీఆర్డీఏ కమిషనర్ అనుమతి ఇచ్చేశారు.ల్యాండ్ పూలింగ్ స్కీం–2025 పదో నిబంధన ప్రకారం వీజీటీఎం, ఉడా, సీఆర్డీఏ, డీటీసీపీ నుంచి అనుమతి పొందిన లేఅవుట్లను భూసమీకరణ నుంచి మినహాయించాలి. అంటే.. పుట్టి రామచంద్రరావు, భాష్యం రాజేష్, కొడాలి నాగేశ్వరరావులు వేసిన లేఅవుట్లకు సంబంధించి 13.8301 ఎకరాలకు భూసమీకరణ నుంచి మినహాయింపు లభిస్తుంది. తద్వారా వారికి భారీ ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ల్యాండ్ పూలింగ్ స్కీంను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాక.. లేఅవుట్లకు అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడానికి సరిగ్గా వారం ముందు లేఅవుట్లకు అనుమతి ఇవ్వడంపై రాజధాని రైతులు విస్తుపోతున్నారు. ముఖ్యనేతకు సన్నిహితుడైన కార్పొరేట్ ఎమ్మెల్యే సన్నిహితులకు ఒక న్యాయం.. తమకో న్యాయమా..! అంటూ రాజధాని రైతులు మండిపడుతున్నారు. -
టెన్త్ ఉత్తీర్ణత 85.25 శాతం
సాక్షి, అమరావతి: గతనెలలో జరిగిన పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫలితాలు గతేడాది కంటే కాస్త మెరుగుపడ్డాయి. ఉత్తీర్ణత గతేడాది కంటే 4.11 శాతం పెరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉత్తీర్ణత 2024లో వచ్చిన 86.69 శాతాన్ని దాటలేకపోయింది. పదోతరగతి పరీక్ష ఫలితాలను గురువారం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు. 2025–26 విద్యా సంవత్సరంలో 6,18,131 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 5,26,954 మంది (85.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారిలో బాలికలు 2,67,321 మంది (87.90 శాతం), బాలురు 2,59,633 మంది (82.68 శాతం) ఉన్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలను ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలోనూ రాసేందుకు అవకాశం కల్పించారు. ఇంగ్లిష్ మీడియంలో 5,83,645 మంది హాజరవగా, 5,03,539 మంది పాసయ్యారు. తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన 30,129 మందిలో 19,834 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ రెండు మాధ్యమాలతో పాటు హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒడియా భాషల్లోను స్వల్పసంఖ్యలో పరీక్షలు రాశారు. ఈ ఏడాది పరీక్షల్లో పాసైన వారిలో అత్యధికంగా 83.69 శాతం మంది ప్రథమ శ్రేణి సాధించారు. 11.87 శాతం మంది ద్వితీయ శ్రేణి సాధించగా 4.44 శాతం మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో పాసయ్యారు.పార్వతీపురం మన్యం జిల్లాలో 96.07 శాతం ఉత్తీర్ణత గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పదోతరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతంతో టాప్లో నిలిచింది. ఈ జిల్లా టాప్లో నిలవడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 96.07 శాతం ఉత్తీర్ణతతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెండోస్థానంలోను, 91.08 శాతం ఉత్తీర్ణతతో విజయనగరం జిల్లా మూడోస్థానంలోను నిలిచాయి.మూడోస్థానంలో ప్రైవేటు స్కూళ్లు ఈ ఏడాది మొత్తం 12,089 ఉన్నత పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 5,044 ప్రైవేటు పాఠశాలలుండగా మిగిలినవి వివిధ యాజమాన్యాల్లోని ప్రభుత్వ పాఠశాలలున్నాయి. మొత్తం 2,161 స్కూళ్లు 100 శాతం ఫలితాలను సాధించాయి. మరో 16 పాఠశాలలు ‘సున్నా’ ఫలితాలను నమోదు చేశాయి. సున్నా ఫలితాలు వచ్చిన 16 పాఠశాలల్లో 11 ప్రైవేటు స్కూళ్లున్నాయి. రాష్ట్రంలోని 12 యాజమాన్య పాఠశాలల్లో.. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు 96.04 శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలిచాయి. తర్వాత బీసీ సంక్షేమశాఖ స్కూళ్లు 96.02 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానంలో నిలిచాయి. విద్యార్థుల సంఖ్య పరంగా రెండోస్థానంలో ఉన్న ప్రైవేటు స్కూళ్లు ఉత్తీర్ణతలో 95.29 శాతంతో మూడోస్థానంలో ఉన్నాయి.నేటి నుంచి రీ కౌంటింగ్ దరఖాస్తులకు అవకాశం పదోతరగతి పరీక్ష తప్పిన, మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు శుక్రవారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ అవకాశమిచ్చింది. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో వారి స్కూల్ లాగిన్ ద్వారా శుక్రవారం నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్కు రూ.500, రీవెరిఫికేషన్కు రూ.1000 ఫీజు చెల్లించాలి.అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు గడువు మే 9 పదోతరగతి తప్పిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షలకు త్వరలో టైమ్టేబుల్ విడుదల చేయనున్నట్టు తెలిపింది. విద్యార్థులు శుక్రవారం నుంచి మే 9వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుంతో మే 24 వరకు ఫీజు చెల్లించవచ్చు. మూడు సబ్జెక్టుల వరకు రూ.110, మూడుకు పైగా సబ్జెక్టులకు రూ.125 ఫీజు చెల్లించాలి. వెనుకబడ్డ కీలక జిల్లాలు రాష్ట్రంలో ఆది నుంచి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు విద్యాకేంద్రాలుగా కొనసాగుతున్నాయి. కానీ ఈ ఏడాది పదోతరగతి ఫలితాల్లో ఆ జిల్లాల మెరుపులు కనిపించలేదు. గుంటూరు జిల్లా 8వ స్థానంలో నిలవగా కృష్ణాజిల్లా 10, ఎన్టీఆర్ జిల్లా 11 స్థానాల్లో నిలిచి ప్రగతిపరంగా ఇతర జిల్లాలతో పోలిస్తే వెనుకబడ్డాయి. ఇక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా 24వ స్థానానికే పరిమితమైంది. -
విద్యుత్ కోతలు స్టార్ట్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలపై వరుసగా ఇంధన కష్టాలు దాడి చేస్తున్నాయి. గ్యాస్ కష్టాలు, పెట్రోల్, డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనాలకు ఇప్పుడు విద్యుత్ కోతలు తోడయ్యాయి. ఓ వైపు అనధికార విద్యుత్ కోతలు విధిస్తూ, మరోవైపు నిరంతరం సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది అబద్దమని సాక్షాత్తూ మంత్రులే బయటపెట్టడం విశేషం. డీజిల్ సరఫరాలో విఫలమైన చంద్రబాబు సర్కారు దాని నుంచి బయటపడేందుకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు ఒప్పుకోవాల్సి వచ్చింది. ‘ఆర్డీఎస్ఎస్’ పనుల పేరుతోనూ కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు.మంత్రి అచ్చెన్నాయుడు బయటపెట్టిన నిజంకొద్ది రోజులుగా రాష్ట్రంలో విపరీతంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రాయల సీమ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపాలతో ఉత్పత్తి నిలిచిపోతోంది. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీంతో విద్యుత్ కొరత ఏర్పడి కోతలు అనివార్యమవుతున్నాయి. దీనిని ప్రభుత్వంగానీ, ఇంధన శాఖ అధికారులుగానీ ధృవీకరించడం లేదు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు అమలు చేయడం లేదని, సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని బుకాయిస్తున్నారు. కానీ ‘‘ఆక్వా కల్చర్ రంగానికి రోజుకి సగటున 2గంటలు విద్యుత్ కోత ఉంది’’ అని సాక్షాత్తూ కూటమి ప్రభుత్వంలోని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా వెల్లడించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో అనధికార విద్యుత్ కోతలు విధిస్తున్నామని స్వయంగా మంత్రులే వెల్లడించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.ఆక్వాతోపాటు గృహాలకూ పవర్ కట్మంత్రి చెప్పినట్లు ఆక్వా రంగానికి రోజుకు సగటున రెండు గంటలు కాదు అంతకు మించి సరఫరా తగ్గింపు అమలు చేస్తుండగా, గృహ విద్యుత్ వినియోగదారులు రోజులో కనీసం 2 నుంచి 4 గంటలు విద్యుత్ కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పీక్ అవర్స్లో అంటే విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే సమయాల్లో పవర్ గ్రిడ్పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కోతలు విధిస్తున్నారు. వినియోగదారులు అధికారులకు ఫోన్లు చేసి అడిగితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని, రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు వంటివి మారుస్తున్నందున ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని చెబుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో ఈ సమస్య అత్యధికంగా ఉంది.కొరతను దాచేందుకు కాకి లెక్కలు రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి 270.578 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. గరిష్ట డిమాండ్ 13,793 మెగావాట్లకు చేరింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి గతంలో 120 మిలియన్ యూనిట్ల వరకూ ఉండగా, ఇప్పుడు 91.944 మిలియన్ యూనిట్లు మాత్రమే జరుగుతోంది. జల విద్యుత్ కేవలం 5.516 మెగావాట్లు వస్తోంది. అధికారికంగా లోడ్ రిలీఫ్ లేదంటూనే అనధికార కోతలు విధిస్తూ డిమాండ్కు తగ్గట్లు సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. విద్యుత్ కొరత ప్రభావంతో బహిరంగ మార్కెట్లో రాష్ట్ర అవసరాలకు రోజూ 38.750 మిలియన్ యూనిట్లు కొంటున్నారు. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్లో రాత్రిపూట విద్యుత్ ధర యూనిట్కు రూ.10కి చేరింది. దీంతో రాత్రి వేళ మన రాష్ట్రం కొనడం లేదు. పగటి వేళ మాత్రం యూనిట్ రూ.4 చొప్పున కొంటున్నారు. దీని కోసం రోజూ రూ.8.355 కోట్లు వెచ్చిస్తున్నారు. -
స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు ఉద్యోగులు రోజు కూలీలా?
సాక్షి, అమరావతి: ‘‘స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు శాఖలో పని చేస్తున్న వారు ప్రభుత్వ ఉద్యోగులా లేక రోజుకూలీలా?’’ అంటూ స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు ఉద్యోగుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర శాఖల్లో వేసిన డెప్యుటేషన్లు వెంటనే రద్దు చేసి, అర్హతలను బట్టి ఉద్యోగులను సరైన ప్రాతిపదికన ఆయా శాఖల్లో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరింది. రేషనలైజేషన్ పేరుతో పనిభారం పెంచే ప్రక్రియ వెంటనే ఆపాలని డిమాండ్ చేసింది.ఒకే జీతంతో రెండు పనులు చేయించడం అన్యాయమైన చర్యగా పేర్కొంది. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులకు స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలోని వార్డు సచివాలయాల్లో ఆరు విభాగాల ఉద్యోగుల్లో ఒక్కరికీ పదోన్నతి కల్పించకుండా తాత్సారం చేయడం అన్యాయమని మండిపడింది., ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ జాని పాషా, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
బాబు సర్కార్ మళ్లీ అప్పు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మంగళవారం... మంగళవారం అప్పుల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే మంగళవారం మరో రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్బీఐ గురువారం నోటిఫై చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏప్రిల్ నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ పరిధిలో రూ.9,000 కోట్లు అప్పు చేసింది. మే ఐదో తేదీ (మంగళవారం) మరో రూ.4,400 కోట్లు అప్పు చేయనుంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసిన అప్పు రూ.3,61,055 కోట్లకు చేరనుంది. ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.15,698 కోట్లు, రోజుకు సగటున రూ.523 కోట్లు అప్పు చేస్తోంది. -
అమరావతి భవనాల అద్దాలకు రూ.2,540 కోట్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరుతో అంచనాలను భారీగా పెంచేసి ఇప్పటికే భారీ దోపిడీకి గేట్లు తెరిచిన చంద్రబాబు సర్కారు అది చాలదన్నట్లుగా ఆ భవనాలకు నగిషీలు, అద్దాల అలంకరణలు, సోకుల పేరుతో మరో గోల్మాల్కు పచ్చజెండా ఊపింది! ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో అద్దాల అలంకరణతో పాటు స్తంభాలను అందంగా తీర్చిదిద్దడం లాంటి సోకుల కోసం ఏకంగా రూ.2,540 కోట్లతో లంప్సమ్ కాంట్రాక్టు ఇచ్చేందుకు కేబినెట్ పరిపాలన ఆమోదం ఇచ్చింది. అలాగే శాసనసభ భవనానికి నగిషీల కోసం మరో రూ.798 కోట్లతో లంప్సమ్ కాంట్రాక్టుకు పరిపాలన ఆమోదం తెలిపింది. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వ రంగంలో చేపట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి డబ్బుల్లేవంటూ పీపీపీ పేరుతో ప్రైవేట్పరం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. రాజధానిలో భవనాల సోకులు, నగిషీల కోసం భారీ ఎత్తున వ్యయం చేయడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. కొత్త మెడికల్ కాలేజీలకు ఏడాదికి రూ.1,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5,000 కోట్లు వ్యయం చేస్తే నిర్మాణాలు పూర్తి అయ్యేవని, వాటిని చేపట్టకుండా రాజధాని భవనాలకు లగ్జరీ సోకుల కోసం అదనంగా ఏకంగా రూ.3,338 కోట్ల వ్యయానికి పరిపాలన ఆమోదం ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఉన్నతాధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కేబినెట్ నిర్ణయాలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు. ⇒ అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్లకు గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, అట్రియం, కెనోపీ స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానెల్స్, బీఎంయూ పనుల కోసం రూ.2,540 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం. మూడు ప్యాకేజీలుగా లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిడెట్ ఎండీకి అనుమతి. ⇒ శాసనసభ భవనానికి స్పైర్, పార్కింగ్ రింగ్, రూఫ్ అండ్ అప్రోచ్ బ్రిడ్జెస్ ఓవర్ పాలవాగు లాంటి సివిల్ స్ట్రక్చర్ పనులకు రూ.798 కోట్ల పరిపాలన అనుమతికి ఆమోదం. లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లు ఆహ్వానించేందుకు అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి అనుమతి. ⇒ రాజధానిలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములు రద్దు. ఆ భూములు రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్డీఏకి అప్పగించాలని నిర్ణయం. ఆర్ఎఫ్–5లో పేదల ఇళ్ల స్థలాల కోసం 09–05–2023న జారీ చేసిన జీవో 59 ద్వారా రెవెన్యూ శాఖ చేసిన కేటాయింపులు సీఆర్డీఏ తీర్మానం మేరకు రద్దు చేసేందుకు ఆమోదం. ⇒ అమరావతిలో కృష్ణా కుడి గట్టు వరద నిరోధక నిర్మాణం కోసం రూ.443.26 కోట్లతో కరకట్ట బలోపేతం, విస్తరణకు ఆమోదం. రూ.149.82 కోట్లు, రూ.146.47 కోట్లు, రూ.146.97 కోట్లతో మూడు ప్యాకేజీలుగా పరిపాలన అనుమతి మంజూరు. గతంలో కాంక్రీట్ వాల్ నిర్మాణానికి రూ.1304.89 కోట్లతో ఇచ్చిన పరిపాలన అనుమతి రద్దు. ⇒ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ ఆఫీస్ రెండు టవర్లు నిర్మాణానికి రూ.1,208 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ అమరావతిలో జోన్––11 పరిధిలో ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ స్కీము కింద మౌలిక సదుపాయాల పనులకు రూ.580 కోట్లకు పరిపాలన అనుమతికి ఆమోదం. ⇒ అమరావతిలో కొన్ని కూడళ్లలో మిగిలిన పనులకు గతంలో ఇచ్చిన రూ.1082 కోట్ల పరిపాలన అనుమతి వ్యయాన్ని రూ.1180 కోట్లకు పెంచేందుకు ఆమోదం. ⇒ రాజధాని ల్యాండ్ పూలింగ్ స్కీములో సవరణలకు ఆమోదం. యాన్యుటీ పెంపు, అప్పు మాఫీ కట్ ఆఫ్ తేదీ సరళీకరణకు సవరణలు. సీఆర్డీఏలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపునకు ఆమోదం. ⇒ రామాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యత్యాస పనులకు ఆమోదం. అదనంగా రూ.354 కోట్ల వ్యయానికి ఆమోదం. ⇒ ఢిల్లీలో 11.536 ఎకరాల భూమిలో కొత్తగా ఏపీ భవన్ నిర్మాణానికి ఆమోదం. రూ.124.50 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, నిర్మాణ పనులు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్బీసీసీ)కు అప్పగించేందుకు అనుమతి. ⇒ పోలవరం నిర్వాసిత కుటుంబాలకు వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఇళ్లు నిర్మాణానికి యూనిట్ ధర రూ.2.85 లక్షల నుండి రూ.3.57 లక్షలకు పెంచడానికి ఆమోదం. ⇒ సహాయ పునరావాస కాలనీ కాకుండా వేరే చోట ఇల్లు నిర్మించుకుంటే ఇళ్ల స్థలం విలువ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచడానికి ఆమోదం. ⇒ పుష్కర ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలో 525 మీటర్లు పొడవున ఎస్కేప్ చానల్ తవ్వకం అదనపు పనులు నామినేషన్పై అప్పగించేందుకు ఆమోదం. ⇒ శ్రీసత్యసాయి జిల్లా హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఫేజ్–11 పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 26 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల వరకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్తో ఆధునీకరించే పనికి సవరించిన అంచనా రూ.309 కోట్లకు పరిపాలన ఆమోదం. ⇒ శ్రీకాకుళం జిల్లాలోని బుడగట్ల పాలెం, అనకాపల్లి జిల్లాలోని పూడిమడక, ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నంలో మూడు ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి తాజాగా రూ.1586.69 కోట్లతో పరిపాలన అనుమతికి ఆమోదం. -
పేదలపై బాబు సర్కారు కక్ష!
సాక్షి, అమరావతి: సామాజిక సమతూకం.. స్థానికులకు ప్రాధాన్యం.. మహిళా సాధికారత.. పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ రాజధాని అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలను చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగా రద్దు చేసింది. తద్వారా పేదలకు రాజధానిలో ఉండే అర్హత లేదని తేల్చి చెప్పింది. రాజధాని అంటే కొంత మందికి మాత్రమే సొంతమని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా పేదలకు కేటాయించిన భూమిని వెనక్కు తీసుకునేందుకు గురువారం కేబినెట్ పచ్చ జెండా ఊపింది. పేదలకు కేటాయించిన భూములు రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్డీఏకి అప్పగించాలని నిర్ణయించింది.ఆర్ఎఫ్–5లో పేదల ఇళ్ల స్థలాల కోసం 09–05–2023న జారీ చేసిన జీవో 59 ద్వారా రెవెన్యూ శాఖ చేసిన కేటాయింపులు సీఆర్డీఏ తీర్మానం మేరకు రద్దు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఓ వైపు పేదల గూటి కలలను కూల్చి వేస్తూ.. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాల్లో టీడీపీ కార్యాలయాల నిర్మాణం కోసం మాత్రం కారుచౌకగా భూ కేటాయింపులు చేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతం కేవలం బడా బాబులకే సొంతమనే రీతిలో వ్యవహరిస్తూ పేదలను గెంటేసేలా నిర్ణయం తీసుకుంటున్నారనేందుకు సర్కారు తాజా నిర్ణయమే తార్కాణమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.ప్రత్యామ్నాయంగా కనీసం వారికి ఇళ్ల స్థలాలు ఎక్కడిస్తారో కూడా చెప్పకుండా ఏకపక్షంగా వ్యవహరించడం విస్మయం కలిగిస్తోందంటున్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని సర్కారు సరికొత్త భాష్యం చెప్పడం దారుణమంటున్నారు. రాజధాని సహా రాష్ట్రంలో ఎక్కడా పేదలకు ఒక్క గజం కూడా భూమి ఇవ్వని చంద్రబాబు.. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం రద్దు చేయడం గమనార్హం. రాజధానిలో బడుగు, బలహీన వర్గాల కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 900 ఎకరాలతో ఆర్–5 జోన్ను ఏర్పాటు చేసింది. అందులో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50 వేల మందికిపైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది. దానిని భారీ లేవుట్గా అభివృద్ధి చేశారు. రికార్డు స్థాయిలో 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చింది. సంపద సృష్టిస్తూ.. విలువైన ఆస్తిని మహిళల చేతికి అందించింది. పేదల ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 78 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించింది. ఏకంగా 17 వేలకుపైగా కాలనీలు రూపుదిద్దుకున్నాయి. 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఒకేసారి వందల ఇళ్ల నిర్మాణంతో ఆయా చోట్ల కొత్త గ్రామాలే ఆవిష్కృతమయ్యాయి. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో పేదలకు సైతం చోటు ఉండాలని, సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆర్ 5 జోన్ను ప్రకటిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఏమాత్రం గిట్టని చంద్రబాబు సర్కారు పేదలపై కక్ష కట్టి తన తీరును మరోమారు చాటుకుంది. సర్కారు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
పెట్రోల్, డీజిల్ సమస్య మన వల్ల రాలేదని చెప్పండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమన్న వాస్తవం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ప్రభుత్వం దాన్నుంచి తప్పించుకొనేందుకు మల్లగుల్లాలు పడుతోంది. రాజధాని కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల కారణంగానే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత వచ్చిందన్న విషయం కేంద్ర ప్రభుత్వ లేఖలతో బయటపడింది. వారం రోజులుగా రాష్ట్ర ప్రజలను అతలాకుతలం చేస్తున్న పెట్రోల్ డీజిల్ కొరత వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఊరూవాడా తెలిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే రాజకీయ అంశాలపై మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత పెద్ద అంశంగా మారిందని, ఉన్నట్టుండి ఈ సమస్య రావడానికి ప్రభుత్వమే కారణమనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిందని పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం. రాజధాని పనులు చేసే కాంట్రాక్టర్లకు రిటైల్ ధరలో బల్్కగా ఆయిల్ సరఫరా చేయాలని కంపెనీలను ఒత్తిడి చేయడం ద్వారా ప్రభుత్వమే ఈ సమస్య సృష్టించిందని ప్రజల్లో విస్తృతంగా జరుగుతున్న చర్చను కొంతవరకైనా నివారించాలంటే మంత్రులు మాట్లాడాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. పెట్రోల్, డీజిల్ సమస్య ప్రభుత్వం వల్ల రాలేదని చెప్పాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. ఆయిల్ కంపెనీల వల్లే ఈ సమస్య వచ్చిందని, ఇందులో ప్రభుత్వం తప్పు లేదని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరినట్లు తెలిసింది.ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయిల్ కొరత ఉందని బలంగా ప్రచారం చేయాలని, అప్పుడే ప్రజలు కొంత శాంతిస్తారని చెప్పినట్లు సమాచారం. రాజధాని పనులకు అవసరమైన ఆయిల్ సరఫరా చేయాలని కేంద్రానికి రాసిన లేఖలు, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలు, ఆయిల్ కంపెనీలకు ప్రభుత్వం రాసిన లేఖల వివరాలు బయటకు ఎలా వెళ్లాయనే అంశంపైనా చర్చ జరిగింది. ఈ వివరాలన్నీ బయటకు వెళ్లడం వల్ల ఇబ్బంది వచ్చిందని, ఇలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా చూడాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం.9 మంది మంత్రులు ఒకేసారి సింగపూర్ పర్యటనకు వెళ్లడం, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు, రాజధాని నిర్మాణాలకు అంచనాలకు మించి భారీ రేట్లతో పనులు చేస్తున్న అంశాలపై మంత్రులు స్పందించాలని చెప్పినట్లు తెలిసింది. ఎంత చెప్పినా కొందరు మంత్రులు ఇలాంటి విషయాలపై మాట్లాడటంలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తమ వల్లే వచ్చిందని వైఎస్సార్సీపీ చెబుతోందని, దాని క్రెడిట్ మొత్తం టీడీపీకే దక్కేలా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలు: సీఎంటీమ్ ఏపీ పనితీరు వల్లే తనకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్–2025 అవార్డు వచ్చిందని, మంత్రులు, అధికారులు, ఉద్యోగులే నిజమైన విజేతలని సీఎం చంద్రబాబు అన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన సందర్భంగా చంద్రబాబు గురువారం మంత్రులు, సీఎస్, డీజీపీ, సెక్రటరీలు, హెచ్వోడీలకు ఆత్మీయ విందు ఇచ్చారు. వివిధ శాఖల్లో మంచి పనితీరు కనబరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను కూడా విందుకు ఆహ్వానించారు. తొలుత మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమావేశమై రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేరుకోవాల్సిన లక్ష్యాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై చర్చించారు. -
భగ్గుమన్న భానుడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలు రికార్డయింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45, తిరుపతి జిల్లా రాయలచెరువులో 44.3, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో 43.6, బాపట్ల జిల్లా కారంచేడు, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43.5, నంద్యాల జిల్లా సంజామలలో 43.2, వైఎస్సార్ కడప జిల్లా కోడూరులో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 20 జిల్లాల పరిధిలోని 216 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు కురిశాయి. నేడు తీవ్ర వడగాడ్పులు శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 49 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.మరోవైపు కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న మూడు రోజులు అకాల వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. -
‘ఓటర్ల జాబితా సవరణపై అందరూ అప్రమత్తంగా ఉండాలి’
తాడేపల్లి : ఓటర్ల జాబితా సవరణపై అందరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ శ్రేణులకు సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈరోజు(గురువారం, ఏప్రిల్ 30వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ఐటీ, సోషల్ మీడియా, బూత్ కమిటీల అధ్యక్షులు, పలు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించి బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ‘ పార్టీ ఓట్ల అక్రమ తొలగింపును అడ్డుకోవాలి. S.I.R పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలను అడ్డుకోవాలి. మోసం చేయడంలో కూటమి నేతలు సిద్ధహస్తులు. 2019 ఎన్నికలకు ముందు మన పార్టీ వారి ఓట్లు 40 నుంచి 45 లక్షలు తొలగించారు. ఆ సమయంలో ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 1984 తర్వాత పుట్టి ఓటర్ల జాబితాలో ఉన్నవారు తిరిగి మళ్ళీ తమను తాము నిరూపించుకుంటేనే ఓటర్ల తుది జాబితాలో ఉంటారు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తమిళనాడులో ఏకంగా 97 లక్షల ఓటర్లను తొలగించారు. మన దగ్గర SIR ప్రారంభానికి ముందే అవసరమైన డేటా మొత్తం సిద్ధం చేసుకోవాలి. జోన్ల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీమ్లను సిద్ధం చేయాలి. S.I.R కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేద్దాం’ అని సజ్జల పేర్కొన్నారు. -
అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం
సాక్షి, విజయవాడ: అమరావతిలో మరో దుబారాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణ వ్యయాలు మళ్లీ పెంపునకు నిర్ణయించింది. సచివాలయం అద్దాలు, హంగుల కోసం 2540 కోట్లు ఖర్చు పెట్టనుంది. సచివాలయం, జీఏడీ టవర్స్ గ్లాస్ క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కెనపీ, కాలమ్ క్లౌడింగ్, పీవీ ప్యానల్స్, స్కై లైట్ సదుపాయాలు కల్పించాలని నిర్ణయించిన కేబినెట్.. ఈ పనులన్నింటికీ 2,540 కోట్లకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే సచివాలయం నిర్మాణానికి అత్యధిక ధరను ప్రభుత్వం చెల్లిస్తోంది.తెలంగాణలో కేవలం 650 కోట్లతో సచివాలయం నిర్మాణం జరగ్గా.. ఏపీలో కేవలం సచివాలయం హంగులకే 2,540 కోట్ల ఖర్చు చేయాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. అసెంబ్లీ నిర్మాణం వ్యయంలోనూ భారీగా పెంచేసింది. మరో 798 కోట్ల పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ భవనానికి సెంట్రల్ స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జెస్ 798 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.సీఎం ఇంటిదగ్గర కరకట్టకు 443 కోట్లు ఖర్చుకి కేబినెట్ ఆమోదం తెలిపిన కేబినెట్.. రూ.443 కోట్లతో మట్టికట్టను విస్తరించాలని నిర్ణయించింది. కరకట్ట పొడవును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 11 కిలోమీటర్ల కరకట్టను ఆధునీకరణతో పాటు.. క్వాంటమ్ ట్విన్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. 37 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 43 అంతస్థుల 2 బిల్డింగ్ లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.అమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయంఅమరావతిలో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేబినెట్.. ఆర్ 5 జోన్ భూములు సిఆర్డీయేకు అప్పగించనుంది. ఆర్ 5 జోన్లో వైఎస్ జగన్ ప్రభుత్వం.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. 50 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. అయితే, అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 50 వేల మంది పేదలకు ప్రత్యామ్నాయం కూడా ప్రభుత్వం చూపలేదు.టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపుఏపీలో టీడీపీ ఆఫీస్లకు భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒంగోలు, విజయనగరం, తూర్పుగోదావరి, కర్నూల్, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో టీడీపీ ఆఫీస్లకు భూములు ఇవ్వడానికి నిర్ణయించింది. 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన భూముల కేటాయింపులు చేసింది. ఒక్కో ఆఫీస్ కి 1.5 ఎకరాల నుండి 2 ఎకరాల వరకు కేటాయింపు జరగనుంది. -
‘కూటమి నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్బుక్ పేరుతో అణచివేతలు కొనసాగిస్తున్నారని.. పౌర హక్కులను దారుణంగా హరిస్తున్నారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని వందేళ్ల వెనక్కి నెట్టారు. వ్యవస్థలను ఇష్టానుసారం వాడుకుంటున్నారు. నియంత పాలన రాష్ట్రంలో సాగుతోంది. పోలీసులు ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు జనం బాధ పడుతున్నారు’’ అని మనోహర్రెడ్డి పేర్కొన్నారు.‘‘యూరియా, డీజిల్, పెట్రోలు, గ్యాస్ ఇలా అన్నిటికీ కరువు ఏర్పడినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కానీ సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులే మా లక్ష్యం అన్నట్టుగా పని చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు కూడా ఇదే కోవలోనిదే. టెర్రరిస్టును అరెస్టు చేసినట్టుగా రోడ్డుపై అటకాయించి అరెస్టు చేశారు. శ్రీహరి మీద 111 సెక్షన్ పెట్టటంపై కోర్టు కూడా ప్రశ్నించింది. కుప్పంలో శ్రీహరికి బెయిల్ రాగానే మరొక కేసు పెట్టి వేధిస్తున్నారు. కుప్పం, కొత్తపేట పీఎస్లలో ఒకే రకమైన ఫిర్యాదులు ఇవ్వటం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉంది. ఫిర్యాదులో లేకపోయినా పోలీసులు ఓవరాక్షన్తో వైఎస్సార్ సీపీ గూండాలు అంటూ నమోదు చేశారు.ప్రభుత్వ పెద్దలు ఆర్గనైజ్డ్ క్రైం చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేలాగ టీడీపీ నేతలే పోస్టులు పెడుతున్నారు. మరి వారిపై ఎందుకు కేసులు పెట్టటం లేదు?. ప్రతిపక్షాలకు ఒక రాజ్యాంగం, అధికార పార్టీ వారికి ఇంకొక రాజ్యాంగం ఉందా?. నిజానికి శ్రీహరికి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియాకు ఎలాంటి సంబంధం లేదు. జర్నలిస్టు శ్రీహరిపై అక్రమంగా కేసులు పెట్టారు’’ అంటూ మనోహర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్
సాక్షి,అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం (గురువారం) కుప్పం కోర్టు వైఎస్సార్సీపీ మీడియా విభాగ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే కొత్తపేట పోలీసులు ఆయనను మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను కుప్పం నుంచి గుంటూరు జిల్లా కొత్తపేటకు తరలిస్తున్నారు. ఉదయం కుప్పం కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే నోటీసులు ఇచ్చి అక్రమంగా అరెస్టు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పూడి శ్రీహరిని నిన్న బెంగళూరు కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కుప్పం కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కానీ, బెయిల్ వచ్చిన కొన్ని గంటలలోనే గుంటూరు పోలీసులు నోటీసులు ఇచ్చి మళ్లీ అరెస్టు చేశారు. -
ఎరువు మొత్తం.. డీజిల్లో కాలిపోయిందిగా!
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తీవ్రస్థాయిలో తలెత్తడానికి చంద్రబాబు ప్రభుత్వమే ప్రధాన కారణమనే విషయాన్ని మేధావుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు గుర్తించారు. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ఈ ప్రభుత్వాన్ని రాయడానికి కూడా వీలులేని విధంగా బూతులు తిడుతున్నారు. ఎన్నికల ముందు వారు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు బాగా బుద్ధి వచ్చిందని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్లను పోస్టింగ్లతో ఏకిపడేస్తున్నారు. ఎన్నికల ముందు ఇంధన ధరలపై తండ్రి, కొడుకు చేసిన ప్రసంగాల వీడియోలను బయటకు తెచ్చి ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ సెటైర్లు, మీమ్స్తో ఆడుకుంటున్నారు. అమరావతి కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చడానికి డీజిల్ను తక్కువ ధరకు వారికి మళ్లించి ప్రజల నోట్లో మట్టికొట్టడాన్ని మేధావులు సైతం తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మొత్తంగా మరోసారి చంద్రబాబు, లోకేశ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరువు పూర్తిగా పోయింది. దీంతో ఆ పార్టీల కేడర్లో తీవ్ర నిరుత్సాహం కనిపిస్తోంది. ప్రజల దగ్గర తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందంటూ వారు మథనపడుతున్నారు.ఇదేం రాజకీయం.. విచిత్రంగా ఉంది ప్రజలు ఇబ్బందిపడితే పడనీ.. అమరావతి కాంట్రాక్టర్లు మాత్రం ఇబ్బంది పడకూడదు.. కార్పొరేట్ల లాభాలు పోకూడదు... సామాన్యుడి ఎకానమీ నాశనం అయినా పర్లేదు.. అని కూటమి ప్రభుత్వం అనుకోవడం విచిత్రంగా ఉంది. అమరావతి కాంట్రాక్టర్లకు డీజిల్ కొరత రాకూడదని, వారికి కష్టం రాకూడదని, ప్రజలు ఇబ్బందిపడినా పర్లేదనే ధోరణి కాదా ఇది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో సామాన్యులకు ఇవ్వాల్సిన డీజిల్ను వారికి ఇవ్వకుండా బల్క్లో కాంట్రాక్టర్లకు ఇవ్వాలని ఆదేశాలివ్వడం వల్ల ఇంధన కొరత ఏర్పడింది. కొరత వచ్చిన తరువాత కూడా కాంట్రాక్టర్లకు సరఫరా ఆగకూడదని ఆదేశాలివ్వడం దారుణం. సామాన్యుడి ఎకానమీ, పేదవాడి ఎకానమీ పడిపోయినా పర్లేదుగానీ కాంట్రాక్టర్ల ఎకానమీని మాత్రం కాపాడాలి. వారి లాభాలు మాత్రం నిరాటంకంగా కొనసాగాలి.. అనుకునేది ఏం రాజకీయం ఇది. సామాన్యులకు అనుకూలం అయిన రాజకీయం అయితే కాదు. పోనీ డీజిల్ను బల్క్లో మళ్లించకపోతే అమరావతి నిర్మాణం ఆగిపోతుందా? వారం ఆలస్యమవుతుందేమో, అంతకు మించి ఏమవుతుంది. అంటే ఈ డైవర్షన్ అమరావతి కోసం కూడా కాదు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసం మాత్రమే. తక్కువ ధరలకు కాంట్రాక్టర్లకు డీజిల్ ఇస్తున్నప్పుడు నిర్మాణ ఖర్చులు కూడా తగ్గాలి కదా. కానీ ఇప్పటికే అమరావతి నిర్మాణానికి అధిక ఖర్చులపై అనేక అనుమానాలు, విమర్శలు ఉన్నాయి. చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చు అన్నారు కదా.. డీజిల్ తక్కువకు ఇస్తున్నందున రూ.12 వేలకు చేయమని అనగలరా. ఐఏఎస్ అధికారులు కనీస అవగాహన లేకుండా ఆదేశాలిస్తారా? వాటివెనుక కచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు, కారణాలు ఉన్నాయి. ఇంధన కొరతపై ముఖ్యమంత్రి సమీక్ష తరువాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. పనికిమాలిన ఆర్డర్ ఏంటిది, కాంట్రాక్టర్లు ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అని సీఎం అడగాలి కదా. – ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు -
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 85.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.9 శాతం ఉత్తీర్ణత,, బాలురు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. 👉పదో తరగతి పరీక్షా ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో https://education.sakshi.com/en తోపాటుగా https://results.bse.ap.gov.in/ ఈ వైబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్క క్లిక్తో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... 👉పది ఫలితాల్లో 96.07 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, 57.12 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో ఉంది.👉మనమిత్ర వాట్సప్ నంబరు 9552300009 ద్వారానూ పొందొచ్చు. ఏపీలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాశారు.ఒక్క క్లిక్తో ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... -
‘డీఎస్సీ డీల్స్’లో ప్రలోభాల పర్వం
సాక్షి, అమరావతి: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పోస్టుల కుంభకోణంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాలు సాక్ష్యాలతో సహా బయటపడటంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత హేయంగా అంగడి సరుకులా డీఎస్సీ పోస్టులను సీఎం బంధువుగా చెప్పుకుంటూ అమ్మేసిన ‘మాస్టర్మైండ్’ మెడకు ఉచ్చు బిగుసుకోవడంతో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.మూడు రోజులకుపైగా విచారణ పేరుతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కాలయాపన చేసి కనీసం ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేయలేకపోయింది. బుధవారం రాష్ట్ర క్రీడా సంఘాలను శాప్ ఎంపికల్లో ఎక్కడా తప్పు జరగలేదని, క్రీడాకారులు తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందలేదని స్టేట్మెంట్లు ఇవ్వాలని ‘మాస్టర్మైండ్’ ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. అయితే, అవినీతికి కొమ్ముకాసి అభాసుపాలు కాలేమని, ప్రభుత్వం చెప్పినట్టు తలాడించలేమని క్రీడా సంఘాల ప్రతినిధులు తెగేసి చెప్పినట్టు తెలిసింది. దీంతో శాప్ పరువు పోతోందని, కాపాడాలని క్రీడా సంఘాలను వేడుకోవడం గమనార్హం. విచారణ పేరుతో పిలిచిన క్రీడాకారులు ఇంకా అదే ఉద్యోగంలో కొనసాగుతుండటం కొసమెరుపు. మాస్టర్మైండ్ గేమ్లో చిక్కుకున్నశాప్ ఉన్నతాధికారులు డీఎస్సీ డీల్స్లో కీలకమైన ‘మాస్టర్ మైండ్’ గేమ్లో శాప్ ఉన్నతాధికారులు సైతం చిక్కుకుపోతున్నట్టు శాప్ వర్గాలే విమర్శిస్తున్నాయి. మరోవైపు ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న శాప్ ఎలా విచారణ చేస్తుంది? అందులో శాప్ అధికారులే కమిటీ సభ్యులుగా ఎలా ఉంటారు? ఈ ఒక్క విచారణతోనే నిజనిర్ధారణ చేసేస్తుందా? వాస్తవాలు బయటకు రావాలంటే కచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, రిటైర్డ్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తేనే ఇంటి దొంగలు బయటపడతారు’ అని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, డీఎస్సీలో స్పార్ట్స్ కోటా ఉపాధ్యాయ పోస్టుల అమ్మకం ద్వారా మాస్టర్మైండ్ ఏకంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లను దండుకున్నట్టు ఆరోపణలు రావడంతో శాప్లో జరుగుతున్న మరిన్ని అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి. ఉన్న పోస్టులు రద్దు.. ఉద్యోగాలు అడగొద్దుచంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఖాళీగా ఉన్న సర్కారు పోస్టులను భర్తీ చేయకపోగా.. మంజూరైన పోస్టులను రద్దు చేయడమే లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు సర్కారు అదే బాటలో పయనిస్తోంది. సమాచార శాఖలో రెండు అటెండర్ పోస్టులను రద్దుచేసి.. వాటి స్థానే ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టు భర్తీ చేసేందుకు అనుమతించింది. అంటే మంజూరైన నాలుగో తరగతి పోస్టుల్ని రద్దు చేసి నిరుద్యోగుల ఆశలకు గండికొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో ఉండగా ఖాళీగా ఉన్న నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులన్నింటినీ రద్దు చేశారు. అవసరమైన చోట ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా 2014–19 మధ్య చంద్రబాబు సాధారణ పరిపాలన, పోలీసు శాఖలతోపాటు అనేక విభాగాల్లో మంజూరైన పోస్టులను రద్దు చేసి వాటి స్థానే ఔట్ సోర్సింగ్ విధానంలో కొన్ని మాత్రమే భర్తీ చేసేందుకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే తరహా పాలనను కొనసాగిస్తున్నారు. సమాచార శాఖలో ఖాళీగా ఉన్న రెండు డార్క్ రూమ్ అటెండర్ల పోస్టులను రద్దు చేస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వాటిస్థానే రూ.44,570–1,27,480 వేతన స్కేలుతో ఒక చీఫ్ ఫొటోగ్రాఫర్ పోస్టును మంజూరు చేశారు. ఇందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోగా.. ఆ పోస్టులనే రద్దు చేయడం అంటే శాశ్వతంగా ప్రభుత్వంలో నాలుగో తరగతి ఉద్యోగాలనేవి ఇక నిరుద్యోగులకు అందని ద్రాక్షగా మిగిలిపోనున్నాయి. -
నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షా ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయనున్నారు. ఫలితాలను sakshieducation.com, మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009, results. bse.ap.gov.inలో చూడవచ్చు. -
ఇంధనానికి బంధనం.. కొరత లేదంటూనే కోత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సంక్షోభంపై ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతోంది. డీజిల్, పెట్రోల్ కొరత లేదంటూ బూటకపు ప్రచారం చేయడం తప్ప బంకులకు సరఫరాను మెరుగుపర్చట్లేదు. వారం గడిచినా ఇప్పటికీ బంకుల్లో పెట్రోల్, డీజిల్పై పరిమితి కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలకు కేవలం రూ.200కు మించి పెట్రోల్ నింపడం లేదు. కార్లకు అయితే గరిష్టంగా 10–15 లీటర్లు, లారీలకు 50 లీటర్ల వరకే డీజిల్ ఇస్తున్నారు. ఆటో డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒకసారి రెండు లీటర్ల డీజిల్ నింపుకుని వెళ్లొచ్చేలోగా అయిపోతోంది. మళ్లీ హడావుడిగా బంకుల దగ్గర పరుగెత్తాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ప్రయాణికులతో మార్గంమధ్యలో ఆగిపోవాల్సి వస్తోంది. ఆటోలను తోసుకెళ్లలేక ఖాళీ బాటిళ్లలో ఇంధనం నింపుకుని వద్దామంటే ప్రభుత్వ ఆదేశాలు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. ఖాళీ టిన్నులు, బాటిళ్లలో ఇంధనం నింపొద్దని చంద్రబాబు సర్కార్ జారీ చేసిన ప్రకటన బడుగుల జీవనాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అవసరానికి మించి ఇంధనం తీసుకుంటే ప్రజలను సైతం శిక్షిస్తామని బహిరంగంగా పోస్టర్లు వేయడం అరాచక పాలనకు అద్దం పడుతోంది. తనిఖీల పేరుతో బంకుల సీజ్ రాష్ట్రంలో ఇండెంట్కు, అవసరాలకు తగ్గట్టుగా బంకులకు ఇంధన సరఫరా జరగడం లేదు. దీంతో ప్రభుత్వం తనిఖీల పేరుతో పెట్రోల్ బంకుల యజమానులపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. నో స్టాక్ బోర్డులు పెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. పైగా తనిఖీల్లో స్టాకు లేనట్టు గుర్తిస్తే అక్కడ అక్రమంగా ఇంధనాన్ని దొడ్డిదారి పట్టించారంటూ బంకులను సీజ్ చేస్తోంది. సంక్షోభం సమయంలో ఇలా బంకులను సీజ్ చేసుకుంటూ వెళ్తే ప్రజలు ఇబ్బంది పడతారనే కనీసం విజ్ఞత లేకుండా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తోంది. బంకుల యజమానులు తమకు సాధారణ రోజుల్లో మాదిరి ఇంధనం రావడం లేదని ఎంత మెరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇంధనం అయిపోతే బంకులదే బాద్యత అంటూ విచిత్ర వాదన తీసుకొచ్చి నిత్యం నరకం చూపిస్తోంది. చాలా బంకులకు రెగ్యులర్ వినియోగదారులుంటారు. వారంతా ఆయా బంకుల్లోనే తమ వాహనాలకు ఇంధనాన్ని నింపుతుంటారు.అలాంటి వారికి చాలా బంకులు క్రెడిట్(అప్పు)పై ఇంధనం విక్రయిస్తుంటాయి. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రవాణా రంగం కుదేలైంది. డైలీ క్యాబ్ సర్వీసులు, దూర ప్రాంతాలకు సరుకులు చేరవేసే మినీ వ్యాన్లు అర్థంతరంగా రోడ్లపై ఆగిపోతున్నాయి. పెద్ద వాహనాలకు 100 లీటర్ల డీజిల్ పోస్తారని ప్రకటించినా బంకుల్లో లభ్యత లేకపోవడంతో అరకొరగానే నింపుకోవాల్సి వస్తోంది. క్రెడిట్ ఎత్తేసిన కంపెనీలు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆర్థికంగా దివాళ తీస్తోంది. అప్పులపై వడ్డీలు.. ఆ వడ్డీలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయడంతోనే పరిపాలనను నెట్టుకొస్తోంది. ఫలితంగా సామాన్య పొదుపు సంఘాల క్రెడిట్ పరపతి ఎప్పుడో కుదేలైంది. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు రంగంలోని బంకులకూ అది పాకింది. ప్రభుత్వ పనితీరును నిత్యం మదింపు చేసుకుంటున్న ఆయిల్ కంపెనీలు క్లిష్ట సమయంలో బంకులకు క్రెడిట్(అప్పు)ను నిలిపివేశాయి. ముందుగా చెల్లిస్తే తప్ప స్టాకును పంపించట్లేదు. ఒక్కసారిగా రూ.లక్షల్లో నగదు సమకూర్చలేని స్థితిలో బంకుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత, దోపిడీ విధానాల కారణంగా డబ్బులు కట్టినా ఏకంగా సరఫరాను కుదించేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో తమ బినామీ కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యనేత సాధారణ బంకుల నుంచి కమర్షియల్, బల్క్ డీజిల్ను తరలించాలని ఆదేశాలివ్వడంతో పరిస్థితి దిగజారిపోయింది. కమర్షియల్లో డీజిల్ రేటు రూ.153 ఉండటంతో ప్రభుత్వం రిటైల్ రేటుకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ను బంకుల నుంచి సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. దీని ఫలితంగా బల్క్ ఆర్డర్లకు డీజిల్ తరలించుకుపోవడంతో కొరత తీవ్రమైంది. రిటైల్ నుంచి కమర్షియల్కు దారి మళ్లింపు రాష్ట్రంలో సగటున రోజువారీగా 9 వేల కిలో లీటర్ల పెట్రోల్, 20వేల కిలో లీటర్ల డీజిల్ వినియోగం ఉంటుంది. సంక్షోభం మొదలైనప్పటి నుంచి నేటివరకు దాదాపు లక్ష కిలో లీటర్ల డీజిల్ బ్యాక్ లాగ్ ఉంది. అంటే, ఇప్పటికిప్పుడు లక్ష కిలో లీటర్ల డీజిల్ అందుబాటులోకి వస్తే తప్ప సాధారణ పరిస్థితి రాదు. మరుసటి రోజు నుంచి యథావిధిగా రోజుకు 20 వేల కిలో లీటర్ల డీజిల్ సరఫరా ఉండాల్సిందే. అయితే, చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో ఒక్క రాజధాని ప్రాంతంలోనే 10 లక్షల లీటర్లకుపైగా రిటైల్ ఇంధనాన్ని కమర్షియల్లో వాడేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ను కమర్షియల్లోకి దారి మళ్లించేశారు. ఏపీలో 100కు పైగా లారీలు, టిప్పర్లను ఆపరేట్ చేసే కంపెనీలు స్థానికంగానే మార్కెట్ కంటే రూ.10 అదనంగా చెల్లించి భారీస్థాయిలో ఇంధనం కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ప్రజలకు చేరాల్సిన డీజిల్, పెట్రోల్ పక్కదారి పడుతోంది. -
‘విజనరీ’ కాదు.. విఫల పాలకుడు!
సాక్షి, అమరావతి: ‘ఇంటి పేరు కస్తూరివారు.. ఇంట్లో మాత్రం గబ్బిలాల కంపు...! అన్నట్లుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి! విజనరీ, పరిపాలనా దక్షుడని టీడీపీ కూటమి, ఎల్లో మీడియా ఊదరగొట్టే చంద్రబాబు పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రిటైల్ బంకులలో సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్ను రాజధాని పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చంద్రబాబు సర్కారు అడ్డదారిలో ఉత్తర్వులు జారీ చేయడంతో వారం రోజులు వాహనదారులు ప్రత్యక్ష నరకం చవిచూశారు. కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు చట్ట విరుద్ధంగా వ్యవహరించడంపై రైతుల నుంచి ఉద్యోగుల దాకా అన్ని వర్గాలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాణిజ్య అవసరాల కోసం బల్క్లో అవసరమైతే కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం ఓఎంసీల నుంచే నేరుగా కొనుగోలు చేయాలి. అందుకోసం ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంది. బల్క్లో కొంటే లీటర్ డీజిల్కు రూ.153 చెల్లించాలి. అదే పెట్రోల్ బంకుల్లో రిటైల్గా అయితే లీటర్ డీజిల్ రూ.98కే దొరుకుతుండటంతో అడ్డదారిలో కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది చట్ట విరుద్ధమని, దీన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో బాబు సర్కారు బండారం బట్టబయలైంది. పాలన గాలికి వదిలేసి మొద్దునిద్ర..!పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు, రైతులు, వ్యాపారులు అల్లాడుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ కొరత వేధిస్తుండటం కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తోంది. రాష్ట్రంలోని 4,500 బంకుల్లో ఇంధన కొరత వేధిస్తోంది. శ్రీకాకుళం నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి బారులు తీరుతున్నా కూటమి ప్రభుత్వంలో కనీసం చలనమే లేకుండాపోయింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కనీసం పెట్రోల్, డీజిల్ కొరతను తీర్చలేక చేతులు ఎత్తేశారు. అత్యవసర సేవలు, సరఫరాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనం మరోసారి బట్టబయలైంది. కీలక సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోజులపాటు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. రాష్ట్రంలో ఈనెల 24 నుంచి పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తింది. బంకుల వద్ద వాహనదారులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వ పెద్దలు మొద్దునిద్ర వీడలేదు. పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తినట్లు అదే రోజు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన విషయం కావడంతో అధికారులు నిస్సహాయంగా మిగిలారు. దాంతో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చి బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా సరుకు రవాణా లారీలు, ఇతర వాహనాల సర్వీసులు నిలిచిపోయాయి. అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం పట్టించుకోకపోవడంతో పరిస్థితి పూర్తిగా దిగజారింది. బంకుల వద్ద ఘర్షణలు చోటు చేసుకుని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వాహనదారులు ఆందోళనతో ఒక బంకు నుంచి మరో బంకు చొప్పున నాలుగైదు చోట్లకు తిరిగినా అంతటా అదే పరిస్థితి నెలకొంది. వాహనాల్లో ఉన్న కొద్దిపాటి ఇంధనం ఖర్చు కావడం మినహా ఎటువంటి ఫలితం లేకుండాపోయింది. చమురు కంపెనీలపై ఆగ్రహం అంటూ లీకులు..ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనదారులు గగ్గోలు పెట్టారు. ఎట్టకేలకు గత ఆదివారం సాయంత్రానికిగానీ చంద్రబాబు కుంభకర్ణ నిద్ర వీడలేదు. అధికారులతో సమీక్ష పేరిట మభ్యపుచ్చేందుకు యత్నించారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై సీరియస్ అయినట్లు ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారు. ఒకవైపు వాణిజ్య అవసరాల కోసం వినియోగించాల్సిన డీజిల్ను సిండికేట్ కాంట్రాక్టు సంస్థల కోసం దారి మళ్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు మరోవైపు చమురు కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు లీకులిచ్చారు. కొరత ఎందుకు ఏర్పడిందో తనకు స్పష్టంగా తెలిసినా పరిష్కారం కోసం చర్యలు తీసుకోకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేశారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్నా కనీసం పెట్రోలియం శాఖ మంత్రితో చర్చించకపోవడం గమనార్హం. తుస్సుమన్న రియల్ టైమ్ గవర్నెన్స్..చంద్రబాబు ఘనంగా చెప్పుకునే రియల్ టైమ్ గవర్నెన్స్ గాలి బుడగలా పేలిపోయింది. పెట్రోల్, డీజిల్ కొరత లాంటి సాధారణ సమస్యను కూడా పరిష్కరించలేకపోయింది. వెలగపూడిలోని ఆర్టీజీఎస్ ఆఫీసు నుంచే రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చిటికెలో పరిష్కరిస్తామని చంద్రబాబు గొప్పగా చెబుతూ ఉంటారు. వారం రోజులుగా బంకుల వద్ద బారులు తీరిన వాహనదారుల ఫొటోలు, వీడియోలను ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ చూపించలేదా? లేక సమస్యను పరిష్కరించడం కూటమి ప్రభుత్వానికి చేతకాలేదా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఇక తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. పలు ప్రాంతాల్లో తనిఖీల పేరిట బంకు యజమానులను వేధిస్తున్నారు. స్టాక్ లేదనే వంకతో బంకులను సీజ్ చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది.చినబాబు మౌనం.. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసంపెట్రోల్, డీజిల్ కొరత ఇంత తీవ్రంగా వేధిస్తున్నా మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. తమ వ్యక్తిగత ప్రచారం కోసం ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేసే వారిద్దరూ పెదవి విప్పడం లేదు. గుప్త పర్యటన కోసం వెళ్లిన లోకేశ్ సామాన్యుల సమస్యతో తనకేం సంబంధం అన్నట్లుగా మిన్నకుండిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ అజ్ఞాతం వీడలేదు. కనీసం ఫోన్లో కూడా అధికారులను ఆరా తీయలేదు. -
పెట్రో దెబ్బకు కూర‘గాయాలు’!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు సృష్టించిన డీజిల్ సంక్షోభంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. సిండికేట్ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు బాబు సర్కారు నిబంధనలకు విరుద్ధంగా రిటైల్ డీజిల్ను అడ్డదారిలో మళ్లించడంతో రవాణావాహనాలకు డీజిల్ దొరక్క నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. వారం వ్యవధిలోనే భారీగా పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో ప్రజలు బేజారెత్తుతున్నారు. ఇప్పటికే సర్కారు నిర్వాకంతో వంట నూనెల ధరలు చుక్కలనంటుతుండగా ఆ జాబితాలో కూరగాయలు కూడా చేరాయి. డీజిల్ కొరత కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఓవైపు డీజిల్ కొరతతో భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి కూరగాయలు కుళ్లిపోతుండగా మరోవైపు సరఫరా ఆగిపోవడంతో ధరలు పెరిగిపోయి వినియోగదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రమంతా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఏపీలో పెరిగిన ధరల పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు కథనం ఇదీ!వారం రోజులుగా వాహనాల్లోనే వేల టన్నులు..రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాలకు కూరగాయలు, నిత్యావసరాలు రవాణా చేసే వాహనాలకు చంద్రబాబు సర్కారు సృష్టించిన డీజిల్ సంక్షోభంతో బ్రేకులు పడ్డాయి. రిటైల్ బంకులలో సాధారణ ప్రజలు వినియోగించే డీజిల్ను రాష్ట్ర ప్రభుత్వం సిండికేట్ కాంట్రాక్టర్ల కోసం మళ్లించడంతో వ్యవస్థ గాడి తప్పింది. డీజిల్ దొరక్క రవాణా వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రాష్ట్ర సరిహద్దుల నుంచి నిత్యావసరాలు మోసుకొచ్చే లారీలను హైవేల పక్కన రోజుల తరబడి నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. వారం రోజులుగా వేల టన్నుల కూరగాయలు వాహనాల్లోనే మగ్గిపోయి కుళ్లిపోతున్నాయి. మార్కెట్కు సరుకు రాకపోవడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లకు మదనపల్లె, కర్నూలు నుంచి టమాటా... బాపట్ల, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పచ్చిమిర్చి.. ఉత్తరప్రదేశ్ నుంచి బంగాళాదుంపలు.. కర్నూలు, మహారాష్ట్ర నుంచి ఉల్లి.. కర్నాటకలోని కోలార్ నుంచి క్యాబేజీ, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, బీట్రూట్, కాలిప్లవర్ వస్తుండగా మిగిలిన కూరగాయలు కృష్ణా, గుంటూరు, గోదావరి లంక గ్రామాల నుంచి రవాణా అవుతుంటాయి. ఆకుకూరలు పూర్తిగా లంక గ్రామాలతో పాటు స్థానిక పల్లెల నుంచే వస్తుంటాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరం లాంటి ప్రధాన నగరాలకు రోజూ 275–300 టన్నుల వరకు కూరగాయలు రవాణా అవుతుంటాయని అంచనా.రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా గూడ్స్ వాహనాలు..రాష్ట్ర పరిధిలో రోజుకు 20 వేల కిలోలీటర్ల డీజిల్ వినియోగమవుతుండగా అందులో 30 శాతానికి పైగా సరుకు రవాణా వాహనాలే వినియోగిస్తుంటాయి. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా గూడ్స్ వాహనాలుండగా 40 శాతం వాహనాలు పూర్తిగా కూరగాయలు, నిత్యావసరాలను చేరవేస్తుంటాయి. డీజిల్ సంక్షోభం మొదలైన తర్వాత ఇవి ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. విశాఖ, విజయవాడ లాంటి ప్రధాన నగరాలకు రోజూ వచ్చే సరుకుల లోడు 30 నుంచి 40 శాతం తగ్గిపోయింది. రూ.కోట్ల విలువైన పంట ఉత్పత్తులు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. మదనపల్లి, కర్నూలు, అనంతపురం లాంటి ప్రాంతాల నుంచి పచ్చిమిర్చి, టమాటా లోడులతో బయల్దేరిన లారీలు డీజిల్ దొరక్క దారి మధ్యలోనే నిలిపి వేయాల్సి వచ్చిందని చిత్తూరుకు చెందిన ఓ లారీ యజమాని ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి వాహనాల్లోనే ఉండిపోవడంతో ఎండవేడికి కూరగాయలు కుళ్లిపోతున్నాయి. డీజిల్ కొరతతో కిరాయిలు రెట్టింపు వసూలు చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.20–30 శాతం పెరిగిన ధరలువేసవిలో ఉత్పత్తి తగ్గడం..దానికి డీజిల్ సంక్షోభం తోడు కావడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రైతులకు కిలో రూ.3–5కు మించి ధర లభించని టమాటా రిటైల్ మార్కెట్లో మూడు రెట్లు పెరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో కిలో రూ.15–20 పలికిన టమాటా ప్రస్తుతం రూ.45–55 పలుకుతోంది. మిగిలిన ప్రధాన కూరగాయల ధరలన్నీ 20–30 శాతం మేర పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆకుకూరలు సైతం 10–20 శాతం ధరలు పెరిగాయి. విజయవాడలోని ప్రధాన రైతుబజార్లలో ఈ నెల ప్రారంభంలో కిలో రూ.16 ఉన్న టమాటా ధర ప్రస్తుతం రూ.35కు చేరింది. వంగ రూ.20 నుంచి రూ.35కి ఎగబాకింది.సకాలంలో రాకపోవడంతో..డీజిల్ కొరత కారణంగా రవాణాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వాహనాలు మధ్యలోనే నిలిచి పోయాయని చెబుతున్నారు. డిమాండ్కు సరిపడా సరుకు రాకపోవడంతో స్థానికంగా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ ప్రభావం వినియోగదారులపై పడుతోంది. – గాదే వెంకటేశ్వరరావు, కూరగాయల వ్యాపారి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాఒక్కసారిగా పెరిగాయి..కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 15 రోజుల క్రితం వరకు నిలకడగా ఉన్న ధరలు ప్రస్తుతం అమాంతం పెరిగిపోయాయి. టమాటా మూడు రెట్లు పెరిగింది. ఇతర కూరగాయల ధరలు కూడా రూ.10–30 వరకు పెరిగాయి. డీజిల్ కొరత కారణంగా వాహనాలు రావడం లేదు. సరుకు లేకపోవడం వల్ల ధరలు పెంచాల్సి వస్తోందని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. – వన్నంరెడ్డి సురేష్, శ్రీనగర్ కాలని, విజయవాడజేబులకు చిల్లు పడుతోందిఇప్పటికే వంటనూనె ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కూరగాయల ధరలు కూడా పెరగడం భారంగా ఉంది. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వమే పరోక్షంగా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. డీజిల్ కొరత కారణంగా సరుకు రవాణా తగ్గి ప్రజల జేబులకు చిల్లు పడుతోంది.– ఆత్మకూరి శ్రీనివాసరావు, పేరవలిపాలెం, బాపట్ల జిల్లా -
పంతం నెగ్గించుకున్న ‘ముఖ్య’నేత!
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతంలో అత్యంత విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని సొంతం చేసుకునేందుకు ‘ముఖ్య’నేత మార్గం సుగమం చేసుకున్నారు. అధికారం అండతో మేనేజింగ్ కమిటీలో అందరూ తమకు అనుకూలమైన వ్యక్తులే ఉండేలా పావులు కదిపారు. బుధవారం జరిగిన కమిటీ ఎన్నికల్లో అంతా ముఖ్యనేత అనుకున్నట్లే జరిగింది. కాలేజీని ముఖ్యనేత పరం చేసేందుకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ఛైర్మన్గా ఎన్నికయ్యారు. మొత్తం 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పడగా దాదాపు అందరూ ముఖ్య నేతకు కాలేజీని బహుమతిగా ఇచ్చేందుకు మొగ్గు చూపక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ కమిటీ కోసం ముఖ్య నేత మనుషులు 20 రోజులుగా ‘ప్రత్యేక ఆపరేషన్’ నిర్వహించారు. పాత డైరెక్టర్లలో ఒక వర్గాన్ని గతంలోనే లొంగదీసుకోగా మిగిలిన వారిపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. బెదిరింపులతోపాటు అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేసినట్లు తెలిసింది. రాజధాని పనులు పర్యవేక్షించే మంత్రి ఈ వ్యవహారంలో అన్నీ తానై వ్యవహరించారు.ముఖ్య నేత ప్రాపకం కోసం.. ముఖ్యనేత బినామీగా పేరు పొందిన ఓ పారిశ్రామికవేత్త, రాజధాని ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ మొదట అన్ని విషయాలు పర్యవేక్షించి పాత డైరెక్టర్లను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ముఖ్య నేత అభీష్టాన్ని తెలుసుకున్నాక మంత్రి కూడా రంగంలోకి దిగారు. ముఖ్య నేతను ప్రసన్నం చేసుకునేందుకు ఈ వ్యవహారాన్ని ఉపయోగించుకున్నారు. కొందరు డైరెక్టర్ల ఇళ్లకు వెళ్లి నయాన భయాన దారికి తెచ్చుకున్నట్లు తెలిసింది. దీంతో ముఖ్యనేతకు అనుకూలంగా వ్యవహరించే మేనేజింగ్ కమిటీ ఏర్పాటైంది. ఇక ఈ కమిటీ ద్వారా కాలేజీని ముఖ్యనేత తమ కుటుంబం పరం చేసుకోవడమే మిగిలింది. అత్యంత కారుచౌకగా కాలేజీ, ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు పాత డైరెక్టర్లు చర్చించుకుంటున్నారు.రూ.2 వేల కోట్ల ఆస్తి.. పప్పు బెల్లాలకు!కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉన్నత లక్ష్యంతో 2003లో ఈ ప్రాంతానికి చెందిన 32 మంది ఎన్ఆర్ఐ వైద్యులు ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్ను స్థాపించారు. మంగళగిరిలో 50 ఎకరాల స్థలం కొనుగోలు చేసి కాలేజీ, దానికి అనుబంధంగా ఆస్పత్రిని నిర్మించారు. అనతి కాలంలోనూ అది ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందగా దాని విలువ కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం కాలేజీ విలువ రూ.2 వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. మేనేజింగ్ కమిటీలో తలెత్తిన విభేదాలతో దీనిపై ముఖ్య నేత కన్ను పడింది. వీటిని ఆసరాగా తీసుకుని ఏకంగా కాలేజీనే సొంతం చేసుకునే ఎత్తుగడ వేశారు. ఇందుకోసం తన బినామీలను రంగంలోకి దించి డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చి తనకు అనుకూలంగా కమిటీ ఏర్పాటయ్యేలా కుట్రలు పన్నారు. కాలేజీని కారుచౌకగా ముఖ్యనేత కుటుంబ పరం చేసేలా పావులు కదిపారు. కాలేజీకి చెందిన రూ.240 కోట్ల కార్పస్ ఫండ్తోపాటు ఇతర విలువైన ఆస్తులను దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. -
కూటమి సర్కార్కు వైఎస్సార్సీపీ అల్టిమేటం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నేత, అప్సడా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిన్నచూపు, చులకనభావం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమా? రైతులకు అవసరం లేదా? అని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.డీజిల్ కొరత కారణంగా మంత్రి నాదేళ్ల మనోహర్ ప్రకటించిన కేటాయింపుల పట్టిలో రైతులకు, వ్యవసాయ రంగానికి స్థానం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటల్లో డీజిల్ సమస్యకు పరిష్కారం చూపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంకులను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రెస్మీట్లో వడ్డీ రఘురాం ఏమన్నారంటే..వ్యవసాయ రంగం అంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపురాష్ట్రంలో ఆక్వా రంగం, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అంటే చిన్నచూపు, చులకన భావం మాత్రమే ఉంది. ఇవాళ డీజిల్ కొరత విపరీతంగా ఉంది. రాష్ట్రంలో 4510 బంకులు ఉంటే అందులో 70 శాతం బంకుల్లో డీజిల్ లేదు. డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులకు డీజిల్ అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణానికే డీజిల్ అవసరమని కేంద్రానికి లేఖలు రాస్తున్నారు… రైతులకు అవసరం లేదా?. మన ఎంపీ కేంద్ర మంత్రిని కలిసి డీజిల్ కొరత ఉందని చెబితే, వాళ్లు అలాంటిది ఏమీ లేదని చెబుతున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు. ఇప్పుడు పంట కోత దశలో కూడా డీజిల్ కోసం బంకుల వద్ద క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. నాదేళ్ల మనోహర్కు రైతులకు కనిపించలేదా?గతంలో కూలీలతో కోతలు కోసేవారు. ఇప్పుడు యంత్రాలతో కోతలు చేస్తున్నారు. కానీ ఆ యంత్రాలకు డీజిల్ లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంత్రి నాదేళ్ల మనోహర్ మాత్రం బైక్కు 2 లీటర్లు, కారుకు 15 లీటర్లు, లారీలకు 50 లీటర్లు, బస్సులకు 100 లీటర్లు మాత్రమే డీజిల్ ఇవ్వాలని ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో రైతుకు ఎంత డీజిల్ అవసరమో ఈ ప్రభుత్వం ప్రకటించలేదు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్నచూపో దీన్నిబట్టి అర్థమవుతోంది. రాష్ట్రంలో రైతు లేడు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటే మంత్రి మాత్రం సింగపూర్లో షికార్లు కొడుతున్నారు. అక్కడి నుంచే ఏపీలో డీజిల్ కొరత లేదని స్టేట్మెంట్ ఇస్తున్నారు.ఆక్వా రంగం ఎలా బాగుపడుంది?ఆక్వా రంగంలో ట్రంప్ ట్యాక్స్ పేరుతో టన్నుకు రూ.60–70 వేల వరకు తగ్గించారు. ఇరాన్–అమెరికా యుద్ధం సాకుగా మరోసారి రూ.30–40 వేల వరకు తగ్గించారు. ఇప్పుడు డీజిల్ కొరత పేరుతో టన్నుకు రూ.10 వేలు తగ్గించారు. ఇలాంటి పరిస్థితిలో ఆక్వా రంగం బాగుందా? సంక్షోభంలో ఉందా? మంత్రే చెప్పాలి. డాలర్ విలువ రూ.53 నుంచి రూ.96కి పెరిగినా, రొయ్య ధర మాత్రం కేజీకి రూ.10 తగ్గింది. వైయస్ జగన్ ఫీడ్ రేటు రూ.25 తగ్గించాలని డిమాండ్ చేస్తే, అప్పట్లో కేవలం రూ.4 మాత్రమే తగ్గించారు. ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలో ప్రభుత్వం కుమ్మక్కై రైతులను నష్టపరుస్తోంది. ప్రతిరోజూ 4 వేల టన్నుల చేపలు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తాయి. సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఈ 50 లీటర్లతో బెజవాడ దాకా వెళ్తుంది.. ఆ తర్వాత ఎలా?చేపలను కార్గో విమానాల్లో పంపాలా?గతంలో పాలీ కెమికల్ ప్రచారం వల్ల చేపల లోడ్లు ఆగిపోయినప్పుడు, వైయస్ జగన్ 24 గంటల్లో సమస్య పరిష్కరించి ఎగుమతులు పునరుద్ధరించారు. ఇప్పుడు డీజిల్ కొరత వల్ల ఎగుమతులు కష్టమయ్యాయి. ఇక చేపలను కార్గో విమానాల్లో పంపాలా?. ఆక్వా రైతులకు ప్రొక్యూర్మెంట్ జరుగుతోంది కానీ ప్రాసెసింగ్ పాయింట్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. లారీలకు 50 లీటర్ల డీజిల్ మాత్రమే ఇస్తే, ఆ రోయ్యలు ఆ పాయింట్లకు ఎప్పుడు చేరుతాయి?ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా?ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి సుమారు 64 వేల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వైయస్ జగన్ సీఎం గా ఉన్నప్పుడు 4.64 లక్షల ఎకరాలు కల్చర్ చేసి, 3.57 లక్షల ఎకరాలను ఆక్వా జోన్లోకి తీసుకువచ్చి రూ.3600 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. కానీ ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి ఎంత సహాయం చేసింది?. అసెంబ్లీలో మాత్రం ‘సూపర్ సిక్స్… సూపర్ హిట్’ అంటున్నారు. కానీ అన్నింటిలో కమీషన్లు తీసుకోవడంలోనే ఈ ప్రభుత్వం సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ రెండేళ్లలో ఒక్క కొత్త కనెక్షన్ అయినా ఇచ్చారా? చూపించండి.గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ రూ.2కే ఇస్తామని చెప్పి మోసం చేసింది. బకాయిలు పెట్టిపోతే, వైయస్ జగన్ వచ్చాక వాటన్నింటిని తీర్చి యూనిట్ రూ.1.50కే ఇచ్చారు. మొక్కజొన్న పంట విస్తారంగా వచ్చింది. తెలంగాణలో క్వింటాల్కు రూ.2400 ఇస్తుంటే, మన రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు చెప్పాలి. డీజిల్ కొరత ఉందని ఈ ప్రభుత్వానికి తెలియదా? గతంలో ఆర్బీకేల ద్వారా పంట కోతల సమయంలో అవసరాలు, నష్టాలు, మద్దతు ధరలపై ముందుగానే సమాచారం ఇచ్చేవారు.కూటమి ప్రభుత్వానికి 24 గంటలే డేట్లైన్రాష్ట్రంలో 24 గంటల్లో డీజిల్ సమస్య పరిష్కరించకపోతే, వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంకులను ముట్టడిస్తాం. డీజిల్పై రూ.20 పెరుగుతుందని మీరే లీకులు ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో కొరత లేకపోతే ఇక్కడే ఎందుకు ఉంది? ఐవోసీ డీలర్లకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తోందా? మంత్రి నాదేళ్ల మనోహర్ స్పష్టం చేయాలి… డీజిల్, పెట్రోల్ ధరలు పెరగవని చెప్పగలరా? రేపు ధరలు పెరిగితే, ఈ సంక్షోభాన్ని కావాలనే సృష్టించారని ప్రజలు అర్థం చేసుకుంటారు.గతంలో పొగాకు, మామిడి, మిరప రైతుల సమస్యల్లో ఉంటే వైయస్ జగన్ పోరాటం చేస్తే తప్ప మీ ప్రభుత్వంలో చలనం రాలేదు. ఇప్పుడు కోకో రైతులు తీవ్ర నష్టపోతున్నా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆక్వా రంగానికి తక్షణమే యూనిట్ ధరను రూ.1.50కు సబ్సిడీగా ఇవ్వాలి. సబ్సిడీ ఇవ్వకపోతే ఆక్వా రైతుల తరఫున ఉద్యమం తప్పదు. వైయస్ జగన్, వైయస్సార్సీపీ ఎప్పుడూ రైతులు, ఆక్వా రైతులకు అండగా ఉంటాయని వడ్డీ రఘురాం స్పష్టం చేశారు. -
ఒకేసారి 6,124 మంది సచివాలయ ఉద్యోగులకు డిప్యుటేషన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులలో 6,124 మందిని వివిధ ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్పై పంపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధ్యక్షతన మార్చి 13న వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ నెల 22న అన్ని శాఖలకు చేరాయి. మొత్తం 19 శాఖలకు 10,465 మంది ఉద్యోగులు అవసర మని ఆయా శాఖలు ప్రభుత్వానికి తెలియ జేయగా.. 6,124 మందిని సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.సచివాలయాల్లో పనిచేసే మహిళా పోలీసులలో 2వేల మందిని హోంశాఖలో సిటిజన్ సర్వీస్ ఫెసిలిటేటర్లుగా, మరో 783 మందిని మహిళా శిశు సంక్షేమ శాఖలో మిషన్ వాత్సల్య విభాగం ఉద్యోగులుగా.. ఇంకో 406 మందిని మెప్మాలో కమ్యూనిటీ కో–ఆర్డినేటర్లుగా.. 129 మందిని సెర్ప్లో లైవ్లీ హుడ్ (జీవనోపాధుల కల్పన) అసిస్టెంట్లుగా.. 100 మంది మహిళా పోలీసులను బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా, 9 మందిని మైనార్టీ శాఖకు డిప్యుటేషన్పై పంపాలని ప్రతిపాదించారు.ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు సైతం..గ్రామ సచివాలయాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను సైతం వివిధ శాఖలకు డిప్యుటేషన్పై పంపించాలని నిర్ణయించారు. వారిలో 430 మందిని గృహ నిర్మాణ శాఖ, 367 మందిని ఆర్ అండ్ బీ, 250 మందిని ఆర్డబ్ల్యూఎస్, 70 మందిని వైద్యశాఖ పరిధిలోని సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, ఇంకో 50 మందిని విద్యా శాఖలో ఇంజినీరింగ్ పనులకు, 20 మందిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, 10 మందిని టూరిజం ఇంజనీరింగ్ పనులకు ఉపయోగించుకోవాలని ప్రతిపాదించారు.గిరిజన శాఖ పరిధిలోని ఐటీడీఏలో 28 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను, సమగ్రశిక్ష విభాగంలో 113 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను డిప్యుటేషన్ విధానంలో నియమించాలని ప్రతిపాదించారు. 562 మంది వార్డు ఎమినిటీస్ సెక్రటరీలను పట్టణాభివృద్ది శాఖలో ఇంజినీరింగ్ పనుల పర్యవేక్షణకు, 530 మంది వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలను టౌన్ ప్లానింగ్ విభాగంలో వినియోగించుకోవాలని ప్రతిపాదించారు. 140 మంది వార్డు రెవెన్యూ సెక్రటరీలను సాంఘిక సంక్షేమ శాఖలో వార్డెన్లు, కేర్ టేకర్లుగా, 125 మంది వీఆర్ఏలను బీసీ సంక్షేమ శాఖ హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్లుగా డిప్యుటేషన్పై పంపాలని ప్రతిపాదించారు.సచివాలయాల ఉద్యోగులు కూలీలా..సచివాలయ ఉద్యోగులను కూలీల మాదిరిగా ఏ శాఖకు కావాలంటే ఆ శాఖకు పంచుతుండటం దుర్మార్గమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షేక్ అబ్దుల్రజాక్, ప్రధాన కార్యదర్శి శిష్టు నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థను బలహీనపరచడానికి, అస్తవ్యస్తం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు. డిప్యుటేషన్పై పంపించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ ఫస్ట్ వస్తోంది.. ముందు నెల జీతాలే ఇవ్వలేదు...
సాక్షి, అమరావతి: రెండు రోజుల్లో మళ్లీ ఒకటో తేదీ వస్తోంది. కానీ రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ముందు నెల జీతాలే ఇంకా ఇవ్వలేదు. రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలకు సంబంధించిన పొదుపు సంఘాల కార్యక్రమాల్లో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) విభాగంలోని సుమారు 4,500 మంది ఉద్యోగులెవరికీ ఏప్రిల్ ఒకటో తేదీన అందాల్సిన జీతం నెల పూర్తవుతున్నా అందనే లేదు.వీరికితోడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా శాఖ పరిధిలో జూనియర్ కాలేజీల్లో పని చేసే 3,600 మంది.. డిగ్రీ కాలేజీల్లో పని చేసే 900 మంది.. పాలిటెక్నికల్ కాలేజీల్లో పనిచేసే 500 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు సైతం ఏప్రిల్ ఒకటిన అందాల్సిన వేతనాలు ఇంకా రానే రాలేదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. వీరికితోడు పాఠశాల విద్య పరిధిలో పనిచేసే 4,500 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేసే 1,600 మంది టీచింగ్ ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు కలిపి 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఏప్రిల్ ఒకటిన జీతాలు అందలేదని ఆయా ఉద్యోగ సంఘ ప్రతినిధులు పేర్కొంటున్నారు.50 వేల మందిపై తీవ్ర ప్రభావంమొత్తం వందకు పైగా ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే సుమారు 50 వేల మందికి పైగా ఉద్యోగులు వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సెర్ప్ పరిధిలో గౌరవ వేతనంతో పనిచేసే 27 వేల మందికి పైగా గ్రామ సమాఖ్య సహాయకులకు (వీవోఏ – యానిమేటర్లు) సుమారు 4 నెలలుగా గౌరవ వేతనం విడుదల చేయలేదని ఆయా ఉద్యోగ సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెలలో కూడా కాంట్రాక్టు లెక్చరర్లు, సెర్ప్ ఉద్యోగులతోపాటు చాలా విభాగాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు చాలా ఆలస్యంగానే జీతాలు ఇచ్చి నట్టు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ మాదిరిగా నెల ముగిసేంత వరకు జీతాలు అందని పరిస్థితి ఉండేది కాదని ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. -
అంగన్వాడీలకు సెలవుల సంగతేంటి?
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఎండలు మండుతాయి. వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన చిన్నారులు, బాలింతలు, గర్భిణుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎండల తీవ్రత దృష్ట్యా రెండునెలల రేషన్ ఒకేసారి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నా... అంగన్వాడీ కేంద్రాలకు సెలవుల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. చర్చల సమయంలో సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం చెబుతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇచ్చిన హామీకి ఇంత వరకూ అతీగతీ లేదని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో సెలవుల ప్రకటన రెండు రోజుల్లో ఏప్రిల్ నెల ముగియనుంది. అయినా అంగన్వాడీలకు మే 1 నుంచి వేసవి సెలవుల ఇచ్చే విషయమై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అంగన్వాడీలకు మే 1 నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. 20 రోజుల క్రితమే చర్చించినా.. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని 20 రోజుల కిందటే అంగన్వాడీ యూనియన్ నేతలు కలిసి వేసవి సెలవుల విషయాన్ని ప్రస్తావించారు. ఇంకా చాలా రోజులు సమయం ఉందని, సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఏప్రిల్ ముగిసి మే నెల వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంత వరకు సెలవుల విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సెలవులు ప్రకటించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటి వద్దే రేషన్(టీహెచ్ఆర్) అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు. -
వైఎస్ జగన్ ఇచ్చిన ‘వెలుగులు’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు సచివాలయాల ద్వారా ఇచ్చిన వరం వారికి మరిన్ని ఫలాలను అందిస్తోంది. ఎనర్జీ అసిస్టెంట్ల సేవలను విద్యుత్ శాఖ పనులకే పరిమితం చేయాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం మంగళవారం ఆదేశించింది. అలాగే.. జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) గ్రేడ్–2 కేడర్లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్లను జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం)లుగా గుర్తిస్తున్నట్టు ఏపీ ట్రాన్స్కో మంగళవారం ప్రకటించింది.దీంతో వీరు నేరుగా జేఎల్ఎంలుగా మారుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం నెలకు వస్తున్న రూ.22,460 జీతం త్వరలో రూ.30,800కు చేరుతోంది. దీనికి ఇతర ప్రోత్సాహకాలు కలిపి దాదాపు రూ.10 వేల వరకూ జీతం పెరుగుతోంది. ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ శాఖకు సంబంధం లేని పనులకు వినియోగించకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఉప కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
డీజిల్ సంక్షోభానికి బాబు సర్కారే కారణం.. సిండికేట్కు ‘ఇంధనం’!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వారం రోజులుగా మండుటెండల్లో రోడ్లమీద నరకయాతన.. పెట్రోలు బంకుల వద్ద గంటల తరబడి పడిగాపులు.. సాధారణ ప్రజలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారుల దీనావస్థ, ఇక్కట్లకు కర్త, కర్మ, క్రియ చంద్రబాబు సర్కారేనని రుజువైంది. ప్రజల కళ్లకు గంతలు కట్టి సర్కారే దొంగాట ఆడుతున్నట్లు తేలిపోయింది! దోచుకో.. పంచుకో.. తినుకో..! విధానంతో బరి తెగించి అడ్డగోలుగా వ్యవహరిస్తున్న టీడీపీ పెద్దలు ప్రజలు ఏమైపోతే తమకేమంటూ జనం జీవితాలతో చెలగాటమాడేందుకు వెనుకాడటం లేదు. రాష్ట్రంలో ఇంధన కొరతపై సమీక్షించిన సీఎం చంద్రబాబు చమురు కంపెనీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని.. విరుచుకుపడ్డారని ఎల్లో మీడియా, సీఎంవో ఇచ్చిన లీకులు ఉత్తుత్తివేనని తేలిపోయింది. స్వయంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి జోక్యం చేసుకోవడంతో చంద్రబాబు బడాయిల బండారం బట్టబయలైంది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్, బల్క్ డీజిల్ను సాధారణ ప్రజల కోసం ఏర్పాటైన రిటైల్ పెట్రోలు బంకులలో రాజధాని నిర్మాణ పనుల కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చమురు కంపెనీలను ఆదేశిస్తూ బాబు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయటాన్ని కేంద్రం తప్పుబట్టింది. ఇది చట్ట విరుద్ధమని, ఆ ఉత్తర్వులు చెల్లవని, వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించిది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఢిల్లీలో పెట్రోలియం శాఖ ఉన్నతాధికారులను కలసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఏపీలో వారం రోజులుగా ప్రజల దుస్థితిని వివరించడంతో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్ను బాబు సర్కారు ఏపీలో కొందరు కాంట్రాక్టర్లకు ప్రయోజనం కల్పిస్తూ వాణిజ్య అవసరాల కోసం దారి మళ్లించినట్లు బహిర్గతమైంది. ఈ అడ్డగోలు ఆదేశాలే రాష్ట్రంలో డీజిల్ సమస్యకు కారణం రాజధాని కాంట్రాక్టర్లకు పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలని ఆయిల్ కంపెనీలను ఆదేశిస్తూ ఈనెల 24న పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు జారీ చేసిన ఉత్తర్వులుకాంట్రాక్టర్లు నేరుగా కాదు.. బల్క్లో కొనాల్సిందేరాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు రూ. వందల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చుతూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయమే ఏపీలో డీజిల్, పెట్రోల్ కృత్రిమ కొరతకు దారి తీసిందన్నది బట్టబయలైంది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కమర్షియల్, బల్క్ డీజిల్ను సాధారణ ప్రజల కోసం ఏర్పాటైన రిటైల్ పెట్రోలు బంకులలో కాంట్రాక్టు సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని చమురు కంపెనీలను ఆదేశిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 24న ఓ సర్క్యులర్ జారీ చేయడమే ఈ ఇక్కట్లకు అసలు కారణం. వాణిజ్య అవసరాలకు భారీ మొత్తం(బల్క్)లో డీజిల్, పెట్రోల్ అవసరం అవుతుంది. కాంట్రాక్టర్లు నేరుగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) నుంచే బల్క్గా డీజిల్ కొనుగోలు చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ నిబంధన విధించింది. వాణిజ్య అవసరాలకు బల్క్గా కొంటే లీటర్ డీజిల్కు రూ.153 చెల్లించాలి. అదే పెట్రోల్ బంకుల్లో రిటైల్గా కొంటే డీజిల్ లీటర్ ధర రూ.98 మాత్రమే. అంటే..ఒక లీటర్పై రూ.55 మేర రాజధాని కాంట్రాక్టర్లకు బాబు సర్కార్ ప్రయోజనం చేకూర్చేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోందని ఓఎంసీ వర్గాలు చెబుతున్నాయి. బంకుల నుంచి రిటైల్ ధరకు కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో డీజిల్ను అందించడం వల్లే ఏపీలో డీజిల్, పెట్రోల్ దొరక్క అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట కోతలు, పరిశ్రమల్లో ఉత్పత్తులు ఆగిపోయాయి. డీజిల్, పెట్రోల్ కొరతతో రాష్ట్రం స్తంభించిపోయినా అంతా బాగుందంటూ ప్రభుత్వం చెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. చట్ట విరుద్ధం.. వెంటనే వెనక్కి తీసుకోండి: కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు చట్టాన్ని ఉల్లంఘించడమేనని.. వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని తేల్చిచెబుతూ ఈనెల 25న సీఎస్కు కేంద్రం రాసిన లేఖ తొమ్మిది సంస్థలకు అధిక ధరలకు కట్టబెట్టి..సీఆర్డీఏ, ఏడీసీఎల్(అమరావతి అభివృద్ధి సంస్థ) నేతృత్వంలో రాజధానిలో రూ.58 వేల కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులను ముఖ్యనేత సన్నిహితులకు చెందిన తొమ్మిది కాంట్రాక్టు సంస్థలకు అధిక ధరలకు కట్టబెట్టి భారీ ప్రయోజనం చేకూర్చారు. కాంట్రాక్టు విలువలో పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి.. అందులో 8 శాతం కమీషన్ రూపంలో వసూలు చేసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు పనులు కట్టబెట్టి లాభం చేకూర్చడంతో ఆగకుండా డీజిల్లోనూ ప్రయోజనం కల్పిస్తూ మరో అడుగు ముందుకేశారు. కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఆగమేఘాలపై..అమరావతి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు రిటైల్ ధరకు పెట్రోల్ బంకుల నుంచి డీజిల్ కేటాయించి సరఫరా చేయాలంటూ సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) కమిషనర్ ఈనెల 23న పౌరసరఫరాల శాఖ కమిషనర్కు లేఖ రాశారు. ఆ మరుసటి రోజే పౌరసరఫరాల శాఖ కమిషనర్ కె.కన్నబాబు దీనిపై స్పందించి.. రాజధాని పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు 27,566.25 కిలోలీటర్లు(2,75,66,250 లీటర్లు) డీజిల్ను రిటైల్ ధరకు పెట్రోల్ బంకులలో కేటాయించి సరఫరా చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో రిటైల్ ధరకు డీజిల్, పెట్రోల్ అందించాలంటూ ఇదే రీతిలో పలు జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 24 నుంచే రాజధాని కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో డీజిల్ను రిటైల్ ధరకు పెట్రోల్ బంకులు అందించాయి. ఆ రోజు నుంచే రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడి రోజురోజుకూ తీవ్రంగా మారి సంక్షోభంగా రూపాంతరం చెందింది. ఇంధనం లేక తిరుపతిలో మూసివేసిన ఓ బంకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కేంద్రంరాజధాని పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో రిటైల్ ధరలకు పెట్రోల్ బంకుల నుంచి డీజిల్ అందించాలని చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది. ఇది చట్టవ్యతిరేకమని స్పష్టం చేసింది. తక్షణమే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏప్రిల్ 25న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్కు కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బల్క్గా రిటైల్ ధరలకు డీజిల్ సరఫరా అందించాలంటూ చంద్రబాబు సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. ఆ ఉత్తర్వులు నిత్యావసర సరకులు (ఎసెన్షియల్ కమోడిటీస్) చట్టం–1995ను ఉల్లంఘించడమేనని ఆ లేఖలో తేల్చిచెప్పారు. ఇది పెట్రోల్, డీజిల్ కొరతకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీల వద్దకే ఓఎంసీల నుంచి నేరుగా బల్క్గా డీజిల్ సరఫరా చేసే వ్యవస్థ ఇప్పటికే ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న పౌరసరఫరాల శాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చి.. జనజీవనం స్తంభించిపోతున్నా సరే రాజధాని కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూర్చుతూ జారీ చేసిన ఉత్తర్వులపై స్పందించకుండా చమురు కంపెనీలపైనే చంద్రబాబు ఎదురుదాడికి దిగడం విస్మయం కలిగిస్తోంది.రిటైల్ బంకుల నుంచి డీజిల్ బల్క్ సరఫరా చట్టవిరుద్ధంఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం అభ్యంతరంరిటైల్ బంకులకు బల్క్ సప్లై లైసెన్సులు ఉండవని స్పష్టీకరణ ఆ ఆదేశాలను తక్షణం ఉపసంహరించు కోవాలని ఏపీ సీఎస్కు కేంద్రం లేఖసాక్షి, న్యూఢిల్లీ: అమరావతి రాజధానిలో నిర్మాణ పనుల కోసం సాధారణ పెట్రోల్ బంకుల (రిటైల్ అవుట్లెట్ల) నుంచి భారీ పరిమాణంలో (బల్క్) డీజిల్ సరఫరా చేయాలంటూ ఏపీ పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి.సాయిప్రసాద్కు కేంద్ర పెట్రోలియం, సహజవాయువులశాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ఈ నెల 25న లేఖ రాశారు. అమరావతి నిర్మాణ కార్యకలాపాల కోసం బల్క్ డీజిల్ను రిటైల్ అవుట్లెట్ల నుంచి సరఫరా చేయాలంటూ ఈ నెల 24న ఏపీ పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు 2002 పెట్రోలియం నిబంధనలు (ముఖ్యంగా ఫామ్–14 కండిషన్ 16(4)), పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) మార్గదర్శకాలకు విరుద్ధమని కేంద్ర కార్యదర్శి తన లేఖలో తేల్చిచెప్పారు. నిబంధనల ప్రకారం రిటైల్ బంకుల్లో వాహనాల ఇంధన ట్యాంకుల్లోకి లేదా ఆమోదించిన కంటైనర్లలో గరిష్టంగా 200 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం పోసేందుకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. బల్క్ సప్లై చేసేందుకు రిటైల్ బంకులకు ఎలాంటి లైసెన్సులు ఉండవని స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ బంక్ వద్ద బారులు తీరిన వాహనదారులు భద్రతకు ముప్పు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు 1955 నిత్యావసర వస్తువుల చట్టం కింద జారీచేసిన మోటార్ స్పిరిట్ అండ్ హై–స్పీడ్ డీజిల్ (సరఫరా, పంపిణీ నియంత్రణ, అక్రమాల నివారణ) ఆర్డర్–2005 నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ ప్రాజెక్టులకు బల్క్ ఇంధనం సరఫరా చేయడానికి ఓఎంసీలకు ప్రత్యేకంగా డైరెక్ట్ సేల్స్ యంత్రాంగం ఉందని గుర్తుచేసింది. ఆ విధానాన్ని కాదని రిటైల్ బంకుల ద్వారా మళ్లించడం చట్టవిరుద్ధమే కాకుండా భద్రత, లైసెన్సింగ్, నిర్వహణ పరమైన ఆందోళనలను రేకెత్తిస్తుందని హెచ్చరించింది. స్థిరమైన పరికరాలకు ఇంధనాన్ని సురక్షితంగా సరఫరా చేయడానికి కేంద్రం నోటిఫై చేసిన డోర్ డెలివరీ ఆఫ్ డీజిల్ (డీడీడీ) పథకం అమల్లో ఉందని, పెసో ఆమోదిత బౌజర్ల ద్వారా సరఫరా చేసుకోవచ్చని సూచించింది. ప్రస్తుత నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఏపీ పౌరసరఫరాలశాఖ ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకునేలా సీఎస్ జోక్యం చేసుకోవాలని కేంద్ర కార్యదర్శి నీరజ్ మిట్టల్ కోరారు.ఇవీ నిబంధనలు..నిబంధనల ప్రకారం పెట్రోలియం ఉత్పత్తులను రిటైల్ అవుట్లెట్లలో వాహనాల ఇంధన ట్యాంకులు, అనుమతించిన కంటైనర్లలోనే నింపాలి. అది కూడా గరిష్టంగా 200 లీటర్లకు మించి నింపకూడదు. రిటైల్ అవుట్లెట్లలో బల్క్ అవసరాల కోసం విక్రయించేందుకు అనుమతి లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పెట్రోల్, డీజిల్ కొరతకు దారి తీసే ప్రమాదం ఉంది. వాణిజ్య అవసరాల కోసం బల్క్గా డీజిల్ విక్రయించేందుకు చమురు కంపెనీలకు ఇప్పటికే పటిష్టమైన ప్రత్యేక వ్యవస్థ ఉంది. -
రాష్ట్రంలో శంకర్దాదాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ సినిమా తరహాలో వైద్య విద్య పరీక్షల్లో కాపీయింగ్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 2 నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన ఎంబీబీఎస్, పీజీ, డెంటల్, ఆయుష్ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్కు పాల్పడుతూ ఇప్పటివరకు ఏకంగా 20 మంది వైద్య విద్యార్థులు పట్టుబడ్డారు. వీరిలో 14 మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. చిట్టీల ద్వారా కాపీయింగ్కు పాల్పడుతూ 16 మంది, స్మార్ట్ వాచీల్లో చూసి రాస్తూ ఇద్దరు, సెల్ఫోన్ ద్వారా కాపీయింగ్ కొడుతూ ఇద్దరు దొరికారు. విశాఖ, నెల్లూరు, కర్నూలులోని ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు రాజమండ్రి, మంగళగిరి, విశాఖపట్నం, విజయనగరంలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ పరీక్షల్లో విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడినట్టు సమాచారం. స్మార్ట్ వాచీలు, ఫోన్లు ఎలా అనుమతించారు? నిబంధనల ప్రకారం ఎగ్జామినేషన్ హాలులోకి స్మార్ట్ ఫోన్లు, వాచీలు తీసుకువెళ్లకూడదు. హాలులోకి ప్రవేశించేటప్పుడే ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారు. పరీక్ష నిర్వహణ విధుల్లో ఉండే ఇని్వజిలేటర్లు, సిబ్బంది కూడా సెల్ఫోన్లు వినియోగించకూడదు. అయితే, తనిఖీలను దాటుకుని విద్యార్థులు చిట్టీలే కాకుండా, స్మార్ట్ ఫోన్లు, వాచీలతో పరీక్ష హాలులోకి ప్రవేశించి కాపీయింగ్కు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది, అబ్జర్వర్, ఎగ్జామినర్ల సహకారంతోనే కాపీయింగ్ తంతు నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.రెండు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో పరీక్ష రాసే సమయంలో ఇన్విజిలేటర్లు సెల్ఫోన్ వినియోగిస్తుండటంతో వారిని పరీక్షల విధుల నుంచి తప్పించారు. గతేడాది కూడా ఎంబీబీఎస్ సప్లిమెంటరీ పరీక్షల్లో విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ వైద్య విద్యార్థులు పట్టుబడ్డారు. కాగా, ప్రస్తుతం ఎగ్జామ్ సెంటర్లలో కాపీయింగ్కు పాల్పడుతున్న విద్యార్థులను విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా గుర్తించినట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, చిట్టీల ద్వారా కాపీయింగ్కు పాల్పడుతూ విద్యార్థులు దొరికిపోయినట్లు వెల్లడించారు. -
వైఎస్సార్సీపీలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ కమిటీలో వివిధ హోదాల్లో నియమించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ఎల్. కాంతారావు, బి.పద్మజలను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా, ఎల్. శ్రీరాములునాయుడును పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా, బి. వెంకటకృష్ణ రావును స్టేట్ వైఎస్ఆర్టీయూసీ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
భూములిచ్చిన ఊరినే బంధించి!
సాక్షి, విశాఖపట్నం: ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాగేసుకుని.. పైసా పరిహారం కూడా చెల్లించకుండానే భూములిచ్చిన ఊరిని పూర్తిగా బంధించి అదానీ గూగుల్ డేటా సెంటర్కు చంద్రబాబు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. తర్లువాడలో నిరసన జ్వాలలు రగలకుండా నలువైపులా పోలీసుల్ని కాపలా పెట్టి.. అట్టహాసంగా చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఆంక్షల నడుమ నిర్వహించింది. తొలుత 30 వేల మంది స్థానిక ప్రజలతో భారీ బహిరంగ సభ నడుమ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది.ఆనందపురం మండలం తర్లువాడ గ్రామానికి నలువైపులా పోలీసులను మోహరించి.. ఆ ప్రాంతాన్ని యుద్ధ ప్రాతిపదికన దిగ్బంధించారు. గెడ్డలు, వాగులు, వంకలు, చివరకు పొలాల్లోని మామిడి తోటలను కూడా వదలకుండా పోలీసులు పహారా కాశారు. తమ భూముల్ని బలవంతంగా లాక్కున్నారనే పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను కనీసం ఊరి పొలిమేరలు కూడా దాటకుండా నిర్బంధించడం చంద్రబాబు నిరంకుశ పాలనకు పరాకాష్టగా మారింది. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ కార్యక్రమం వద్ద రైతులు నిలదీయాలని భావించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో రెండు రోజుల నుంచి తర్లువాడ గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భూములిచ్చిన వందలాది మంది రైతులను దరిచేరనివ్వలేదు.శంకుస్థాపన కార్యక్రమం ముగిసే వరకు గ్రామం నుంచి ఎవరూ బయటకు రాకుండా.. బయటి వ్యక్తులు ఊరిలోకి వెళ్లకుండా అప్రకటిత నిర్బంధాన్ని విధించారు. పొలం పనులకు, తోటపనులకు వెళ్తామని వచ్చిన రైతుల్ని కూడా వెనక్కి పంపించేశారు. తర్లువాడ నుంచి కేవలం ఇద్దరు టీడీపీ నేతలకు మాత్రమే సభకు హాజరయ్యేందుకు పాస్లు ఇచ్చారు. ఏయూ విద్యార్థులు, ఐటీ సెజ్లోని కంపెనీల ఉద్యోగుల్ని సభకు తరలించారు. ప్రభుత్వ దమనకాండతో భీతిల్లిన రైతులు, గ్రామస్తులు నష్టపరిహారం చెల్లించే వరకూ గూగుల్ డేటా సెంటర్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
వట్టిమాటలు కట్టి‘పెట్రో’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం తీవ్రమైంది. వారం రోజులుగా ఈ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. సంక్షోభాన్ని నివారించడంలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. పైగా కృత్రిమ కొరతకు కారణమైంది. పర్యవసానంగా రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా నో స్టాక్ బోర్డులే దర్శమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంఓ చంద్రబాబు సర్కార్ను మొద్దు నిద్ర నుంచి మేల్కొపేందుకు వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నిరసనలకు పిలుపు నిచి్చంది. మంగళవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలతో పాటు ప్రజలు భాగస్వాములు కావటం విశేషం. దీంతో నిరసన కార్యక్రమం దిగి్వజయమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సర్కార్ వైఫల్యాన్ని నేతలు ఎండగట్టారు. ‘ఏపీలో మద్యం పుల్ .. డీజిల్ పెట్రోల్ నిల్, పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి, దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా సంక్షోభం లేదు.. ఇక్కడే ఎందుకు? ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వం, ఇంధనం అవసరమైనంత అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి’ అంటూ రాసిన ప్లకార్డులు వైఎస్సార్సీపీ నాయకులు చేతపట్టుకొని బంకుల వద్ద నిరసన తెలిపారు.పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం మాత్రం మాటలతో కాలయాపన చేస్తోందని వారు విమర్శించారు. వారం రోజులుగా తీవ్ర సమస్య ఉన్నా.. బాబు సర్కారు పబ్లిసిటీ డ్రామాలు ఆడడం ఏమిటని నిలదీశారు. మొన్న యూరియా .. నిన్న గ్యాస్ .. నేడు ఇంధన కొరత! ఇలా ఈ ప్రభుత్వంలో ప్రజలకు నిత్యం నరకం కనపడుతోందని దుయ్యబట్టారు. ఈ ఇంధన సంక్షోభం బాబు సృష్టించిందేనని విమర్శించారు. విజయవాడ కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. బాబు పబ్లిసిటీ స్టంట్లు ఆపి.. వట్టిమాటలు కట్టిపెట్టి ఇంధన సంక్షోభాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా..⇒ ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ⇒ గుంటూరులో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపారు. ⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నాయకులు నిరసన తెలిపారు. ⇒ కోనసీమజిల్లా కొత్తపేటలో డీజిలు లేక ఆగిపోయిన రైతు ట్రాక్టరుకు పగ్గం కట్టి బంకు వద్దకు తీసుకువచ్చి వినూత్న నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నేతలు నిరసన గళమెత్తారు. కొన్ని ప్రాంతాల్లో మోటార్సైకిళ్లతో నిరసన తెలిపారు. రాజోలులో ట్రక్కు ఆటోను తాళ్లతో లాగి నిరసన తెలిపారు. ⇒ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు సర్కారు తీరుపై నిరసన తెలిపారు. రాజమండ్రిలో పెట్రోల్ బంక్ వద్ద ఖాళీ డీజిల్ డబ్బాలతో నిరసన తెలిపారు. కాకినాడ జిల్లాలోనూ బంకుల వద్ద ఆందోళన కార్యక్రమాలు సాగాయి. ⇒ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకులు పెట్రోల్ బంకులను సందర్శించి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ విశాఖ జగదాంబ జంక్షన్లో ఆటోలకు తాడు కట్టి లాగుతూ తమ నిరసన తెలియజేసి, క్యూలో ఉన్న వినియోగదారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకులు గళమెత్తారు.⇒ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీ డీజిల్ డ్రమ్ములతో నిరసన తెలిపారు. ⇒ తిరుపతిలో ఎద్దుల బండిపై ఆటోను ఎక్కించి ర్యాలీ నిర్వహించి వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. -
AP: ఫోన్లు, స్మార్ట్ వాచీల సాయంతో మెడికోల మాల్ ప్రాక్టీస్
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్వర్శిటీ వైద్య పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. వైద్య విద్య వార్షిక పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చోటు చేసుకుంది.చిట్టీలు, ఫోన్లు, స్మార్ట్ వాచీల సాయంతో మాస్ కాపీయింగ్ జరిగింది. సుమారు 20 మంది మెడికోలు మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డారు. ఇన్విజిలేటర్లు సైతం సెల్పోన్లు వాడుతూ దొరికారు. ఇద్దరు ఇన్విజిలేటర్లపై వీసీ డా. చంద్రశేఖర్ చర్యలు తీసుకున్నారు. మూడేళ్ల పాటు పరీక్షల విధులకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ కెమెరాలు అమర్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పరీక్ష జరిగే సమయంలో అధికారుల పర్యవేక్షణలో మాస్ కాపీయింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. -
ఏపీలో డీజిల్ కొరత వెనుక రూ.150 కోట్ల భారీ స్కామ్!
సాక్షి,ఢిల్లీ: ఏపీలో డీజిల్ కొరత వెనుక రూ.150 కోట్ల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం నాలుగు నెలల్లో మూడు కోట్ల లీటర్ల డీజిల్ను రిటైల్ అవుట్లెట్స్ నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ ఆదేశాల వెనుక వందల కోట్ల స్కాం ఉన్నట్లు బయటపడింది. అమరావతి కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.రిటైల్, బల్క్ డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం రూ.50. రిటైల్ బంకుల్లో ధర రూ.98 కాగా, బల్క్లో రూ.153. రిటైల్ బంకుల నుంచి డీజిల్ను రవాణా చేయాలని ప్రభుత్వం సూచించడం ద్వారా ప్రతి లీటర్పై రూ.50 లాభం వచ్చేలా నిర్మాణ సంస్థలకు అవకాశం కల్పించింది. ఈ లాభాల్లో వాటాలు పొందేందుకు ఎత్తుగడ వేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. చివరకు ఈ కుట్ర బహిర్గతమైంది -
‘కూటమి ప్రభుత్వం కాదు.. క్యూలో నిలబెట్టే ప్రభుత్వం’
సాక్షి,అమరావతి: రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం కాదని..క్యూలో నిలబెట్టే ప్రభుత్వం అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏపీలో ఇంధన సంక్షోభంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. చంద్రబాబు సినియరిటీ..విజనరీ ఎవరికి కావాలి?. పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి దయనీయంగా మారింది.కూటమి సర్కార్కు పబ్లిసిటీ తప్ప.. ఏమీ చేతకాదు. స్టాక్ లేక బంకులు మూసివేశారు.ఇది కూటమి ప్రభుత్వం కాదు.. క్యూలో నిలబెట్టే ప్రభుత్వం. గ్యాస్,పెట్రోల్,డీజిల్, యూరియా కోసం ప్రజల్ని, రైతులను క్యూలు కట్టిస్తున్నారు. వరి కోతలు..ఆక్వా కల్చర్కు డీజిల్ లేని దుస్ధితి.కూటమీ ప్రభుత్వం ఫెల్యూర్ గవర్నమెంట్.. పబ్లిసిటీ తప్పా ప్రజా సమస్యలు పట్టడం లేదు. ఐదు రోజుల నుండి సీఎం ఆగ్రహం అంటున్నారు. సీఎం ఆగ్రహనికి విలువలేదా? కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజల్ని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఆదుకున్నారో గుర్తు తెచ్చుకోవాలని హితువు పలికారు. -
‘ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం’
తాడేపల్లి: పక్క రాష్ట్రాల్లోనూ, దేశంలోనూ ఎక్కడ లేని పెట్రోల్, డీజిల్ కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని నిలదీశారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కావాలనే ఏపీలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించిందని, అందుకు కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఏపీలోని పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై తాడేపల్లి నుంచి మాట్లాడిన సజ్జల.. ‘పెట్రోల్,డీజిల్ కొరతలో ఏపీలో ప్రజా జీవనం స్తంభించింది. ఏపీలో పెట్రోల్ కొరత తీవ్రంగా ఉంది. నాలుగైదు రోజులుగా పెట్రోల్ కొరత ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా అక్కడ కొరత లేదు.ఏపీలో పెట్రోల్,డీజిల్ కొరతకు కూటమి ప్రభుత్వమే కారణం. ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన సంక్షోభం. ఇక్కడ పానిక్ భయంతో.. 0 సంక్షోభం అంతా మీరు క్రియేట్ చేసిందే. కావాలనే ఏపీలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించారు. సమస్య పరిష్కరించకుండా ఏదో మాట్లాడుతున్నారు. 24న సివిల్ సప్లై కమిషనర్ ఆయిల్ కంపెనీలకు లేఖ రాశారు. అమరావతి పనులకు పెట్రోల్, డీజిల్ కేటాయించాలని కోరారు. ఇది చట్టానికి విరుద్ధమని ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని కేంద్రం సూచించింది. మరో 20 ఏళ్ల రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లడంలో బాబు సిద్ధహస్తుడు. డీజిల్ తీసుకురాని వాళ్లు.. పరిశ్రమలు ఏం తీసుకొస్తారు?’ అని ప్రశ్నించారు. -
ఏపీలో ఇంధన సంక్షోభం.. కూటమి సర్కార్ను తప్పుబట్టిన కేంద్రం
సాక్షి,అమరావతి: ఏపీలో పెట్రోల్ సంక్షోభానికి కూటమి ప్రభుత్వం మరింత ఆజ్యం పోసింది. నాలుగు రోజుల క్రితం ఆయిల్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని నిర్మాణ పనుల కోసం భారీగా బల్క్ డీజిల్ను రిటైల్ బంకుల నుంచి సరఫరా చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. మొత్తం 2 కోట్ల 75 లక్షల 66 వేల లీటర్ల డీజిల్ను సరఫరా చేయాలని నిర్ణయించింది.దీంతో కూటమి సర్కార్ చర్యలతో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశంపై ఏపీ సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాలను కేంద్ర పెట్రోలియం శాఖ తప్పుబట్టింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్రం లేఖ రాసింది. ఇది పెట్రోలియం నియమాలు, నిత్యావసర వస్తువుల చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. -
‘దేశంలో ఎక్కడా లేని కొరత ఏపీలోనే ఎందుకు?’
ఢిల్లీ: ఢిల్లీ: ఏపీలో పెట్రోల్,డీజిల్ సంక్షోభానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ను వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్రెడ్డి కలిశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పెట్రో కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని నీరజ్ మిట్టల్ దృష్టికి తీసుకెళ్లారు అవినాష్రెడ్డి. ఏపీలోని పరిస్థితులను చక్కదిద్ది అవసరమైన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారుఅనంతరం అవినాష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ పెట్రోల్, డిజిల్ కొరత దేశంలో ఎక్కడా కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఏపీలో ఎందుకు కొరత ఏర్పడింది?, డిమాండ్కు, సప్లైకి మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయి. 70 శాతం పెట్రోల్ బంకులు కొరత వల్ల పనిచేయడం లేదు. పెట్రోలు 200 రూపాయలకు మించి బైక్లకు పోయడం లేదు. పొరుగు రాష్ట్రంలో ఇలాంటి కొరత ఎక్కడా లేదు. వ్యవసాయ రంగం ఆక్వాకల్చర్ ట్రాన్స్పోర్ట్ తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రజల రోజువారి పనుల పైన తీవ్రమైన అంతరాయం కలిగిస్తుంది. ప్రజల కష్టాలు తీర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం హోర్డర్స్ తో కుమ్మక్కయింది. పలు ఆయిల్ కంపెనీలు కూడా సప్లైని తగ్గించాయి. కమర్షియల్ ఎల్పీజీ రేట్లు పెంచినా, బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోంది. ఏపీలోని పరిస్థితులను చక్కదిద్ది అవసరమైన పెట్రోల్ డీజిల్ ఎల్పీజీని అందుబాటులోకి తేవాలి. హోర్డింగు, బ్లాక్ మార్కెటింగ్, ఉద్దేశపూర్వక తగ్గింపు తదితర అంశాలపై దృష్టి పెట్టాలి’ అని అవినాష్రెడ్డి పేర్కొన్నారు. -
తూతూమంత్రంగా జగన్పై హత్యాయత్నం కేసు దర్యాప్తు
సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సరైన దిశలో దర్యాప్తు చేయలేదని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది తప్పెట నిరంజన్రెడ్డి సోమవారం హైకోర్టుకు నివేదించారు. ఎన్ఐఏ అనేక కీలక అంశాలను సమాధానాల్లేని ప్రశ్నలుగా మిగిల్చిందన్నారు. దర్యాప్తును తూతూ మంత్రంగా పూర్తి చేసిన ఎన్ఐఏ, చార్జ్షిట్ను చాలా హడావుడిగా దాఖలు చేసిందని కోర్టుకు వివరించారు.జగన్పై జరిగిన హత్యాయత్నంపై మొదట దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పలు కీలక సాక్ష్యాలను సేకరించిందని, అటు తరువాత దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ ఆ సాక్ష్యాలను ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ఎన్ఐఏ దర్యాప్తులో చాలా లోపాలున్నాయని, అందుకే పూర్తిస్థాయిలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తనపై హత్యాయత్నం కేసులో లోతైన దర్యాప్తు జరపాలన్న తన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ విజయవాడ ఎన్ఐఏ కోర్టు 2023 జూలైలో జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తుది విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సందేహాల నివృత్తి కోసం తదుపరి విచారణను మే 6కి వాయిదా వేశారు. మారణాయుధంతో లోపలకు ఎలా వెళ్లాడో చెప్పని ఎన్ఐఏ అంతక్రితం సీనియర్ న్యాయవాది నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘జగన్పై 2018 అక్టోబర్ 25వ తేదీన హత్యాయత్నం జరిగింది. ఘటనా స్థలంలోనే నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మరుసటి రోజున శ్రీనివాసరావు ఇంటి నుంచి సిట్ అధికారులు ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించేందుకు ఉపయోగించే ఏరోడ్రమ్ ఎంట్రీ పాస్ (ఏఈపీ)ను స్వా«దీనం చేసుకున్నారు. దీని ప్రకారం హత్యాయత్నం జరిగిన రోజున ఎలాంటి ఎంట్రీ పాస్ లేకుండానే శ్రీనివాసరావు విమానాశ్రయంలోకి వెళ్లాడని స్పష్టమవుతోంది. ఇంటిలో పాస్ ఉంటే, ఎయిర్పోర్ట్లోకి వెళ్లడం శ్రీనివాసరావుకు ఎలా సాధ్యమైంది? విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. లోపల ఉన్న హోటల్లోకి వెళ్లే సిబ్బందిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అలాంటిది శ్రీనివాసరావు కత్తి తీసుకుని ఎలా లోనికి వెళ్లాడో ఎన్ఐఏ చెప్పడం లేదు. ఈ విషయంలో విమానాశ్రయ అప్పటి భద్రతా అధికారులను, సిబ్బందిని ఎన్ఐఏ విచారించలేదు. విమానాశ్రయంలో ఉన్న ఫ్యూజన్ హోటల్లో ఉద్యోగం సంపాదించేందుకు శ్రీనివాసరావు తనపై ఎలాంటి కేసులు లేవంటూ స్థానిక పోలీసుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారు. దీనిని ఆ హోటల్ యజమాని హర్షవర్ధన్ ధ్రువీకరించారు. హర్షవర్ధన్ కారణంగానే శ్రీనివాసరావుకు అక్కడ ఉద్యోగం వచ్చింది. శ్రీనివాసరావు హాజరు విషయంలో బయోమెట్రిక్ యంత్రాన్ని, సీసీ కెమెరాలను ఎన్ఐఏ సరిగా విశ్లేషించలేదు. వీటన్నింటి దృష్ట్యా ఈ కేసులో లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రాష్ట్రంలో ఎన్ఐఏ కేసులను విచారించే కోర్టుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రప్రభుత్వం 2023 జూలై 21న నోటిఫికేషన్ ఇచ్చింది. జూలై 24న గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. దీని ప్రకారం విశాఖపట్నం పరిధిలో చోటు చేసుకున్న ఘటనలపై విచారించే పరిధి విశాఖలోని ఎన్ఐఏ కోర్టుకు మాత్రమే ఉంది తప్ప, విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు లేదు’ అని విన్నవించారు. కాగా, ఎన్ఐఏ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ వాదనలు వినిపిస్తూ విజయవాడ కోర్టుకు విచారణ పరిధి ఉందన్నారు. జగన్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరపాలే తప్ప, సింగిల్ జడ్జి విచారించడానికి వీల్లేదన్నారు. నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది బి.ఆదినారాయణ రావు వాదనలు వినిపిస్తూ ఈ కేసులో శ్రీనివాసరావే బాధితుడన్నారు. విజయవాడ కోర్టు ఉత్తర్వులు సరైనవేనని పేర్కొంటూ జగన్ పిటిషన్ను కొట్టేయాలన్నారు. -
‘ఉపాధి’ బకాయిలు వెంటనే చెల్లించాలి
సాక్షి, అమరావతి/గాం«దీనగర్ (విజయవాడ సెంట్రల్) : ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కూలీలకు నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్యపై సోమవారం ఆందోళన చేసింది. వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకులు అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద శాంతియుతంగా ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం.. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు.ఉపాధి హామీ బకాయిలు విడుదల చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పెమ్మసాని.. ఆ డబ్బును రాష్ట్రంలోని ఒక్క ఉపాధి కూలీ ఖాతాలోకైనా జమచేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం ‘ఉపాధి హామీ’ని నిర్వీర్యం చెయ్యొద్దు.. కూలీల కడుపు కొట్టొదు.. అంటూ పెద్దఎత్తున నేతలు నినాదాలు చేశారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏమన్నారంటే.. పేదల శాపం తగులుతుంది ‘ఉపాధి హామీ పథకం నిధులన్నింటినీ టీడీపీ కూటమి నేతలు పందికొక్కుల్లా దోచుకోవడానికి చూస్తున్నారు. పేదల శాపం చంద్రబాబు ప్రభుత్వానికి తప్పక కొడుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2020–2021 కరోనా సమయంలో కూడా 47.52 లక్షల కుటుంబాలకు 21,85,84,000 పనిదినాలు కల్పించారు. 2021–22లో 24.14 కోట్ల పనిదినాలు, 2023–24లో 25.54 కోట్ల పనిదినాలు కల్పించారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2025–26లో 42.85 లక్షల కుటుంబాలకు కేవలం 18.59 కోట్ల పనిదినాలు మాత్రమే కల్పించారు. మరోవైపు.. రెక్కాడితేగానీ డొక్కాడని ఉపాధి కూలీలకు చంద్రబాబు ప్రభుత్వం గతేడాది డిసెంబరు నుంచి వేతనాలు పెండింగ్ పెట్టింది. పనిచేసిన 15 రోజుల్లోపు కూలీలకు వేతనాలివ్వాలని చట్టం స్పష్టంగా చెబుతున్నప్పటికీ దానిని తుంగలో తొక్కారు. ఇలా రూ.1,800 కోట్లు బకాయిలు పెట్టింది. అయితే, పచ్చ మీడియా రూ.1,800 కోట్లు విడుదలయ్యాయని వార్తలు ప్రచురిస్తోంది. నిధులు విడుదలైతే దద్దమ్మ ప్రభుత్వం వేతనాలు ఎందుకు చెల్లించలేదు? గతేడాది డిసెంబరు నుంచి పెండింగ్లో ఉన్న కూలీల వేతనాలు విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ నేతలు వేములకొండ తిరుపతిరావు, కొమ్మినేని రవిశంకర్, ఎ.రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
99 పైసలకు 20 ఎకరాల కేటాయింపు
సాక్షి, అమరావతి: విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన ఎండాడలో ఇన్ఫోసిస్ క్యాంపస్ కోసం సుమారు రూ.1,000 కోట్లకుపైగా విలువ కలిగిన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ లిఫ్ట్ పాలసీ 2024–29 ప్రకారం ఇన్ఫోసిస్ లిమిటెడ్కు మొత్తం 20 ఎకరాల భూమిని 99 పైసలకే కేటాయిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ భూమిలో ఇన్ఫోసిస్ రెండు దశల్లో రూ.750 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ను అభివృద్ధి చేస్తుందని తెలిపారు.దీంతోపాటు ఎండాడ వద్ద సర్వే నెంబర్ 175/పీలో మరో 5 ఎకరాల భూమిని భవిష్యత్తు అవసరాలకు ఇన్ఫోసిస్కు కేటాయించడానికి ఏపీఐఐసీకి బదలాయించాలని రెవెన్యూశాఖను కోరింది. ఈ క్యాంపస్కు అవసరమైన మౌలికవసతులను రూ.79 కోట్లతో ఏపీఐఐసీ, వీఎంఆర్డీఏ కల్పించనున్నాయి.2029 జనవరి నాటికి తొలి దశ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తం ఆరేళ్లలో రెండు దశలను పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టుకు 100 శాతం గ్రీన్ఎనర్జీని అందించాలని ఇంధన శాఖను ఆదేశించింది. భూమి అమ్మకం ఒప్పందం కుదిరిన 120 రోజుల్లోగా అనుమతుల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వైజాగ్ ఇన్ఫోసిస్ @ వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఖజానా ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా మాజీ సీఎం వైఎస్ జగన్ విశాఖకు ఇన్ఫోసిస్ను తీసుకువస్తే.. ఇప్పటికే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదే ఐటీ సంస్థకు రూ.1,000 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకే చంద్రబాబు సర్కారు కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు పప్పు బెల్లాలుగా అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిలదీసినా చంద్రబాబు సర్కారులో ఎటువంటి మార్పులేదు.రూ.వేల కోట్ల లాభాలను గడిస్తూ... ఒకపక్క తన దగ్గర ఉన్న భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తున్న ఇన్ఫోసిస్కు తాజాగా విశాఖలోని ఎండాడలో అత్యంత ఖరీదైన భూములను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు హైదరాబాద్లో వేలం ద్వారా భూములను విక్రయిస్తూ తెలంగాణ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని పొందుతుంటే, రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు సర్కారు రూ.వేల కోట్ల విలువైన భూములను కేవలం 99 పైసలకే కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. తొలిసారిగా టైర్–2 నగరానికి తెచ్చిన ఘనత వైఎస్ జగన్దే తొలిసారిగా ఇన్ఫోసిస్ను టైర్–2 నగరానికి తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డికే దక్కుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మధురవాడలోని ఐటీ హిల్–2లో ఇన్ఫోసిస్ సొంతంగా ఒక ప్రైవేటు బిల్డింగ్లో 1,000 సీట్లతో ఏర్పాటు చేసుకున్న డెవలప్మెంట్ సెంటర్ను 2023 అక్టోబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. భవిష్యత్తులో విస్తరణకు సహాయ సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు.అయితే అప్పుడు రాష్ట్ర ఖజానాకు ఎటువంటి నష్టం లేకుండా ఐటీ కంపెనీని తీసుకువస్తే.. చంద్రబాబు సర్కారు మాత్రం మూడు నెలలకు ఒకసారి రూ.8,500 కోట్లకుపైగా లాభాలు గడించే ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజానికి 99 పైసలకే విలువైన భూమిని కేటాయించడాన్ని మేధావులు విమర్శిస్తున్నారు. గతేడాది బెంగళూరులో తన వద్ద అదనంగా ఉన్న 53 ఎకరాలను ఇన్ఫోసిస్ రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించిందని, ఇలా రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను విక్రయించుకుంటున్న సంస్థకు విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూమిని 99 పైసలకే ఏ విధంగా కట్టబెడతారంటూ ప్రశి్నస్తున్నారు. భూములివ్వడంతోపాటు భవన నిర్మాణానికీ డబ్బులు..! చంద్రబాబు సర్కారు ఇప్పటికే విశాఖలో ఐటీ ముసుగులో అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కేటాయిస్తూ ఖజానాకు తూట్లు పొడుస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు 99 పైసలకు భూములు కేటాయించినట్లు చూపిస్తూ అదే సమయంలో రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కట్టబెడుతోంది. ఐటీ క్యాంపస్లు, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్స్ పేరిట కే.రహేజా, సత్వా, కపిల్ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు కారు చౌకగా భూములను కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.అంతేకాకుండా ఇలా కేటాయించిన భూముల్లో 50 శాతం స్థలం వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించడాన్ని వీరు తప్పుబడుతున్నారు. అది చాలదన్నట్లు.. ఆ సంస్థలు పెడుతున్న పెట్టుబడిలో 60 నుంచి 70 శాతం ప్రోత్సాహకాల రూపంలో తిరిగి వెనక్కి ఇవ్వడంతోపాటు భవన నిర్మాణాల కోసం ఒక్కో చదరపు అడుగుకు రూ.2,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెల్లిస్తోందంటూ తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
భానుడి భగభగ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1, అమరావతిలో 44.2, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 44.8, తిరుపతి జిల్లా బేస్తపల్లి, వైఎస్సార్ కడప జిల్లా వీరబల్లిలో 44.2, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 21 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. -
‘వైద్యం’.. నైవేద్యం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో మరో భారీ అవినీతికి ‘కాంట్రాక్టు’ కుదిరింది. ‘వైద్యం’ ప్రాజెక్ట్ పేరుతో నచ్చినవారికి అడ్డగోలుగా ప్రజాధనాన్ని నైవేద్యంగా సమర్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. వైద్యశాఖ పరిధిలోని వివిధ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఇటీవల ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్టెన్షన్ వర్కర్స్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్కు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా టెండర్ ఆహ్వానించారు. ఈ ప్రాజెక్ట్కు ‘వైద్యం’ అని పేరు పెట్టారు. 66 నెలల కాలపరిమితితో కూడిన సుమారు రూ.40 కోట్ల ఈ ప్రాజెక్ట్ను ఉద్యోగుల ముఖ హాజరు సేవలు అందిస్తున్న కంపెనీకి అడ్డగోలుగా కట్టబెట్టడానికి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు సంస్థ బిడ్ను టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రీ–క్వాలిఫికేషన్లో ఆమోదించినట్టు విశ్వసనీయ సమాచారం. ఏబీడీఎం భాగస్వామ్యం లేకపోయినా ‘వైద్యం’ ప్రాజెక్ట్ టెండర్కు నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. టెండర్ నిబంధనల ప్రకారం ఆ కంపెనీలు కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం)లో భాగస్వామ్యం కలిగి ఉండాలి. టెండర్లు వేసిన నాలుగు కంపెనీల్లో ఒకటైన ఉద్యోగుల ముఖ హాజరు సేవలు అమలు చేస్తున్న సంస్థకు ఏబీడీఎంలో భాగస్వామ్యం లేదు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను బిడ్లో పొందుపరచలేదు. అందువల్ల ప్రీ–క్వాలిఫికేషన్ దశలోనే బిడ్ను తిరస్కరించాలి. అయితే, ఈ సంస్థకు అడ్డగోలుగా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు డీల్స్ కుదరడంతో ప్రీ–క్వాలిఫికేషన్లో బిడ్ను ఆమోదించడానికి వైద్యశాఖలోని ఓ ఉన్నతాధికారి అక్రమాలకు తెరలేపారని తెలుస్తోంది. ఏబీడీఎంలో భాగస్వామ్యమైన కంపెనీలనే అనుమతించాలని టెండర్ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా... ఉద్యోగుల ముఖ హాజరు ప్రాజెక్ట్ అనుభవం ఆధారంగా బిడ్ ఆమోదించేలా స్వయంగా ఉన్నతాధికారే అక్రమాలకు తెరలేపారని సమాచారం. వాస్తవానికి ఏపీటీఎస్ టెండర్ ఆహ్వానించిన అనంతరం నిర్వహించిన ప్రీ–బిడ్ సమావేశంలో 10 నుంచి 20 కంపెనీలు పాల్గొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఏబీడీఎంలో భాగస్వామ్యం నిబంధనను సడలించాలని 10కి పైగా కంపెనీలు కోరగా, వైద్యశాఖ అంగీకరించలేదు. ఇప్పుడా నిబంధనను తుంగలో తొక్కి అర్హత లేని కంపెనీ బిడ్ను ఆమోదించడానికి సర్వం సిద్ధం చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
చంద్రబాబు అసమర్థ పాలనతోనే ఇంధన కొరత
సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్/కడప కార్పొరేషన్/యర్రగొండపాలెం: చంద్రబాబు అసమర్థ పాలనతోనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డులు లేదా పెట్రోల్, డీజిల్ కోసం కొట్లాడుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు తీరి ఉన్నాయన్నారు. రవాణా వాహనాల వారి నుంచి ఆటో సోదరుల వరకు పడిగాపులు పడుతున్నారని చెప్పారు. మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్లు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ నడుపుతున్న ఈ ప్రభుత్వంలో ప్రచారం తప్ప పని కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన కొరతతో అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఎక్కడా ఇంధన కొరత లేదని ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, టీడీపీ కూటమి అధికారంలో ఉన్న ఒక్క ఏపీలో మాత్రమే ఈ దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను గుర్తించి చక్కదిద్దడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు క్యూలైన్ కష్టాలు తప్పడం లేదన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు, గ్యాస్ కోసం జనం క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. చీమ చిటుక్కుమంటే పబ్లిసిటీ కోసం మీడియా ముందుకొచ్చే చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేశ్లు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇండిగో విమానాలు ఆగిపోతే తనకే మాత్రం సంబంధం లేకున్నా మంత్రి లోకేశ్ సమీక్షించాడని ఎల్లో మీడియా ఊదరగొట్టిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇంధన కొరత గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. తుపాన్ను తప్పించానని చెప్పిన చంద్రబాబు పక్కనే ఉన్న హెచ్పీసీఎల్, ఐవోసీఎల్ నుంచి పెట్రోల్, డీజిల్ తెప్పించలేకపోతున్నారా?.. అంటూ ఎద్దేవా చేశారు. కాగా, మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలోని పెట్రోలు బంకుల వద్ద పరిస్థితుల్ని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరిశీలించారు. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు పడుతున్న అవస్థల్ని అడిగి తెలుసుకున్నారు. -
గ్రానైట్ పరిశ్రమపై డీజిల్ భారం
చీమకుర్తి : రెండు వారాల నుంచి డీజిల్ కొరత గ్రానైట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓ పక్క ప్రభుత్వం తరఫున అధికారులు డీజిల్, పెట్రోల్ కొరత లేదంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ మరోపక్క ఎక్కడికక్కడ బంకులు మూసేసి నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి కేంద్రంగా 50కి పైగా గ్రానైట్ క్వారీలు, 70కి పైగా ఉన్న కంకర మిల్లులు, 600కు పైగా ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలపై డీజిల్ కొరత పెనుభారంగా మారిందని వాటి యజమానులు వాపోతున్నారు. పైగా.. ఇండస్ట్రీ అవసరాలకు ఉపయోగించే డీజిల్పై అదనంగా రూ.55 పెంచి రూ.152 లెక్కన లీటరుకు వసూలుచేస్తున్నట్లు యజమానులు గగ్గోలు పెడుతున్నారు. రెండు వారాలుగా డీజిల్ కొరతతో 1.30 లక్షల లీటర్ల వాడకం నుంచి ప్రస్తుతం 30 వేల నుంచి 40 వేల లీటర్లకు పడిపోయింది. దానివల్ల గ్రానైట్ క్వారీల్లో ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. కూడా నిలిచిపోవడంతో కార్మీకుల ఉపాధిపై ప్రభావం చూపుతోందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడుతున్న కారణంగానే పరిశ్రమలకు వినియోగించే డీజిల్ ధరలను ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లుగా పెంచుకుంటోందని చిన్న పరిశ్రమల యజమానులు ఆరోపిస్తున్నారు. -
ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.3,746 కోట్లు
సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,746 కోట్ల బకాయి ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రై పార్టీ బిడ్ డిస్కౌంటింగ్ విధానంలో ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.వెయ్యి కోట్ల బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు సమకూరాయన్నారు. సుమారు 25 ఆస్పత్రులకు రూ.62 కోట్ల వరకు చెల్లింపులు చేసినట్టు వెల్లడించారు. ఆస్పత్రుల యాజమాన్యాలకు విడుదల చేసే నిధుల్లో నుంచి వడ్డీని ముందుగానే మినహాయించుకుంటున్నట్లు వివరించారు. అప్పునకు వడ్డీ ప్రభుత్వం చెల్లించకుండా... ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.1,000 కోట్లు అప్పు చేసింది. అయితే, ఆ అప్పునకు వడ్డీ ప్రభుత్వం కట్టకుండా, ఆస్పత్రులకు చెల్లిస్తున్న మొత్తం నుంచి ముందుగానే కోత విధించడం గమనార్హం. -
‘ఢీ’జిల్.. రైతులకు తప్పని తిప్పలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు అసంబద్ధ విధానాల వల్ల మార్కెట్లో పంట ఉత్పత్తులకు ధర లేక గగ్గోలు పెడుతున్న రైతులను ఇప్పుడు ఇంధన సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముమ్మరంగా సాగుతున్న ధాన్యం, మొక్కజొన్న మాసూళ్లతో పాటు కోతకొచ్చిన ఇతర పంటల పనులను డీజిల్ కొరత వేధిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఆక్సిజన్ సమస్యలు తలెత్తకుండా రొయ్యలు, చేపలను రక్షించుకునేందుకు డీజిల్ దొరక్క ఆక్వా రైతులూ పడరాని పాట్లుపడుతున్నారు. బంకుల్లో నాలుగు రోజులుగా నోస్టాక్ బోర్డులు కనిపిస్తుండడంతో కర్షకులు లబోదిబోమంటున్నారు. కోతల వేళ.. విలవిల.. రబీలో దాదాపు 68.92 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, అందులో 23 లక్షల ఎకరాల్లో వరి, మరో 23 లక్షల ఎకరాల్లో అపరాలు సాగయ్యాయి. 12.50 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న, 2.50 లక్షల ఎకరాల్లో జొన్న, 3.50 లక్షల ఎకరాల్లో నూనెగింజలు సాగయ్యాయి. అపరాలు, నూనెగింజల పంటల కోతలు దాదాపు పూర్తయిపోయాయి. జొన్న కోతలూ దాదాపు 80 శాతం పూర్తి కాగా, మొక్కజొన్న 70 శాతం పూర్తయ్యాయి. వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. గోదావరి, కృష్ణా డెల్టా పరిధిలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో వరి కోతలు జోరుగా సాగుతుండగా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో మొక్కజొన్న కంకి వొలుపు పనులు జరుగుతున్నాయి. పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి కోతలు, అపరాల (మినుము, పెసర) త్రషింగ్ పనులు తుది దశలో ఉన్నాయి. కోతల వేళ యంత్రాల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా వరిలో కోతలు, నూర్పుళ్లు, రవాణాకు డీజిల్ అవసరం చాలా ఎక్కువ. డీజిల్ కొరత కారణంగా అద్దెకు తెచ్చి న కోత యంత్రాలు పొలాల్లోకి దిగలేని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి వరి కోతలకు హార్వెస్టర్లకు ఎకరాకు 10 నుంచి 16 లీటర్ల డీజిల్ అవసరం. అంటే రోజుకు సగటున 10 ఎకరాల్లో కోతలు పూర్తి చేయాలన్నా.. ఒక్కో హార్వస్టర్కు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ కావాలి. ఇక కోసిన ధాన్యాన్ని తరలించడానికి ట్రాక్టర్లకు 10 ఎకరాలకు సుమారు 40 నుంచి 50 లీటర్ల డీజిల్ అవసరం. మొక్కజొన్న, అపరాల సాగులో ఉపయోగించే త్రషర్లకు 30 నుంచి 40 లీటర్ల డీజిల్ అవసరమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న కొరత వల్ల బంకుల వద్ద 5 నుంచి 10 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. ఆలస్యమైతే దిగుబడులపై తీవ్ర ప్రభావం కోతలు ఆలస్యమయ్యే కొద్ది ఆ ప్రభావం దిగుబడులపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం గింజలు నేలరాలి పోయి దిగుబడులు తగ్గిపోతాయని చెబుతున్నారు. రంగు మారడం, విరగడం జరుగుతుందని, అప్పుడు మద్దతు ధర మాట దేవుడెరుగు కనీసం పెట్టుబడి కూడా దక్కే అవకాశాలు ఉండవని కర్షకులు వాపోతున్నారు. అకాల వర్షాలు కురిస్తే ఇక పంటపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఆవేదన చెందుతున్నారు. కూపన్లకూ ముప్పుతిప్పలు రైతుల వినతి మేరకు డీజిల్ సరఫరాలో రైతులు, ఆక్వా రైతులకు అధిక ప్రాధాన్యమివ్వాలని, డిమాండ్ను బట్టి వారికి కూపన్ల ద్వారా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కూపన్ల కోసం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాజకీయ సిఫార్సులు ఉంటేనే కూపన్లు ఇస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వ్యవసాయ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం వలన కూపన్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అడ్వాన్స్లు తీసుకున్న కోత యంత్రాల నిర్వాహకులు సైతం డీజిల్ కొరత వల్ల చేతులెత్తేస్తున్నారు. పైగా కోతలకు ఎకరాకు రూ.2800 నుంచి రూ.3వేలు వసూలు చేసే యంత్ర నిర్వాహకులు ప్రస్తుతం రూ.3వేల నుంచి రూ.4వేల మధ్య డిమాండ్ చేçస్తుండడం రైతులకు భారంగా మారింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీకే రాయపురం బంకు వద్ద డీజిల్ కోసం రైతులు ఆందోళన చేశారు. బంకు సిబ్బందితో ఘర్షణకు దిగారు. దీంతో అధికారులు బంకులో డీజిల్ సరఫరా నిలిపివేసి వరి యంత్రాలకు ఒక్కోదానికి 70 లీటర్ల డీజిల్ కూపన్లు ఇస్తామని దండోరా వేయించారు. అయితే ట్రాక్టర్లకు కూపన్లు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.ఆక్వా రైతులకు ’ ప్రాణవాయువు’ సంక్షోభం ఆక్వా రైతులకు డీజిల్ కేవలం ఇంధనం కాదు.. అది చేపలు, రొయ్యల ప్రాణవాయువుకు ఆధారం. రాత్రి వేళల్లో ఏరియేటర్లు నిరంతరం పనిచేయాలి. విద్యుత్లో వోల్టేజ్ సమస్యలు ఉన్నప్పుడు డీజిల్ జనరేటర్లే దిక్కు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ఏరియేటర్లు ఏమాత్రం ఆగినా ఒకటి రెండు గంటల్లోనే రొయ్యలన్నీ తేలిపోతాయి. మాస్ మోరా్టలిటీ (మూకుమ్మడి మరణాలు) దెబ్బకు రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు.ప్రస్తుతం ఒక్కో చెరువుకు ఆక్వా రైతులు గరిష్టంగా రూ.10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రోజుకు 4వేల టన్నుల చేపలు కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రవాణా అవుతున్నాయి. డీజిల్ సంక్షోభంతో ఆక్సిజన్ అందక రొయ్యలు, చేపలు చనిపోతే ఆర్థికంగా చితికిపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, రాజకీయ జోక్యం లేకుండా రైతులు, ఆక్వా రైతులకు డిమాండ్ మేరకు డీజిల్ సరఫరా చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
రవాణాకు బ్రేకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీజిల్ సంక్షోభం మరింత ముదిరింది. మొన్న యూరియా.. నిన్న గ్యాస్.. నేడు ఇంధనం కొరత! సంక్షోభాలను పసిగట్టడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. రియల్ టైమ్ గవర్నెన్స్ ఉత్త డొల్లగా మారింది. రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిచ్చాయి. రేపటికల్లా ఎక్కడా ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని ఆదివారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించిన తర్వాత సమస్య మరింత తీవ్రతరమైంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వ పెద్దలు సమీక్షలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన కొరత రవాణా రంగానికి విస్తరించడంతో ఎక్కడికక్కడ సరుకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి లారీలు బంకుల వద్ద బారులు తీరినా డీజిల్ దొరకలేదు. సోమవారం అన్ని ప్రధాన నగరాల్లో లారీలు నిలిచిపోయాయి. దీంతో నిత్యావసరాలు భగ్గుమన్నాయి. కూరగాయల ధరలు 40 నుంచి 50 శాతం పెరగ్గా.. నిత్యావసర సరుకుల ధరలు ఒక్కసారిగా 30% పెరిగాయి. మరోపక్క వరి కోత యంత్రాలకు డీజిల్ లభించకపోవడంతో బ్లాక్లో కొనుగోలు చేస్తున్న యజమానులు రైతుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో అన్నదాత అటు ధాన్యానికి సరైన ధర లేక.. ఇటు కోత యంత్రాల అద్దె భారంతో రెండు విధాలా నష్టపోతున్నాడు. వరి కోత మిషన్ల చార్జీలు గంటకు రూ.2,800 నుంచి ఒకేసారి రూ.3,500కు పెంచేశారు. ప్రస్తుతం రబీ కోతల సమయం కావడంతో వరి కోత యంత్రాలకు డీజిల్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క కోసిన పంటను సైతం మిల్లులకు తరలించే వాహనాలు దొరక్క ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచుతున్న పరిస్థితి. ఫలితంగా రైతన్నలు అన్ని విధాలా నష్టపోతున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రాజుపాలెం హైవేపై ఓ పెట్రోల్ బంకు వద్ద డీజిల్ కోసం బారులు తీరిన లారీలు హైవేల్లో నిలిచిపోయిన వాహనాలు బంకుల్లో నిల్వలు అడుగంటడం.. భారీ వాహనాలకు 50 నుంచి 100 లీటర్ల డీజిల్ను మాత్రమే ఇస్తూ రేషన్ విధించడంతో రవాణాకు బ్రేకులు పడ్డాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ తదితర ప్రధాన నగరాల్లో వేలాది లారీలు ఆగిపోయాయి. దీనివల్ల లారీ యజమానులు భారీగా నష్టపోవడమే కాకుండా వాహనాల ఈఎంఐలు చెల్లించే పరిస్థితి లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. మరోపక్క డీజిల్ దొరక్క పలు లారీలు జాతీయ రహదారుల వెంట నిలిచిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలో డీజిల్ అయిపోయి రోడ్డు మధ్యలోనే లారీ ఆగిపోవడంతో ఎన్హెచ్–16పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంబులెన్స్లు కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. ప్రైవేట్ బస్సులకూ డీజిల్ గండం ఏర్పడింది. విజయవాడ, విశాఖ నుంచి దూర ప్రాంతాలకు తిరిగే బస్సులకు డీజిల్ దొరకలేదు. దీంతో పలు రూట్లలో సర్వీసులను రద్దు చేశారు. తిరుగుతున్న కొద్ది బస్సుల్లో ఆపరేటర్లు డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. తిరుపతిలోని వరదరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న బంక్లో పెట్రోల్, డీజిల్ కోసం భారీగా వచ్చిన వాహనదారులు ఇక నిత్యావసరాల వంతు? ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. శుభకార్యాలకు వెళ్లాల్సిన వారు డీజిల్ దొరక్క ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఆటోలు తిరగకపోవడం, బైకులలో పెట్రోల్ లేకపోవడంతో ఆర్టీసీపై ఒత్తిడి పెరిగింది. ఇప్పటికే ఉచిత బస్సుల పేరుతో సర్వీసులను తగ్గించిన సర్కారు.. పెరిగిన ఒత్తిడికి తగ్గట్టు బస్సులను పెంచలేదు.ఇంధన సంక్షోభం నిత్యావసర ధరలపై మరింత ప్రభావం చూపవచ్చని, అన్ని సరుకుల ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సరుకు రవాణా వాహనాలు నాలుగు రోజుల్లో చేరాల్సిన గమ్యాన్ని వారం రోజుల్లో చేరుతున్నాయి. ఇంధన కొరతతో రోడ్లపైనే వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో హైవేల్లో ఆయిల్ బ్లాక్ దందా పెరిగిపోయింది. డీజిల్పై లీటర్కు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నట్లు లారీ యజమానులు వాపోతున్నారు. ఇంధన ఖర్చులు, డ్రైవర్ల జీతాలు తడిసి మోపెడు అవుతున్నాయని లారీ ఓనర్ల అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. విశాఖలోని సిరిపురం పెట్రోల్ బంక్ వద్ద రద్దీ ఇలా... 29 తర్వాత పెట్రో ధరలపై కీలక నిర్ణయం! ఏపీలో ఇంధన సరఫరాను ప్రధానంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కంపెనీలు నిర్వహిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో నష్టాలు వస్తున్నాయని, లీటరుపై రూ.30 చొప్పున నష్టం భరించాల్సి వస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున రెండో విడత ఎన్నికలు ముగిశాక ఈనెల 29 తర్వాత డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.అనంతపురంలో పెట్రోల్ కోసం క్యూ లో వేచి ఉన్న వాహనదారులు డీజిల్ లేక నిలిచిన ప్రైవేట్ బస్సు సీఐ చొరవతో బస్సు గమ్యస్థానానికి ఇబ్రహీంపట్నం: డీజిల్ కష్టాలు ప్రయాణీకుల పాలిట శాపంగా మారాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సోమవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్దకు చేరుకోగానే డీజిల్ అయిపోయింది. బస్సు హైవే పక్కన పెట్రోల్ బంకు సమీపంలో ఆగిపోయినప్పటికీ పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డు ఉండడంతో డ్రైవర్కు ఏంచేయాలో దిక్కుతోచలేదు. మరోవైపు.. ప్రయాణికులు బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని గమ్యస్థానానికి చేర్చాలని పట్టుబట్టారు. సమాచారం అందుకున్న స్థానిక సీఐ సుబ్రహ్మణ్యం అక్కడికొచ్చి 50 లీటర్ల డీజిల్ సేకరించి, బస్సును గమ్యస్థానానికి పంపించారు. పరీక్షకెలా వెళ్లాలి? నేను మంగళవారం జరగనున్న పీజీఈసెట్ పరీక్షకు హాజరు కావాలి. నాలుగు కిలోమీటర్ల దూరంలోని రేణిగుంట రోడ్డులోని పరీక్ష కేంద్రానికి ఉదయం 9గంటలకే చేరుకోవాలి. దీంతో సోమవారం బైక్లో పెట్రోల్ పోయిద్దామని అన్ని బంకులూ తిరిగాను. ఎక్కడా దొరకలేదు. ఇక తప్పదు. సైకిల్పైనే వెళ్లాలి. –విశ్వనాథ్రెడ్డి, ప్రవేశ పరీక్షార్థి, తిరుపతిఒక్క రోజు ఉపాధి పోయినట్లే నేను ఆటో డ్రైవర్ను. సోమవారం తెల్లవారుజామున డీజిల్ అయిపోయింది. డబ్బాలు పట్టుకుని టౌన్ అంతా తిరిగా. ఎక్కడా డీజిల్ దొరకలేదు. ఇప్పుడు ఈ బంకు వద్దకు వచ్చి క్యూలో ఉన్నా. నాలుగైదు గంటలు కావస్తోంది. ఇప్పటికి మా వంతు రాలేదు. మొత్తం మీద ఈ రోజు ఉపాధి పోయినట్లే. – సుబ్రమణ్యంరెడ్డి, ఆటోడ్రైవర్, మంగళంబతికేది ఎలా? ఆటో నడుపుతూ జీవిస్తున్నా. ప్రయాణికులను తీసుకుని విజయనగరం వచ్చాను. రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న బంక్కు వెళ్లి ఆయిల్ పోయమంటే లేదన్నారు. రోజువారి వచ్చే ఆదాయంతో జీవించే మాలాంటి వారికి బతుకుబండి నడవకపోతే ఇబ్బందులు తప్పవు. మేం బతికేది ఎలా? – శంకరరావు, సీతారామునిపేట నెల్లిమర్ల మండలం,విజయనగరం జిల్లా25 కిలోమీటర్లు వచ్చినా ప్రయోజనం లేదు పల్నాడు జిల్లా రెంటచింతలలో డీజిల్ దొరక్క 25 కిలోమీటర్ల దూరంలోని మాచర్ల వచ్చా. పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఉన్నా డీజిల్ దొరకలేదు. పంట రవాణాకు డీజిల్ కావాలి. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – వెంకటేశ్వర్లు, రైతు, తుమృకోట, రెంటచింతలకుదేలైన పారిశ్రామిక రంగం ఇంధన కొరత మూలంగా నియోజకవర్గంలోని పౌడర్, సున్నపురాయి, గ్రానైట్ పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ రంగంతో పాటు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయారు. – బాల తిమ్మారెడ్డి, పారిశ్రామికవేత్త, నంద్యాల జిల్లా -
నర్సీపట్నం ఘటనపై స్పందించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నర్సీపట్నం ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్పై జరిగిన దాడిని ఖండించారు. అక్రమ తవ్వకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని చంద్రబాబు సర్కార్ను నిలదీశారు. ‘హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించినందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడి అనుచరులు ఉమాశంకర్ గణేశ్పై దౌర్జన్యం చేశారు. ఉమాశంకర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో విఫలమైన శాంతిభద్రతలకు ఈ సంఘటన నిదర్శనం. ఇలాంటి దాడులు, దౌర్జన్యాలు నిజాన్ని అణచివేయలేవు. ప్రభుత్వం ఈ సంఘటనపై వెంటనే స్పందించాలి. దాడికి దిగిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పతనమైన శాంతిభద్రతలను పునరుద్ధరించాలి. ఉమా శంకర్ గణేశ్కు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది’ అని వైఎస్ జగన్ అన్నారు. నర్సీపట్నం సృష్టి క్షేత్రంలో తవ్వకాలపై హైకోర్టులో స్టే ఉండగా.. రాత్రిపూట అక్రమంగా పనులు జరుగుతున్నాయి. వాటిని మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ పరిశీలించి.. పనులు ఎలా జరుపుతున్నారని ప్రశ్నించారు. ఆయనను అడ్డుకున్న టీడీపీ గూండాలు వాగ్వివాదానికి దిగారు. ఆపై బరితెగించి ఆయనపై దాడి చేశారు. Tadepalli, April 27:Former Chief Minister and YSRCP President Y. S. Jagan Mohan Reddy strongly condemned the attack on former Narsipatnam MLA Petla Uma Shankar Ganesh in Narsipatnam In a statement released, YS Jagan Mohan Reddy stated that for merely questioning activity being… pic.twitter.com/9cTvqoGaGH— YSR Congress Party (@YSRCParty) April 27, 2026 -
ఏపీలో ఇంధన కొరత.. చంద్రబాబు సర్కారుపై వైవీ ఆగ్రహం
సాక్షి,కృష్ణా: కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం ఆయిల్ కొరతపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కృష్ణాజిల్లాలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.మచిలీపట్నం పోర్టు, రాష్ట్రంలో డీజిల్ , పెట్రోల్ కొరత పై చర్చించాం. దేశంలో ఎక్కడా లేనంత కొరత ఏపీలోనే ఉంది. కేంద్రంతో మాట్లాడి ప్రభుత్వం ఆయిల్ కొరత పై తక్షణమే చర్యలు తీసుకోవాలి. డీజిల్ కొరతతో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్ల వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో నాలుగు పోర్టులు 40శాతం పూర్తయ్యాయి. ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు చివరి దశ వరకూ పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను నిలిపివేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరగా పోర్టులు పూర్తిచేయించేందుకు పోరాటం చేస్తాం. ఎన్నికల నాటికి మచిలీపట్నం పోర్టు నిర్మాణం చాలా వేగంగా సాగింది.కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే నాలుగు పోర్టులు,ఫిషింగ్ హార్బర్లు పూర్తయిపోతాయి.మే 5 నుంచి 10వ తేదీలోపు మచిలీపట్నం పోర్టును సందర్శిస్తాంపోర్టు అధికారులను అనుమతి కోరాం.అనుమతులు రాగానే తేదీని ప్రకటిస్తాం.రెండు లక్షల కోట్లు అమరావతికి ఖర్చు చేస్తున్నారు. కేవలం పదివేల కోట్లు పోర్టులు,హార్బర్లకు ఖర్చు పెట్టలేరా . వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పేరు వస్తుందనే భయంతోనే ప్రభుత్వం పోర్టుల పనులు చేపట్టడం లేదు.రాష్ట్రంలో అన్ని పోర్టులు, హార్బర్లు పూర్తి చేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం.. పోరాటం చేస్తాం’అని హెచ్చరించారు. -
ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి: ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం సృష్టించిన కొరతే అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని కొరత సృష్టించి వ్యాపారులకు దోచి పెట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిపోయిందంటూ ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేతగాని పాలనకు నిదర్శనం అంటూ పెట్రోలు బంకుల దగ్గర వాహనదారుల ఇక్కట్ల వీడియోలను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. విత్తనాలు దగ్గర నుంచి వంట గ్యాస్ వరకూ ఇదే పరిస్థితి‘విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది. తాజాగా ఆ జాబితాలో పెట్రోల్, డీజిల్ చేరింది. కృత్రిమ కొరత సృష్టించి, దాని ద్వారా దోచుకునే పర్వానికి కూటమి నాయకులు సిద్ధమయ్యారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు. సరఫరాలో సంక్షోభం లేదు. కానీ, ఇక్కడ డీలర్లు, కూటమి నాయకులు కుమ్మక్కవడంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, ధరలు పెంచుతారని భావిస్తున్న డీలర్లు పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేస్తున్నారు. వారితో కూటమి నాయకులు జత కట్టారు. అంతా కలిసి దోపిడీకి సిద్ధమయ్యారు. అయినా నిజం ఒప్పుకోకుండా, సరఫరా మరింత తగ్గుతుందన్న భయంతో వాహనదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నందువల్ల డిమాండ్ పెరిగి, కొరత ఏర్పడిందని కుంటి సాకులు చెబుతున్నారు. వాస్తవం మీకు కూడా తెలుసు..వాస్తవం ఏమిటన్నది మీక్కూడా తెలుసు. అందుకే పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై సమగ్రమైన రివ్యూ కూడా చేయకుండా, కేవలం లీకులతో సరి పెడుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ఉద్దేశపూర్వక కొరత వల్ల అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఈ కృత్రిమ కొరత రైతులను కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తోంది. ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు తగిన డీజిల్ అందక కార్యకలాపాలు నిల్చిపోతున్నాయి. రబీ పంటల కోత కాలంలో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోత యంత్రాలకు రోజుకు సుమారు 100 నుంచి 160 లీటర్ల డీజిల్ అవసరం ఉండగా, సరఫరా లేకపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోతున్నాయి. చేపలు మరియు రొయ్యల పెంపకంలో ఉపయోగించే ఏరిఏటర్లు కూడా డీజిల్పై ఆధారపడటంతో, ఆక్వా రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెబుతారు’ అని హెచ్చరించారు..@ncbn గారూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా అనుకూలంగా మార్చుకుని దోచుకునే మార్గాలను వెతుక్కోవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. లేని కొరత సృష్టించి వ్యాపారులకు సహకరిస్తూ మీరు లాభపడడం అలవాటుగా మారింది. విత్తనాలు, ఎరువులు, యూరియా మొదలు, వంట గ్యాస్ వరకు మన రాష్ట్రంలో అదే జరిగింది.తాజాగా ఆ… pic.twitter.com/xLLCXcFuHr— YS Jagan Mohan Reddy (@ysjagan) April 27, 2026 -
ఏపీలో పెట్రో కొరతపై కేంద్రానికి ఎంపీ గురుమూర్తి లేఖ
ఢిల్లీ: ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఎంపీ గురుమూర్తి లేఖ రాశారు. ‘ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ రాష్ట్రంలో 4510 పెట్రోల్ బంకుల్లో 70 శాతం నో స్టాక్ బోర్డులు వెలిశాయి. వాహనదారులకు పెట్రోల్, డీజిల్ రేషన్ విధిస్తున్నారు. కానీ పెట్రోలియం శాఖ దేశ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సప్లై కి ఎలాంటి అవరోధాలు లేవని చెప్తుంది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి ఎలాంటి డిమాండ్ లేదని ప్రభుత్వం చెప్తుంది. క్షేత్రస్థాయికి , ప్రభుత్వ లెక్కలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శూన్యం. పెట్రోల్ డీజిల్ కొరత ఫలితంగా వ్యాపారులు రైతులు పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని కొరతకు గల కారణాలను దర్యాప్తు చేయాలి. బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ తదితర అంశాలపై దృష్టి సారించాలి. ఏపీ అవసరాలకు తగిన పెట్రోల్ డీజిల్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
లోకేశ్ ఏంటిది?.. ఆరు నెలలకు నిద్ర లేచిన మంత్రి టీమ్..
సాక్షి, అమరావతి: క్వాంటమ్ కంప్యూటింగ్... ఈ పదాన్ని చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో బాగా ప్రచారం చేస్తోంది. ఎటువంటి సమస్యకైనా మిల్లీ సెకన్లలో పరిష్కారం చూపించే సత్తా ఉందంటూ ఊదరగొడుతోంది. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ను పర్యవేక్షించే మంత్రి నారా లోకేశ్ శాఖ మాత్రం తప్పుడు జీవోలు జారీ చేసే శాఖగా మారిపోయింది. ఏకంగా జీవోల్లో కంపెనీల పేర్లనే మార్చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. తీరా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. తప్పు జరిగిన ఆరు నెలల తర్వాత నిదానంగా నిద్రలేచిన లోకేశ్ టీం తప్పులను సరిదిద్దుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో చంద్రబాబు బడాయి మాటల బండారం ప్రపంచానికి తెలిసిపోయింది. అసలేం జరిగిందంటే... కంపెనీల పేర్లనే పూర్తిగా మార్చేసి జీవోలు.. గతేడాది నవంబర్ నెలలో ఐటీ శాఖ ఎస్సీఐసీబీ వెంచర్స్ ఎల్ఎల్పీ అనే సంస్థ రూ.550 కోట్లతో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జీవో ఎంఎస్ నెంబర్ 49.., క్రేయాన్ టెక్నాలజీ రూ.1,079 కోట్లతో ఐటీ ఎన్క్లౌంజర్స్, పీసీబీ బేరబోర్డు యూనిట్ ఏర్పాటును ఆమోదిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 60ను ప్రభుత్వం విడుదల చేసింది.అయితే జీవోల్లో కంపెనీల పేర్లను ఒకదానికి బదులు ఇంకో కంపెనీ పేరును పేర్కొంటూ అధికారులు కళ్లు మూసుకొని ఉత్తర్వులు జారీ చేసేశారు. ఒక జీవో జారీ చేసే ముందు సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ శాఖ అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ, ఫైనాన్స్, సీఎస్, సీఎంవో ఇలా అనేక మందిని దాటుకొని రావాల్సి ఉంటుంది. అలాంటిది... ఎక్కడా కూడా జరిగిన పొరపాటును గుర్తించలేదంటే ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఆరు నెలల తర్వాత పేర్లు మార్చి... జీవోలు బయటకు రాగానే కంపెనీల యాజమాన్యాలు జరిగిన తప్పును వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిదిద్దడానికి ఏకంగా ఆరు నెలల సమయం తీసుకొంది. చివరకు జనవరిలో విశాఖ కేంద్రంగా జరిగిన సీఐఐ పెట్టుబడుల సమావేశంలో ఈ రెండు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడూ కూడా ఆ కంపెనీల ప్రతినిధులు జరిగిన తప్పిదాన్ని మరోసారి అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. నవంబర్ 2025లో జారీ చేసిన తప్పుడు జీవోలను సవరిస్తూ ఏప్రిల్ 2026లో జీవోలను జారీ చేశారు.జీవో జారీ అయ్యే సమయంలో వివిధ దశల్లో ఒక గుమస్తా అనుకోకుండా చేసిన తప్పు వల్ల కంపెనీల పేర్లు మారాయంటూ చేతులు దులిపేసుకున్నారు. తప్పుడు జీవోల్లోని పేర్లు మార్చేందుకే ఆరు నెలల సమయం తీసుకున్నారని.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదేనా అని పలువురు పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
కోరి తెచ్చుకుంటే.. కాలేజీని కాజేస్తోంది!
సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ ఇది తమ పార్టీ, తమ ప్రభుత్వమని భావిస్తే తమనే మింగేయాలని చూస్తోందని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ పాత డైరెక్టర్లు లబోదిబోమంటున్నారు! కాలేజీని సొంతం చేసుకోవడానికి ‘ముఖ్య’నేత మనుషులు తెస్తున్న ఒత్తిడితో బెంబేలెత్తిపోతున్నారు. రాజధానికి చేరువలో మంగళగిరిలో రూ.2 వేల కోట్లకుపైగా విలువైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిని చేజిక్కించుకునేందుకు ముఖ్య నేత చేస్తున్న యత్నాలను ‘సాక్షి’ బయటపెట్టిన విషయం తెలిసిందే. డైరెక్టర్లను లొంగదీసుకునేందుకు ముఖ్యనేత సామదాన దండోపాయాలు ప్రయోగిస్తున్నట్లు తెలిసింది. రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రి ఇదే పనిలో నిమగ్నమై డైరెక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ముఖ్యనేతకు బినామీగా ఉన్న పారిశ్రామికవేత్త తెరవెనుక చక్రం తిప్పుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. నయాన భయాన లొంగదీసుకునే యత్నాలు..ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసలైన డైరెక్లర్లు ఎవరో తేల్చుకోవాలని ఆర్బిట్రేషన్ జడ్జి తీర్పు ఇవ్వడంతో ఇటీవల మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తులు (పాత డైరెక్టర్లు, కాలేజీ వ్యవహారాల్లో ముఖ్యులు) సమావేశమయ్యారు. కొత్త డైరెక్టర్లను ఎన్నుకునేందుకు ఆ సమావేశంలో నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. దీనిప్రకారం వారంతా తమ అభిప్రాయాలను తెలిపి తిరిగి కొత్త మేనేజింగ్ కమిటీని ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెల 29వతేదీన మరో సమావేశం నిర్వహించనున్నారు. అందులో కొత్త డైరెక్టర్లు, కొత్త మేనేజింగ్ కమిటీ ఖరారయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలాఖరులోపు కొత్త కమిటీని నియమించుకోవాలని ఆర్బిట్రేషన్ జడ్జి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 29న జరిగే సమావేశం కీలకంగా మారింది. డైరెక్టర్లను నయాన భయాన లొంగదీసుకునేందుకు ముఖ్యనేత తరఫున ఓ మంత్రి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి వ్యాపారాలు, ఇతర వ్యవహారాల గురించి ఆరా తీస్తూ బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ముఖ్య నేత మాట కాదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కొందరు డైరెక్టర్ల ఇళ్లకు వెళ్లి వార్నింగ్లు ఇస్తున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆశించిన డైరెక్టర్లు తాజా పరిణామాలతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని కొన్ని దశాబ్దాలుగా పెంచి పోషించామని, గత ఎన్నికల్లో గెలిపించేందుకు శాయశక్తులా పని చేశామని, కానీ ఇప్పుడు తమపై గురి పెట్టటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వాన్ని తాము వ్యతిరేకించినా కాలేజీ విషయంలో జోక్యం చేసుకోలేదని, తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదని గుర్తు చేసుకుంటున్నారు. -
ఈ పాపం సర్కారుదే!
కమర్షియల్ అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు/కాంట్రాక్టర్లకు సంబంధించిన బంకులకు సరఫరా అయ్యే ఇంధన చార్జీలు పెరిగాయి. రిటైల్-కమర్షియల్ ఇంధనం ధరలో సగానికి సగం వ్యత్యాసం ఉంది. దీంతో పెద్ద కాంట్రాక్టర్లు కొన్ని రిటైల్ బంకుల నుంచి బ్లాక్లో కొంటున్నారని ఆయిల్ కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిటైల్ బంకులకు సరఫరా తగ్గించేశాయి. ఇక్కడ నిఘా పూర్తిగా కొరవడింది. సమన్వయం లేదు. ప్రభుత్వ పర్యవేక్షణ అసలే లేదు. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే. అందుకే సమస్య తీవ్రతరమైంది. నిజంగా ప్రభుత్వం దృష్టి పెడితే 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఎందుకో మరి ప్రభుత్వం ఆ పని మాత్రం చేయడం లేదు.-ఇంధన రంగానికి చెందిన ఓ నిపుణుడు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మన రాష్ట్రంలోనే డీజీల్, పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 4,510 బంకుల్లో 70 శాతానికిపైగా మూతబడ్డాయి. కొన్నిచోట్ల ఉన్న కొద్ది స్టాక్ను రేషన్ లెక్కన అందిస్తున్నారు. అందుకోసం కనుచూపుమేర వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి ఎదురు చూపుల తర్వాత అరకొర ఇంధనంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. డీజిల్ కార్లకు 10–15 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. బైకులకు రూ.200 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు. ఇంధనం ఉన్న బంకుల్లో గరిష్టంగా 5 గంటలు మించి అమ్మకాలు జరగలేదు. శనివారం డీజిల్కు మాత్రమే తీవ్ర కొరత ఏర్పడగా, ఆదివారం అది పెట్రోల్కు కూడా అంటుకుంది. దీంతో బంకుల వద్ద వాహనదారులు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా రంగం కుదేలైంది. పెద్ద వాహనాల రవాణా నిలిచిపోయింది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన సంక్షోభం కొనసాగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతోంది. సమస్య పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్కు ఏమాత్రం కొరత లేదు. ఒక్క ఏపీలో మాత్రమే ఇంతగా ఇంధన సంక్షోభం నెలకొంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వాహనదారులు మండిపడుతున్నారు. సమన్వయం లేదు.. నిఘా లేదు.. పరిష్కారం దిశగా చర్యలూ లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే నో స్టాక్ బోర్డు పెడితే ఊరుకోమని సీఎం హెచ్చరించడం నవ్వులపాలవుతోంది. పెట్రోల్, డీజిల్ సరఫరానే లేదని బంకుల యజమానులు వాపోతుంటే.. సరఫరా సవ్యంగా సాగేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి బంకులకు వార్నింగ్ ఇవ్వడం ఏమిటని చర్చ జరుగుతోంది. గుంటూరు లాడ్జి సెంటర్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద బారులుతీరిన వాహనాలు సీఎంది ఓ లెక్క.. సివిల్ సప్లై శాఖ మంత్రిది మరోలెక్క రాష్ట్రంలో ఇంధన కొరతతో ప్రజలు ఆందోళన చెందుతుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కొరత లేదని చెబుతోంది. వినియోగంపై తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. డిమాండ్కు తగ్గ సరఫరా ఉందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పడం విస్తుగొల్పుతోంది. పెట్రోలియం సంస్థలు శనివారం 10,345 కిలో మీటర్ల పెట్రోలు, 14,156 కిలో లీటర్ల డీజిల్ను డీలర్లకు సరఫరా చేసినట్టు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్ అమ్మకాలు ఉంటే.. శనివారం 8,489 కిలో లీటర్ల అమ్మకాలు జరిగాయని, డీజిల్ సాధారణ రోజుల్లో రోజుకు 9,048 కిలో లీటర్లు అమ్మకాలు జరిగితే శనివారం 10,556 కిలో లీటర్లకు పెరిగిందన్నారు. కర్నూలులోని నారాయణ పెట్రోల్ బంక్లో సైకిల్పై వచ్చి పెట్రోలు తీసుకెళ్తున్న యువకుడు సాధారణ స్థాయిని మించి అమ్మకాలు జరగడంతో కొన్ని బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా అబద్ధం. వాస్తవానికి మార్చి 31న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ఇంధన వినియోగం వివరాలను వెల్లడించారు. రోజువారీ సగటు పెట్రోల్ వినియోగం 7,900 కిలో లీటర్లు అని, డీజిల్ 20,000 కిలో లీటర్లు ఉందన్నారు. అంతేగాక డీజిల్ సరఫరాను 8%, పెట్రోల్ను 2.4% అదనంగా పెంచినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో ఆదివారం సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడించిన లెక్కలకు, సివిల్ సప్లై శాఖ మంత్రి లెక్కలకు పొంతన కుదరడం లేదు. ఈ లెక్కన ఇంధన వినియోగంపై ఇప్పటి దాకా ప్రభుత్వం వద్ద సరైన లెక్కలే లేవని తేటతెల్లమవుతోంది.అనంతపురంలోని టవర్క్లాక్ వద్ద వాహనదారులతో నిండిపోయిన ఇండియన్ పెట్రోల్ బంక్ చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం⇒ రాష్ట్రంలో ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చడంతో అది రవాణా రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. రాష్ట్రం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే సరుకు రవాణా వాహనాలు దాదాపుగా నిలిచిపోయాయి. ప్రజా రవాణా వాహనాలు, ఆటోలు వంటివి సగానికి పైగా తిరగడం లేదు. ఈ నెలాఖరుకు ఇంధన ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో సరఫరా ఆపేశారనే చర్చ జరుగుతోంది. అయితే ఇది కూడా వాస్తవం కాకపోవచ్చని, అలాగైతే పొరుగు రాష్ట్రాలకు ఎలా సరఫరా అవుతోందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలోని హెచ్పీ బంకు వద్ద పెట్రోల్ కోసం బారులుతీరిన వాహనాలు ⇒ ఇదిలా ఉండగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాష్ట్రంలో డీలర్లకు డిమాండ్లో 40 శాతం మాత్రమే సరఫరా చేస్తున్నాయి. ఇంధన ఉత్పత్తి పెంచామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. అది ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. శనివారం మధ్యాహ్నం వరకు కొంత మేర తెరుచుకున్న బంకుల్లో పెట్రోల్ మాత్రమే అరకొరగా అమ్మకాలు సాగించారు. సాయంత్రానికి వాటిలోనూ ‘నో స్టాక్’ బోర్డులు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ద్విచక్ర వాహనాలకు రూ.200 పెట్రోల్, కార్లకు 10–15 లీటర్లు డీజిల్/పెట్రోల్ మాత్రమే అందించారు. ఫుల్ ట్యాంక్, క్యాన్లలో విక్రయాలు ఆపేశారు. -
క్రెడిట్ దోపిడీలో బాబు గిగా స్పీడ్!
సాక్షి, అమరావతి: మొన్న ఎన్టీపీసీ గ్రీన్ పవర్.. నిన్న రెన్యూ పవర్.. నేడు డేటా సెంటర్..! విశాఖ కేంద్రంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా మారుస్తున్నానంటూ రెండు రోజుల క్రితం రెన్యూ పవర్ శంకుస్థాపన సభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు తాజాగా తాను తెచ్చిన గూగుల్ డేటా సెంటర్తో విశాఖ విశ్వనగర మంటూ అనుకూల మీడియాలో ప్రచారానికి తెర తీశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషితో విశాఖలో అదానీ డేటా సెంటర్ సాకారం కాగా అందుకోసం 3,900 కి.మీ. పొడవున సబ్సీ (సముద్ర గర్భం) కేబుళ్లు కోసం గత ప్రభుత్వం 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాయడం తెలిసిందే.ఇప్పుడు అదే డేటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్ అంటూ చంద్రబాబు సర్కారు క్రెడిట్ దోపిడీకి పాల్పడుతోంది. అయితే అది అదానీ డేటా సెంటరే అని సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్ ఇప్పటికే బయటపెట్టడంతో చంద్రబాబు సర్కారు ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. డేటా సెంటర్పై గూగుల్తో ఒప్పందం సమయంలో ఉద్దేశపూర్వకంగా అదానీ పేరును తొక్కి పెట్టి క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడానికి చంద్రబాబు చేసిన విన్యాసాలు విఫలమయ్యాయి. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ను అదానీ, భారతీ ఎయిర్టెల్ గ్రూపుల భాగస్వామ్యంతో గూగుల్ ఏర్పాటు చేస్తోందని అంగీకరించడంతోపాటు భూములు అదానీ పేరిటే బదలాయించి ప్రోత్సాహకాలు సైతం కల్పిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేయడమే దీనికి నిదర్శనం.బాబు సమక్షంలోనే తేల్చేసిన అదానీ.. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి గతేడాది అక్టోబర్ 14న ఢిల్లీలో ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంలో చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగానే అదానీ పేరును ప్రస్తావించలేదు.అయితే అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ స్పందిస్తూ ఈ డేటా సెంటర్లో తాము భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. భారతీ ఎయిర్టెల్ గ్రూప్ కూడా ఈ డేటా సెంటర్లో తాము భాగస్వాములమంటూ ట్వీట్ చేసింది. గూగుల్తో కలిసి తాము రూ.15 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ సీఎం చంద్రబాబు సమక్షంలోనే ప్రకటించడంతో ముఖ్యమంత్రితో పాటు వేదికపైన ఉన్న మంత్రుల మొహాలు ఒక్కసారిగా మాడిపోయిన సంగతి తెలిసిందే.జీవో సాక్షిగా బండారం బద్ధలు.. చంద్రబాబు క్రెడిట్ చోరీని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాధారాలతో మీడియా సమక్షంలో ఎండగట్టిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే గూగుల్తో ఒప్పందం సమయంలో సీఎం చంద్రబాబు అదానీ పేరెత్తలేదన్న విషయాన్ని బయటపెట్టారు. వైఎస్ జగన్ చెప్పిన ప్రతీ అక్షరం సత్యమేనని చంద్రబాబు సర్కారు విడుదల చేసిన జీవో సాక్షిగా రుజువైంది.క్రెడిట్ చోరీని కప్పిపుచ్చేందుకు తొలుత గూగుల్ పేరిట జీవో విడుదల చేసి ఆ తర్వాత ఆ భూములను అదానీ ఇన్ఫ్రా పేరుమీదకు బదలాయించడమే దీనికి తార్కాణం. ఒకపక్క కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020 నవంబర్లో విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకుంది. అంతేకాదు.. డేటా సెంటర్కు డేటా వచ్చేందుకు వీలుగా 3,900 కి.మీ. పొడవున సముద్ర గర్భంలో కేబుళ్ల ఏర్పాటుకు 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది.వైఎస్ జగన్ కృషితో సాకారం.. గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అదానీతో జత కట్టడమే కాకుండా నోయిడాలో అదానీ నిర్మించిన డేటా సెంటర్ను 2022 అక్టోబర్ 11న లీజుకు తీసుకుంది. ఈ క్రమంలో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న మాజీ సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. డేటా సెంటర్ కోసం గత ప్రభుత్వం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. చంద్రబాబు సర్కారు చెబుతున్న డేటా సెంటర్ను తాము నిర్మించడం లేదని.. దీన్ని అదానీ గ్రూపే చేపడుతోందని, అందువల్ల భూమిని కూడా అదానీ ఇన్ఫ్రాకే కేటాయించాలని కోరుతూ గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ గతేడాది అక్టోబర్లో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కు లేఖ రాశారు.ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వ కృషితో సాకారమైన డేటా సెంటర్ను చంద్రబాబు అబద్ధాలతో తన ఖాతాలో ఎలా వేసుకున్నారో వైఎస్ జగన్ సాక్ష్యాలతో ఎండగట్టిన విషయం తెలిసిందే. డేటా సెంటర్ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సబ్సీ కేబుళ్లు సింగపూర్ నుంచి విశాఖకు ఏర్పాటుకు వైఎస్ జగన్ అంకురార్పణ చేశారు. ఈ డేటా సెంటర్ ద్వారా విశాఖలో ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని తద్వారా గ్లోబల్ క్యాపబుల్ సెంటర్స్ వస్తాయని వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. -
బీసీల అభ్యున్నతే వైఎస్సార్సీపీ ధ్యేయం
అనంతపురం : బీసీల అభ్యున్నతే వైఎస్సార్సీపీ ధ్యేయమని వక్తలు పునరుద్ఘాటించారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్బోన్ అని దేశ చరిత్రలో తొలిసారిగా చెప్పిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తు చేశారు. అనంతపురంలో ఆదివారం వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాయలసీమ జోనల్ స్థాయి ‘బీసీ గళం’సభ నిర్వహించారు.బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ తదితరులు ప్రసంగించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన హామీల కంటే అధికంగానే బీసీలకు తోడ్పాటునందించారని గుర్తు చేశారు. వారి అభ్యున్నతికి ఏకంగా రూ.1.75 లక్షల కోట్లు వెచి్చంచారని పేర్కొన్నారు.బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం కలి్పంచే శక్తి వైఎస్ జగన్కు మాత్రమే ఉందన్నారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేయడానికి బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి మద్దతిస్తారని చెప్పారు. బీసీలే టీడీపీకి పట్టుకొమ్మలు అని చెప్పుకునే చంద్రబాబు ఈ రెండేళ్లలో వారి కోసం ఒక్క కార్యక్రమమైనా చేపట్టారా? అని ప్రశి్నంచారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా బీసీలకు ఇచి్చన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించేందుకు బీసీలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, శైలజానాథ్, శంకరనారాయణ, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్విసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) సీఈవో అఖిలేష్కుమార్ దీక్షిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించేందుకు 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం సీఈఎస్ఎల్ టెండర్ పిలిచిందని పేర్కొన్నారు.దీని ద్వారా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో విద్యుత్ ఆధారిత రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 750 బస్సులు కేటాయించగా, వీటిలో విశాఖపట్నానికి 150, తిరుపతికి 300 బస్సులు మంజూరు చేసినట్లు వివరించారు. -
భక్తులకు వైఎస్ జగన్ శ్రీ కన్యకాపరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి : శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని పేర్కొన్నారు. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/ocXww8S6f1— YS Jagan Mohan Reddy (@ysjagan) April 26, 2026 -
‘ఏపీని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు బరితెగించి నీచమైన పనులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి తమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.‘‘రాచరిక వ్యవస్థను అమలు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎమ్మెల్యేలను అదుపు చేయడం మానేశారు. ఈ రాష్ట్రాన్ని కూటమి ఎమ్మెల్యేలు భ్రష్టు పట్టిస్తున్నారు. గుండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై సురేంద్రబాబు అనుచరులు దాడి చేశారు. మహిళా సిబ్బందిపై దాడి చేసి కిడ్నాప్ చేసి.. భయబ్రాంతులకు గురిచేశారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు కనీసం తన అనుచరులను వారించలేదు. నంద్యాల జిల్లా రుద్రవరం టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు సిబ్బందిని కిడ్నాప్ చేశారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఎమ్మెల్యే లేకపోతే టోల్ కట్టమని అడుగుతారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నా కుటుంబసభ్యులు వెళ్లినపుడు టోల్ కట్టారు...టీడీపీ ఎమ్మెల్యేల రాసలీలలు ఓ స్థాయికి వెళ్లాయి. మహిళతో రాసలీలలు జరుపుతూ సత్యవేడు ఎమ్మెల్యే దొరికిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ మహిళతో రాజీ చేసుకోమని స్వయంగా చంద్రబాబే చెప్పినట్లు వార్తలు చదివి ఆశ్చర్యపోయాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మోసం చేశాడని దళిత మహిళ వేడుకున్నా పట్టించుకోలేదు. దళిత మహిళను కాపు నేత రోడ్డుపై కొడుతుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మహిళలకు న్యాయం చేస్తా.. నిలబడతాననే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు. అరవ శ్రీధర్ పై పవన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు..గుంటూరు ఈస్ట్ నజీర్ అహ్మద్ మహిళతో అసభ్యంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదు. విజయనగరం జిల్లా మంత్రి పీఏపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్ను వేధిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. తమను మోసం చేశారు. శారీరకంగా వాడుకున్నారని బాధిత మహిళలు చెబుతుంటే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రా....రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి కాదా?. రాష్ట్రంలో ఏ పార్టీ బతకడానికి వీల్లేదనేదే చంద్రబాబు ఆలోచన. చంద్రబాబుది కక్షపూరిత అజెండా..స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్నపాత్రుడు డప్పు కళాకారుడి చెంప చెళ్లుమనింపించాడు. చెంపదెబ్బ కొట్టి.. మళ్లీ బాధితుడితోనే ఎలాంటి దాడి జరగలేదని వీడియో పెట్టించారు. ఎందుకు టీడీపీ పార్టీ స్పీకర్ను భరిస్తోంది. అయ్యన్నపాత్రుడు స్పీకర్ కూర్చీలో కూర్చోవడానికి అనర్హుడు. రాజమండ్రి ఎమ్మెల్యే వాసు ముఖ్య అనుచరుడు బాలికను గర్భవతి చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బాలిక బిడ్డను కంటే డబ్బులిస్తాం సర్ధుకోమని చెప్పిన దుష్ట ప్రభుత్వం ఇది. ఇలా చేయడానికేనా చంద్రబాబు ఒక్క అవకాశం ఇవ్వండని అడిగింది. కంపెనీలు, ఇండస్ట్రీలు, సంస్థలపై పడుతున్నారు. పోర్టు పనులకు వెళుతున్న లారీలను కందుకూరు ఎమ్మెల్యే అడ్డుకుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు?. కింగ్ ఫిషర్ కంపెనీ ఏడాదికి రూ.18 కోట్లు కట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కింగ్ ఫిషర్ కంపెనీకి సమస్య సృష్టించి పరిష్కరించినట్లు డబుల్ డ్రామా ఆడారు...తన నియోజవర్గంలోంచి వెళ్లే లారీలకు కప్పం కట్టాలని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ హుకుం జారీ చేశారు. ఎందుకు కట్టాలి మీకు కప్పం ... ఈ దోపిడీని ఏమనాలి. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బెదిరించాడు. శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బంది పై దాడి చేశాడు. తప్పతాగిన మైకంలో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. కియా కాంట్రాక్టులన్నీ తమకే కావాలని మంత్రి సవిత అనుచరుడు దౌర్జన్యం చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు , వాళ్ల అనుచరులు ఇంత అరాచకంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?. టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనుల పై నోరుపారేసుకున్నాడు. టీడీపీ నేతల ఆగడాలపై మేం ఆరోపణలు చేయడం లేదు. వాళ్ల అనుకూల పత్రికల్లోనే టీడీపీ నేతల గురించి రాస్తున్నారు. టీడీపీ, జనసేన , బీజేపీ ఎమ్మెల్యేలకు అధికారులంటే లెక్కలేదు..నర్సరావుపేట ఎమ్మెల్యే ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లి బాత్ రూమ్లో కూర్చుని తాళం వేసుకున్నాడు. లీగల్ అడ్వైజర్గా సిఫార్సు చేయొచ్చు.. కానీ ఎస్పీకి హుకుం జారీ చేయడమేంటి?. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ గూండాలు, రేపిస్ట్లతో నిండిపోయి గబ్బు కొడుతోంది. చంద్రబాబు ఆయన కుమారుడికి సీఎం కుర్చీ కోసం యుద్ధం జరుగుతోంది. తమ మధ్య జరుగుతున్న యుద్ధంలో చంద్రబాబు పాలన వదిలేశారు. పవన్ కళ్యాణ్కు పది రోజులకొకసారి అనారోగ్యం కలుగుతోంది. జనసేన ఎమ్మెల్యేలు మహిళలతో అసభ్యంగా వ్యవహరించినా పవన్ మాట్లాడటం లేదు. మళ్లీ ఏపీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో అరాచకాలు ఆగుతాయి’’ అని సుధాకర్బాబు పేర్కొన్నారు. -
రేపు వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం నిరసనలు
సాక్షి, అమరావతి: పంచాయతీ రాజ్ శాఖలో పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరుతూ ఈ నెల 27న(సోమవారం) రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తెలిపారు. నిరసన అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని చెప్పారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు నిర్వహించిన పనులకు సంబంధించి కూలీలకు వేతనాలు అందకపోవడం బాధాకరమన్నారు. -
నిరంతర విధి.. నిశ్శబ్ద రోదన
ఇటీవల కాకినాడలో ధనరాజ్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పని భారం భరించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. సహచర కానిస్టేబుళ్లు ఆయన్ను తక్షణమే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన పని ఒత్తిడితో కుంగిపోతున్న పోలీస్ కానిస్టేబుళ్ల దుస్థితిని మరోసారి చర్చనీయాంశం చేసింది.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుళ్లు తీవ్రమైన పనిభారంతో కుంగిపోతున్నారు. శారీరకంగా.. మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పోలీస్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీ చేసినా.. చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెద్దఎత్తున పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీ చేయడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నతాధికారుల వేధింపులు కానిస్టేబుళ్లను మరింతగా కుంగదీస్తున్నాయి. అటు ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల వేధింపులతో కానిస్టేబుళ్లు మౌనంగా రోదిస్తున్నారు. ఉండాల్సింది 80 వేలు.. ఉన్నది 48 వేల మందే పోలీస్ కానిస్టేబుళ్లకు తీవ్రమైన పని ఒత్తిడికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్రంలో భారీగా ఉన్న కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయడం లేదు. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి లక్ష మంది జనాభాకు కనీసం 138 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. ఆ ప్రకారం రాష్ట్రంలో 5.50 కోట్ల మందికి కనీసం 80 వేలమంది కానిస్టేబుళ్లు అవసరం. కానీ.. రాష్ట్రంలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం కేవలం 48 వేల మంది కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు 45 శాతం మంది తక్కువగా ఉన్నారు.అయినా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు. ఆ మేరకు కానిస్టేబుళ్లను నియమించకపోగా.. అధికారికంగా మంజూరు చేసిన కానిస్టేబుల్ పోస్టులనైనా భర్తీ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కానిస్టేబుల్ పోస్టుల్లో 18 వేల వరకు ఖాళీగా ఉన్నాయి. వాటిలో సివిల్ పోలీస్ విభాగంలో 5,159, ఏఆర్ విభాగంలో 4 వేలు, ఏపీఎస్పీ విభాగంలో 6,231, మినిస్టీరియల్ స్టాఫ్ విభాగంలో 3వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసే ఉద్దేశమే లేనట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తీవ్ర పని ఒత్తిడితో కుంగుబాటు నిబంధనల ప్రకారం కానిస్టేబుళ్లు మూడు షిప్టుల విధానంలో రోజుకు 8 గంటలపాటు విధులు నిర్వర్తించాలి. కానీ.. పోస్టులు భర్తీ చేయకపోవడంతో రెండు షిఫ్టుల విధానం అమలవుతోంది. అదికూడా వేళాపాళా లేకుండా పనిభారంతో అధికారులు వేధిస్తున్నారు. ఒక్కో కానిస్టేబుల్ రోజుకు 12 నుంచి 14 గంటలపాటు పని చేస్తున్నట్టు పోలీస్ శాఖ అంతర్గత నివేదికలు వెల్లడిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో కానిస్టేబుళ్లు ఏకంగా 16నుంచి 18 గంటలపాటు పని చేయాల్సి వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.మితిమీరిన స్థాయిలో వీఐపీల బందోబస్తు విధులు, ఎన్బీడబ్ల్యూ విధులు, నైట్ పెట్రోలింగ్ విధుల ఒత్తిడితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీక్లీ ఆఫ్ల విధానం కూడా అమలు చేయడం లేదు. అంటే వారంలో ఏడు రోజులూ పని చేయాల్సి వస్తోంది. కుటుంబానికి కనీస సమయం కేటాయించలేకపోతున్నారు. పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు వంటి విషయాలపై కూడా దృష్టి సారించలేకపోతున్నారు.పేరుకుపోయిన టీఏలు, సరెండర్ లీవులుకానిస్టేబుళ్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వీఐపీ బందోబస్తు విధులు, ఎన్బీడబ్ల్యూ విధులు, కోర్టు విధులు, ఇతరత్రా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు ట్రావెలింగ్ అలవెన్సులు కూడా సకాలంలో చెల్లించడం లేదు. ఖర్చులు భారీగా పెరిగిపోయినా.. దీర్ఘకాలంగా చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. 2024 జూన్ నుంచి టీఏ బకాయిలు చెల్లించనే లేదు. మరోవైపు సరెండర్ లీవులు, అదనపు సరెండర్ లీవుల బకాయిలు సైతం పేరుకుపోయాయి. డీఏ బకాయిలు సరే సరి. రాష్ట్రంలో ఒక్కో జూనియర్ కానిస్టేబుల్కు రూ.లక్ష చొప్పున, సీనియర్ కానిస్టేబుల్కు రూ.2 లక్షల చొప్పున బకాయిలు ఉన్నాయి. అయినా సరే.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా పనిభారం అమాంతంగా పెంచుకుంటూపోతోందని కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వంలో 6,100 పోస్టుల భర్తీకి చర్యలు రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించింది. అయితే, టీడీపీ ఆ పోస్టుల భర్తీని సవాల్ చేస్తూ కోర్టులో ఏకంగా 28 కేసులు వేసి అడ్డుకుంది. దాంతో అప్పటి మెయిన్ పరీక్షను నిర్వహించలేకపోయింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులను వాపసు తీసుకోవడం గమనార్హం. అనంతరం ఆ పోస్టులను ప్రభుత్వం ఇటీవల భర్తీచేసి అది తమఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడింది. కానీ ఆ పోస్టులను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నోటిఫికేషన్ జారీ చేసి ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన విషయం వాస్తవమని ఎంపికైన కానిస్టేబుళ్లు స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కారడవిలో అక్రమాల ‘కోడి’
సాక్షి, అమరావతి: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం ఉద్దేశించిన ‘పెరటి కోళ్ల పెంపకం పథకం’లో అక్రమాలు కోడై కూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.7.96 కోట్లను మింగేసేందుకు నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఏపీ ఎస్టీ కమిషన్కు రాష్ట్ర యానాదుల సంఘం ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్రమాలు, అవినీతిపై ఆరోపణల నేపథ్యంలో పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్(పీఓ) నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందంతో విచారణ కమిటీని నియమించారు.దీంతో అక్రమాల విలువతోపాటు ఈ అవినీతి వ్యవహారంలో ఎవరి వాటా ఎంత అనేది తేలుస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక నుంచి అడ్వాన్సుల చెల్లింపుల వరకు అడ్డగోలు నిర్ణయాలు అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయనే విషయం సంఘం ఫిర్యాదుతో బట్టబయలైంది. రాష్ట్రంలోని ఆరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో 4,593 మంది గిరిజనులకు లబ్ధి చేకూర్చి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు దోహదపడాల్సిన ఈ పథకం పక్కదారి పట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇలా కేటాయించారు⇒ ఆరు ఐటీడీఏల పరిధిలో మొత్తం రూ.7,96,25,000 కేటాయించారు.⇒ పాడేరు, రంపచోడవరం, కోట రామచంద్రాపురం, పార్వతీపురం, నెల్లూరు, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలోని 25 మండలాల్లో 4,593 మంది గిరిజన లబ్ధిదారులను గుర్తించారు.⇒ ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున ఇప్పటికే రూ.6,88,95,000 మంజూరు చేశారు.⇒ కోళ్ల ఉత్పత్తికి బ్రీడర్ యూనిట్స్ ఒక్కొక్క దానికి రూ.1.25 లక్షల చొప్పున మొత్తం 50 యూనిట్లకు రూ.62.50 లక్షలు కేటాయించారు.⇒ కోళ్ల మేత నిమిత్తం ఒక్కో ఫీడ్ మిల్ ఏర్పాటుకు రూ.3.60 లక్షల చొప్పున మొత్తం 8 ఫీడ్ మిల్స్కు రూ.28.80 లక్షలు కేటాయించారు.⇒ కోళ్ల ఉత్పత్తి పేరిట ఒక్కో హేచరీకి రూ.2 లక్షల చొప్పున మొత్తం 8 హేచరీలకు రూ.16 లక్షలు కేటాయించారు.నోటిఫికేషన్ లేదు.. టెండర్ పిలవలేదుఏ పథకాన్ని అయినా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలనుకుంటే నోటిఫికేషన్ జారీ చేయడం లేదా టెండర్లు ఆహ్వానించాల్సి ఉంటుంది. దీనికి విరుద్ధంగా పెరటి కోళ్ల పెంపకం పథకంలో ఎటువంటి నోటిఫికేషన్, టెండర్ పిలవకుండానే ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకోవడం అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర నిధులు నూరు శాతం లబ్ధిదారులకే కేటాయించే అవకాశం ఉన్న ఈ పథకాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గిరిజన సంక్షేమ అధికారులతో అమలు చేయవచ్చు. అందుకు విరుద్ధంగా ప్రైౖవేట్ ఏజెన్సీకి అప్పగిస్తూ ఒప్పందం చేసుకోవడం ద్వారా నిబంధనల్ని ఉల్లంఘించారు. ఆ ఏజెన్సీని అడ్డు పెట్టుకుని నిధుల్ని బొక్కేందుకు ఆ శాఖలోని కీలక నేత చక్రం తిప్పుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.కోళ్లు కొనకుండానే అడ్వాన్సులుఏ పథకంలో అయినా లబ్ధిదారుల ఎంపిక, యూనిట్లు మంజూరు, కొనుగోళ్లు వంటి ప్రక్రియలు చేపట్టిన తర్వాతే నిబంధనల ప్రకారం ప్రభుత్వం దశలవారీగా నగదును బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో మాత్రం ఆరు ఐటీడీఏల ప్రాజెక్ట్ ఆఫీసర్ల ఖాతాలకు ముందస్తు (అడ్వాన్స్)గా నిధులు పూర్తిగా జమ చేయడం గమనార్హం. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని, కోళ్లు కొనేందుకు డబ్బులు ఇవ్వాలని పీఓలపై ఆ ఏజెన్సీ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. పథకం ప్రకారమే పీఓల ఖాతాలకు నగదు జమచేసి.. ఆ తర్వాత వారిపై ఒత్తిడి తెచ్చి కోళ్ల కొనుగోలు పేరుతో అయిన వారికి వాటిని జమ చేసేలా స్కెచ్ వేశారు. అలా చేయడం ద్వారా అంతా అధికారికంగా చేసినట్టు చూపి మొత్తం వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు రంగం సిద్ధం చేశారు.ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశాంకేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజనులకు అందించే పెరటి కోళ్ల పెంపకం యూనిట్ల మంజూరులో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయపై ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్కు ఫిర్యాదు చేశాం. ఈ నేపథ్యంలోనే పాడేరు పీఓ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి విచారణ చేయిస్తున్నట్టు చెప్పారు. అక్రమాలను నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని నూరు శాతం సక్రమంగా అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలి. లేదంటే ఉద్యమం చేపడతాం. – కేసీ పెంచలయ్య, అధ్యక్షుడు, ఏపీ యానాదుల సంఘం -
రైతు కథ.. కన్నీటి వ్యధ.. కర్షకుల కష్టం దళారుల పాలు
ఆరుగాలం శ్రమించి అన్నదాత చిందించిన చెమటకు ఫలితం దక్కడం లేదు. పండించిన పంటకు మద్దతు ధర లేనే లేదు. చేతికొచ్చిన పంటను అమ్ముకునే దారే కనిపించడం లేదు. తొలి పంట వైపరీత్యాలతో దెబ్బతింటే.. రెండో పంటకు మద్దతు ధర దక్కక, కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర కల్పించడంలో బాబు ప్రభుత్వం చేతులెత్తేయడంతో అప్పులతో సాగు చేసి పండించిన పంటను అయినకాడకి తెగనమ్ముకుంటూ ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఏ పల్లెకు వెళ్లినా రాసులు పోసిన పంటలు దర్శనమిస్తున్నాయి. కొనేవారు లేక, మద్దతు ధర దక్కక, కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేక అన్నదాతలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని సుమారు 30కి పైగా పల్లెల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో అన్నదాతల వెతలు వర్ణనాతీతం. ఏ పల్లెకు వెళ్లినా రైతుల ఆక్రందనలే.. ఏ రైతును కదిపినా కన్నీటి గాధలే. కళ్లెదుట పంటకు మద్దతు ధర దక్కక పోవడంతో చమర్చిన కళ్లతో దుఃఖాన్ని పంటి కింద అదిమి పెట్టుకొని రైతన్నలు మౌనంగా రోదిస్తున్న తీరు గుండెలను పిండేస్తోంది. పెట్టుబడులు పెరిగిపోయాయి రెండెకరాల్లో కౌలుకు చేస్తున్నా. ఎకరాకు రూ.20 వేలు కౌలుకు చెల్లించాను. రబీలో మొక్క జొన్న సాగుకు ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి పెట్టాను. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కోతకు రూ.4 వేలు తీసుకుంటున్నారు. పంటను తోలేందుకు ట్రాక్టర్కు రూ.1,000 డిమాండ్ చేస్తున్నారు. పెట్టుబడులు ఏటా పెరిగిపోతున్నాయి. ధర మాత్రం పెరగడం లేదు. మార్కెట్లో చూస్తే రూ.1,650కి మించి కొనడం లేదు. ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టపోతున్నా. – తాళ్లూరి ఇసాక్, గణపవరం, పల్నాడు జిల్లా ఈ రైతు పేరు లగడపాటి వీరాంజనేయులు. బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన ఈయన రబీలో కౌలుకు తీసుకున్న 30 ఎకరాల్లో శనగ, 10 ఎకరాల్లో తెల్లజొన్న వేశాడు. ఎకరాకు రూ.15 వేల చొప్పున రూ.6 లక్షలు కౌలుకే చెల్లించాడు. రెండు పంటలకు రూ.15 లక్షల వరకు రూ.2కు వడ్డీకి తెచ్చి సాగు చేశాడు. తెల్లజొన్న 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే, శనగ 8 క్వింటాళ్లకు మించి రాలేదు. తెల్లజొన్న రూ.1,600కు అమ్ముకున్నాడు. శనగకు క్వింటాకు రూ.4,900కు మించి ధర లేదు. ‘అతి కష్టమ్మీద 40 క్వింటాళ్ల శనగను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా రెండు నెలలైనా పైసా జమ కాలేదు. గతేడాది నల్లబర్లి పొగాకు సాగుతో రూ.10 లక్షలు నష్టపోతే ఈసారి మరో రూ.15 లక్షలకు పైగా నష్టపోతున్నా’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.ఈ రైతు పేరు శివ వెంకటరెడ్డి. గుంటూరు జిల్లా చుండూరు మండలం చిన్న పరిమి గ్రామానికి చెందిన ఈయన 10 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. ఎకరాకు రూ.32 వేలు కౌలు చెల్లించాడు. అదునుకు యూరియా దొరకక బ్లాకులో బస్తా రూ.350–450 మధ్య కొనుగోలు చేశాడు. పంటను కాపాడుకునేందుకు మోటార్లతో ఐదుసార్లు నీళ్లు పెట్టాల్సి వచ్చింది. ఇలా ఎకరాకు రూ.50 వేల చొప్పున అప్పులు చేసి పెట్టుబడి పెట్టాడు. తీరా పంట చేతికొచ్చేసరికి క్వింటా రూ.1,600కు మించి కొనడం లేదని, ఈ ధరకు అమ్ముకుంటే కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని వాపోయాడు. వైఎస్ జగన్ హయాంలో ఇదే మొక్కజొన్నను రూ.2,650కు అమ్ముకున్నానని, పచ్చి వడ్లకు రూ.2,200 ధర దక్కిందని చెప్పాడు. జగన్ ప్రభుత్వంలో మంచి ధరలు లభించాయని, ఇప్పుడు రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ రైతు పేరు వేటు వెంకటేశ్వరరెడ్డి. బాపట్ల జిల్లా తెనాలి మండలం ఐతానగరానికి చెందిన ఈయనకు సెంటు భూమి కూడా లేదు. వ్యవసాయంపై మక్కువతో 40 ఎకరాలు కౌలుకు తీసుకొని తొలి పంట వరి వేశాడు. ఎకరాకు రూ.35 వేల వరకు పెట్టుబడి పెడితే అకాల వర్షాలకు 30 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. దాంట్లో సగం కౌలుకే ఇవ్వాల్సి వచ్చింది. మిగిలిన ధాన్యం బస్తా (75 కేజీలు) రూ.1,350 చొప్పున అమ్ముకున్నాడు. రబీలో ఎకరాకు రూ.25 వేల పెట్టుబడితో జొన్న సాగు చేశాడు. మోంథా తుపానుకు మూడొంతులు పంట పోతే రెండోసారి విత్తగా ఎకరాకు 18 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి. తీరా మార్కెట్కు తెస్తే కొనేవారు లేరు. ‘రెండు పంటలకు రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు రూ.5 లక్షలే చేతికొచ్చింది. ఈ సీజన్లో రూ.7 లక్షలకు పైగా నష్టపోయాను’ అని ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రైతు పేరు నల్లమోతు సత్యనారాయణ. పల్నాడు జిల్లా నాదెళ్ల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 3.5 ఎకరాల్లో మొక్కజొన్న, 1.60 ఎకరాల్లో బొప్పాయి పంటలు సాగు చేశాడు. ఎకరాకు మొక్కజొన్నకు రూ.50 వేలు, బొప్పాయికి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాడు. మొక్కజొన్న ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి రాగా, క్వింటా రూ.1,600కు అమ్ముకోగా, బొప్పాయి పంటకు నాందేడ్ తెగులు సోకడంతో నాణ్యత తగ్గింది. ‘ఎకరాకు 10 టన్నులకు మించి దిగుబడులు రావడం లేదు. మార్కెట్లో కిలో రూ.10కి మించి కొనేవారు లేరు. తెగులు సోకిందంటే కిలో రూ.5కే అడుగుతున్నారు. కనీసం కిలోకు రూ.15–16 ధర వస్తే కానీ గిట్టుబాటు కాదు. గతేడాది 10 ఎకరాల్లో వంగ తోట వేసి నష్టపోయాను. ఈసారి మొక్కజొన్న, బొప్పాయి వేసి తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాను. ఏం చేయాలో పాలుపోవడం లేద’ని కన్నీటి పర్యంతమయ్యాడు. పల్నాడు జిల్లా నాదెళ్లలో తెగుళ్ల బారిన పడిన బొప్పాయి పంట (పంపాన వర ప్రసాదరావు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి చందాన తయారైంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో రైతులు గతేడాది సాగు చేసిన నల్ల బర్లీ పొగాకుతో తీవ్ర నష్టాలను మూట గట్టుకున్నారు. ఇప్పటికీ వందలాది మంది రైతుల ఇళ్లల్లో పొగాకు బేళ్లు బేలచూపులు చూస్తూనే ఉన్నాయి. మిర్చి, పత్తి పంటలకు గిట్టుబాటు ధర దక్కక ఒక్కో రైతు రూ.5–10 లక్షల వరకు నష్టపోయారు. నల్లబర్లి పొగాకు సాగు చేయొద్దు.. లాభసాటిగా ఉన్న మొక్కజొన్న, శనగ సాగు చేయండని ప్రభుత్వం ఊరూ వాడ ప్రచారం చేసింది. మరొక వైపు గతేడాది నష్టపోయిన మిర్చి, పత్తి రైతులు సైతం ఈసారి జొన్న, మొక్కజొన్న, శనగ, కంది సాగు వైపు మళ్లారు. బాపట్ల లంక గ్రామాలతో పాటు పల్నాడు జిల్లాలో సాగు చేసే టమాటా, ఉల్లి, బెండ, వంగ, గోరుచిక్కుడు, దోసకాయలు, బంగాళదుంప తదితర కూరగాయల పంటలకు కూడా గిట్టుబాటు ధర లేక దళారులకు అప్పనంగా ఇవ్వలేక రైతులు మౌనంగా రోదిస్తున్నారు. పల్నాడు జిల్లా అమీన్సాహెబ్ పాలెంలో మిర్చిని ఆరబోస్తున్న రైతులు తీపిని పంచాల్సిన పుచ్చకాయ, కర్బూజ తోటలు రైతులకు కన్నీటి చేదును మిగిలిస్తున్నాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొందని.. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కలేదని రైతులు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రకృతి ప్రకోపం వల్లనో, మార్కెట్ వైఫల్యం వల్లనో నష్టపోవడం లేదని.. ముమ్మాటికీ పాలకులు చేస్తున్న నమ్మక ద్రోహం వల్లే నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి, టమాటా వంటి పంటలకైతే కనీసం కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేక పొలాల్లోనే వదిలేస్తున్నామని తెనాలికి చెందిన ఎం.భాస్కరరావు అనే కౌలు రైతు వాపోయారు. అరటి, బొప్పాయి పంటలు కొనే వారు లేక తోటల్లోనే పక్వానికి వచ్చి రాలిపోతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మొంథా తుపాను వల్ల నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదని అయ్యారుపేటకు చెందిన పొపూరి బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను అమ్మగా వచ్చిన అరకొర ఆదాయం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని మరో కౌలు రైతు కుసుమర్తి ముసలయ్య కన్నీరు పెట్టుకున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి జలగల్లా పీలుస్తుంటే ప్రభుత్వం కళ్లున్నా చూడలేని కబోదిలా తయారైందని మండిపడుతున్నారు. మార్కెట్ యార్డులు వెలవెలఎప్పుడూ కళకళలాడే మార్కెట్ యార్డులు కొనుగోళ్లు లేక నిశ్శబ్దానికి వేదికలవుతున్నాయి. జొన్న, మొక్కజొన్న సాగు చేస్తే కొనేవారు లేక చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక హమాలీలుగా పని చేయాల్సి వస్తోందని ఐతానగర్కు చెందిన శనవం గోపిరెడ్డి వాపోయారు. పేరుకు శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా మూణ్ణాళ్ల ముచ్చటగా మూసేశారని, క్వింటాకు రూ.4,800కే దళారులకు తెగనమ్ముకుంటున్నామని రైతులు చెబుతున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారని చెప్పారు. మరొక వైపు మొక్కజొన్న రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మద్దతు ధర రూ.2,400 కాగా, మార్కెట్లో రూ.1,400 నుంచి రూ.1,650 మధ్య పలుకుతోంది. అది కూడా వ్యాపారుల కాళ్లా వేళ్లా పడితే కానీ కొనడం లేదంటున్నారు. జొన్న రైతుల పరిస్థితీ అంతే.. మద్దతు ధర క్వింటా రూ.3,749 కాగా, మార్కెట్లో రూ.1,600–1,850 మధ్య దక్కుతోంది. దాచుకునేందుకు డబ్బుల్లేక సన్న, చిన్నకారు రైతులు ఈ ధరకే అమ్ముకుని నష్టపోతున్నారు. కాస్త ఆర్థిక స్థోమత ఉన్న వారైతే గోదాముల్లో నిల్వ చేసుకుంటున్నారు.ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే⇒ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ మద్దతు ధర కోసం ఇబ్బంది పడలేదని రైతులు ముక్త కంఠంతో చెప్పారు. ఏదైనా సందర్భంగా మార్కెట్లో కాస్త ధర తగ్గితే చాలు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకునేదని గుర్తు చేస్తున్నారు. రెండేళ్లుగా ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదని వాపోతున్నారు.. చంద్రబాబు ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఉందో లేదో కూడా అర్థం కావడం లేదని వాపోయారు. ⇒ తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్క జొన్న కొనుగోళ్లకు శ్రీకారం చుడితే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేంద్రానికి లేఖలు రాస్తూ కాలయాపన చేస్తోంది. పైగా కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వకపోతే మొక్కజొన్నే కాదు ఏ పంటనూ కొనుగోలు చేయలేమని తెగేసి చెబుతుండటాన్ని రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఊడినా ఒకటేనని మండిపడుతున్నారు. ⇒ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు రైతులకు లాభసాటి ధరలు దక్కేలా చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర లభించేలా చేయడంలో విఫలమవుతోంది. ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పథకం, పంట నష్టపరిహారం వంటి పథకాలు అందక పోవడం వంటి కారణాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రెండేళ్లలో రూ.25 వేల కోట్ల సంపదను రైతులు నష్టపోయారు.గతంలో బస్తా రూ.2 వేలు పలికేది ఐదెకరాల్లో గోరు చిక్కుడు సాగు చేశా. రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 60 బస్తాలు (బస్తాకు 10 కేజీలు) దిగుబడులొచ్చాయి. మార్కెట్కు పోతే 10 కేజీల బస్తా రూ.240కు మించి కొనడం లేదు. గతంలో రూ.2 వేల వరకు ధర పలికేది. ఈసారి తీవ్రంగా నష్టపోతున్నా. – ఎరుపల్లి శ్రీనివాసరావు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాబాండ్ ఇచ్చినా..ఇబ్బందులే..ఐదెకరాల్లో వర్జీనియా పొగాకు సాగు చేశాను. ఐటీసీ బాండ్ కూడా ఇచ్చింది. రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికొచ్చేసరికి గోదాములు ఖాళీగా లేవంటూ రేపురా మాపురా అంటూ తిప్పుతున్నారు. కొనే సమయానికి నాణ్యత లేదంటున్నారు. ధర తగ్గించేస్తున్నారు. గతేడాది నల్లబర్లి సాగు చేసి నష్టపోయాం. ఈసారి వర్జీనియా సాగు చేసి ఇబ్బంది పడుతున్నాం. – మందుల నాగరాజు, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాఅప్పులోళ్లకు జమ చేశారు ఎకరం సొంత పొలం ఉంది. మరో ఎకరన్నర కౌలుకు తీసుకుని తెల్లజొన్న పంట వేశాను. ఎకరాకు రూ.30 వేలు చొప్పున రూ.75 వేల వరకు రూ.2 వడ్డీకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాను. ఎకరాకు 40 టిక్కీలు (టిక్కీ 60 కేజీలు) చొప్పున 24 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కనీస మద్దతు ధర రూ.3,749 మాట దేవుడెరుగు.. కనీసం మార్కెట్లో కొనేవారు లేరు. అప్పులోళ్లు వడ్డీల కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. చేసేది లేక క్వింటా రూ.1,850కు ఓ వ్యాపారికి తెగనమ్ముకున్నా. చేతికి రూ.44 వేలు రావడంతో దాన్ని అప్పులోళ్లకు జమ చేశాను. ఇంకా కౌలుకు చెల్లించాల్సి ఉంది. ఇంటికి పైసా కూడా తీసుకెళ్లలేదు. – పాటిపండ్ల వీరయ్య, ఐతానగరం, బాపట్ల జిల్లారెండు పంటల్లోనూ నష్టాలే..ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్ (25 కేజీలు) రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది. – కళ్లం అనిల్కుమార్ రెడ్డి, సాహెబ్పాలెం, పల్నాడు జిల్లాగోరుచిక్కుడుకూ ధర లేదు..కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు. – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లారెండు పంటల్లోనూ నష్టాలే..ఎనిమిది ఎకరాల్లో టమాటా వేశా. ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టాను. మరో 4 ఎకరాల్లో గుమ్మడి సాగు చేశాను. రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టాను. గుమ్మడి నాలుగు టన్నులొచ్చింది. టన్ను రూ.8400 ధర పలికింది టమాటా 4 వేల బాక్సులొస్తే.. బాక్స్ (25 కేజీలు) రూ.80–110 లోపే తెగనమ్ముకోవాల్సి వచ్చింది. నా చేను సమీపంలోనే మార్కెట్లో టమాటా కిలో రూ.40 తక్కువకు అమ్మడం లేదు. నాకు మాత్రం కిలో రూ.3–4 మధ్య దక్కింది. – కళ్లం అనిల్కుమార్ రెడ్డి, సాహెబ్పాలెం, పల్నాడు జిల్లాగోరుచిక్కుడుకూ ధర లేదు..కౌలుకు తీసుకున్న 10 ఎకరాల్లో గోరుచిక్కుడు, ఐదెకరాల్లో పెసలు సాగు చేశాను. వర్షాలు ఎక్కువగా పడడంతో గోరుచిక్కుడు పంట దెబ్బతింది. ఎకరాకు రూ.30 వేల చొప్పున పెట్టుబడులు పెట్టాను. గోరుచిక్కుడు 10 కేజీల బస్తా రూ.150 పలికింది. పెసలుకు పెట్టుబడి కూడా దక్కలేదు. – భవనం కోటిరెడ్డి, విఠంరాజుపల్లె, పల్నాడు జిల్లాఆ ఐదేళ్లూ... అన్నదాతకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ధర లేని ప్రతీసారీ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. వాటి ధరలు పెరిగేందుకు కృషి చేశారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి ఇవ్వకపోయినా 2019–20లో 4,17,268 టన్నులు, 2020–21లో 3,06,713 టన్నులు, 2022–23లో 73,302 టన్నుల మొక్కజొన్నను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. చివరకు ఎన్నికల వేళ రబీ 2023–24 సీజన్లో ఓ దశలో జొన్న ధర పతనమవుతుందని తెలియగానే కేంద్రం నుంచి అనుమతులు రాకున్నా మార్క్ఫెడ్ ద్వారా రూ.38.60 కోట్ల విలువైన 12,136 టన్నులు కొనుగోలు చేసి తమది రైతు ప్రభుత్వమని వైఎస్ జగన్ నిరూపించారు. -
హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ లీసా గిల్ చేత గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. విజయవాడలోని లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజాప్రతినిధులతోపాటు జస్టిస్ లీసా గిల్ కుటుంబ సభ్యులు, పంజాబ్–హరియాణ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు సీనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభంలో జస్టిస్ లీసా గిల్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి చదివి వినిపించారు. ప్రమాణస్వీకారం అనంతరం జస్టిస్ లీసా గిల్కు గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, పలువురు న్యాయవాదులు, హైకోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.త్వరలోనే పదోన్నతిపై సుప్రీంకోర్టుకి...ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రికార్డు సృష్టించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 5వ ప్రధాన న్యాయమూర్తి. పంజాబ్–హరియాణ కోటాలో జస్టిస్ లీసా గిల్ రానున్న మూడు, నాలుగు నెలల్లో పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. సోమవారం నుంచి ఆమె న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కలిసి కేసులను విచారిస్తారు -
విదేశీ పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం అర్ధరాత్రి బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లారు. రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. -
శ్రీరామ్ పరాశర@24 క్రాఫ్ట్స్
సాక్షి, అమరావతి: కళ్లు చెదిరే సెట్టింగ్స్..అద్భుతమనిపించే విజువల్స్.. ఇవి ఏ పాన్ ఇండియా చిత్రాల్లో కనిపించే దృశ్యాలు కాదండోయ్.!! ఓ యువ దర్శకుడు ఒక్కడే సినిమాకు అవసరమైన 24 క్రాఫ్ట్లను నిర్వర్తించి ఔరా అనిపించాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( ఏఐ) సాయంతో ఇంతటి అద్భుతం చేశాడు యవదర్శకుడు రామ్ పరాశర. రామాయణం పేరుతో ఆయన రూపొందిస్తున్న పౌరాణిక చిత్రం టీజర్ను ఎపిక్ రామాయణ పేరుతో ఇటీవల విడుదల చేశారు. ఐదు రోజుల్లోనే లక్షల వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. అన్నీ తానై.. టీజర్లో చూపించిన విజువల్స్, గ్రాఫిక్స్, నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు శ్రీరాముడి పాత్రను చూపించిన తీరు, యుద్ధ సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు రామ్. టీజర్లో రెండో వ్యక్తి అనే మాటే లేదు. డైరెక్షన్ నుంచి ఎడిటింగ్ వరకూ, సౌండ్ డిజైన్ నుంచి విజువల్ ఎఫెక్ట్స్ వరకూ 3డీ నుంచి యానిమేషన్ వరకు మొత్తం 24 విభాగాలను ఒక్కడే నిర్వహించి రికార్డు సృష్టించాడు. టీజర్ ప్రారంభంలో శివుడి ధనస్సు గురించి వినిపించే పవర్ఫుల్ వాయిస్ ఓవర్, ప్రేక్షకుడిని వెంటనే పురాణ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ప్రతి ఫ్రేమ్లో కనిపించే డీటైల్, గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ పాన్–ఇండియా సినిమా స్థాయిని తలపిస్తున్నాయి. అవకాశం సృష్టించుకున్నా.. ‘‘ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మా స్వగ్రామం. గుంటూరులో పెరిగాను. ప్రముఖ సంస్థలో ఐదేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను. సినిమా మీద ఆసక్తితో ఆరేళ్లకిందట హైదరాబాద్ వచ్చి దర్శకుడిగా మారాలని ప్రయత్నిస్తున్నాను. ఓ పెద్ద బ్యానర్లో దర్శకుడిగా అవకాశం వచ్చి కొన్ని రోజుల పాటు షూటింగ్ కూడా జరిగిన తర్వాత సినిమా ఆగిపోయింది. అప్పటి నుంచి అవకాశాల కోసం ఎక్కని ఆఫీసు మెట్టు లేదు. అయినా ఫలితం లేకపోవడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సాయంగా తీసుకున్నాను. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో అద్భుత రామాయణ దృశ్య కావ్యాన్ని రూపొందిస్తున్నాను. ఏఐ టూల్స్ వాడి కేవలం మూడు రోజుల్లో రూపొందించిన టీజర్కు భారీ స్పందన వస్తోంది.’’ –శ్రీ రామ్ పరాశర బొమ్మకంటి. -
బాబు సర్కారులో 'డిస్కం' లు ఢమాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జాతీయ స్థాయిలో ‘ఏ’ గ్రేడ్లో నిలిచేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో వాటి ర్యాంకింగ్ దారుణంగా పడిపోతోంది. ఇటీవల విడుదలైన జాతీయ ర్యాంకింగ్లలోనూ వెనుకబడి ‘బీ’ గ్రేడుతో సరిపెట్టుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) శుక్రవారం విడుదల చేసిన 2024–25 డిస్కంల పనితీరు నివేదిక రాష్ట్ర విద్యుత్ రంగంలోని లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. రాష్ట్ర విద్యుత్ రంగం తిరోగమనంలో ఉందనడానికి ఈ నివేదికలోని చాలా అంశాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2026–27లో చేయాల్సిన మార్పులపై ‘భవిష్యత్ వనరుల ప్రణాళిక’ ద్వారా ఏపీఈఆర్సీ సూచనలు చేసింది. ఇవీ ప్రధాన లోపాలు.. » విద్యుత్ వినియోగంలో తగ్గుదల, ప్రాజెక్టుల అమలులో ఆలస్యం, పెట్టుబడుల వినియోగంలో వైఫల్యం వంటి అంశాలు డిస్కంల వైఫల్యాలను ప్రతిబింబిస్తున్నాయి. » ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను తీసుకోవడానికి చేసుకున్న ఒప్పందం ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. అలాగే, కడపలోని 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఇంత వరకూ పూర్తి కాలేదు. » రాష్ట్రంలో పరిశ్రమల విద్యుత్ వినియోగం గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా హెచ్టీ ఇండస్ట్రీ విభాగంలో ఏపీఎస్పీడీసీఎల్లో 17 శాతం, ఏపీఈపీడీసీఎల్లో 21 శాతం తగ్గుదల నమోదవ్వడం రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాల మందగమనానికి సంకేతం. పరిశ్రమలు మూతపడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. » డిస్కంల పరిధిలో మొత్తం విద్యుత్ అమ్మకాలు కూడా తగ్గాయి. అంటే ఆ మేరకు విద్యుత్ వినియోగం తగ్గింది. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 9.82 శాతం వరకు విద్యుత్ వినియోగం తగ్గుదల నమోదవడం గమనార్హం. విశాఖపట్నం వంటి ఆర్థిక రాజధాని ఈ డిస్కం పరిధిలోనే ఉంది. అయినప్పటికీ ఇక్కడ విద్యుత్ అమ్మకాలు పడిపోవడం రాష్ట్ర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. » డిస్కంలు పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు లక్ష్యాలను మించి సాధించినప్పటికీ, వినియోగ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించలేకపోయాయి. ఆ లోటును రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికెట్ల (ఆర్ఈసీ) కొనుగోలుతో భర్తీ చేయడం వ్యవస్థలో లోపాలను సూచిస్తోంది. » ఆమోదించిన మూలధన వ్యయం ప్రణాళికల ప్రకారం డిస్కంలు ఖర్చు చేయడంలో విఫలమయ్యాయి. ఏపీఈపీడీసీఎల్లో రూ.3,293 కోట్లకు బదులు కేవలం రూ.1,058 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఏపీసీపీడీసీఎల్లో రూ.2813 కోట్లలో సగానికి తక్కువే వెచ్చించారు. » విద్యుత్ మిగులు, ఖర్చుల వివరాలు, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాల్లో డిస్కంలు పూర్తి పారదర్శకత పాటించడం లేదని వివిధ వర్గాల ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణలో ఆరోపించారు. దీంతో భవిష్యత్లో ఖర్చుల వివరాలను మరింత స్పష్టంగా ఇవ్వాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. -
జగన్ విజన్తోనే లోకల్ క్యాడర్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించే లోకల్ క్యాడర్ వ్యవస్థ గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకుంది. తాజాగా కూటమి ప్రభుత్వం దీని అమలుకు గెజిట్ జారీ చేసినా ఆ ఆలోచన, ప్రణాళిక వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. 2022లో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాక అందుకనుగుణంగా లోకల్ క్యాడర్ వ్యవస్థను రూపొందించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. దానికి గతేడాది డిసెంబర్లో ఆమోదం లభించడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన గెజిట్ను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా 1975 నాటి పాత లోకల్ క్యాడర్ విధానమే కొనసాగింది. రాష్ట్రాన్ని జోన్లుగా విభజించి ఉద్యోగాలను భర్తీ చేసేవారు. ఒక జిల్లాకు చెందిన అభ్యర్థి తన జోన్లోని అనేక జిల్లాల అభ్యర్థులతో పోటీ పడాల్సి వచ్చేది. స్థానికత ఉన్నప్పటికీ అది విస్తృత పరిధిలో ఉండడంతో చాలామందికి అవకాశాలు తగ్గిపోయేవి. రాష్ట్రం విడిపోయాక 2014–19లో జిల్లాలను విభజించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. కొత్త లోకల్ క్యాడర్ ఏర్పాటు ఈ పరిస్థితిని మార్చడానికి 2022లో వైఎస్ జగన్ జిల్లాలను పునర్వ్యవస్థీకరించారు. రాష్ట్రాన్ని 13 నుంచి 26 జిల్లాలుగా విభజించడం ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేశారు. అదే సమయంలో ఉద్యోగాల విషయంలో స్థానికతను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించి 2023లో కొత్త లోకల్ క్యాడర్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు పోస్టులను పూర్తిగా జిల్లా యూనిట్గా మార్చారు. తద్వారా ఏ జిల్లాలోని ఉద్యోగాల్లో ఆ జిల్లాకే చెందిన అభ్యర్థులకే ఎక్కువ అవకాశం లభించేలా చేశారు. ఆపై ఉన్న పోస్టులకు జోన్, మల్టీ జోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానంగా 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయడం ద్వారా ఉద్యోగాలపై స్థానికులకు బలమైన హక్కు కల్పించారు. అంతకుముందు ఉన్న విధానంలో 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే స్థానిక రిజర్వేషన్ ఉండేది. మిగిలిన పోస్టులకు జోనల్ పరిధిలో ఎక్కువ పోటీ ఉండేది. కొత్త విధానంలో 95 శాతం లోకల్ రిజర్వేషన్ పెట్టడం ద్వారా యువతకు మరింత భద్రత కల్పించారు. 2023లో కేంద్రానికి పంపిన జగన్ ప్రభుత్వం.. తాజాగా ఆమోదం ఈ విధానాన్ని రూపొందించినా దాన్ని అమలు చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం. స్థానికత, లోకల్ రిజర్వేషన్ అంశాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి పరిధిలోకి వచ్చే అంశాలు కావడంతో కేంద్ర హోంశాఖ పరిశీలనతో పాటు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 2023లో లోకల్ క్యాడర్ వ్యవస్థ ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి పంపింది. ఆ ప్రతిపాదనలను గతేడాది డిసెంబర్ 15న రాష్ట్రపతి ఆమోదిస్తూ ఆర్డర్ జారీ చేశారు. దీంతో దాన్ని అమలు చేయడానికి వీలుగా ఈ నెల 20న కూటమి ప్రభుత్వం రాష్ట్రపతి ఆర్డర్ను జీవో ఎంఎస్ నంబర్ 45 ద్వారా రాష్ట్ర గెజిట్లో ప్రచురించింది. దీంతో ఈ విధానం అధికారికంగా అమల్లోకొచి్చంది. ఈ లోకల్ క్యాడర్ వ్యవస్థకు రూపకల్పన, విధానం, స్థానిక రిజర్వేషన్ జగన్ ప్రభుత్వం ఉండగా చేసిన నిర్ణయాలే. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నుంచి లోకల్ క్యాడర్ డిజైన్ వరకు జరిగిన ప్రతి కీలక దశ అప్పట్లోనే పూర్తయింది. అయితే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర ఆమోదం రావడంతో ఇప్పుడు గెజిట్లో ప్రచురణ జరిగింది. నిరుద్యోగ యువతకు భరోసా రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఇది భరోసానిచ్చే విషయం. తమ జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశాలు పెరిగాయి. స్థానిక పోటీ పరిమితమవడం వల్ల గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు మరింత అనుకూలంగా మారింది. మొత్తంగా చూస్తే జగన్ హయాంలోనే రూపుదిద్దుకుని ఇప్పుడు అమల్లోకి వచ్చిన లోకల్ క్యాడర్ వ్యవస్థ ఒక తరం భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్మాణాత్మక సంస్కరణ అని నిపుణులు చెబుతున్నారు. -
మద్యం అక్రమ కేసులో ఈడీ సోదాలు
సాక్షి, అమరావతి: మద్యం విధానంపై అక్రమ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, హైదరాబాద్లోని పలువురి నివాసాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ఈ కేసు నమోదు చేసింది. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, హైదరాబాద్లోని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, రిటైర్డ్ అధికారి కృష్ణమోహన్రెడ్డి, మరికొందరి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, ఆయన సమీప బంధువు నివాసంలోనూ సోదాలు చేశారు. పది మంది ఇళ్లలో దాడులు జరిగాయి. అందరి ఇళ్ల వద్ద ఈడీ అధికారులకు అన్ని విధాలుగా సహకరించడంతో వారు సోదాలు పూర్తి చేసుకుని వెళ్లారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు వారు అడిగిన డాక్యుమెంట్లు అందజేసినట్లు తెలిసింది. అడిగిందే అడుగుతూ రొటీన్ ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సోదాల్లో పెద్దగా ఏమీ లభించలేదని తెలిసింది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ మద్యం విధానంపై ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగానే ఈడీ కూడా కేసు నమోదు చేసిన క్రమంలో శుక్రవారం సోదాలు కొనసాగించారు. -
నేడు వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి దళిత గళ సమ్మేళనం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి దళిత గళ సమ్మేళనం శనివారం నిర్వహిస్తున్నట్లు పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావులు తెలిపారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. -
సర్కారు ఆస్పత్రుల్లో సంకటం
విజయవాడ జీజీహెచ్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూత వేటు దూరంలో ఉండే విజయవాడ జీజీహెచ్లో రోగులే సిరంజీలు, దూది, మందులు, సర్జికల్ పరికరాలను బయట కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొంది. ఇక్కడే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్స్కు తీవ్ర కొరత పరిస్థితులు దాపురించాయి. ఆస్పత్రులకు ప్రభుత్వం సరిపడా మందులు, సర్జికల్స్ను సరఫరా చేయకపోవడంతో బయట కొనుక్కోవాలని సిబ్బంది చీటీలు రాసి పంపుతున్నారు. దీంతో దారి ఖర్చుల కోసం తెచ్చుకున్న పదీ పరకా ఖర్చయిపోయి పరామర్శకు వచ్చిన బంధువులు, స్నేహితులను అప్పు కోసం చేయి చాపాల్సి వస్తోందని రోగులు, కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. పీహెచ్సీల్లో 214, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో 417, జిల్లా, బోధనాస్పత్రుల్లో 712 రకాల చొప్పున మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఏ ఒక్క చోటా నిర్దేశించిన మేరకు లేవు. ఇక వైద్య రంగంలో అత్యంత కీలకమైన బోధనాస్పత్రుల్లో 372 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. వీటికి కూడా తీవ్ర సంక్షోభం నెలకొంది. మందులు, సర్జికల్స్ కొరత నేపథ్యంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ‘సాక్షి’ విజయవాడ జీజీహెచ్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులను పరిశీలించింది. చేతిలో చీటీలతో ఆస్పత్రి ప్రాంగణంలోని ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ వద్ద రోగులు, వారి సహాయకులు తండోపతండాలుగా క్యూ కట్టి కనిపించారు. బీపీ బిళ్లలు, నాజల్ డ్రాప్స్, సిరంజిలు, కాటన్, ఎగ్జామినేషన్ గ్లౌజ్లు, రక్త నమూనాలు సేకరించే ట్యూబ్లు, సర్జికల్, బ్లడ్ థిన్నర్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన వివిధ రకాల మందులు బయట కొనుక్కోవాలని చీటీలు రాయడంతో రోగులపై రూ.300 నుంచి రూ.వేలల్లో భారం పడుతున్నట్టు వెల్లడైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జీజీహెచ్లలో ఇదే దుస్థితి నెలకొంది. ఈ మందులు బయట కొనుగోలు చేసుకోవాలంటూ చీటీల్లో టిక్ పెట్టిన విజయవాడ జీజీహెచ్ సిబ్బంది » గుంటూరు జీజీహెచ్లో బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ల చికిత్సల్లో వినియోగించే ఎస్సెన్షియల్ యాంటిబయోటిక్స్ కొరత వేధిస్తోంది. బీ–కాంప్లెక్స్, ఎకోస్ప్రిన్, మల్టీ విటమిన్ మాత్రలు సరిపడా ఉండటం లేదు. న్యూరాలజీ, కార్డియాలజీ లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో గతంలో నెల, రెండు నెలలకు సరిపడా ఇచ్చిన మందులను తీవ్ర కొరత నేపథ్యంలో ఇప్పుడు వారం, పది రోజులకు సరిపడా మాత్రమే ఇస్తున్నారని రోగులు ఫిర్యాదు చేస్తున్నారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా సెకండరీ హెల్త్ ఆస్పత్రులను మందులు, సర్జికల్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. » ఉత్తరాంధ్రలో ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా సక్రమంగా లేకపోవడం కిడ్నీ వ్యాధిగ్రస్తుల పాలిట శాపంగా మారుతోంది. డయాలసిస్ రోగులకు అవసరమైన కాల్సిట్రియోల్, ఫెబుక్సోస్టాట్, సోడియం బైకార్బొనేట్, కోర్తలిడన్, విటమిన్, టోర్సెమైడ్ లాంటి మందులను రోగులే బయట కొనుక్కోవ్సాలిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖ కేజీహెచ్లో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేవు. సర్జికల్స్ మెటీరియల్స్కు తీవ్ర కటకట నేపథ్యంలో గాయాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు డ్రెస్సింగ్ కోసం అవసరమైన మందులు, సూదులు, కిట్స్ కూడా బయటకు రాస్తున్నారు. ఇమ్యూనోగ్లోబులిన్స్, వెంటిలేటర్ కిట్స్, ఆక్సిజన్ పైపులు, గుండె వ్యాధులకు వాడే మందులకు కొరత ఏర్పడింది. కర్నూలు, అనంతపురం, తిరుపతిల్లోని బోధనాస్పత్రుల్లోనూ మందులు, సర్జికల్స్కు తీవ్ర కొరత ఉంది. సర్జికల్స్ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్యులు చెబుతున్నారు. » సీఎం సొంత జిల్లా చిత్తూరువ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో బీపీ, విటమిన్, విరేచనాలు, జలుబు, దగ్గు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం వాడే మందులకు కొరత నెలకొంది. ఎసిడిటీ, గ్యాస్ సమస్యల కోసం వాడే రాంటాక్ బిళ్లలు కూడా కొన్ని చోట్ల అందుబాటులో లేక బయట కొనుక్కోవాలని చెబుతున్నారు. » కుక్క కాటుకు పీహెచ్సీల్లో ఇచ్చే ఏఆర్వీ వ్యాక్సిన్తో పాటు క్యాల్షియం, విరోచనాలు, బీపీ, గ్యాస్ మాత్రలు, జలుబు, దగ్గు సిరప్ల నిల్వలు నామమాత్రంగా కూడా లేవు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే పరిస్థితి గ్రామ స్థాయిలోని విలేజ్ క్లినిక్స్లోనూ నెలకొంది.సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఖాళీ..!చంద్రబాబు గద్దెనెక్కాక ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. మందులు, సర్జికల్స్ కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ ఏమాత్రం సరిపోవడం లేదని సూపరింటెండెంట్లు, వైద్య శాఖ పదే పదే మొత్తుకుంటున్నా ప్రభుత్వం అదనపు బడ్జెట్ ఇవ్వడం లేదు. 2025–26లో కేటాయించిన బడ్జెట్ మూడు క్వార్టర్లకే ఖర్చయిపోవడంతో అదనంగా రూ.100 కోట్లకుపైగా కేటాయించాలని వైద్య శాఖ అభ్యర్థించింది. ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా అదనంగా విదల్చకపోవడంతో ఇతర బడ్జెట్ను అరకొరగా సర్దుబాటు చేసి డిసెంబర్, జనవరి నెలల్లో ఇవ్వాల్సిన పర్చేజ్ ఆర్డర్లను ఏపీఎంఎస్ఐడీసీ ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చింది. 2025–26 చివరి క్వార్టర్ మందులే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్(సీడీఎస్)కు పూర్తి స్థాయిలో చేరని దుస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేయాల్సిన సీడీఎస్లలో నిల్వలు తరిగిపోయాయి. ఏలూరు జీజీహెచ్లో మందుల కొరతపై ఇటీవల తీవ్ర వివాదం నెలకొంది. ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్కు సంబంధించిన మందులు, సర్జికల్స్ సరఫరా కోసం మార్చి నెలలోనే ఇండెంట్లు తీసుకుని పీవో (పర్చేజ్ ఆర్డర్) జారీ చేయాలి. ఏప్రిల్ ముగుస్తున్నా ఇంకా ఇండెంట్లు తీసుకునే ప్రక్రియ ముగియ లేదు. రాష్ట్రంలోని అన్ని సీడీఎస్ (సెంట్రల్ డ్రగ్ స్టోర్స్)లలో శుక్రవారం నాటికి 712 రకాల మందులకు గాను 150–400 రకాలు నిల్వలు లేవు. పశ్చిమ గోదావరి సీడీఎస్లో 300 లోపు మందులే ఉన్నట్లు సమాచారం. సీఎం సొంత జిల్లాలోని చిత్తూరు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం సీడీఎస్లలో 400 లోపు రకాల మందుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆస్పత్రులకు మందుల సరఫరాలో సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. కిడ్నీ బాధితులకు ఎంత కష్టం..ఉద్దానం కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో బాధితుల వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యమిస్తూ క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ) కింద ప్రత్యేకంగా పీహెచ్సీలు, ఇతర ప్రభుత్వాస్పత్రులకు నాణ్యమైన, ఖరీదైన మందులను సరఫరా చేసింది. కూటమి సర్కారు వచ్చాక సీకేడీ మందుల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఒక్కో కిడ్నీ బాధితుడిపై మందుల కొనుగోళ్ల రూపంలో నెలకు రూ.15 వేల మేరకు భారం పడుతోంది. కిడ్నీ బాధితులకు మెరుగైన వైద్య సేవల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం నెలకొల్పిన పలాస కిడ్నీ కేర్ సెంటర్ను కూటమి సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. మందులు, సర్జికల్స్ను సక్రమంగా సరఫరా చేయడం లేదు. డయలైజర్ల కొరత నెలకొంది. డయాలసిస్ రోగులు వీటిని బయట కొనుగోలు చేసేందుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. సప్లయ్ లేదంటున్నారు2019లో నాకు కిడ్నీ జబ్బు బయటపడింది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నా. గత ప్రభుత్వం ఉచితంగా మందులు ఇచ్చేది. ఏడాదికిపైగా మందులు ఇవ్వడం లేదు. ఆస్పత్రుల్లో అడిగితే సప్లయ్ లేదంటున్నారు. కూలికి పోతే గానీ పూటగడవని పరిస్థితి మాది. బయట కొనేందుకు ప్రతి నెలా రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. ఎంతో కష్టంగా ఉంది. – కూర్మారావు, కిడ్నీ బాధితుడు, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాప్రతిసారి బయటే కొంటున్నాంమా మనవడికి పుట్టుకతోనే కాళ్ల వంకర సమస్య ఉంది. చికిత్స కోసం తరచూ జీజీహెచ్కు వస్తుంటాం. ప్రతిసారి బాబుకు డ్రెస్సింగ్ మెటీరియల్ బయటే కొంటున్నాం. – మేరీ, మైలవరంబీపీ బిళ్లలు బయట కొన్నామా అమ్మ నరాల సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. విజయవాడ జీజీహెచ్లో అడ్మిట్ చేస్తే బీపీ బిళ్లలు బయట కొనుక్కోమని చీటీ రాసిచ్చారు. – సుబ్బారావు, మంగళగిరిపెద్దాస్పత్రిలోనూ అంతే..వారం కిందట వడదెబ్బ తగలడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లా. వైద్యులు రాసిన మందుల చీటితో కౌంటర్కు వెళితే రెండు రకాల మందులు బయట కొనుక్కోమన్నారు. స్థానిక పీహెచ్సీలో వైద్యం సరిగా లేదని వ్యయప్రయాసలకోర్చి పెద్దాస్పత్రికి పోతే అక్కడా అదే తంతు. – మహేశ్వరి, వీరకనెల్లూరు, చిత్తూరు జిల్లావిజయవాడ వన్టౌన్ గొల్లపాలెంగట్టులో నివసించే శ్రీనివాసరావు కార్పెంటర్గా జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య సమస్యతో విజయవాడ జీజీహెచ్కు రావడంతో సీటీ స్కాన్ చేశారు. రిపోర్ట్ ఆధారంగా వైద్యులు ఆరు రకాల ఔషధాలు సూచించారు. మందుల కౌంటర్కు వెళితే మూడు రకాలు బయట కొనుక్కోవాలని చెప్పారు. దీంతో జీజీహెచ్ ప్రాంగణంలోని ప్రైవేట్ మెడికల్ షాప్లో మందులు కొన్నాడు. ‘ఉచిత వైద్యం చేస్తారని ప్రభుత్వాస్పత్రికి వస్తే మందుల కోసం రూ.300కిపైనే ఖర్చయింది. సీటీ స్కాన్ ఫిలిమ్ కోసం మరో రూ.300 తీసుకున్నారు. రిపోర్ట్ వాట్సప్లో పెట్టిస్తే చాలని డాక్టర్ చెప్పారు. అలా పెట్టం అని రూ.300 వసూలు చేశారు. నా ఒకరోజు సంపాదన మందులు, రిపోర్టులకే ఖర్చయిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక్కడ కనిపిస్తున్న వృద్ధురాలు లక్ష్మి స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు. వ్యవసాయ కూలీ. కొన్నేళ్లుగా గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్న ఆమె భర్త రమణ తీవ్ర అనారోగ్యం పాలవడంతో వారం క్రితం విజయవాడ జీజీహెచ్లో అడ్మిట్ చేశారు. ‘కాళ్లావేళ్లా పడితే బుధవారం ఐసీయూకు మార్చారు. బీపీ బిళ్లలు కూడా బయటే కొన్నాం. ఇప్పుడు సిరంజీలు కూడా బయట కొనాలంటున్నారు. పొలం పనులు చేసుకుని జీవించే వాళ్లం. ఉచిత వైద్యం కోసం వస్తే మాతోనే డబ్బు ఖర్చు పెట్టిస్తున్నారు..’ అని బోరుమంది.కమీషన్ల రోగం..రోగుల ప్రాణాలతో చెలగాటం» రాష్ట్రవ్యాప్తంగా వేధిస్తున్న వెంటిలేటర్ల కొరత » విజయవాడలో 80కు గాను అందుబాటులో కేవలం 35 మాత్రమే.. తిరుపతి రుయాలో 60 వెంటిలేటర్లు మరమ్మతులకు.. » కమీషన్లు ఇచ్చే కంపెనీకే కాంట్రాక్టు ఇవ్వడానికి టెండరు ప్రక్రియ సాగదీతసాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తి పరాకాష్టకు చేరుతోంది. పేద రోగుల ప్రాణాల కంటే కమీషన్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు హోరెత్తుతున్నాయి. ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఓ పక్క వెంటిలేటర్ల కొరత తీవ్రంగా వేధిస్తుంటే మరోపక్క కొత్తవి కొనుగోలు విషయంలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కృష్ణాజిల్లా మచిలీపట్నం జీజీహెచ్లోని అనస్తీషియా విభాగంలో మూడు వెంటిలేటర్లు ఉంటే వాటిలో రెండు పనిచేయడంలేదు. దీంతో అత్యవసర కేసులను విజయవాడ జీజీహెచ్కు రిఫర్ చేస్తున్నారు.అలాగే విజయవాడ జీజీహెచ్లో 80 వెంటిలేటర్ల అవసరం ఉండగా, 35 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని పనిచేయని దుస్థితి. తిరుపతి రుయాలో 120 వెంటిలేటర్లు ఉంటే 60 మరమ్మతులకు గురయ్యాయి. ఇక్కడ 100 వరకూ వెంటిలేటర్ల అవసరం ఉంది. కర్నూలు జీజీహెచ్లో 369 ఉంటే, 191 పనిచేయడంలేదు. ఇక్కడ కొన్ని నెలలుగా 70 వెంటిలేటర్లు సమకూర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా పట్టించుకోవడంలేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కొత్త, పాత బోధనాస్పత్రులను వెంటిలేటర్ల కొరత సమస్య తీవ్రంగా వేధిస్తుంటే అస్మదీయ సంస్థలకు కాంట్రాక్టును కట్టబెట్టేందుకు ఏడాదికి పైగా టెండరు ప్రక్రియను ప్రభుత్వ పెద్దలు సాగదీస్తున్నారు.తిరస్కరించిన కంపెనీల అర్హత కోసం..2024లో ప్రభుత్వాస్పత్రుల్లో వెంటిలేటర్ల కొనుగోలు కోసం ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)కి ప్రతిపాదనలు వెళ్లాయి. గతేడాది జనవరిలో టెండర్లు పిలిచారు. అయితే దానిని రద్దుచేశారు. అనంతరం.. గతేడాది డిసెంబరులో వెంటిలేటర్ల కోసం ప్రత్యేకంగా టెండరు పిలిచారు. బిడ్ల మదింపు అనంతరం అర్హత సాధించిన ఎనిమిది సంస్థల పరికరాలకు ఈనెల 7, 8 తేదీల్లో డెమో నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థ తెచ్చిన పరికరాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఇవి ప్రమాణాల మేరకు లేవని, రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని వైద్యుల బృందం కుండబద్దలుకొట్టి తిరస్కరించినట్లు సమాచారం. అయితే, వైద్యశాఖ ఉన్నతాధికారే రీ–డెమో పెట్టి తిరస్కరించిన పరికరాలన్నింటినీ ఆమోదించాలని ఆదేశించారు. ఈనెల 28న రీ–డెమో నిర్వహణకు కార్పొరేషన్ సమాయత్తమైనట్లు సమాచారం. అవసరం లేకున్నా..కమీషన్ల కోసం గతేడాది పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ పరికరాలను అవసరం లేకపోయినా బోధనాస్పత్రులకు పెద్ద మొత్తంలో డంప్ చేశారు. రూ.9 కోట్లు విలువచేసే 80 పరికరాలను డీఎంఈ ఆస్పత్రులకు ఆర్డర్ పెట్టారు. వైద్యసేవలతో ఏమాత్రం ప్రమేయంలేని, కళాశాలల్లో కూడా డిమాండ్ లేని ఈఎన్టీ సిమ్యులేటర్ల కొనుగోలు రూపంలో మరో కుంభకోణానికి తెరలేపారు. ఏకంగా ఒకే కంపెనీ పరికరాలను సరఫరా చేసేలా దాని అనుబంధ సంస్థలు రెండు టెండర్లు వేస్తే వాటిని ఆమోదించి, కాంట్రాక్టును అవార్డు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. -
న్యాయ వ్యవస్థకు చీఫ్ జస్టిస్ ఠాకూర్ సేవలు నిరుపమానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ ఠాకూర్కు వీడ్కోలు పలికేందుకు న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తొలుత ప్రసంగిస్తూ, న్యాయవ్యవస్థకు జస్టిస్ ఠాకూర్ అందించిన సేవలను కొనియాడారు. ‘జస్టిస్ ఠాకూర్ ఏపీ హైకోర్టులో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. జ్యుడీషియల్ అకాడమీ, హైకోర్టు జడ్జిల అతిథి గృహాల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. 38 కోర్టు భవనాలను ప్రారంభించారు. అలాగే న్యాయవ్యవస్థలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టారు. 3,482 పోస్టులను భర్తీ చేశారు. న్యాయాధికారుల ఖాళీలను సైతం భర్తీ చేశారు’ అని పేర్కొన్నారు. ఆయన విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో జస్టిస్ ఠాకూర్ కుటుంబ సభ్యులు, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, పలువురు ప్రభుత్వ న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ ఠాకూర్ దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం శాలువాలతో సత్కరించి, చిత్ర పటాన్ని బహూకరించిందిస్వతంత్ర న్యాయ వ్యవస్థ పౌరుడి హక్కుచీఫ్ జస్టిస్ ఠాకూర్ భావోద్వేగ ప్రసంగంకార్యక్రమం చివరిలో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడటానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 5 నిమిషాల పాటు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. అనంతరం ఆయన ప్రసంగం ఆద్యంతం భావోద్వేగంతోనే కొనసాగింది. స్వతంత్ర న్యాయవ్యవస్థ అన్నది న్యాయమూర్తి ప్రత్యేక హక్కు కాదని, అది ఈ దేశ పౌరుడి హక్కు అని చెప్పారు. న్యాయవ్యవస్థ విలువను కాపాడటానికే తాను ప్రయత్నించానని తెలిపారు. తాను న్యాయవాద వృత్తిని ఓ జీవన విధానంగా భావించిన కుటుంబంలో జన్మించినందుకు అదృష్టవంతుడినన్నారు. తన తండ్రి, సోదరుడి రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించే విషయంలో సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు అధికారులు, ఉద్యోగులు ఎంతగానో సహకరించారన్నారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. నేడు సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణంరాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణం చేయనున్నారు. శనివారం సాయంత్రం విజయవాడలోని లోక్భవన్లో జరిగే కార్యక్రమంలో ఆమెతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, పంజాబ్–హర్యానా హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ గిల్ కుటుంబసభ్యులు, బంధువులు, న్యాయవాదులు పాల్గొననున్నారు. న్యాయమూర్తుల గౌరవార్థం గవర్నర్ జస్టిస్ నజీర్ విందు ఏర్పాటు చేశారు. -
సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం : సజ్జల
సాక్షి,తాడేపల్లి: కూటమి పాలనలో వ్యవసాయం రంగం సంక్షోభంలో చిక్కుకుందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతు సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాబు ధరలేదు. అధికార పార్టీ, దళారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారు. సమస్యలు గాలికొదిలేసి మంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారని’ధ్వజమెత్తారు. రైతు విభాగం సమావేశంలో వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురామ్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు సహా రైతు విభాగం నేతలు పాల్గొన్నారు. -
‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?’
సాక్షి, తాడేపల్లి: ‘‘చంద్రబాబూ.. డైవర్షన్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?.. ప్రజల కష్టాలు, రైతుల కన్నీళ్లు మీకు కనపడవా?’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొక్కజొన్న, ధాన్యం, పత్తి, మిర్చి.. ఇలా ఏది చూసినా గిట్టుబాటు ధరల్లేవు. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా?. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే నేతలు కేంద్రం నుండి ఏం సహాయం పొందారు?’’ అంటూ శైలజానాథ్ నిలదీశారు.‘‘ప్రజా సమస్యలు పక్కన పెట్టి, తిరుమల లడ్డూపై సంవత్సరన్నర పాటు అనవసర వివాదం చేశారు. పదో తరగతి పరీక్ష పేపర్ల స్పాట్ వాల్యూషన్ కూడా సరిగా చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వక విద్యాసంస్థలు పిల్లలను వేధిస్తున్నాయి. హాస్టళ్ల దుస్థితి, నిరుద్యోగుల సమస్యలు, శాంతి భద్రతలకు విఘాతం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్యతో జనం అల్లాడి పోతున్నారు. కానీ ప్రభుత్వానికి ఇవేమీ కనపడటం లేదు’’ అంటూ సాకే శైలజానాథ్ దుయ్యబట్టారు.‘‘ప్రజా సమస్యలు, దళితులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. ప్రజల ఆస్తుల్ని దోచుకోవటమే సంపద సృష్టా?. మావిగన్ ప్రతిపాదనకు సమాధానం చెప్పకుండా దూషణలు ఎందుకు?. రాయలసీమలో రైతులు నీటి కోసం కష్టాలు పడుతున్నారు. కానీ అమరావతిలో నీటిని తోడటానికే కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బు రాయలసీమలో ఖర్చు పెడితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. కానీ చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు చేసి అమరావతిలోనే పెట్టటం అన్యాయం. అమరావతి అప్పులు రాయలసీమ వాసుల మీద పడుతున్నాయి. రాష్ట్రంలో యధేచ్చగా భూదోపిడీ జరుగుతోంది. దేవాదాయ భూములను కూడా పరిశ్రమలకు ఎలా ఇస్తారు?’’ అంటూ శైలజానాథ్ ప్రశ్నించారు. -
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్లు..: హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీస స్థాయిలో స్పందించడం లేదని హైకోర్టు మండిపడింది. ఐఏఎస్ అధికారులు వేధిస్తున్నా, ఖజానాకు నష్టం చేకూరుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. ఐఏఎస్ అధికారులకు చట్టం అన్నా, కోర్టు ఆదేశాలన్నా కనీస స్థాయిలో కూడా గౌరవం లేదంది. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కుటుంబాలు ఓ చోట, వీరు మరో చోట జీవితాన్ని వెళ్లదీస్తున్నారని తెలిపింది. అయితే ఐఏఎస్ అధికారులు మాత్రం శుక్ర, శనివారాల్లో విమానాల్లో హైదరాబాద్కు వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించింది. ఆయా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో కోర్టు చూస్తూనే ఉందని వ్యాఖ్యానించింది. చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ (సీసీఎస్టీ) బాబు అహ్మద్ తమను అనేక రకాలుగా వేధిస్తున్నారని, పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం మరోసారి విచారణ జరిపారు. ‘ఇలాంటి అధికారుల విషయంలో మెతక, ఉదాసీన వైఖరిని అవలంభించలేం. బాబు అహ్మద్ ప్రజలకు ఉచిత సేవ చేయడం లేదు. ఆయన ప్రతీ నెలా 1వ తేదీన ఠంచనుగా జీతం తీసుకుంటున్నారు. మాకే అధికారం ఉంటే తక్షణమే ఆయనను సస్పెండ్ చేసేవాళ్లం. అహ్మద్పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి, ఆధారాలుంటే ఆయనను సర్వీసు నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తాం’ అని న్యాయమూర్తి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. పదోన్నతుల ఫైళ్లను తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడం కాదా? తొలుత విచారణ పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ బాబు అహ్మద్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అహ్మద్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. పదోన్నతుల విషయంలో ప్యానల్ ఇయర్ ముగియడంతో తిరిగి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఎప్పుడో డీపీసీ పూర్తయితే ప్యానల్ ఇయర్ ముగిసేంత వరకు ఎందుకు పదోన్నతులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇందుకుగాను అహ్మద్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)నిసూటిగా ప్రశ్నించారు. పదోన్నతులకు సంబంధించిన ఫైళ్లను ఐఏఎస్ అధికారులు తొక్కిపెట్టడం ఉద్యోగులను వేధించడం కాదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టుకు పిలిపిస్తేనే అన్నీ సర్దుకుంటాయన్నారు. గతంలో ఓ కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు ధర్మాసనం ఇదే అహ్మద్ను భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించిందని గుర్తు చేశారు. పదోన్నతుల విషయంలో గత డిసెంబర్లో ఈ కోర్టు ఆదేశాలిస్తే ఇప్పటి వరకు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. -
డీఎస్సీలో ‘డీల్స్’!
డీఎస్సీలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి.. నాన్–లోకల్ కోటాలో బయట జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేశారు. నాన్ లోకల్లో పోటీపడే వారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలు దిగువన ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలో నాన్లోకల్ కోటాలో పోస్టు కట్టబెట్టేశారు. ఈ విషయం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ–2025 పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాల దందా రాజ్యమేలింది. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ... నకిలీ ధ్రువపత్రాలతో అనర్హులకు చంద్రబాబు సర్కార్ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ‘ముఖ్య’నేతకు బంధువుగా చెప్పుకుంటూ క్రీడాశాఖలో కీలక పదవిని అనుభవిస్తున్న వ్యక్తి ఈ వసూళ్ల దందాలో మాస్టర్ మైండ్గా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం కొందరు అభ్యర్థులతో డీల్ కుదుర్చుకుని ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే జీవోలో అప్రాధాన్య నేషనల్ గేమ్స్ను చేర్చారని స్పష్టం చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే వ్యూహాత్మకంగా క్రీడా విధానం (స్పోర్ట్స్ పాలసీ) 2024–25 ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో సరుకులు మాదిరిగా విక్రయించినట్లు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 421 డీఎస్సీ పోస్టులను క్రీడా కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేయడం ఒక ఎత్తయితే.. భారీగా ముడుపులు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టడం మరో ఎత్తు. క్రీడా విధానం రూపకల్పన సమయంలో అక్రమాలకు తెర తీస్తూ జీవో నంబర్ 4లో స్పోర్ట్స్ ప్రాధాన్యతలను ఇవ్వడం.. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాధాన్యతలను మార్పు చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జీవితాలతో చంద్రబాబు సర్కారు గేమ్స్ ఆడిందని అభ్యర్థులు వాపోతున్నారు. సీబీఐతో విచారణకు డిమాండ్..కొన్ని క్రీడా సంఘాలను భయపెట్టి క్రీడాకారుల పోస్టులకు అనుగుణంగా అవసరమైన పత్రాలు రూపొందించడంలో మాస్టర్ మైండ్ చక్రం తిప్పారు. ఈ అవినీతి బాగోతాన్ని నడిపించడంలో క్రీడా ప్రాధికార సంస్థలోని ఓ డీఎస్డీవో రేయింబవళ్లు మాస్టర్మైండ్కు సహాయ సహకారాలు అందించారు. చిన్నాచితకా సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. అందులోనూ రెండేసి డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నా, సబ్ జూనియర్ స్థాయి నుంచి వరస క్రమంలో సర్టిఫికెట్లు లేకున్నా పోస్టులు ఇచ్చేశారు. ఐదు నుంచి పది పోస్టులు మినహా చాలావరకు క్రీడా కోటాలోనే భర్తీ చేయడం గమనార్హం. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ చేయించి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు.ప్రతిభకు ప్రాధాన్యం ఎక్కడ?క్రీడా విధానం 2024–29లో భాగంగా క్రీడా కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ జీవో 4 జారీ చేసింది. ఇందులో విచిత్రంగా సీనియర్ నేషనల్ విభాగం కంటే ‘నేషనల్ గేమ్స్’కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారం చేశారు. ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జరిగే సీనియర్ నేషనల్స్ సర్టిఫికెట్కు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. జాతీయ జట్టు ఎంపికలు సైతం వాటి ఆధారంగానే చేస్తారు. రెండేళ్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే ‘నేషనల్ గేమ్స్’ను పెద్దగా ఎవరూ పరిగణనలోకి తీసుకోరు. జాతీయ జట్ల ఎంపికలతో వీటికి సంబంధం ఉండదు. ఇందులో చాలా రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని సైతం పెద్దగా ప్రోత్సహించవు. అలాంటి ‘నేషనల్ గేమ్స్’ను చంద్రబాబు సర్కారు జీవో 4లో ప్రాధాన్యంగా పెట్టి డీఎస్సీ క్రీడా కోటాలో అక్రమాలకు తెర తీసింది. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే క్రీడా కోటాలో పోస్టులను అమ్ముకునేందుకు ముఖ్యనేతకు బంధువుగా చెప్పుకునే ‘మాస్టర్మైండ్’ పక్కా స్కెచ్ వేశారు. కేవలం పోస్టులు అమ్ముకోవడం కోసమే జీవో 4లో నేషనల్ గేమ్స్ను చేర్చి.. వసూళ్ల దందా పూర్తి కావడంతో ఆ జీవోను సవరించి చేతులు దులుపుకొనే యత్నం చేస్తున్నట్టు సమాచారం.హైకోర్టు ఆదేశాలు బేఖాతర్...⇒ చంద్రబాబు సర్కారు జారీ చేసిన డీఎస్సీ–2025 నోటిఫికేషన్కు సంబంధించి పలు న్యాయవివాదాలు రేకెత్తాయి. డీఎస్సీ ప్రక్రియలో పలు లోపాలు ఉన్నాయని, పోస్టుల భర్తీలో తప్పులు దొర్లాయని పెద్ద ఎత్తున అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో డీఎస్సీపై 104కుపైగా కేసులు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు అమలు, స్పోర్ట్స్ కోటాతో పాటు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యం తీసుకోవడం లాంటి వాటిల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఫిర్యాదు చేశారు. కీలకమైన పోస్టుల ప్రాధాన్యంపై అప్పట్లో హైకోర్టు స్పందిస్తూ ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందడం వారి హక్కు అని తీర్పునిచ్చింది. అయితే, ఆ తీర్పు ఇచ్చిన రోజే.. ఆర్డర్ కాపీ రాకుండా హడావుడిగా ఫలితాలను ప్రకటించి చంద్రబాబు సర్కారు పోస్టులను భర్తీ చేసింది. కాగా ‘మాస్టర్మైండ్’కు చెందిన ఓ అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్లు పొందిన వారికి తగిన అర్హతలు లేకున్నా టీచర్ పోస్టులు కట్టబెట్టేశారు. అనంతరం ఆ మాస్టర్మైండ్ సన్మానం కూడా చేయించుకున్నారు. అయితే ఆ నియామక పత్రాలు ఇచ్చేలోగా ప్రతిభ గల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో వెనక్కి తగ్గారు.⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖలో క్రీడా కోటాలో ఉద్యోగానికి అనర్హురాలిగా తేలింది. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసగించేందుకు యత్నించినట్లు గుర్తించడంతో విజయనగరం జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అనూహ్యంగా ఆమె ఏపీ డీఎస్సీ–2025లో క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఎంపికైంది. దీనిపై సామాజిక కార్యకర్తలు ‘శాప్’కు సైతం ఫిర్యాదు చేశారు.⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన పోస్టల్ శాఖలో అదే క్రీడా కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందారు. -
దక్కని ధర.. రైతుకు సెగ!
వేలం కేంద్రాల్లో పొగాకు ధరలు రైతులను కుంగదీస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఇది రైతుల పాలిట ఆశనిపాతంలా మారింది. వేలం కేంద్రాల్లో ప్రస్తుతమున్న పరిస్థితి కొనసాగితే ఆర్థికంగా కోలుకోలేమనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. కొనుగోలు కేంద్రాల్లో ప్రారంభ ధర రూ.250 ఉండగా నేడు రూ.232కు పడిపోయింది. బ్రైట్ రకం ధరలే ఇలా ఉంటే లోగ్రేడ్ ధరలు మరింతగా దిగజారుతాయన్న బెంగ రైతులకు పట్టుకుంది. ప్రకృతి కరుణించకపోవడం, తెగుళ్ల కారణంగా దిగుబడి భారీగా పడిపోయింది. దీనికి తోడు పశ్చిమాశియా యుద్ధం రైతుకు గోరుచుట్టపై రోకటి పోటుగా తయారైంది. ఈ ఏడాది ఎకరాకి రూ.20 వేల నుంచి రూ.50 వేలు నష్టం తప్పదని రైతులు దిగాలు చెందుతున్నారు. సింగరాయకొండ: పొగాకు రైతుకు కనకవర్షం కురవటం ఇక కలేనా అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో లాభాలు చవిచూశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా నిలవడంతో రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. ఫలితంగా రైతులకు కాసుల వర్షం కురిసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి తలకిందులైంది. వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిండా ముంచేస్తున్నా ప్రభుత్వం పట్టించున్న దాఖలాల్లేవు. ఫలితంగా వేలం కేంద్రాల్లో కనీస మద్దతు ధర లభించక ఎక్కువ మంది రైతులు పొగాకును వచ్చిన ధరకు తెగనమ్ముకున్నారు. మరికొంత మంది శీతల గోదాముల్లో దాచుకున్నారు. గత సంవత్సరం ప్రారంభ ధర కేజీ రూ.320కి పైగా పలికింది. ఈ దఫా కేజీ ప్రారంభ ధర రూ.250 ఉండగా ప్రస్తుతం కేజీ ధర రూ.232 పలకటంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాలున్నాయి. 2026–27 పంట సీజన్కు సంబంధించి రీజియన్ పరిధిలో 82,475 హెక్టార్లలో పొగాకు పంట సాగైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026–27 లో పంట సీజన్కు సంబంధించి ఒంగోలు రీజియన్ పరిధిలో 90.20 మిలియన్ కేజీల పొగాకు పండించేందుకు బోర్డు అనుమతి ఉంది. కానీ ఈ ఏడాది సుమారు 130 మిలియన్ కేజీల పొగాకు పండించినట్లు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం తగ్గినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. ధరతో దిగాలు.. ప్రస్తుతం పొగాకు వేలం కేంద్రాల్లో ప్రారంభం నుంచి బ్రైట్గ్రేడ్ పొగాకు కేజీ ధర రూ.250 పలికింది. తరువాత ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కర్ణాటకలో పొగాకుకు సరాసరి కేజీ ధర రూ.230 వచ్చిందని ఇక్కడ కూడా ఆ స్థాయిలో వచ్చే అవకాశం ఉందని భావించారు. కానీ వేలం ప్రారంభమైన కొద్దిరోజులకే కేజీ ధర రూ.232 లకు పడిపోవడంతో రైతులు ఆందోళనలో పడిపోయారు. గిట్టుబాటు ధర లభించేనా ప్రస్తుతం వేలం కేంద్రాల్లో లభిస్తున్న ధరలను చూస్తే రైతులకు నిద్రపట్టని పరిస్థితి నెలకొంది. కొండపి వేలం కేంద్రంలో కేజీ ధర రూ.232 ఉండగా, టంగుటూరులో కేజీ ధర రూ.235, కందుకూరులో కేజీ ధర రూ.245 ఉంది. ఈ ప్రకారం రైతుకు ఎకరాకు ఒక్కో బ్యారన్కు రూ.1.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నష్టం సంభవిస్తుందని ఈ విధంగా అయితే ఎలా బట్టకట్టాలా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశాజనకంగా లేని దిగుబడులు: ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవటంతో పాటు మంచు కారణంగా తెగుళ్ల బెడద తీవ్రంగా ఉంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు 9 క్వింటాళ్ల దిగుబడి రాగా కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు కేవలం 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు చెబుతున్నారు. జరుగుమల్లి మండలం నందనవనం తదితర ప్రాంతాల్లో అక్టోబర్లో సాగు ప్రారంభించటంతో పాటు వర్షాలు కురవటంతో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని, అదే చాలా ప్రాంతాల్లో నవంబర్లో సాగు ప్రారంభించటంతో సకాలంలో వర్షాలు లేక దిగుబడి 5 నుంచి 9 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ధరలతో ఆత్మహత్యలే శరణ్యం: ఈ ఏడాది పొగాకు ధరలు తగ్గటంతో పాటు యుద్ధం కారణంగా కొనుగోలుదారులు లేక ధరలు బాగా దిగజారే పరిస్థితి నెలకొంది. ఒకవేళ కేంద్రానికి బేళ్లు తీసుకెళ్తే వాటిని నానా పరీక్షలు చేసి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతు 45 బేళ్లు తీసుకుని వెళ్తే కేవలం 27 బేళ్లు మాత్రమే కొనుగోలు చేసి 18 బేళ్లు వెనక్కి తిప్పి పంపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఆత్మహత్యలే శరణ్యమని ఇక కౌలు రైతుల పరిస్థితి చెప్పటానికి వీలు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలిగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకుందని రైతులు గుర్తుచేశారు. గతంలో వ్యాపారులు సిండికేట్ అయి పొగాకు ధరలు పడిపోతుంటే గత ప్రభుత్వం మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆదుకుంది. కానీ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదని, వీరు ఎంతసేపటికీ దోచుకో, దాచుకో అన్న సిద్దాంతం.. లేకపోతే జగన్మోహన్రెడ్డి ని విమర్శించటానికే సమయం కేటాయిస్తున్నారే తప్ప పొగాకు రైతును ఆదుకునే ఒక్క ప్రయత్నం చేపట్టిన దాఖలాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు సాగు తగ్గించండి ప్రత్యామ్నాయ పంటలను పండించండని చెప్పటమే తప్ప ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న ఆలోచన మాత్రం లేదని, ఈ ప్రభుత్వంలో కష్టాలే మిగిలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బేళ్లు వెనక్కు పంపుతున్నారు ఈ ఏడాది పొగాకు వేలం ప్రారంభంలో కేజీ ధర రూ.250 ఉండగా, ప్రస్తుతం రూ.232 పలుకుతుంది. యుద్ధం వంక చూపి వ్యాపారులు బేళ్ల కొనుగోలు పట్ల ఆసక్తి చూపకుండా ఆంక్షలు విధిస్తూ బేళ్లు తిప్పి పంపుతున్నారు. అసలే నష్టాలు వస్తాయి ఎలా అని బాధపడుతుంటే బేళ్లు వెనక్కి పంపటం అదనపు భారంగా మారింది. – తాటికొండ రామచంద్రరావు, రైతు, పచ్చవ ఎకరాకు రూ.40 వేలు నష్టం ఈ ఏడాది 40 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. ప్రస్తుతం కేజీ ధర రూ.232 మాత్రమే ఉంది. కేజీ ధర రూ.260 పైన ఉంటేనే గిట్టుబాటవుతుంది. ప్రస్తుత ధరలతో ఎకరాకు సుమారు రూ.40 వేలు నష్టమొచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం పొగాకు రైతును ఆదుకునేందుకు కృషి చేయాలి. – నాగినేని భాస్కర్, పొగాకు రైతు, పైడిపాడుకేజీ రూ.270పైన ఉంటేనే గిట్టుబాటయ్యేది నేను 29 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నాను. ఈ ఏడాది కేజీ ధర రూ.270 పైన ఉంటేనే గిట్టుబాటవుతుంది. వర్షాలు సరిగా కురవకపోవటం, తెగుళ్ల కారణంగా దిగుబడి ఆశించినంతగా లేదు. మందుల ఖర్చులు బాగా పెరిగాయి. ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలు చేపట్టి ఆదుకోవాలి. – పిన్నిక శ్రీనివాసరావు, పొగాకు రైతు, పంగులూరివారిపాలెం -
కీర్తి చోరుడు బాబు.. మరో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులను తమవిగా చెప్పుకుంటూ అభాసుపాలవుతున్నా.. రోజురోజూకూ మరింత దిగజారి కీర్తి చౌర్యానికి పాకులాడుతున్నారు. తాజాగా రెన్యూ పవర్ ప్రైవేటు లిమిటెడ్ పెట్టుబడులు తామే తెచ్చామంటూ గొప్పలు పోతున్నారు. అయితే ఈ పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. రెన్యూ పవర్ సీఈఓ సుమంత్సిన్హా గత ప్రభుత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం అప్పటి సీఎం వైఎస్ జగన్ దార్శనికతను కొనియాడారు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి. వైఎస్ జగన్కు ధన్యవాదాలు ‘‘పెట్టుబడులను ఆకర్షించడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడంపై వంటి అనుకూలమైన వ్యాపార వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. 2050 నాటికి ఆగ్నేయాసియాలో ప్రవేశించే పెట్టుబడిదారులకి ఏపీ తొలి ప్రాధాన్యంగా మారాలని, పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చే ప్రపంచ గమ్యస్థానంగా ఎదగాలని రాష్ట్రం ఒక దార్శనికతను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్లో నిన్న జరిగిన చర్చకు సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు.’’ » ఇవి రెన్యూ పవర్ చైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్సెస్ట్మెంట్ సమ్మిట్లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం, గత ప్రభుత్వంతో ఒప్పందాల అనంతరం సామాజిక మాధ్యమం(లింక్డ్ఇన్) వేదికగా చెప్పిన మాటలు ఇవి. తండ్రీ కొడుకుల తీరు సిగ్గు..సిగ్గు వైఎస్ జగనే రెన్యూ పవర్ని తీసుకొస్తే.. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఆ సంస్థను గెంటేసిందని, తామే ఆ సంస్థ నుంచి పెట్టుబడులు తీసుకువస్తున్నామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు చెబుతున్నారు. క్రెడిట్ చోరీ నాటకంలో తండ్రీకొడుకులు పోటీ పడుతున్నారు. కానీ నెటిజన్లు వాస్తవాలను బయటపెట్టి సోషల్ మీడియాలో వారిని ట్రోల్స్ చేస్తున్నారు. -
టెన్త్ ‘స్పాట్’.. తప్పులతడక
సాక్షి, అమరావతి : ఈ ఏడాది పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం విద్యార్థుల పాలిట శాపంగా మారనుంది. ఇటీవల ముగిసిన స్పాట్ వాల్యుయేషన్లో భారీగా తప్పులు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మార్కుల నమోదు తప్పులతడకగా జరిగినట్లు తెలిసింది. పార్ట్–2లో నమోదుచేసిన మార్కులకు భిన్నంగా పార్ట్–3లో నమోదైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ట్యాబ్లతో మార్కులను ఆన్లైన్ చేయగా ఈ విధానం విఫలమవడంతో రాష్ట్ర పరీక్షల డైరెక్టరేట్ మళ్లీ మాన్యువల్గా స్కానింగ్ విధానం చేపట్టింది. ఈ క్రమంలో మార్కుల నమోదులో జరిగిన తప్పులు పెద్దఎత్తున బయటపడుతున్నాయని, దాంతో ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉపాధ్యాయులకు నోటీసులు పంపుతున్నట్లు తెలిసింది. గతేడాది గొప్పలకు పోయి విద్యార్థుల భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన పరీక్షల విభాగం.. ఈ ఏడాది అంతకంటే ఘోరమైన తప్పిదాలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో 6.20 లక్షల మంది విద్యార్థుల ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుందని భావిస్తున్నారు. పార్ట్–2, 3లో భిన్నంగా మార్కులు..మూల్యాంకనంలో ఆన్సర్షీట్ పైన ఓఎంఆర్ షీట్ ఉంటుంది. ఇందులో విద్యార్థి వివరాలతో పాటు మార్కులు నమోదుచేస్తారు. అలాగే, ఓఎంఆర్ షీట్లోని పార్ట్–2లో ప్రశ్నల వారీగా మార్కులను అక్కడే గ్రాండ్ టోటల్ చేస్తారు. అనంతరం పార్ట్–3లో అవే మార్కులను నమోదుచేసి పెన్సిల్తో బబ్లింగ్ చేసి అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్, చీఫ్ ఎగ్జామినర్ సంతకాలు చేస్తారు. అయితే, ఇక్కడే అనేక తప్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఉదా.. ఒక సబ్జెక్టులో పార్ట్–2లో 75 మార్కులు నమోదుచేసి, పార్ట్–3లో మాత్రం 57 వచ్చినట్లు నమోదుచేశారు. అలాగే, 89 మార్కులకు 67, 90 మార్కులకు 60, 70 మార్కులకు 94, 62 మార్కులకు 88.. ఇలా నమోదైనట్లు గుర్తించారు. ఈ క్రమంలో తప్పు మార్కులు నమోదుచేసిన ఉపాధ్యాయులకు, స్పెషల్ అసిస్టెంట్లకు రాష్ట్ర పరీక్షల విభాగం తాఖీదులు పంపుతోంది. వారిచ్చే సమాధానం ఆధారంగా సవరణ చేయాల్సి ఉంటుంది. అలాగే, జిల్లాలకు భారీగా సవరణ జాబితాలు పంపుతున్నారు. సాధారణంగా ఏటా ఈ తరహా పొరపాట్లు చాలా స్వల్పంగా జరుగుతాయి. కానీ, ఈసారి భారీగా జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. టార్గెట్ పెట్టి మరీ టీచర్లపై ఒత్తిడి..ఈ ఏడాది టెన్త్ విద్యార్థుల ఉత్తీర్ణత ఆధారంగానే ఉపాధ్యాయుల పనితీరును మదింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అవార్డులకు కూడా దీనినే ప్రాతిపదికగా తీసుకుంటామని విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తెలిపింది. దీంతోపాటు టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించకున్నా, తక్కువ ఉత్తీర్ణత వచ్చినా ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులదే బాధ్యతని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో.. ఈసారి భారీగా కాపీయింగ్ జరిగినట్లు విమర్శలు వచ్చాయి. అలాగే, మూల్యాంకనంలో పాల్గొనాలంటే కనీసం మూడేళ్ల ‘స్పాట్’ అనుభవం ఉండాలి. కానీ, ఈసారి బోధన చేయని ఉపాధ్యాయులతోనూ మూల్యాంకనం చేయించారు. దీంతో మార్కుల నమోదులో పెద్దఎత్తున తప్పులు వెలుగుచూస్తున్నాయి. -
మీ ఇష్టానికి కొంటే కుదరదు
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి అనుమతి లేకుండా కరెంటు కొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) గుర్తించింది. అలా కొన్న విద్యుత్కు ధరను ఖరారు చేయడానికి కమిషన్ నిరాకరించింది. అనుమతితో చేసిన కొనుగోళ్లకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్కు రూ.5.17గా ఖరారు చేసింది. ఇదే ధర 2025–26 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుందని గురువారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఆలస్యంగా పిటిషన్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి ఆరు నెలలు ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేశాయి. అలాగే డిస్కంలు యూనిట్ ధర రూ.5.22గా ప్రతిపాదించగా.. కమిషన్ రూ.5.17కు తగ్గించింది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోళ్ల ఆధారంగా ఈ ధరను లెక్కించింది. అనుమతి లేని కొన్ని విద్యుత్ కేంద్రాల నుంచి డిస్కంలు చేసిన కొనుగోళ్లను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే పునరుత్పాదక విద్యుత్ కొనుగోళ్లను కూడా లెక్కించలేదు. ఇక తాత్కాలికంగా చెల్లించిన ధర, తుది ధర మధ్య తేడాను వచ్చే నెల నుంచి మూడు సమాన నెలవారీ వాయిదాల్లో సర్దుబాటు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పిటిషన్లను ఈ ఏడాది సెపె్టంబర్ 30లోపు తప్పనిసరిగా దాఖలు చేయాలని సూచించింది. ఒక్కరు కూడా అభ్యంతరం చెప్పలేదేంటో ఏపీఈఆర్సీ 2022లో ప్రవేశపెట్టిన పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత నియమావళి ప్రకారం.. ఏటా డిస్కంలు విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని కమిషన్కు సమర్పించాలి. దీనిలో భాగంగా ఏపీ ఈపీడీసీఎల్ ఫిబ్రవరి 26, సీపీడీసీఎల్ మార్చి 9, ఎస్పీడీసీఎల్ మార్చి 10న పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై మార్చి 16న బహిరంగ ప్రకటన జారీ చేసిన కమిషన్ ఏప్రిల్ 6 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. కానీ చిత్రంగా ఒక్కరి నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేదా సూచనలు రాలేదు. ఏప్రిల్ 22న కర్నూలులో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఎలాంటిæ అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీంతో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగానే కమిషన్ తుది నిర్ణయం తీసుకుంది. మూడు డిస్కంల సమాచారాన్ని కలిపి ఒకే ధరను ఖరారు చేసింది. ఇలా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం చాలా అరుదు. కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించకపోవడమే దీనికి ప్రధాన కారణం. -
అర్చకులపై రెడ్బుక్ టెర్రర్
సాక్షి, అమరావతి : రాజకీయాలకు తావే ఉండకూడని గుళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండు రోజుల క్రితం టీటీడీ అనుబంధ ఒంటిమిట్ట ఆలయంలో పనిచేసే అర్చకులు వేద అశీర్వచనం చేయడంపై వివరణ కోరుతూ ప్రభుత్వ పెద్దలు టీటీడీ ద్వారా షోకాజ్ నోటీసులు ఇప్పించడం కలకలం రేపింది. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్టు బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చినా చర్యలు చేపట్టకపోగా కనీసం వివరణ కూడా కోరలేదు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం చేసిన అర్చకులపై చర్యలు చేపట్టడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తిరుమల కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఇటీవల కాలంలో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్రతను సైతం దెబ్బతీసేలా పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగానే అర్చకులకు నోటీసులు ఇచ్చినట్లు చర్చ సాగుతోంది. దిగజారుడు రాజకీయం ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్తగా కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో టీటీడీ సహా వివిధ ఆలయాల నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం అందజేయడం పరిపాటిగా మారింది. నియోజకవర్గ, మండల స్థాయి అధికార పార్టీ నాయకులు కూడా తమ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ అర్చకులను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల రాజంపేట నియోజకవర్గంలో ఓ మండల టీడీపీ నేత అనుచరులు ఒక ఎస్సీ యువకుడిపై దాడి చేశారు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి తమ్ముడు, మండల టీడీపీ నేతలు ఒంటిమిట్ట ఆలయ అర్చకులను కర్నూలు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారి ఆఫీసుకు తీసుకెళ్లి.. ఆ అధికారికి వేద ఆశీర్వచనం చేయించారు. ఇప్పుడు ఇదే అధికార పార్టీ నేతలు.. అర్చకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం చేయడం తప్పన్నట్లు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీనిపై కనీస ఆలోచన లేకుండా టీటీడీ పెద్దలు అర్చకులకు నోటీసులతో ఇబ్బంది పెట్టడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు చేయలేదా? ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి అర్చకులు వివిధ సందర్భాల్లో వేద ఆశీర్వచనం ఇవ్వడం సాధారణం అని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు అప్పటి టీటీడీ అ«ధికారులు వేద పండితులతో వేద ఆశీర్వచనం అందించడంతో పాటు వస్త్రం కూడా అందజేశారని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల ఎవరికైనా ఎలాంటి ప్రోటోకాల్ ఉండదని, అయినా అప్పుడు చంద్రబాబుకు టీటీడీ అధికారులు ఆ గౌరవం అందించడం కేవలం ఆయన మాజీ ముఖ్యమంత్రి అన్న గుర్తింపే అని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. -
పెద్దసంఖ్యలో జిల్లా జడ్జిల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. ఇటీవల సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్) నుంచి అదనపు జిల్లా జడ్జిలుగా పదోన్నతులు పొందిన వారితో సహా మొత్తం 72 మందికి స్థానచలనం కల్పిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలువురు జిల్లా జడ్జిలు బదిలీ అయ్యారు. వీరందరికీ హైకోర్టు కొత్త పోస్టింగ్లు ఇచ్చింది. మే 7వ తేదీ లోపు కొత్త బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. రిలీవ్ అయ్యే లోపు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్న తీర్పులను వెలువరించాలని కూడా స్పష్టం చేసింది. విజయవాడ రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న ఎ.సత్యానంద్ ప్రకాశం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. అత్యంత కీలకమైన విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా ఎల్.తేజోవతి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె నెల్లూరు మూడో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్నారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా ఉన్న పి.భాస్కరరావు తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం 12వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా బదిలీ అయ్యారు. రాష్ట్ర వక్ఫ్బోర్డ్ ట్రిబ్యునల్ చైర్మన్గా టి.రామచంద్రుడు నియమితులయ్యారు. గుంటూరు అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా ఉన్న జి.చక్రపాణి విశాఖపట్నం సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిగా నియమితులయ్యారు. నెల్లూరు మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఉన్న జి.గీత, నెల్లూరు ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా బదిలీ అయ్యారు. విజయవాడ కో–ఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా కె.రాధారత్నం నియమితులయ్యారు. -
నిరుద్యోగులకు వయోగండం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపుపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం మౌనం వహిస్తోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించిన పాలకులు, వారి వయో పరిమితి పెంపుపై మాత్రం స్పందించకపోవడంపై ఆందోళన నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలకు 34 ఏళ్ల వయసు ఉండగా, ఈ పరిమితిని కొన్నేళ్లుగా 42 ఏళ్లకు పెంచుతున్నారు. అయితే, 2023లో సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్లకు 44 ఏళ్లకు పెంచాలని గత ప్రభుత్వంలో సీఎంకు నారా లోకేశ్ లేఖ రాశారు. టీడీపీ ఎమ్మెల్సీలు సైతం పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఎంకు లేఖలు రాశారు. ఎన్నికల సమయంలో లోకేశ్ నిర్వహించిన యువగళం సభల్లోనూ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. కానీ అధికాకంలోకి వచ్చాక మాత్రం ఇచ్చిన హామీ మేరకు వయసు పెంపుపై చంద్రబాబు ప్రభుత్వం మౌనంగా ఉంది. ఈ క్రమంలో అభ్యర్థుల వయోపరిమితిపై నిర్ణయం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి లేఖ రాసింది. అయినప్పటికీ రెండు నెలలుగా అటు నుంచి ఎలాంటి స్పందనా లేదు. మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని అక్కడి ప్రభుత్వం 46 సంవత్సరాలకు పెంచి నిరుద్యోగులకు భరోసా కల్పించింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ప్రభుత్వం గతేడాది ఇచ్చిన డీఎస్సీ–2025లో అభ్యర్థుల వయోపరిమితిని 44 సంవత్సరాలు చేసింది. కానీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విషయంలో మాత్రం తప్పించుకుంటోంది. గతేడాది జూలైలో అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా వయో పరిమితి పెంచలేదు.హామీ విస్మరిస్తే ఊరుకోం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచాలని లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 47 సంవత్సరాలకు పొడిగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని లోకేశ్ ఎందుకు విస్మరిస్తున్నారు? రాష్ట్రంలో యూపీఎస్సీ మాదిరిగా ఏటా నోటిఫికేషన్స్ రావడం లేదు. కొన్ని నోటిఫికేషన్లపై న్యాయ వివాదాలతో ఏళ్ల తరబడి భర్తీ పూర్తి కావడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని లోకేశ్ నిలబెట్టుకోవాలి. వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. లేకపోతే నిరుద్యోగుల ఆందోళన తప్పదు. – ఎంబేటి రామచంద్ర, రాష్ట్ర అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ ఏటా 75 వేల మందికి అన్యాయం ఏపీపీఎస్సీ ఓటీపీఆర్లో నమోదైన వివరాల ప్రకారం రాష్ట్రంలో ఏటా 75 వేల మంది గ్రాడ్యుయేట్లు వయసు దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. రెండు నెలలుగా వయో పరిమితి పెంపుపై ప్రభుత్వంగానీ, గతంలో హడావుడి చేసిన నారా లోకేశ్గానీ స్పష్టతనీయడం లేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏపీపీఎస్సీని నీరుగార్చిందన్న అపవాదును మూటగట్టుకొంది. దాదాపు 7 నెలలుగా సర్వీస్ కమిషన్కు రెగ్యులర్ చైర్మన్ను నియమించకుండా ఇన్చార్జితోనే నెట్టుకొస్తోంది. దీంతో కమిషన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటించినా అభ్యర్థుల వయోపరిమితిపై మాత్రం స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. -
హత్యా రాజకీయాలు.. దుష్ప్రచార కుట్రలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు మరోసారి తన మార్కు హత్యా రాజకీయ దుష్ప్రచారానికి తెగబడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన ప్రతిసారి డైవర్షన్ కుట్రలో భాగంగా ఇటువంటి దుష్ప్రచారానికి తెర తీయడం తన నైజమని మరోసారి నిరూపిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ కుతంత్రానికి పాల్పడుతున్నారు. టీడీపీకి వత్తాసు పలికే ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా విభాగాల ద్వారా పక్కాగా దుష్ప్రచార పన్నాగం పన్నుతున్నారు. అసలు హతుడు దస్తగిరి భార్య రమణమ్మే ఈ హత్యతో వైఎస్సార్సీపీ నేత నిత్యానందరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించినా, టీడీపీ మూకలు మాత్రం విష ప్రచారం కొనసాగిస్తుండటం గమనార్హం. దస్తగిరి హత్య ఉదంతాన్ని వక్రీకరిస్తూ వైఎస్సార్సీపీతోపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారానికి దిగజారుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. అసలు రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు తెరతీసిన చరిత్ర ఉన్న చంద్రబాబు.. వైఎస్సార్సీపీకి హత్యా రాజకీయాల బురద అంటించాలని యత్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. దాంతో చంద్రబాబు హత్యా రాజకీయాల చరిత్ర మరోసారి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.చంద్రబాబు దిగజారుడు రాజకీయం వైఎస్సార్సీపీ నేత పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరిస్తూ చంద్రబాబు, ఆయన ముఠా విష ప్రచారానికి పాల్పడుతూ దిగజారుడు రాజకీయాలకు తెగబడుతోంది. ఏకంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, సవిత స్వయంగా ఈ దుష్ప్రచారాన్ని భుజానికెత్తుకోవడం ద్వారా ఈ పన్నాగం అంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతోందన్నది స్పష్టమవుతోంది. అసలు విషయం ఏమిటంటే.. వైఎస్సార్సీపీకి చెందిన పెద్ద దస్తగిరి, నిత్యానంద రెడ్డి అత్యంత సన్నిహిత మిత్రులు. సుదీర్ఘకాలంగా వారిద్దరూ వ్యాపార భాగస్వాములు. రెండు కుటుంబాలు అత్యంత సన్నిహితంగా మెలుగుతాయన్నది వైఎస్సార్ కడప జిల్లాలో అందరికీ తెలిసిన వాస్తవం. ఈ వాస్తవాలను విస్మరిస్తూ టీడీపీ ముఠా దుష్ప్రచారానికి పాల్పడుతుండటం గమనార్హం. నిత్యానందరెడ్డికి దస్తగిరి బినామీ అనే కొత్త ప్రచారాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చారు. ఆస్తుల విషయంలో గొడవతోనే ఆయన్ను హత్య చేశారని నిధారార ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. కాగా ఆ ఆరోపణలను హతుడు దస్తగిరి భార్య రమణమ్మే స్వయంగా ఖండించడం గమనార్హం. తన భర్త పెద్ద దస్తగిరి ఎవరికీ బినామీ కాదని ఆమె తేల్చి చెప్పారు. అసలు తన భర్త పెద్ద దస్తగిరికి నిత్యానందరెడ్డితో ఎటువంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. అయినా సరే టీడీపీ నేతలు రాజకీయ కుట్రతోనే దుష్ప్రచారం చేస్తున్నారు. దర్యాప్తు పేరిట కుతంత్రం ఈ హత్య కేసు దర్యాప్తు ముసుగులో వైఎస్సార్సీపీ నేతలను వేధించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం బరి తెగిస్తోంది. అందుకే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, తాలుకా పోలీస్ స్టేషన్ సీఐ రెడ్డప్ప, చిన్న చౌకు సీఐ ఓబులేసు, ఎస్సై రాజేశ్వర రెడ్డిలను హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో ప్రస్తుతం ట్రాఫిక్లో ఉన్న బాలస్వామిరెడ్డిని ఏరికోరి కడప డీఎస్పీగా నియమించారు. ఆ వెంటనే డీఎస్పీ బాలస్వామి రెడ్డి నేతృత్వంలో పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. బాధిత కుటుంబం అనే సానుభూతి కూడా లేకుండా హతుడు పెద్ద దస్తగిరి నివాసంలో సోదాల పేరుతో కుటుంబ సభ్యులను పోలీసులు వేధించారు. వైఎస్సార్సీపీ నేత నిత్యానందరెడ్డికి వ్యతిరేకంగా తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వారిని వేధిస్తున్నారు. కానీ అందుకు పెద్ద దస్తగిరి కుటుంబ సభ్యులు ఏమాత్రం సమ్మతించ లేదు. హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేహత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లోనే హత్యా రాజకీయాలకు తెరతీసింది చంద్రబాబేనన్నది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం. ఆయన హత్యా రాజకీయాల చరిత్ర తిరగేస్తే చాంతాడంత ఉంటుంది. అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం.. ప్రతిపక్షంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబడటాన్ని టీడీపీ అధికారిక విధానంగా చేసింది చంద్రబాబే.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన చంద్రబాబు.. తన ప్రభుత్వ హయాంలో ఇంకెంతగా బరితెగించి ఉంటారన్నది ఊహకే అందని దారుణం. విజయవాడలో మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి నుంచి.. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండల వరకు.. అన్ని దారుణాల్లో చూపుడు వేలు చంద్రబాబు వైపే చూపిస్తోంది. మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. అతను ఎన్టీరామారావుపై ఎందుకు హత్యాయత్యానికి పాల్పడ్డారన్నది పోలీసుల విచారణలో వెల్లడవుతుందని అందరూ ఆశించారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మల్లెల బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా అతని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం రూ.30 వేలే ఇచ్చారని ఆ లేఖలో ఉండటం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా అప్పటి రాజ్యాంగేతర శక్తి చంద్రబాబే అడ్డుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాత్రికేయుడు పింగళి దశరథరామ్ పాశవిక హత్యటీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథరామ్ పాశవిక హత్యను రాష్ట్రం ఎప్పటికీ మరచిపోలేదు. 1985 అక్టోబరు 20న రాత్రి విజయవాడలో రిక్షాలో వెళుతున్న దశరథరామ్ను దారి కాచి మరీ దారుణంగా దాడి చేశారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు చెప్పినా సరే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయడం గమనార్హం. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల దన్నుతోనే దశరథరామ్ను హత్య చేశారన్నది స్పష్టమైంది. చంద్రబాబు అండతోనే వైఎస్ రాజారెడ్డి దారుణ హత్యచంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్ రాజా రెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు పేర్ల పార్థసారథి, ఆయన వర్గీయులు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారు. వంగవీటి రంగా దారుణ హత్యవిజయవాడలో టీడీపీ అరాచకాలకు అడ్డుగోడగా నిలిచిన అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా హత్య రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. 1988లో నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను పాశవికంగా హత్య చేశారు. టీడీపీ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్నందునే చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ హత్యకు తెగబడ్డారని పరిశీలకులు స్పష్టం చేశారు. ఆ హత్యలో స్వయంగా పాల్గొని నిందితుడిగా ఉన్న వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009 ఎన్నికల నుంచి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం కూడా విశాఖ టీడీపీలో ఈయన కీలకమే. కాగా, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కంగాటి నారాయణ రెడ్డితోపాటు మరొకరిని 2017లో బాంబులతో దాడి చేసి హత్య చేశారు. చంద్రబాబు అండతోనే అప్పటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబమే ఈ హత్యకు కుట్ర పన్నింది.ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తిగా చెలరేగిపోయేవారన్నది బహిరంగ రహస్యం. 1989–94లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాందోళన పేరిట బస్సులను దహనం చేయాలని చంద్రబాబు ఆదేశించే వారని అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీవీ చానళ్ల ఇంటర్వ్యూల్లో వెల్లడించడం గమనార్హం. కొన్ని బస్సులు తగలబడాలి.. కొందరు సామాన్యులు చనిపోవాలి.. అప్పుడే ఆందోళన విజయవంతమైనట్టని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన చెప్పడం గమనార్హం. మహానేత వైఎస్సార్కే నేరుగా బెదిరింపు 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి వరుసగా రెండోసారి సీఎం కావడంతో చంద్రబాబు తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే 2009లో ఆయన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విస్మయ పరిచాయి. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను’ అని చంద్రబాబు వైఎస్ రాజశేఖరరెడ్డిని బెదిరించడం గమనార్హం. అనంతరం కొద్ది రోజుల్లోనే వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో దుర్మరణం చెందారు. దాంతో ఆయన్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన హెచ్చరికలను పరిశీలకులు ప్రధానంగా ప్రస్తావించారు కూడా. 2024 నుంచి రెడ్బుక్ అరాచకం 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెడ్బుక్ అరాచకాన్ని ప్రోత్సహిస్తుండటం విస్మయ పరుస్తోంది. 20 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారు. అంటే నెలకో రాజకీయ హత్యతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు 22 నెలల పాలనలో రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతిభద్రతలకు నిదర్శనంగా నిలిచింది. -
జస్టిస్ లీసా గిల్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం 1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
ఐఏఎస్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: ఐఏఎస్ అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకపోవడంపై సీరియస్ అయ్యింది. ఉద్యోగుల జీవితాలతో ఎలా ఆడుకుంటారని మండిపడింది. ప్రభుత్వం, సీఎస్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. పన్ను వసూళ్లలోనూ అహ్మద్ బాబుపై ఆరోపణలున్నాయి. మాకు అధికారం ఉంటే వెంటనే సస్పెండ్ చేసే వాళ్లం’ అని వ్యాఖ్యానించింది, -
‘మీకు కార్పొరేషన్ కావాలా?’.. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారా?
సాక్షి,కాకినాడ: పిఠాపురం జనసేన నేతలపై నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఆరోగ్యం ఎలా ఉందని ఎవరూ అడగడం లేదని అన్నారు. కాపు కార్పొరేషన్, కల్యాణ మండపం కావాలని అడుగుతారా? అని ప్రశ్నించారు. పవన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోరా? అంటూ మండిపడ్డారు. దీంతో నాగుబాబు మాటలకు జనసేన నేతలు సారీ చెప్పారు. జనసేన క్షమాపణలు చెప్పడంతో అదే కావలని నాగబాబు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. గత వారం సడెన్గా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. 2018లో పవన్ కల్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు. రంగస్థలం మూవీ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని పవన్ వెల్లడించారు. -
భగీరథ మహర్షి జయంతి.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: భగీరథుని జయంతి సందర్భంగా సగరులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సైతం సాధ్యంగా మార్చిన తపోధనుడు భగీరథ మహర్షి. తన కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి, మానవళికి వరంగా ప్రసాదించిన భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సైతం సాధ్యంగా మార్చిన తపోధనుడు భగీరథ మహర్షి. తన కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి, మానవళికి వరంగా ప్రసాదించిన భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.#BhagirathaMaharshiJayanthi pic.twitter.com/HMuhFkZYEZ— YS Jagan Mohan Reddy (@ysjagan) April 23, 2026 -
తమిళనాడులోనూ ‘మేధావితనం’ బయటపెట్టుకున్నారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఎవరికి లాభం చేకూరుస్తోంది? అన్నాడీఎంకే ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమికా? లేక అధికారంలో ఉన్న డీఎంకేకా? ద్రవిడ సెంటిమెంట్ ప్రబలంగా ఉండే తమిళనాడులో డీఎంకే పార్టీ చంద్రబాబు వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకునేలా కనిపిస్తోంది. చంద్రబాబు తెలుగువారు అధికంగా నివసించే కోయంబత్తూరు తదితర ప్రాంతాలలో పర్యటించారు.ఈ ప్రాంతాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన తెలుగు ప్రజలే ఎక్కువ. దశాబ్దాలుగా అక్కడ జీవనం సాగిస్తున్న వారు తమిళులతో మమేకమైపోయారు. అయినాసరే... కాంగ్రెస్, డీఎంకే కూటమిపై వ్యతిరేకత పెంచే ఉద్దేశంతోనే చంద్రబాబును ఆ ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగించారన్న విమర్శలు వస్తున్నాయి. అదే సందర్భంలో చంద్రబాబు ప్రసంగం కూడా వైరుధ్యాలతో కూడి ఉంది. పైగా తన బలహీన పాయింట్లను ప్రచారం చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అనిపిస్తుంది.తమిళనాడులో యాంటి హింది సెంటిమెంట్ అధికం. కానీ చంద్రబాబు అక్కడకు వెళ్లి హిందీ భాషను ప్రమోట్ చేసేలా తమిళుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడారు. ఇది సహజంగానే అక్కడి ప్రజలకు నచ్చదు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అన్నా డీఎంకేకి కూడా ఇది రుచించదు. చిత్రమేమిటంటే తమిళనాడులో ఎన్ని భాషలు వీలైతే అన్ని నేర్చుకోవాలని చెప్పిన చంద్రబాబు ఆంధ్రలో మాత్రం ఆంగ్ల మీడియాన్ని వ్యతిరేకించారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెడితే దానిని తీవ్రంగా తప్పుపట్టారు.బాబు సన్నిహితులు దీనిపై హైకోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. హిందీ నేర్చుకుంటే ఎక్కువ మేలు జరుగుతుందా?లేక ఆంగ్లం బాగా చదివితే అధికంగా ఉపయోగం ఉంటుందా అన్నది తమిళులకు తెలియదా! మీడియా సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా డీఎంకేకి మేలు చేసినట్లయిందని కొంతమంది విశ్లేషించారు. అలాగే కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన డీఎంకే అదే పార్టీతో కలవడం ఏమిటనే చిత్రమైన వాదన తీసుకువచ్చారు. ఇక్కడే ఆయన పరస్పర విరుద్దంగా మాట్లాడడమే కాకుండా, సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది.ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ఢిల్లీలో తాకట్టు పెట్టిందని ప్రచారం చేసేవారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఆరంభించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ పార్టీనే విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్న తర్వాత ఈయన కాంగ్రెస్ తో కలవకుండా ఉన్నారా అంటే అదీ లేదు. గతంలో అంటే వేరే రాష్ట్రానికి వెళ్లి ఏమి చెప్పినా, అక్కడి జనానికి తెలియదు కనుక ఎలాగో నడిచిపోయేది. ఈ రోజుల్లో అలా కాదు. ఎవరు ఎక్కడ మాట్లాడినా, అందులో తేడా ఉంటే క్షణాలలో సోషల్ మీడియాలో వీడియోలతో సహా వచ్చేస్తోంది. చంద్రబాబు కూడా అలాగే దొరికిపోయారనుకోవాలి.1983 ఎన్నికలలో కూడా చంద్రబాబు తన మామ ఎన్.టి.ఆర్.ను కాదని కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయారు.ఆ తర్వాత టీడీపీలోకి ప్రవేశించి, ఆధిపత్యం సాధించుకున్నారు. 2013లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. బీజేపీతో కొన్నిసార్లు, ఇతర పార్టీలతో కొన్నిసార్లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు.ఆ క్రమంలో 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో కలిసి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వదలి వేసినా, 2023 శాసనసభ ఎన్నికలలో పరోక్షంగా తెలంగాణలో కాంగ్రెస్కు సహకరించారన్నది బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ వద్ద టిడిపి జెండాలు కూడా అప్పట్లో రెపరెపలాడాయి. ఇప్పటికీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతల అనుబంధం తెలిసిందే. కాకపోతే ఈ విషయాలేవీ తమిళులకు తెలియవన్నది ఆయన నమ్మకం కావచ్చు.ఇది ఒక కోణం అయితే కాంగ్రెస్తో స్నేహం చేస్తున్న రోజుల్లో సోనీయాగాంధీ, రాహుల్ గాంధీలతో కలిసి సభలలో పాల్గొన్నారు.బిజెపి నేతలను ముఖ్యంగా ప్రధాని మోడీని తీవ్రమైన పరుష భాషలో విమర్శించేవారు.ఆ క్రమంలో అప్పట్లో తమిళనాడు వెళ్లి ప్రస్తుత ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోడీ కన్నా స్టాలిన్ సమర్థమైన నేత అని చంద్రబాబు ప్రశంసించారు. మామూలుగా అయితే ఈ అంశం పెద్దగా ప్రస్తావనకు వచ్చేది కాదేమో. కాని స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించిన నేపథ్యంలో ఈ వీడియోలన్ని బయటకు వచ్చాయి. చంద్రబాబు తన అవకాశవాద రాజకీయాలను తమిళనాడులో మరో సారి బహిర్గతం చేసుకున్నారు. ఇది డీఎంకే కే మేలు చేసే అవకాశం ఉంటుంది. అనవసర విషయాలు ప్రస్తావించి ఎన్డీయే కూటమిని డిఫెన్స్ లో పడేసినట్లు అనిపిస్తుంది.నిజానికి చంద్రబాబు ఈ టూర్లో కాంగ్రెస్పై మరీ తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేయలేదు. సాధారణంగా ఆయన తన ప్రత్యర్ధులపై వ్యక్తిత్వ హననానికి పాల్పతుంటారు. అందులో మంచి, చెడు కూడా చూడరు. అలాంటిది ఈ ప్రచారంలో కాంగ్రెస్ లేదా డీఎంకే ముఖ్యనేతలెవ్వరిని వ్యక్తిగతంగా విమర్శించకుండా జాగ్రత్త పడ్డారు. కాకపోతే తమిళనాడు ప్రభుత్వం వివిధ రంగాలలో వైఫల్యం చెందిందని, చెన్నై వెనుకబడిపోయిందని, అప్పులపాలైందని, మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని.. ఇలాంటి విమర్శలేవో చేశారు. అవన్ని విన్నవారు ఇదేదో ఏపీలో తన ప్రభుత్వం గురించి తానే చెప్పుకుంటున్నట్లుగా ఉందని చమత్కరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ తమిళనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా బలమైన రాష్ట్రం. చెన్నై ఉపాధి కేంద్రంగా ఉంది.ఏపీ నుంచి అక్కడికి వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. అదే టైమ్ లో ఏపీ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారింది. ఈ రెండేళ్లలోనే చంద్రబాబు సర్కార్ రూ.355000 కోట్లకు పైగా అప్పు చేసి దేశంలో రికార్డు సృష్టించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో అనేకం అమలు కాలేదు.వి శాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చేసినట్లు, ఇతరత్రా ఏదో అభివృద్ది జరిగిపోతున్నట్లు భ్రమ కల్పించడానికి ప్రయత్నించారు. ఈ విషయాలేవి తమిళ ప్రజలకు పెద్దగా అవసరం లేనివే. లేని గొప్పలు చెప్పుకుని ఏపీలో ఎల్లో మీడియాకు బానర్ కధనాలు ఇవ్వడమే లక్ష్యం కావచ్చు.ఏపీలో మద్యం బెల్ట్ షాపులు ప్రభుత్వం పరువు తీస్తున్నాయి. మద్యాన్ని అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.నకిలీ మద్యం ప్లాంట్ కూడా నడిచిన వైనం బయటపడిన సంగతి తెలిసిందే. డబుల్ ఇంజన్ సర్కార్ తో బుల్లెట్ వేగంతో అభివృద్ది అంటూ ప్రచారం చేశారు.కాని కేంద్రం ద్వారా ఏపీకి ఈ రెండేళ్లలో కలిగిన లాభం ఏమిటో ఆయన వివరించలేకపోయారు. అమరావతిలో కొత్త ఎయిర్ పోర్టు కడుతున్నామని చెప్పుకున్నారు. దాని అవసరంపై టీడీపీ మేధావులే పెదవి విరుస్తున్నారు.అమరావతి పేరుతో వేల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలను భయపెడుతున్న విషయం తమిళులకు తెలియకపోవచ్చు. తమిళనాడులో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేరే విషయం. చివరిగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక వ్యంగ్య వ్యాఖ్యను ప్రస్తావించుకోవాలి.స్టాలిన్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ కామెంట్ చేశారట.'చంద్రబాబు 1995లో నన్ను మంచోడు అన్నారు. 2004లో కాదన్నారు. 2009లో మంచోడు అన్నారు. 2014లో కాదు అన్నారు. 2019లో మళ్లీ నన్ను మంచోడు అని మెచ్చుకున్నారు.ఇప్పుడు 2026లో తిరిగి నేను మంచోడిని కాదు అని అంటున్నారు. ఇలాంటి వ్యక్తి మాటలు తమిళనాడు ప్రజలు పట్టించుకోరు" అని అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి చంద్రబాబు జవాబు ఇచ్చే పరిస్థితి ఉంటుందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గిల్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి ఆమె నియామకం అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నియామకంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లీసా గిల్ సీజేగా నియమితులయ్యారు. జస్టిస్ గిల్ ప్రస్తుతం హైకోర్టులో నెంబర్ 2గా కొనసాగుతున్నారు. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గిల్.. గత నెల 6న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ ఠాకూర్ పదవీ విరమణ అనంతరం జస్టిస్ గిల్ను సీజేగా ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25న సీజేగా ఆమెతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయిస్తారు.ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం 1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
అప్పుల ‘నెట్’లో ఆస్పత్రులు
సాక్షి, అమరావతి: ఇప్పటికే 23 నెలల పాలనలో రికార్డు స్థాయిలో రూ.3.56 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ‘ఆరోగ్యశ్రీ’ ఊపిరి తీస్తోంది! రూ.మూడు వేల కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు వరుసగా సమ్మెలోకి వెళుతుండటంతో బకాయిలన్నింటినీ వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని నమ్మబలికి మరోసారి మోసానికి సిద్ధమైంది. ఆస్పత్రుల బకాయిలు తీర్చడం కోసం అప్పులు చేస్తామంటూ ఆరోగ్యశ్రీ చరిత్రలోనే వింత సంప్రదాయానికి నాంది పలకడమే కాకుండా.. ఆ అప్పులకు నెట్వర్క్ ఆస్పత్రులు ష్యూరిటీగా ఉండాలంటూ దారుణమైన నిబంధన విధించడం.. ప్రభుత్వమే పక్కా కాబూలీ వ్యాపారుల తరహాలో వ్యవహరిస్తుండటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం.. ఆగిన ఆసరా..అధికారం చేపట్టి రెండేళ్లు కూడా తిరక్కుండానే ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు ఛిన్నాభిన్నం చేసేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో సూది మందు, దూదికి కూడా తీవ్ర కటకటలాడే పరిస్థితులు నెలకొన్నాయి. అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిన పేద రోగులను మందులు బయట కొనుక్కోవాలంటూ ప్రభుత్వమే అదనపు భారం మోపుతోంది. ఆరోగ్యశ్రీని నీరుగార్చడంతోపాటు రోగి కోలుకునే సమయంలో ఆర్థిక సాయంతో ఆదుకునే ఆసరా పధకాన్ని నిలిపివేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో శ్రీకారం చుట్టిన నాడు–నేడు కార్యక్రమాన్ని పూర్తిగా గాలికి వదిలేయడమే కాకుండా ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టేస్తూ మన విద్యార్థుల వైద్య విద్య కల, పేదల ఉన్నత వైద్యానికి చంద్రబాబు సర్కారు గండి కొడుతోంది. 104, 108 సేవలు స్కామ్లుగా మారిపోయాయి. చివరకు వైద్య పరికరాల కొనుగోళ్లలోను భారీ అవినీతికి పాల్పడుతున్నారు. మొత్తం ఆరోగ్య వ్యవస్థనే కుప్ప కూల్చేశారు. ఏపీలో ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వేలో వెల్లడైంది.మరో మోసానికి సిద్ధం..!రూ.3 వేల కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిల సాధన కోసం నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లడంతో బకాయిలన్నీ ఓటీఎస్లో ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం దీన్ని నిలబెట్టుకోకపోవడంతో ఇటీవల మరోమారు ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. దీంతో తొలి విడతలో రూ.వెయ్యి కోట్ల బకాయిలు విడుదల చేస్తామని నమ్మబలికి రోజుకో తిరకాసుతో చంద్రబాబు సర్కారు చుక్కలు చూపిస్తోంది. ఓటీఎస్ కోసం ప్రత్యేకంగా అప్పు చేస్తామంటూ, ఆ అప్పులకు అయ్యే వడ్డీ కోసం ఆస్పత్రులకు ఇవ్వాల్సిన మొత్తంలో 8 శాతం కోత విధించనుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ను ష్యూరిటీగా పెట్టి బ్యాంక్ నుంచి అప్పు చేయాలని ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. అయితే ట్రస్ట్కు రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు తేల్చి చెప్పడంతో ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా రుణాలు సమీకరించి వాటి ద్వారా ఆస్పత్రులకు నిధులు విడుదల చేస్తామని నమ్మబలికింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఆస్పత్రి మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంటుందని పేర్కొంది. ‘‘పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోతే ఆస్పత్రుల నుంచి వసూలు చేస్తాం..’’ అని ఆ అగ్రిమెంట్లో నిబంధన పెట్టారు. వడ్డీ, అసలు మొత్తాన్ని ఆస్పత్రులే చెల్లించాల్సి ఉంటుందని షరతు విధించారు. ఈ నిబంధన చూసి ఆస్పత్రుల యజమానులు కంగుతిన్నారు. దీన్ని తొలగించాలని ఏపీ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. సాధారణంగా ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో పది శాతం టీడీఎస్ కింద కట్ అవుతుంది. మరోవైపు అప్పులకు వడ్డీ ఆస్పత్రులే కట్టాలంటూ 8 శాతం కోత పెడుతున్నారు. ఇటు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా అటు ఆస్పత్రుల ముక్కుపిండి వసూలు చేసే విధానాలపై నెట్వర్క్ ఆస్పత్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ప్రజారోగ్యంతో చెలగాటం..ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభమైన నాటి నుంచి ప్రభుత్వం నేరుగా ఖజానా నుంచి ఆస్పత్రులకు బిల్లులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 2024లో చంద్రబాబు గద్దెనెక్కాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా రూపుమాపే కుట్రలో భాగంగా బిల్లులు చెల్లించకుండా తొక్కిపెట్టారు. తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు చెందిన బసవతారకం ఆస్పత్రికి మాత్రం అడ్డదారుల్లో బిల్లులు ఇస్తూ, మిగిలిన ఆస్పత్రులకు రూ. 3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ఎఫ్ఆర్బీఎం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలన్నింటినీ ఉల్లంఘిస్తూ 23 నెలల్లో రూ.3.56 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసి ఆరోగ్యశ్రీ బిల్లులు మాత్రం చెల్లించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. -
శ్రీహరి, గిరీష్ అరెస్ట్కు పోలీసుల యత్నాలు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్కుమార్రెడ్డి రిమాండ్ను తిరస్కరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసిన తరువాత కూడా వారి అరెస్ట్కు పోలీసులు ప్రయత్నాలు చేశారని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి బుధవారం హైకోర్టుకు నివేదించారు. అలా అయితే ఆ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఆదేశించారు. దీనిపై ఈ నెల 29వ తేదీన పూర్తి స్థాయిలో వాదనలు వింటానని తెలిపారు. అప్పటి వరకైనా కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుధాకర్రెడ్డి అభ్యర్థించారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ‘కుప్పం కోర్టు ఆదేశాల అమలును మాత్రమే నిలుపుదల చేశాం తప్ప, వాటిని రద్దు చేయలేదు. అందువల్ల శ్రీహరి, గిరీష్ లను అరెస్ట్ చేస్తారన్న ఆందోళన అవసరం లేదు’ అని పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో శ్రీహరి, గిరీష్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ప్రత్యేకంగా ఆదేశించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కుప్పం కోర్టు ఉత్తర్వులను సవా లు చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్ లక్ష్మణరావు కుప్పం కోర్టు రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. -
నేతన్నల నిరసనాగ్రహం
మంగళగిరి టౌన్: చేనేత కార్మికులు నిరసన గళమెత్తారు. తమ సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పోరుబాట పట్టారు. మంగళగిరి సమీపంలోని చినకాకాని వై జంక్షన్లోని నేతన్న సర్కిల్ వేదికగా బుధవారం చేనేత సంఘాల నాయకులు 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. దీక్షను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ కె. వియన్నారావు ప్రారంభించి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికుల సామాజిక భద్రత కోసం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాతో కూడిన ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో కనీసం రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి చేనేత కార్మికుడికి ఏడాదికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలకు రావాల్సిన రూ.203 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న ‘నేతన్న నేస్తం’ నిధులు విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీ మేరకు మంగళగిరిలో 20 వేల ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే ‘చలో అమరావతి’ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కో–కన్వినర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, నాయకులు పిల్లలమర్రి బాలకృష్ణ , బండారు ఆనంద్ ప్రసాద్, సీపీఎం నేత రమాదేవి, ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు ఆదేశాలు
సాక్షి,విజయవాడ : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రైవేట్పరం చేసేందుకే మొగ్గుచూపారు. ఈ మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.పీపీపీ పనులు నెలరోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. మొత్తం 10 మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇచ్చేయాలని సూచించారు. ఫేజ్ 1లో నాలుగు, ఫేజ్ 2లో ఆరు మెడికల్ కాలేజీలు పీపీపీకి అప్పగించనుంది. గతంలో పిలిచిన టెండర్లకు ప్రైవేట్ సంస్థలు స్పందించలేదు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
తెచ్చిన అప్పు అంతా ఏం చేస్తున్నారు?: లేళ్ల అప్పిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: రైతులు కష్టాల్లో ఉంటే మంత్రులు సింగపూర్లో షికార్లు చేస్తారా? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల కోసం ఖర్చు చేయటానికి డబ్బులు లేవు గానీ.. షికార్లకు డబ్బులుంటాయా? అంటూ నిలదీశారు. చంద్రబాబు హయాంలో ఏ రైతూ బాగుపడింది లేదు. వ్యవసాయం దండగ అని తన ‘మనసులో మాట’ పుస్తకంలో రాసుకున్న వ్యక్తి చంద్రబాబు. అందుకే ఇప్పుడు మళ్లీ ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోయినా పట్టించుకోవటం లేదు’’ అంటూ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మామిడి, ధాన్యం, పత్తి, మిర్చి, ఉల్లి, టమోటా, మొక్కజొన్న.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధరల్లేదు. అయినా చంద్రబాబు అధికారులతో ఒక్ సమీక్ష సమావేశం కూడా ఎందుకు నిర్వహించలేదు?. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పని చేస్తుందా?. రైతులను ఆదుకోవడానికి డబ్బుల్లేవంటారా?. లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు?. చంద్రబాబు రైతు వ్యతిరేకి. మిగతా రాష్ట్రాల్లో రైతులను అందుకునేందుకు అక్కడి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కానీ చంద్రబాబుకు మాత్రం ఆ స్పృహ ఎందుకు లేదు?’’ అంటూ అప్పిరెడ్డి ప్రశ్నించారు.‘‘ప్రపంచానికి పాఠాలు నేర్పానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటారు. మరి అలాంటి వ్యక్తి తన మంత్రులకు సింగపూర్లో ట్రైనింగ్ ఇస్తారట. రైతుల కోసం డబ్బుల్లేవంటూ మంత్రుల విహార యాత్రలకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారా?. రైతు సమస్యల పరిష్కారానికి ఒక్క సమీక్ష సమావేశాన్నైనా చంద్రబాబు ఏర్పాటు చేశారా?. రైతులకు మేలు చేసింది వైఎస్సార్ కుటుంబమే. ఉచిత విద్యుత్ నుంచి రైతు భరోసా కేంద్రాల వరకు వైఎస్సార్, వైఎస్ జగన్ మాత్రమే చేశారు. చంద్రబాబు ఏనాడూ ఏ రైతుకూ మేలు చేయలేదు. రైతుల కన్నీళ్లలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోతుంది’’ అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు
సాక్షి,అమరావతి: ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. 40-60కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
చంద్రబాబూ.. తప్పు చేస్తున్నారు
సాక్షి, అమరావతి: ‘మీరు తప్పు చేస్తున్నారు.. అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు భయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రావిురెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా..’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారంటూ ఎత్తిచూపారు. ‘మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్బాబు మీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా?’ అని నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ ‘‘చంద్రబాబు గారూ.. ఇటీవల మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భయపడి పోతున్నారని అర్థమవుతోంది. ఎన్నికల ముందు అధికారం కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్లు సైతం ఇచ్చి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ చేయకపోగా.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేసేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుకలపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అంటే మీరు భయపడుతున్నారనే కదా దీని అర్థం?⇒ ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటేనే మీ పరిపాలన బాగా లేదనే కదా అర్థం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే కదా దాని అర్థం. మరి అవి ఎప్పుడు నెరవేరుస్తారని అడగడం తప్పా? రెండేళ్లు అవుతున్నా, మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడం నేరమా? రూ.3.50 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. అవేమవుతున్నాయని నిలదీయడం అపరాధమా? వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా.. మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా..⇒ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రావిురెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి, అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా.. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వసూ్తనే ఇస్తామన్న ఐఆర్ ఇవ్వాలని అడగడంలో తప్పేముంది? అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే కదా.. ఉద్యోగుల విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు, మీ మోసపూరిత వైఖరిని అందరూ గమనిస్తున్నారు.⇒ సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారు. మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని, అది తనను బాధించిందని శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం కాదా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా అర్థం?⇒ ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? ప్రతి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులు. ఇది జంగిల్ రాజ్ కాదా? ఉగాది రోజున మీ జీతాలు డబుల్ చేస్తామని వలంటీర్లకు మాట ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కడుపుకొట్టింది నువ్వు కాదా? 2.60 లక్షల మందిని రోడ్డున పడేసి, ఆ వ్యవస్థే లేకుండా చేసిన అరాచకత్వం నీదే కదా? మీ కక్ష సాధింపులకు, మీరు ఉద్యోగులపై పెట్టే ఒత్తిళ్లకు ఒక్క సచివాలయ ఉద్యోగులే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆకస్మిక మరణం పొందింది నిజం కాదా? ⇒ చంద్రబాబు గారూ.. సూటిగా ఒక ప్రశ్న. మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా? చంద్రబాబు గారూ.. మీరు తప్పు చేస్తున్నారు. అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు, భయపడుతున్నారు. -
‘ముఖ్య’నేత సూత్రధారి.. బినామీలు పాత్రధారులు 'లేపాక్షి'.. లేపేద్దాం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విలువైన భూములను సొంతం చేసుకుంటూ బంధుగణానికి, కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్న ‘ముఖ్య’నేత రూ.వేల కోట్ల విలువైన మరో భూదోపిడీకి స్కెచ్ వేశారు! బెంగళూరుకు అత్యంత సమీపంలో శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్కు చెందిన 8,844 ఎకరాల భూములను కాజేసేందుకు తన బినామీలను రంగంలోకి దించారు. రూ.పది వేల కోట్ల విలువైన ఆ భూములను సొంతం చేసుకునేందుకు ముఖ్యనేత తనకు అత్యంత సన్నిహితుడైన బీఎస్సార్ ఇన్ఫ్రా అధినేత బలుసు శ్రీనివాసరావును తెరపైకి తెచ్చి నయాన భయాన గుప్పిట పట్టే కుట్రలు వేగవంతం చేశారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ఆస్తిని బరి తెగించి స్వా«దీనం చేసుకునే కుట్ర పన్నారు. ఎన్సీఎల్టీ నుంచి వేలంలో దక్కించుకున్నవారు వాటిని బలుసుకు విక్రయించేలా ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. ఇప్పటికే మూడు నాలుగు దఫాలు సమావేశాలు జరిగాయి. ఆ భూములను బలుసుకు అప్పగించాలని ముఖ్యనేత స్వయంగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేడో రేపో ఒప్పందానికి శతవిధాలా యత్నాలు జరుగుతున్నాయి. రాజధాని, సాగునీటి ప్రాజెక్టుల్లో రూ.8,300.12 కోట్ల విలువైన పనులను బీఎస్సార్ ఇన్ఫ్రాకు ఇప్పటికే అప్పగించడం గమనార్హం. దీనికి సంబంధించి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో రూ.830 కోట్లు బీఎస్సార్కు చెల్లింపులు జరిగాయి. ఆ నిధులతోనే లేపాక్షి భూములను హస్తగతం చేసుకునే దిశగా ముఖ్యనేత వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యనేత అధికారంలోకి రాగానే తనకు సన్నిహితుడైన సెల్కాన్ అధినేత గురుస్వామినాయుడు ద్వారా తొలుత కథ నడిపించారు. ఫీల్డ్ విజిట్ పేరుతో లేపాక్షి భూముల్లో కాలుమోపిన ఆయన వాటిని ముఖ్యనేత పరం చేసేందుకు కలెక్టర్, పరిశ్రమల శాఖ కార్యదర్శితో చర్చలు జరిపారు. తమకు ఇంకా భూములు కావాలని అధికారులకు చెప్పారు. లేపాక్షి భూములకు సంబంధించి గురుస్వామినాయుడు దాదాపు రూ.150 కోట్ల మేర చెల్లింపులు జరిపి అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాటిని కొట్టేయటానికి 20 వేల ఎకరాల్లో మెగా ఇండ్రస్టియల్ పార్క్.. డిఫెన్స్ హబ్ ఏర్పాటు అంటూ ప్రచారానికి తెర తీశారు. గత ప్రభుత్వంలో లేపాక్షి భూములను కాజేస్తున్నారంటూ ఎల్లోమీడియాతో కలసి టీడీపీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. ఇప్పుడు అవే భూములను అధికారంలోకి రాగానే బలుసు ద్వారా ముఖ్యనేత దక్కించుకుంటున్నారని పారిశ్రామికవర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యనేత స్వయంగా బరి తెగించి సాగిస్తున్న ఈ దోపిడీ బాగోతం ఇలా ఉంది..! ఎల్లో మీడియా లెక్క ప్రకారమే రూ.10 వేల కోట్లు! బెంగళూరుకు అత్యంత సమీపంలో శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్కు చెందిన 8,844 ఎకరాల భూముల విలువ రూ.పది వేల కోట్లకు పైమాటేనని 2023లో టీడీపీ నేతలతోపాటు ఎల్లో మీడియా పేర్కొంది. ఇప్పుడు విలువైన ఆ భూములను తనకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావు పేరుతో కారుచౌకగా కొట్టేయడానికి ‘ముఖ్య’నేత స్కెచ్ వేశారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే రాజధానిలో రూ.7,440.08 కోట్ల విలువైన పనులతోపాటు సాగునీటి ప్రాజెక్టుల్లో (హంద్రీ–నీవా రెండో దశ కాలువ లైనింగ్లో రెండు ప్యాకేజీలు.. పోలవరం ఎడమ కాలువ ఆరు, ఎనిమిదో ప్యాకేజీలు) రూ.860.04 కోట్లు.. వెరసి రూ.8,300.12 కోట్ల విలువైన పనులను బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు కట్టబెట్టింది. కాంట్రాక్టు పనుల అగ్రిమెంటు విలువలో పది శాతం అంటే రూ.830 కోట్లను ఇప్పటికే బలుసుకు మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో ఇచ్చేసింది. అవే నిధులతో ఇప్పుడు లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని.. ఇప్పటికే డబ్బులు చేతులు మారాయని విశ్వసనీయ సమాచారం. ఆ భూముల అప్పగింత ఒప్పందంపై నేడో రేపో ఒప్పందాలు జరగనున్నట్లు పారిశ్రామికవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రూ.పది వేల కోట్ల విలువైన లేపాక్షి నాలెడ్జ్ భూములను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి రూ.500 కోట్లకే కాజేస్తున్నారంటూ ప్రస్తుత ఆరి్థక మంత్రి పయ్యావుల కేశవ్ 2023లోతీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇదే అదునుగా ఎల్లో మీడియా వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేసింది. కానీ.. అవన్నీ పచ్చి అబద్ధాలేన్నది తేలిపోయింది. ఇప్పుడు అవే భూములను బలుసు శ్రీనివాసరావు ద్వారా ముఖ్యనేత కాజేస్తున్నారంటూ పారిశ్రామికవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం నిర్మించిన భవనం ఎన్సీఎల్టీలో రూ.401 కోట్లకు దక్కించుకున్న సుబ్బారెడ్డి, సీవీ రెడ్డి.. ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ యాజమాన్యం ఒక్కరే. తీసుకున్న రుణాలను ఇందూ ప్రాజెక్ట్స్ చెల్లించలేకపోవడంతో 2018లో ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్)లో క్రిప్ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్) కింద బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేశాయి. దాంతో ఈ వ్యవహారంపై ఎన్సీఎల్టీ ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ను నియమించింది. ఇందూ ప్రాజెక్ట్స్పాటు దాని అనుబంధ సంస్థలను విక్రయించడానికి 2020లో ఎన్సీఎల్టీ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్లో రూ.500 కోట్లకు ఎర్లిన్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ ఇందూ ప్రాజెక్ట్స్, దాని అనుబంధ సంస్థలను దక్కించుకుంది. అయితే ఎన్సీఎల్టీలో సకాలంలో ఎర్లిన్ ప్రాజెక్ట్స్ డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో ఆ బిడ్డింగ్ను రిజల్యూషన్ ప్రొఫెషనల్ రద్దు చేశారు. దాంతో 2023లో మళ్లీ బిడ్డింగ్ నిర్వహించగా రూ.401 కోట్లకు ఇందూ ప్రాజెక్ట్స్తోపాటు దాని అనుబంధ సంస్థలను బి.సుబ్బారెడ్డి, సీవీ రెడ్డి దక్కించుకున్నారు. 2024 మార్చిలో ఎన్సీఎల్టీలో రూ.401 కోట్లను డిపాజిట్ చేసి ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్తోపాటు అనుబంధ సంస్థలను వారిద్దరూ సొంతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘లేపాక్షి’పై కన్నురాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములపై ‘ముఖ్య’నేత కన్నేశారు. సెల్ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ‘సెల్కాన్’ అధినేత గురుస్వామినాయుడును ముందుపెట్టి కథ నడిపించారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి, సీవీ రెడ్డిలతో ఆయన ద్వారా చర్చలు సాగించారు. గురుస్వామినాయుడు లేపాక్షి భూముల వద్దకు వెళ్లి కలియతిరిగారు. అప్పటి శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ కార్యదర్శితోనూ చర్చలు జరిపారు. అయితే తాజాగా తనకు అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావును ముందుపెట్టి ఆ భూములను సొంతం చేసుకునేలా ముఖ్యనేత మరింత పకడ్బందీగా ప్రణాళిక అమలు చేశారు. సుబ్బారెడ్డి, సీవీ రెడ్డిలతో ముఖ్యనేత నేరుగా సంప్రదించి.. కారు చౌకగా తమకు ఆ భూములు అప్పగించాలని ఒత్తిడి తెచ్చినట్లు పారిశ్రామికవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉన్నత స్థాయి నుంచి తీవ్రంగా వస్తున్న ఒత్తిళ్లకు తాళలేక లేపాక్షి భూములను బలుసు శ్రీనివాసరావుకు విక్రయించడానికి అంగీకరించినట్లు పారిశ్రామికవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అడ్వాన్స్గా కొంత డబ్బు కూడా చెల్లించారని.. భూముల విక్రయం ఒప్పందంపై ఏ క్షణమైనా సంతకాలు చేయటానికి రంగం సిద్ధం అయినట్లు చెబుతున్నాయి.నాడు వద్దు.. నేడు ముద్దుదేశంలో అత్యంత వెనుకబడిన ఉమ్మడి అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా.. భారీ ఎత్తున ఉపాధి అవకాలు కల్పించడమే లక్ష్యంగా పారిశ్రామికాభివృద్ధికి 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు అత్యంత సమీపంలో కర్ణాటక–ఏపీ సరిహద్దులో గోరంట్ల–చిలమత్తూరు మండలాల్లో ఎన్హెచ్–44 పక్కనే ఏపీఐఐసీ ద్వారా 8,844 ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూములను తమకు కేటాయిస్తే డిఫెన్స్, ఏరోస్పేస్, ఎల్రక్టానిక్, ఐటీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటుచేస్తామని లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు ఉన్న అర్హత ఆధారంగా 8,844 ఎకరాల భూమిని 2008లో ప్రభుత్వం కేటాయించింది. పరిశ్రమల కోసం అంత భారీ ఎత్తున భూములు కేటాయించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రాద్ధాంతం చేశారు. ఈ భూముల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ క్షిపణుల తయారీ పరిశ్రమ కోసం బీడీఎల్(భారత్ డైనమిక్స్ లిమిటెడ్), హెలికాఫ్టర్, విమానాల తయారీ పరిశ్రమ కోసం హెచ్ఏఎల్(హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్), ఈసీఐఎల్(ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) సంస్థలు లేపాక్షి నాలెడ్జ్ హబ్తో ఒప్పందాలు చేసుకున్నాయి. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐఎస్సీ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్) సంస్థ లేపాక్షి నాలెడ్జ్ హబ్లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. పలు ప్రైవేటు పారిశ్రామిక దిగ్గజాలు పరిశ్రమల స్థాపన కోసం లేపాక్షి నాలెడ్జ్ హబ్తో ఒప్పందాలు చేసుకున్నాయి. 2009 సెపె్టంబరు 2న వైఎస్సార్ హఠాన్మరణం చెందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ను రాజకీయంగా అణచివేసేందుకు సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కై కుట్రలు చేస్తూ వచ్చారు. జగన్పై అక్రమ కేసులు బనాయించారు. అందులో భాగంగా ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్లపై కూడా కేసులు పెట్టారు. 2013లో నాటి కిరణ్కుమార్రెడ్డి సర్కార్ లేపాక్షి నాలెడ్జ్ హబ్కు కేటాయించిన భూములను రద్దు చేసింది. దీనిపై లేపాక్షి నాలెడ్జ్ హబ్ హైకోర్టును ఆశ్రయించింది. కిరణ్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అక్రమ కేసుల విచారణలో భాగంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను ఈడీ అటాచ్ చేసింది. చంద్రబాబు, కాంగ్రెస్ అధిష్టానం సైంధవుల్లా అడ్డుపడకపోయి ఉంటే శ్రీసిటీని తలదన్నే రీతిలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ సెజ్ అభివృద్ధి చెందేదని.. వెనుకబడిన అనంతపురం జిల్లా రూపురేఖలు మారేవని.. ప్రజల జీవనప్రమాణాలు పెరిగేవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. నాడు వద్దన్న భూములే ఇప్పుడు చంద్రబాబు సర్కార్కు ముద్దయ్యాయి. లేపాక్షి భూములతోపాటు 20 వేల ఎకరాల్లో మెగా ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తుండటం గమనార్హం. 2022–23లో పరిశ్రమల ఏర్పాటు కోసం చిలమత్తూరు మండలం టేకులోడులో ఎకరం ధర రూ.25 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఇప్పుడు ఎకరానికి రూ.12.50 లక్షలను పరిహారంగా ముట్టజెప్పి చంద్రబాబు సర్కార్ లాక్కుంటోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఉపాధి’పై ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, అమరావతి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద పనులు చేసిన కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వల్ల పేదల కడుపులు మాడిపోతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. 2023–24తో పోల్చితే 2025–26లో రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన ఉపాధి పనులు, వేతనాల వృద్ధి రేటు వివరాలు ‘నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. అలాంటి చరిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏను అత్యుత్తమంగా అమలు చేయటంలో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా ఒకటిగా ఉండేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో పూర్తిగా వెనుకబడి పోయింది.ఉపాధి పొందిన కుటుంబాలు, వారి ఖర్చులు, వ్యయం వంటి వివరాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. ఈ రెండేళ్లలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండటానికి కూడా ఇదొక కారణంగా ఉంది. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అంతులేని ధన దాహం, అవినీతి వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో ప్రభుత్వ తీరును కడిగి పారేశారు. -
ప్రజారోగ్యం.. ‘ప్రైవేట్’ భాగ్యం!
సాక్షి, అమరావతి: ఇటు ప్రజలు వ్యాధుల బారిన పడకుండా రోగాలను కట్టడి చేయడం.. అటు రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు అందించడంలో చంద్రబాబు సర్కార్ దారుణంగా విఫలమైనట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్లో అనారోగ్య బాధితుల్లో ఏకంగా 69.9 శాతం మంది చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు ఆ సర్వే నివేదిక పేర్కొంది. గత ప్రభుత్వంలో పూర్తి భరోసా కచ్చించిన ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులు రెండేళ్ల వ్యవధిలోనే తారుమారు కావడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని తేలింది. అపర సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని ప్రభుత్వమే స్వయంగా నీరుగార్చడం.. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.వేల కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టడం.. ప్రభుత్వాస్పత్రుల్లో కనీసం సూది, దూది లాంటి వాటికీ దిక్కులేకపోవడం.. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం లాంటివి ఈ దుస్థితికి ప్రధాన కారణం. ఏపీలో ప్రైవేట్లో వైద్యం కోసం ప్రజలు జేబు నుంచి సగటున రూ.53,303 చొప్పున ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు గద్దెనెక్కాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్కు నిత్యం కొరత నెలకొంది. దీంతో ప్రైవేట్ ల్యాబ్స్లో పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లినా రోగులకు భారం తప్పడం లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు నీరుగారిపోవడంతో ప్రజలు తమ సొంత జేబుల నుంచి రూ.4,972 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని తేలింది. ఏపీలో అనారోగ్యం బారినపడిన ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ ఇటీవల విడుదల చేసిన నేషనల్ శాంపిల్ సర్వే 80వ నివేదిక సాక్షిగా రుజువైంది.ఆందోళనకరంగా ఆరోగ్య సూచీలు..! చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వైద్య రంగం రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఉచితంగా ఇవ్వాల్సిన మందులు, సర్జికల్స్ అందుబాటులో ఉండటం లేదు. ఇతర సదుపాయాలకూ తీవ్ర కొరత నెలకొంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లి ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అనారోగ్య బాధితుల్లో 26.9 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతుండగా మిగిలిన వారు ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సర్వే తెలిపింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య ‘గృహ సామాజిక వినియోగం : ఆరోగ్యం’ సర్వేను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. 1,39,737 గృహాల నుంచి సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేశారు. ఆరోగ్య సూచీలకు సంబంధించి దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పలు ప్రతికూల అంశాల్లో ముందు వరుసలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ‘అప నమ్మకం’లో ఐదో స్థానంప్రభుత్వాస్పత్రుల పట్ల ప్రజల అపనమ్మకంలో ఏపీ దేశంలో ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 69.9 శాతం మంది రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించారు. అనారోగ్య బాధితుల్లోనూ ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. సర్వే నిర్వహణకు ముందు 15 రోజుల్లో అనారోగ్యానికి గురైన వారు జాతీయ స్థాయిలో 13.1 శాతంగా ఉండగా ఏపీలో 21.1 శాతం మంది వ్యాధుల బారిన పడ్డారు. అనారోగ్య బాధితుల్లో మనకంటే ముందంజలో ఉన్న పశ్చిమ బంగ, కేరళ రాష్ట్రాలు ప్రభుత్వ వైద్య సేవల్లో మాత్రం మెరుగైన స్థానాల్లో నిలవడం గమనార్హం. దేశంలో అత్యధికంగా అనారోగ్య బాధితులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, హర్యానా, చత్తీస్గడ్, ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. జనం జేబులు గుల్ల చికిత్సల కోసం ప్రైవేట్ ఆస్పత్రులపై ఆధారపడాల్సి రావడంతో రాష్ట్రంలో ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు నీరుగారిపోవడంతో ప్రాణాలు దక్కించుకునేందుకు అప్పుల పాలవుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 3 వేలకుపైగా ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 2019–24 మధ్య ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. 104, 108 వాహనాలను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ వైద్యానికి భరోసా కల్పించడంతోపాటు ఫ్యామిలీ డాక్టర్, ఇంటివద్దకే మందులు అందించడం లాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టడంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన అగత్యం తప్పింది. -
సర్కారు నిర్వాకం.. జనంపై అప్పుల భారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోగా తిరిగి జనంపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పుల భారం మోపుతోంది. 23 నెలల పాలనలోనే మొత్తం రూ.3,56,655 కోట్ల మేర అప్పులు చేసింది. ఈ లెక్కన చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున రూ.15,506 కోట్లు, రోజుకు రూ.516 కోట్లు చొప్పున అప్పు చేసింది. రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని పెంచడంలో, ఖజానాకు రాబడి పెంచడంలోనూ వైఫల్యం చెందిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని మాత్రం అత్యంత వేగంగా అప్పుల ఊబిలో ముంచేశారు. మంగళవారం 7.81 శాతం వడ్డీతో రూ.4,600 కోట్ల బడ్జెట్ అప్పు చేశారు. దీంతో చంద్రబాబు సర్కారు 23 నెలల్లోనే రికార్డు స్థాయిలో బడ్జెట్లోనే రూ.1,98,564 కోట్ల అప్పు చేసింది. ఇప్పటి వరకు కార్పొరేషన్ల పేరుతో గ్యారెంటీ ఇచ్చి తెచ్చిన అప్పులు, రాజధాని పేరుతో చేసిన అప్పులతో కలిపి మొత్తం రాష్ట్ర అప్పులను రూ.9,88,859 కోట్లకు పెంచేసింది. బడ్జెట్ బయట, బడ్జెట్లోపల అందిన కాడికి అప్పులు చేసినా సూపర్ సిక్స్ హామీలు మాత్రం అమలు చేయలేదు. రాష్ట్రాభివృద్ధి.. కొత్త ఉద్యోగాలూ లేవు. చేసిన అప్పులన్నీ రెవెన్యూ వ్యయానికి మళ్లించేసి, రాష్ట్ర ప్రజలను దారుణమైన అప్పుల్లోకి నెట్టేసింది. మరో పక్క వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.1,10,704 కోట్లకు చేరాయి. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లే కాకుండా కొత్తగా కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. ఇంకో వైపు రాజధాని పేరుతో రూ.47,387 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. ఇటీవల మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన గణాంకాల మేరకే వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి బడ్జెట్ అప్పులు, బడ్జెట్ బయట అప్పులు కలిపి మొత్తం రూ.6,32,204 కోట్లుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ అప్పులు ఏకంగా రూ.9,88,859 కోట్లకు పెరిగాయి. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత తక్కువ వ్యవధిలో ఇంత భారీ ఎత్తున అప్పులు చేసిన దాఖలాలు లేవు. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత భారీగా అప్పుల చేసిన ఘనత కేవలం చంద్రబాబు ప్రభుత్వానికే దక్కింది.ఈ మంగళవారం చేసిన అప్పు రూ.4,600 కోట్లు23 నెలల్లో చేసిన మొత్తం అప్పు రూ.3,56,655 కోట్లునెలకు సగటున చేసిన అప్పు రూ.15,506కోట్లురోజుకు సగటున చేసిన అప్పు రూ.516.8 కోట్లు -
సా‘ఫీ’గా చెల్లించకుంటే రద్దు చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోవడంతో ఉన్నత విద్యా రంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఆక్షేపించింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించలేకపోతే రద్దు చేయడమో, పునఃపరిశీలించడమో చేయాలని సూచించింది. మంగళవారం గుంటూరు జిల్లా చినకాకానిలో అసోసియేషన్ సమావేశం జరిగింది. యాజమాన్యాల ప్రతినిధులు ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు రమణాజీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజుల భారాన్ని మోయలేకుంటే వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు కళాశాలలకు కల్పించాలని కోరారు. బకాయిల విడుదలపై ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తుంది తప్ప పైసా విదల్చడం లేదని విమర్శించారు. ఇప్పటి వరకు డిగ్రీ కళాశాలలకు దాదాపు 90శాతం ఫీజులు పెండింగ్లో ఉన్నట్టు చెప్పారు. గత రెండేళ్లుగా కళాశాలలు నిర్వహణ కుంటుపడి దివాళా తీసే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎంకు, మంత్రులకు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు రావట్లేదని, ఈ ప్రభుత్వంలో ఉన్నత విద్యకు ప్రాధాన్యం లేదనే సందేహం కలుగుతోందన్నారు. సింగిల్ మేజర్ వల్ల నష్టమే 2025–26 విద్యా సంవత్సరంలో తీసుకొచ్చిన సింగిల్ మేజర్ విధానంతో నష్టం వాటిల్లుతోందని, విద్యాప్రమాణాలపై ప్రభావం పడుతోందని రమణాజీ ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు తగ్గిపోతుండగా వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో 60–70శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయన్నారు. రాష్ట్రంలో 1100 డిగ్రీ, 250 ఇంజనీరింగ్, 800పైగా ఇతర విద్యా సంస్థలు సేవలందిస్తున్నాయని, వీటి యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఫీజు రీయింబర్స్మెంట్పై ఆమోదయోగ్య నిర్ణయానికి రావాలని హితవుపలికారు. -
‘విజయవాడకు వెస్ట్ బైపాస్ ఉండగా మళ్లీ ఇదేమిటీ?’
విజయవాడ: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో ప్రభుత్వం నిర్బంధ భూసేకరణ చేయాలని చూస్తోందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. కొంతమంది గొంతెమ్మ కోర్కెల కోసం ఇంతమంది రైతుల పొట్ట కొట్టడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు(మంగళవారం, ఏప్రిల్ 21వ తేదీ), అమరావతి రింగ్ రోడ్డు ప్రభావిత గ్రామాల రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐదు జిల్లాలకు చెందిన రైతులతో పాటు వడ్డే శోభనాద్రీశ్వరరావు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద నగరాలకు లేని ఔటర్ రింగ్ రోడ్డు అమరావతిలో అవసరమా? అని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు పునః సమీక్షించుకోవాలని సూచించారు. ‘భూములు కోల్పోవాల్సి వస్తున్న రైతులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. అమరావతి 29 గ్రామాల్లో జనాభా ఎంత?, ఈ 12 ఏళ్లలో ఎంత జనాభా పెరిగింది. దేశంలో పెద్ద పెద్ద నగరాల్లోనే లేని ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడ అవసరమా?, ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఎవరిని సంప్రదించారు.. అసలు ఎవరికి చెప్పారు?, కనీస ఆలోచన లేకుండా రూ. 24,700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?, మొక్కజొన్న కొనమంటే మంత్రి అచ్చెన్నాయుడు డబ్బుల్లేవన్నాడు. 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా?, ఇదేమైనా మీ ప్రైవేట్ ప్రాపర్టీ అనుకున్నారా చంద్రబాబు. మీ హెరిటేజ్ కంపెనీ విస్తరణ అనుకున్నారా చంద్రబాబు. రైతులు... రైతుల భూములు మీకు చీమలు...దోమలు మాదిరి కనిపిస్తున్నాయా?, విజయవాడకు వెస్ట్ బైపాస్ ఉండగా కొత్తగా రింగ్ రోడ్డు అవసరమా?, జాతీయ రహదారులకు 70 మీటర్లు చాలని కేంద్రం చెబుతోంది. కానీ ప్రభుత్వం 140 నుంచి 250 మీటర్లు తీసుకోవాలని చూస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు పై పోరాటం చేయాల్సిందే’ అని పేర్కొన్నారు. -
‘చంద్రబాబూ.. ఎంజీఎన్ఆర్ఈజీఏపై ఇంత నిర్లక్ష్యమా ?’
సాక్షి, తాడేపల్లి: ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ వ్యవస్థ దెబ్బ తింటోందంటూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. అలాంటి చారిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏని అత్యుత్తమంగా అమలు చేయటంలో మిగతా రాష్ట్రాలతోపాటు ఏపీ కూడా ఒకటిగా ఉండేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో పూర్తిగా వెనుకపడి పోయింది...ఉపాధి పొందిన కుటుంబాలు, వారి ఖర్చులు, వ్యయం వంటి వివరాలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ రెండేళ్లలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండటానికి కూడా ఇదొక కారణంగా ఉంది. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అంతులేని ధనదాహం, అవినీతి వలనే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝘁𝗼 𝗥𝘂𝗿𝗮𝗹 𝗘𝗰𝗼𝗻𝗼𝗺𝘆 𝗶𝘀 𝗗𝘄𝗶𝗻𝗱𝗹𝗶𝗻𝗴 From the perspective of Rural economy, effective implementation of the MGNREGA is of vital importance. This programme enhances disposable incomes in rural sections who have highest marginal propensity to… pic.twitter.com/KSvPGgVEsJ— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2026 -
దస్తగిరి కేసులో హైటెక్ కుట్ర..!
సాక్షి, అమరావతి: కడపలోని రిమ్స్ ఆవరణలో జరిగిన హత్య కేసులో హైటెక్ కుట్రలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు శాఖలోనే ఉన్నత స్థాయి అధికారుల మెప్పు కోసం కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అడుగులు వేస్తున్నారు. వ్యక్తిగత గొడవల నేపథ్యంతో పాటు గంజాయి మత్తులో చేసిన హత్య విషయంలోనూ ఏదో ఒక రకంగా ఇరికించాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.అన్ని రకాలుగా దస్తగిరి హత్య విషయంలో హైటెక్ కుట్రను మరిపిస్తున్నారు. రిమ్స్ ఆవరణలో ఉన్న దస్తగిరిని మట్టుబెట్టిన కేసులో దర్యాప్తు పక్కదారి పడుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పచ్చ పత్రికలు, మీడియాకు లీకులిస్తూ అందుకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ను ముందుకు తీసుకెళ్తూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.రిమాండ్ రిపోర్ట్లో వైఎస్సార్సీపీ నేతల ప్రస్తావనకడపలో ఈ నెల 6వ తేదీన జరిగిన దస్తగిరి హత్య కేసులో పోలీసులు పక్షపాతంగా వెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆది నుంచి కూడా ఎవరికీ తెలియకుండా నిందితుల వివరాలు బయటపడకుండా పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై చర్చ సాగుతోంది. దస్తగిరి హత్య కేసులో అన్ని విధాలుగా విచారణ చేస్తున్నామంటూనే పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పేర్లు నిందితుల ద్వారా తెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా దస్తగిరితో పాటు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఇతర నేతలందరూ కలిసిమెలసి ఉంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో వారు చెప్పినట్లు కాల్ రికార్డులు ఉన్నాయని కేసులో 13వ నిందితుడుగా నిత్యానందరెడ్డిని చేర్చారు. ముందుగా గంజాయి బ్యాచ్తో పాటు వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రచార మాధ్యమాలు ఘోషించాయి. తరువాత క్రమంలో రాజకీయ ఒత్తిడులో లేక ఇతర కారణాలేవో తెలియదు కానీ దర్యాప్తులో పోలీసులు రూటు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి.మాజీ సీఎం జగన్ వస్తారని..ఈ నెల మొదటి వారంలో హత్యకు గురైన దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని సోషల్ మీడియాలో ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అ య్యారు. దీంతో కేసులో వేగంపెంచారు. దస్తగిరి హత్య విషయంలో ఎక్కడ ప్రభుత్వాన్ని నేతలు, పోలీసులను టార్గెట్ చేస్తారన్న ఆలోచనతో ఆగమేఘాల మీద విచారణ సాగిస్తున్నారు. అయితే ఇందులో ఫోన్ కాల్ రికార్డులు ఇతర వ్యవహారాల పరిస్థితులను చూపిస్తూ వైఎస్సార్సీపీపై నెపం నెట్టేందుకు సిద్ధమయ్యారు. డొల్లతనం బయటపడకుండా దర్యాప్తు డైవర్ట్ఈ నెల 6వ తేదీన అలంఖాన్పల్లెలో గొడవ జరిగిన తరువాత రిమ్స్ ఆవరణలో దస్తగిరిని కొంత మంది విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. అయితే అంతకు ముందు దాడులు జరిగిన నేపథ్యంలో నాకు రక్షణ కలి్పంచాలని దస్తగిరి పోలీసులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని సర్వత్రా చర్చ సాగుతోంది. అలంఖాన్పల్లె నుంచి రిమ్స్కు పోయేలోపే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.ఈ నేపథ్యంలో రిమ్స్కు వెళ్తున్న దస్తగిరిపై దాడులు జరగడం చనిపోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో దస్తగిరిని పొట్టన పెట్టుకున్న నిందితుల వివరాలు తేల్చాల్సిన పోలీసులు రాజకీయ డ్రామాలకు తెరతీయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియదు కానీ పోలీసులు డైవర్షన్ డ్రామాలతో హత్య కేసు దర్యాప్తులో అలా పక్కదారి వెళ్తుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేజర్ నిత్యానందరెడ్డి టార్గెట్గా కేసు విచారణ జరుగుతున్నదని జగమెరిగిన సత్యం.వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన దస్తగిరి హత్య కేసుకు సంబంధించి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి చుట్టూ పోలీసులు వలపన్నుతున్నారు. ఆది నుంచి నిందితులతో పాటు చనిపోయిన వ్యక్తి అందరూ కలిసిమెలసి తిరుగుతున్నారు. అయితే అనేక కారణాలు వ్యక్తిగత పరిస్థితులు ఇతర కారణాలు ఏవైనా దస్తగిరి హత్య నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం సాగుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే వ్యక్తిగత పరిచయాలు గతంలో.. దిగిన ఫొటోలు.. ఇతర కాల్ డేటా ఆధారం చేసుకుని మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని కేసులో ఇరికించే ప్రక్రియ షురూ అయింది. పోలీసులు అధికార పార్టీ, పోలీసు ఉన్నతాధికారుల మెప్పు కోసం మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లక్ష్యంగా ముందుకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిత్యానందరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులుకడప: కడప నగర శివార్లలోని మాజీ డిప్యూటి మేయర్ బండి నిత్యానందరెడ్డి అక్రమ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏడు వాహనాల్లో స్పెషల్ పోలీసులు ఇంటిపై దాడి చేసి సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల్లో పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఇంటిమీద దాడి చేయడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురైనట్లు తెలిసింది. పోలీసులు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్కోసం ఇళ్లంతా శోధించి కొన్ని పత్రాలు, ఒక ల్యాప్ట్యాప్ తీసుకెళ్లారు. ఆర్థరాత్రి వరకు పోలీసులు అక్కడే తిష్ట వేశారు. -
ఇక.. వారసత్వ సంపద వంతు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన వారసత్వ సంపద కేంద్రాలు, స్మారక చిహ్నాల (మాన్యుమెంట్స్) ప్రదేశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చంద్రబాబు సర్కార్ బరితెగించింది. అభివృద్ధి ముసుగులో రూ.కోట్ల విలువైన పర్యాటక భూములను కొల్లగొడుతున్న తరహాలోనే అత్యంత ప్రాచీన, సంస్కృతికి అద్దం పట్టే వారసత్వ సంపదను సీఎస్ఆర్ ముసుగులో కార్పొరేట్ సంస్థలు, తమ బినామీల చేతుల్లో పెడుతోంది.దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా చంద్రబాబు ప్రభుత్వం వారసత్వ కట్టడాల పరిరక్షణ బాధ్యతల నుంచి నిస్సిగ్గుగా తప్పుకోవడంతో పాటు.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి వాటి భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇందులో భాగంగానే 2024–29 పర్యాటక విధానానికి అనుగుణంగా ‘అడాప్ట్ మాన్యుమెంట్ పాలసీ’ని సోమవారం ప్రకటించింది. ఏపీ పురావస్తుశాఖ పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్న మాన్యుమెంట్స్ ఇకపై ప్రైవేటు బ్రాండింగ్లో కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కోనున్నాయి. మరుగుదొడ్లు, చెత్తకుండీలు ఏర్పాటు చేయలేరా? వారసత్వ సంపద కేంద్రాల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కనీసం అక్కడ పర్యాటకుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, చెత్తకుండీలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఉంది. ప్రపంచ గుర్తింపు పొందిన నాగార్జునకొండ, గండికోట, లేపాక్షి, అమరావతి బౌద్ధసూ్థపం, ఉండవల్లి గుహలు, ఇతర బౌద్ధారామాలు, కొండపల్లి, చంద్రగిరి కోటలతో సహా మొత్తం వారసత్వ, స్మారక చిహ్నలను అంగట్లో సరుకు మాదిరిగా వేలం వేస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ (సీఎస్ఆర్) కింద వారసత్వ కట్టడాలను సంరక్షించేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ (పీ–4)లో ఐదేళ్ల పాటు వాటి పూర్తి నిర్వహణ బాధ్యతలను అప్పగించనుంది.ఆ తర్వాత పనితీరును బట్టి కాలపరిమితి పొడిగిస్తామని పాలసీలో పేర్కొంది. ఆయా సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ముందుగా మరుగుదొడ్లు, తాగునీరు, లైటింగ్, పార్కింగ్, ల్యాండ్ స్కేపింగ్ వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంతో పాటు టికెట్ కౌంటర్లు, స్నాక్ సెంటర్లు, విడిది కేంద్రాలు, ఇతర సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేసి సెమీ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. వారసత్వ బ్రాండింగ్ లేనట్లే.. చంద్రబాబు ప్రభుత్వం వారసత్వ కేంద్రాలను ప్రైవేటు పరం చేయడంతో వాటి సమగ్రతకు భంగం కలగడంతోపాటు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని పురాతత్వవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారసత్వ కేంద్రాలను కార్పొరేట్ ఈవెంట్ల కేంద్రంగా మార్చే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. వీటి నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ మాన్యుమెంట్ కోసమే ఖర్చుచేయాల్సి వచ్చినప్పుడు మాన్యుమెంట్ మిత్ర తమ సొంత, అనుకూల వ్యక్తులకే పనులు కట్టబెడితే సామాన్యులు ఎలా భాగస్వాములవుతారని, స్థానికులకు ఉపాధి ఎలా లభిస్తుందని ప్రశ్నిస్తున్నారు. సీఎస్ఆర్ కింద ఖర్చుచేస్తున్న సంస్థలు తమ బ్రాండింగ్ను పెంచుకుంటే వారసత్వ కేంద్ర ప్రాధాన్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. స్మారకచిహ్నం వద్ద ఇతర వాణిజ్య సేవల కోసం లీజ్ ఒప్పందం ద్వారా మూడోవ్యక్తి చేరికతో పురాతన కట్టడాలు, చిహ్నాల భద్రత కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. కేవలం కార్పొరేట్, ప్రైవేటు వ్యాపారులకు పన్ను మినహాయింపులు కల్పించడానికి, పనిలోపనిగా విలువైన ప్రజల సొత్తును తమ చేతుల్లో పెట్టుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పైగా కార్పొరేట్ల రాకతో సామాజిక–ఆరి్థక విధ్వంసం జరిగే ప్రమాదం ఉంది. అంటే స్థానిక (గైడ్లు, చిన్న వ్యాపారుల) జీవనోపాధిని దెబ్బతీసి కార్పొరేట్ వెండర్లు ప్రవేశించే అవకాశం ఉంది.సీఎస్ఆర్ అంటూనే వ్యాపారమా?వారసత్వ సంపద కేంద్రాలు, స్మారక చిహ్నలను దత్తతకు ఇచ్చిన తర్వాత అభివృద్ధి చేయడంతో పాటు అక్కడే వారికి వాణిజ్య కార్యకలపాలకు, సౌండ్ అండ్ లైటింగ్కు అవకాశం కల్పించినప్పుడు ఇక సీఎస్ఆర్కు అర్థం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. దత్తత తీసుకునే ‘మాన్యుమెంట్ మిత్ర’కు, ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం చేసుకుని నిర్వహణ సాగించేలా ప్రత్యేకంగా పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్గా, పురావస్తుశాఖ కమిషనర్ కన్వీనర్గా, దేవదాయశాఖ కమిషనర్తో కలిపి మొత్తం ఏడుగురితో కమిటీని నియమించింది. ఈ కమిటీ దత్తత కోసం అందుబాటులోని స్మారక చిహ్నాలను ఆమోదించి వాటిని మాన్యుమెంట్ మిత్రలకు ఇచ్చేందుకు వచ్చే బిడ్ల మూల్యాంకనం చేసి కట్టబెడుతుంది. ఇక వీటి దత్తత అనంతరం పర్యవేక్షణకు పురావస్తుశాఖ కమిషనర్ చైర్మన్గా, కలెక్టర్ వైస్ చైర్మన్గా మొత్తం తొమ్మిదిమందితో కమిటీని ఏర్పాటు చేసింది. -
ఎట్టకేలకు పోలవరం ఎత్తిపోతల
సాక్షి, అమరావతి: పోలవరం ఎత్తిపోతలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. గతంలో దీన్ని తప్పుబట్టిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు ఆ ఎత్తిపోతల అత్యంత అవసరమంటూ వాస్తవాలను అంగీకరించారు. దాంతో పోలవరం ఎత్తిపోతల పనులను రద్దు చేస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని.. పనులు కొనసాగించడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు కాగా.. కనిష్ట నీటి నిల్వ 119.4 టీఎంసీలు. పోలవరం జలాశయంలో 35.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటేనే కుడి, ఎడమ కాలువలకు నీళ్లందుతాయి.అంతకంటే తక్కువ స్థాయిలో ఉంటే నీళ్లందవు. పోలవరంలో 35.5 మీటర్ల దిగువన ఉండే నీళ్లన్నీ డెడ్ స్టోరేజీ కింద లెక్క. ఇందులో 35.5 నుంచి 32 మీటర్ల మధ్య నిల్వ ఉండే సుమారు 30 టీఎంసీలను కుడి కాలువ ద్వారా తరలించి.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్కు ముందస్తుగా సాగునీరు అందించడం, ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ.912.84 కోట్లతో 2021 ఏప్రిల్ 19న పోలవరం ఎత్తిపోతలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 32 మీటర్ల కాంటూర్ దిగువన ఉండే నీటిని రివర్ స్లూయిజ్ల ద్వారా తరలించి గోదావరి డెల్టాలో రబీ పంటకు సమృద్ధిగా నీళ్లందించడంతోపాటు తాగునీటి అవసరాలు తీర్చాలని నిర్ణయించారు.ఆ నీటిని ఉపయోగించుకోకపోతే జూన్లో వరద ప్రవాహం ప్రారంభమవుతుంది.. పోలవరం నిండగానే ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా గోదావరి వరద సముద్రం పాలవుతుంది. ఈ నేపథ్యంలో మహత్తర ఆశయంతో చేపట్టిన ఆ ఎత్తిపోతలను 2021 జూలై 24న నిర్వహించిన టెండర్లలో రూ.765.94 కోట్లకు మేఘా సంస్థ దక్కించుకుంది. 17.05 శాతం పనులను పూర్తి చేసింది. అప్పట్లో ఈ ఎత్తిపోతలను చంద్రబాబు తప్పుబట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల ఉండగా పోలవరం ఎత్తిపోతల ఎందుకంటూ దబాయించారు. పోలవరం ఎత్తిపోతల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవని.. రూ.912 కోట్లు వృథా అంటూ విమర్శించారు. వాస్తవానికి గోదావరిలో నీటి మట్టం 14 మీటర్లు కంటే ఎగువన ఉన్నప్పుడే పట్టిసీమ ఎత్తిపోతలకు నీళ్లందుతాయి.కానీ.. పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తే పట్టిసీమ ఎత్తిపోతలకు నీళ్లందవు. అయితే చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించి వైఎస్ జగన్ సర్కార్పై బురదచల్లారు. కృష్ణా డెల్టా, ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలకు వరదాయిని లాంటి పోలవరం ఎత్తిపోతలను తప్పుబట్టిన చంద్రబాబు తీరును ఖండిస్తూ అప్పట్లో ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు దుమ్మెత్తిపోశారు.ఈ క్రమంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ ఎత్తిపోతల పనులను రద్దు చేశారు. కానీ.. ఇప్పుడు అదే ఎత్తిపోతల ఆవశ్యకతను గుర్తిస్తూ పనులు కొనసాగించడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు వరదాయిని లాంటి రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే అక్కసుతో... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందం మేరకు ఆ ఎత్తిపోతలను చంద్రబాబు నిలిపేసి రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారని సాగునీటిరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగ నియామకాలు, బదిలీలకు లోకల్ కేడర్ల గెజిట్ జారీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించి స్థానిక కేడర్ల గెజిట్ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గత ఏడాది డిసెంబర్ 15 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సోమవారం జారీ చేసిన గెజిట్లో స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు నేరుగా భర్తీకి సంబంధించి రాష్ట్రాన్ని 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా వర్గీకరించారు. ఏ పోస్టుల భర్తీలోనైనా 95 శాతం పోస్టులను స్థానికులతోనే భర్తీ చేయనున్నారు. మిగతా పోస్టులను జనరల్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు.స్థానికత విషయంలో ఏదైనా పోస్టుకు సంబంధించి విద్యార్హతలో ఏడేళ్లు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో నాలుగేళ్లు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా నిర్ధారిస్తారు. ఒక పోస్టుకు ఇంటర్మీడియట్ విద్యార్హతగా ఉంటే ఇంటర్కు ముందు ఏడేళ్లు ఎక్కడ చదివారో పరిశీలించి అందులో నాలుగేళ్లు చదివిన చోట స్థానికతగా పరిగణిస్తారు. విద్యార్హత లేని పోస్టులకు నివాస ప్రాంతాన్ని స్థానికంగా పరిగణిస్తారు. ఏడేళ్ల పాటు ఏ ప్రాంతంలోనూ చదవకపోతే రాష్ట్రంలోని నివాస ప్రాంతాన్ని స్థానికంగా పరిగణిస్తారు. అంధత్వం, వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేకించిన పాఠశాలల్లో చదివితే తల్లిదండ్రుల స్వస్థలాన్ని స్థానికతగా పరిగణిస్తారు. జూనియర్ అసిస్టెంట్.. అంతకంటే దిగువనున్న పోస్టులను జిల్లా స్థాయి కేడర్గా, జూనియర్ అసిస్టెంట్కు ఆపైన సూపరింటెండెంట్, మొదటి స్థాయి గెజిటెడ్ పోస్టులను జోనల్ స్థాయి కేడర్గా, మొదటి స్థాయి గెజిట్ పోస్టుల కేటగిరీపైన డిప్యూటీ కలెక్టర్, సమానమైన కేటగిరీ పోస్టులను మల్టీ జోనల్ స్థాయి కేడర్గా పరిగణిస్తారు. -
ఉద్యోగులపై ‘రెడ్బుక్’ టెర్రర్
సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగంతో వ్యవస్థలను గుప్పిట పట్టి రాష్ట్రంలో టెర్రర్ సృష్టిస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా ఉద్యోగులపైనా దాన్ని ప్రయోగించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగిన పాపానికి ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రావిురెడ్డిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న కె.వెంకట్రావిురెడ్డిని సర్వీసు నుంచి తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా సమస్యలపై ప్రశ్నిస్తూ రోడ్డెక్కుతున్న ఉద్యోగులను భయపెట్టి నోరెత్తకుండా చేయాలన్నది కుతంత్రమని స్పష్టమవుతోంది. వెంకట్రావిురెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు గత ఎన్నికల్లో ఆయన వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేశారనే సాకు చూపారు. టీడీపీ పెద్దలకు నచ్చిన విధంగా నివేదిక ఇప్పించుకుని..తమ పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిస్సిగ్గుగా చట్టాన్ని సైతం మార్చాలని చూసిన చంద్రబాబు సమస్యలపై గళమెత్తిన ఉద్యోగులను మాత్రం కక్షగట్టి వేధిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడటంలో ముందుండే వెంకట్రావిురెడ్డిపై కక్ష గట్టి 2024 ఎన్నికల సమయంలోనే తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సస్పెన్షన్ను కొనసాగించింది. సస్పెన్షన్లో ఉండగానే.. ఆయన వైఎస్సార్సీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు మోపి విచారణ జరిపింది. గత ఎన్నికల్లో ఆయన ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారం చేసినట్లు తప్పుడు ఆధారాలు సృష్టించింది.నిజానికి ఎన్నికల ప్రచారం జరగలేదని ఆయా డిపో మేనేజర్లు స్పష్టంగా నివేదికలు ఇచ్చినా.. అధికార యంత్రాంగం చంద్రబాబు చేతిలో ఉండడంతోనే వెంకట్రావిురెడ్డికి వ్యతిరేకంగా నివేదిక ఇప్పించుకున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన్ను సర్వీసు నుంచి తొలగించారు. వెంకట్రావిురెడ్డి 2014–19లోనూ ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తున్నారని బాబు ప్రభుత్వం ఆయనపై కక్ష సాధించింది. అప్పట్లో 15 నెలలపాటు సస్పెండ్ చేసింది. ఆయన తప్పు లేదని తేలడంతో తిరిగి విధుల్లోకి తీసుకున్నా.. ఉద్యోగుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని తరచూ బయటపెడుతుండడం కంటగింపుగా మారింది.ఉద్యమించడంతో బెదిరింపు యత్నాలు..సమస్యలను పరిష్కరించకుంటే పోరాటం చేస్తామని, అనంతపురం జిల్లా నుంచి మొదలుపెట్టి అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని ఇటీవలే వెంకట్రావిురెడ్డి ప్రకటించారు. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలతోపాటు పెండింగ్ డీఏలు ఇవ్వాలని, పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించి పీఆర్సీ ఇవ్వాలని, రూ.40 వేల కోట్ల వరకూ ఉన్న బకాయిలు చెల్లించాలని, ఉద్యోగులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అవుట్సోరి్సంగ్ సిబ్బంది, అంగన్వాడీలు సహా అన్ని విభాగాల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.తరచూ ఆందోళనలతో విజయవాడ ధర్నా చౌక్ మార్మోగుతోంది. తాజాగా ఈ నెలలోనే ఉపాధ్యాయ సంఘాలు భారీ ఆందోళనలకు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో వెంకట్రావిురెడ్డిపై వేటు వేయడం ద్వారా ఉద్యోగులను భయపెట్టి నోరెత్తకుండా చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తను టీడీపీ సర్కారు వేధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్యోగులపైనా దాన్ని ప్రయోగించడంతో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. -
కాగితాలపై కంపెనీలు...ఖాతాల్లోకి రూ.కోట్లు
సాక్షి,విశాఖపట్నం: నిజానికి అక్కడ ఎలాంటి వ్యాపారం జరగదు. ఏ వస్తువూ కొనుగోలు చేయరు. కానీ, కాగితాల మీద భారీ లావాదేవీలు జరిగినట్లు నకిలీ ఇన్వాయిస్లను సృష్టిస్తారు. ఈ బిల్లులను చూపిస్తూ, తాము ఇప్పటికే ప్రభుత్వానికి పన్ను చెల్లించేశామని, ఆ మొత్తాన్ని ‘ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్’ రూపంలో తిరిగి తమకు చెల్లించాలని జీఎస్టీ అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించాల్సిన అధికారులు.. ఆ ఫేక్ ఇన్వాయిస్లనే ధ్రువీకరించి, కోట్లాది రూపాయల క్రెడిట్ను నేరగాళ్ల నకిలీ ఖాతాల్లోకి జమ చేసేస్తున్నారు.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో వరుసగా ఇలాంటి దోపిడీదారులు పట్టుబడుతున్నా.. ఈ అడ్డగోలు వ్యవహారానికి అడ్డుకట్ట పడటం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు రూ.352 కోట్ల మేర ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలు జరగ్గా.. ఇప్పటివరకూ పది మంది నిందితులను డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 380కి పైగా నకిలీ కంపెనీలు ఈ దందాలో భాగస్వాములైనట్లు దర్యాప్తులో తేలింది. వెలుగుచూసిన ఉదంతాలు ఇవే.. ⇒ శ్రీ ప్రోగ్రెసివ్ ప్రాజెక్ట్స్ పేరుతో నకిలీ సంస్థల నెట్వర్క్ ఏర్పాటు చేసి.. ఫేక్ ఇన్వాయిస్లతో రూ.9.62కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన ఓ ముఠాను ఈ నెల 2న డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ⇒ తన సోదరుడి సంస్థను అడ్డం పెట్టుకొని నకిలీ రసీదులతో రూ.19.79 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొట్టేసిన ఎలియాజ్ భాషా అనే వ్యక్తిని డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ⇒ తమిళనాడుకు చెందిన సిద్ధిక్ సయ్యద్.. దక్షిణాది రాష్ట్రాల్లో కొందరి గుర్తింపు కార్డులను దొంగిలించి, వారి పేర్లతో 302 ఫేక్ కంపెనీలు సృష్టించాడు. ఏకంగా రూ.643 కోట్లకు ఫేక్ ఇన్వాయిస్లు తయారు చేసి, రూ.115.88 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దోచుకున్నాడు. ఎట్టకేలకు అతన్ని గతేడాది మేలో డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నేరగాళ్ల అసలు వ్యూహాలు ఇవే! మ్యూల్ అకౌంట్స్: నేరగాళ్లు ఎన్నడూ తమ సొంత పేర్లతో కంపెనీలు పెట్టరు. నిరుపేదలు, కూలీలు లేదా అమాయకుల ఆధార్, పాన్ కార్డులను తక్కువ ధరకు సేకరించి, వారి పేర్లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందుతారు. స్కామ్ బయటపడ్డాక పోలీసులు వెళ్తే, ఆ అడ్రస్లో ఉండేది ఏమీ తెలియని సామాన్యులే. దీని వల్ల అసలు సూత్రధారులు దొరకడం కష్టమవుతోంది. సర్క్యులర్ ట్రేడింగ్: ఇదొక గొలుసుకట్టు మోసం. ఒక పేరుతో కంపెనీ పెట్టి, కాగితం మీద ఉన్న మరో కంపెనీకి వస్తువులు అమ్మినట్లు చూపిస్తారు. ఆ కంపెనీ నుంచి మరో నకిలీ కంపెనీకి బిల్లు మారుతుంది. ఎక్కడా వస్తువు కదలదు కానీ, ప్రతి దశలోనూ ‘ఇన్పుట్ టాక్స్ క్రెడిట్’ను క్లెయిమ్ చేస్తూ ప్రభుత్వ ధనాన్ని లాగేస్తుంటారు. ఐటీ రిటర్న్స్లో లొసుగులుజీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు జీఎస్టీఆర్–2ఏ(కొనుగోళ్లు), జీఎస్టీఆర్–3బీ (చెల్లింపులు) మధ్య ఉండే వ్యత్యాసాలను అధికారులు ఎప్పటికప్పుడు సరిచూడాలి. అయితే, డేటా భారీ స్థాయిలో ఉండటం, చిన్న కంపెనీల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వీరికి వరంగా మారుతోంది. ఇదే అదనుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. షెల్ కంపెనీల మాయాజాలం: విశాఖలో పట్టుబడిన చాలా కంపెనీల చిరునామాలు.. ఒకే గదిలో పది కంపెనీలు ఉన్నట్లు లేదా అసలు ఉనికిలోనే లేని అపార్ట్మెంట్ నంబర్లతో ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇన్స్పెక్టర్లు.. కార్యాలయంలోనే కూర్చుని అన్నీ సవ్యంగా ఉన్నాయి అని నివేదికలు ఇవ్వడం వల్లే ఈ రూ.352 కోట్ల స్కాం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.డేటా అనలిటిక్స్ సాయంతోనే గుట్టు రట్టు!ఇటీవల డీజీజీఐ పట్టుకున్న కేసులన్నీ డేటా అనలిటిక్స్ సాంకేతికత ద్వారానే సాధ్యమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ సాంకేతికత ద్వారా భారీ మొత్తంలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, అందులోని అసాధారణ మార్పులను లేదా అనుమానాస్పద లావాదేవీలను క్షణాల్లో గుర్తిస్తారు. ముఖ్యంగా డీజీజీఐ వాడుతున్న అద్వైత్ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా.. ఒకే పాన్ కార్డుతో ఎన్ని కంపెనీలున్నాయి? ఒకే అడ్రస్తో ఎన్ని రిజి్రస్టేషన్లు అయ్యాయి? కొనుగోలు, అమ్మకాల మధ్య పొంతన ఉందా? అన్నది ఇట్టే పసిగట్టవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో నెట్వర్క్ డయాగ్రమ్స్ సృష్టించి.. ఒక నకిలీ కంపెనీ నుంచి మరో కంపెనీకి నిధులు ఎలా మళ్లుతున్నాయో లింక్ అనలిటిక్స్ ద్వారా గుర్తిస్తూ నేరగాళ్ల గుట్టు రట్టు చేస్తున్నారు.ముందుగా ఎందుకు గుర్తించరు? ఇంత అధునాతన సాంకేతికత అందుబాటులో ఉన్నా.. రూ.352 కోట్ల మోసాలు ఎలా జరిగాయన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు ఉనికిలో లేని దాదాపు 380కి పైగా నకిలీ కంపెనీలు కోట్లు కొల్లగొడుతున్నా.. నిబంధనల ప్రకారం జరగాల్సిన క్షేత్రస్థాయి పరిశీలన ఎందుకు అటకెక్కిందన్నదానిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నేరగాళ్లు కోట్లాది రూపాయలు దోచుకున్న తర్వాతే అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారన్నది నగ్న సత్యం. మోసం జరుగుతున్న ప్రారంభ దశలోనే ఫేక్ ఇన్వాయిస్లను పట్టుకోవడంలో జీఎస్టీ విభాగం విఫలమైందా? లేదా ఉద్దేశపూర్వకంగానే చూసీచూడనట్లు వదిలేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. వందల కోట్లు రికవరీ చేశామని అధికారులు చెబుతున్నా, కొత్తగా పుట్టుకొస్తున్న నకిలీ కంపెనీలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను కఠినతరం చేయకపోతే.. సామాన్యుడు కట్టే పన్నులన్నీ అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
వేడిరాత్రులు.. ప్రమాద ఘంటికలు
సాక్షి, అమరావతి: వేసవి అంటే మండిపోయే పగలు, ఉపశమనం ఇచ్చే రాత్రులు. కానీ ఇప్పుడు సూర్యుడు అస్తమించినా సెగలు తగ్గడం లేదు. రాత్రి ఏడుగంటలు దాటినా గాలిలో వేడి తగ్గకపోగా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా పగటి ఉష్ణోగ్రతల కంటే రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. దీన్ని వార్మ్నైట్ విపత్తుగా పిలుస్తున్నారు. సాధారణంగా భూమి పగలు సూర్యుడి నుంచి గ్రహించిన వేడిని రాత్రి సమయాల్లో తరంగాల రూపంలో అంతరిక్షంలోకి వదిలేస్తుంది.దీనివల్ల తెల్లవారుజామున వాతావరణం చల్లబడుతుంది. అయితే ప్రస్తుతం వాతావరణంలో పెరిగిన కాలుష్య పొరలు ఈ వేడిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి 12 గంటల సమయంలో కూడా ఉష్ణోగ్రత 30 డిగ్రీల కంటే తగ్గకపోవడం గమనార్హం. ఆరోగ్యానికి పెనుముప్పు రాత్రిళ్లు వేడి తగ్గకపోవడం వల్ల మన శరీరం రీసెట్ అయ్యే అవకాశం కోల్పోతోంది. నిద్రలో గుండె వేగం తగ్గాలి. కానీ బయటి వేడి వల్ల శరీరం తనను తాను చల్లబరుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తుంది. దీనివల్ల రక్తపోటు పెరిగి గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత 25 డిగ్రీల పైన ఉంటే గాఢనిద్ర పట్టదు. ఇది మరుసటిరోజు పనితీరుపై ప్రభావం చూపడమే కాకుండా దీర్ఘకాలంలో చిరాకు, డిప్రెషన్కు దారితీస్తుంది. పంటలకూ దెబ్బ రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వరి వంటి పంటల దిగుబడి తగ్గిపోతుంది. మొక్కలు రాత్రివేళ ఎక్కువ శ్వాసక్రియ జరపడం వల్ల గింజ గట్టిపడక తాలుశాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ మార్పులు అంటే ఎక్కడో మంచు పర్వతాలు కరగడం మాత్రమే కాదు. మన ఇంటి పైకప్పులు నిప్పుల కుంపట్లుగా మారడం కూడా అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నగరాల్లో పచ్చదనాన్ని పెంచడం, భవనాలపై కూల్ రూఫ్ పెయింట్స్ వేయడం, కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా వార్మ్నైట్ ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కారణాలివే ఈ వేడిరాత్రులకు ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 1. నగరాల్లో చెట్లు తగ్గిపోయి కాంక్రీట్ భవనాలు, తారు రోడ్లు పెరిగాయి. ఇవి పగలు వేడిని పీల్చుకుని రాత్రివేళ బయటకు వదులుతాయి. పల్లెటూళ్లలో వేడి త్వరగా తగ్గుతున్నా, నగరాల్లో మాత్రం ఈ కాంక్రీట్ సెగలు రాత్రంతా కొనసాగుతున్నాయి. దీన్ని అర్బన్ హీట్ ఐలాండ్గా పేర్కొంటున్నారు. 2. మనది తీర ప్రాంత రాష్ట్రం కావడంతో గాలిలో తేమశాతం ఎక్కువ. గాలిలో తేమ పెరిగినప్పుడు అది ఒక దుప్పటిలా మారి భూమి నుంచి వెలువడే వేడిని అంతరిక్షంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. 3. బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రాత్రివేళ సముద్రం నుంచి వచ్చే గాలులు చల్లదనానికి బదులు సెగలను మోసుకొస్తున్నాయి. -
ప్రభుత్వ ఉద్యోగం నుంచి కాకర్ల వెంకట్రామిరెడ్డి తొలగింపు
సాక్షి,విజయవాడ: ఏపీ ఉద్యోగ సంఘం నాయకుడిపై కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి గత 22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తూ, చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై కక్ష సాధింపులకు దిగింది.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిపై పగబట్టింది. ఈ క్రమంలో సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనపై చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి సస్పెన్షన్ విధించారు. ఇప్పుడు శాశ్వతంగా సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
హంద్రీ–నీవా కాలువ పనుల్లో.. రూ.3,000 కోట్లు కొట్టుకుపోయాయ్!
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి మొదటి దశ ప్రధాన కాలువ వెడల్పు.. రెండో దశ ప్రధాన కాలువ, దానిలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ), కుప్పం బ్రాంచ్ కెనాల్ (కేబీసీ) లైనింగ్ పనుల్లో డొల్లతనం బట్టబయలైంది. గత నెల 24న మల్యాల పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయడం ఆపేయడంతో.. కాలువలో నీటి ప్రవాహం ఆగిపోయి పనితనం తేలిపోయింది. కర్నూలు, అనంతపురం జిల్లాలలో హంద్రీ–నీవా ప్రధాన కాలువ వెడల్పు మొదటి దశ పనులను ఇష్టారాజ్యంగా చేయడంతో ప్రవాహ ఉద్ధృతికి కాలువ గట్లు కోతకు గురై బలహీనంగా మారాయి. కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట్ల నాసిరకంగా చేసిన లైనింగ్ కొట్టుకుపోయింది.ఇక అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో హంద్రీ–నీవా రెండో దశ, పీబీసీ, కేబీసీ కాలువ సైడ్ స్లోప్స్ (వాలు) సరిచేసి, గట్టిపరచకుండా నాసిరకంగా లైనింగ్ చేయడంతో అనేక చోట్ల జారిపోయింది. సిమెంటు కాంక్రీట్ కరిగిపోయి కొట్టుకుపోయింది. నిబంధనలు తుంగలో తొక్కి.. పని స్వభావాన్ని మార్చేసి నాసిరకంగా లైనింగ్ చేస్తుండటాన్ని గతేడాది జూలై 14న ‘ఈ లైనింగ్ దండుకునేందుకే’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తొలి దశ ప్రధాన కాలువ విస్తరణ పనులకు సంబంధించి గతంలో చేసినవే మళ్లీ ఇప్పుడు చేసినట్లుగా చూపడంపై ‘హంద్రీ–నీవాలో మహాపాతకం’ శీర్షికన గతేడాది జూలై 16న ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది.ఆ కథనాలు అక్షర సత్యమన్నది హంద్రీ–నీవా కాలువను పరిశీలిస్తే స్పష్టమవుతోందని ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు స్పష్టం చేస్తున్నారు. రికార్డు సమయంలో పూర్తి చేశామని గొప్పలు చెప్పుకునేందుకు నాసిరకంగా పనులు చేయడం వల్ల రూ.3 వేల కోట్ల మేర ప్రజాధనం వృథా చేశారని ఆరోపిస్తున్నారు. హంద్రీ–నీవా మొదటి దశ ప్రధాన కాలువలో రోజుకు 3,850 క్యూసెక్కులు తరలించేలా వెడల్పు చేసే పనులు, రెండో దశ కాలువ, పీబీసీ, కేబీసీ లైనింగ్ పనులను రూ.3,500 కోట్లతో చేపట్టి రికార్డు సమయంలో పూర్తి చేశామని చంద్రబాబు సర్కార్ గొప్పగా ప్రకటించుకుంది.గతేడాది జూలై 17న శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడాన్ని అధికారులు ప్రారంభించి మార్చి 24న ఆపేశారు. మొత్తం 248 రోజుల్లో 52.023 టీఎంసీలు తరలించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన రోజుకు సగటున 2,427.46 క్యూసెక్కులను మాత్రమే తరలించారన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు సర్కార్ గొప్పగా ప్రకటించినట్లుగా రోజుకు 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి ఉంటే 248 రోజుల్లో హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు 82.50 టీఎంసీలు సరఫరా అయ్యేవని ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు స్పష్టం చేస్తున్నారు. 2019–24 మధ్య కాలువను వెడల్పు చేయకున్నా రోజుకు గరిష్టంగా 2,850 క్యూసెక్కులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తరలించిందని.. దీన్ని బట్టి చూస్తే వెడల్పు, లైనింగ్ ముసుగులో చంద్రబాబు సర్కార్ భారీ ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నది స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు.రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించినా..హంద్రీ–నీవా రెండో దశ కాలువ, పీబీసీ, కేబీసీ కాలువకు సిమెంట్ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావులు ఎండిపోతాయని.. పంటలు ఎండిపోయి తాము రోడ్డున పడతామని అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కి.మీ నుంచి 400–500 కి.మీ వరకు ఐదు ప్యాకేజీలుగా విభజించి ఆర్నెల్ల్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో రూ.972.19 కోట్లతో (రూ.520.75 కోట్ల విలువైన మూడు ప్యాకేజీల పనులు ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు.. రూ.451.44 కోట్ల విలువైన రెండు ప్యాకేజీల పనులు సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు అప్పగించారు.పుంగనూరు బ్రాంచ్ కాలువలో 0 కి.మీ నుంచి 75వ కి.మీ వరకు లైనింగ్ పనులను రెండు ప్యాకేజీల కింద విభజించి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు రూ.319.6 కోట్లతో అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కాలువలో 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు వెడల్పు చేయడం, లైనింగ్ పనులను రూ.480.22 కోట్లతో సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన ఎన్సీసీ సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్కు రూ.196.91 కోట్లతో అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఎఫ్ఆర్సీ లైనింగ్ టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. నిబంధనల్లో ఎక్కడా ఎస్ఎఫ్ఆర్సీ ప్రస్తావనే లేదు. పని స్వభావం మారితే స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్ఎల్టీసీ) ఆమోదంతోపాటు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్లో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూపించి ఎస్ఎఫ్ఆర్సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతిపాదిస్తే ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు నోరు మెదపలేకపోయారని జల వనరుల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ సైడ్ వాలు (స్లోప్)ను క్రమానుగతంగా సరి చేయకుండానే ఇష్టారాజ్యంగా అత్తెసరు మందంతో ఎస్ఎఫ్ఆర్సీ విధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు కానిచ్చేశారు. కాలువకు నీటిని విడుదల చేయడంతో ఆ ప్రవాహ ఉద్ధృతికి ఎస్ఎఫ్ఆర్సీ విధానంలో వేసిన లైనింగ్ అనేక చోట్ల కరిగిపోయి కొట్టుకుపోయింది. వెడల్పు పేరుతో రూ.695.53 కోట్లు వృథా..:హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే పనులను టీడీపీ హయాంలో 2017లో చేపట్టింది. 2019 ఫిబ్రవరి 18 నాటికే 2,73,32,444 క్యూబిక్ మీటర్ల మట్టి పని పూర్తయింది. ఈ పనులకు రూ.435 కోట్ల మేర బిల్లులు చెల్లించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ.. 2025లో మళ్లీ కొత్తగా హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే పనులను చంద్రబాబు సర్కారు రూ.695.53 కోట్లతో చేపట్టింది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. ఒకటో ప్యాకేజీ (0 నుంచి 88 కి.మీ వరకు) కింద రూ.255.79 కోట్లకు మేఘా సంస్థకు, రెండో ప్యాకేజీ (88 కి.మీ నుంచి 216.3 కి.మీ వరకు) కింద రూ.439.74 కోట్లకు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి చెందిన వీపీఆర్–డీఎస్సార్(జేవీ) సంస్థకు అప్పగించింది.ప్రధాన కాలువను వెడల్పు చేయడంతోపాటు.. బ్రిడ్జిలు, అక్విడెక్టులు లాంటి కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట ఇరువైపులా వంద మీటర్ల పొడవున కాలువకు లైనింగ్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఒకటో ప్యాకేజీలో 37.79 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 5.61 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని.. రెండో ప్యాకేజీలో 84.97 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 14.13 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేయాలని లెక్క కట్టింది.కానీ.. కాలువ గట్లపై ముళ్ల పొదలు తొలగించి, ఇన్స్పెక్షన్ పాత్ (తనిఖీ మార్గం)ను సరి చేసి.. ప్రొక్లెయిన్తో అక్కడక్కడ తవ్వి.. గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా చేసినట్లు కాంట్రాక్టర్లు మాయాజాలం చేశారు. ఇక కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న చోట్ల అత్యంత నాసిరకంగా లైనింగ్ చేశారు. మల్యాల ఎత్తిపోతల నుంచి కాలువలోకి నీటిని ఎత్తిపోయడంతో ప్రవాహ ఉధృతికి కాలువ గట్లు కోతకు గురై బలహీనంగా మారాయి. అనేక చోట్ల సిమెంటు లైనింగ్ కొట్టుకుపోయింది.⇒ హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్లో 87.622 కి.మీ. నుంచి 88.925 కి.మీ. వరకు ఎక్కడికక్కడ జారిపోయిన కాంక్రీట్ లైనింగ్కు ఈ ఫొటోనే సాక్ష్యం. అన్నమయ్య జిల్లా పరిధిలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు వెడల్పుతో లైనింగ్ పనులను రూ.480.22 కోట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడి సంస్థ ఎన్సీసీకి నామినేషన్పై కట్టబెట్టారు. కాలువ సైడ్ స్లోప్స్ (ఏటవాలు ప్రాంతం) సరిచేయకుండానే.. ఇన్క్లైయిన్డ్ రోలర్తో గట్టిపరచకుండానే మట్టి పొరకు అత్యంత నాసిరకం ఎం–25, ఎం–20 రకం కాంక్రీట్ మిశ్రమంతో లైనింగ్ చేశారు. దీంతో కాలువకు నీటిని విడుదల చేయగానే లైనింగ్ ఎక్కడికక్కడ పగిలిపోయి జారిపోయింది. నీటి ప్రవాహం ఆగిపోవడంతో కాలువ లైనింగ్ డొల్లతనం తేలిపోయింది.⇒ హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల్లో అక్రమాలకు ఇవో మచ్చుతునక. తొలి దశ, రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ, కుప్పం బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేసి అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్ కట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. కానీ నిబంధనలను తుంగలో తొక్కి పని స్వభావం (స్కోప్ ఆఫ్ వర్క్) మార్చేసి.. వేగంగా పూర్తి చేయాలనే సాకుతో అడ్డగోలుగా ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేశారు. షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేస్తే చదరపు మీటర్కు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీ–నీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లించారంటూ ఇంజనీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి సమీపంలో కమ్మవారిపల్లి వద్ద హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 340 కి.మీ నుంచి 341 కి.మీ. మధ్య స్టీల్ ఫైబర్ రీయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ (ఎస్ఎఫ్ఆర్సీ) విధానంలో వేసిన లైనింగ్ కరిగిపోయిందనడానికి ఈ ఫొటోనే రుజువు! చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్ఎఫ్ఆర్సీని తయారు చేస్తారు. కాలువ రాతి పొర ప్రదేశంలో మాత్రమే.. సైడ్ స్లోప్స్ (ఏటవాలు ప్రాంతం) సరిచేసుకుని 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత అదే మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ చేయాలి.కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ సైడ్ స్లోప్స్ క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో మాత్రమే ఎస్ఎఫ్ఆర్సీతో లైనింగ్ వేశారు. ఈ దారుణాన్ని గతేడాది జూలై 14న ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇంత అడ్డదిడ్డంగా లైనింగ్ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని.. ఇదో వింత అని ఇంజనీరింగ్ నిపుణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షం కురిసినా, కాలువకు కనిష్ట స్థాయిలో నీటిని విడుదల చేసినా.. ఈ లైనింగ్ ఎక్కడికక్కడ జారిపోవడం, కరిగిపోవడం ఖాయమని.. భారీ ఎత్తున ప్రజాధనం వృథా కావడం తథ్యమని స్పష్టం చేశారు. ఇప్పుడు అదే జరిగిందని ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థ బీఎస్సార్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.లైనింగ్ పనులు ఎలా చేయాలంటే..⇒ తొలుత కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలగించాలి. కాలువపై ఇన్స్పెక్షన్ పాత్ (దారి) వేయాలి. కాలువకు ఇరు వైపులా(సైడ్ స్లోప్స్).. అడుగు భాగంలో ఇన్క్లెయిన్డ్ రోలర్ (ప్రొక్లెయినర్కు రోలర్ను అమర్చడం) ద్వారా గట్టి పరచాలి.⇒ ఆ తర్వాత 12 ఎంఎం, 20 ఎంఎం గ్రానైట్ కంకర, నాణ్యమైన ఇసుక, సిమెంటుతో తయారు చేసిన ఎం–25 మిక్సర్, ఎం–20 మిక్సర్తో పేవర్ మిషన్ ద్వారా కాలువకు ఇరువైపులా లైనింగ్ వేయాలి. ఆ తర్వాత అడుగు భాగంలో లైనింగ్ వేయాలి. అనంతరం రెండు వారాలపాటు క్యూరింగ్ (నీటితో తడపాలి) చేయాలి.⇒ రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్ క్రీటింగ్ విధానంలో లైనింగ్ చేయాలి. రాతి పొరకు ఇనుప బోల్ట్ కొట్టి.. దానికి ఇనుప జాలరీ అమర్చి దానిపై అధిక ఒత్తిడితో ఎం–20 కాంక్రీట్ వేయాలి. ⇒ పనులను ఏఈ, డీఈ, ఈఈలు నిరంతరం పర్యవేక్షించాలి. ఎస్ఈ, సీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. నాణ్యత నియంత్రణ విభాగం(క్వాలిటీ కంట్రోల్) అధికారులు ఎప్పటికప్పుడు సిమెంటు కాంక్రీట్ లైనింగ్ శాంపుల్స్ను తీసి ల్యాబొరేటరీల్లో పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించాలి. నాసిరకంగా ఉన్నట్లు తేలితే వాటిని తొలగించి మళ్లీ నాణ్యంగా పనులు చేయించాలి.⇒ పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్కు పనులు అప్పగించడానికి వీల్లేదు. ఏవైనా పనులను సబ్ కాంట్రాక్టర్కు అప్పగించాలంటే జల వనరుల శాఖ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ పనుల నాణ్యతకు ప్రధాన కాంట్రాక్టరే బాధ్యత వహించాలి.లైనింగ్ పనులు ఎలా చేశారంటే..⇒ కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలగించి దారి వేశారు. ఇన్క్లెయిన్డ్ రోలర్తో కాలువ ఇరు వైపులా అడుగు భాగాన్ని గట్టి పరచలేదు. కేవలం పొక్లెయిన్ బకెట్తో తూతూ మంత్రంగా గట్టి పరిచే పనులు కానిచ్చేశారు. దాంతో కాలువకు ఇరు వైపులా మట్టి ఎక్కడికక్కడ జారిపోతున్నా సరే సిమెంటు కాంక్రీట్తో లైనింగ్ వేశారు.⇒ గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్టుగా పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచే ఇప్పుడు కంకర తయారు చేస్తున్నారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో నుంచి ఇసుకను తెచ్చారు. నాసిరకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం), ఎం–20 (1 పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎం ఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం) మిక్సర్ తయారు చేశారు. ⇒ కాలువకు ఇరువైపులా ఇన్క్లెయిన్డ్ రోలర్తో గట్టిపరచక పోవడంతో ఎక్కడికక్కడ మట్టి జారిపోతున్నా పేవర్ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మికుల ద్వారా సిమెంట్ కాంక్రీట్తో లైనింగ్ వేశారు. మట్టిజారిపోతున్నా సరే అలానే లైనింగ్ వేస్తున్నారు. దీని వల్ల లైనింగ్ ఎక్కువ కాలం నిలబడదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా లైనింగ్ చేయడంతో నీటి ప్రవాహ ఉద్ధృతికి లైనింగ్ ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది. ఎం–25, ఎం–20 కాంక్రీట్లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్ చేసిన ప్రాంతాల్లో ఇసుక పైకి తేలి స్పష్టంగా కనిపిస్తోంది. -
ఉద్యోగులపై అంతులేని నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని.. వారిని ఇంతలా పట్టించుకోని ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే సీఎం చంద్రబాబు తనను ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారని.. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదని ఆయన స్పష్టంచేశారు. తాడేపల్లిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల మేలు కోసం తాను ఎందాకైనా వెళ్తానన్నారు. అందుకే మేలో అనంతపురం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. వెంకటరామిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..రెండేళ్లయినా ఒక్క హామీ నెరవేరలేదు..వైఎస్ జగన్ పాలన ఉద్యోగులకు స్వర్ణయుగం లాంటిది. మళ్లీ జగన్ సీఎం అయితేనే ఉద్యోగుల సమస్యల పరిష్కారమవుతాయి. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ బకాయిలు క్లియర్ వంటి చాలా హామీలిచ్చారు. ఇప్పటికే రెండేళ్లయినా ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఐఆర్ ఊసేలేదు. పీఆర్సీ అమలుచేయాల్సిన టైం దాటిపోయి మూడేళ్లయినా ఇంతవరకు పీఆర్సీ కమీషన్ను ఏర్పాటుచేయలేదు. ఇప్పటివరకు నాలుగు డీఏలు పెండింగ్ ఉన్నాయి. బాకాయిలు రూ.40 వేల కోట్లకు చేరుకున్నాయి. పెన్షనర్ల సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అందజేస్తాం, సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్ కంటే మెరుగైన పింఛన్ విధానం అన్నారు.. అదీలేదు. సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు అన్నారు, అవీలేవు. ఆశ వర్కర్లకు జీతాలు పెంచి, గ్రాట్యుటీ ఇస్తామన్నారు.. అదీలేదు. ఈ ప్రభుత్వంతో పోలిస్తే గత వైఎస్ జగన్ ప్రభుత్వం వంద రేట్లు మేలు.ఉద్యోగులపై పనిభారం..ఇలాంటి ప్రభుత్వం కరోనా కాలంలో ఉండి ఉంటే రాజధాని కోసం, హూదూద్, కేరళ తుపాను బాధితుల కోసం ఉద్యోగుల నుంచి వసూలుచేసినట్లుగా కరోనా పేరుతో కూడా చంద్రబాబు డబ్బులు వసూలుచేసేవారు. ఉద్యోగుల పక్షాన గత ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు నాటి ప్రభుత్వం కంటే మెరుగ్గా ఉద్యోగులకు ఏం మేలు చేశారు? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది.. వేలాది మంది టీచర్లకు ప్రమోషన్లు, మండలానికి ఒక ఎంఈఓ పోస్టు క్రియేట్ చేసి టీచర్లకు పదోన్నతులిచ్చింది.. గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకొచ్చి లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చింది.. ఆశ వర్కర్లకు జీతాలు పెంచింది.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసింది.. ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చింది.. అందుకే ఇప్పుడు ప్రతీ ఉద్యోగి రోడ్డుపైకొచ్చి ఆందోళన చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్టీఏ కూడా ఆందోళనకు సిద్ధమైంది. ఉద్యోగులను ఇంతగా నిర్లక్ష్యం చేయటం చంద్రబాబుకు మంచిది కాదు. ఉద్యోగులకు యాప్లు తగ్గిస్తామని చెప్పి పనిభారం పెంచారు. సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. పైపెచ్చు సచివాలయంలో వారు ఉండటంలేదని నిందిస్తున్నారు. ఉద్యోగులను వేధించేందుకు ఈ ప్రభుత్వం కొత్తకొత్త పద్ధతులు అవలంబిస్తోంది.ఉద్యోగులు విసిగిపోయారు..ఇక గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో మూడునెలలకు ఒక మీటింగ్ పెట్టేది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రుల కమిటీ సభ్యులు వీరికి అందుబాటులో ఉండేవారు. ఈ ప్రభుత్వంలో అలా ఎవ్వరూ లేరు. అందుకే ఉద్యోగులంతా విసిగిపోయారు. సంక్రాంతి డీఏ బకాయిలు అందరికీ పడకపోయినా ఎల్లో మీడియా ఇచ్చేసినట్లు రాసేసింది. వచ్చేనెలలో అనంతపురం నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం దిగొచ్చే వరకూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తాం. -
సుర్రుమన్న సూరీడు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం కర్నూలు జిల్లా నగరడోనలో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 279 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో 44.5, కాకినాడ జిల్లా కరపలో 44.4, అనంతపురం జిల్లా రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.3 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో కొన్నిచోట్ల వర్షం పడింది. రానున్న రెండు రోజులు కూడా తీవ్రమైన ఎండలు, అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నేడు తీవ్ర వడగాలులు వీచే మండలాలు ఇవే.. శ్రీకాకుళం జిల్లాలో బూర్జ, హిరమండలం, పాతపట్నం, విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, మెరకముడిదాం, రాజాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
మా భూముల జోలికొస్తే పోరాటమే
తాడేపల్లి రూరల్: అమరావతి ముఖ ద్వారమైన గుంటూరు జిల్లా ఉండవల్లిలో పంట పొలాలను తీసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 16న భూ సేకరణ కింద నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులంతా ఆదివారం సమావేశమయ్యారు. ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని, వేర్వేరుగా పోరాటం చేస్తే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, గతంలో భూ సమీకరణకు ఏవిధంగా పోరాడామో ఇప్పుడూ అదేవిధంగా పోరాటానికి సిద్ధం కావాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒకవేళ ప్రభుత్వం దిగొచ్చి భూ సేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటే... చర్చించి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో, రైతులకు ఎలా న్యాయం చేస్తారో అడగడానికి సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని పంట పొలాల్లో నుంచి వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని ప్రభుత్వానికి భూ సమీకరణకు ఇచ్చేందుకు గతంలో కొంత మంది రైతులు 9.3 పత్రాలను అందజేశారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి పోను మిగిలిన భూములకు కూడా భూ సేకరణ నోటిఫికేషన్ ఇస్తారని తెలియడంతో వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అవసరమైతే కోర్టుల ద్వారా 9.3 పత్రాలను వెనక్కి తీసుకుంటామని తెలిపారు. ఉండవల్లిలో భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఉండవల్లి రేగడ పొలాన ప్లాట్లు కేటాయించారు. ఆ ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్కి, పాత జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం, సీఆర్డీఏ ఉందని, మొట్టమొదటగా గుంటూరు చానల్ ఒడ్డున సీడ్ యాక్సెస్ నుంచి మాతాశ్రీ ఆశ్రమం వరకు 160 మీటర్ల రోడ్డు నిర్మాణానికి 34 ఎకరాల రైతులకు భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి, కొండవీటి వాగు వెడల్పుకు, ఉండవల్లి – అమరావతి రోడ్డు నుంచి నాయుళ్ల రామమందిరం, రెడ్ల రామమందిరం మీదుగా ఉండవల్లి దళితవాడ వరకు... అక్కడి నుంచి నులకపేట ఫైరింగ్ స్టేషన్ మరోవైపు పెనుమాక నుంచి సొరంగం ఏర్పాటు చేసి ఉండవల్లి కరకట్ట వైపు కూడా రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వీటన్నింటికి విడివిడిగా భూ సేకరణకు, ఇళ్లను తొలగించేందుకు నోటిఫికేషన్ త్వరలో ఇస్తారని, మనందరం ఐక్యంగా పోరాటం చేసి ప్రభుత్వం చర్చలకు వచ్చేవిధంగా నిలబడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో కలిసొచ్చే పార్టీలతో రైతులకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
కూలి ఇవ్వండయ్యా!
సాక్షి, అమరావతి: మండుటెండలో కష్టపడి పని చేసిన ఉపాధి హామీ పథకం కూలీలకు నెలల తరబడి ప్రభుత్వం కూలి డబ్బులు చెల్లించకుండా పస్తులు పెడుతోంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారం తర్వాత నుంచి పనులు చేసిన కూలీలంతా కూలి కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి నెలాఖరుతో ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.812 కోట్లు.. ఈ ఏప్రిల్ ఒకటి నుంచి శనివారం వరకు పనులు చేసిన కూలీలకు మరో రూ.195 కోట్లు.. మొత్తంగా రూ.1,007 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. నిబంధనల ప్రకారం గరిష్టంగా 15 రోజుల లోపు కూలీల వేతనాలు చెల్లించాలని కేంద్ర చట్టం చెబుతున్నా, ఆచరణలో అమలు కావడం లేదు. ఈ పథకానికి సంబంధించి వంద శాతం కూలి డబ్బులు కేంద్రమే చెల్లిస్తుంది. అయితే, దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా బకాయిలు కేవలం మన రాష్ట్రంలోని కూలీలకు చెల్లించాల్సి ఉందని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఈ సమస్య తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ఏడాది మే, జూన్ , జూలై నెలల్లో దాదాపు రూ.రెండు వేల కోట్లు.. 2024 డిసెంబర్– 2025 మార్చి మధ్య దాదాపు రూ.1,000 కోట్లు బకాయిలు పెట్టి.. ఆలస్యంగా చెల్లించారని కార్మీక సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో అధికార పార్టీ నేతలు దొంగ మçస్తర్లతో భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో కేంద్రం పరిశీలన చేస్తుండడం వల్లే కూలీలకు వేతన బకాయిల చెల్లింపులో ఆలస్యమవుతోందని అధికార వర్గాల సమాచారం. సకాలంలో కూలి అందక పోవడంతో పనులకొచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో దాదాపు 75.43 లక్షల మంది ఏటా ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి, రూ.6,500–7,000 కోట్ల మేర లబ్ధి పొందారు. అప్పట్లో కరోనా సమయంలో కూడా ఒకే రోజు 54 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవ్వడం రికార్డుగా నిలిచింది. అప్పట్లో ఏటా ఏప్రిల్ నెలలో సగటున రోజుకు 25 లక్షల మందికి పనులు కల్పించగా, ఈ ఏడాది ప్రస్తుత ఏప్రిల్లో ఇప్పటి వరకు (20 రోజుల్లో) కేవలం 78.94 లక్షల మందికి మాత్రమే అంటే రోజుకు సగటున ఐదు లక్షల మందికి కూడా పనులు కల్పించలేక పోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనని స్పష్టమవుతోంది. ఇలాగైతే ఎలా బతకాలి? ఉపాధి హామీ పథకం పనులు చేసి నెలలు గడుస్తున్నా కూలి డబ్బులు మా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. కుటుంబాన్ని పోషించుకుందామని పనికి వెళితే కనీసం కూలి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పులు చేయాల్సి వస్తోంది. ఇలాగైతే ఎలా బతకాలి? ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని కూలి డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలి. – కేజే ఫ్లోరెన్స్, కుముదువల్లి, పాలకోడేరు మండలం, పశ్చిమగోదావరి జిల్లా ఉపాధిలో కోత.. పేదలకు వాతపని దినాల కల్పనలో పదేళ్లు వెనక్కు వెళ్లిన వైనంవంద శాతం కూలీ డబ్బులు కేంద్రమే ఇస్తున్నా చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యంచేసిన పనికి వంద శాతం మేర కూలి డబ్బులు కేంద్రమే ఇచ్చే ఉపాధి హామీ పథకం అమలులో కూడా చంద్రబాబు ప్రభుత్వం అథమ స్థాయికి దిగజారి పోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆఖరి ఏడాది 2023–24లో 25.55 కోట్ల పని దినాలు కల్పించగా, మార్చి 31తో ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పేదలు 18.59 కోట్ల పని దినాలే పొందగలిగారు. ఈ లెక్కన ఏకంగా దాదాపు 7 కోట్ల పనిదినాలు తగ్గిపోయాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో పేదలు రూ.6,277 కోట్ల ప్రయోజనం పొందగా, 2025–26లో రూ.4,952 కోట్లు మాత్రమే లబ్ధి పొందారు. తద్వారా పేదలు రూ.1,325 కోట్ల మేర ఆర్థిక లబ్ధిని కోల్పోయారు. 2023–24లో 75.43 లక్షల మందికి పనులు దొరకగా, 2025–26లో 67.62 లక్షల మంది మాత్రమే పనులు పొందారు. ఈ లెక్కన బాబు హయాంలో దాదాపు 8 లక్షల మంది పనులు కోల్పోయారు. వంద రోజుల పని విషయానికి వస్తే 2023–24లో 6.87 లక్షల కుటుంబాలు లబ్ధి పొందగా, 2025–26లో ఆ సంఖ్య కేవలం 2.15 లక్షలే. అంటే దాదాపు మూడొంతుల కుటుంబాలు తగ్గిపోయాయి. జగన్ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబం సరాసరిన ఏటా 55 పని దినాలు పొందగా, అది ప్రస్తుతం 43 రోజులకు పడిపోయింది. గత జగన్ ప్రభుత్వంలో కల్పించిన మొత్తం పనుల్లో 22–23 శాతం ఎస్సీలు లబ్ధి పొందగా, 2025–26లో అది 20.47 శాతానికి మాత్రమే పరిమితమైంది. దివ్యాంగులు సైతం జగన్ ప్రభుత్వంలో 80 వేల మందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో 66 వేలకు తగ్గిపోయారు. ‘ఉపాధి’లోనూ రాజకీయమే 2024 జూన్లో చంద్రబాబు సీఎం అయ్యాక తొలి రెండు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఉపాధి హామీ పథకం అమలులో పనిచేసే గ్రామ స్థాయి ఫీల్డు అసిస్టెంట్లను రాజకీయ కారణాలతో పెద్ద ఎత్తున తొలగించింది. ఈ విషయమై బాధిత ఫీల్డు అసిస్టెంట్లు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కొత్తగా నియమితులైన ఫీల్డు అసిస్టెంట్లు తమకు అనుకూలమైన వారికే పనులు కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో పనుల కల్పన తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. దశాబ్ద కనిష్టానికి పనుల కల్పనరాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కల్పన దశాబ్ద కనిష్టానికి పడిపోయింది. అంతకు ముందు విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలి ఆర్థిక ఏడాది 2014–15లో అతి తక్కువ పని దినాల తర్వాత 2015–16లో 19.91 కోట్ల పనిదినాల పాటు పనులు దక్కాయి. ఆ తర్వాత గత పదేళ్లలో ఒక ఆర్థిక ఏడాదిలో ఎప్పుడూ 20 కోట్లకు తక్కువగా పని దినాలు కల్పించిన దాఖలాలు లేవు. ఉపాధి హామీ పథకం కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో భాగం కావడం.. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నిత్యం గొప్పలు చెబుతున్న తరుణంలో దిగజారిన ఈ రికార్డు వారి పనితీరులోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతోంది. ఇదిలా ఉండగా, 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలోనూ పేదలకు పనుల కల్పన తక్కువే. అప్పట్లో 101 కోట్ల మందికి పనులు కల్పించగా, 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏకంగా 120 కోట్ల మందికి పనులు కల్పించారు. 23.2% తక్కువగా పనులు: లిబ్టెక్2024–25తో పోలిస్తే 2025–26లో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల పేదలు రూ.1,232 కోట్లు నష్టపోయారని లిబ్టెక్ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఇందులో 40 శాతం అంటే దాదాపు రూ.484 కోట్ల మేర ఎస్సీ, ఎస్టీల కుటుంబాలే నష్టపోయాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం తీరు తెన్నులపై ఈ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఏటా నివేదికలు అందజేస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఈ పథకం అమలుపై శనివారం నివేదికను విడుదల చేసింది. గత దశాబ్ద కాలంలో అత్యంత తక్కువగా పని దినాల కల్పనలో ఇదే రికార్డు అని స్పష్టం చేసింది. 2024–25 ఆర్థిక ఏడాదితో పోల్చితే 2025–26లో పేదలకు 23.2 శాతం మేర పనుల కల్పన తగ్గిందని చెప్పింది. 2024–25లో 24.22 కోట్ల పని దినాలు లభ్యంకాగా, 2025–26లో కేవలం 18.59 కోట్ల పనిదినాలు మాత్రమే పనుల కల్పన సాగినట్టు లిబ్టెక్ పేర్కొంది. వంద రోజులు పనులు కల్పించిన కుటుంబాల సంఖ్య కూడా 5.10 లక్షల నుంచి 2.16 లక్షలకు తగ్గిపోయిందని తెలిపింది. గత ఏడాది రాష్ట్రంలో 7.20 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులను తొలగించడం, మరో వైపు జాబ్కార్డులు ఉన్న వారికి పనులు కల్పన తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమని తన నివేదికలో స్పష్టం చేసింది. -
లోకేశ్ దిగజారుడు రాజకీయం!
సాక్షి, అమరావతి: రాజకీయాల్లో ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతిసారీ అంతకంటే దిగువకు దిగజారి రాజకీయ విశ్లేషకులను నివ్వెరపోయేలా చేసే సీఎం చంద్రబాబునాయుడు కంటే ఆయన తయుడు లోకేశ్ మరింత దిగజారిపోయారంటూ సామాజిక మధ్యమాల్లో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా వైఎస్ విజయ అని సంబోధిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసిన నారా లోకేశ్ ఇప్పుడు రాజకీయంగా మరింతగా దిగజారుతూ వైఎస్ విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు చేశారంటూ ఎత్తిచూపుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లికి గతంలో ఎప్పుడైనా నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారా.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దిగజారుడు రాజకీయాల్లో భాగంగానే ఎన్నడూ లేని రీతిలో వైఎస్ విజయమ్మపై లేని ప్రేమను ఒలకబోస్తూ లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్ 19) వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మను పులువురు నేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు. అయితే గతంలో ఎన్నడూ విజయమ్మకు శుభాకాంక్షలు తెలుపని, కనీస గౌరవం ఇవ్వని సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేశ్.. ప్రస్తుతం దిగజారుడు రాజకీయంలో భాగంగానే ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.


