Jogulamba
-
నేడు నల్లమలకు సీఎం రేవంత్
సాక్షి, నాగర్కర్నూల్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి నేడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌర జల వికాసం పథకానికి అంకురార్పణ చేయనున్నారు. మాచారం గ్రామంలోని చెంచుల పోడు భూముల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సోలార్ పంప్సెట్ మోటారు ఆన్ చేసి సీఎం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఇందిరా సౌర జల వికాసం ప్రాజెక్ట్ పైలాన్ను సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం మాచారం గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగసభలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సంతోష్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 27 మంది లబ్ధిదారులు.. ఇందిర సౌర జల వికాసం కింద అమ్రాబాద్ మండలం మాచారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా, ఇప్పటికే 27 మంది చెంచు రైతులకు చెందిన మొత్తం 50 ఎకరాల పోడు భూములను అధికారులు సిద్ధం చేశారు. రైతుల పోడు భూములను చదును చేయడంతో పాటు భూగర్భ జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 16 బోర్లను తవ్వించారు. వాటికి సోలార్ విద్యుత్, 5 హెచ్పీ మోటారును ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతుల భూముల్లో ఇప్పటికే నిమ్మ, బత్తాయి, అవకాడో, మామిడి మొక్కలతో పాటు సరిహద్దుల్లో కొబ్బరి, వెదురు మొక్కలను నాటించారు. వాటికి నీటి సరఫరా కోసం స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను ఏర్పాటుచేశారు. మొక్కల ద్వారా శాశ్వత ఆదాయం వచ్చేంత వరకు ప్రత్యామ్నాయంగా అంతర్గత పంటలను వేసేలా చెంచు రైతులకు అవగాహన కల్పించారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో మేలు జరిగేలా చూసేందుకు ఐదేళ్ల పాటు అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర జలవికాసం పథకం ప్రారంభం అనంతరం భారీ బహిరంగ సభ స్వగ్రామం కొండారెడ్డిపల్లెలోనూ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి జూపల్లి, ఎంపీ మల్లురవి సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా.. సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 11 గంటలకు అమ్రాబాద్ మండలం మాచారంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు గ్రామంలోని చెంచుల పోడుభూముల్లో సోలార్ విద్యుత్తో నడిచే బోరు మోటారును ఆన్చేసి ఇందిరా సౌర జలవికాసం పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడే ఈ పథకానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ను ప్రారంభించి తిలకిస్తారు. 11.35 గంటలకు గ్రామంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11.45 గంటలకు గ్రామంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రోడ్డు మార్గంలో వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చేరుకుంటారు. 1.45 గంటలకు కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. -
లక్ష్యం.. నిర్దేశం
గద్వాల వ్యవసాయం: జిల్లాలోని గద్వాల, అలంపూర్ మార్కెట్యార్డులకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రెండు మార్కెట్యార్డులకు నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. ఈఏడాది కూడా పంట ఉత్పత్తులు యార్డులకు బాగా వచ్చి లక్ష్యం మేరకు ఆదాయం సమకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా, జిల్లాలో జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్లతో పాటు, నెట్టెంపాడు ప్రాజెక్ట్ పరిధిలోని ఏడు రిజర్వాయర్లు, 120దాకా చెరువులు, ఇంకా కుంటలు ఉన్నాయి. దీంతో ఇక్కడ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఏటా వానాకాలం సీజన్లో 1.27లక్షల హెక్టార్లు, యాసంగిలో 48వేల హెక్టార్లలో వరి, పత్తి, కంది, ఆముదం, వేరుశనగ, మొక్కజొన్న, ఎండుమిర్చి తదితర పంటలు రైతులు పండిస్తున్నారు. పండించిన పంట ఉత్పత్తులను విక్రయించేందుకు గద్వాల, అలంపూర్ మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఇందులో అలంపూర్ మార్కెట్యార్డుకు అయిజ సబ్మార్కెట్గా ఉంది. యార్డులకు ఆదాయం ఇలా.. యార్డులలో పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలపై మొత్తం సరుకు విలువలో నూటికి రూపాయి లెక్కన యార్డుకు సెస్ వస్తుంది. ఇతర ప్రాంతాలకు పంట ఉత్పత్తులను విక్రయించేందుకు తీసుకెళ్తే చెక్పోస్టుల వద్ద కూడా యార్డులు మొత్తం సరుకు విలువలో నూటికి రూపాయి వసూలు చేస్తాయి. ఇదిలాఉండగా, ప్రతి ఆర్థిక సంవత్సరంలో మార్కెట్యార్డులకు ప్రభుత్వం ఆదాయ లక్ష్యాలను నిర్దేశిస్తుంది. 2025–26కి గాను గద్వాల యార్డుకు రూ. 5.25 కోట్లు, అలంపూర్ యార్డుకు రూ. 4 కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. కాగా 2024–25లో గద్వాల యార్డు నిర్దేశించిన లక్ష్యం రూ. 4.24కోట్లకు గాను రూ.4.77కోట్లు, అలంపూర్ యార్డు లక్ష్యం రూ.2.44కోట్లకు గాను రూ. 4.07 కోట్లు సాధించాయి. జిల్లాలో ఏడాది అంతా వేరుశనగ యార్డుకు విక్రయానికి వస్తోంది. దీనివల్ల ఆదాయం బాగా వస్తుందని చెబుతున్నారు. ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వల్ల కూడా ఆదాయం వస్తుందని, వీటన్నింటి వల్ల లక్ష్యం మేరకు ఆదాయం లభిస్తుందని అంననా వేశారు. ఇక అలంపూర్ మార్కెట్యార్డుకు విషయానికి వస్తే ఇక్కడ రోజువారి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు నిర్వహించరు. లైసెన్స్ ఉన్న ట్రేడర్స్ రైతుల నుంచి కొన్ని సార్లు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు యార్డుకు సెస్ లభిస్తుంది. ఈమార్కెట్ యార్డు పరిది కింద ఎర్రవల్లి, పుల్లూరు, అయిజలలో చెక్పోస్టులు ఉన్నాయి. ఈ చెక్పోస్టుల నిర్వహణ ద్వారా ఆదాయం ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. మిల్లుల నుంచి కూడా ఆదాయం వస్తోంది. అయిజ సంత నుంచి రెండేళ్లుగా ఆదాయం బాగా పెరిగింది. మార్కెట్ యార్డు నుంచి 2.50 ప్రభుత్వ రంగ సంస్థలు 1.26 మిల్లులు 1.15 చెక్పోస్టులు 0.25 పశువుల సంత 6 లక్షలు కూరగాయల మార్కెట్ 3లక్షలు గద్వాల యార్డులో వరి ధాన్యాన్ని కాంటా వేస్తున్న కార్మికులు (ఫైల్)అలంపూర్ యార్డు లక్ష్యం ఇలా.. (రూ.కోట్లలో) చెక్పోస్టుల నుంచి 2.00 మిల్లులు, ట్రేడర్స్ 1.10 ప్రభుత్వ రంగ సంస్థలు 0.70 సంత నుంచి 0.20 గతేడాది గద్వాల, అలంపూర్ యార్డులకు రికార్డు స్థాయిలో ఆదాయం జిల్లా కేంద్రంలో జోరుగా పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరం గద్వాలకు రూ.5.25 కోట్లు.. అలంపూర్కు రూ.4 కోట్లు ఆదాయ లక్ష్యాల నిర్దేశం -
పాలమూరు అందాలు చూసొదా్దం
పిల్లలమర్రి మహబూబ్నగర్కు 5 కిలోమీటర్ల దూరంలో పిల్లలమర్రి ఉంది. అతిపెద్ద ఆకుపచ్చ గొడుగులాగా నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ భారీ వృక్షానికి 750 ఏళ్లు ఉంటాయని అంచనా. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మర్రి వృక్షం. పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో క్రీ.శ.7వ శతాబ్దం నుంచి 15వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. మహబూబ్నగర్లోని మెట్టుగడ్డ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఏడు తరాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పిల్లలమర్రి, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు, ఆకట్టుకునే ప్రాజెక్టులు, ప్రకృతి అందాల నడుమ అలల సవ్వడిలో కృష్ణమ్మ ఒడిలో సాగే బోటు ప్రయాణాలు, జలపాతాలు, జంగిల్ సఫారీ.. ఇలాంటి ఎన్నో విశేషాలతో పాలమూరు పర్యాటకం సందర్శకులను కనువిందు చేస్తోంది. రోజురోజుకు సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న పర్యాటక ప్రాంతాలు ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటున్నాయి. పిల్లలు, పెద్దలకు ఆహ్లాదాన్ని పంచుతూ హాలీడేస్ను జాలీడేస్గా మార్చేస్తోంది. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మానవపాడు: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అలంపూర్ జూనియర్ సివిల్ కోర్డు జడ్జి మిథున్ తేజ అన్నారు. శనివారం మండలంలోని మద్దూరు గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చదువు కోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. అలాగే, బాల్యవివాహాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. ఆర్థిక లావాదేవీలు, భూ క్రయవిక్రయాలకు సంబంధించి ఖచ్చితంగా లిఖితపూర్వకంగా పత్రాలు కలిగి ఉండాలని, రైతులు విత్తనాలు, ఎరువులు కొన్నప్పుడు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నష్టపోతే రశీదు ఉండటం వల్ల లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, గృహహింస చట్టం, న్యాయ సేవాసంస్థ అందించే సేవలతోపాటు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, నారాయణరెడ్డి, శ్రీధర్రెడ్డి, మధు, గజేంద్రగౌడ్, వెంకటేష్ పాల్గొన్నారు. -
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలి
గద్వాలటౌన్: ఉపాధ్యాయులు.. విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. ఐదురోజులుగా ఆంగ్లం, గణితం, సాంఘికశాస్త్రం, ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు కొనసాగిన శిక్షణ కార్యక్రమాలు శనివారం ముగిశాయి. స్థానిక ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా బోధన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అందుకోసమే విద్యాశాఖ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి శిక్షణ దోహదపడుతుందని, వారిని మెరుగ్గా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. రానున్న విద్యా సంవత్సరం కృత్రిమ మేధ బోధన అన్ని పాఠశాలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. డీఈఓ అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా సులభమైన బోధన పద్ధతులు అవలంభించాలన్నారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ఎస్తేర్రాణి, కోర్సు డైరెక్టర్లు బీకే రమేష్, అమీర్బాష, వెంకటనర్సయ్య, అంపయ్య తదితరులు పాల్గొన్నారు. -
రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి
మల్దకల్: పంటల సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని.. సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు పొందవచ్చని పాలెం శాస్త్రవేత్తలు నళిని, శంకర్ రైతులకు సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని శనివారం మండలంలోని విఠలాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు సాగు చేయాలని సూచించారు. పంటలకు ఆశించే చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. నాణ్యమైన విత్తనాలను వాడి అధిక దిగుబడులను పొందాలని, రసాయన ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతిని పంటలు నష్టపోయే వీలుందన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పనిసరిగా రైతులు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ రాజశేఖర్, ఏఈఓ భాస్కర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలమర్రిలో అందగత్తెల సందడి
పిల్లలమర్రి మహావృక్షం వద్ద సుందరీమణులను సన్మానిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీహరి, మధుసూదన్రెడ్డి, వీర్లపల్లి శంకర్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, పర్ణికారెడ్డి, తదితరులు విద్యార్థులతో మాటామంతీ.. మహా వృక్షం సందర్శించిన తర్వాత మిస్ వరల్డ్ పోటీదారులు జిల్లాకు చెందిన విద్యార్థులతో చిట్చాట్ చేశారు. నలుగురు విద్యార్థులు నాలుగు ప్రశ్నలు అడిగారు. అందులో ఓ చిన్నారి మీ మిస్ వరల్డ్ జర్నీ గురించి వివరించండని ప్రశ్నించగా.. జపాన్కు చెందిన పోటీదారు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. మరో చిన్నారి పిల్లలమర్రి సందర్శన తర్వాత వృక్ష సంరక్షణపై మీరు ఇతరులకు అవగాహన కల్పిస్తారా? అని అడిగారు. దీనిపై ఇండియాకు చెందిన పోటీదారు మాట్లాడుతూ ఇండియన్ అని, మాది రైతు కుటుంబమని, చెట్ల గురించి తనకు తెలుసని.. వాటి పెంపకం గురించి అందరికీ అవగాహన కల్పిస్తానని వివరించారు. విశ్వ వేదికలపై మాట్లాడటానికి సూచనలివ్వాలని ఓ విద్యార్థి కోరగా.. బంగ్లాదేశ్ చెందిన కంటెస్టెంట్ సమాధానమిచ్చారు. ఆత్వవిశ్వాసంతో ముందుకెళ్లాలని చెప్పారు. చివరగా ఓ విద్యార్థి మీ చిన్ననాటి కలల గురించి చెప్పండని ప్రశ్నించగా.. నేపాల్, థాయ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్కు చెందిన మిస్వరల్డ్ పోటీదారులు స్పందించారు. మహావృక్షం వద్ద 2 గంటలు.. రాజరాజేశ్వర ఆలయం, మ్యూజియం సందర్శన తర్వాత సాయంత్రం 6.01 గంటలకు అందాలభామలు మహావృక్షం వద్దకు చేరుకున్నారు. జిల్లా అటవీ అధికారి సత్య నారాయణ పిల్లలమర్రి చరిత్రను వివరించారు. 700 ఏళ్ల నాటి ఈ వృక్షాన్ని 2018 నుంచి ఎలా సంరక్షిస్తూ వస్తున్నామనే అంశాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. అనంతరం మర్రిచెట్టు సమీపంలో 11 మొక్కలు నాటారు. ఆ తర్వాత మహావృక్షం చెంత ఏర్పాటు చేసిన స్టేజ్ వద్దకు చేరుకున్నారు. అక్కడే టీ, స్నాక్స్ తీసుకొని సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. దాదాపు 2 గంటలు మహావృక్షం వద్దే ఉన్నారు. అనంతరం చేనేత స్టాల్స్ను సందర్శించారు. గద్వాల, నారాయణపేట చేనేతలు తయారు చేసిన చీరలను పరిశీలించారు. అక్కడే ఉన్న మగ్గాన్ని, వెదురుతో తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. తొలుత రాజరాజేశ్వర ఆలయం నుంచి.. పిల్లలమర్రికి చేరుకున్న అందాల భామలకు కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి సంపంగి, లైట్ పింక్ గులాబీ పువ్వులతో తయారు చేసిన మాలలను వేసి స్వాగతం పలికారు. ముందుగా 16వ శతాబ్దం కాలం నాటి రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయ చరిత్రతో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఈ ఆలయం ముంపునకు గురైతే ఇక్కడికి తీసుకొచ్చి పునఃప్రతిష్టించినట్లు మిస్వరల్డ్ పోటీదారులకు గైడ్ శివనాగిరెడ్డి వివరించారు. అక్కడి నుంచి మ్యూజియం వద్దకు చేరుకోగా.. వివిధ విగ్రహాలు, శిల్పాల విశిష్టత, పాత రాతియుగం పనిముట్లు, నవీన శిలాయుగపు పనిముట్లు, బృహత్ శిలాయుగపు పాత్రలు, విజయనగర, కుతుబ్ షాహీల కాలంనాటి ఆయుధాలు, విగ్రహాల గురించి వివరించారు. మ్యూజియంలో శాతవాహనుల నుంచి అసఫ్జాహి రాజుల వరకు ముద్రించిన వెండి, సీసపు, రాగి, బంగారు నాణేలతో పాటు మహా శివలింగం, దాని ముందు ఉన్న నంది విగ్రహాల గురించి శివనాగిరెడ్డి వివరించారు. -
డెంగీ రహిత జిల్లాగా మార్చుదాం
గద్వాల క్రైం: డెంగీ రహిత జిల్లాగా మార్చుదామని.. దీనికోసం దోమల నివారణలో అంతా భాగస్వాములు కావాలని జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి సిద్ధప్ప అన్నారు. శుక్రవారం జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తా, చెదారం, మురుగు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. సాధారణ జ్వరం కంటే దోమల ద్వారా వచ్చే విషజ్వరాలు మనుషుల నాడీ వ్యవస్థపై దాడి చేసి తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఏడిస్ దోమ కుట్టడం వల్ల డెంగీ వ్యాధి సోకుతుందని, ప్రజలు ఆరోగ్య విషయాలపై వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి తగు మందులు వాడాలని సూచించారు. -
జోగుళాంబ గద్వాల
పకడ్బందీగా ధాన్యం కొనుగోలు శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025ఫొటో తీస్తున్న మిస్ ఇండియా గద్వాల: ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు కురిసే అవకాశాలున్నందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 17శాతం తేమ ఉన్న ధాన్యాన్ని సంచుల్లో నింపి వెంటనే మిల్లులకు తరలించి అన్లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా ధాన్యం తరలింపులో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా అవసరమైన ట్రాన్స్ఫోర్ట్ వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. గన్నీబ్యాగుల కొరత లేకుండా, వర్షాలు కురిసినప్పుడు ధాన్యం రక్షణకు టార్పాలిన్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీఎస్వో స్వామికుమార్, డీఎం విమల, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, డీఏవో సక్రియనాయక్ పాల్గొన్నారు. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని అర్హులైన వారికే ఇళ్ల కేటాయింపులు చేయాలని కలెక్టర్ అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల వారీగా లబ్ధిదారుల ఎంపికను త్వరగా పూర్తి చేసి జాబితాను సిద్ధం చేయాలన్నారు. అర్హత లేనివారి గల కారణాలు వివరిస్తూ జాబితాలో పొందుపర్చాలన్నారు. పారదర్శకంగా ‘యువ వికాసం’ లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో రాజీవ్యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ఎక్కడా అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా చేపట్టాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో ప నిచేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, డీపీవో నాగేంద్రం, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్; ఎల్డీఎం శ్రీనివాసరావు, మున్సిపల్ కమీ నర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈవీఎంల పరిశీలన పటిష్ట భద్రత ఏర్పాట్లతో నిరంతరం ఈవీఎంలను భద్రపర్చాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో ఉన్న స్ట్రాంగ్ రూంలో ఈవీఎం యంత్రాలను పరిశీలించారు. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ బీఎం సంతోష్ తళుక్కుమన్న సుందరీమణులు ● మహావృక్షాన్ని సందర్శించిన మిస్వరల్డ్–25 పోటీదారులు ● 22 దేశాలకు చెందిన యువతుల రాక ● ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన పర్యటన -
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి
ఇటిక్యాల: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈమేరకు పైలెట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, రైతులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఇటిక్యాల మండలంలోని మునగాలలో నిర్వహించిన భూ భారతి సదస్సులో ఆయన పాల్గొని రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తూ.. పరిష్కారానికి అనువుగా ఉన్న సమస్యలపై ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత, భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. ఈ మేరకు పైలెట్ ప్రాజెక్టుగా ఇటిక్యాల మండలాన్ని ఎంపిక చేసి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వివరించారు. భూ రికార్డుల సవరణలు, విస్తీర్ణ మార్పులు, వారసత్వ సమస్యలు, భూమి స్వభావానికి సంబంధించిన లోపాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, సాదాబైనామాలు, సర్వే నెంబర్ గల్లంతు, పట్టాదారు పాస్బుక్జారీ కాకపోవడం వంటి అంశాలు పరిష్కరించబడతాయని తెలిపారు. ఈ సదస్సులో తహశీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, డి టి నందిని, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఘన స్వాగతం జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లా మీదుకు నారాయణపేట పర్యటన వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఘనంగా స్వాగతం పలికారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కలెక్టర్ విజయేందిర మొక్కను అందజేసీ స్వాగతం పలికారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలమర్రి మహావృక్షం ఫొటోను అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్రావు, ఆర్డీఓ నవీన్, అర్బన్ తహసీల్దార్ ఘన్సిరాం, డీటీ దేవేందర్, ఆర్ఐలు నర్సింగ్, సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు. నిర్వాసితులకు అండగా ఉంటాం కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కొల్లాపూర్ మండలంలోని బోడబండ తండా, సున్నపుతండా, వడ్డెర గుడిసెలను కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి మంత్రి సందర్శించి.. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పనుల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు. నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీరు వస్తుండటంతో సున్నపుతండా మునకకు గురయ్యే అవకాశం ఉందని.. ప్రభుత్వం ఆదుకోవాలని తండావాసులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో ఇళ్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో సర్వం కోల్పోయిన ప్రజలకు అన్నివి ధాలా అండగా ఉంటామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బోడబండ తండా, సున్నపు తండా, వడ్డెర గుడిసెల కు చెందిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ భన్సీలాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏకలవ్య పాఠశాలలో ప్రవేశానికి అవకాశం కందనూలు: తెలంగాణ గిరిజన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్లో మిగిలిన సీట్ల భర్తీకి గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ అధికారి కె.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ప్రవేశానికి ఆసక్తిగల విద్యార్థులు tsemrs.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని.. బాలానగర్ కళాశాలలో ఈ నెల 26న నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 94156 06618, 98557 37578 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
పాలమూరుకు అందాలభామలు
ప్రపంచ సుందరీమణుల బృందం సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సుందరీమణుల బృందానికి స్వాగతం పలకడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. గురువారం ఎస్పీ డి.జానకితో కలిసి కలెక్టర్ పిల్లలమర్రిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ అనే థీమ్తో ప్రభుత్వం అందాల భామలు.. ప్రాచీన ఆలయాలు పర్యాటక ప్రాంతాల అందాలను తిలకించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, ఏఎస్పీ రాములు, డీఎఫ్ఓసత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ● 22 దేశాలకు చెందిన అందగత్తెల రాక ● అన్ని ఏర్పాట్లు చేసిన పర్యాటక శాఖ ● మూడు అంచెల భద్రతతో భారీ బందోబస్తు ఏర్పాటు ● 2 గంటల పాటు కొనసాగనున్న పర్యటన పాలమూరు: ఏడున్నర శతాబ్దాల చరిత్ర ఉన్న పిల్లలమర్రిలో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు సందడి చేయనున్నారు. హైదరాబాద్లో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన పోటీదారుల బృందం శుక్రవారం పాలమూరుకు రానుంది. వారి కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 22 దేశాలకు చెందిన విదేశీ అందగత్తెలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో సాయంత్రం 5 గంటలకు మహబూబ్నగర్కు చేరుకోనున్నారు. పిల్లలమర్రి ప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేశారు. మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు రెండు కిలోమీటర్ల మేర రోడ్డును సుందరీకరించడంతో పాటు ఇరువైపుల విద్యుత్ స్తంభాలకు రంగులు వేశారు. తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య సుందరీమణుల బృందానికి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. పటిష్ట భద్రత కల్పిస్తాం.. ప్రంపచ సుందరీమణుల పర్యటన సందర్భంగా పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి పిల్లలమర్రి వరకు ప్రత్యేక కాన్వాయ్ కొనసాగుతుంది. మూడు అంచెల భద్రతతో పోలీస్ బలగాలు విధుల్లో ఉంటాయి. పర్యాటకులు, ప్రజలు మన ప్రాంతానికి వచ్చే అతిథిలతో గౌరవంగా ఉండాలి. పోలీస్శాఖ నుంచి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. – డి.జానకి, ఎస్పీ, మహబూబ్నగర్ ● మిస్వరల్డ్ పోటీదారుల బృందం మహబూబ్నగర్లో రెండు గంటల పాటు పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటారు. పది నిమిషాల పాటు విశ్రాంతి తర్వాత మొదట చారిత్రక కళాఖండాలు, శిల్పకళలను తిలకిస్తారు. ఆ తర్వాత పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తారు. అనంతరం మూడున్నర ఎకరాల్లో విస్తరించి ఉన్న పిల్లలమర్రి మహావృక్షాన్ని తిలకిస్తారు. అక్కడే ఒక్కొక్క అందగత్తె ఒక్కొక్క మొక్కను నాటనున్నారు. అనంతరం తిరిగి వారు రాత్రి ఏడు గంటలకు రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సులో హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నేడు పిల్లలమర్రిని సందర్శించనున్న ప్రపంచసుందరి పోటీదారులు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు మిస్ వరల్డ్–2025 పోటీదారుల పర్యటను సంబంధించి జిల్లా పోలీస్ శాఖ 1,008 మందితో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది. మూడు అంచెల భద్రత వ్యవస్థ ఉంటుంది. మొదటి వరుసలో మహిళ పోలీస్ సిబ్బంది విత్ సఫారీలో ఉండగా, రెండో వరుసలో సివిల్ పోలీస్, మూడో వరుసలో ఏఆర్ పోలీస్ బలగాలను బందోబస్తు కోసం కేటాయించనున్నారు. వీరితో పాటు స్పెషల్ పార్టీ, రాష్ట్రస్థాయి నుంచి బలగాలు పహారా కాస్తాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ల నుంచి పోలీస్ బలగాలను రప్పించారు. ఇద్దరు ఎస్పీలు, ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 936 మంది ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉంటారు. బందోబస్తును మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ డి.జానకి పర్యవేక్షించనున్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
గద్వాల: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ శ్రీనివాస్రావుతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై బీచుపల్లి నుంచి పుల్లూర్ జంక్షన్ వరకు ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలను గుర్తించి బ్లాక్స్పాట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా ఎర్రవల్లి నుంచి గద్వాల వరకు ప్రమాదసూచిక బోర్డులు, హెచ్చరికలు సూచించే గుర్తులు, కల్వర్టుల మరమ్మతు చేయాలని ఆర్అండ్బీ శాఖ అధికారులను ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద రాత్రి వేళలో సరైన వెలుతురు స్పష్టమైన సైన్బోర్డులు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ శ్రీనివాస్రావు మాట్లాడుతూ ప్రజల ప్రాణభద్రతకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రోడ్డుప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిని పట్టుకునేందుకు నిరంతరంగా డ్రంక్అండ్డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగులయ్య, డీటీవో వెంకటరమణరావు, డీఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప, హిమాన్ష్గుప్త, ఎకై ్సజ్శాఖ, పంచాయతీశాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఆగని భూకబ్జాల పర్వం
జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా మున్సిపల్ స్థలాలు కబ్జా ●స్థలాలను కాపాడాలి లేఅవుట్ ప్లాన్లో ప్రజా అవసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలు చాలాచోట్ల కబ్జాకు గురయ్యాయి. వాటిపై గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశాం. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కబ్జాకు గురైన ఖాళీ స్థలాలను కాడాలి. భవిష్యత్తులో ఎవరూ అందులో చోరబడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. – పూజారి శ్రీధర్, గద్వాల రక్షణ చర్యలు చేపడతాం అధికారిక లేఅవుట్లోని పది శాతం స్థలాలను అమ్మడం, కోనడం నిబంధనలకు విరుద్ధం. విక్రయించిన లేఅవుట్ స్థలంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. వెంటనే టౌన్ ఫ్లానింగ్ అధికారులతో మార్కింగ్ చేసి ఆయా స్థలాలకు రక్షణ చర్యలు తీసుకుంటాం. స్థలాల కొనుగోలు విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. – దశరథ్, కమిషనర్, గద్వాల గద్వాలటౌన్: గద్వాల పట్టణ శివారులో వెలిసిన లేఅవుట్లలో అక్రమ దందా కొనసాగుతోంది. అప్పట్లో సామాజిక ప్రజా అవసరాల కోసం ఇచ్చిన స్థలాలు రాత్రికి రాత్రే ఇళ్ల స్థలాలుగా మారుతున్నాయి. నాడు తయారు చేసిన అధికారిక లేఅవుట్ మ్యాప్లో సామాజిక స్థలాలు ప్రత్యేకంగా చూపించి ప్లాట్ల స్థలాలను విక్రయించారు. అధికారిక లేఅవుట్లో గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రర్ అయిన పది శాతం స్థలాన్ని అక్రమార్కులు ప్లాట్లుగా చేసి విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నారు. ఈ ఉదంతాలు మున్సిపల్ పరిధిలో అనేకం వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికి అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుని వదిలేస్తున్నారు. ఊదాసీనంగా అధికారులు అనుమతులు లేకుండా నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లను అడ్డుకోవడంలో మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వ స్థలంగా ఉన్న సామాజిక స్థలాలు అక్రమంగా ఇతరులకు ధారాదత్తం అవుతున్న ఊదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అంతేగాక కొంతమంది రియల్టర్లు కుమ్మకై ్క ‘మాకెంత.. మీకెంత అంటూ..’ అంటూ బేరసారాలకు దిగుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. లేఅవుట్లోని పది శాతం స్థలం అన్యాక్రాతం అవుతుందని, ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్నారని చాలామంది మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇప్పటికే అనేక అధికారిక లేఅవుట్లలో ఉన్న సామాజిక స్థలాలు కనుమరుగయ్యాయి. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి లేఅవుట్లలో విక్రయించిన పది శాతం సామాజిక స్థలానికి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. లేఅవుట్లోని పార్కు స్థలాలు సైతం మాయం రూ.లక్షలు వెనకేసుకుంటున్న అక్రమార్కులు -
అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు
అలంపూర్: అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీముభారక్, సీఎం సహాయ నిధి చెక్కులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...పేదింటి ఆడపిల్లలకు పెళ్లి కానుక ద్వారా రూ.లక్ష 116 అందిస్తుందన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ.70 లక్షల విలువగల కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా సీఎం సహాయ సహాయ నిధి ద్వారా 102 మంది లబ్ధిదారులకు రూ.25 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. లబ్దిదారులు సకాలంలో చెక్కులను తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
నేటినుంచి డిగ్రీ పరీక్షలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పరీక్షలు పలు కారణాలతో రెండుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందులో ఏబీ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్డబ్ల్యూ తదితర కోర్సుల్లో 2, 4, 6 సెమిస్టర్లతోపాటు పలు సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్ష నిర్వహణకు అధికారులు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా తదితర చర్యలు చేపట్టారు. ఇప్పటికే అన్ని కేంద్రాలకు మెటీరియల్ చేరుకుంది. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 47 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా ఇందులో 17 ప్రభుత్వ.. 30 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో సె మిస్టర్–2లో 16,073 మంది విద్యార్థులు, సెమిస్ట ర్– 6లో 13,787 మంది, సెమిస్టర్–4లో 9,240 మంది విద్యార్థులు కలిపి మొత్తం 39,100 మంది పరీక్ష రా యనున్నారు. 9 రూట్లలో ఫ్లయింగ్ స్క్వాడ్, 47 మంది సిట్టింగ్ స్క్వాడ్ను నియమించారు. మాస్ కాపీయింగ్కు ఎలాంటి అవకాశం లేకుండా పరీక్షలు పక డ్బందీగా నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. రెండుసార్లు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రారంభం 47 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 39,100 మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తిచేశాం.. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా కాపీయింగ్ తావు లేకుండా పకడ్బందీగా, పాదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్రీనివాస్, పీయూ వైస్ చాన్స్లర్ -
ధాన్యాన్ని మిల్లులకు వెంటనే తరలించాలి
ధరూరు: కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని, ఎక్కడా నిల్వ ఉంచుకోవద్దని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని అల్వలపాడులోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించారు, రైస్ మిల్లులకు ఎంత తరలించారు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా డిజిటల్ తేమ మిషన్ ద్వారా తేమ శాతాన్ని పరిశీలించి 17 శాతం రాగానే ధాన్యాన్ని కాంటా వేసి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ముఖ్యంగా గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని సివిల్ సప్లయ్ డీఎంను ఆదేశించారు. ధాన్యం రవాణాకు ఎక్కువ సంఖ్యలో లారీలను సిద్ధం చేసి ఉంచాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను వెంట వెంటనే ట్యాబ్లో ఎంట్రీ చేయాలని, ఆ తర్వాత రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, కాంటా వేసే విషయంలో పారదర్శకంగా తూకాలు వేయాలని, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఖాళీ చేసేలా ఐకేపీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్, సివిల్ సప్లయ్ డీఎం విమల్, తహశీల్దార్ భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలమర్రి ‘ముస్తాబు’
● 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి సందర్శన ● మహావృక్షం ఖ్యాతిపైపవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఏర్పాట్లు ● విజయనగరం కాలం నాటి ఆలయం.. పురావస్తు మ్యూజియానికి సొబగులు ● తెలంగాణతోపాటు జిల్లా సంస్కృతి ప్రతిబింబించేలా అధికారుల సన్నాహాలు ● వెదురు ఆకృతులు, చేనేత చీరలు, మగ్గాలు, బతుకమ్మలు,బోనాల ప్రదర్శన ● గిరిజనుల సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానం.. గురుకులాల విద్యార్థులతో మాటాముచ్చట ● సుమారు వెయ్యి మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఈ నెల 16న ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో పాలమూరు ముస్తాబవుతోంది. సుమారు 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రిని వారు సందర్శించనుండగా.. మహావృక్షం ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ముందుకు సాగుతోంది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్శాఖ పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టింది. ఆలయం.. మ్యూజియం.. ఆ తర్వాత పిల్లల మర్రి.. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో పాలమూరుకు చేరుకోనున్నారు. పిల్లలమర్రి వద్ద తెలంగాణ పండుగల విశిష్టత, సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలు, బోనాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల మధ్య వారికి ఆహ్వానం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా వారు విజయనగర కాలం నాటి పునర్నిర్మించిన రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించి.. పురావస్తు మ్యూజియానికి రానున్నారు. ఆ తర్వాత లంబాడాల నృత్య ప్రదర్శన మధ్య పిల్లల మర్రికి చేరుకోనున్నారు. మహా వృక్ష విశిష్టత, దీనికి సంబంధించిన చరిత్ర, పునరుజ్జీవం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రపంచ సుందరీమణులకు వివరించనున్నారు. అదేవిధంగా రాజరాజేశ్వర ఆలయ విశిష్టతతోపాటు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజియం విశేషాలను వారికి అర్థమయ్యే రీతిలో వివరించేందుకు ప్రత్యేక గైడ్లను నియమించారు. గద్వాల, నారాయణపేట చేనేత చీరల ప్రదర్శన.. మన నేతన్నల కళా నైపుణ్యాన్ని వివిధ దేశాలకు చెందిన అందమైన భామలకు తెలియజేసేలా పిల్లల మర్రి ఆవరణలో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ప్రఖ్యాతి గాంచిన గద్వాల, నారాయణపేట చేనేత చీరలను ప్రదర్శించనున్నారు. మగ్గాలతో సహజసిద్దంగా నేసే చీరల తయారీకి సంబంధించిన విధానాన్ని వివరించనున్నారు. దీంతోపాటు వెదురుతో తయారు చేసిన అలంకరణ ఆకృతులు, మహిళా సంఘాల హస్త కళానైపుణ్యాన్ని వివరించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. పిల్లల మర్రి ఆవరణలో 22 మంది అందాల భామల చేతుల మీదుగా వివిధ రకాల మొక్కలు నాటేలా అధికారులు చర్యలు చేపట్టారు. చివరగా గురుకుల విద్యార్థులతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు కాసేపు ముచ్చటించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 2 గంటలు.. మూడంచెల బందోబస్తు మిస్ వరల్డ్–25 కంటెస్టెంట్లకు చెందిన గ్రూప్–2 సభ్యులు 16న సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గాన మహబూబ్నగర్లోని పిల్లలమర్రి వద్దకు నేరుగా చేరుకుంటారు. పలు కార్యక్రమాల అనంతరం తిరిగి రాత్రి ఏడు గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్కు బయలుదేరనున్నట్లు తెలిసింది. ప్రపంచ సుందరీమణుల రాక నేపథ్యంలో ఐజీ, ఎస్పీ పర్యవేక్షణలో పోలీసులు మూడంచెల బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డాగ్, బాంబ్ స్క్వాడ్లతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు వెయ్యి మంది పోలీస్ సిబ్బందికి బందోబస్తు విధులు కేటాయించారు. రేపు ప్రపంచ సుందరీమణుల రాక గ్రూప్–2లోని 22 మంది అందగత్తెలు.. ఏర్పాట్లు ఇలా.. మిస్ వరల్డ్–25 కంటెస్టెంట్లు పిల్లల మర్రి పర్యటనను పురస్కరించుకుని పురావస్తు, అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో వివిధ రకాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊడల మర్రి చుట్టూ మట్టిని చదును చేసి, గ్రాస్ మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నారు. మహావృక్షం చుట్టూ గోడ, ఊడల మర్రి పునరుజ్జీవంలో భాగంగా ఏర్పాటు చేసిన సిమెంట్ పిల్లరతోపాటు సిమెంట్ కుర్చీలకు రంగులు అద్దుతున్నారు. పిల్లలమర్రి చుట్టూ పచ్చదనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటర్ ప్రూఫ్ టెంట్లతోపాటు ప్రత్యేకంగా వాష్రూంలను సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా మ్యూజియంలోని శిల్పాలను శుభ్రం చేయడంతోపాటు వాటికి నేమ్ బోర్డులు రాయిస్తున్నారు. ఆయా శిల్పాలు ఏ కాలానికి చెందినవి.. ఎవరి హయాంలో తయారు చేశారు.. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వంటి వివరాలు నేమ్ బోర్డులో పొందుపరుస్తున్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో సౌండ్ అండ్ లైటింగ్, పారిశుద్ధ్య పనులు చకచకా సాగుతున్నాయి. మిస్ వరల్డ్–25 పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో జరుగుతున్న పోటీల్లో వందకు పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటిచెప్పేందుకు ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం వేదికగా మలుచుకుంది. ఇందులో భాగంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను గ్రూప్–1, గ్రూప్–2గా విభజించి.. ప్రత్యేక థీమ్, టూరిస్ట్ సర్క్యూట్ల వారీగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు పాలమూరులో ప్రఖ్యాతిగాంచిన పిల్లల మర్రిని గ్రూప్–2లోని వివిధ దేశాలకు చెందిన 22 మంది అందగత్తెలు శుక్రవారం సందర్శించనున్నారు. -
ధర లేక.. దిక్కుతోచక !
ఎండుమిర్చి రైతు కుదేలు ●తెగుళ్లు ముంచాయి ఎండుమిర్చికి ఆకుముడుత తెగులు సోకి పంట గిడుసబారింది. ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్లు దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. మిరప పంట నాణ్యత లేనందున ధర కేవలం రూ.10 వేల నుంచి రూ.13 వేలు పలుకుతోంది. పంటను విక్రయిస్తే నష్టమే వస్తోంది. – జగన్నాథరెడ్డి, మిర్చి రైతు, అయిజ గిట్టుబాటు ధర కల్పించాలి మిర్చి పంట విక్రయానికి అధికారులు మార్కెట్ సౌకర్యం, గట్టుబాటు ధర కల్పించాలి. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో పంటను హైదరాబాద్, బెంగుళూరు, గుంటూరుకు తరలిస్తున్నారు. రవాణా ఖర్చు భారమవుతుంది. జిల్లా కేంద్రంలో ప్రతిరోజు ఎండుమిర్చి మార్కెట్ సౌకర్యం కల్పించాలి. – గోవిందు, మిర్చి రైతు, అయిజ దళారులు దోచుకుంటారు ఎండు మిర్చికి మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో చిన్న రైతుల నుంచి మధ్యదళారులు మార్కెట్ ధర కంటే క్వింటాకు రూ.2 వేలు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. అసలే రూ.లక్షలకు లక్షలు అప్పులు చేసి పెట్టుబడి పెడితే.. పెట్టుబడి రాకపోగా దళారులు నిండా ముంచుతున్నారు. – దేవేందర్, రైతు, సింధనూరు పంట మార్పిడి చేయాలి ఏటా మిరప పంట సాగుచేస్తుండడంతో పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశించి దిగుబడులు తగ్గుతున్నాయి. ఏటా పంట మార్పిడి చేయాలి. ఈ ఏడాది మిరప సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. మార్కెట్లో ధర కూడా పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. గతేడాది పండించిన మిరపను రైతులు కోల్డ్ స్టోరేజ్ గోదాంలలో నిల్వచేసుకున్నారు. ఈ ఏడాది వచ్చిన పంటను నిల్వ చేసుకునేందుకు గోదాంలు చాలడం లేదు. రైతులు హార్టికల్చర్ అధికారుల సూచన మేరకు సాగుచేస్తే నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. – మహ్మద్ అలీ అక్బర్, హార్టీకల్చర్ జిల్లా అధికారి అయిజ: ఆరుగాలం కష్టపడి ఎండు మిరపను పండించిన రైతుకు ఈ ఏడాది కాలం కలిసి రాలేదు. అటు మిర్చి దిగుబడి ఘననీయంగా తగ్గిపోగా.. ఇటు మార్కెట్లో ధరలు అమాంతం పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్ సౌకర్యం కల్పించాల్సిన అధికారులు చేతిలెత్తేయడంతో మిర్చి పండించిన రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పురుగులు, తెగుళ్ల కారణంగా గతేడాదితో పోల్చితే ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. అదేవిధంగా మార్కెట్లో క్వింటాకు ధర రూ.10 వేలు తక్కువ పలుకుతోంది. పండిన పంటను అమ్మకుందామంటే జిల్లాలో మార్కెట్ లేదు. సుదూర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్కు పంటను తరలించాలంటే అన్నదాతలు వ్యయప్రయాసలకు గురి కావాల్సి వస్తుంది. విధిలేక దళారులకు విక్రయిద్దామంటే మార్కెట్ రేటుకంటే రూ.2 వేల నుంచి రూ.3వేలు తక్కవకు ధరకు అడగడంతోపాటు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అంచనాలు తప్పాయి.. జిల్లాలో 2024లో 65,115 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేయగా.. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మిర్చి రకాలను బట్టి ధర రూ.15 వేల నుంచి రూ. 25వేల వరకు పలికింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు సగం విస్తీర్ణం తగ్గిపోయింది. సాగుబడి తక్కువ విస్తీర్ణం ఉండడంతో ధర ఎక్కువ పలుకుతుందని, లాభాలు ఎక్కువగా ఉంటాయని ఊహించిన రైతుల అంచనాలు తప్పాయి. ధర ఘననీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది వానాకాలంలో 19,785 మంది రైతులు 37,801 ఎకరాల్లో ఎండుమిర్చిని సాగుచేశారు. పంటకు వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించాయి. తామర పురుగు పంటపై పగబట్టింది. ఆకుముడుత ఈ ఏడాది ఎక్కువ శాతం పెంటలను దెబ్బతీసింది. రైతులు ఎన్ని రకాల మందులు పిచికాారీ చేసినా ఫలితం లేకపోయింది. అప్పులు మిగిలాయి కానీ పురుగులు మాత్రం చావలేదు. మొత్తంగా ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఎండుమిర్చి రకాలను బట్టి ధర రూ.10 వేల వేల నుంచి రూ.13 వేల వరకు మాత్రమే పలుకుతోంది. మధ్యరకంగా తీసుకుంటే ఎకరానికి రైతులకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రాబడి వస్తోంది. పెట్టుబడి ఎకరానికి సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టారు. దీంతో రైతులు ఆరుగాలం పడిన కష్టం వృథా అయ్యింది. పెట్టుబడులు తిరిగి రాకపోగా రైతులు అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మండలం సాగు విస్తీర్ణం రైతులు (ఎకరాల్లో) ఇటిక్యాల 6,022 2,733 మానవపాడు 5,852 2,809 అయిజ 4,991 2,811 ఎర్రవల్లి 4,729 2,281 గద్వాల 4,366 2,397 గట్టు 3,507 2,194 మల్దకల్ 2,875 1,734 వడ్డేపల్లి 2,830 2,281 ఉండవెల్లి 2,830 1,344 రాజోళి 1,016 666 అలంపూర్ 671 245 ధరూరు 133 94 కేటీదొడ్డి 121 87 జిల్లాలో మిర్చి సాగు ఇలా.. తెగుళ్లతో తగ్గిన దిగుబడులు పడిపోయిన మార్కెట్ ధరలు కోల్డ్ స్టోరేజీల్లో పేరుకుపోయిన ఎండుమిర్చి నిల్వలు -
ప్రశాంతంగా పాలిసెట్
● 78 మంది విద్యార్థులు గైర్హాజరు గద్వాల టౌన్: పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1,780 మంది విద్యార్థులకు గాను 1,702 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 78 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 95.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉదయం 9 గంటల వరకే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. పది గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రం లోపలికి అనుమతి ఇచ్చారు. నిమిషం నిబంధన ఉండటంతో పలువురు విద్యార్థులు చివరి నిమిషంలో ఉరుకులు, పరుగులు తీశారు. ఆయా కేంద్రాలలో ఒక్కో బెంచీకి ఒక్కరే విద్యార్థి పరీక్ష రాసే విధంగా చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల దగ్గర గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. రెవెన్యూ, వైద్య, పోలీసు అధికారులు నిరంతంర పర్యవేక్షించారు. పరీక్ష పూర్తయిన తరువాత బందోబస్తు మధ్య పరీక్ష పేపర్లును వాహనాలలో తరలించారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు గద్వాల: అక్రమ లేఅవుట్లను 25శాతం రాయితీతో క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడగించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 47,063 దరఖాస్తులు రాగా వాటిలో 25,710 మందికి 25 శాతం రాయితీతో కూడిన ఎల్ఆర్ఎస్ సమాచారాన్ని పంపినట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 14,313 మందికి, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 11, 397 మందికి సమాచారాన్ని పంపగా వీరిలో కేవలం 6165 మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 18న చెస్ పోటీలు వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 18న జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 9, 11 బాలలకు చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విస్ లీగ్ పద్ధతిలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోటీలు జరుగుతాయని.. మొదటి, రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల బాలలు పోటీలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంఘం జిల్లా అధ్యక్షుడు (సెల్నంబర్ 97034 62115), కోశాధికారి టీపీ కృష్ణయ్య (సెల్నంబర్ 99591 54743) సంప్రదించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి కేటీదొడ్డి: కర్ణాటక రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని, ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు దృష్టి సారించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. మంగళవారం మండలంలోని కొండాపురం గ్రామంలోని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకు రాష్ట్రం నుంచి వచ్చే రైతులకే ముందుగా టోకన్లు ఇస్తున్నారని ఇక్కడి నెలల నుంచి ఉన్న రైతులకు టోకెన్లు, గన్నీ బ్యాగ్స్ ఇవ్వడం లేదని ఆయన అడిషనల్ కలెక్టర్ నర్సింగ్రావుకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. తూకంలో తరుగులు ఎక్కువ తీస్తున్నారని అవకతవకలు జరుగకుండా చూడాలని అన్నారు. ధాన్యం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి వారికి కేటాయించిన రైస్ మిల్లులకు తనలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి స్వప్న, మండల అధ్యక్షుడు శ్రీపాదరెడ్డి, నాయకులు హన్మిరెడ్డి, ఎర్రభీంరెడ్డి, శ్రీనివాసులు, నాగిరెడ్డి, తదితరులు ఉన్నారు. వేరుశనగ క్వింటా రూ.5,640 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు మంగళవారం 146 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.5640, కనిష్టం రూ.2840, సరాసరి రూ.4470 ధరలు పలికాయి. అలాగే, 42 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5820, కనిష్టం రూ.4590, సరాసరి రూ.5712 ధరలు లభించాయి. 621 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1856, కనిష్టం రూ. 1509, సరాసరి రూ.1769 ధరలు వచ్చాయి. -
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వద్దు
గద్వాల: రైస్మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకోవడంలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన గద్వాల మండలం కొత్తపల్లి, రేకులపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా కేంద్రాలలోని ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్ధేశిత మిల్లులకు తరలించడంతో పాటు తక్షణమే మిల్లుల వద్ద అన్లోడింగ్ జరిగేలా పర్యావేక్షణ జరపాలన్నారు. అక్కడే రైతులను పలుకరించి ధాన్యం అమ్మకాలలో ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆయా కేంద్రాలలో సేకరించిన ధాన్యం నిల్వల గురించి, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున ధాన్యం తరలింపు, రైస్మిల్లల వద్ద అన్లోడింగ్ ప్రక్రియ త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గన్నీబ్యాగుల కొరత, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. అకాలవర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోకుండా సరిపడా సంఖ్యలో టార్పాలిన్లు సమకూర్చుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ మల్లిఖార్జున్, డీటీ అజిత్కుమార్, ఆర్ఐ రామకృష్ణ, ఏఈవో హరీష్, డీపీఎం రామ్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
బోధనా సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపే లక్ష్యం
గద్వాలటౌన్ : మారుతున్న లక్ష్యాలకు అనుగుణంగా భోధన సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అన్నిస్థాయిల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాలను చేపట్టిందని జిల్లా విద్యా సమన్వయ అధికారిణి ఎస్తేరురాణి అన్నారు. మంగళవారం వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు వేరువేరుగా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వారికి ఆయా సబ్జెక్టుల నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన ఫలితాలను పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్లు బీకే రమేష్, అమీర్బాష, వెంకటనర్సయ్య, అంపయ్య తదితరులు పాల్గొన్నారు. -
మన్యంకొండలో వైభవంగా వసంతోత్సవం
మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ అలివేలు మంగతాయరు దేవస్థానం సమీపంలో మహబూబ్నగర్– రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కనున్న శ్రీలక్ష్మీనర్సింహస్వామి (ఓబులేశు) ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవబృత స్నానం తదితర పూజలు జరిపి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొన్నారు. అనంతరం పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. స్వామివారి పాదాలు, శఠగోపురానికి పురోహితులు సంప్రదాయబద్ధంగా స్నానం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
భూ భారతి సదస్సులను వినియోగించుకోండి
ఇటిక్యాల: రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఇటిక్యాల మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో ఆయన పాల్గొని రైతుల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, జిల్లాలో ఇటిక్యాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారం కోసం గతంలో ప్రజలు అధికారులను కలవాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు అధికారులే గ్రామాల్లోకి వచ్చి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి నెలాఖరులోగా అర్హులైన వారికి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. రైతులు నిర్దేశిత ప్రొఫార్మా ద్వారా దరఖాస్తులను ఇవ్వాలని సూచించారు. ఈ సదస్సులో భూ రికార్డుల సవరణలు, విస్తీర్ణ మార్పులు, వారసత్వ సమస్యలు, భూమి స్వభావానికి సంబంధించిన లోపాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, సాదాబైనామాలు, సర్వే నెంబర్ గల్లంతు, పట్టాదారు పాస్బుక్జారీ కాకపోవడం వంటి అంశాలు పరిష్కరించబడతాయని తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సులో తహసీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, డి టి నందిని, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
45వేల గన్నీ బ్యాగుల సరఫరా
గట్టు: ఎట్టకేలకు గట్టు మండలానికి 45 వేల గన్నీ బ్యాగులను అధికారులు సోమవారం సరఫరా చేశారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతున్న వ్యవహారంపై ‘పేరుకుపోయిన ధాన్యం’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమవగా అధికారులు స్పందించారు. గన్నీ బ్యాగులను సమకూర్చారు. వీటిని ఆయా కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేశారు. గట్టుకు 15వేలు, మాచర్లకు 10వేలు, ఆలూరుకు 10వేలు, పెంచికలపాడుకు 10 వేల గన్నీ బ్యాగులను తీసుక వచ్చి రైతులకు అందజేసినట్లు పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, సీఈఓ భీమేష్ తెలిపారు. గన్నీ బ్యాగుల కోసం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు బారులు తీరారు. ఇప్పటికే వడ్ల రాసులతో కొనుగోలు కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. వడ్లను ఎప్పుడు తూకం పడతారా అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు అధికారులు గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగానే వడ్ల తూకం ఆగిపోయిందని, ధాన్యం మిల్లులకు తరలిస్తే ఏ ఇబ్బంది ఉండదని రైతులు తెలిపారు. గన్నీ బ్యాగుల కొరతను తీర్చిన అధికారులు.. ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా మిల్లులకు తరలించే ఏర్పాట్లు కూడా చేయాలని రైతులు కోరారు. -
భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలి
అయిజ: భారతమాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాలేదని సోమవారం మండలంలోని దేవబండ గ్రామం రైతులు భారతమాల రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడారు. నష్టపరిహారం కోసం రైతులు అనేకసార్లు ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. భారతమాల రోడ్డు నిర్మాణం కోసం 33 ఎకరాల భూసేకరణ చేశారని తెలిపారు. మెదటి విడతలో కొంతమంది రైతులకు మాత్రమే నష్టపరిహారం వచ్చిందని, మిగితా వారికి రాలేదని మండిపడ్డారు. బోర్వెల్స్, ఓపెన్ వెల్స్, చెట్లకు రావాల్సిన నరష్టపరిహారం ఇంతవరకు రాలేదని వాపోయారు. అందరికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇచ్చేవరకు నిరసన చేపడుతామని హెచ్చరించారు. సంఘటన స్థలానికి ఎస్ఐ శ్రీనివాసరావు చేరుకొని సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని నచ్చచెప్పడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి మొత్తం 75 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్లో మొత్తం 9 అర్జీలు వచ్చాయి. ఈమేరకు ఎస్పీ శ్రీనివాసరావు ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఫిర్యాదులు రాగా.. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ బాధితులకు తెలిపారు. -
నిర్వహణ ప్రశ్నార్థకం
ఆర్డీఎస్లో వేధిస్తున్న సిబ్బంది కొరత సిబ్బంది కొరతతో పర్యవేక్షణ కరువు సిబ్బంది తక్కువగా ఉండటంతో కెనాల్పై పర్యవేక్షణ నామమాత్రంగానే ఉందని చెప్పాలి. ప్రధానమైన డిస్ట్రిబ్యూటరీల దగ్గర మాత్రమే అధికారుల పర్యటనలు, పర్యవేక్షణలు కొనసాగుతున్నాయని రైతుల నుంచి ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆర్డీఎస్పై మరమ్మతులు చేపట్టారు. పనులు చేపట్టడానికి ముందే పనులు జరగాల్సిన డీ–20 నుంచి దిగువకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సి ఉంది. మరమ్మతులకు నిధులు మంజూరు కాక ముందు చేసిన పర్యటనలే తప్పా తాజాగా చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం కెనాల్పై ఇంకా ఏమైనా మరమ్మతులు ఎక్కువ మొత్తంలో చేపట్టాల్సిన అవసరం పెరిగిందా అనే కోణంలో కూడా అధికారులు పరిశీలిన చేయాల్సి ఉండగా.. సిబ్బంది కొరత వల్ల ఆ పరిశీలన జరగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజోళి: జిల్లాలో దాదాపు వంద కిలోమీటర్ల మేర ఆర్డీఎస్ కాల్వ విస్తరించినా.. నిర్వహణ మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అలాగే, ఆర్డీఎస్ ఆయకట్టుకు సైతం నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్డీఎస్ నిర్వహణకు గతంలో ఉన్న అధికారులు ప్రస్తుతం లేకపోవడం, సిబ్బంది కొరతతో ఉన్న కొద్దిమందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా వచ్చే నీటిని చివరి ఆయకట్టుకు అందించే క్రమంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడంలో అధికారులు నియంత్రణ కోల్పోతున్నారు. దిగువ, ఎగువన ఉన్న రైతులకు నీటి విషయంలో సరైన సమాధానం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. మొత్తానికి ఆర్డీఎస్ కెనాల్పై అధికారుల పర్యవేక్షణ నామమత్రంగానే ఉందని రైతులు ఆరోపిస్తుండగా.. ఉన్న సిబ్బందితోనే చివరి ఆయకట్టు వరకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ఆయకట్టుకు జీవం పోస్తున్నామని అధికారులు అంటున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ కెనాల్ వంద కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 12ఏ డిస్ట్రిబ్యూటరీ నుంచి 40వ డిస్ట్రిబ్యూటరీ వరకు 42.6 కి.మీ నుంచి 140 కి.మీ వరకు ఉంది. దీనికి సంబంధించిన విధులు చేయాల్సిన అధికారుల కంటే తక్కువగా సిబ్బంది ఉన్నారు. 2017 సంవత్సరంలో చీఫ్ ఇంజినీర్స్ కమిటీ రూపొందిన నిబంధనల మేరకు ఆయా విభాగాల వారిగా సిబ్బందిని కేటాయించారు. దాని ప్రకారమే సిబ్బంది ఉండాలి కాని, వర్క్ ఇన్స్పెక్టర్లు 11 మంది ఉండాల్సి ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. మరో నలుగురిని ఏర్పాటు చేయాల్సి ఉంది. కాల్వపై వివిధ పనులు చేస్తూ, నీటి ప్రవాహాన్ని సాఫీగా చేసి, ప్రధానమైన చోట్ల కంప చెట్లు ఇతర వ్యర్థాలను తొలగించి, అత్యవసర సమయంలో సేవలందించే లస్కర్లు, ఇతర మాన్యువల్ సిబ్బంది 57 మంది ఉండాలి. కానీ 46 మంది మాత్రమే ఉన్నారు. ఎలక్ట్రీషియన్లు ఒకరిని కేటాయించాల్సి ఉండగా ఇంత వరకు కేటాయింపు చేయలేదు. ఇద్దరు పంపు ఆపరేటర్లు అవపసరముండగా.. వారిని కూడా కేటాయించలేదు. ఫిట్టర్ మెకానిక్గా ఒకరు అవసరం ఉండగా వారిని కూడా ఏర్పాటు చేయలేదు. జీఓ 45 ప్రకారం ఔట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని నియమించేందుకు అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం దీనిపై ఇప్పటిదాకా అడుగు ముందుకు వేయడం లేదని రైతులు అంటున్నారు. కానీ కొన్ని రకాల సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం ద్వారానే ఉత్తర్వులు రావాల్సి ఉండటంతో చాలా వరకు సిబ్బందిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. వంద కిలోమీటర్ల మేర ప్రవాహం వంద కి.మీ.ల కాల్వ పర్యవేక్షణకుసరిపడా లేని సిబ్బంది తరచూ కాల్వ వెంట కోతలు.. సవాళ్లను అరికట్టడంలో తీవ్ర ఒత్తిడి తుమ్మిళ్ల లిఫ్టుతో అదనపు భారం సిబ్బంది కొరత ఉన్నప్పటికీ.. ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరందించడమే మా లక్ష్యం. దాని కోసం నిరంతరం శ్రమిస్తాం. దీని కోసం ఉన్న సిబ్బందితోనే కాలం వెల్లదీస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, రైతులకు ఇబ్బందులు రాకూడదనే లక్ష్యంతో సిబ్బందితోనే అదనపు సమయమైనా తీసుకుని పనులు చేస్తున్నాం. సిబ్బంది నియామకం అనేది ప్రభుత్వం, ఉన్నతాధికారుల చేతిలోనే ఉంటుంది. కాగా ఈ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – శ్రీనువాసులు, ఆర్డీఎస్ ఎస్ఈ -
కనులపండువగా ఆదిశిలావాసుడి కల్యాణం
మల్దకల్: ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం సోమవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు రమేషాచారి, మధుసూదనాచారి, రవిచారి.. స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా మహాహోమం నిర్వహించి స్వామి వారి ఉత్సవమూర్తులకు కల్యాణం జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆలయచైర్మన్ ప్రహ్లాదరావు, చంద్రశేఖర్రావు, దీరేంద్రదాసు, నరేందర్, సవారి, రాములు, వీరారెడ్డి, పద్మారెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు మీసేవా కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని, కనీసం ఇంటర్మీడియట్ గణితశాస్త్రంలో 60శాతం మార్కులు, ఐటీఐ డ్రాప్ట్స్మెన్(సివిల్), డిప్లొమా(సివిల్), బీటెక్(సివిల్) లేదా ఇతర సమాన అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఓసీ అభ్యర్థులు రూ.10వేలు, బీసీ విద్యార్థులు రూ.5వేలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు రూ.2500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు నోటీసు అయిజ: అయిజ మున్సిపాలిటీలో ఇటీవల నిర్వహించిన తైబజార్ వేలం రద్దు విషయంపై సోమవారం మున్సిపల్ కమిషనర్కు హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు తైబజార్ వేలం నిర్వహించారు. అయిజకి చెందిన రవీందర్ రూ.21 లక్షలకు వేలం దక్కించుకున్నారు. అయితే వేలం నిబంధనల మేరకు నిర్వహించలేదని, రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఈనెల 4న వేలం నిర్వహణను రద్దుచేసినట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు. ఇదిలాఉండగా, తైబజార్ను వేలంలో దక్కించుకున్న రవీందర్ ఈనెల 6న హైకోర్టును ఆశ్రయించడంతోపాటు మానవ హక్కుల కమిషన్కు, సీడీఎంఏ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈమేరకు హైకోర్టు నోటీసు పంపించింది. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులును వివరణ కోరగా.. హైకోర్టు నుంచి నోటీసు వచ్చిందని, త్వరలో వివరణ ఇస్తానని పేర్కొన్నారు. 15, 16న ‘ఇంటర్’ స్పాట్ కౌన్సెలింగ్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం (2025– 26)లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు గాను ఈ నెల 15, 16 తేదీల్లో విద్యార్థులకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు గురుకులాల మహబూబ్నగర్ ప్రాంతీయ సమన్వయ అధికారి కె.సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, వనపర్తి, కేటీదొడ్డి, అచ్చంపేట, మన్ననూర్, పెద్దమందడి, కొండాపూర్లో ఈ కళాశాలలు ఉన్నాయన్నారు. వీటిలో చేరేవారు మొదటి రోజు బాలురకు, రెండో రోజు బాలికలకు జిల్లాకేంద్రం శివారు ధర్మాపూర్లోని ఆల్ మదీనా బీఈడీ కళాశాల ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతోపాటు ఒక సెట్ జిరాక్స్, ఐదు పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. వేరుశనగ క్వింటా రూ.5,970 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు సోమవారం 112 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.5970, కనిష్టం రూ.2919, సరాసరి రూ.5136 ధరలు పలికాయి. అలాగే, 63 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5830, కనిష్టం రూ.4656, సరాసరి రూ.5810 ధరలు లభించాయి. 863 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1951, కనిష్టం రూ. 1702, సరాసరి రూ.1739 ధరలు వచ్చాయి. 2 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6306, కనిష్టం రూ. 6026, సరాసరి రూ.6026 ధరలు పలికాయి. -
రేపటి నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–19, 23 విభాగాలకు ఈ సెలక్షన్స్ ఉంటాయన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్లోని పిల్లలమర్రి రోడ్డులోగల ఎండీసీఏ క్రికెట్ మైదానంలో, జడ్చర్లలోని మినీ స్టేడియంలో, 15న నారాయణపేటలోని మినీ స్టేడియంలో, నాగర్కర్నూల్లోని నల్లవెల్లి రోడ్డులోగల క్రికెట్ అకాడమీలో, 16న వనపర్తి జిల్లా పెబ్బేరులోని పీపీఎల్ మున్సిపల్ గ్రౌండ్లో, గద్వాలలోని ఇండోర్ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారుల సెలక్షన్స్ ఉంటాయని చెప్పారు. ఎంపికై న క్రీడా జట్లతో ఈ నెల 19 నుంచి ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్లకు శ్రీకారం చుట్టిందని, పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు తమ ప్రతిభచాటాలని పిలుపునిచ్చారు. క్రికెట్ సెలక్షన్స్కు సంబంధించి మిగతా వివరాల కోసం మహబూబ్నగర్లో సంతోష్ (81792 75867), నాగర్కర్నూల్లో సతీష్ (89193 86105), జడ్చర్లలో మహేష్ (99494 84723), గద్వాలలో శ్రీనివాసులు (98859 55633), నారాయణపేటలో రమణ (91007 53683), పెబ్బేర్లో శంకర్ (96033 60654) నంబర్లను సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
ఎప్సెట్లో ‘గట్టు’ గురుకుల విద్యార్థినుల ప్రతిభ
గట్టు: ఎప్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాల్లో గట్టు గురుకుల కళాశాల విద్యార్థినులు ప్రతిభ చాటారు. ఆదివారం ఫలితాలను విడుదల చేయగా.. గట్టు విద్యార్థినులు స్వాతి 369వ ర్యాంకు, ఐశ్వర్య 981వ ర్యాంకు మణికుమారి 1106 ర్యాంకు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. వీరితోపాటు ఇదే కళాశాలకు చెందిన మరికొందరు సైతం 10 వేల లోపు ర్యాంకులను సాధించినట్లు తెలిపారు. విద్యార్థినులు ప్రతిభ కనబర్చడంపై ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. -
నెరవేరిన ‘రుణ’ లక్ష్యం
ఇందిరా మహిళా శక్తి కింద యూనిట్లు 2024–25లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద భ్యాంకుల ద్వార రుణాలు పొందిన మహిళలు వివిధ రకాల వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది. వ్యక్తిగత యూనిట్లతో పాటు ప్రధానంగా ఒక సంఘంలో నలుగురు, ఐదుగురితో కలిసి గ్రూప్ యూనిట్లు నెలకొల్పుకునేలా ప్రోత్సహించారు. ఈపథకం కింద 2024–25లో క్యాంటీన్లు, కిరణాలు, టైలరింగ్, బ్యూటీపార్లర్లు, పాడి, చీరలు, స్వీట్ దుకాణాలు, అగర్బత్తీలు, రోటీ మేకింగ్ సెంటర్లు తదితర వాటిని స్వయం సహయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్నారు. గద్వాల న్యూటౌన్: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు రుణ లక్ష్యం నెరవేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఐదు మండలాలు మినహా, లక్ష్యం మేరకు రుణాలు అందించారు. స్వయం సహయక సంఘాల మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు బ్యాంక్ లింకేజీ కింద బ్యాంకుల ద్వార రుణాలు అందిస్తారు. బ్యాంకుల ద్వార రుణాలు పది నుంచి పదిహేను మంది మహిళలు కలిసి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడగా.. వారంతా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు బ్యాంకుల ద్వార గ్రూపు రుణాలు అందిస్తారు. ఇందుకోసం ప్రతి ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను నిర్ధేశిస్తారు. బ్యాంకు ద్వార రుణాలు పొందే గ్రూపు మహిళలు వారు నిర్వహించుకునే వ్యాపారాలు సూచిస్తూ బ్యాంకు లింకేజీ కింద బ్యాంకులకు దరఖాస్తు చేసుకుంటారు. బ్యాంకులు ఆయా స్వయం సహాయక సంఘాల సీనియారిటీ అంతకుముందు తీసుకున్న అప్పుకు సంబందించి వారి చెల్లింపులను పరిగణలోకి తీసుకుంటారు. డోస్ల వారీగా రూ. లక్ష నుంచి రూ.20లక్షల వరకు రుణాలు అందిస్తారు. బ్యాంకర్లు ఇచ్చిన అప్పుకు 12 నుంచి 14శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. 5248 సంఘాలు.. రూ.204.29 కోట్లు డీఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల నిర్వహణ చూస్తుంటారు. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల రుణ లక్ష్యం 5248 సంఘాలకు రూ. 204.29కోట్లు లక్ష్యం ఉండగా.. 2,355 సంఘాలకు 217.57 కోట్లు అందించారు. మండలాల వారీగా పరిశీలిస్తే ఇటిక్యాలలో 186శాతం, ధరూర్లో 145శాతం, అలంపూర్లో 121శాతం, గద్వాల 119శాతం, వడ్డేపల్లిలో 118శాతం, మల్దకల్లో 110శాతం, గట్టులలో 102శాతం రుణ లక్ష్యం నెరవేరింది. ఇక కేటీదొడ్డిలో 87శాతం, ఉండవల్లిలో 82శాతం, రాజోళిలో 72శాతం, మానవపాడులో 70శాతం, అయిజలో 65శాతం నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పించారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు చిన్న, పెద్ద వ్యాపారాలు నిర్వహించుకుని, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అందించే ఈరుణాల లక్ష్యంపై డీఆర్డీఏ అధికారులు, సిబ్బంది ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే దృష్టి సారించారు. సంబంధిత అధికారులు ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందికి దిశానిర్ధేశం చేయడం వల్ల జిల్లా రుణ లక్ష్యం నెరవేరింది. స్వయం సహాయ సంఘాల ఆర్థికాభివృద్ధే ధ్యేయం ‘ఇందిరా మహిళా శక్తి’ కింద మహిళలకు బ్యాంకుల ద్వారా వ్యాపార యూనిట్లు చిన్న, పెద్ద వ్యాపారాలు నిర్వహించుకునేలా ప్రోత్సాహం రుణాలు సద్వినియోగం చేసుకోవాలి స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహళలు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. 2024–25లో లక్ష్యం మేరకు రుణాలు అందించాం. ఈఏడాది తీసుకున్న రుణాలతో ఇందిరా మహిళాశక్తి పథకం కింద చాలా వ్యాపారాల యూనిట్లు నెలకొల్పారు. వీటి నిర్వహణ ద్వార ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. 2025–26లో సైతం రుణ లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకుంటాం. – నర్సింగరావ్, అడిషనల్ కలెక్టర్ -
2024–25లో రుణాల వివరాలిలా..
మండలం అర్హత కలిగిన రుణాలు పొందిన రుణ లక్ష్యం అందించిన రుణం సంఘాలు సంఘాలు (రూ. కోట్లలో) ఇటిక్యాల 492 451 18.78 35.08 ధరూర్ 440 166 14.46 21.09 అలంపూర్ 315 166 11.39 13.86 గద్వాల 515 260 23.59 28.21 వడ్డేపల్లి 251 111 9.82 11.66 మల్దకల్ 570 241 23.17 25.62 గట్టు 542 225 17.83 18.24 కేటీదొడ్డి 372 108 13.59 11.90 ఉండవెళ్లి 363 185 16.63 13.75 రాజోళి 353 101 14.23 10.25 మానవపాడు 553 196 23.53 16.62 అయిజ 482 145 17.26 11.28 -
ప్రతి ఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలి
మల్దకల్: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుచుకుంటూ దైవచింతన అలవర్చుకోవాలని త్రిదండి చినజీయర్ స్వామి సూచించారు. ఆదివారం మండలంలోని అమరవాయిలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు ప్రవచనాలు వినిపించారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడుచుకోవాలని, కులమతాలను రూపుమాపడాని,కి ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి సర్వమతాలకు దేవుడు ఒక్కడేనని అన్నారు. భక్తులు ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం వలన జీవితంలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకునే వీలుంటుందన్నారు. అంతకు ముందు వెంకటేశ్వరెడ్డి కుటుంబసభ్యులు స్వామి వారికి పాదపూజ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లదరావు, చంద్రశేఖర్రావు, ముకుందరావు, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, వెంకట్రాములు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఘన స్వాగతం ఇటిక్యాల: మండలంలోని మునుగాల గ్రామంలో ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భాగవత సప్తాహం పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చినజీయర్ స్వామి హాజరయ్యారు. ప్రతి మనిషికి ఆనందం ముఖ్యమని లౌకిక ఆనందం తాత్కాలికం మాత్రమేనని నిజమైన ఆనందం భాగవత ప్రవచనం ఆలకించడం ద్వారానే అనుభవం పొందగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమీటి సభ్యులు, విశ్వ హిందు పరిషత్ సభ్యులు, ఆయా గ్రామాల భగవద్గీత భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
పేరుకుపోతున్న ధాన్యం..
గట్టు: యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. దీంతో రైతులు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఎప్పుడెప్పుడు చేస్తారా అంటూ వేయ్యికళ్లతో రైతులు ఎదురు చూస్తున్నారు. సరిపడా గన్నీ బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపక పోవడంతో ధాన్యం కొనుగోలు నత్తనడకసాగుతున్నట్లు రైతులు ఆరోపించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సంబందించి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక గట్టు విషయానికి వస్తే.. మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ధాన్యం కొనుగోళ్లు అప్పగించారు. గట్టు, మాచర్ల, పెంచికలపాడు, ఆలూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి దాకా ఆయా కొనుగోలు కేంద్రాల దగ్గర 292 మంది రైతులకు సంబంధించి 33,786 బస్తాలు(40కేజీలు), 13,514 క్వింటాళ్లను కొనుగోలు చేసినట్లు సహకార సంఘం అధికారులు తెలిపారు. ఇవి కాక మరిన్ని ధాన్యం రాసులు కొనుగోలు కేంద్రాల దగ్గర అలాగే ఉండిపోయాయి. గట్టులో సుమారుగా 30 వేల బస్తాలు, మాచర్లలో సుమారుగా 25 వేల బస్తాలు, పెంచికలపాడులో 15వేల బస్తాలు, ఆలూరులో 12వేల బస్తాల వరకు కొనుగోలు చేయాల్సి ఉన్నట్లు అంచనా. బయటి మార్కెట్ కన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న చోట వడ్ల ధర అధికంగా ఉండడంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అకాల వర్షాల వలన వడ్లు తడిస్తే ఇబ్బంది అని రైతులు వాపోతున్నారు. అధికారులు త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరత గన్నీ బ్యాగులు లేక వడ్ల కొనుగోలు మరింత ఆలస్యం అవుతున్నట్లు రైతులు ఆరోపించారు. గన్నీ బ్యాగుల కోసం ఎదురుచూస్తున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటి వరకు 4 కొనుగోలు కేంద్రాలకు కేవలం 33వేల గన్నీ బ్యాగులు మాత్రమే పంపారని, ఇంకా సుమారుగా 80 వేల బస్తాలు అవసరం ఉన్నట్లు అంచనా. ఇక కొనుగోలు చేసిన వడ్లను మిల్లులకు తరలించేందుకు లారీల సమస్య నెలకొంది. ఇప్పటిదాకా పంపిన గన్నీ బ్యాగులకు సంబందించి వడ్లను తూకం వేసిన అధికారులు వాటిని మిల్లులకు తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉండిపోయినట్లు అధికారులు తెలిపారు. తూకం పట్టిన వడ్ల బస్తాలు సుమారుగా 3వేల వరకు కొనుగోలు కేంద్రాల దగ్గరే ఉండిపోయినట్లు సమాచారం. ఇదిలాఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన వడ్లను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, సీఈఓ భీమిరెడ్డి తెలిపారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా కొనుగోలు ఆలస్యమవుతుందని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వేధిస్తున్న గన్నీ బ్యాగుల కొరత కొన్న ధాన్యం తరలింపునకు ఇబ్బందులు రైతులకు తప్పని పడిగాపులు -
ఆలయ లెక్కల్లో వాస్తవాలు నిగ్గు తేల్చాలి
రాజోళి: రాజోళిలోని చారిత్రాత్మక వైకుంఠ నారాయణ స్వామి ఆలయంలో పాత కమిటీ లెక్కలు చూపడం లేదని నూతన ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 3 వ తేదీన నూతన కమిటీగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఆలయానికి సంబందించిన లెక్కలు ఇతర వివరాలు అడిగితే మాట దాటేస్తున్నారని అన్నారు. తప్పనిసరిగా లెక్కలు అడిగితే ఎనిమిది ఏళ్ల కిందట లెక్కలు ఎలా చూపుతామని అనడంపై పలు అనుమనాలు వ్యక్తమవుతున్నాయని, పదుల ఎకరాల్లో మాన్యాలు ఉన్న ఈ ఆలయానికి అభివృద్ధి చేయాల్సింది పోయి,లెక్కలు చూపకుండా దాచడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. వివరాలకు సంబందించి మళ్లీ మళ్లీ అడిగితే పాత కమిటీలోని కొందరు సభ్యులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని, గ్రామానికే కాకుండా రాష్ట్రానికే తలమానికమైన ఈ ఆలయ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అన్నారు. ఆలయ ఈఓకు పలు మార్లు వివరాలు అడిగినా ఆయన కూడా మాట దాటేస్తున్నారని,ఆయన తీరుపై కూడా పలు అనుమనాలు ఉన్నాయని, వాస్తవాలను నిగ్గు తేల్చి ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోపి,భాస్కర్,మద్దిలేటి తదిదరులు పాల్గొన్నారు. -
సోలార్ పనులు వేగవంతం
వంగూరు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సోలార్ విద్యుత్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ప్లానింగ్బోర్డు ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానియా, విద్యుత్శాఖ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖ్ అన్నారు. శనివారం ఉదయం గ్రామంలోని ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్లేట్లను వారు పరిశీలించి విద్యుత్ సరఫరా వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 482 ఇళ్లుండగా.. 412 ఇళ్లపై సోలార్ ప్లేట్లు బిగించామని, మిగతా 70 ఇళ్ల పైకప్పు మట్టి, రేకులు ఉండటంతో మిగిలిపోయినట్లు అధికారులు వారికి వివరించారు. మట్టి మిద్దెలు ఉన్న ఇళ్ల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేయాలని రెడ్కో అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద కొండారెడ్డిపల్లిలో సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేస్తున్నామని, అన్ని పనులు పూర్తయితే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. వారి వెంట రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి, గ్రామస్తులు వేమారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. -
అమ్మా.. నీకు వందనం
జోగుళాంబ గద్వాలవాతావరణం ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు వీస్తాయి. వేగంగా ‘టర్ఫ్’ పనులు పాలమూరు ఎండీసీఏ క్రికెట్ మైదానంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025వివరాలు 10లో uసృష్టిలో అమ్మ పాత్ర గురించి వివరిచేందుకు, వర్ణించేందుకు ఏ భాష సరిపోదు. అయితే నా వరకు మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. మా సొంత గ్రామం అప్పారెడ్డిపల్లి వనపర్తి జిల్లా. అమ్మ మణెమ్మ, నాన్న బుచ్చన్న. మేము ఐదుగురం సంతానం కాగా.. ఇద్దరం మగ పిల్లలం, ముగ్గురు ఆడపిల్లలు. మాది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మా నాన్న ప్రధానంగా కులవృత్తి వడ్రంగి పనిచేసేవారు. నేను పదో తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరాలకున్నాను. కానీ, అప్పట్లో కులవృత్తికి బాగా డిమాండ్ ఉండడం, మాది పెద్ద కుటుంబం కావడం.. ఇంట్లో నేనే పెద్ద కుమారుడిని కావడంతో మానాన్న పదో తరగతిలోనే ఆపేసి వండ్రంగి పని నేర్చుకోవాలన్నారు. అయితే మా అమ్మ చదువుకుంటేనే విలువ ఉంటుందని, నన్ను ఇంటర్మీడియట్లో చేర్పించారు. అలా అమ్మ ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, ఉన్నత విద్య పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మతోపాటు నాన్న ప్రోత్సాహం కూడా ఉంది. ఇప్పటికీ శనివారం, ఆదివారం వచ్చిందటే చాలు పెద్దోడ ఇంటికి వచ్చివెళ్లు అంటుంది. అంత ప్రేమ పంచడం సృష్టిలో ఒక్క అమ్మకే సాధ్యం. పిల్లలు ఎంత ఎదిగినా తల్లి దృష్టిలో చిన్నపిల్లలే. అందుకే మనకోసం కష్టించే అమ్మకు మనం పెద్దవారం అయిన తర్వాత గౌరవించి బాగా చూసుకుంటే వారికి అదే చాలు. – లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● తల్లి ప్రోత్సాహంతో జీవితంలో ఎదిగిన వారెందరో.. ● అమ్మ మాట.. బంగారు బాట.. తల్లి ప్రేమ మారదు.. ఉద్యోగరీత్యా మా పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. ఎలాంటి సందర్భంలో నీకు దూరంగా ఉన్నా అనే విషయం చెబితే మా అమ్మాయి అర్థం చేసుకుంటుంది అని చెప్పుకొచ్చారు మహబూబ్నగర్ ఎస్పీ జానకి. మాకు ఒకే ఒక్క కూతురు హైదరాబాద్లో 8వ తరగతి చదువుతుంది. విధుల్లో భాగంగా నేను మహబూబ్నగర్లో ఉంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడి రావడం.. లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికై నా పిల్లలపై చూపే తల్లి ప్రేమ, వాత్సల్యంలో ఎలాంటి మార్పు ఉండదు. గతంలో జనరేషన్కు ఇప్పటి పిల్లలకు చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు సాంకేతికపరంగా టెక్నాలజీ అందుబాటులో ఉండటం వల్ల చాలా విషయాలు అర్థం అవుతున్నాయి. భవిష్యత్పరంగా ఎలా ఉండాలి.. ఇతర అంశాలపై చర్చించడం చేస్తాను. చదువులో కూడా ఏదైనా సందేహాలు, సలహాలు ఇస్తాను. అమ్మాయికి దూరంగా ఉన్నా.. నిత్యం ఫోన్ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటాను. ‘నా చిన్నతనం నుంచి మా అమ్మ శోభ నాకు అన్ని రకాలుగా ప్రోత్సాహంగా నిలిచారు. మా అన్న, చెల్లెలితో పాటు నన్ను బాగా చదువుకునేలా ప్రోత్సహించారు. ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆమెకన్నా ముఖ్యమైన వారు మన జీవితంలో ఎవరూ ఉండరు. నాకు సమయం కుదిరినప్పుడల్లా అమ్మ, నాన్న, కుటుంబసభ్యులతో గడుపుతాను. తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. – వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, ఎస్పీ, నాగర్కర్నూల్ నేడు మాతృ దినోత్సవం అమ్మను తొలి గురువుగా భావించి ఆదర్శంగా తీసుకుని సివిల్ సర్వీసెస్ లక్ష్యం నిర్దేశించుకున్నా. వెన్నంటే ఉంటూ ఎంతో ప్రోత్సాహం అందించి నేడు సమాజంలో గౌరవ ప్రదమైన కలెక్టర్గా ప్రజలకు సేవలందించేందుకు సహకారం అందించారు. నా లైఫ్లో ప్రతి ముఖ్యమైన ఘట్టంలో మా అమ్మ నర్సమ్మ పాత్ర చాలా కీలకం. ప్రాథమిక విద్య హైదరాబాద్లో.. ఐదో తరగతి నుంచి ఢిల్లీలో చదువుకునేందుకు అమ్మ తన ఉద్యోగ బాధ్యతలను నా కోసం పదేళ్లపాటు ఢిల్లీకి మార్చుకున్నారు. నా జీవిత లక్ష్యం సాధించేందుకు ఎంతగానో మార్గనిర్దేశనం చేశారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మా అమ్మ పట్టుదలతో ఉన్నత చదువులను అభ్యసించి ఆదాయపన్ను శాఖ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. నా కెరీర్లో రోల్ మోడల్గా నిలిచారు. చిన్న వయస్సు నుంచే ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తూ.. జీవిత లక్ష్యం సాధించుకునేందుకు వెన్నంటి నడిపించారు. మారుమూల ప్రాంతమైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం గ్రామంలో కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టారు. మా నాన్న సురభి సత్యన్నతో జీవితాన్ని పంచుకునేందుకు తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్కు వచ్చారు. నాన్న రాష్ట్ర సర్సీసుల్లో జాయింట్ కలెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మా కుటుంబ ఉన్నతి కోసం మా అమ్మ ఎంతగానో కృషి చేశారు. – ఆదర్శ్ సురభి, కలెక్టర్, వనపర్తి అమృత పదం అమ్మ పదాలు తెలియని పెదవులకు అమృత పదం అమ్మ. అమృతం ఆయుష్షు పోస్తుందో.. లేదో.. తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకు అందిస్తుంది. నిండునూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవ మాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటిపాపలా చూసుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే తల్లి రుణం తీర్చుకోలేం. అమ్మ మన రేపటి భవిష్యత్ కోసం నిత్యం శ్రమించే శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ.. అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – విజయేందిర, కలెక్టర్, మహబూబ్నగర్ తొలి గురువుగా అందరికీ స్ఫూర్తి అమ్మ లేకుంటే నేను లేను సృష్టికి ప్రతి రూపం అమ్మ.. పిలిచే తియ్యని పిలుపే అమ్మ.. ప్రాణం పోసే దేవత అమ్మ.. కన్నపేగు గుండెచప్పుడు అమ్మ.. మమతల ఒడి.. త్యాగాల గుడి.. తొలిబడి అమ్మ.. అమితమైన ప్రేమ.. అంతులేని అనురాగం.. అలుపెరగని ఓర్పు.. మాటల్లో వ్యక్తపరచలేని భావం.. చేతల్లో ప్రదర్శించలేని భాష్యం.. అందుకే అమ్మకు సాటి అమ్మే.. అమ్మకు మించిన దైవం లేదంటారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు వారి అమ్మ ప్రేమను గుర్తు చేసుకున్నారు. – సాక్షి, నాగర్కర్నూల్/పాలమూరు/ వనపర్తి/గద్వాల/జెడ్పీసెంటర్ తల్లికంటే ముఖ్యులు ఎవరూ ఉండరు.. నా కెరీర్లో రోల్ మోడల్ -
ఆదిశిలా క్షేత్రంలో భక్తుల ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావుల చెర్వు గట్టు తిమ్మప్పస్వామి, చర్లగార్లపాడు వెంకటేశ్వరస్వామి ,శేషంపల్లి శివసీతారామస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, వాల్మీకి పూజరులు తదితరులు పాల్గొన్నారు. -
బావిలో పడి ఇద్దరు దుర్మరణం
● మృతుల్లో ఓ యువకుడు, ఓ బాలుడు ● సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఘటన హుజూర్నగర్: యువకుడు బావిలో పడిపోగా.. అతడిని కాపాడబోయి మరో యువకుడు అందులోకి దిగాడు. ప్రమాదవశాత్తు ఇద్దరూ నీట మునిగి మృతిచెందారు. ఈ విషాదకర ఘటన శుక్రవారం హుజూర్నగర్లో చోటుచేసుకుంది, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన కన్మనూర్ తిరుపతయ్య, మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం చందాపూర్ గ్రామానికి చెందిన మోదిపురం లక్ష్మణ్లు మరో ఆరుగురితో కలిసి గొర్రెలను మేపుకుంటూ హుజూర్నగర్కు వచ్చారు. గత పది రోజులుగా పట్టణానికి చెందిన జక్కుల లింగయ్య పొలంలో మేత కోసం గొర్రెలను నిలిపి అక్కడే ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం తిరుపతయ్య కుమారులైన శేఖర్, చరణ్ వేసవి సెలవులు కావడంతో తండ్రి వద్దకు వచ్చారు. శుక్రవారం తిరుపతయ్య పెద్ద కుమారుడైన శేఖర్, గొర్రెల కాపరి లక్ష్మణ్తో కలిసి నీటిని తీసుకువచ్చేందుకు సమీపంలో గల లింగయ్య బావి వద్దకు వెళ్లారు. లక్ష్మణ్ (21) నీళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు శేఖర్ (14)ప్రయత్నించగా అతను కూడా బావిలో పడ్డాడు. దీంతో ఇద్దరూ నీట మునిగి మృతిచెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృతుడు శేఖర్ తండ్రి తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ముత్తయ్య తెలిపారు. -
18న నల్లమలకు సీఎం రాక
మన్ననూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నల్లమల పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అమ్రాబాద్ మండలంలో సభాస్థలం ఇతరత్రా ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ పరిశీలించారు. ఆదివాసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రూ.12,600 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిర సౌర గిరి జల వికాస పథకం ప్రాజెక్టును ఈ నెల 18న సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. అలాగే జిల్లా అధికారులు, ఐటీడీఏతో అనుసంధానంగా ఉన్న అధికారులు, సిబ్బందితోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఆ దివాసీలతో సమావేశం ఉంటుందన్నారు. ఈ క్రమంలో అనుకూల ప్రదేశం కోసం పదర మండలంలోని పెట్రాల్చేన్, అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్, మాచారం, వెంకటేశ్వర్లబావి గ్రామాల్లో పర్యటించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ రోహిత్రెడ్డి, డీటీడీఓ ఫిరంగి, ఐటీడీఏ ఏఓ జాఫర్ ఉస్సేన్, మండల అధికారులు, చెంచులు పాల్గొన్నారు. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ బదావత్ సంతోష్ -
భూ భారతి సదస్సులను వినియోగించుకోండి
ఇటిక్యాల: రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న భూ భారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలోని మొగిళిరావులచెర్వు గ్రామంలో నిర్వహించిన భూ భారతి సదస్సులో ఆర్డీఓ పాల్గొని రైతుల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని ప్రారంభించిందని, జిల్లాలోని ఇటిక్యాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని వివరించారు. గతంలో ప్రజలు అధికారులను కలవాల్సి వచ్చేదని, ఇప్పుడు అధికారులే గ్రామాల్లోకి వచ్చి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి నెలాఖరులోగా అర్హులైన వారికి ఉత్తర్వులు జారీ చేస్తామని, రైతులు నిర్దేశిత ప్రొఫార్మాలో దరఖాస్తులు అందించాలని సూచించారు. ఈ సదస్సులో భూ రికార్డుల సవరణలు, విస్తీర్ణ మార్పులు, వారసత్వ సమస్యలు, భూమి స్వభావానికి సంబంధించిన లోపాలు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, సాదాబైనామాలు, సర్వే నంబర్ గల్లంతు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ తదితర సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితమని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో తహసీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, పంచాయతీ కార్యదర్శి హారిక, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తిచేయాలి
గద్వాల: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పనుల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతిని మండలాల వారీగా సమీక్షిస్తూ మంజురైనా ఇళ్ల నిర్మాణ పనుల్లో గ్రౌండింగ్, బేస్మెంట్, మార్క్ అవుట్, రీ వెరిఫికేషన్ తదితర అంశాలను అధికారుల నుంచి వివరంగా అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పునులు వేగవంతంగా పూర్తయ్యేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి వివరాలను ఎప్పటికప్పడు ఆన్లైన్ యాప్లో నమోదు చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎంపికలో ఆధార్, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు అన్ని అర్హత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. దరఖాస్తులను డౌన్లోడ్ చేసి కార్పొరేషన్ బ్యాంకుల వారీగా సంబంధిత బ్యాంకులకు పంపిచాలని, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు వాటిని పరిశీలించి అర్హత నివేదిక సమర్పించాలన్నారు. ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి అర్హత ఉన్న వారిని ఎంపిక చేయాలన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన రైతుల ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యం సేకరించి మిల్లులకు తరలించాలన్నారు. గాలి, దుమ్ము, అకాల వర్షాలు పడుతున్నందున వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్బాబు, ఎల్డీఎం శ్రీనివాసరావు, పౌరసరఫరాల అధికారి స్వామికుమార్, డీఎం విమల, పీడీ శ్రీనివాసులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తాడూరు: రెండు బైక్లు ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన జగపతిరెడ్డి (55) శుక్రవారం పని నిమిత్తం ఇంటినుంచి బైక్పై బయల్దేరాడు. కల్వకుర్తి రహదారిలో పెట్రోల్బంక్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టడంతో కిందపడిపోయిన జగపతి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తీసుకెళుతుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. -
‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలి
ఎర్రవల్లి: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రమూకలపై భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శుక్రవారం బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ఈఓ రామన్గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా శత్రు దేశానికి మన దేశ త్రివిధ దళాల సైనికులు తగిన గుణపాఠం చెప్పాలని, అలాగే వారికి దైవిక బలంతోపాటు రక్షణ, ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ అర్చకులు వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మారుతిచారి, సందీప్చారి, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్లాస్టిక్ నిషేధం.. అమలైతేనే ప్రయోజనం
జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగంపై ముమ్మరంగా తనిఖీలు ● పూర్తిస్థాయిలో అరికట్టేందుకు మరోసారి అడుగులు ● కలెక్టర్ దిశానిర్దేశంతో కఠిన చర్యలకు ఉపక్రమణ ● నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 10 టన్నులు సేకరణ ముమ్మరంగా తనిఖీలు.. ప్రస్తుతం ప్లాస్టిక్ నిషేధానికి అధికారులు మళ్లీ నడుం బిగించారు. గడిచిన కొన్ని రోజులుగా ఆయా మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లాకేంద్రమైన గద్వాలలో ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. కలెక్టర్ సంతోష్ ఆదేశాలతో నిత్యం ఉదయం, సాయంత్రం వేళలో దుకాణాలపై దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నారు. కూరగాయల మార్కెట్తోపాటు హోల్సేల్, రిటేల్ దుకాణాల్లో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని కార్యాయాలకు తరలించారు. ఆయా పార్టీల నుంచి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ఎక్కడా తగ్గకుండా దాడులు కొనసాగిస్తూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గద్వాల టౌన్: ఉదయం నుంచి నిద్రించే వరకు ప్లాస్టిక్తో మానవ జీవితం ముడిపడి ఉంటోంది. అంతలా కలిసిపోయిన దీంతో పర్యావరణంతోపాటు మానవవాళికి ముప్పుపొంచి ఉందని తెలిసినా వినియోగిస్తూనే ఉన్నాం. పర్యావరణ వేత్తలు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. కొద్దిగానైనా మార్పు రావడం లేదు. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా వీటి వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. పట్టణాల్లోని రహదారుల పక్కన, నివాస గృహల సమీపంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్పై నిషేధం ఉండేది. ప్రస్తుతం 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సమస్యలను అధిగమించాలంటే వ్యక్తిగతంగా, సమష్టిగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని.. అప్పుడే పర్యావరణ ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్పు వచ్చినట్టే వచ్చి.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో సుమారు 30 వేల నివాస గృహాలు, దుకాణాలు ఉన్నాయి. దీంతో ప్రతిరోజు 80 టన్నుల చెత్త పోగవుతోంది. అందులో 10 టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. గతంలోనే గద్వాల, అయిజ మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు చేశారు. అప్పట్లో అడపాదడపా దుకాణాలపై దాడులు నిర్వహించారు. రూ.100 నుంచి రూ.5 వేల వరకు జరిమానా సైతం విధించారు. తదనంతరం అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తిరిగి వాటి విక్రయాలను మొదలుపెట్టారు. ఏళ్ల తరబడి ప్రణాళిక రూపొందిస్తున్నా.. కౌన్సిల్లో తీర్మానాలు చేస్తున్నా.. అమలులో క్షేత్రస్థాయి లోపాలతో అడ్డుకట్ట పడటం లేదు. ప్రజల్లో మార్పు రావాలి.. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. పాలిథీన్ కవర్లకు బదులు ఇతర సంచులు వాడాలని, తద్వారా ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుందని చెబుతున్నాం. ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే వంద శాతం ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ విక్రయాలు చేస్తే జరిమానాలతో పాటు దుకాణం లైసెన్సు రద్దు చేస్తాం. – దరశథ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల -
సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి
కేటీదొడ్డి: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి లాభాలు పొందాలని జిల్లా వ్యవసాయాధికారి సక్రియానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని కుచినెర్ల గ్రామ రైతువేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన పాలెం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే పంటల సాగుపై దృష్టిసారించాలన్నారు. సేంద్రియ ఎరువులు, రసాయనాల వినియోగం, సాగునీటి ఆదా, మట్టి పరీక్షలు, వర్షాధార వ్యవసాయంలో నీటిని సంరక్షించే చర్యలు, పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలు, చెట్ల పెంపకంతో కలిగే లాభాలు, యూరియా వాడకాన్ని సరైన మోతాదులో వాడాలని, రసాయనాలను తగు మోతాదులో వాడాలని, రైతులు షాపులలో కొన్న విత్తనం పురుగు, తెగుళ్లు కలుపు మందులకు రశీదు భద్రపరుచుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఉపయోగపడతాయని తెలిపారు. ఆయిల్పాం తోటల సాగు, యాజమాన్య పద్ధతుల్లో మెలకువలు వివరించారు. అనంతరం రైతు ముంగిట్లో కరపత్రం విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, మండల వ్యవసాయాధికారి సాజిద్ రెహమాన్, ఏఈఓలు ప్రియాంక, కిరణ్కుమార్, మమత, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. 1,105 క్వింటాళ్ల వేరుశనగ రాక గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,105 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.6,200, కనిష్టంగా రూ.3,700, సరాసరిగా రూ.5,200 చొప్పున పలికింది. అలాగే 64 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టంగా రూ.5,812, కనిష్టంగా రూ.3,680, సరాసరిగా రూ.5,812, 4 క్వింటాళ్ల కంది రాగా గరిష్టంగా రూ.6,066, కనిష్టంగా రూ.4,689, సరాసరిగా రూ.4,899, 646 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టంగా రూ.1,876, కనిష్టంగా రూ.1,550, సరాసరిగా రూ.1,766 ధరలు లభించాయి. డిగ్రీ ఫలితాలు విడుదల బిజినేపల్లి: మండలంలోని పాలెం అటానమస్ డిగ్రీ కళాశాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో సెమిస్టర్లో 43 శాతం ఉత్తీర్ణత సాధించారని, విద్యార్థులు తమ ఫలితాలను కళాశాల వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. మార్కుల పునఃమూల్యాంకనం కోసం ఈ నెల 17 వరకు తమ దరఖాస్తులను కళాశాలలో సమర్పించాలన్నారు. ఫలితాలను పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రమేష్బాబు, ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజ్కుమార్, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, అనురాధరెడ్డి విడుదల చేయగా.. కళాశాల అడిషనల్ కంట్రోలర్ శివ, సిబ్బంది శ్రీనివాస్, నాగరాజు, సుష్మ, వెంకటేష్, యాదగిరి, కవిత తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో కండక్టర్ల బదిలీలు స్టేషన్ మహబూబ్నగర్: ఉమ్మడి జిల్లాలోని పది ఆర్టీసీ (రీజియన్) డిపోల్లో పనిచేస్తున్న 89 మంది కండక్టర్లకు వారి అభ్యర్థన మేరకు బదిలీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టి 80 మంది అభ్యర్థులకు కండక్టర్లుగా వివిధ డిపోల్లో పోస్టింగులు ఇచ్చామని, అలాగే 89 మంది రెగ్యులర్ కండక్టర్లకు వారి అభ్యర్థన మేరకు బదిలీలు చేశామని ఆర్ఎం తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తమ బదిలీలను చేపట్టినందుకు కండక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
వేసవిలో ‘చల్లని’ సేవ
మరికల్: వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఎంతో మంది స్వచ్ఛందంగా అంబలి, చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాతృత్వం చాటుకుంటున్నారు. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదట దివంగత మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కుటుంబ సభ్యులు మరికల్ మండలం తీలేర్ స్టేజీ వద్ద అంబలి కేంద్రం ఏర్పాటు చేశారు. వీరి స్ఫూర్తితో మరికల్ మండల అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. 22 ఏళ్లుగా ప్రతి వేసవిలో బాటసారులు, కూలీల దాహార్తి తీరుస్తున్నారు. వీరి ఆదర్శంతో ఇతర మండలాలు, గ్రామీణ స్టేజీల వద్ద అంబలి కేంద్రాలను ఏర్పాటుచేసి వేసవిలో చల్లని సేవ అందిస్తున్నారు. 44 ఏళ్ల క్రితం.. ఈ ప్రాంత ప్రజలు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో మండుటెండలను సైతం లెక్క చేయకుండా పడుతున్న శ్రమను చూసి దివంగత మాజీ ఎమ్మెల్యే కె.వీరారెడ్డి తండ్రి వెంకారెడ్డి చల్లించిపోయారు. తాను సర్పంచ్గా ఎన్నికై న తర్వాత వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు గాను 1981లో తీలేర్ స్టేజీ వద్ద అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి ఏడాది వేసవిలో అంబలి కేంద్రం నిర్వహిస్తూ వ్యవసాయ కూలీలతో పాటు బాటసారుల దాహం తీర్చే వారు. అయితే వెంకారెడ్డి మరణానంతరం ఈ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే వీరారెడ్డి కొనసాగించారు. అతడి మరణం తర్వాత ఆయన కుమారుడు, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి తన అవ్వ వజ్రమ్మ, తాత వెంకారెడ్డి, తండ్రి వీరారెడ్డి జ్ఞాపకర్థంగా అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయ్యప్ప అనుగ్రహంతోనే సేవ.. అయ్యప్ప సేవాసమితి స్థాపించిన నాటి నుంచి బాటసారుల తీర్చేందుకు అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. అయ్యప్పస్వామి అనుగ్రహంతో 22 ఏళ్లుగా అంబలి కేంద్రాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నాం. భవిష్యత్లో కూడా కొనసాగిస్తాం. – సతీశ్కుమార్, మరికల్ ఆనందంగా ఉంది.. మరికల్ బస్టాండ్, చౌరస్తాలో యువక మండలి తరఫున చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నాం. 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం ఆనందంగా ఉంది. భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. – శ్రీకాంత్రెడ్డి, యువక మండలి అధ్యక్షుడు, మరికల్ తీలేర్ అంబలి కేంద్రానికి 44 ఏళ్లు పూర్తి వేసవిలో ప్రజల దాహార్తి తీరుస్తున్న దాతలు -
హైదరాబాద్లో కానిస్టేబుల్ మృతి
పెద్దకొత్తపల్లి: నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహేందర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా గురువారం ఉదయం హైదరాబాద్లోని మీర్పేట పీఎస్ పరిధిలో స్కూటీపై వెళుతుండగా.. గుర్తుతెలియని కారు వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో కింద పడిన మహేందర్ తలకు బలమైన గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మహేందర్ స్వస్థలం లింగాలలో విషాదఛాయలు అములుకున్నాయి. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. -
విద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
గద్వాల టౌన్: జిల్లా విద్యాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డీఈఓ మహ్మద్ అబ్దుల్ ఘనీ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బాలభవన్లో ఏర్పాటు చేసిన మండల విద్యాధికారుల విద్యా సంవత్సర సన్నాహక సమావేశంలో డీఈఓ పాల్గొని మాట్లాడారు. విద్యా వ్యవస్థ అభివృద్ధిలో మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు ముందుండి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర అధికారులు సూచించిన అన్ని కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు విధిగా పాల్గొనేలా చూడాలని సూచించారు. బడిబాట, యూడైస్, మార్కుల అప్లోడింగ్, శిక్షణ కార్యక్రమాలు, కాంప్లెక్స్ సమావేశాలు తదితర వాటిలో సహకరించాలని కోరారు. సీఆర్పీలు, ఎంఐఎస్లు, కోఆర్డినేటర్లు, సీసీఓలు డేటా నమోదులో చురుకుగా వ్యవహరించాలని చెప్పారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన హెచ్ఎం, ఉపాధ్యాయులను అభినందించారు. రాబోయే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సమావేశంలో సెక్టోరియల్ అధికారులు ఎస్తేర్రాణి, ఫర్జానాబేగం, డీసీబీ కార్యదర్శి ప్రతాప్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియా ద్వారా కొత్త పరిచయాలు
● మైనర్ ఏజ్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న వైనం ● ఆన్లైన్, మొబైల్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలంటున్న చైల్డ్ సేఫ్టీ అధికారులు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న ఘటనలు సాక్షి, నాగర్కర్నూల్: ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, స్నాప్ చాట్, వాట్సప్.. తదితర సామాజిక మాధ్యమాల్లో నిత్యం గంటల తరబడి గడపడం ప్రస్తుతం టీనేజర్లకు సాధారణంగా మారింది. ఇదే క్రమంలో ఆన్లైన్ వేదికల ద్వారా కొత్తగా పరిచయం అయిన వారి పట్ల ఆకర్షితులవుతున్నారు. వీరిలో మైనర్లే ఎక్కువగా ఉంటున్నారు. బాల్య దశలోనే ప్రేమ పేరుతో ఇల్లు విడిచి వెళ్లిపోవడం, మైనర్ ఏజ్లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్నాయి. చాలావరకు ఘటనలు సంబంధిత అధికారుల దృష్టికి సైతం రావడం లేదు. తీరా మైనర్గా ఉన్న బాలికలకు వివాహతంతు పూర్తయ్యాక అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. కఠిన నిబంధనలు ఉన్నా.. మైనర్ వివాహాలు జరిపిస్తే కఠినమైన చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మైనర్ పెళ్లిళ్లు కొనసాగుతున్నాయి. మైనర్ బాలికలను వివాహం చేసుకుంటే యువకుడు, బంధులవులతో పాటు బాధ్యులైన వారందరిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. చాలాసందర్భాల్లో ఈ నిబంధనలు అమలుకావడం లేదు. మండలస్థాయిలో చైల్డ్ మ్యారేజీ ప్రొహిబిషన్ ఆఫీసర్లుగా సంబంధిత ఎమ్మార్వోలు, జిల్లాస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా, చాలావరకు వివాహాలు జరిగాక కేవలం కౌన్సిలింగ్లకే పరిమితమవుతున్నారు. చిన్నవయసులోనే ఆన్లైన్ ద్వారా పరిచయాలు ప్రేమ వ్యవహారాలకు దారి తీస్తుండటంతో తల్లిదండ్రులే మైనర్ బాలికలకు గుట్టుగా వివాహాలు జరిపిస్తున్నారు. మరికొంత మంది మైనర్ దశలోనే ఆన్లైన్ పరిచయస్తులను నమ్మి ఇల్లు విడిచి వెళ్లిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. -
నేటి నుంచి బీచుపల్లి బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లి: అపర మంత్రాలయంగా పేరుగాంచిన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయన అర్చకులు తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఉదయం పంచామృతాభిషేకం, వాస్తుపూజ హోమం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణ, రాత్రికి తెప్పోత్సవం, ఆదివారం ఉదయం పంచామృతాభిషేకం, స్వామివారి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం, సోమవారం ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజ, మధ్యాహ్నం సీతారాముల కల్యాణం, బలిహరణము, సాయంత్రం రథంగ హోమం, రాత్రికి కుంభం, రథోత్సవం, మంగళవారం ఉదయం పంచామృతాభిషేకం, చౌకిసేవ, బలిహరణం, రాత్రికి ప్రభోత్సవం, బుధవారం ఉదయం అమృతస్నానం, పంచామృభిషేకం, రాత్రికి పల్లకీసేవతో ఆంజనేయస్వామి ఉత్సవాలు ముగుస్తాయి. ఆలయంలో నిత్య పూజలు ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రతి రోజు ఉదయం 07:30 లకు ఆకుపూజ, అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి ఏటా జరిగే ఉత్సవాల సమయంలో నాలుగు శనివారాల్లో కూడా భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పిస్తారు. ఆలయ సమీపంలో దక్షిణవాహినిగా పేరుగాంచిన పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాతే భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తారు. ప్రతి అమావాస్య రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపడతారు. ఐదు రోజుల పాటు వేడుకలు 12న ఆంజనేయస్వామివారి రథోత్సవం వేలాది తరలిన రానున్న భక్తులు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ఆంజనేయస్వామి ఉత్సవాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించినట్లు ఆలయ ఈఓ రామన్గౌడ్ తెలిపారు. ఆలయ చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. -
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
వెల్దండ: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొట్ర గ్రామానికి చెందిన చిట్టయ్య(65) మేకల కాపరిగా ఉండేవాడు. ఈనెల 5వ తేదీ సాయంత్రం నుంచి ఇంటికి రాలేదు. మద్యానికి బానిసై అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లి 10 రోజులకోసారి వచ్చేవాడు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, బంధువులతో వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం దుర్వాసన రావడంతో సమీప పొలాల రైతులు హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారి సమీపంలోని ప్రభుత్వ భూమిలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న పోలెమోని చిట్టయ్య(65)ను గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ కురుమూర్తి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుల్లిపోవడంతో సంఘటనా స్థలంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్ప త్రి వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిట్టయ్యకు భార్య బాలమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్యనిప్పంటించిన ఘటనలో చికిత్స పొందుతూ భర్త మృతి జడ్చర్ల టౌన్: నాలుగు రోజుల క్రితం వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించగా, జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కావేరమ్మపేటకు చెందిన చింతకుంట రాములు(52), తిరుపతమ్మ భార్యభర్తలు. భార్యాభర్తల మధ్య గొడవలు అవుతుండేవి. దీంతో నాలుగు రోజుల క్రితం భార్య రాములుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీన్ని గమనించిన చుట్టు పక్కల వారు వెంటనే కాలిన గాయాలతో ఉన్న అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా జిల్లా ఆస్పత్రిలోనే రెండురోజుల క్రితం మరణవాంగ్మూలం నమోదు చేశారు. ఘటనపై రాములు సోదరుడు యాదయ్య జడ్చర్ల పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. వివాహం జరిగిన నాటి నుంచి అన్నతో వదిన గొడవలు పడేదని, అదే క్రమంలో పెట్రోలు పోసి నిప్పంటించిందని ఫిర్యాదులో పొందుపర్చాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని, అంత్యక్రియల నిమిత్తం సాయంత్రం వరకు అనుమతిచ్చారు. ఇద్దరు పిల్లలతో సహాతల్లి అదృశ్యం నవాబుపేట: ఇంట్లో అందరు నిద్రిస్తూ ఉండగా తల్లి ఇద్దరు పిల్లలతో అ దృశ్యమైన సంఘటన మండలంలోని తీగలపల్లి శుక్రవారం చోటుచేసుకుంది. జడ్చర్ల మండ లం నాగసాలకు చెందిన ఎడ్ల కృష్ణయ్య కుటుంబంతో ఐదేళ్ల క్రితం మండలంలోని తీగలపల్లికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణయ్యకు భార్యతో పాటు ముగ్గు రు పిల్లలు ఉన్నారు. ఈ నెల 7వ తేదీన అందరు తిని నిద్రించిన తరుణంలో తెల్లవారుజామున భార్య శ్రీదేవి (35) ఆ యన ఇద్దరు కుమారు లు విశ్వప్రసాద్(7), అ ఖిల్(5)లు కనిపించకుండ పోయారు. దీంతో ఆయన చుట్టుపక్కల, బంధువులతో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్ర మ్ తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి
భూత్పూర్: మండలంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రెండు వెర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నాసాగర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి చెందిన యనమల రామ సంజీవరెడ్డి(35) జిల్లా కేంద్రంలోని ఓ గుత్తేదారు వద్ద ట్రాక్టర్తో పనులు చేయుటకు వచ్చాడు. పని పూర్తి చేసుకొని తిరిగి స్వగ్రామానికి గురువారం రాత్రి ట్రాక్టర్పై వెళ్తుండగా అన్నాసాగర్ సమీపంలోని జాతీయ రహదారిపై పక్కనే ఉన్న రేలింగ్కు అదుపు తప్పి ఢీకొట్టాడు. దీంతో రామసంజీవరెడ్డి ట్రాక్టర్పై నుంచి ఎగిరిపడి ట్రాలీ టైర్ మీదపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జిల్లా జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శుక్రవారం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చిన్నాన్న యనమల లక్ష్మీనారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరో పమాదంలో భూత్పూర్ పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు మోటార్ సైకిల్ను శేరిపల్లి (బి) బస్టాప్ నుంచి భూత్పూర్ వైపుకు మలుపుతుండగా జడ్చర్ల వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లుకు తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. శేరిపల్లి (బి) గ్రామానికి చెందిన కృష్ణ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్ధలంలో గాయపడిన వెంకటేశ్వర్లును 108 లో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ తిరుమల రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరొకరికి తీవ్ర గాయాలు -
తక్కువ పెట్టుబడితో సీడ్ డ్రిల్ విత్తు
దూరం పాటించాల్సిందే...! రకం వరుసల మొక్కల మధ్య (సెం.మీ.) మధ్య (సెం.మీ.) వరి 25 15 మొక్కజొన్న 60 20 పామాయిల్ 60 20 పెసర 25 10 గోగు 25–30 15 వేరు శనగ 30 15 అలంపూర్: జిల్లాలో రైతులు ఎక్కువగా విత్తనాలు వెదజల్లడం, నాగళి వెనుకసాళ్లలో వేసే పద్ధతులను అవలంబిస్తున్నారు. చిన్న కమతాల్లో ఇది తప్పనిసరి. అయితే పెద్ద కమతాల్లో సాగు చేసే వారు యంత్రాలను వినియోగించడం మంచిది. ఫెర్టి కమ్ సీడ్ డ్రిల్ డ్రిల్లర్లతో విత్తనాలు, ఎరువులు సమపాళ్లలో ఒకేసారి వేసుకోవచ్చు. దీనివలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియనాయక్ రైతులకు సూచించారు. కూలీల సమస్యను అధికమించడానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సీడ్డ్రిల్ యంత్రంతో సాగు పద్ధతులను ఆయన రైతులకు వివరించారు. ఫెర్టి కమ్ సీడ్ డ్రిల్ ఉపయోగాలు.. ● అన్ని రకాల విత్తనాలు ఈ డ్రిల్తో వేయవచ్చును. ● 8 గంటల్లో 6 నుంచి 8 ఎకరాల్లో విత్తనాలు విత్తుకోవచ్చు. ● వర్షాధార భూముల్లో తేమ తగ్గక ముందే సకాలంలో విత్తనాలు వేసుకోనే అవకాశం ఉంటుంది. ● పంటను బట్టి వరుసల మద్య దూరం, మొక్కల మద్య దూరం మార్చుకోవచ్చు. ● విత్తనంతో పాటు ఎరువులు వేయడం వలన పంట తొలి దశలో ఆరోగ్యంగా పెరుగుతుంది. వేసిన ఎరువు మొక్కకు మాత్రమే అందడం వలన ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. పంటకు గాలి వెలుతురు బాగా తగిలి పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. ● యంత్రాలతో వరి, వేరు శనగ, మొక్కజొన్న, పెసర, మినుములు, కొమ్ము శనగ, గోగు తదితర పంటలు వేసుకోవచ్చు. ● ఈ యంత్రాన్ని ఉపయోగించేటప్పుడు తప్పనిసరిగా పొలం చదునుగా ఉండాలి. ● చివరి దుక్కిలో రోటోవేటర్ ఉపయోగించాలి. ● పొలం చదునుగా ఉంటే పొలం అంత విత్తనం, ఎరువులు ఒకే మోతాదులో పడతాయి. ఒకేసారి మొలక శాతం వస్తోంది. యంత్రాలను ప్రభుత్వం రాయితీపై అందజేస్తుంది. పాడి–పంట సాగు ఇలా.. సీడ్డ్రిల్ యంత్రములో రెండు బాక్సులు ఉంటాయి. ముందు బాక్స్లో ఎరువులు వేయాలి. రెండవ బాక్స్లో విత్తనం వేయాలి. ఎరువు ముందు పడుతుంది. తర్వాత విత్తనం పడుతుంది. -
అన్నదాతలపై ఆరి్థక భారం
జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు.. ● 06.05.2025 తేదీన పట్టణ పోలీసులు జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీ చేపట్టారు. మద్యంతాగి వాహనాలు నడుపుతున్న ముగ్గురు యువకులు డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డారు. ఇలా..నిత్యం రోడ్లపై మైనర్లు బైక్లను మితిమీరిన వేగంతో విన్యాసాలు చేస్తూ సినిమా తరహాలో బైక్ చేజింగ్లకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో వీరు ప్రమాదాల బారిన పడడంతోపాటు ఎదుటివారిని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. ● 17.2.2025వ తేదీన జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు మైనర్లు డబ్బులు సంపాదించేందుకోసం దొంగతనాలకు అలవాటుపడ్డారు. కాలనీ శివారులోని పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్న క్రమంలో పోలీసులు వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. ● 27.3.2025 జిల్లా కేంద్రానికి చెందిన 17ఏళ్ల బాలుడు ప్రేమ పేరిట పదో తరగతి చదువుతున్న విద్యార్థిని వేధింపులకు గురి చేశాడు. బాలికను భయపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి జువైనల్ హోంకు పంపించారు. అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పరికరాల ఉప ప్రణాళిక పథకం కింద రైతులకు వ్యవసాయ పరికరాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాకు వివిధ రకాల పరికరాలను అందించేందుకు గాను నిధులు మంజూరు చేస్తుంది. మార్చి 21న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. 2024– 25 ఆర్థిక సంవత్సరం ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాకు 1,341 యూనిట్లకు గాను రూ.3,30,53,000 నిధులు మంజూరయ్యాయి. మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతంపై వీటి ఇవ్వాలని సూచించారు. తక్కువ సమయం ఉండటంతో ప్రచారం కల్పించలేకపోయారు. దీనిపై ఇప్పటికే వ్యవసాయాధికారులు దరఖాస్తులు స్వీకరణలో జాప్యంతో లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమైంది. ఈలోగా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో మంజూరైన నిధులను వినియోగించలేకపోయారు. దీంతో 2025– 26 కొత్త ఆర్థిక సంవత్సరంలో వీటిని అమలు చేస్తారా.. లేదా.. అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సం కింద నిధులు, దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభు త్వానికి వ్యవసాయ శాఖ నివేదిక పంపించారు. అందించే పరికరాలు ఇవే.. రైతులకు ఎక్కువగా ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్ మంజూరు చేశారు. చేతి పంపులు, తైవాన్ పంపులు, డ్రోన్లు, రొటోవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజీ వీల్స్, కలుపు తీసే యంత్రాలు, గడ్డికోసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, ట్రాక్టర్లు, మొక్కజొన్న పట్టే యంత్రాలు, పత్తిని మూటకట్టే పరికరాలు ఇవ్వనున్నారు. కేజీ వీల్స్, తైవాన్ పంపులు, రొటోవేటర్లు, చేతిపంపులు ఎక్కువగా మంజూరయ్యాయి. ఎంపిక చేసిన రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఏడేళ్ల తర్వాత.. వ్వవసాయానికి సంబంధించి ఐదేళ్లుగా వాతావరణం అనుకూలిస్తున్నా.. అన్నదాతలకు ప్రభుత్వం సాయం కరువైంది. ఏడేళ్లుగా యంత్ర సాయం లేకపోవడంతో అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయి. 2017 వరకు ఏటా వానాకాలంలో రాయితీ పరికరాలను అందించగా తర్వాత నిలిపివేయడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని, రూ.150 కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఖర్చులు, సమయం ఆదా.. కూలీ ఖర్చులతోపాటు సమయాన్ని ఆదా చేసుకోవాలని రైతులు ఎక్కువగా యంత్రాలపై ఆధారపడుతున్నారు. ఏటా యంత్రాల కోసం దరఖాస్తు చేయడం.. ఎదురుచూడటం పరిపాటిగా మారింది. ప్రతి సంవత్సరం మార్చి నెల గడువు కాగా.. కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల వారీగా ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను మండలాలకు కేటాయించడం తదుపరి మీసేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం.. అనంతరం జిల్లా కమిటీ ద్వారా ఆమోదం తెలిపి, కలెక్టర్ అనుమతితో రైతులకు అందజేయాలి. కాగా.. జిల్లాకు 2014– 15లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో మంజూరు చేయగా.. 2016 నుంచి మాత్రం కేటాయింపులు ఒక రకంగా మంజూరు మరో రకంగా ఉంటోంది. మూడు నెలలకోసారి నాలుగు విడతల్లో నిధులిచ్చే ప్రక్రియ ఊసేలేదు. 2016లో తొలి విడత.. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తొమ్మిదేళ్లుగా అటకెక్కింది. 2016లో తొలి విడత నిధులు కేటాయించగా.. తదుపరి కార్యాచరణ కరువైంది. ఈ పథకానికి రూ.5 కోట్లు కేటాయించి, రైతులకు పరికరాలు, అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇచ్చేవారు. ఏళ్లుగా ఆ ఊసే లేకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వ్యవసాయ యంత్రాలకు చేయూత కరువు మహిళా రైతులకు 50, ఇతరులకు 40 శాతం రాయితీ పరికరాలు ఆర్థిక సంవత్సరం ముగియడంతో లబ్ధిదారుల ఎంపికకు బ్రేక్ 2018 నుంచి నిధులుకేటాయించని వైనం వ్యవసాయ యాంత్రీకరణ పథకంపునరుద్ధరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం -
రెన్యువల్కు రాశాం..
కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు రూ.86 లక్షలు మంజూరయ్యాయి. ఆర్థిక సంవత్సరం చివరలో నిధులు రావడంతో సమయానికి లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. దీంతో ప్రస్తుత 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకు కేంద్రానికి రెన్యువల్ కోసం లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని పునరుద్ధరించి నిధులు ఇస్తామని ప్రకటించింది. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి, నాగర్కర్నూల్ సబ్సిడీపై ట్రాక్టర్లు ఇవ్వాలి.. గతంలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఇచ్చేవారు. కొన్నేళ్లుగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం రాయితీపై ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు ఇస్తే అన్నదాతలకు ఎంతో ఊరట కలుగుతోంది. పంటల సాగుకు ఖర్చు తగ్గుతుంది. – కదిరే కృష్ణయ్య, రైతు, ఉప్పునుంతల దున్నడానికే రూ.11 వేలు.. ఏటా సాగు ఖర్చు పెరుగుతోంది. ట్రాక్టర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఎద్దులతో వ్యవసాయం చేద్దామంటే వాటిని మేపేందుకు మేతలేదు. ఎకరా పంట సాగుకు రూ.25 వేల పెట్టుబడి అయితే అందులో రూ.11 వేలు దున్నడానికే పోతోంది. – సబావత్ పుల్యానాయక్, రైతు, గుట్టమీది తండా -
దారి తప్పుతున్నారు..!
మద్యానికి బానిసలవుతున్న మైనర్లు, యువత ●తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి పిల్లలు మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడితే మొదట్లోనే తల్లిదండ్రులు గుర్తించి మందలించాలి. వారికి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వొద్దు. డబ్బు విలువ తెలిసేలా.. పిల్లల ఫీజుల కోసం తాము పడుతున్న కష్టాన్ని వివరించాలి. చెడు వ్యసనాల బారిన పడడం వల్ల కలిగే అనర్థాలను వివరించి సన్మార్గంలో నడిచేలా చూడాలి. చిన్న తనంలోనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించి.. దానిని చేరుకునేందుకు కష్టపడి చదవాలని నిత్యం దిశానిర్దేశం చేయాలి. డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ తదితర కేసుల్లో మైనర్లు పట్టుబడితే.. వారితోపాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాం. – మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల గద్వాల క్రైం: నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు చెప్తుండేవారు. కానీ, ఇప్పుడు చదువు మరిచి కొందరు మైనర్లు చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. వీరిలో అధికంగా 16 ఏళ్లు నిండని మైనర్లు.. యువతే ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది. సరదాగా అలవాటు చేసుకున్న మద్యం, దూమపానానికి బానిసలుగా మారి.. ఆ మత్తులోనే వాహనాలు తీసుకొని రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. మరికొందరు మత్తు పదార్థాలు కొనుగోలు చేసేందుకు ఏకంగా వాహనాల దొంగతనాలకు వెనకాడడంలేదు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో ఇటీవల ప్రమాదాల బారినపడి గాయాలైన ఘటనలు అనేకం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి మీద కన్నవారికి ఆశలు, ఆశయాలు ఉంటాయి. కానీ, వారు మాత్రం చెడు వ్యసనాలకు అలవాటు పడి.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడి.. పలు కేసుల్లో ఇరుక్కొని భవిష్యత్ను ప్రశ్నార్థకంగా చేసుకుంటున్నారు. డబ్బు కోసం అడ్డదారులు.. సిగరేట్, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ మైనర్లు, యువత.. అదే ఫ్యాషన్ అనే భ్రమలో కాలం గడుపుతున్నారు. నిషాలో జోగుతూ భవిష్యత్ చిత్తు చేసుకుంటున్నారు. మత్తులో డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇళ్లలో చొరబడి విలువైన వస్తువులు, సామగ్రి దొంగలిస్తున్నారు. వాటిని తక్కువ ధరకు మార్కెట్లో విక్రయించి వచ్చిన నగదుతో మద్యం, ఇతర మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సైతం పట్టణ శివారు ప్రాంతాలకు స్నేహితులతో కలిసి వేడుకల పేరుతో హంగామా సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. అటుగా వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మద్యం దుకాణాల వద్ద చిన్నారులకు మద్యం విక్రయించబోమనే నిబంధన ఉన్నా.. అది అమలు కావడంలేదనే విమర్శలు వినవస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ చేసే సమయంలో పలువురు మైనర్లు దొరికిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం పోలీసులకు పరిపాటిగా మారింది. 80 ఈ – పెట్టి.. 40 డ్రంకెన్ డ్రైవ్ కేసులు మితిమీరిన వేగంతో రోడ్డు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న ఘటనలు అనేకం ఈజీ మనీ లక్ష్యంగా దొంగతనాలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న వైనం అడ్డుకట్ట వేయడంలో కుటుంబ సభ్యులు విఫలం చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు బైక్లు, కార్లు నేర్పిస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం తప్పు అని తెలిసినా.. ఇంట్లో ఏదైన పని ఉంటే ఆసరా అవుతారనే భావనతో పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలు ఏమో వారాంతాలు, వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి బైక్ల మీద అతివేగంగా దూసుకెళ్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేని వయస్సులో వాహనాలు నడుపుతూ ఎదురుగా వచ్చిన వాహనాలను ఢీకొట్టడమో, ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రమాదాల బారిన పడడమో, అతివేగంతో అదుపుతప్పిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వీరిని మొదట్లోనే నిలువరించాల్సిన తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇటీవల చేపట్టిన తనిఖీల్లో మైనర్లు బైక్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 30 వరకు 80కి పైగా ఈ పెట్టి కేసులు, 40 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలని, వారు అడిగినన్ని డబ్బులు ఇవ్వకుండా స్వయంగా వారి అవసరాలను గుర్తించి వారే డబ్బులు చెల్లించాలని, వాహనాలు నడుపుతున్నారని మురిసిపోవడం కంటే వారు చేస్తున్నది తప్పు అన్న విషయాన్ని గుర్తించాలని, పిల్లల అలవాట్లు, పాఠశాల, కళాశాల విద్యాభ్యాసం, రోజువారి కార్యకలాపాలపై దృష్టి సారించాలని, ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే మందలించాలని పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. -
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
గద్వాల క్రైం: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అకర్శితులయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో ఈశ్వరియ విశ్వ విద్యాలయం వారు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. డీఎస్పీ మొగిలయ్య, ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ, మంజుల, సీఐ శ్రీను, ఎస్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ట్రాక్టర్తో కరిగెట దున్నుతున్న ఓ రైతు -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
గద్వాల/ఇటిక్యాల: భూ సమస్యలను సత్వరం పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం ఇటిక్యాల మండలంలోని సాతర్లలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులలో కూడిన బృందాలు రెవెన్యూ సదస్సులో అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తారని, ఈ సదస్సుల్లో ఎలాంటి ఫీజు లేకుండా రైతులు తమ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చుని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరీశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత నిర్ణీత గుడువులోగా సమస్కలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. రైతులు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సదస్సులో ఆర్డీఓ శ్రీనివాన రావు, తహశీల్దార్లు వీర భద్రప్ప, నరేష్, డి.టి. నందిని, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. మార్పుకోసం ప్రతిఒక్కరు కృషి చేయాలి సమాజంలో మార్పు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రెడ్క్రాస్ వ్యవస్థాపకులు సర్ జీన్ హెన్రీడ్యూనాంట్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్ జీన్ హెన్రీడ్యూనాంట్ చేసిన మానవతా సేవలు, అపూర్వకృషికి గుర్తుగా మొదటగా నోబెల్శాంతి బహుమతి ఆయనకు లభించిందన్నారు. రెడ్క్రాస్ సంస్థ విశ్వవ్యాప్త మానవతా ఉద్యమానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. విపత్తుల సమయంలో సహాయ సహకారాలు రక్తదానం, ఆరోగ్యసంరక్షణ, విపత్తు సంసిద్ధత తదితర రంగాల్లో సంస్థ చేపడుతున్న సేవలు గొప్పవని కొనియాడారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ రమేష్, సభ్యులు అయ్యప్పురెడ్డి, రవికుమార్, అక్బర్బాషా, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రధాన కూడళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందం విస్తృత్తంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పాత, కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆలయాలు, ప్రార్థన మందిరాలు, షాపింగ్ కాంప్లెక్స్లు తదితర ప్రాంతాల్లో పట్టణ ఎస్ఐ కళ్యాణ్కుమార్ ఆధ్వర్యంలో అనుమానం ఉన్న బ్యాగ్లు, స్థలాలను నిషేధిత పదార్ధాలను గుర్తించేందుకు యంత్రాలతో తనిఖీలు చేశా రు. శత్రు దేశంపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కార్యక్రమంలో భాగంగా పోలీ సు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. రెండు రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైన ఉంటే సంబంధిత పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా వారు తెలిపారు. అయితే పోలీసులు విస్తృత్తంగా తనిఖీలు చేపట్టడంతో పలువురు ఆందోళన చెందారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి ఇటిక్యాల: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని.. వైద్య సిబ్బంది సైతం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ సంధ్య కిరణ్మయి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి రోగులతో మాట్లాడి వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విష జ్వరాలతో పాటు వివిధ వ్యాధులకు సంబందించిన మందులు, పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు ప్రయివేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకొని ఇబ్బందులు పడాల్సిన అవనరం లేదన్నారు. గర్భిణులు ప్రభుత్వం అందిస్తున్న 102 సేవలను వినియోగించుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు. చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని, ఎండాకాలం నూలు వస్త్రాలు ధరించాలని, ఉదయం 11 గంటల నుంచి సాయత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. డిడిఈఓ రామాంజనేయులు, మండల వైద్యాధికారి డాక్టర్ రాధిక, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, పాల్గొన్నారు. ఇష్టానుసారంగా ఎరువులు వినియోగించొద్దు గద్వాల వ్యవసాయం: ఇష్టానుసారంగా ఎరువులను వినియోగించరాదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. గురువారం గద్వాల మండలంలోని కొండపల్లి రైతువేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇష్టానుసారంగా ఎరువులను వినియోగించడం వల్ల భూసారం తగ్గిపోతుందని, సిఫారసు చేసిన ఎరువులను మోతాదు మేరకు మాత్రమే వినియోగించాలని అన్నారు. సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ, వివిధ పంటలలో నూతన సాంకేతికతను పాటించడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చునని అన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్ మాట్లాడుతూ.. ఎప్పుడు ఒకే రకమైన పంటలు వేయకుండా, పంట మర్పాడి తప్పక చేయాలని సూచించారు. పండ్ల తోటల్లో అంతర పంటలు వేసుకోవడం వల్ల అధిక లాభాలు వస్తాయని చెప్పారు. అంతకుముందు ప్రాంతీయ పరిశోధన కేంద్రం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ నళిని యూరియా వినియోగం, సాగు ఖర్చులు తగ్గించుకునే విధానాలు, పంట మార్పిడి చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, శాస్త్రవేత్త డాక్టర్ శంకర్ ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత రశీదులను భద్రపర్చడం, సాగునీటి ఆదా, చెట్లను పెంచడం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ ఆదినారాయణ రెడ్డి, ఆయిల్ఫామ్ ఫెడరేషన్ అధికారి శశిధర్గౌడ్, మండల వ్యవసాయ, ఉధ్యానశాఖల అధికారులు, విస్థరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
కలంపై జులుం సహించం
గద్వాల: ప్రజాస్వామ్యంలో పత్రిక, మీడియా రంగం నాలుగో స్తంభమని.. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రంగానికి భంగం వాటిల్లే చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని.. కలంపై జులుం ప్రదర్శించాలని చూస్తే సహించేది లేదని సీనియర్ జర్నలిస్టులు హెచ్చరించారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వ పాలనలోని లోపాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పుటికప్పుడు ‘సాక్షి’ దినపత్రిక ఎండగడుతూ వస్తోంది. దీనిని జీర్ణించుకోలేని ఏపీ పాలకులు పోలీసులతో అప్రజాస్వామ్యంగా ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో గురువారం తనిఖీల పేరిట దౌర్జన్యానికి తెగబడటాన్ని టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద గద్వాల వర్కింగ్ జర్నలిస్టులు ఏపీ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. అనంతరం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు వినతిపత్రాన్ని అందజేశారు. పోలీసులతో పత్రిక గొంతును నొక్కేప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. పాలకులు ప్రజాస్వామ్యయుతంగా ఉండాల్సిన అవసరముందని, అదేవిధంగా పోలీసుల చర్యలు చట్టాన్ని పరిరక్షించి శాంతిభద్రతలను కాపాడాలే ఉండాలి తప్పితే రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరించరాదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అప్రజాస్వామ్య చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో జర్నలిస్టుల నుంచి ప్రజాస్వామ్యబద్దంగా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రవిందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సీనియర్ జర్నలిస్టులు, వెంకటేష్, హరికృష్ణ, గోకారి,మధు, లోకేష్, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల నిరసన -
పుర ఆదాయానికి గండి
వ్యాపార సముదాయాలపై కొరవడిన పర్యవేక్షణ ●వసూలు చేస్తాం మున్సిపాలిటీకి సంబందించిన దుకాణాల అద్దె బకాయిలను వసూలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడతాం. ఇప్పటికే బకాయిలు ఎక్కువగా ఉన్న దుకాణాల తాలుకు జాబితా తయారు చేశాం. వారందరికి నోటీసులు జారీ చేస్తున్నాం. అప్పటికీ స్పందించకుంటే దుకాణాలకు తాళాలు వేస్తాం. దుకాణాల అద్దె విషయంలో కఠిన చర్యలు తప్పవు. – దశరథ్ మున్సిపల్ కమిషనర్, గద్వాల గద్వాలటౌన్: ‘స్థలం మనది.. ఇల్లు కట్టుకునేది మన సొమ్ములతో.. కానీ ఇంటి స్థలానికి లేఅవుట్ అనుమతి ఉండాలి. ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకోవాలి. కనీసం లేఅవుట్ లేకపోయినా భూమి మార్కెట్ ధరపై 14 శాతం అపరాధ రుసుం వసూలు చేస్తారు. అనుమతి లేకుండా ఇల్లు కట్టుకుంటే ఆస్తిపన్ను రెట్టింపు విధిస్తారు. అన్నీ అనుమతులు తీసుకొని ఇల్లు కట్టుకున్నా ఏటా ఆస్తిపన్ను చెల్లించాలి. ఇది మన సొంత ఆస్తికి సంబంధించిన వ్యవహరం.’ ‘భూమి మనదే... పూరి గుడిసె అయినా.. మేడలైనా మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఆస్తిపన్ను చెల్లించాలి. మదింపు చేసి విధించిన ఆస్తిపన్నును ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశిత తేదీల్లో చెల్లించని పక్షంలో రూ.100కు రూ.2 చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. మన సొంత ఆస్తులకు సైతం ఏటా పన్ను చెల్లించాలన్న మాట.’.. కానీ ఇవేవీ లేకుండా దర్జాగా ఆస్తులను అనుభవించాలనుకుంటే మాత్రం మున్సిపాలిటీలకు చెందిన ఆస్తులు (వ్యాపార సముదాయాలను) వెతుక్కోవాలి. ఒక్కసారి వేలంలో పాల్గొని సముదాయంలో ఒక్క దుకాణం పొందితే చాలు మొదట కొంత సొమ్ము విదిల్చుకుంటే ఇక ఆ ఆస్తిని అనుభవించడానికి హక్కులు పొందినట్లే. అద్దెలు అడిగేవారుండరు.. అడిగినా మనకు తెలిసిన నాయకులను ఆశ్రయిస్తే సరిపోతుంది. గద్వాల మున్సిపాలిటీలోని వ్యాపార సముదాయాల్లో జరుగుతున్న తంతు ఇది. మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే మనరులుగా లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వ్యాపార సముదాయాలు పరులపాలవుతున్నాయి. మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతుండగా, దుకాణాలను పొందిన వ్యక్తులు వాటిని ఇతరులకు అద్దెకిస్తూ ఆర్జిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార సముదాయాల్లో నిబంధన ఉల్లంఘన అడుగడుగునా చోటుచేసుకుంటున్న విషయం అధికారులకు తెలిసినా నోరు మెదపడం కానీ.. అద్దె వసూలు చేయాలనే సాహసంతో ఒక్క అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. రాజకీయ జోక్యం సొంత ఆస్తులపై రాబడిని ఆర్జించలేని స్థితిని మున్సిపాలిటీకి కల్పిస్తుంది. పేరుకుపోతున్న బకాయిలు పాత బస్టాండ్ సముదాయంలో, పాత గ్రంథాలయ భవన నిర్మాణం కింద దుకాణాలను వేలం పాట ద్వారా అద్దెలకు ఇచ్చారు. భారీ మొత్తంలో వ్యాపారులు వేలం పాడి దుకాణాలను దక్కించుకున్నారు. ఇందులో చాలా మంది వ్యాపారులు దుకాణం దక్కించుకున్నప్పటి నుంచి అద్దెలే చెల్లించడం లేదు. ఈ రెండు సముదాయాలలో ఉన్న అద్దె బకాయిలే రూ.లక్షల్లో ఉన్నాయి. కొంత మంది రెండు, మూడేళ్ల నుంచి అద్దెలు చెల్లించడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్దె వసూళ్లకు వెళ్లిన మున్సిపల్ సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పెద్ద మొత్తంలో అద్దె బకాయిలు పేరుకపోతున్నాయి. కొన్ని దుకాణాలకు న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయి. వాటి పరిష్కారానికి అధికారులు కనీస శ్రద్ధ కనబర్చడం లేదు. రెండు, మూడేళ్లుగా అద్దెలు చెల్లించని వైనం పేరుకుపోయిన రూ.1.50 కోట్ల అద్దె బకాయిలు బయటి మార్కెట్ కంటే తక్కువ అద్దెలతో మున్సిపాలిటీకి నష్టం ఇదీ పరిస్థితి.. జిల్లాలో గద్వాలతో పాటు అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే మూడు దశాబ్దాల క్రితం ఐడీఎస్ఎంటీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ రుణంతో గద్వాల మున్సిపల్ పరిధిలో 236 దుకాణాలను చేపట్టారు. ఏ నుంచి హెచ్ బ్లాక్ వరకూ.. స్టోర్స్ అకాడమి, నల్లకుంట కాలనీ, కూరగాయల మార్కెట్ దగ్గర, పాత బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం పక్కన, కళాశాల మార్గంలో ఉన్న ప్రధాన రహదారుల పక్కన దుకాణాలను నిర్మించారు. కొన్ని దుకాణ సముదాయాలకు 30 ఏళ్లు లీజు అగ్రిమెంట్ పూర్తయింది. కేటాయించిన దుకాణాల అద్దెలను ప్రతి మూడేళ్లకు రెన్యూవల్ చేయాలి. కానీ అద్దెలను మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు పెంచకుండా తక్కువ మొత్తంలో అద్దెలు చెల్లిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండికొడుతున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో దుకాణాల అద్దె బకాయి రూ.1.50 కోట్లకు చేరుకుంది. -
నంబర్ ప్లేట్ మార్చాల్సిందే..
అచ్చంపేట: నకిలీ నంబర్ ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతలపై సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి అన్ని రకాల వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు(హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరి చేస్తూ.. రవాణాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు కొనుగోలు చేసిన వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకుంటే ఇకపై రోడ్డుపై నడిపేందుకు అవకాశం లేదు. కాలపరిమితి ముగిసిన వాహహనాల నంబర్ ప్లేట్ల పైనా నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని రకాల పాత వాహనాలకు ఇప్పుడున్నవి కాకుండా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాలని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి తుది గడువు సెప్టెంబర్ 30గా ప్రకటించింది. లేని పక్షంలో భారీ జరిమానాలు, శిక్షలు వేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. వీటిని అమర్చుకునేందుకు ప్రత్యేక రుసుములు ప్రకటించారు. వాహనాల తీరు ఆధారంగా ధరలు నిర్ణయించింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణాశాఖ కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. పటిష్ట చర్యలు నిర్దేశిత గడువు నిండిన వాహనాలు రోడ్డుపై నడపకుండా ఉండేందుకు రవాణాశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటుంది. 15 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన వాహనాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. నిర్ణీత కాల పరిమితి ముగిసిన వాహనాలు వేర్వేరు నంబర్ ప్లేట్లపై రోడ్డుపై తిరుగుతూ ప్రమాదాల కారణం అవుతున్నాయి. అనేక వాహనాలకు సకాలంలో సామర్థ్యం పరీక్షలు చేయడం లేదు. ఇలాంటి వాటికి ఆడ్డుకట్టు పడనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2018 డిసెంబర్ 31 నాటికి 6,01,677 వాహనాలు ఉండగా 2019 జనవరి 1 నుంచి 2025 ఏప్రిల్ 30 వరకు 3,68,574 వాహనాలతో మొత్తం 9,65,761 వాహనాలు ఉన్నాయి. ఐదు జిల్లాల రవాణాశాఖ కార్యాలయాల పరిధిలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు జరగుతున్నాయి. సాధారణ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలు 4 లక్షలకు పైగానే ఉంటాయని సమాచారం. ఈ వాహనదారులంతా తప్పనిసరిగా హెచ్ఎస్ఆర్ ప్లేట్లు బిగించుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాహనాలకు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, కాలుష్య నిరాధరణ పత్రాల వంటి తదితర సేవలను నిలిపివేస్తారు. వాటిని అమ్మాలన్నా.. కొనాలన్నా ఇబ్బందులు తప్పవు. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో పట్టబడితే కేసులు నమోదు చేసి జరిమానా వేయడం లేదా వాహనాలు సీజ్ చేయడం చేస్తారు. నంబర్ ప్లేట్ మార్పు ఇలా.. పాత వాహనానికి కొత్తగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూడబ్లూ.ఎస్ఐఏఎం.ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్లి వాహనం నంబర్, ఫోన్నంబర్, వాహన రకం, కంపెనీ, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. నంబర్ ప్లేట్ షోరూం వివరాలు వస్తాయి. వెంటనే ఆ షోరూంకు వెళ్లి వాహనానికి అమర్చుకొని ఫొటోను తీసి మరోసారి వెబ్సైట్లో ఎంటర్ చేయాల్సిన బాధత వాహనదారుడిపైనే ఉంటుంది. ఇదిలాఉండగా, నిరక్షరాస్యులు, స్మార్ట్ఫోన్లు లేని వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్కు చెల్లించే రుసుములు ఇలా.. ద్విచక్రవాహనం 320-360 కార్లు 590-700కమర్షియల్ వాహనాలు 600-800 త్రిచక్రవాహనాలు 350-450 జిల్లా బైక్లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర వాహనాలు మహబూబ్నగర్ 2,70,491 26,069 14,585 9,872 19,493 433 వనపర్తి 37,407 6093 2,415 3,845 6,678 2,424 నాగర్కర్నూల్ 41,291 6,893 3,610 4,391 9,770 342 గద్వాల 58,956 4,856 1,648 3,267 6,811 218 నారాయణపేట 40,059 4,953 3,135 2,700 8,823 149 2019 జనవరి నుంచి 2025 ఏప్రిల్ వరకు కొనుగోలు చేసిన వాహనాలు జిల్లా బైక్లు కార్లు ఆటోలు గూడ్స్ ట్రాక్టర్లు/ట్రైలర్లు ఇతర వాహనాలు మహబ్బ్నగర్ 84,061 13,548 5,873 4,310 7,917 163 వనపర్తి 36,767 4,376 1,968 2,114 7,373 01 నాగర్కర్నూల్ 47,797 6,225 1,947 3,416 15,093 78 గద్వాల 56,329 4,199 697 2,101 6,803 44 నారాయణపేట 42,405 3,719 2,409 1,423 5,404 44 పాత వాహనాలకు హై సెక్యూరిటీ ఉత్తర్వులు జారీ చేసిన రవాణాశాఖ 2019 కంటే ముందు కొనుగోలు చేసిన వాటికి తప్పనిసరి సెప్టెంబర్ 30 వరకు తుది గడువు నకిలీ నంబర్ ప్లేట్ల కట్టడి.. రహదారి భద్రతే లక్ష్యం పాత వాహనాలకు అమర్చుకోవాలి పాత వాహనాలకు కొత్తగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు అమర్చుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం వాహనాలకు ఫీజును నిర్ధారించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలకు మరో 5 ఏళ్లు గడువు పొడిగించాలంటే వాహనదారుడు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దానికి బార్కోడ్ వస్తోంది. అప్పడు వాటికి హైసెక్యూరిటీ నంబర్ల ప్లేటు అమర్చుకోవాల్సి ఉంటుంది. తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తాం. వాహనాలకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేస్తాం. – చిన్నబాలు, రీజినల్ ట్రాన్స్పోర్టు అధికారి, నాగర్కర్నూల్ -
సిబ్బంది లేక ఇబ్బంది
అయిజ: పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా 2017లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అయిజకు సబ్ డివిజన్ కేటాయించారు. నాటి నుంచి సబ్డివిజన్ కేంద్రం ఏర్పాటు చేసుకొని అయిజ, మల్దకల్, గట్టు మండలాల రైతులకు విద్యుత్ సేవలు అందిస్తున్నారు. అయితే, సబ్ డివిజన్ ఏర్పాటు వరకు బాగానే ఉన్నా.. సరిపడా సిబ్బంది లేకపోవడం, సొంత భవనం నిర్మించకపోవడం, తాత్కాలిక భవనంలో వసతులు లేకపోవడంతో అటు అధికారులు, ఉన్న సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మూడుచోట్ల సబ్ డివిజన్లు జిల్లాలో గద్వాల, అలంపూర్, అయిజలో కలిపి మొత్తం మూడు విద్యుత్ సబ్డివిజన్లు ఏర్పాటు చేశారు. అయితే గద్వాల, అలంపూర్లో సబ్ డివిజన్లకు కార్యాలయ భవనాలు ఉన్నాయి. ఆ రెండు ప్రదేశాల్లో సబ్ డివిజన్ కార్యాలయంలో తగినంతమంది సిబ్బంది ఉన్నారు. అయిజలో సబ్ డివిజన్ ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతోంది. మూడు సంవత్సరాలపాటు ఇంచార్జ్లతో సరిపెట్టారు. గత మూడు సంవత్సరాల నుంచి రెగ్యులర్ ఏడీఈ పనిచేస్తున్నా వసతులు కరువయ్యాయి. మౌళిక వసతులు కరువు అయిజ విద్యుత్ సబ్ డివిజన్లో ఇంతవరకు కనీసం కార్యాలయ భవనం నిర్మించలేదు. తగిన సిబ్బంది, పరికరాలు లేకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. చిన్న గదిలో ఏఈ కార్యాలయం ఏర్పాటు చేసుకొని విధులు నిర్వహిస్తున్నారు. అదే గదిలో ఏడీఈ విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది కూర్చోవడానికి కూడా స్థలం లేకుండా పోయింది. కనీసం ఏఈలు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా అవకాశం లేదు. కార్యాలయంలో కనీసం ముగ్గురు ఏఈలు, ముగ్గురు సబ్ ఇంజినీర్లు వస్తేకూడా కూర్చోవడానికి స్థలం లేదు. అలాగే, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. తొమ్మిది గ్రామాలకు లైన్మన్లు లేరు. ఒక్కో గ్రామానికి ఇద్దరు నుంచి ముగ్గురు లైన్మెన్లు ఉండాల్సి ఉండగా వెంకటాపురం, పర్దిపురం, కిస్టాపరం, యాపదిన్నె, కుర్వపల్లి, గుడుదొడ్డి, బింగుదొడ్డి, ఎక్లాస్పురం, దేవబండ గ్రామాల్లో కనీసం ఒక్కొక్క లైన్మెన్ కూడా లేరు. రాజోళి, మల్దకల్, గట్టు మండలాల్లోని సబ్ స్టేషన్లలో ముగ్గురు చొప్పున ఆపరేటర్లు ఉండాల్సి ఉండగా ఒక్కొక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వేరే వ్యక్తులతో తాత్కాలికంగా పనులు చేయిస్తున్నారు. ప్రతి సబ్స్టేషన్లలో ముగ్గురు ఆపరేట్లు ఉండాల్సి ఉండగా ఇద్దరు ఆపరేటర్లతోనే పనులు చేయిస్తున్నారు. విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం కొనసాగుతున్నది ఈ భవనం ఇదే..అయిజ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో సమస్యల తిష్ట సొంత భవనం లేక అధికారులు, సిబ్బంది ఇబ్బందులు 2017లో విద్యుత్ సబ్డివిజన్ ఏర్పాటు అయిజ, మల్దకల్, గట్టు, రాజోళి మండలాల రైతులకు సేవలు కూర్చోవడానికి కూడా స్థలంలేదు రైతులు తమ గోడును వినిపించుకోవడానికి సబ్డిజన్కు వెళ్తే అక్కడ అధికారితో కనీసం కూర్చొని మాట్లాడేందుకు కూడా స్థలంలేదు. దానివలన రైతులు నిలబడి మాట్లాడి వెళ్లాల్సి వస్తుంది. కార్యాలయంలో రైతులు కనీసం ఏఈతో మాట్లాడుకుందాం అన్నా సరే అక్కడ కూడా స్థలం చాలడంలేదు. దీంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి. – గోవిందు, రైతు నివేదికలు పంపించాం సబ్డివిజన్ కార్యాలయ భవనంలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. తగినంత సిబ్బంది లేకపోవడంతో పనులు వేగంగా ముందుకు సాగడంలేదు. ఈ విషయాలను ఉన్నతాధికారులకు తెలియజేశాం. కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టాలని రెండేళ్ల క్రితం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. – నీలి గోవిందు, ఏడీఈ, అయిజ సబ్ డివిజన్ -
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
ఇటిక్యాల: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు భూ భారతి చట్టంతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఇటిక్యాల మండలం వావిలాల గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై రైతుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసీల్దార్, ఆర్డీఓ లేదా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. ప్రస్తుతం అధికారులే స్వయంగా గ్రామాలకు వచ్చి భూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారని తెలిపారు. వావిలాల గ్రామంలో వివిధ రకాల భూ సమస్యలపై 49 అర్జీలు అందాయని.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నెల రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్లు వీరభద్రప్ప, నరేష్, ఎంపీడీఓ అజార్ మొహినుద్దీన్, ఏఓ రవికుమార్, రెవెన్యూ సిబ్బంది మనోహర్, నరేష్, మదన్మోహన్, సర్వేయర్ దౌలమ్మ, పంచాయతీ కార్యదర్శి శంకర్ పాల్గొన్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లలో తనిఖీలు గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ల్యాబ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. బయో మెడికల్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని.. ప్రైవేటు ల్యాబ్లు, డయాగ్నొస్టిక్ సెంటర్ల నిర్వాహకులు తప్పనిసరిగా బీఎండబ్ల్యూ నిబంధనలు పాటించాలని జిల్లా ప్రోగ్రాం అధికారిణి ప్రసూన్నరాణి సూచించారు. ఈ తనిఖీల్లో అధికారులు మధుసూదన్రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు. ముగిసిన ఆరాధనోత్సవాలు మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న శేషదాసుల వారి ఆరాధనోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల చివరి రోజున శేషదాసుల వారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పండితులు రాఘవేంద్రాచారి, రమేషాచారి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. సన్మార్గంలో పయనించాలన్నారు. అనంతరం సంగీత కచేరి చేశారు. హరినామ సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, దీరేంద్రదాసు, రాఘవేంద్రదాసు, శశాంక్, విష్ణు, అరవిందరావు, బాబురావు, భీంసేన్రావు, మనోహర్రావు, రామారావు, శ్రావణ్, రవిచారి తదితరులు పాల్గొన్నారు. -
గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి
రాజోళి: కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు సంబంధిత అధికారులకు సూచించారు. రాజోళి మండలం పచ్చర్ల గ్రామంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నామని రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. రైతులకు సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు నసనూరు, పెద్ద ధన్వాడ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రతి కూలీకి రూ.300 కూలి అందే విధంగా పనులు చేపట్టాలని సూచించారు. అదే విధంగా పచ్చర్లలో ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న నాలుగు పశువుల పాకలు, ఎరువు గుంతలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ ఖాజామొయినుద్దీన్, ఏపీఓ ప్రసాద్, ఏపీఎం మార్తమ్మ తదితరులు ఉన్నారు. -
విద్యార్థులకు సకాలంలో యూనిఫాం అందించాలి
ధరూరు: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో యూనిఫాం అందించాలని అడిషనల్ డీఆర్డీఓ నర్సింహులు అన్నారు. మంగళవారం ధరూరు మండలం అల్వాలపాడు గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల యూనిఫాం తయారీకి అవసరమైన క్లాత్ను ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు అందించినట్లు తెలిపారు. దు స్తులను చక్కగా కుట్టి విద్యార్థులకు అందించాలని సూచించారు. అనంతరం ఇప్పటికే కుట్టిన యూనిఫాంలను ఆయన పరిశీలించారు. సమావేశంలో డీపీఎం రామ్మూర్తి, ఏపీఎం శోభారాణి, సీసీ నవీన్కుమార్ తదితరులు ఉన్నారు. -
కష్టపడి కాదు.. ఇష్టపడి చదవాలి
● ప్రతి విద్యార్థి ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలి ● కలెక్టర్ బీఎం సంతోష్ ● ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన గద్వాల: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కష్టపడి కాకుండా.. ఇష్టపడి చదువుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 34 మంది విద్యార్థులను మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో 32వ స్థానంలో నిలవగా.. తాజాగా విడుదలైన ఫలితాల్లో 10.36 శాతం పెరుగుదలతో ఉత్తమ ఫలితాలు సాధించి 26వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరాలంటే.. క్రమశిక్షణ, కష్టపడేతత్వం ఉండటంతో పాటు తమపై తమకు పూర్తి నమ్మకం ఉండాలని సూచించారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు నిరంతర కృషి అవసరమన్నారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ కీలకమని.. భవిష్యత్కు దిశను నిర్ణయిస్తుందన్నారు. ఈ సమయంలో మరింత పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా అవసరమన్నారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండి.. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. రోజు వ్యాయామానికి కొంత సమయం కేటాయించాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం మెస్ చార్జీలను కూడా 40 శాతం పెంచిందని.. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషిచేసిన ఉపాధ్యాయులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్ ఘని, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మామిడి రైతు కుదేలు
అకాల వర్షాలు, ఈదురుగాలులతో తీవ్రనష్టం ●300 టన్నులకు పైగా.. నాగర్కర్నూల్ జిల్లాలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఏప్రిల్ నెలాఖరులో 300 టన్నులకు పైగా మామిడి కాయలు నేల రాలాయి. వీటిని విక్రయించేందుకు హైదరాబాద్ మార్కెట్కు తీసుకువచ్చారు. మార్కెట్లో రాలిన కాయలను తక్కువ ధరలకు రైతులు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా రోజూ రాలిన కాయలు మార్కెట్కు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. దీనికి తోడు గాలివానల వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సలీం, మామిడి ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్, కొల్లాపూర్ నష్టంపై నివేదికలిచ్చాం.. అకాల వర్షాలు, భారీ ఈదురుగాలుల కారణంగా మామిడి తోటల్లో పెద్దమొత్తంలో కాయలు రాలాయి. నియోజకవర్గాల వారీగా పంటనష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో చెట్లు విరిగిపడిన సంఘటనలు లేవు. కానీ, కాయలు చాలా రాలాయి. రాలిన కాయలను మార్కెట్లో ధరలు ఉండవు. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు తెలియజేశాం. – లక్ష్మణ్, ఉద్యానవన శాఖ అధికారి, కొల్లాపూర్ కొల్లాపూర్ శివారులో ఈదురుగాలులకు నేలరాలిన మామిడి కాయలు కొల్లాపూర్: వాతావరణ ప్రభావంతో అంతంత మేరకే దిగుబడులు.. చేతికొచ్చిన దాన్ని అమ్ముకునే సమయానికి అకాల వర్షాలు, భారీ ఈదురుగాలులు మామిడి రైతులను కుదేలు చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు లాభాలు రాకపోగా.. కష్టాలు.. నష్టాలు చుట్టుముట్టి రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. నామమాత్రపు దిగుబడులు ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం మామిడి దిగుబడులు నామమాత్రంగానే ఉన్నాయి. మొదట్లో పూతలు బాగా పూసినప్పటికీ వాతావరణంలో మార్పులు, చీడపీడల కారణంగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాలేదు. సాధారణ దిగుబడి కంటే సగం మేరకు తక్కువగా దిగుబడులు వచ్చాయి. పండిన ఆ కాస్త పంటను అమ్ముకునే సమయంలో మామిడి రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. ఏప్రిల్ నెల మూడో వారం నుంచి తరచూ వీస్తున్న భారీ ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా మామిడి తోటలు దెబ్బతిని.. కాయలు పెద్దమొత్తంలో రాలిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు సైతం నెలకొరిగాయి. సరైన ధరలు లేక.. మామిడి దిగుబడుల సంగతి పక్కన పెడితే.. ధరలు ఈ ఏడాది కూడా పెరగలేదు. ఇందుకు వ్యాపారుల సిండికేటే ప్రధాన కారణం. ఫిబ్రవరి నెలలో టన్ను రూ.లక్షకు పైగా పలికిన మామిడి ధర.. మార్చి మొదటి వారంలో పూర్తిగా తగ్గిపోయాయి. టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.70 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే పలుకుతోంది. గాలివానల కారణంగా రాలిన మామిడి కాయలను హైదరాబాద్ మార్కెట్లో టన్నుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపు కొనుగోలు చేస్తున్నారు. అంటే రైతులు పండించిన పంటకు రవాణా, కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి. నష్టం అంచనాకు సాంకేతిక సమస్యలు మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా బీభత్సం సృష్టించిన గాలులు కల్వకుర్తి, బిజినేపల్లి ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లు వాతావరణం అనుకూలించకపంట దిగుబడిపై ప్రభావం ఆర్థికంగా చితికిన రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు -
పారా బాయిల్డ్లో భారీ అగ్నిప్రమాదం
వనపర్తి: పెబ్బేరు పట్టణ శివారులోని సాయిగోపాల్ పారా బాయిల్డ్ మిల్లులో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి–44కు సమీపంలోని మిల్లులో సాయంత్రం ఎవరూ లేని సమయంలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగి.. గన్నీ బ్యాగులు, ధాన్యం బస్తాలు, మర ఆడించిన బియ్యం పెద్దమొత్తంలో దహనమైనట్లు మిల్లు యజమాని తెలిపారు. మిల్లులో పనిచేసేవారు టీ తాగేందుకు బయటకు వెళ్లిన సమయంలో షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగగా.. గమనించిన వారు వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడంతోపాటు కొత్తకోట అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రెండు వాహనాలు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్ర యత్నం చేసినా.. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 కోట్లకుపైగా నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పారా బాయిల్డ్ మిల్లులో చెలరేగుతున్న మంటలు వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన -
ఏం జరుగుతుందంటే..
జిల్లాలో ఇసుక అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మన ఇసుక వాహనం పేరుతో కొన్ని ట్రాక్టర్లకు అనుమతులిచ్చింది. అయితే వారు ఆన్లైన్లో తమ ట్రాక్టర్ను నమోదు చేసుకునేందుకు కొంత నగదును ప్రభుత్వానికి చెల్లించడంతో పాటు ఇసుకను ప్రజలకు అందించే క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుకను అందిస్తున్నారు. ఈ క్రమంలో వారికి నష్టాలు కూడా తప్పడం లేదు. కాగా నదిలో ఇసుక కూడా తక్కువగా ఉండటంతో ఎక్కడ లభ్యత ఉంటే అక్కడికి వెళ్లి ఇసుకను తీసుకుంటున్నారు. కానీ కర్నూల్ జిల్లా అధికారులు నదిలోకి వెళ్తున్న గద్వాల జిల్లా ట్రాక్టర్లను తమ హద్దులోకి వచ్చారనే నెపంతో బెదిరించడం, ఫొటోలు తీసుకోకుండా ఫోన్లు లాక్కోవడం, జరిమానాలు విధించడం చేస్తున్నారు. కానీ ఏపీకి చెందిన ట్రాక్టర్లతోపాటు నదిలో నీరున్న సమయంలో నేరుగా స్టీమర్లు జిల్లా సరిహద్దులోకి వచ్చి ఇసుకను తోడుతున్నా ఇక్కడి జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా నదిలో అష్టకష్టాలు పడి నదిలో ఇసుకను లోడ్ చేసుకుని వస్తున్న అనుమతి ఉన్న ట్రాక్టర్లపై రాజకీయ కక్ష్యలతో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ట్రాక్టర్ల యజమానులు ఇసుక వాహనాలను నడిపేందుకు జంకుతున్నారు. నదిలో దిగితే ఏపీ అధికారుల బెదిరింపులు, బయటకు వస్తే జిల్లా అధికారులు నానా కారణాలతో కేసులు చేస్తున్నారని ట్రాక్టర్ల యజమానులు అంటున్నారు. రోడ్ టాక్స్, ప్రభుత్వానికి ఆన్లైన్ కోసం టాక్స్ ఇతర అన్ని పన్నులు చెల్లిస్తున్నా తమకు అండగా ఉండటం వదిలేసి ఏపీ అధికారులతో సమానంగా కేసులు చేయడం దారుణమని అంటున్నారు. -
భూసమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
ఇటిక్యాల: భూ సమస్యలను పరిస్కరించేందుకు గాను ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి.ఎం సంతోష్ అన్నారు. సొమవారం మండలంలోని గోపల్దిన్నెలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టుగా మండలాన్ని ఎంపిక చేశారని, భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు సమర్పించాలని, అధికారులు స్వయంగా గ్రామాలకే దరఖాస్తులను పరిశీలించి, అర్హతను నిర్ధారించిన తర్వాత వారికి సంబంధింత ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు. మీసేవ కేంద్రాలలో దరఖాస్తు ఫీజు ఉంటుందని, ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను పూర్తిగా ఉచితంగా స్వీకరించబడుతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను నెల రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి అనంతరం కలెక్టర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్దిదారులు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తి అయ్యేందుకు పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. గ్రామంలో మొత్తం 55 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే 8 ఇళ్లకు బేస్మెంట్ పూర్తికాగా ముగ్గురికి మొదటి విడతగా రూ.1లక్ష వచ్చినట్లు తెలిపారు. ఇళ్ల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ.. లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ, హౌసింగ్ పీడీ శ్రీనివాసులు, తహశీల్దార్లు వీర భద్రప్ప, నరేష్, ఎంపీడీఓ అజార్ మొహినుద్దీన్, ఎఓ రవికుమార్ పాల్గొన్నారు. -
ఉచితం పేరుతో దందా
రాజోళి: తుంగభద్ర నది నీటి కోసం గతంలో రెండు ప్రాంతాల వారు ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. అప్పటి అధికారులు, యంతాంగ్రం ఆ సమస్యపై పెద్దగా స్పందించకపోవడంతోనే ఘర్షణ జరిగిందని నాటి ప్రత్యక్ష సాక్ష్యులు నేటికి చెబుతుంటారు. ప్రస్తుతం అదే ప్రాంతాల నడుమ మరో సమస్యపై వివాదం ముదురుతోంది. గతంలో తుంగభద్రలో నీటి కోసం కాగా.. ఇప్పుడు కూడా అదే నదిలో ఇసుక కోసం వివాదం జరుగుతుంది. ఇప్పుడు కూడా అధికారులు మౌనంగా ఉండటంతో జిల్లాకు నష్టం వాటిల్లుతుందని, జిల్లా ప్రయోజనాలను మరిచి ఏపీ అధికారుల తీరుపై కనీసం నోరు మెదపకపోవడంపై జిల్లా ప్రజలు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. తూర్పు గార్లపాడు శివారులో కర్నూల్–గద్వాల మధ్యలో వివాదానికి కేంద్రంగా మారిన సరిహద్దు రెండు ప్రాంతాల నడుమ ఒకే నది రాష్ట్రంలోని గద్వాల జిల్లా.. ఏపీలోని కర్నూల్ జిల్లాలో తుంగభద్ర నది ప్రవహిస్తుంది. ఈ క్రమంలో నదిలో నీటిని కలిసి తాగుతున్నామని, అందులో ఉన్న వనరులను పంచుకునే క్రమంలో పరిమితులు విధిస్తూ ఒక ప్రాంతం వారికి అన్యా యం చేయడం తగదని జిల్లా వాసులు అంటున్నారు. రెండు ప్రాంతాల మధ్య ఉన్న ఒకే నది ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా చూడాల్సిన అధికార పార్టీలే ఈ సమస్యను పరిష్కరించకుండా వదిలేస్తే మున్మందు సమస్య తీవ్రత పెరిగే అవకాశముందని జిల్లా వాసులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో ఉచిత ఇసుక పేరుతో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటితోపాటుగా నది పరివాహకంలోని అన్ని గ్రామాల్లో ఇసుకను తోడి ఉచితం పేరుతో టిప్పర్లలో తరలించి దందాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు ఉంటే రాత్రిళ్ల సమయంలో ఇసుక రవాణా చేయాల్సిన పరిస్థితి ఏంటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఉచితం ఏపిలో మాత్రమే ఉండగా, ఏపి నుంచి తెలంగాణలోకి వాహనాలు రావడం ఏంటని, దాని వెనుక ఎవరున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నదిలోకి వెళ్లగానే హద్దు పేరుతో దాడులు చేసి కేసులు, జరిమానాలు విధించే, ఏపి అధికారులు హద్దులు దాటి వచ్చి దందాలు చేస్తున్న ఏపీ వాహనాలు ఎందుకు కనిపించడం లేదని జిల్లా వాసులు అంటున్నారు. ఏపీ వాహనాలు జిల్లాలో చేస్తున్న దందాను జిల్లా అధికారులు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదని అంటున్నారు. జిల్లాలో నది తీర గ్రామాల్లో భాగంగా రాజోళి మండలం తూర్పు గార్లపాడు, చిన్నధన్వాడ, మానవపాడు మండలంలోని మద్దూరు గ్రామాల్లో మన ఇసుక వాహనాలు నడుస్తుండగా.. జిల్లాలోని తుంగభద్ర నది పరివాహక గ్రామాల్లోని ఏపీ వైపున నుంచి ఈ గ్రామాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తుమ్మిళ్ల గ్రామంలో నేటికి మర బోట్ల ద్వారా ఇసుకను జిల్లా సరిహద్దులోకి వచ్చి తీస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పటికే తూర్పు గార్లపాడులోని ఇసుక రీచ్కి వెళ్లిన జిల్లా ట్రాక్టర్లపై ఏపీ అధికారులు రెండు సార్లు కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. ఇలా ప్రకృతి వనరులపై అజమాయిషీ చేస్తున్నా.. రోజురోజుకు వివాదం ముదరుతున్నా అధికార పార్టీ, ప్రభుత్వ పెద్దలు నోరుమెదపకపోవడం, చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇరు ప్రాంతాల అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, లేకపోతే వివాదం మరింత ముదిరే ప్రమాదముందని జిల్లా వాసులు అంటున్నారు. ఇదిలాఉండగా, నదిలో నెలకొన్న సమస్యను జిల్లా మైనింగ్ శాఖ అధికారి దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేయగా.. పలుమార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. ప్రకృతి వనరులపై అజమాయిషీ జిల్లా సరిహద్దులోకి వచ్చి ఇసుక తోడుతున్న ఏపీ ప్రాంతంవారు ఉచితం పేరుతో ప్రకృతి వనరులను కొల్లగొడుతున్న ఇసుక మాఫియా జిల్లా ట్రాక్టర్ యజమానులపై ఏపీ అధికారుల కేసులు, బెదిరింపులు నోరు మెదపని జిల్లా అధికారులు -
‘ప్రజావాణి’కి 53 ఫిర్యాదులు
గద్వాల:వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 53 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించడం జరిగిందని వాటిని వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏవో నరెందర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 8 అర్జీలు గద్వాల క్రైం: సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 8 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గద్వాలలో ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్గా చూపించి రూ.20లక్షలు మోసం చేశాడని, న్యాయం చేయాల్సిందిగా రిటైర్డు ఆర్టీసీ ఉద్యోగి ఫిర్యాదు చేశాడు. అలాగే, గట్టు మండలానికి చెందిన ఇద్దరు రైతులు భూ వివాదంపై తరచూ ఘర్షణ చోటు చేసుకుంటుందని, వారి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీ దృష్టికి రైతులు వివరించారు. ఇలా పలువురు బాధితులు పలు సమస్యలపై ఎస్పీకి విన్నవించారు. డిగ్రీ పరీక్షలు వాయిదా మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ కోరులకు సంబంధించి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ పరీక్షలు బుధవారం (మే 6) నుంచి జరగాల్సి ఉంది. ప్రభుత్వం కొన్నేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘాలు.. సోమవారం నుంచి డిగ్రీ కళాశాలలు బంద్ చేసి, ఆందోళనకు దిగిన నేపథ్యంలో పీయూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు జూనియర్ బాలుర సాఫ్ట్బాల్ జట్టు ఎంపికలు మహబూబ్నగర్ క్రీడలు: ఈనెల మూడో వారంలో మంచిర్యాల జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర సాఫ్ట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాలుర జట్టు ఎంపికలను ఈనెల 7వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు సభ్యులు నాగరాజు, రాఘవేందర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా వివరాల కోసం 99590 16610, 99592 20075 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు. స్వయం ఉపాధికి కార్పొరేషన్ల తోడ్పాటు స్టేషన్ మహబూబ్నగర్: స్వయం ఉపాధికి కార్పొరేషన్లు ఎంతో దోహదపడుతాయని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. మహబూబ్నగర్ షాసాబ్గుట్ట ముస్లిం సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెహందీ, కంప్యూటర్ కోర్సులు పూర్తిచేసిన మహిళలకు సోమవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేవిధంగా కార్పొరేషన్లు చేయూత అందిస్తాయని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరపున స్కిల్డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, మెహందీ, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి రుణాలు మంజూరవుతాయని అన్నారు. -
2 వేల ఏళ్ల నాటి గ్రామం..
నంది వడ్డెమాన్గా మారిన వర్ధమానపురం ● 400 ఏళ్లు పాలించిన కాకతీయ సామంత రాజులు ● నేటికీ సజీవంగా చారిత్రక ఆనవాళ్లు ● గ్రామంలో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడు ● రాష్ట్రంలోనే ఏకై క ఆలయంగా ప్రసిద్ధి శనేశ్వరుడికి అతీ ప్రీతికరమైన నల్లటి వస్త్రాలు ధరించి ఇక్కడ పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లేడు, జమ్మి ఆకు, నువ్వుల నూనెలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. గుడి ఆవరణలో స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించి.. విగ్రహం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి.. స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకించి.. ఆ తైలాన్ని తలకు రుద్దుకుని మరోమారు స్నానం చేస్తారు. అనంతరం అక్కడే ఉన్న నంది శివలింగాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ జేష్ట్యాదేవి సమేతంగా శనేశ్వరుడు కొలువుదీరినందున మహిళలు సైతం ఈ పూజల్లో పాల్గొనవచ్చు. నాగర్కర్నూల్: కాకతీయుల చరిత్రగా పిలిచే వర్ధమానపురమే నేటి నందివడ్డెమాన్. తెలంగాణలో వర్ధమానపురానికి 2 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉంది. వర్ధమానపురాన్ని రాజధానిగా చేసుకుని 400 ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని కాకతీయ సామంతరాజులు పాలించినట్లు చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి. గ్రామంలో నేటికీ ఆలయాలు, కోటగోడలు, శాసనాలే ఇందుకు నిదర్శనం. కాగా నాటి జైనమత ప్రచారకుల్లో కొందరు సన్యాసులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. వారి ప్రభావం వల్ల జైనమత తీర్థంకరుల్లో 24వ వాడైన వర్ధమాన మహావీరుడి పేరు మీద ఈ గ్రామానికి వర్ధమానపురం అనే పేరు వచ్చింది. గ్రామం వెలుపల నంది విగ్రహం ఉండడంతో నందివర్ధమానపురంగా పేరొందింది. ఇది కాల క్రమేనా నందివడ్డెమాన్గా మారింది. గ్రామం చుట్టూ ఎటు చూసినా ఆలయాలే దర్శనమిస్తాయి. ఇందులో ప్రధానంగా కాళిమాత, శివగౌరమ్మ, త్రిమూర్తులు, వీరభద్రస్వామి, నందీశ్వర, శనేశ్వరుడు, చెన్నకేశవస్వామి తదితర ఆలయాలు ఉన్నాయి. మహిళలు సైతం పూజలు చేయొచ్చు.. -
కనులపండువగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం
మల్దకల్: మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి గోవిందమాంబల కల్యాణోత్సవం ఆదివారం వేదపండితులు కుమారస్వామి, శివకుమార్ మంత్రోచ్ఛరణల మధ్య కనులపండువగా సాగింది. ముందుగా స్వామి వార్ల ఉత్సవమూర్తులను భాజాభజంత్రీలతో ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితులు కల్యాణం నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు, గద్వాల పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్అచారి, సంఘం నాయకులు బ్రహ్మయ్యచారి, ప్రభాకరచారి ముఖ్యలతిథులుగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు మల్దకల్తో పాటు గట్టు, అయిజ, గద్వాల పట్టణాలకు చెందిన విశ్వబ్రాహ్మణులు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకాగా.. ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు బ్రహ్మయ్య, మహేష్, బీష్మాచారి, వినోద్, రంగప్పచారి, శ్రీనివాసులు, కాలప్పచారి, నర్సింహచారి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
కులగణనతోనే ఆ వర్గాలకు న్యాయం
అయిజ: కులగణన చేస్తేనే వెనుకబడిన జాతులకు మేలు కలుగుతుందని మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్తో కలిసి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్గాంధీ పాదయాత్ర చేశారని, ఆ సమయంలో ప్రజల ఆలోచన విధానాన్ని, సంక్షేమంలో ప్రజలు వెనుకబడిన విధానాన్ని గుర్తించారని అన్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ కడప తొక్కని వెనకబడిన జాతులు చాలా ఉన్నాయని, కులగణన వెనుకబడిన కులాల, జాతుల అభ్యున్నతికి దోహదపడుతుందని, రాహుల్ గాంధీ ఇదే విషయం చెప్పారని అన్నారు. ఇప్పటి వరకు ఎవ్వరూ కుల గణన సర్వే చేయలేదని, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు సర్వే చేసింది కానీ వివరాలు బయటపెట్టలేదని అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనను రేవంత్రెడ్డి అమలు చేశారని, రాష్ట్రంలో చేసిన కుల గణన దేశానికి ఆదర్శం అయ్యిందని అన్నారు. దాని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కుల గణన చేసేందుకు ముందుకొచ్చిందని అన్నారు. తైబజార్ వేలం రద్దు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మాట్లాడుతూ.. అయిజ మున్సిపాలిటీలో ఇటీవల నిర్వహించిన తైబజార్ వేలం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తైబజార్ను నిర్వహించిన వారు నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. కౌన్సిలర్లు తీర్మానం చేయకుండా తైబజార్ వేలాన్ని ఎలా నిర్వహిస్తారని అన్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో తైబజార్ను నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని తొత్తినోనిదొడ్డిలో నూతనంగా నిర్మించిన గంగమ్మ గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పొగాకు రైతు అయోమయం
● కొనుగోళ్లు చేపట్టకుండానిండా ముంచుతున్న కంపెనీలు ● రేపు, మాపు అంటూ కాలయాపన ● అకాల వర్షాలతో తప్పని ఇబ్బందులు ●8 ఎకరాల్లో సాగు చేశా దాదాపు 8 ఎకరాల్లో పొగాకు పంట సాగుచేశాను. ముందుగానే ధర రూ.15500 నిర్ణయించారు. సిగరేట్ పొగాకు లాభసాటిగా ఉంటుందని సాగుచేశా. తీరా పంట వేశాక ఇబ్బందులు తప్పడం లేదు. అకాల వర్షాలు ఓ వైపు.. పంట కొనుగోలు చేయకుండా కంపెనీల యాజమాన్యాలు మరోవైపు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం చొరవ చూపి పంట కొనుగోలు చేసేలా చూడాలి. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే మాకు శరణ్యం. – బజారన్న, పొగాకు రైతు, మానవపాడు పంట నల్లగా మారుతోంది.. అకాల వర్షాలతో పొగాకు పంట నల్లగా మారుతోంది. దీంతో విక్రయించే సమయంలో వ్యాపారులు ధర చాలా తక్కువ చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి అప్పులు చేసి పంటలు పండించిన రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసేలా ఆయా కంపెనీల యాజమాన్యాలకు సూచించాలి. – మహేష్బాబు, పొగాకు రైతు, మానవపాడు మానవపాడు: ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే.. తీరా కొనుగోలు చేసే సమయంలో కంపెనీలు తాత్సారం చేస్తుండడంతో పొగాకు రైతు అయోమయంలో పడ్డాడు. రోజులు కాదు.. నెలల తరబడి రేపు, ఎళ్లుండి కొంటాం అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎన్నో ఆశలతో సాగుచేసిన పోగాకు పంట రైతుల ఆశలను నీరు గారుస్తోంది. పొగాకు సాగుకు ముందే కొన్ని కంపెనీలు తాము కొనుగోలు చేస్తాం.. మీరు పండించండి అని రైతులతో కాంట్రాక్ట్ చేసుకుంటారు. తీరా పంట చేతికి అందిన తర్వాత ఇలా తాత్సారం చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను సాగుచేసే ముందు రైతులు ఐటీసీ, జీపీఐ, అలయన్స్, వీఎస్టీ తదితర కంపెనీలతో కాంట్రాక్టు చేసుకొన్నారు. క్వింటా పొగాకు ధర రూ.15,500 నిర్ణయించారు. నిర్ణయించిన రేట్లు చెల్లించి పొగాకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు పంట సాగు చేశారు. దిగుబడి కుడా రైతులకు అశించిన స్థాయిలో వచ్చింది. సిగరెట్, బీడీ రకం పొగాకు డిసెంబర్లో పంట కోసి దోర్నాలు కట్టారు. ఒక్కోసారి పొగాకు దోర్నాలు మండెకు తిప్పేందుకు దాదాపు రూ.3వేల ఖర్చు వస్తోంది. నేటి వరకు ఖర్చు వేలలో అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలయాపన ఐటీసీ, జీపీఐ, అలయన్స్, వీఎస్టీ కంపెనీలు పొగాకు కొనుగోలు చేస్తాం అని చెప్పి.. ఇప్పుడేమో నేడు.. రేపు అంటూ కంపెనీల చుట్టూ తిప్పుకుంటున్నారు. తమ నుంచి తక్కువ ధరకు పొగాకు కొనుగోలు చేసే దిశగా కంపెనీలు మోసం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు పొగాకు నల్లగా మారిందని వ్యాపారులు తక్కువ ధరకు నిర్ణయిస్తున్నారని, క్వింటాకు రూ.10వేల నుంచి రూ.13వేల వరకు కొనుగోలు చేస్తున్నారని వాపోతున్నారు. కలెక్టర్ ఆదేశించినా.. జిల్లాలో మానవపాడు, ఉండవెల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి, అలంపూర్ తదితర మండలాల్లో పొగాకును వందల ఎకరాల్లో సాగుచేశారు. నేరుగా కలెక్టర్ కలగజేసుకొని.. రైతుల నుంచి పోగాకు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా కంపెనీల యాజమాన్యాలు, వ్యాపారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికితోడు అకాల వర్షాలు పొగాకు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వర్షానికి తడిస్తే నల్లగా మారే ప్రమాదం ఉందని వాపోతున్నారు. దీంతో వ్యాపారులు క్వింటాపై రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు తక్కువ ఇస్తున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
గద్వాల: నీట్ పరీక్షకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ పరీక్షకు మొత్తం 1029మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరికి గద్వాలపట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్న పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులను ఉదయం 11గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 1:30గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్లు, ఆ తర్వాత వచ్చే అభ్యర్థులను అనుమతించబడదని పేర్కొన్నారు. అలాగే, కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ వాచ్లు, బ్లూటూత్ వంటి పరికరాలు తీసుకువచ్చేందుకు అనుమతి లేదని, తప్పనిసరిగా అడ్మిట్కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకురావాలని తెలిపారు. దివ్యాంగ అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని, పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తుతో పాటు, సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు 9100901606 సంప్రదించవచ్చని తెలిపారు. పటిష్ట బందోబస్తు గద్వాల క్రైం: జిల్లాలో ఆదివారం నిర్వహించే నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నీట్ పరీక్ష సందర్భంగా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, వివిధ ప్రాంతాల్లోంచి వచ్చే అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఏదేని గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్, జిరాక్స్ షాపులు మూసి వేయాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా గుంపులుగా కనిపించినా చర్యలు తప్పవన్నారు. అభ్యర్థులు కేంద్రాలకు సమయాని కంటే ముందుగా చేరుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు మొగిలయ్య, నరేందర్రావు, సిబ్బంది కళ్యాణ్కుమార్, మల్లేష్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 1,029 మంది అభ్యర్థులు -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
అయిజ: మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు హెచ్చరించారు. శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తైబజార్ వేలం నిర్వహణ నిబంధనల మేరకు లేకపోవడంతో దాన్ని రద్దుచేసి కొత్తగా వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వార్డు ఆఫీసర్లు ప్రతి ఒక్కరూ వారి వార్డుల్లో పూర్తి వివరాలు తెలుసుకోవాలని, ఎప్పడు అడిగినాసరే పూర్తి సమాచారం ఇవ్వాలని అన్నారు. మృతిచెందిన వారికి అనేక నెలలుగా పించన్లు బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయని, వారి వివరాలు సేకరించి రికవరీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసి భూగ్భ జలాలను పెంచాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా త్వరలో విడుదల అవుతుందని, అనర్హులను గుర్తించి వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుందని అన్నారు. ఎల్ఆర్ఎస్ నిరంతర ప్రక్రియ అని, కమర్షియల్ టాక్స్ చెల్లించని వారికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మండలంలోని ఉప్పల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం నాణ్యత, గోడౌన్ సదుపాయాలు, రైతులకు జారీచేసే రసీదులు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పొరపాట్లకు తావు లేకుండా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. మల్దకల్: విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు హెచ్చరించారు. మల్దకల్ ఎంపీడీఓ కార్యాలయన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేయగా.. కొందరు విధులకు హాజరుకాలేదు. సమయపాలన పాటించి ప్రతి ఒక్కరు విధులకు సక్రమంగా హాజరుకావాలని ఆదేశించారు. నర్సరీలలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను పెంచి సంరక్షించాలని అన్నారు. -
జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్
గద్వాల క్రైం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలతను శనివారం కలెక్టర్ సంతోష్కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ, భూ సంబంధ, ఇతరరాత్ర కేసుల పరిష్కారంలో సలహాలు, సూచనలు న్యాయమూర్తిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తికి కలెక్టర్ పూల మొక్కను అందజేశారు. రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు ఇటిక్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంపై ఈ నెల 5వ తేదీ నుంచి 16వ తేది వరకు మండలంలోని అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ భద్రప్ప శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5న గోపల్దిన్నే, 6న వావిలాల, 7న పెద్దదిన్నె, 8న సాతర్ల , 9న ఎం.ఆర్ చెర్వు, 11న షాబాద్, 13న మునుగాల, 16న ఉదండాపురంలో సదస్సులు నిర్వహించి అక్కడే ప్రజల నుంచి భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల వెల్లువ అయిజ: లే అవుట్ క్రమబద్ధీకరణ పథకంలో (ఎల్ఆర్ఎస్)లో ముందస్తు ఫీజు చెల్లించిన వారికి 25శాతం ప్రభుత్వం రాయితీ కల్పించడంతో మున్సిపాలిటీకి దరఖాస్తుదారులు క్యూ కట్టారు. రాయితీ పొందేందుకు శనివారం చివరి తేదీ కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొదట ఫీజు చెల్లిస్తే ఏ సమయంలో అయినా ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చనే ఉద్దేశంతో చివరిరోజు వందకుపైగా ఫీజు చెల్లించారు. వేరుశనగ క్వింటా రూ.6,169 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శనివారం 218 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6169, కనిష్టం రూ. 2700, సరాసరి రూ. 5969 ధరలు పలికాయి. అలాగే, 60 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ.5839, కనిష్టం రూ. 5209, సరాసరి రూ. 5759 ధరలు పలికాయి. 1980 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2026, కనిష్టం రూ. 1701, సరాసరి రూ.1729 ధరలు లభించాయి. -
రేపటి నుంచి డిగ్రీ కళాశాలలు బంద్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలను సోమవారం నుంచి బంద్ చేస్తున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో వైస్చాన్స్లర్తో జరిగిన సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని, దీంతో కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. దీనికి తోడు పీయూ అధికారులు సైతం కళాశాలల అఫ్లియేషన్స్, ర్యాటిఫికేషన్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చే వరకు సమయం ఇవ్వాలన్నా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఈ నెల 6న జరిగే డిగ్రీ పరీక్షలను సైతం నిర్వహించడం లేదని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జహీర్అక్తర్, ఫణిప్రసాద్, సత్యనారాయణగౌడ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
మానవపాడు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని పీడీ కాశీనాథ్ సూచించారు. శనివారం మండలంలోని నమూనా ఇంటి నిర్మాణాన్ని, ఇందిరమ్మ ఫైలెట్ నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఫైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో కొంతమందికి ఇళ్లు మంజూరు చేశామని, మిగిలిన ఇళ్ల నిర్మాణాలను ఎంపిక చేసేందుకు అలాట్మెంట్ జాబితా తయారు చేశామన్నారు. లబ్ధిదారుల్లో ఎటువంటి పొరపాట్లు లేకుండా వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత పేదవారికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. చంద్రశేఖర్నగర్లో లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణాలను త్వరగా చేపట్టేలా.. నాణ్యతతో నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ నరేంద తదితరులు పాల్గొన్నారు. -
మందెయ్.. చిందెయ్
చీకటి పడితే చాలు రెచ్చిపోతున్న మందుబాబులు అనధికార సిట్టింగులు.. తరచూ గొడవలు పట్టణంలోని కొత్తబస్టాండు ప్రాంతంలో వైన్షాపుల వద్ద మందుబాబులు లిక్కర్ కొనుగోలు చేసి పక్కనే అనధికారికంగా సిట్టింగ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రధానంగా బస్టాండ్ ఉండడం, మెయిన్బజార్లో అన్ని రకాల వ్యాపార సముదాయాలు ఉండడంతో సామాన్య ప్రజలు వివిధ అవసరాల దృష్ట్యా రాకపోకలు సాగిస్తారు. అయితే మందుతాగిన మందుబాబులు ఫుల్గా మందేసి ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తుంటారు. మద్యం మత్తుతలో రోడ్లపై వెళ్లే సామాన్యుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనలు అనేకం ఉన్నాయి. గత నెల కొత్తబస్టాండు వద్ద బైక్పై వెళ్తున్న భార్యభర్తల పట్ల అనుచితంగా వ్యవహరించి వారికి ఇబ్బందులు కలిగించారు. కొందరు సర్దిచెప్పినా వినకపోవడం పోలీసు జోక్యంతో సదరు భార్యభర్తలు మందుబాబుల బారినుంచి బయటపడ్డారు. ● అంబేడ్కర్ చౌరస్తాలో ఉన్న ఓ బార్ షాపులో మద్యం మత్తులో యువకులు ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వెళ్లి అల్లరి చేశారు. దీనిపై ప్రశ్నించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్పై అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన అప్పట్లో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇవి మచ్చుకు కొన్ని ఘటనలు మాత్రమే. ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గద్వాల/గద్వాలక్రైం: జిల్లా కేంద్రంలో మందుబాబుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు మద్యం తాగి ఆ మత్తులోనే రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టిస్తుండడం పరిపాటిగా మారింది. నిబంధనల ప్రకారం వైన్షాపు వద్ద ఉన్న పర్మిట్ రూంలలోనే మద్యం తాగాల్సి ఉన్నా.. వైన్షాపుల ఎదుట రోడ్లపైకి వచ్చి బహిరంగంగా మద్యం తాగుతున్నారు. గద్వాల పట్టణంలో మొత్తం 8 వైన్ షాపులు, మూడు బార్ షాపులున్నాయి. వీటిల్లో రోజుకు రూ.32లక్షల లిక్కర్ తాగేస్తున్నారంటే లిక్కర్కు ఉన్న ప్రాధాన్యత స్పష్టం అవుతుంది. అయితే పట్టణంలో కొన్ని ప్రధాన కూడళ్లల్లో ఉన్న వైన్షాపుల వద్ద అనధికారికంగా సిట్టింగ్లు వేస్తూ మందుబాబులు మందేసి అక్కడే చిందెస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. దీంతో ఆ వైపుగా వెళ్లేందుకు మహిళలు, విద్యార్థినులు జంకుతున్నారు. ● జిల్లా కేంద్రంలో వైన్షాపుల వద్దనే అనధికార సిట్టింగులు.. ● అటు వైపుగా వెళ్లేందుకు సైతం జంకుతున్న మహిళలు, విద్యార్థినులు ● రోజుకు రూ.32లక్షల మద్యం అమ్మకాలు వాస్తవానికి గద్వాల పట్టణంలో 8 వైన్ షాపులు, వాటిలో పర్మిట్ రూంలకు అనుమతి ఇచ్చారు. మద్యం కొనుగోలు చేసిన వారు పర్మిట్ రూంలో నిల్చొని మద్యం సేవించి వెళ్లిపోవాలి. కానీ వైన్షాపులలో లిక్కర్ కొనుగోలు చేసిన మందుబాబులు పర్మిట్ రూంలలో దర్జాగా సిట్టింగ్ వేసి అనుమతి లేకుండా చికెన్, మటన్, గుడ్లు, చేపలు వంటి మాంసం పదార్థాలు తింటున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ఎకై ్సజ్శాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. అధికారులు ఏం చేస్తున్నారు -
అధికారుల అవగాహన లోపం..
తెలంగాణ ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి నెట్టెంపాడు ఎతిపోతల పథకం ద్వారా కృష్ణానది నీటిని మొదట ర్యాలంపాడు రిజర్వాయర్లో నింపుతారు. అక్కడి నుంచి తాటికుంట, ముచ్చోనిపల్లి, నాగర్దొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నింపుతున్నారు. అధికారుల అవగాహన లోపం వలన రైతులకు నీటి అవసరం లేకున్నా గేట్లు మూయకపోవడంతో భవిష్యత్తులో ఉపయోగపడాల్సిన నీరు వృథాగా వాగులు, వంకల పాలవుతోంది. అధికారులు నీటి వృథాను అరికట్టాలి. – మేకల నాగరెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు, అయిజ పంట కాల్వలు నిర్మించాలి రిజర్వాయర్ పూర్తయ్యి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పంట పొలాల్లో పంట కాలువలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు పంట పొలాలకు సాగునీరందించేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. పెద్ద కాల్వ నుంచి పంట పొలంలోకి నీరు తెచ్చే క్రమంలో నీరు వృథాగా పోతుంది. దీంతో పక్క పొలం రైతులకు నష్టం జరుగుతుంది. అధికారులు స్పందించి పంట కాల్వ పనులు సకాలంలో పూర్తిచేయాలి. – గోవిందు, రైతు, అయిజ నీటి వృథా అరికడతాం.. నీటిని విడుదల చేసే సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంది. దానిలన నీటివిడుదల విషయంలో అంత ఖచ్చితంగా పనులు నిర్వర్తించలేకపోతున్నారు. రైతులు వచ్చి షెట్టర్లు పైకి ఎత్తి ఎక్కువ మొత్తంలో నీరు విడుదల చేసుకపోతుంటారు. దాన్ని అరికట్టేందుకు సిబ్బంది తక్కువగా ఉండడంతో ఇలా జరుగుతుంది. వెంటనే నీటి వృథాను అరికడతాం. – రాంబాబు, ఏఈఈ ● -
వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి
మల్దకల్: రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఏడీఎ సంగీతలక్ష్మి అన్నారు. శుక్రవారం మల్దకల్ రైతు వేదికలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ వీసీ ద్వారా రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు నేరుగా రైతులతో మాట్లాడారు. ఆధార్తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకి 11 నెంబర్లలో విశిష్ట సంఖ్యని కేటాయించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పంటల సాగు విధానంపై రైతులకు అవగహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓలు రాజశేఖర్, శ్రీలత, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
అలంపూర్: కార్మికులు కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్తేజ అన్నారు. శుక్రవారం అలంపూర్లోని జూనియర్ సివిల్ కోర్టులో మండల న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జడ్జి మిథున్ తేజ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మేడేను పురస్కరించుకొని కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. కార్మికుల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఆ చట్టాలతో తమను తాము రక్షించుకోవచ్చని, చట్టాలతో న్యాయం పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్మికులకు ఉన్న హక్కులు, చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, ఏజీపీ మధు, సీనియర్ న్యాయవాదులు నారయణ రెడ్డి, ఈదుర్ బాష, యాకోబ్, ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
భూసమస్యలు పరిష్కరించాలి
గద్వాల: భూభారతి చట్టం అమలుకు ఈనెల 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇటిక్యాల మండలాన్ని ఎంపిక చేసినట్లు ఇందుకు సంబంధించి మండలంలోని భూసమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి చట్టం అమలులో భాగంగా జిల్లాలో ఇటిక్యాల మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు మండలంలో ఈనెల 5వ తేదీన గోపాల్దిన్నె, 6న వావిలాల, 7న పెద్దదిన్నె, 8న సాతర్ల, 9న ఎం.ఆర్.చెర్వు, 12న షాబాద్, 13న ఇటిక్యాల, 14న చాగాపురం 15న మునగాల, 16న ఉదండాపురం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను ప్రతిరోజు ఆన్లైన్లో నమోదు చేసి రోజువారిగా వాటిని నవీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శుల సహకారంతో కార్యక్రమంపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ వీరభద్రప్ప, నరేష్, డీటీలు నందిని పాల్గొన్నారు. విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపిఎస్సి ద్వారా ఎంపికై న 10 మంది హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్స్ను కలెక్టర్ సంతోష్ ఐడిఓసీ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నియమితులైన ఉద్యోగులకు అభినందనలు తెలుపుతూ వారు తమ హాస్టల్స్లో విద్యార్ధుల సంక్షేమానికి కృషి చేయాలని విద్యార్ధుల భద్రత, ఆహారం, వసతి మొదలైన వాటిపై శ్రద్ద పెట్టాలని సూచించారు. నియామక పత్రాలు అందుకున్న వారికి వివిధ ప్రాంతాల్లోని హాస్టల్స్లో బాధ్యతలు అప్పగించబడ్డాయని తెలిపారు. అలంపూర్ సురేష్గౌడ్, మల్దకల్ బస్వరాజ్, గట్టు రమేష్, గద్వాల ఆంజనేయులు, రామ్గోపాల్, మానవపాడు జయరాం, రాజోలి శేషన్న, ఉండవల్లి నరేష్ను నియమించారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి సరోజమ్మ ఉన్నారు. విద్యార్థికి అభినందనలు పదో తరగతి పరీక్షల్లో 566 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధిని అక్షయ శుక్రవారం కలెక్టర్ సంతోష్ను కలవగా.. ఆమెను అభినందించారు. కలెక్టర్ బీఎం సంతోష్ ‘భూభారతి’ పైలెట్ మండలంగా ఇటిక్యాల ఎంపిక -
ఏళ్లుగా.. అచేతనంగా!
చేనేత పార్కు ఏర్పాటుపై ముందడుగు పడని వైనం ●పార్కు ఏర్పాటు చేయాలి చేనేత పార్కును త్వరగా ఏర్పాటు చేయాలి. దీనిద్వారా ప్రతేక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా పార్కుకు కేటాయించిన స్థలంలో కొందరు మట్టిని అక్రమంగా తరలిస్తూ స్థలాన్ని నాశనం చేస్తున్నారు. స్థలాన్ని కాపాడి రక్షణ చర్యలు చేపట్టాలి. – రాంలింగేశ్వర్కామ్లీ, గద్వాల చేనేత క్లస్టర్ చైర్మన్ నివేదిక పంపించాం పార్కుకు కేటాయించిన స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం రూ.2.40కోట్లతో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ఇంజినీరింగ్ అధికారుల ద్వారా చేపడుతాం. అదేవిధంగా రూ.50లక్షలలో రూ.8.50లక్షలు ఏపీఐసీసీ వాళ్లు దిమ్మెల ఏర్పాటు, సెక్యూరిటీ గార్డు ఏర్పాటుకు వెచ్చించారు. రెవెన్యూ శాఖ వారు ఫొటోగ్రఫి సర్వే చేయగా ఇందుకు రూ.2.50లక్షలు ఖర్చు చేశారు. ఈనిధులను రాష్ట్ర ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు ఖర్చు చేయడం జరిగింది. మట్టిదందాపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాం. కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తే పూర్తిస్థాయిలో రక్షణ కల్పించవచ్చు. – గోవిందప్ప, ఏడీ చేనేత శాఖగద్వాల ● నిధులున్నా పట్టించుకోని అధికారులు ● రూ.11లక్షలు ఖర్చు చేసినట్లు అధికారుల కాకిలెక్కలు ● మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తున్న పార్కుకు కేటాయించిన స్థలం -
నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం
గద్వాల: ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం గద్వాల పట్టణ శివారులో నిర్మిస్తున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా అధికారులు, కాంట్రాక్టర్తో పనుల తీరుతెన్నులపై అడిగి తెలుసుకున్నారు. కళాశాల వసతులకు అనుగుణంగా జీ ప్లస్ వన్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. విద్యార్థులకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిర్మాణం పనులకు సంబంధించిన మ్యాప్ ద్వారా పనుల వివరాలను అఽడిగి తెలుసుకున్నారు. పనులలో నాణ్యతాప్రమాణాలు పాటించాలని, అదేవిధంగా నిర్దిష్ట కాలపరిమితిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నర్సింగ్ కాలేజీ హనుమంతమ్మ, డీఈ శ్రీనివాసులు, ఏఈ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతోనే ఆరోగ్యం పదిలం
గద్వాలటౌన్: ఆటలు ఆడటం ద్వారానే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని అడిషనల్ కలెక్టర్ లక్ష్మినారాయణ అన్నారు. గురువారం స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి వాలీబాల్, తాయిక్వాండో కరాటే, ఖోఖో, అథ్లెటిక్స్, కబడ్డీ, క్రికెట్ క్రీడా శిక్షణా శిబిరాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. చిన్నప్పటి నుంచి ఆటల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. క్రీడలతో దేహ దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఆరోగ్యకరమైన జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. నైపుణ్యం గల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు. మీతోపాటు మీ ఇంటి దగ్గర ఉండే మీ స్నేహితులను వేసవి శిక్షణ శిబిరానికికి తీసుకురావాలని సూచించారు. ఈ శిబిరం వేసవికే పరిమితం కాకుండా ఏడాది పొడువున నిరంతరం క్రీడలు ఆడేవిధంగా కొనసాగాలని కోరారు. డీవైఎస్ఓ అధికారి జితేందర్ మాట్లాడుతూ గద్వాలలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవ లేదని, వారిని ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సెలవుల్లో క్రీడలు ఆడుతూ ఆనందంగా గడపాలని సూచించారు. ఉదయం, సాయంత్రం సాగే వేసవి శిక్షణా శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అవసరమైన దగ్గర శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. చిన్నారుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో వేసవిలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. విద్యార్థులు వినియోగించుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఆయా విభాగాల క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్, నగేష్బాబు, సతీష్, నర్సింహారాజు, కరాటే మాస్టర్ శ్రీహరిలతో పాటు ఆయా క్రీడల శిక్షకులు చందు, రవి, తిరుపతి, రజనికాంత్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి మాఫియాకు కాసుల వర్షం
ఇదిలా ఉంటే మరోవైపు చేనేత పార్కుకు కేటాయించిన స్థలంలో చాలా ప్రాంతం గుట్టలుగా ఉంది. ఈ గుట్టలు మట్టిమాఫియాకు వరంగా మారాయి. నిత్యం వందల లారీలలో మట్టిని అక్రమంగా తవ్వుతూ డబ్బులు వెనకేసుకుంటున్నారు. ఇందులో అధికార పార్టీకి చెందిన నాయకుల అనుచరులే మట్టిమాఫియా అవతారం ఎత్తిసొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇందులో రెవెనూ, మైనింగ్, పోలీసుశాఖలోని కొందరు అవినీతి అధికారులను మచ్చిక చేసుకుని అక్రమంగా మట్టిదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చేనేత పార్కు స్థలంలో యథేచ్ఛగా కొనసాగుతున్న మట్టిదందా -
అవాంతరాలు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు
గద్వాల: ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని రకాల జగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం యాసంగిలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, సివిల్సప్లై డీఎస్ఓ స్వామి, డీఎం విమల, పుష్పమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా.. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలులో అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి నాణ్యతను పరీక్షించి అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అదేవిధంగా ప్రభుత్వ భవనాల్లో రూఫ్ టాఫ్ హార్వెస్టింగ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. పాతబోర్ల రీచార్జింగ్ ద్వారా భూగర్భ జలాలను పెంచుకునే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. సమావేశంలో మిషన్భగీరథ ఇంట్రా ఈఈ శ్రీధర్రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్రావు, వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సంద్య తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలి
శాంతినగర్: పోలీస్ స్టేషన్కు వివిధ సమస్యల గురించి వచ్చే బాధితులకు సత్వరం న్యాయం అందేలా ఆయా స్టేషన్ల సిబ్బంది చూడాలని ఎస్పీ టి.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం శాంతినగర్ పోలీస్స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కార్యాలయంలోని వివిధ రికార్డులను, స్టేషన్ పరిసరాలను, సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. 100 నంబర్కు కాల్ వస్తే వెంటనే స్పందించి అక్కడికి చేరుకోవాలని.. బాధితులకు రక్షణ కల్పించాలన్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు విసృతంగా నిర్వహించి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని, 24/7 గస్తీ నిర్వహించాలన్నారు. తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, మూడనమ్మకా లు, బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో వుంటూ ప్రజా సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదుల్లో ఎలాంటి జాప్యం లేకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. డీఎస్పీ వై.మొగులయ్య, సీఐ టాటా బాబు, ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జూనియర్ సివిల్ జడ్జిగా గట్టు ఆడపడుచు
గట్టు: గట్టు చరిత్రలో తొలిసారిగా ఓ ఆడపడుచు జడ్జిగా ఎంపికయ్యారు. గట్టుకు చెందిన సంఘం స్వర్ణమల్లిక జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. బుధవారం జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో గట్టుకు చెందిన స్వర్ణమల్లిక జడ్జిగా ఎంపికయ్యారు. గట్టుకు చెందిన న్యాయవాది సంఘం సురేష్ కుమార్తెనే స్వర్ణమల్లిక. ఈయన గద్వాల కోర్టులో గత 30 ఏళ్లుగా న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు. స్వర్ణమల్లిక 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గద్వాల సత్యసాయి విద్యామందిర్లో, ఇంటర్ను శ్రీమేధా హైదరాబాద్, డిగ్రీ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎంను ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. న్యాయవాదిగా నమోదు అయిన తర్వాత కొంత కాలం గద్వాల కోర్టులోనూ, ఆ తర్వాత హై కోర్టులో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ వచ్చారు. స్వర్ణమల్లిక సోదరుడు సంతోష్ సైతం న్యాయవాదిగా కొనసాగుతున్నాడు. స్వర్ణమల్లిక జడ్జిగా ఎంపిక కావడంపై గట్టు మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గద్వాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కావలి నర్సింహులు, కార్యదర్శి జయసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు ఖాజామోహినోద్దిన్, మాజీ అధ్యక్షుడు రఘురామిరెడ్డిలతో పాటుగా పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. జడ్జిగా ఎంపికై న తన కూతురు సంఘం స్వర్ణమల్లికతో సంఘం సురేష్ -
పది ఫలితాల్లో కొంత మెరుగు
32 నుంచి 26వ స్థానానికి చేరిన జిల్లా స్థానం ● 91.74 శాతం ఉత్తీర్ణత ● బాలికలదే పైచేయి.. ● బాలికలు 93.96 శాతం, బాలురు 89.49 శాతం ఉత్తీర్ణత గద్వాలటౌన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 26వ స్థానంతో సరిపెట్టుకోవడం తీవ్ర నిరాశ కల్గించింది. గతంతో పోలిస్తే జిల్లా ర్యాంకు, ఉత్తీర్ణత శాతం కొంత మెరుగుపడింది. గత ఏడాది రాష్ట్రస్థాయిలో 32వ స్థానంలో ఉన్న జిల్లా ర్యాంకు ఈ సారి కాస్త పెరిగింది. ఉత్తీర్ణత ఏకంగా పది శాతానికి పైగా పెరిగింది. జిల్లా వ్యాప్తంగా 7,569 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 6,944 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లా సరాసరి ఉత్తీర్ణత 91.74 శాతంగా నమోదైంది. వీరిలో 3,759 మంది బాలురకు గాను 3,364 మంది ఉత్తీర్ణత సాధించి 89.49 శాతంతో సరిపెట్టుకున్నారు. 3,810 మంది బాలికలు పరీక్షలు రాయగా 3,580 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 93.96 శాతంతో బాలుర కంటే కొంత పైచేయి సాధించారు. అక్షరాస్యతలో వెనకంజలో ఉన్న ఈ జిల్లాలో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధించినప్పటికీ సర్దుబాటుతో వాటిని భర్తీ చేయగలిగారు. 61 పాఠశాలలకు ‘వంద’నాలు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది మంచి ఫలితాలు వచ్చాయి. అయితే అందులో 61 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి వంద శాతం ఉత్తీర్ణత రావడం జిల్లాకే గర్వకారణం. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన వాటిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఒకటి, జడ్పీ ఉన్నత పాఠశాలలు 17, రెసిడెన్షియల్ పాఠశాలలు 08, కేజీబీవీలు 05, ప్రైవేటు పాఠశాలలు 30 ఉన్నాయి. మరి కొన్ని పాఠశాలలు ఒకటి, రెండు శాతంతో వందశాతం ఉత్తీర్ణత కోల్పోయాయి. ప్రతిభ చాటిన విద్యార్థులు.. ● గద్వాల విశ్వభారతి హైస్కూల్కు చెందిన విద్యార్థిని అఫ్రానాజ్ 587 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచింది. అయిజ శ్రీకృష్ణవేణి హైస్కూల్కు చెందిన విద్యార్థిని పద్మావతి 585 మార్కులు సాధించి జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో గట్టు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని అక్షయ 576 మార్కులు, కేటీదొడ్డి బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి చరణ్ 574 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. ● జిల్లాలో 962 మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. ●సమష్టి కృషికి నిదర్శనం పదో తరగతి ఫలితాలలో జిల్లా విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఈ సారి 10.36 శాతం ఉత్తీర్ణత మెరుగుపడింది. అందరి సమష్టి కృషి ఫలితంగానే 91 శాతంకు పైగా ఉత్తీర్ణత వచ్చింది. వంద రోజుల ప్రణాళిక, ప్రత్యేక తరగతులను ప్రతి పాఠశాలలో త్రికరణశుద్ధిగా అమలు చేయడంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ఇకపై ఇదే ఒరవడి కొనసాగించి, రాబోవు విద్యా సంవత్సరంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జిల్లా అధికారులకు అభినందనలు. – సంతోష్, కలెక్టర్ సివిల్స్ సాధించడమే లక్ష్యం తల్లిదండ్రులు యూనిస్పాష (యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు), అమ్మ ఆసిమాబేగం, గురువుల ప్రోత్సహంతో మంచి మార్కులు సాధించాను. 587 మార్కులతో జిల్లా టాపర్గా నిలవడం ఆనందంగా ఉంది. ఐఐటీలో సీటు సంపాదించి, సివిల్స్ సాధించడమే నా లక్ష్యం. – అఫ్రానాజ్, విశ్వభారతి హైస్కూల్, గద్వాల జిల్లాలో గతంలో పదో తరగతి ఫలితాలు ఇలా.. డాక్టర్ అవుతా.. ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం, కష్టపడి చదవడంతో 566 మార్కులు సాధించాను. తల్లిదండ్రులు శివశంకర్, లలిత కష్టం వృథా కాకుండా మంచి మార్కులు సాధించా. వైద్యురాలిగా స్థిరపడి పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడమే నా లక్ష్యం. – అక్షయ, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, గద్వాల -
మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి
అలంపూర్: నియోజకవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మున్సిపాలిటీలోని 3 వార్డులో టీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీరోడ్ల నిర్మాణానికి మంగళవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.5 కోట్లతో ఆయా వార్డుల్లో సీసీరోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కాంట్రక్టార్లు పనులు నాణ్యతగా చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్రావు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఇంతియాజ్ అలీ, సర్దార్, శేఖర్రెడ్డి, పెద్ద ముక్తార్, నాగరాజుయాదవ్, రుక్ముద్దీన్, నాగభూషణం, రఘురెడ్డి తదితరులు పాల్గొన్నారు.మహిళా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలిమల్దకల్: మహిళల ఆరోగ్యంపై వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీప్యూటీ డీఎంహెచ్ఓ సంధ్యాకిరణ్మయి అన్నారు. మంగళవారం మల్దకల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు ప్రతినెలా వైద్యపరీక్షలు చేయించుకోవడంతో పాటు పోషకాలు కలిగిన ఆహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెంచడంతో పాటు గ్రామాల్లో 30 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. పీహెచ్సీతో పాటు ఆరోగ్య ఉపకేంద్రాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం పదవీ విరమణ పొందిన రామేశ్వరమ్మను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డా.జయమ్మ, రాజు, సూపర్వైజర్ శ్రీధర్, వెంకటస్వామి, జ్యోతి పాల్గొన్నారు.వేరుశనగ క్వింటాల్ రూ.6,419గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్యార్డుకు మంగళవారం 310 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ. 6,419, కనిష్టంగా రూ. 2,916, సరాసరి రూ. 4,598 ధరలు వచ్చాయి. క్వింటాల్ కందులు రాగా.. రూ. 5,206 ధర పలికింది. 115 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 5,939, కనిష్టంగా రూ. 5,629, సరాసరి రూ. 5,929 ధరలు లభించాయి. 2,369 క్వింటాళ్ల వరి (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 1,920, కనిష్టంగా రూ. 1,700, సరాసరి రూ. 1,901 ధరలు వచ్చాయి.రెండు రోజుల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిమహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బోయపల్లి (డివిజన్ నం.16), హనుమానున్నగర్–న్యూగంజి (డివిజన్ నం.47)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చోట ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. కాగా, ఆయా ప్రాంతాల్లో దరఖాస్తుదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదిలాఉండగా మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలో ఎల్–1 కింద 1,400 ఇళ్లు కేటాయించారు. అయితే సుమారు రెండు వేల మంది నుంచి దరఖాస్తులు అందగా, క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ఇన్చార్జ్ ఎంఈ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే కొత్త చట్టం
అయిజ: రైతులకు ఎదురయ్యే భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం అయిజ తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణి స్థానంలో భూ భారతి చట్టం రూపొందించినట్లు చెప్పారు. మనిషికి ఆధార్ కార్డులాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపు చేస్తారన్నారు. తద్వారా భూ ఆక్రమణలకు అవకాశం ఉండదన్నారు. భూ భారతి చట్టంలో 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉన్నాయని వివరించారు. ధరణి వ్యవస్థలో కేవలం వ్యవసాయ భూములే నమోదు అవుతుండగా.. భూ భారతి వ్యవస్థలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ చట్టంలో అన్ని రకాల అప్లికేషన్లు ఉన్నాయని.. హక్కుల రికార్డుల్లో తప్పులను సవరించుకోవచ్చని అన్నారు. రిజిస్ట్రేషన్ మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుదని పేర్కొన్నారు. 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు సాదాబైనామా ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతుల దరఖాస్తులపై ఆర్డీఓలు విచారించి.. ఆర్హత కలిగిన వారికి పట్టాదారు పాస్పుస్తకాలు జారీ చేస్తారన్నారు. వారసత్వ భూముల మార్పిడికి ముందు కుటుంబ సభ్యులకు నోటీసులు జారీచేసే విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. లైసెన్స్ కలిగిన సర్వేయర్లతో భూ సర్వే చేసి.. మ్యాప్తో సహా పట్టాదారు పాస్పుస్తకాల్లో వివరాలను చేర్చే అవకాశం కల్పించినట్లు చెప్పారు. ధరణి వ్యవస్థలో భూ సమస్యలపై నేరుగా సివిల్ కోర్టుకే వెళ్లాల్సి వచ్చేదని.. ఇప్పుడు భూ భారతి చట్టంలో అధికారుల ఉత్తర్వ్లుపై అసంతృప్తి ఉంటే తహసీల్దార్ నుంచి ఆర్డీఓ, ఆ తర్వాత కలెక్టర్ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. అదే విధంగాభూ వివాదాలను పరిష్కరించేందుకు గాను ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందని తెలిపారు. జిల్లాలోనే అయిజ మండలంలో ఎక్కువ ఎకరాల భూములు ఉన్నాయని.. 6,500 సమస్యలను తహసీల్దార్ పరిష్కరించినట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ జ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడెప్ప, వైస్చైర్మన్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఏఓ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. భూమి హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కలెక్టర్ బీఎం సంతోష్ -
ఆయిల్పాం కష్టాలు తీరేనా?
నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. డిమాండ్ మేర నూనె గింజల ఉత్పత్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయిల్పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ లేకపోవడంతో రైతులు పంటను విక్రయించేందుకు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. 2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతు లు ఆయిల్పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారు లు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతోంది. నారాయణపేట జిల్లాలో 5,907 ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్పాం గెలలను తరలించాల్సి వస్తోంది. ఆశించిన స్థాయిలో దిగుబడి.. ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 29వేల ఎకరాల్లో పంట కోత లు చేపట్టినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో 130 టన్నులు, వనపర్తిలో 600, జోగుళాంబ గద్వాలలో 300, మహబూబ్నగర్లో 260 టన్నుల దిగుబడి రాగా.. నాగర్కర్నూల్ జిల్లాలో ఇప్పడిప్పుడే పంట కోత ప్రారంభమైంది. లాభసాటిగా ధరలు.. గతేడాది ఆయిల్పాం టన్నుకు రూ. 11వేల నుంచి రూ. 14వేల వరకు ధర ఉండేది. ప్రస్తుతం టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 21వేల వరకు ధర పలుకుతోంది. దీంతో ఆయిల్పాం రైతులకు లాభసాటిగా మారింది. ఏడాది పాటు కాపు కాస్తుండటంతో రైతు లు గెలలను విక్రయించేందుకు అవస్థలు పడాల్సి వ స్తోంది. అయితే ప్రతి 30 కి.మీ. ఒక సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలు ఉంటేనే ప్రయోజనం.. పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సాగు ఇలా.. స్థానికంగానే పరిశ్రమ ఏర్పాటుచేయాలి.. ప్రభుత్వం అందించిన రాయితీ ప్రోత్సాహం, అధికారుల సహకారంతో 7 ఎకరాల్లో ఆయిల్పాం సాగుచేశాను. ఇటీవల గెలలను కోసి అశ్వారావుపేటకు తరలించాను. స్థానికంగానే పరిశ్రమ ఉంటే రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్, రైతు, గూడెబల్లూరు, మాగనూర్ మండలం త్వరలో ఇబ్బందులు తీరుతాయి.. ఆయిల్ఫెడ్ జీఎం అందించిన సమాచారం మేరకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి వద్ద 95 ఎకరాల్లో, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లిలో 40 ఎకరాల్లో ఆయిల్పాం పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం చిత్తనూర్ వద్ద 80 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు స్థలం సేకరణలో దాదాపు కొలిక్కి వచ్చింది. మరో కొన్ని నెలల్లో రైతులు స్థానికంగానే పంటను విక్రయించవచ్చు. – సమీనా బేగం, జిల్లా ఆయిల్ఫెడ్ ఇన్చార్జి, నారాయణపేట రైతులను ప్రోత్సహిస్తున్నాం.. జిల్లాలో ప్రస్తుతం 6వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతోంది. మరో 4వేల ఎకరాల్లో సాగుచేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. 10వేల ఎకరాలు పూర్తిచేస్తే మన జిల్లాలోనే పరిశ్రమ ప్రారంభమవుతుంది. ఇటీవల ధర భాగా పెరిగిన పరిస్థితుల్లో రైతులు ఆయిల్పాం సాగుపై దృష్టిసారించాలి. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. – చంద్రశేఖర్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, నారాయణపేట ఉమ్మడి జిల్లాలో పంట కోతలు షురూ గెలల విక్రయానికి అశ్వారావుపేటకు వెళ్లాల్సిందే.. స్థానికంగా ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉంటేనే రైతులకు ప్రయోజనం ఉమ్మడి జిల్లాలో 28,999 ఎకరాల్లో సాగు చిగురిస్తున్న ఆశలు.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయిల్ఫెడ్ కార్పొరేషన్కు చైర్మన్ను నియమించింది. అయితే కొత్త పాలకవర్గం ఆయిల్పాం సాగుకు కొత్త జనసత్వాలు నింపేందుకు చర్యలు తీసుకోవడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల నారాయణపేట జిల్లాలో చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు. -
మల్లమ్మకుంటతోనే మేలు..
తుమ్మిళ్ల లిఫ్ట్ నిర్మాణం వల్ల చాలా వరకు నీటి సమస్య తీరింది. తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడే తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా నీటిని తోడుకునేందుకు అవకాశం ఉంటుంది. నదిలో నీరు లేని సమయంలో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తే వరద ఉన్నప్పుడు రిజర్వాయర్లో నీరు నింపుకోవచ్చు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తేనే మేలు. వేలాది మంది రైతులకు న్యాయం జరుగుతుంది. – వీరన్న, ఆయకట్టు రైతు, తనగల రిజర్వాయర్ రద్దు మంచిది కాదు.. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తే అలంపూర్ నియోజకవర్గంలోని 55 వేల ఎకరాల ఆయకట్టుకు, పదివేల ఎకరాల నాన్ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. అలంపూర్ సస్యశ్యామలమవుతుంది. దీన్ని రద్దు చేయడం వల్ల కేవలం 400 ఎకరాల రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు మంచిది కాదు. నష్టపోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలి. సాటి రైతులు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్, ● -
పకడ్బందీగా భూభారతి చట్టం అమలు
రాజోళి: ప్రభుత్వం రైతుల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బీఎం.సంతోష్ తెలిపారు. మండల కేంద్రం రాజోళిలోని రైతు వేదికలో సోమవారం భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు. గతంలో ఉన్న ధరణి వల్ల పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న మరికొన్ని సమస్యలను పరిష్కరించి, వారికి సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. దీని వల్ల సాదా బైనామాలు, హద్దు పంచాయతీలు, సర్వే ఇబ్బందులు తదిదర అంశాలకు సంబందించిన సమస్యలను పరిష్కరించే విధంగా చట్టం తయారు చేయబడిందని తెలిపారు. మేధావులు, విద్యావంతులు రూపొందించిన ఈ చట్టంలో అప్పీల్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యం ఉందని, తహసీల్దార్ ఉత్తర్వులపై ఆర్డీఓ, కలెక్టర్ వద్దకు వెళ్లి అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించబడిందన్నారు. వారసత్వ భూమి మార్పిడిలో సర్వేయర్ ఇచ్చే కమతం నక్షను జత చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయని, అలాంటి అంశాలను ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందని తెలిపారు. భూముల విరాసత్ సమయంలో కుటుంబ సభ్యులు అందరికీ నోటీసులు అందించి, రిజిష్ట్రేషన్ సమయంలో ఆటంకాలు తలెత్తకుండా చూసే విధంగా చర్యలుంటాయన్నారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ భూ బారతి చట్టం ద్వారా రైతులు తమకు ఉన్న సమస్యలను స్థానిక అధికారుల దగ్గరకు తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ దొడ్డెప్ప,వైస్ చైర్మన్ కుమార్,తహసీల్దార్ పి.రామ్మోహన్,ఎంపీడీఓ ఖాజా మెయినుద్దీన్,వ్యవసాయ అధికారి సురేఖ ఆయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. పాత సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం కలెక్టర్ బీఎం.సంతోష్ -
రైతులకు అండగా ఉంటాం
ధరూరు: యాసంగిలో వరి ధాన్యం పండించి కొనుగోలు సెంటర్కు తీసుకువచ్చిన ప్రతి రైతుకు అండగా ఉంటామని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బండ్ల కష్ణమోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని ఐకేపీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్ను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుకున్నారు. గన్నీ బ్యాగుల కొరత కారణంగా వారాల తరబడిగా ధాన్యం తీసుకువచ్చి ఇబ్బంది పడుతున్నామని రైతులు వివరించగా.. ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే గన్నీ బ్యాగులు పంపించి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. ఆదివారం కురిసిన వానకు కొంత వరకు ధాన్యం తడిసిందని, బ్యాగులు త్వరగా అందిస్తే తమకు ఇబ్బంది ఉండదని రైతులు వాపోయారు. అకాల వర్షంతో మండలంలో మామిడి తోటలు, మునగ ఇతర పంటలు సాగు చేసిన రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.25 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోందని, ఇంకా ఎక్కడెక్కడ రైతులు నష్టపోయారో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాలన్నారు. అకాల వర్షాలు, ఉరుముల కారణంగా మూగ జీవాలు మృతిచెందాయని, ఈ విషయాన్ని సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రాజశేఖర్, రామకృష్ణ నాయుడు, శ్రీనివాస్రెడ్డి, రాములు, ఉరుకుందు, ఏకేపీ ఏపీఎం శోభారాణి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
మానవపాడు: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ బాలాజీరెడ్డి సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులు, ల్యాబ్, పీహెచ్సీ పరిసరాలను పరిశీలించారు. ప్రతిరోజు ఆస్పత్రికి వచ్చే జ్వర పీడితుల వివరాలను తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలని సూచించారు. ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ సిద్దప్ప, పీఎచ్సీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసన్నరాణి, డాక్టర్ హేమామనస, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణికి 25 ఫిర్యాదులు
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆర్డీఓ శ్రీనివాస్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై మంది 25 ఫిర్యాదులు వచ్చిన్నట్లు తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించడం జరిగిందని వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో నరెందర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మేడేను జయపద్రం చేయండి గద్వాల: మేడే 1వ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జయపద్రం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అమెరికాలోని చికాగో నగరంలో 1886లో మే 1వ తేదీని పనిగంటల కోసం కార్మికులు చేపట్టిన సమ్మె సందర్భంగా ఆనాటి పాలకుల ఆదేశాలతో చికాగో నగరంలో హే మార్కెట్లో కార్మికులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు కార్మికులు మరణించినట్లు, అనేక మంది కార్మికులు రక్తం చిందించినట్లు తెలిపారు. ఫలితంగా 1989లో మే1వ తేదీని కార్మిక వర్గం దీక్షా దినంగా పాటిస్తూ ఉన్నారన్నారు. మే 1వ తేదీన ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మికులు అడ్డాల వద్ద కార్మిక జెండాలు ఎగురవేసి దీక్షా దినంగా జరుపుకోవాలని కోరారు. మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు గద్వాల: నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం కింద గద్వాల జిల్లాలో కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేసేందుకు దరఖాస్తు కోరుతున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకనటలో తెలిపారు. ఈప్రోగ్రాం కింద బస్తి దవాఖానాలలో మూడు ఖాళీ మెడికల్ ఆఫీసర్లు పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు వారి దరఖాస్తులను పూర్తి చేసి మే 3వ తేదీ సాయంత్రం 5గంటల వరకు డీఎంహెచ్వో ఆఫీసులో అందజేయాలని, పూర్తి వివరాలకు https/gadwal.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. డీసీసీబీ రుణ లక్ష్యం రూ.600 కోట్లు ఉప్పునుంతల: ఈ ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ ద్వారా రూ.600 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పీఏసీఎస్లో చైర్మన్ సత్తు భూపాల్రావుతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంఘ సభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందజేసి రైతులకు పంట, ఇతర రుణాలు అందించేలా చూడాలని సూచించారు. అలాగే స్థానిక పీఏసీఎస్లో సాఫ్ట్వేర్ సమస్యలతో ఓటీఎస్ ద్వారా రైతుల నుంచి కొంత అధికంగా రుణ బకాయిలు వసూలు చేశామని.. జరిగిన పొరపాటును సరిచూసుకున్న వెంటనే వసూలు చేసిన ఎక్కువ డబ్బులను మార్చిలోనే తిరిగి వారి సొంత ఖాతాలో జమ చేశామని, ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని వివరించారు. నాబార్డ్, టెస్కాబ్ రుణాలు పొందాలంటే రుణ రికవరీ శాతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం డీసీసీబీకి రూ.21 కోట్లు నష్టం వాటిల్లినా.. ఓటీఎస్ ద్వారా మొండి బకాయిలు వసూలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 78 సహకార పరపతి సంఘాల్లో 39 సంఘాలు మాత్రమే 50 శాతం మేర రుణాలను రికవరీ చేసేవని.. ఓటీఎస్తో మరో 16 సంఘాలు రుణ రికవరీ శాతం 50 శాతం దాటిందని వివరించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తం, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్స్ అందజేస్తున్నాం. 25 శాతం రాయితీ గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ ప్రక్రియపై ఎలాంటి సందేహాలున్నా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే దరఖాస్తుదారులకు లెటర్లు పంపించడం, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. – యాదయ్య, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట ● -
ఆలస్యం.. అలసత్వం!
నేటికీ ప్రారంభం కాని జొన్న కొనుగోళ్లురాజోళి: అసలే జొన్న కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించగా.. దీనికితోడు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో జిల్లాలో జొన్న సాగు చేసిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాసంగి సీజన్లో సాగు చేసిన జొన్నలను కొనుగోలు చేసేందుకు ఈ నెల 24న ఒక కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా మిగతా చోట్ల సైతం మరో మూడు కేంద్రాలు ప్రారంభించిన అనంతరమే జొన్న కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతుండడంతో రైతులు పెదవి విరుస్తున్నారు. అకాల వర్షాలతో పంటను కాపాడుకోవడం కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఏసీఎస్ల ఆధ్వర్యంలో... జిల్లాలో 2532 మంది రైతులు 5300 ఎకరాల్లో జొన్న సాగు చేశారు. యాసంగిలో పండించిన జొన్నలకు కొనేందుకు ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 14శాతం తేమ శాతం ఉంటే క్వింటాకు రూ.3371 అందించనుంది. ఈ సీజన్లో 28వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ఈ క్రమంలో ఈ నెల 24న మండల కేంద్రం రాజోళిలో కేంద్రాన్ని ప్రారంభించింది. కానీ నేటి వరకు ఎలాంటి కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో పాటుగా వడ్డేపల్లి మండలం కొంకలలో శనివారం ప్రారంభం కాగా.. రాజోళి మండలం తుమ్మిళ్ల, పచ్చర్ల గ్రామాల్లో కూడా జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సి ఉంది. వీటి మొత్తానికి కాను సోమవారం నుంచి కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పినా.. ఆదివారం అకాల వర్షం కురవడంతో కొనుగోళ్లు ప్రారంభించలేదు. జిల్లాలో అధికంగా అలంపూర్ నియోజకవర్గంలోనే జొన్న సాగు ఎక్కువగా చేపట్టడంతో నియోజకవర్గంలోనే నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. టోకెన్లు కోసం తంటాలు ఇదిలాఉండగా, ఈ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లు ఇవ్వాల్సి ఉంటుంది. తమ భూమిలో ఏ పంట సాగు చేస్తున్నారనే విషయాన్ని రైతులు గతంలోనే వ్యవసాయ శాఖలో ఆన్లైన్ చేసి ఉండటంతో, నిజమైన రైతులకే విక్రయించే విధంగా టోకెన్ ద్వారా అవకాాశం కల్పిస్తారు. దీంతో రైతులు ఈ టోకెన్లు తీసుకునేందుకు వ్యవసాయ అధికారులను సంప్రదించడం, కార్యాలయానికి వెళ్లడం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యం చేశారని, ఇప్పటి వరకే రైతులు ఆర్థిక అవసరాల దృష్ట్యా ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారని, కేంద్రాలను ప్రారంభించాక కూడా కొనుగోలులో జాప్యం జరిగితే రైతులు మళ్లీ వ్యాపారుల వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుందని, దీన్ని వ్యాపారులు అదునుగా చేసుకునే అవకాశముందని రైతులు అంటున్నారు. పంట సాగుకు ఆపసోపాలు ఈ ఏడాది జొన్నల సాగును రైతులు అతి కష్టం మీద పూర్తి చేశారు. పెట్టుబడి కోసం అప్పులు తీసుకురాగా.. అనుకున్నంత స్థాయిలో పంట చేతికి రాలేదని వాపోయారు. ప్రధాన కారణంగా ఆర్డీఎస్ కెనాల్పై పరిస్థితిని చూపుతున్నారు. పంటకు సరిగ్గా నీరు అవసరమున్న సమయంలో కెనాల్లో నీరు నిలిచిపోవడం, ఇండెంట్ నీరు రాకపోవడంతో పంట ఎండుముఖం పట్టింది. అతి కష్టం మీద నీరు వచ్చినప్పటికీ అదే నీటితో పంటలకు తడులు అందించారు. కెనాల్లో నీరు లేని సమయంలో పొలాల పక్కనే ఉన్న బోర్లు, బావుల దగ్గర నీటిని తీసుకుని పంటలకు తడులు అందించారు. ఇలా అతికష్టం మీద ఆపసోపాలు పడి పంటను సాగు చేవరి దాకా తీసుకువస్తే, విక్రయించే సమయంలో కష్టాలు తప్పడంలేదని వాపోతున్నరు. ఈ కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేసి ఉంటే అప్పుడు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించిన రైతులు కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే వారని అంటున్నారు. కాగా గత ఏడాది ఇవే కేంద్రాల నుంచి 25వేల క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేయగా.. ఈ ఏడాది 28 వేల క్వింటాళ్ల వరకు కొంటామని అధికారులు అంటున్నారు. కేంద్రం ప్రారంభమయ్యాక సంచులు లేకపోయినప్పటికీ శనివారానికి 28వేల సంచులను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆలస్యంగా కొనుగోలు ప్రారంభించినా రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు కొంటారా లేదా ఎదురుచూడాలి. చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తాం ప్రస్తుతం రాజోళి, కొంకల కేంద్రాలను ప్రారంభించాం. పచ్చర్ల, తుమ్మిళ్ల కూడా కేంద్రాలను ఏర్పాటు చేసి త్వరలో కొనుగోళ్లను ప్రారంభిస్తాం. రైతులకు ఇబ్బందులు రాకుండా సంచులు అందుబాటులో ఉంచాం. రైతుల నుండి చివరి ధాన్యం వరకు కొనుగోలు చేస్తాం. కొనుగోళ్లకు సంబంధించి వారి ఏఈఓలకు వివరాలు అందిస్తాం. – రవికుమార్, సీఈఓ, వడ్డేపల్లి పీఏసీఎస్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో రెండు కేంద్రాల ఏర్పాటు 24న ప్రారంభమైనా.. కొనుగోళ్లు చేపట్టని వైనం ఇబ్బందుల్లో రైతులు -
రజతోత్సవ సభకు తరలిన నేతలు
అలంపూర్: వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని నేతలు భారీగా తరలి వెళ్లారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు కానున్న సందర్భాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత నేతృత్వంలో సభ జరగనుండటంతో ఈ ప్రాంతం నుంచి పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. అలంపూర్ పట్టణంలోని బ్రహ్మాణ వీధిలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకట్రామయ్యశెట్టి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఆదేశాలతో మండలంలోని నేతలు చలో వరంగల్ సభకు తరలివెళ్తున్నట్లు తెలిపారు. 25 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో సాధించిన విజయాలను వివరించారు. నియోజకవర్గంలోని బీచుపల్లిలో ఎమ్మెల్యే విజయుడు జెండా ఊపి కాన్వాయిని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు బుక్కాపురం శ్రీనివాస్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మురళి గౌడ్, సింగవరం నాగభూషణం, చిలుకూరి శ్రీనివాసులు, రాంబాబు, రఘు, వీరసేన ఉన్నారు. -
ఆదిశిలా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలు
మల్దకల్: ఆదిశిలా క్షేత్రమైన స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా సద్దలోనిపల్లి కృష్ణస్వామి, పాల్వాయి అడవి ఆంజనేయస్వామి, కుర్తిరావుల చెర్వు గట్టు తిమ్మ ప్పస్వామి, చర్లగార్లపాడు వెంకటేశ్వరస్వామి ,శేషంపల్లి శివసీతారామస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అమావాస్యను పురస్కరించుకుని గద్వాల పట్టణంలోని కాకతీయటెక్నో స్కూల్ యజమాన్యం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు అరవిందరావు, ఆలయ అర్చకులు మధుసూదనాచారి, రవిచారి, నాయకులు మధు, నారాయణ, అరగిద్ద రాముడు, వాల్మీకి పూజరులు తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో సీనియర్ సివిల్ జడ్జి పూజలు గద్వాల ిసీనియర్ ిసివిల్జడ్జి వి శ్రీనివాస్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ నిర్వహకుడు అరవిందరావు, అర్చకులు జడ్జి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అర్చకులు స్వామి వారికి అభిషేకాలు నిర్వహించి జడ్జి దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులు ఆలయ విశిష్టతలను వివరించి జడ్జి దంపతులను శాలువాతో సత్కరించి మెమోంటోను అందజేశారు. -
పోలీసులు అప్రమత్తం
జిల్లా పోలీసులు గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో ప్రమాదకర బావులు, చెరువులు, నీటి గుంతలను గుర్తించారు. వ్యవసాయ బావుల వద్ద పిల్లలు ఈతకు వచ్చిన నేపథ్యంలో తప్పనిసరిగా పెద్దలు ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ప్రతి రోజు కళాజాత బృంద సభ్యులచే అవగహన సదస్సులు, సూచనలు, స్వీయజాగ్రత్తలను వివరిస్తున్నారు. ఈత ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. అవసరమైతే ఈత నేర్చుకునేందుకు ప్రస్తుతం మార్కెట్లలో దొరికే ట్యూబ్లు, రక్షణ జాకెట్లను ధరించాలని సూచిస్తున్నారు. ప్రతి చోటా పోలీసు నిఘా ఏర్పాటు చేసి ప్రమాదకరమైన బావుల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. -
ఉత్సాహంగా నెట్బాల్ సెలక్షన్స్ ట్రయల్స్
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని డీఎస్ఏ మైదానం, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల రాష్ట్రస్థాయి బాల, బాలికల నెట్బాల్ సెలక్షన్స్ ట్రయల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతూ రానున్న జాతీయస్థాయి టోర్నమెంట్లకు సంబంధించి రాష్ట్రంలోని పలుచోట్ల సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో రాణించిన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక కోచింగ్ క్యాంపులు నిర్వహించి ప్రతిభచాటిన వారిని తుది రాష్ట్ర జట్లకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో నెట్బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు విక్రమాదిత్య, సాదత్ఖాన్, ఖాజాఖాన్, అంజద్అలీ, షరీఫ్, షకీల్, అక్రం పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామదాసు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పెన్షనర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు అధికారంలోకి వచ్చిన తక్షణమే పరిష్కరిస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. పెండింగ్ కరువు భత్యాల మంజూరు, పీఆర్సీ అమలు చేయకపోవడం, ఈ–కుబేర్లో బిల్లులు పెండింగ్లో ఉండటం ఇలా అనేక సమస్యలతో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మార్చి 2024 నుంచి రిటైర్డ్ అయిన వారి గ్రాట్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్స్, ఎల్ఎఫ్ ఇతర ఏరియర్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు చెల్లించాలన్నారు. వీటిపై ప్రభుత్వ స్పందన లేకపోవడంతోనే ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. మూడో దశ పోరాటంలో భాగంగా నిర్వహించే ధర్నాలో పెన్షనర్లు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ‘బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలి’ జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలని అఖిల భారత బీసీ సంఘటన సమితి జాతీయ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన బీసీ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహబూబ్నగర్ మేయర్ సీటును బీసీ మహిళకు రిజర్వు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విశ్వకర్మ, రాజు యువశక్తి, ముద్ర వంటి సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు. మెలికలు పెట్టకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చి బీసీల సాధికారతకు, జీవనోపాధికి దోహదపడాలన్నారు. బీసీలు అంకితభావంతో సమకాలీన రాజకీయాలను గమనిస్తూ మన ఓటు మనకే అన్న నినాదంతో పోటీ చేయకుండా బీసీలకే వేసుకొని రాజ్యాధికారం సాధించాలన్నారు. సమావేశంలో ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి బ్రహ్మయ్యచారి, బీసీ సంఘటన సమితి ప్రధాన కార్యదర్శి ప్రదీప్, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంశ్రీనివాస్, అంజయ్య, లక్ష్మీనారాయణయాదవ్, రజక సంఘం అధ్యక్షుడు పురుషోత్తం, పద్మశాలీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్, బవసార్ సంఘం అధ్యక్షుడు విశ్వనాథ్, వీరశైవ సంఘం అధ్యక్షుడు సిద్ధిరామప్ప, మహేంద్ర సంఘం అధ్యక్షుడు రాములు, నాయీ బ్రాహ్మణ అధ్యక్షుడు సత్యం, సంఘాల నాయకులు హరిప్రకాష్గౌడ్, సుబ్రహ్మణ్యం, రాజసింహుడు, నర్సింహ, కందమూరి, మంజుల, ఉమామాధవి, రమాదేవి, పుష్ప, రాధ పాల్గొన్నారు. -
ఈదురుగాలుల బీభత్సం
ధరూరు: మండలంలో భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు భారీ ఎత్తున ఈదురు గాలులు వీచడంతో చెట్లు నేలకొరిగాయి. గార్లపాడు గ్రామానికి చెందిన పాలెం నర్సింహులుకు చెందిన రెండు కాడెద్దులు పిడుగు పాటుకు గురై మృతి చెందాయి. వీటి విలువ 1.50లక్షలు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. మండల కేంద్రంతో పాటు మండల పరిదిలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది.అలాగే, ధరూరులో ఇటీవల నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లతో లోతట్టు ప్రాంతాల్లోని ముస్లిం కాలనీ, ఎస్సీ కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మసీదుపై పిడుగు.. తప్పిన ప్రమాదం ఎర్రవల్లి: పిడుగుపాటు మజీద్ మినార్ కూలిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని దువాసిపల్లిలో సాయంత్రం భారీ ఉరుములతో కూడిన ఈదురు గాలులు వీచడంతో ఒక్కసారిగా గ్రామంలోని మసీద్పై పిడుగు పడింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పిడుగు దాటికి మసీద్ మినార్ (శిఖరం) పాక్షికంగా కూలిపోయింది. గ్రామంలో పక్షం రోజుల్లోనే రెండవసారి పిడుగు పడటంతో ప్రజలంతా భయబ్రాంతులకు గురయ్యారు. ధరూరులో విరిగిన చెట్లు, నిలిచిన విద్యుత్ సరఫరా కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యం -
వినోదం.. కారాదు విషాదం
వేసవి సెలవుల వేళ చెరువులు, బావుల వద్దకు పిల్లల పరుగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఈతకు వెళ్లనివ్వొద్దు ● పెద్దలు, శిక్షకుల సమక్షంలోనే ఈత నేర్చుకోవాలి ● గాలి ట్యూబులు, ఇతర రక్షణ కవచాలను నడుముకు, హ్యాండ్ ట్యూబులు కట్టుకోవాలి ● నీటి అడుగులో మట్టి, నాణేలు తెచ్చే, ఎక్కువ సేపు నీటిలో మునిగి ఉంటారనే ఆటలు ఆడొద్దు ● నదులు, కాల్వలు, ప్రాజెక్టుల వద్ద తవ్విన గుంతల్లో ఈత కొట్టొద్దు ● హృద్రోగులు, మూర్చ, హైబీపీ ఉన్న వారు నీటిలోకి వెళ్లొద్దు ● నీటిలో ఎవరైనా మునిగిపోతుంటే సమీపంలో ఉన్న పెద్దవారిని పిలవాలి. ● ఈత నేర్చుకునే క్రమంలో ప్రమాదాల బారిన.. ● ఏటా పదుల సంఖ్యలో గాలిలో కలుస్తున్న ప్రాణాలు ● తల్లిదండ్రుల అప్రమత్తం.. స్వీయ జాగ్రత్తలే రక్షణ గద్వాల క్రైం: విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులంతా ఉత్సాహంతో సొంతూళ్లకు పయనమయ్యారు. సెలవుల్లో వారు చేసే వినోదం అంతా ఇంతా కాదు. కానీ, వేసవి తాపం నుంచి ఉపశమనానికి, ఈత నేర్చుకుందామనే ఉత్సాహంతోనో పిల్లలు చెరువులు, బావుల వద్దకు వెళ్లి ప్రమాదాల బారిన పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. గతేడాది వేసవిలో జిల్లాలో ఈతకు వెళ్లి ఏడుగురు చిన్నారులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా చెరువులు, బావులు, నీటి గుంతల పరిసర ప్రాంతాల్లో పోలీసుశాఖ నిఘా ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఈత కోసం వెళ్తే తప్పనిసరిగా వారి వెంట వెళ్లాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు.. ● 3.22.2024 మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి (14) గ్రామంలోని తోటి స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. ● 16.03.2024 అయిజ మండలం మూగోనిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి (10) గ్రామ సమీపంలోని బావిలో ఈత కోట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు. బావిలోకి పై నుంచి దూకగా.. నీటిలో ఉన్న కర్ర ముక్క గొంతుకు గుచ్చుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు. ● 20.03.2024 అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి (17) సమీపంలోని బావి ఉండడంతో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి ఈత నేర్చుకునే క్రమంలో గతంలో పిల్లలు ప్రమాదాల బారిన పడ్డారు. వీటి నివారణకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వీయ జాగ్రత్తలపై గ్రామాల్లో కళాకారులచే అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ బావులు, రిజర్వాయర్లు, నీటి కుంటల వద్ద పిల్లలను అటు వైపు రాకుండా గ్రామ పోలీసు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. నిరూపయోగంగా ఉన్న బోరు వెల్స్ను మూపివేసేలా ఆదేశాలు జారీ చేశాం. తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖ చెప్పే స్వీయ జాగ్రత్తలు పాటించాలి. బావులు, చెరువులు, నీటి కుంటల వద్ద ప్రహరీ గోడలు ఏర్పాటుకు కృషి చేస్తాం. ప్రమాదాల నివారణకు సిబ్బందిని అప్రమత్తం చేశాం. – శ్రీనివాసరావు, ఎస్పీ -
ఒత్తిళ్లకు తలొగ్గి..
ప్రైవేటు కళాశాలల సూచనలతో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా ఇబ్బందులు రానివ్వం.. ప్రైవేటు కళాశాలలకు ఎట్టి పరిస్థితిలోనూ ర్యాటిఫికేషన్, అప్లియేషన్ ఇన్స్పెక్షన్ చేపడతాం. వీటికోసం ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. అలా చేస్తేనే దోస్త్లో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సమస్యలు ఉన్న కారణంగా వాయిదా వే సిన పరీక్షలను వచ్చేనెలలో నిర్వహిస్తాం. వి ద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – రమేష్బాబు, పీయూ రిజిస్ట్రార్● 9 రోజులపాటు నిలిపివేయడంతో పీజీసెట్, లాసెట్పై ప్రభావం ● అప్లియేషన్, ర్యాటిఫికేషన్ ప్రక్రియపై పట్టింపులేని వైఖరి ● ఆదేశాలను బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలు ● పీయూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలుషెడ్యూల్ ప్రకారమే.. అసలు యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఎందుకు తలొగ్గి.. పరీక్షలు వాయిదా వేశారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది కాబట్టి కచ్చితంగా వాటిని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి. అలాగే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటి ప్రక్రియలు వెంటనే పూర్తిచేయాలి. – రాము, యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఉద్యమం చేపడుతాం.. ప్రైవేటు కళాశాలలకు రీయింబర్స్మెంట్ రాకుంటే పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నష్టం చేస్తారా.? పీయూ అధికారుల ఈ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రైవేటు కళాశాలల్లో వసతులు మెరుగుపడాలంటే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటివి చేపట్టాల్సిందే. పీయూ అధికారులు తీరు మార్చుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతాం. – నాగేష్, యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వింత ధోరణి నడుస్తోంది. ప్రైవేట్ కళాశాలలను నియంత్రించాల్సిన యూనివర్సిటీ అధికారులు.. ఏకంగా వారి ఒత్తిళ్లకే తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఈ నెల 28 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు 2, 4, 6 నిర్వహిస్తున్నట్లు గతంలో సర్క్యులర్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ విడుదల చేయగా.. ఈ నెల 25న వాటిని వాయిదా వేస్తున్నట్లు మరో సర్క్యులర్ జారీ చేశారు. దీనికి కారణం ‘ప్రైవేట్ కళాశాలల విజ్ఞప్తి మేరకు’ మాత్రమే వాయిదా వేసినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. సాధారణంగా పరీక్షలు వాయిదా వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పోటీ పరీక్షలు, సెలవుల దృష్ట్యా మాత్రమే వాయిదా వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్లతో వాయిదా వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. విద్యార్థులకు తీవ్రనష్టం.. పీయూ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ తదితర అన్ని కళాశాలలు కలిపి 102 ఉండగా.. వీటిలో సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పీజీలో పీజీ సెట్, లా సెట్, ఎంబీఏ వంటి కోర్సులలో ప్రవేశాలకు విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంది. ఎంట్రెన్స్లకు చదివేందుకు కనీసం 15 రోజుల సమయం కూడా సరిపోదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయడం వల్ల ఫలితాలు, మెమోల జారీ వంటి ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని.. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందని వాపోతున్నారు. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాయిదా వేసిన డిగ్రీ పరీక్షలను అధికారులు వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నారు. ర్యాటిఫికేషన్ కోసం.. పీయూ పరిధిలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ర్యాటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఈ నెల 23 చివరి తేదీ కాగా.. 24 నుంచి 30 వరకు అన్ని కళాశాలల యాజమాన్యాలు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను అధికారులకు సమర్పించాలని ఈ నెల 7న యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీటితోపాటు కళాశాలల్లో వసతులపై ఇన్స్పెక్షన్ చేయించుకోవాలని సూచించింది. అయితే అధికారుల సూచనల ప్రకారం కొన్ని కళాశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. మరికొన్ని కళాశాలలు వాటిని పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలల అప్లియేషన్ చివరిసారిగా 2022లో నిర్వహించగా.. తర్వాత గత వీసీ హయాంలో ప్రైవేటు కళాశాలలు అప్లియేషన్, ర్యాటిఫికేషన్ వంటి వాటి జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం కొత్త వీసీ వచ్చాక పరిస్థితిలో మార్పు వస్తుందని భావించినా.. గతంలో మాదిరిగానే వాటిని మూలకు పెట్టినట్లు తెలుస్తోంది. -
పండ్లు.. జ్యూస్లకు డిమాండ్..
వేసవిలో కొబ్బరిబొండాలు, పుచ్చకాయలు, మామిడిపండ్ల, ఇతర జ్యూస్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ● ఆరోగ్యానికి చెరుకు రసం ఎంతో మేలైనది. ప్రత్యేకంగా వేసవిలో చెరుకురసం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. దీనిని తీసుకోవడం వల్ల ఎండల నుంచి ఉపశమనం పొందడంతోపాటు ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో ప్రతిచోటా చెరుకు రసం సెంటర్లు వెలుస్తున్నాయి. మహబూబ్నగర్ పట్టణంలో దాదాపు 50 చెరుకు రసం కేంద్రాలు ఉన్నాయి. చెరుకు రసం ఫుల్గ్లాస్ రూ.30, ఆఫ్ గ్లాస్ రూ.20 ధరలు ఉన్నాయి. ● ఈ సీజన్లో ప్రతిచోట లస్సీ సెంటర్లు వెలుస్తాయి. కొన్నేళ్ల నుంచి లస్సీ (పెరుగు)కి ప్రత్యేక గుర్తింపు ఉంది. సాధారణ లస్సీ రూ.20, స్పెషల్ లస్సీని రూ.30కు విక్రయిస్తున్నారు. అదేవిధంగా ఫలుదాకు ప్రత్యేక ఆదరణ లభిస్తుంది. పాలు, డ్రైఫ్రూట్స్తో తయారు చేసే ఫలుదాకు ఇటీవలే కాలంలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గ్లాసు ఫలుదా రూ.40 చొప్పున అమ్ముతున్నారు. ● పేద, ధనిక తేడా లేకుండా ప్రతిఒక్కరూ కొబ్బరిబొండాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రతిచోట ప్రధాన రోడ్ల వెంట వీటి అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి జిల్లాలు, కాకినాడ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఒక్కటి రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. ● మార్కెట్లో తాటిముంజులు, మామిడి పండ్ల సందడి నెలకొంది. కొల్లాపూర్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి మామిడిపండ్లను దిగుమతి చేసుకొని కిలో రూ.80 – 100 వరకు విక్రయిస్తున్నారు. ఇక శరీరానికి చలువ చేయడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న తాటిముంజలకు మార్కెట్లో భలే డిమాండ్ ఉంటుంది. రూ.100కు 12 ముంజలు ఇస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు కా ర్బోహైడ్రేట్స్, ప్రొటీన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉండే పుచ్చకాయలు అన్ని ప్రాంతాల్లో లభిస్తుంది. కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. లస్సీ.. ఇష్టంగా తాగుతా.. లస్సీ అంటే చాలా ఇష్టం. వేసవి కాలంలో లస్సీని ఎక్కువగా తాగుతా. ఎండలో తిరిగే సమయంలో లస్సీ తాగడం శరీరానికి చల్లటి ఉపశమనం లభిస్తుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. – సాయికుమార్, మహబూబ్నగర్ -
వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లిం మహిళలకు మేలు
గద్వాలటౌన్: వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పేర్కొన్నారు. వన్ నేషన్– వన్ ఎలక్షన్, వక్ఫ్ సవరణ చట్టం–2025పై జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన మేధావుల అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో వక్ఫ్ చట్టం పక్కదారి పట్టిందని, ధనిక ముస్లింలకు మాత్రమే లబ్ధి చూకూరిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు, ఎంఐఎం నేతలు చట్ట సవరణపై భయాందోళనలు రేకెత్తించారని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుతో వక్ఫ్బోర్డుల్లో జరిగే అవినీతి, అక్రమాలకు ముగింపు పడి పేద ముస్లింలకు లాభం చూకూరుతుందన్నారు. వక్ఫ్బోర్డు పేరుతో ఇంతకాలం జరిగిన అక్రమాలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన దేశానికి ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. అభివృద్ధికి సైతం దోహదం చేస్తుందని చెప్పారు. పలువురు ముస్లింలు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. వెనకబడిన ముస్లింలకు ఇది ఆర్థికపరమైన ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. పేద ముస్లింలు బీజేపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్పాష, బీజేపీ నాయకులు రామంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రవికుమార్ఏక్టోటే, మాలీం ఇసాక్, మోహిద్ఖాన్, అత ఉర్ రహమాన్, దేవదాసు, నర్సింహా తదితరులు పాల్గొన్నారు. -
చలో వరంగల్..
బీఆర్ఎస్ శ్రేణుల్లో రజతోత్సవ సందడి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘గులాబీ’ శ్రేణుల్లో రజతోత్సవ సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభను ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ జనసమీకరణకు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టిన నేతలు.. తాము రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకుసాగుతున్నారు. నేడు ఊరూరా పార్టీ జెండావిష్కరణలను పండుగ వాతావారణంలో నిర్వహించి.. అనంతరం వాహనాల్లో సభకు తరలేలా తగిన ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సైతం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అదేవిధంగా ఫ్లెక్సీలు, పార్టీ బ్యానర్లతో మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో పలు కూడళ్లు గులాబీమయంగా మారాయి. సెగ్మెంట్కు 300 వాహనాలు.. 3 వేల మంది జనసమీకరణ వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా పార్టీ శ్రేణులను తరలింపు కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డితోపాటు ఎమ్మెల్సీ, అలంపూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గానికి 300 వాహనాల వరకు సిద్ధం చేసి.. సుమారు మూడు వేల మంది కార్యకర్తలను సభకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందిని తరలించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. పర్యవేక్షణకు ఇన్చార్జీల నియామకం.. వరంగల్కు సుదూర ప్రయాణం చేయాల్సి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం పార్టీ నేతలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి వాహనానికి ఓ ఇన్చార్జితో పాటు భోజనం, తాగునీటి వసతుల పర్యవేక్షణకు విడివిడిగా ఇన్చార్జీలను నియమించారు. అదేవిధంగా సభకు వెళ్లే ప్రతి వాహనానికి సంఖ్య, ఇన్చార్జి పేరు, సెల్ నంబర్తో స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఇన్చార్జీలు నియోజకవర్గ ఇన్చార్జితో సమన్వయం చేసుకోనున్నారు. వాహనాలు ఎక్కడి నుంచి బయలు దేరాయి.. ఎక్కడ భోజనాలు చేశారు.. ఎప్పుడు సభకు వచ్చారు.. ఎ ప్పుడు వెళ్లారు.. ఇలా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు ప ర్యవేక్షించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. పాలమాకుల లేదంటే శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్కు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి వాహనాలు పాలమాకుల దాటిన తర్వాత లేదా శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పైకి చేరుకుని.. నేరుగా ఘట్కేసర్ వద్ద వరంగల్ హైవేలో దిగుతాయి. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జోన్–2లో పార్కింగ్.. రజతోత్సవ సభకు తరలివెళ్లే ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ తమ వాహనాలను జోన్–2లో పార్కింగ్ చేసుకోవాలి. వరంగల్ జాతీయ రహదారిలో కరుణాపురం వద్ద ఎన్హెచ్–163 బైపాస్లో టోల్గేట్ నుంచి దేవన్నపేట, మేడిపల్లి, అనంతసాగర్ మీదుగా పార్కింగ్ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. వాహనాలను అక్కడ పార్కింగ్ చేసి నేరుగా సభావేదిక స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్ సభకు భారీగా తరలుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు 50 వేల మంది తరలింపు బస్సులు, కార్లు ఇతర ప్రైవేట్ వాహనాలను సమకూర్చిన నేతలు పట్టణాలతో పాటు ఊరూరా పండుగలా పార్టీ జెండావిష్కరణలు ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైన పలు కూడళ్లు -
బాధితులకు అండగా ఉండాలి
గద్వాల క్రైం: జిల్లాలో పోక్సో కేసుల నమోదు, బాధితులకు అందిస్తున్న సేవలపై శనివారం సాయంత్రం గద్వాల జిల్లా అదనపు సెషన్ కోర్టు, పోక్సో కోర్టు జడ్జి ఎస్ రవికుమార్ భరోసా సెంటర్ను తనిఖీ చేసి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భరోసా సిబ్బంది శిరిష, స్రవంతి పలు విషయాలపై జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. జడ్జి వారితో మాట్లాడుతూ జిల్లాలో లైగింక దాడులకు గురైన మైనర్ బాలికల కేసులు, నిందితులకు శిక్షపడే విధంగా తీసుకున్న చర్యలపై ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. వేధింపులకు గురైన క్రమంలో వారిలో ఆత్మస్థైర్యం, నమ్మకం, చట్టాలపై కల్పిస్తున్న విషయాలను ఆరా తీశారు. భరోసా సెంటర్ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను, రికార్డులను పరిశీలించారు. సిబ్బంది ఎంతో బాధ్యతతో విధులు నిర్వహించి మనోధైర్యం కోల్పోయిన బాధితులకు అండగా ఉండలన్నారు. నిపుణులైన వైద్యులు, డాక్టర్లు, లాయర్లు, కౌన్సెలింగ్ సిబ్బంది ద్వారా ప్రభుత్వం బాధింపపడ్డ బాధితులకు భరోసా ఇవ్వలనే ధృఢసకల్పంతో ఈ సెంటర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అనంతరం సెంటర్లోని వివిధ విషయాలపై అక్కడి సిబ్బందిని అడిగి తెలసుకున్నారు. ఈ కార్యక్రమంలో భరోసా సిబ్బంది శ్వేత, కీర్తి, కవిత తదితరులు ఉన్నారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించిన కాంగ్రెస్ గద్వాలటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్కు సముచిత గౌరవం ఇవ్వకపోగా.. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేతలు త్రీవంగా అవమానించారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1952 లోక్సభ ఎన్నికల్లో అంబేడ్కర్ను ఓడించేందుకు ఆనాటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి నారాయణరావ్ కథరోల్కర్ను పోటీకి నిలిపియని, నెహ్రూ స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అంబేడ్కర్ ఓటమికి కారకులయ్యారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ హయాంలో అంబేడ్కర్ స్మృతివనం, పంచతీర్థ పేరుతో ఆయన పుట్టిన స్థలం, నివసించిన స్థలం, దహన సంస్కారాలు నిర్వహించిన స్థలాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు విద్యాసాగర్రెడ్డి, రామంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రామచంద్రారెడ్డి, రవికుమార్ఏక్బోటే, బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి పాల్గొన్నారు. డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణా సంస్థ (ఎస్డీడీజీడబ్ల్యూటీటీఐ) హైదరాబాద్లో మూడేళ్ల పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళాశిశు సంక్షేమ జిల్లా అధికారిణి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. మే 19లోపు దరఖాస్తూ చేసుకోవాలని కోరారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికలు, ఇతర నిరాశ్రయులైన పిల్లలు, చిల్డ్రన్ హోం, మహిళా సంస్థల్లోని బాలబాలికలు, దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ కోర్సులు ఉన్నాయని తెలిపారు. వివరాలకు జిల్లా బాలల సంరక్షణ విభాగం గద్వాలలో సంప్రదించాలని కోరారు. బాల పురస్కార్ అవార్డుకు.. గద్వాల: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్ అవార్డుల కోసం అర్హులైన చిన్నారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళా శిశు సంక్షేమ అధికారిణి సునంద ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు, సృజనాత్మకత, సాంస్కృతిక కళలు, సాహసం, క్రీడలు,సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక, ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన బాలబాలికలు జూలై 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. -
కొత్త చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం
గట్టు: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శనివారం గట్టులో భూ భారతి చట్టం–2025పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కొత్తగా ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. కొత్త చట్టం ప్రకారం ఇక నుంచి భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు భూమిని సర్వే చేసి, మ్యాప్తోనే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు, ఇలా చేయడం ద్వారా 90 శాతం భూముల వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్లే.. ప్రతి రైతు భూమికి భూదార్ కార్డు ఉండనుందని, ఇక నుంచి భూ ఆక్రమణకు అవకాశం లేదన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్ మార్పులు, చేర్పులు, వారసత్వ భూములు, సాదాబైనామాలు, ఓఆర్సీ వంటి సేవలు సుభతరం అవుతాయని అన్నారు. భూ సమస్యల పరిష్కారాకి మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, నిర్దేశిత సమయంలో సమస్యలను పరిష్కరించడం జరుగుంతుందని తెలిపారు. ధరణి వ్యవస్థలో భూ హక్కులపై తలెత్తే వివాదాలకు అప్పీల్ అవకాశం లేక సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, కొత్త చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, ట్రీభ్యునల్ వరకు అప్పీల్ అవకాశం అందుబాటులోకి వచ్చి, సమస్యలకు పరిష్కారం లభించనున్నట్లు వివరించారు. జిల్లాలోనే గట్టు మండలంలోనే అత్యధిక భూ సమస్యలు ఉన్నప్పటికి ఇప్పటికే 90 శాతం సమస్యలు పరిష్కరించామని, త్వరలోనే గ్రామ పాలన అధికారుల నియామకం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల వారిగా అధికారులు రెవెన్యూ సదస్సులను నిర్వహించి, దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసిల్దార్ సలీముద్దిన్,ఎంపీడీఓ చెన్నయ్య పాల్గొన్నారు. పిల్లలకు పౌష్టికాహారం, మెరుగైన విద్య అందించాలి అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు మెరుగైన విద్యను అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అంగన్వాడీ టీచర్లకు ఆదేశించారు. శనివారం గట్టులోని సంతబజారు అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని పిల్లలు, తల్లులు, బాలింతలకు అందుతున్న అంగన్వాడీ సేవల గురించి సిబ్బంది ద్వారా వివరాలను తెలుసుకున్నారు. చిన్నారుల ఎత్తు, బరువులను పరిశీలించి,మోబైల్ యాప్లోని వివరాలను చెక్ చేశారు. పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ క్రమంగా చేపట్టి ఖచ్చితమైన ఎత్తులు, బరువులు యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. పిల్లలను అంగ్లం అక్షరమాల, తెలుగు వర్ణమాలపై ప్రశ్నించారు. పిల్లలకు అంగన్వాడి కేంద్రంలో బలమైన పునాది పడడానికి మరింత మెరుగుగా అంగన్వాడి టీచర్లు పని చేయాలన్నారు.గర్భిణుల ఆరోగ్య స్థితిని ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయాలని, పౌష్టికాహారంపై అవగాహాన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య, ఆస్పిరేషన్ బ్లాక్ కోఆర్డీనేటర్ అప్జల్, ఆర్ఐ రాజు, అంగన్వా డి టీచర్ వెంకట్రావమ్మలు పాల్గొన్నారు. -
మలేరియా నిర్మూలనకు సమష్టి కృషి
గద్వాల క్రైం: మలేరియా నిర్మూలన కోసం ప్రజలు, వైద్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి సిద్దప్ప అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాను మలేరియా రహిత జిల్లాగా చూసేందుకు ప్రతి ఒక్కరు వైద్యుల సలహాలు పాటిస్తే విజయం సాధిస్తామన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ దోమల నివారణకు ప్రజలు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రధాన శత్రువు దోమలని, వాటి ద్వారా మలేరియా, చికెన్ గున్యా, డెంగీ, మెదడువాపు వ్యాధులు వస్తాయన్నా రు. కార్యక్రమంలో వైద్యులు రాజు పాల్గొన్నారు. -
విత్తన నాణ్యతపై అవగాహన కలిగి ఉండాలి
ధరూరు: విత్తన నాణ్యతపై ప్రతి రైతు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే డీలర్ల మోసాల నుంచి బయటపడతారని రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ రీజినల్ మేనేజర్ ఆది నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకు కార్యాలయంలో మండల సింగిల్ విండో వైస్ చైర్మన్ పరమేష్ అధ్యక్షతన విత్తన నాణ్యతపై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ రూపొందించిన విత్తనాలు తెగుళ్లు, రోగాలు ఇతర ప్రతికూల పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులను ఇస్తాయని అన్నారు. ప్రతి రకంలోనూ ప్రత్యేక వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా శాస్త్రవేత్తలు తయారు చేస్తారన్నారు. ప్రతి ఒక్క రైతు టీజీ సీడ్స్ విత్తనాలను రైతులు ఎంచుకోవడం ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చునని అన్నారు. టీజీ సీడ్స్ విత్తరనాలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు(పీఏసీఎస్) ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, రైతు ఉత్పత్తి సంఘాలు ఇతర డీలర్ల ద్వారా అన్ని మండలాలకు సరఫారా చేస్తున్నామని అన్నారు. ప్రతి మండలంలోనూ అందుబాటులో టీజీ సీడ్ విత్తనాలు ఉంటాయని, ముఖ్యంగా వరిలో సన్న రకాలైన ఆర్ఎన్ఆర్ – 15048, బీపీటీ 5204, కేఎన్ఎం – 1638తో పాటు జేజీఎల్ – 27356, ఎంటీయూ 1224 వంటి కొత్త రకాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల బాయంకు సీఈఓ రాజు, తదితరులు పాల్గొన్నారు. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు
గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్వికాసం పథకాలలో అర్హులైన వారికే అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రాజీవ్యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఆర్ఎస్లపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజీవ్యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందని, ఈ పథకానికి ప్రభుత్వం రూ.6వేల కోట్లు కేటాయించిందని వివరించారు. జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీల నుంచి 25,500 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తులను సెక్టార్ల వారీగా స్క్రూటిని చేయాలన్నారు. సోమవారం వరకు సంబఽంధిత బ్యాంకు మేనేజర్లకు సమర్పించాలని, జిల్లా స్థాయిలో దరఖాస్తుల పరిశీలన మే 28 వరకు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతిపై మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ గడువు ఈనెల 30వ తేదీతో ముగుస్తున్నందున నిర్థేశించిన లక్ష్యం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్బాబు, ఎల్డీఎం శ్రీనివాస్రావు, మున్సిపల్ కమీషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు. -
క్రీడలతోనే ఆరోగ్యం పదిలం
గద్వాలటౌన్: ఆటలు ఆడటం ద్వారానే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జితేందర్ అన్నారు. శుక్రవారం స్థానిక సోమనాద్రి స్టేడియంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఆటల్లో ముందుండాలని, క్రీడలతో దేహ దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు. నైపుణ్యం గల క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని భరోసా ఇచ్చారు. మీతోపాటు మీ ఇంటి దగ్గర ఉండే మీ స్నేహితులను వేసవి శిక్షణ శిబిరానికి తీసుకు రావాలని సూచించారు. ఈ శిబిరం వేసవికే పరిమితం కాకుండా ఏడాది పొడువునా నిరంతరం క్రీడలు ఆడేవిధంగా కొనసాగాలని కోరారు. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు మాట్లాడుతూ గద్వాలలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదవ లేదని, వారిని ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సెలవుల్లో క్రీడలు ఆడుతూ ఆనందంగా గడపాలని సూచించారు. ఉదయం, సాయంత్రం సాగే వేసవి శిక్షణా శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్కార్ స్కూల్ యాజమాన్యం వారు శిక్షణకు హాజరైన విద్యార్థులకు క్రీడా దుస్తులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయ్, మాజీ కౌన్సిలర్ బండల పాండు, రాజారెడ్డి, చక్ర, ప్రవీణ్, వంశీ, రాము, సతీష్, పరుశ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ హక్కులతోనే స్వేచ్ఛాయుత జీవనం
అలంపూర్ : రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే దేశంలోని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ అన్నారు. అలంపూర్లోని జూనియర్ సివిల్ కోర్టులో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిధున్ తేజ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతోపాటు సంరక్షించుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే, బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారని, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతోనే ప్రతి ఒక్కరు సమాజంలో ఆనందంగా జీవిస్తున్నారని, చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గవ్వల శ్రీనివాసులు, న్యాయవాదులు నారాయణరెడ్డి, శ్రీధర్ రెడ్డి, నాగరాజు యాదవ్, తిమ్మారెడ్డి, నరసింహులు, వెంకటేష్, గజేంద్ర గౌడ్, బీమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రాయితీపై అనాసక్తి
ప్రచారం చేసినా ఫలితం లేదు జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటిల పరిధిలో ఉన్న నివాసగృహాలు, దుకాణాలు, వాణిజ్య సముదాయాలు తదితర వాటి నుంచి ప్రతి ఏడాది ఆస్తిపన్ను వసూలు చేస్తారు. ఆరు నెలలకు ఒకసారి రెండు విడతలుగా వీటిని చేపడతారు. అయితే చివరి రెండు నెలల పాటు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, బిల్ కలెక్టర్లు బృందాలుగా ఏర్పడి వీటి వసూలును చేపట్టారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు గత ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్లలో లక్ష్యాన్ని చేరుకోవడానికి తడబడ్డాయి. తాజాగా మార్చిలో ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ.. ఏప్రిల్ మాసంలో పన్ను చెల్లించేవారికి రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది మొత్తం చెల్లించాల్సిన పన్నులో ఐదుశాతం మినహాయిస్తామని ప్రకటించింది. ఇందుకు పట్టణాలలో ప్రచారం కోసం ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు పెట్టారు. బిల్ కలెక్టర్లు కాలనీల వారిగా అవగాహన కల్పిస్తున్నారు. కానీ జనం నుంచి మాత్రం స్పందన అంతగా రాలేదని చెప్పవచ్చు. గతేడాది సంబంధించిన పూర్తి పన్ను చెల్లించిన వారికే ఇది వర్తించింది. గద్వాలటౌన్: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ముందస్తు ఆస్తిపన్ను చెల్లిస్తే ఐదుశాతం లభించే రాయితీకి ఆదరణ కరువైంది. ఇందుకు ఈ నెల రోజులు సమయం ఇచ్చినా.. చాలా తక్కువ మంది మాత్రమే చెల్లించేందుకు ఆసక్తి చూపించారు. దీంతో అధికారులు అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. 2025–26 ఏడాదికి సంబంధించి ఈ నెలలో ఏడాది మొత్తం పన్ను చెల్లించిన వారికి అందులో ఐదుశాతం రాయితీ లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు సైతం దీనిపై ప్రచారం నిర్వహించినా.. ఆశించిన స్పందన రాలేదు. నెల రోజుల గడువు దగ్గర పడుతున్నా.. ప్రజలు నామమాత్రంగానే ఆసక్తి చూపించారు. నాలుగు మున్సిపాలిటీలలో ఓ మోస్తారుగా పన్ను చెల్లించారని చెప్పవచ్చు. జిల్లాలో ఇదీ పరిస్థితి ఒకేసారి ఆస్తిపన్ను చెల్లిస్తే 5శాతం రాయితీ జిల్లాలో మున్సిపాలిటీల వివరాలిలా.. కరువైన ఆదరణ.. లక్ష్యం ఆమడదూరం గడువు నాలుగు రోజులే.. వినియోగించుకోవాలి కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఐదుశాతం రాయితీ వర్తింపజేస్తున్నాం. ఏడాది చెల్లించే పన్నులో ఐదుశాతం మినహాయించి తీసుకుంటున్నాం. ఇందుకోసం పట్టణంలో ప్రచారం కోసం ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశాం. ఈనెల 30వ తేదీ వరకే అవకాశముంది. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. – దశరథ్, కమిషనర్, గద్వాల గద్వాలలో 15,677 అసెస్మెంట్లతో ఐదు శాతం రాయితీకి అర్హులుగాా ఉన్నారు. వీరిలో కేవలం 2,136 మంది పన్ను చెల్లించి రాయితీ పొందారు. అయిజలో 8,116 అసెస్మెంట్లుకు గాను 1,474 మంది రాయితీ మీద పన్ను చెల్లించారు. అదేవిధంగా అలంపూర్లో 3,502 మందికిగాను 375 మంది పన్ను చెల్లించారు. వడ్డేపల్లి మున్సిపాలిటీలో 4,046 మందికి గాను కేవలం 669 మంది మాత్రమే ఆస్తిపన్ను చెల్లించి రాయితీ అవకాశాన్ని పొందారు. -
లక్ష్యం మేరకు ఉపాధి పనులు చేపట్టాలి
ఇటిక్యాల: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పారదర్శకంగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో జరుగుతున్న వివిధ పనులను ఆయన పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపుదల కోసం రూ.30 వేలతో నిర్మించిన ఇంకుడు గుంత పనులను పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులతో చర్చించారు. అనంతరం మహిళా సమైఖ్య సంఘం కార్యాలయాన్ని సందర్శించి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలను సరైన కొలతలు ప్రకారం కుట్టించి ఆయా పాఠశాలలకు అందజేయాలని సూచించారు. ఆయా గ్రామాల వారీగా రిజిస్టర్లు ఏర్పాటుచేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భద్రప్ప, ఏపీఎం కురుమయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సరైన సమయంలో ఆస్పత్రికి తరలించాలి గద్వాల క్రైం/అలంపూర్: అంబులెన్స్ డ్రైవర్లు క్షత్రగాతులను సరైన సమయంలో ఆస్పత్రికి తరలించాలని రాష్ట్ర ఫ్లీడ్ హెడ్ గిరిబాబు అన్నారు. శుక్రవారం జిల్లా ఆస్పత్రితోపాటు అలంపూర్లోని 108, 102, పార్థీవ వాహనాలను ఆయనతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్, జిల్లా కో ఆర్డినేటర్ రత్నయ్య తనిఖీ చేశారు. అనంతరం ఆయన డ్రైవర్లతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైన ప్రమాదాలు చోటు చేసుకున్న క్రమంలో సిబ్బంది, వాహన డ్రైవర్లు వీలైనంత త్వరగా అక్కడికి చేరుకోవాలని, బాధితులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల కోసం సమీప ఆస్పత్రులకు తరలించాలన్నారు. వాహనాల నిర్వహణ ఎప్పటిప్పుడు చూసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యుత్తమ సేవలను అందించాలన్నారు. అనంతరం పలు రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో రవికుమార్, రత్నమయ్య తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,021 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు శుక్రవారం 308 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6021, కనిష్టం రూ.3076, సరాసరి రూ. 4739 ధరలు పలికాయి. అలాగే, 10 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం, కనిష్టం, సరాసరి రూ. 6329 ధర వచ్చింది. 112 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5921, కనిష్టం రూ. 5455, సరాసరి రూ. 5921 ధరలు పలికాయి. 1680 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2001, కనిష్టం రూ. 1702, సరాసరి రూ.1910 ధరలు లభించాయి. -
ఉగ్ర రక్కసిపై ఆగ్రహజ్వాల
జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ, మృతులకు నివాళిగద్వాలటౌన్: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని సకల జనులు ముక్త కంఠంతో ఖండించారు. ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృత్యువాత పడటంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పాత బస్టాండ్ చౌరస్తా నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు ప్రధాన రహదారుల వెంట కొవ్వొత్తులు, జాతీయ జెండాలు చేతపట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్పార్టీ ఇన్చార్జి సరిత, మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్ మాట్లాడారు. ఉగ్ర శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశమంతా ఐక్యంగా ఉందన్నారు. పర్యాటకులపై ఉగ్రమూకల జరిపిన దాడి హేయమైన చర్యఅని మండిపడ్డారు. దేశంపై ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న ఉగ్ర మూకలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్బాబు, ఇసాక్, డీటీడీసీ నర్సింహా, పులిపాటి వెంకటేష్, బాస్కర్యాదవ్, జగదీష్, రాజశేఖర్రెడ్డి, ఆనంద్, తిమ్మోతి, సురేష్, ఆనంద్గౌడ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నల్ల బ్యాడ్జిలతో ప్రార్థనలు జమ్ము కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా ముస్లింలు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లాలోని ముస్లింలు నల్ల బ్యాడ్జిలను ధరించి మసీదులలో ప్రార్థనలు చేశారు. అనంతరం మసీదు బయట ఫ్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలు మాట్లాడారు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి ప్రతి ఒక్కరి మనసును కలచివేసిందన్నారు. దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు. మనదేశ శాంతి, ఏకత్వాన్ని బలహీనపరచడానికి విదేశీ శక్తులను అనుమతించేది లేదన్నారు. -
సంగమేశ్వరా.. దారి చూపవా..
●కృష్ణాతీరంలోని సంగమేశ్వరుని దర్శనానికి సరిహద్దు పంచాయితీ ● ఏపీ పరిధిలోని ఆలయం చెంతకు తెలంగాణ బోట్లను రానివ్వకుండా అడ్డుపడుతున్న ఏపీ జాలర్లు ● స్వామి దర్శనానికి భక్తులకు తప్పని కష్టాలు ● ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే సంగమేశ్వరుడి దర్శనం పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.. కొల్లాపూర్ మండలం, నాగర్కర్నూల్ జిల్లా) సోమశిల వద్ద కృష్ణాతీరం వద్దకు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సంగమేశ్వరుడి దర్శనం కోసం కృష్ణానదిలో బోటులో వెళ్లాల్సి ఉండగా, ఏపీకి చెందిన సిద్దేశ్వరం, సంగమేశ్వర గ్రామాల జాలర్లు బోట్లను రానివ్వడం లేదు. కొద్ది దూరం బోటులో, తర్వాత ఆటోలో, మళ్లీ బోటులో ప్రయాణిస్తూ కష్టాలు పడుతున్నారు. పర్యాటకులు, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. – రామ్మోహన్, సోమశిల, సాక్షి, నాగర్కర్నూల్: ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే ఆలయం తెరచుకుని ఉంటుంది. మిగతా కాలమంతా నీటిలోనే మునిగి ఉంటుంది. ఏడు నదులు ఒక చోట కలిసే సంగమేశ్వర క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులకు ప్రయాసలు తప్పడం లేదు. కృష్ణాతీరానికి ఇరువైపులా ఉన్న స్థానిక గ్రామాల జాలర్లు, బోట్ల నిర్వాహకుల మధ్య వివాదం, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీని తీసుకువచ్చింది. ఫలితంగా సంగమేశ్వరుడి దర్శనం కోసం వస్తున్న భక్తులు, పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సప్త నదుల సంగమం, ఏడాదిలో నాలుగు నెలలే దర్శనం.. కృష్ణానది ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయం శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో బ్యాక్వాటర్లో మునిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని కొత్తపల్లి మండల పరిధిలో ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గాక ఆలయం కనిపిస్తుంది. మార్చి నుంచి జూన్ వరకు రిజర్వాయర్లో నీరు లేని సమయంలోని భక్తుల దర్శనానికి అందుబాటులో ఉంటుంది. మిగతా ఏడాదంతా నీటిలోనే మునిగి ఉంటుంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమారథి, భవనాశిని నదులు ప్రవహించే ఏడు నదుల సంగమ క్షేత్రంగా సంగమేశ్వరాన్ని పేర్కొంటారు. ఆలయంలో శివలింగాన్ని పాండవుల్లో ఒకరైన భీముడు రాయితో కాకుండా వేపధారు(చెక్క)తో ప్రతిష్ఠించడం ఇక్కడి ప్రత్యేకత. ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య సరిహద్దు వివాదం.. సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు నాగర్కర్నూల్ జిల్లాలోని కృష్ణాతీరంలో ఉన్న సోమశిలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటులో సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయం ఏపీ పరిధిలో ఉండటంతో సంగమేశ్వరం, సిద్దేశ్వరం గ్రామాలకు చెందిన జాలర్లు, బోట్ల నిర్వహకులు తెలంగాణ నుంచి వచ్చే బోట్లను అడ్డుకుంటున్నారు. తమకు ఆదాయం రావడం లేదని అభ్యంతరం చెబుతుండటంతో తరచుగా వివాదం చెలరేగుతోంది. దీంతో కొన్ని రోజులుగా సంగమేశ్వర దర్శనం కోసం వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొదట తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా సోమశిల నుంచి బోటులో బయలుదేరితే ఏపీ పరిధిలోని సిద్దేశ్వరం తీరం వద్ద బోటును నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలోని సంగమేశ్వరం వరకు ఆటోలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకుంటున్నారు. దర్శనం తర్వాత ఆటోలో సిద్దేశ్వరం వరకు వచ్చి, అక్కడి కృష్ణానదిలో ఏపీకి చెందిన జాలర్ల బోట్లలో సోమశిలకు చేరుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.300 ఖర్చు అవుతుంది. 3 గంటల సమయం పడుతోంది. ఇరు రాష్ట్రాల జాలర్ల సరిహద్దు వివాదంతో పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణాతీరంలోని సంగమేశ్వరుడి ఆలయం -
కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలి
ధరూరు: ఐకేపీ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా ఉండాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంతోపాటు మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల మహిళా సమాఖ్య సభ్యులతో మాట్లాడి కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేయాలని, మ్యాచర్ మిషన్ ఆధారంగా వచ్చిన తేమ వివరాలను తీసుకుని ధాన్యం సేకరించాలని మండల అధికారి శ్రీలత, ఐకేపీ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి తీసుకునే ఆధార్, పట్టాదార్ పాస్ బుక్, అకౌంట్ నంబర్ల జిరాక్స్ కాపీలను సరిచూసుకుని ధాన్యం సేకరించాలన్నారు. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలి గద్వాల క్రైం: పోలీసుస్టేషన్ పరిధిలో సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం వివిధ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్స్గా విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సమస్యలతో వచ్చిన బాధితులకు స్టేషన్లోని హెడ్ కానిస్టేబుల్స్ మాట్లాడి వాటిని పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కోర్టు కేసుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. సమావేశంలో సీసీఎస్ సీఐ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,339 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు గురువారం 299 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6339, కనిష్టం రూ. 3099, సరాసరి రూ. 5699 ధరలు పలికాయి. 6 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ 6300, కనిష్టం రూ 5869. సరాసరి రూ. 6308 ధరలు వచ్చాయి. 94 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 5921, కనిష్టం రూ. 4607, సరాసరి రూ. 5921 ధరలు పలికాయి. 1665 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.1980, కనిష్టం రూ. 1709, సరాసరి రూ.1960 ధరలు లభించాయి. మొక్కజొన్న క్వింటాల్ రూ.2,271 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డులో గురువారం మొక్కజొన్నకు క్వింటాల్ గరిష్టంగా రూ.2,271, కనిష్టంగా రూ.1,409 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,191, కనిష్టంగా రూ.4,000, ఆముదాలు గరిష్టంగా రూ.6,510, కనిష్టంగా రూ.5,841, జొన్నలు గరిష్టంగా రూ.4,355, కనిష్టంగా రూ.3,627, కందులు రూ.6,480, ధాన్యం హంస రూ.1,869, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.1,802, రాజేంద్ర రకం రూ.1,916 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.,2212, కనిష్టంగా రూ.1,806, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,769, కనిష్టంగా రూ.1,639, ఆముదాల గరిష్టంగా రూ.5950గా ఒకే ధర నమోదైంది. నేడు డయల్ యువర్ ఏటీఎం లాజిస్టిక్ స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీ లాజిస్టిక్ సమస్యల కోసం శుక్రవారం డయుల్ యువల్ ఏటీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇసాక్ బిన్ మహ్మద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ కార్గో సంబంధిత సమస్యలను 8125456978 నంబర్కు ఫోన్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామన్పాడులో 1,015 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో గురువారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు గాను 1,015 అడుగులు ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. దీంతో జలాశయంలోని ఎన్టీఆర్ కాల్వ ద్వారా 2 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల నుంచి 18, తాగునీటికి 20 క్యూసెక్కుల నీటిని వదిలారు. -
మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
పెంట్లవెల్లి: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని జటప్రోల్, గోప్లాపూర్ గ్రామాల్లో కొనసాగిన సంవిధాన్ పాదయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది నేతలు మన దేశం కనుమరుగు కాకూడదని ఎన్నో త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని కొందరు చూస్తున్నారని, ప్రజలు దీనిని ఎప్పటికీ సహించరన్నారు. బీఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనేత అని, ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఆ మహనీయుల కృషి ఫలితమే అన్నారు. ప్రతిఒక్కరూ మహనీయుల అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మండలంలోని జటప్రోల్లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, చైర్పర్సన్ వెన్నెల ప్రారంభించారు. కార్యక్రమంలో గోవింద్గౌడ్, రామన్గౌడ్, భీంరెడ్డి, గోపాల్, ఖదీర్, కుమార్ పాల్గొన్నారు. -
‘రియల్’ మోసాలు..
●● నడిగడ్డలో స్కీంల పేరిట యథేచ్ఛగా దందా ● కాలపరిమితి ముగిసినాస్థలాలు రిజిస్ట్రేషన్ చేయని వైనం ● రీ క్రియేషనల్ స్థలంలోనూవెంచర్లు ఏర్పాటు ● లబోదిబోమంటున్న బాధితులు ● నాలుగు నెలల్లో 93 ఫిర్యాదులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జిల్లాలో పలు రియల్ ఏస్టేట్ వ్యాపారులపై గ్రీవెన్స్లో ఫిర్యాదులు వస్తున్నాయి. మోసం చేసిన వ్యక్తులపై వివిధ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఎవరైన వెంచర్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రభుత్వ అనుమతి పొంది ఉండాలి. వెంచర్ అనుమతుల విషయంలో రెవెన్యూ, నగరపాలక, గ్రామీణ స్థాయిలో పంచాయతీ అధికారులు ధృవీకరించాలి. మొత్తం డబ్బు చెల్లించినా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకున్నా.. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి వెంచర్లు వేసినా వారిపై చీటింగ్ కేసులు నమోదు చేస్తాం. – శ్రీనివాసరావు, ఎస్పీ గద్వాల క్రైం: సొంతిళ్లు నిర్మించుకోవాలనేది ప్రతిఒక్కరి కల. దీనిని అవకాశంగా మార్చుకున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమాయక ప్రజలే లక్ష్యంగా కొత్త కొత్త స్కీంల పేరిట దందా నిర్వహిస్తూ ప్రజలను నట్టేట ముంచుతున్నారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు స్థలాలు ఇస్తామంటూ స్కీంల పేరిట వాయిదాల రూపంలో డబ్బులు వసూలు చేసి ఏళ్లు గడుస్తున్నా స్థలాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. వారి కబంధ హస్తాల్లో చిక్కుకుని న్యాయం కోసం బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని పార్కులు, విశ్రాంతి స్థలాల ఏర్పాటుకు కేటాయించిన రీ క్రియేషన్ స్థలాలు సైతం కబ్జా చేసి వీటిని కూడా వెంచర్లుగా చేసి ప్రభుత్వ ఆస్తులను సొంతం చేసుకునే కుట్రలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇటీవల వచ్చిన ఫిర్యాదులు.. ● 3.02.2025 తేదీన గద్వాల పట్టణానికి చెందిన ఓ రిటైర్డు ప్రొఫెసర్ 2000 సంవత్సరం నుంచి 2003 వరకు ఓం సాయి ప్రియ రియల్ ఏస్టేట్లో స్కీం పేరిట నెల వారిగా డబ్బులు చెల్లించాడు. వెంచర్లో సభ్యుడుగా కాలపరిమితి స్కీం డబ్బులు చెల్లించాడు. అయితే సదరు రియల్ ఏస్టేట్ వ్యాపారులు మాత్రం ఆ ఉద్యోగికి స్థలం రిజిస్ట్రేషన్ చేయలేదు. దీనిపై పలుమార్లు పంచాయితీలు చోటు చేసుకున్నాయి. నేడు రేపు అంటూ సాగదీశారు. మోసపోయినట్లు గుర్తించి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. ● 14.02.2025 తేదీన గట్టు మండలానికి చెందిన ఓకే కుటుంబానికి చెందిన ఏడుగురు తాము పూర్తిగా స్కీం డబ్బులు చెల్లించినా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. వీరికి రియల్ ఏస్టేట్ వ్యాపారి స్వయాన బంధువు కావడంతో ముబారక్ నైన్ రియల్ ఏస్టేట్లో 2013 నుంచి 2018 వరకు స్కీంలో ప్లాట్ కోసం డబ్బులు చెల్లించారు. కాలపరిమితి ముగియగా వారికి ఇవ్వాల్సిన ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించాల్సిందిగా రియల్ ఎస్టేట్ సభ్యులను కోరారు. త్వరలో రిజిస్ట్రేషన్ చేయిస్తామని నమ్మించారు. నేటికీ ఎలాంటి పురోగతి రాలేదు. ● 19.03.2025 తేదీన అయిజకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి న్యాయం చేయాలని పోలీసులను సంప్రదించారు. ఈయన అగ్రిగోల్డ్ రియల్ ఏస్టేట్లో 2012లో స్కీంలో ప్లాట్ కోసం డబ్బులు చెల్లించాడు. అయితే కాలపరిమితి ముగిసిన క్రమంలో ఆ సంస్థ నిర్వాహకులు బోర్డు తీప్పేయడంతో అయోమయంలో పడ్డాడు. ● 23.01.2025 తేదీన ఇటిక్యాల మండలానికి చెందిన ప్రైవేటు వ్యాపారులు సలీం, కలీం పోలీసులను ఆశ్రయించారు. వీరు ప్లాట్ల స్కీంలో భాగంగా 2014లో డబ్బులు చెల్లించారు. అయితే కాలపరిమితి ముగిసినా సదరు వ్యాపారులు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతూ వచ్చారు. నేటికి స్థలం రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో చివరికి వారు పోలీసులను ఆశ్రయించారు. ఇలా గద్వాల – అలంపూర్ సెగ్మెంట్లలో గడచిన నాలుగు నెలల వ్యవధిలోనే 93 ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయి. ఈ ఫిర్యాదులు సైతం జిల్లా పోలీసుశాఖ నిర్వహించిన ప్రజావాణిలో అందాయి. రెక్కలు ముక్కలు చేసుకొని వచ్చిన డబ్బును నెల నెలా చెల్లించామని, తీరా ఇన్నాళ్లకు స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వమంటే నేడు రేపు అంటూ తిప్పుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలని జిల్లా అధికారులను బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా.. గద్వాల జిల్లా కేంద్రంలో పార్కులు, విశ్రాంతి లేదా వినోదాల కోసం (రీ క్రియేషన్) కేటాయించిన భూములను సైతం రియల్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వే నంబర్లలో 57, 103, 413, 414, 415, 416, 419, 421, 422, 423, 424, 425, 426, 427, 431, 460 –494 వరకు, 671, 691, 707, 710,723, 745, 749, 758, 803, 906, 1091, 1090, 1039, 1079, 1031, 1035, 995,994, 993, 991 తదితర సర్వే నంబర్లలో 100 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇందుల్లో పార్కులు, క్రీడా మైదానాలు, క్యాంపసైట్లు, హైకింగ్, క్యాంపింగ్, ఈత కొలనులు తది తర వాటి కోసం భూములు కేటాయిస్తే వీటిని సైతం రియల్ ఏస్టేట్ వ్యాపారులు వెంచర్లుగా మార్చేశారు. ఈమేరకు పలువురు ఫిర్యాదులు సైతం చేశారు. -
భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం
మల్దకల్: ఎంతో కాలంగా భూసమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ బీఎం సంతోష్ రైతులకు సూచించారు. గురువారం మల్దకల్లో భూభారతి చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ధరణిలో ఉన్న చిన్న చిన్న పొరపాట్ల కారణంగా రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని, ప్రస్తుతం కొత్తగా వచ్చిన భూభారతిలో ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రత్యేక చట్టం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రైతులు భూసమస్యలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోనే పరిష్కరించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగ పరచుకోవాలన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పరిష్కారం కానీ సమస్యలు ఆర్డీఓ కార్యాలయంలో పరిష్కరించబడతాయన్నారు. భూభారతి ద్వారా తక్షణ రిజిస్ట్రేషన్తో పాటు సర్వే నంబరు, వ్యవసాయ భూమికి సంబంధించిన నక్ష ఉంటుందన్నారు. అదే విధంగా వారసత్వ భూములు, పెండింగ్ సాదా బైనామాల దరఖాస్తులను పరిష్కరించవచ్చన్నారు. మనిషికి ఆధార్కార్డు లాగే భూమికి భూదార్ సంఖ్యను కేటాయింపు చేస్తారని, భూ అక్రమాలకు అవకాశం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటుందని, అలాగే గ్రామాలలో ప్రజలకు భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టరు లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహశీల్దార్ షాహేదాబేగం, ఏఓ రాజశేఖర్, డిటీ ఝాన్సీరాణి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి
గద్వాలటౌన్: యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. గురువారం గద్వాల ప్రభుత్వ పీజీ సెంటర్లోని కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన సమ్మెకు పలు విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 21 వల్ల కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే రెగ్యులర్ చేయాలని, పార్ట్ టైం అధ్యాపకులకి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు మంగళగిరి శ్రీనివాసులు, మహేందర్, గోపినాథ్రాథోడ్, వంగూరి గణేష్లతో పాటు విద్యార్థి నాయకులు భాస్కర్, నవీన్కుమార్, శ్రీనునాయక్, కోటి, బలిచక్రవర్తి, మమత, స్పందన, శ్యామల, నిఖిత, మైథిలి తదితరులు పాల్గొన్నారు. -
జూరాల.. భద్రమేనా?
జూరాల జలాశయంలో తెగిన 8 గేట్ల ఇనుప రోపులు 62 రేడియల్ క్రస్ట్ గేట్లు.. జూరాల ప్రాజెక్టుకు మొత్తం 62 రేడియల్ క్రస్ట్ గేట్లు, 84 బ్లాకులు ఉన్నాయి. ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు ఈ 62 రేడియల్ క్రస్ట్ గేట్లను ఆపరేట్(పైకెత్తడం) చేయడం ద్వారా నీటిని దిగువనకు విడుదల చేసేలా సులభతరమైన విధానంలో రేడియల్ క్రస్ట్గేట్లు ఏర్పాటు చేశారు. అర్ధ చంద్రాకారంలో ఉన్న గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు గేట్లకు ఇరువైపులా రెండు రబ్బర్ సీల్స్, అడుగు భాగాన ఒక రబ్బర్ సీల్ ఉన్నాయి. ఆపరేట్ చేసేందుకు అవసరమైన ఇనుప రోప్లు గేటుకు ఇరువైపులా, కింది భాగాన రెండు చొప్పున ఇనుప రోపుల నిర్మాణం ఉంటాయి. వీటి సాయంతోనే మొత్తం రేడియల్ క్రస్ట్ గేట్లను అవసరమైనప్పుడు పైకి ఎత్తడం, దించడం చేస్తారు. భారీ వరద వస్తే.. 2009 సంవత్సరం మాదిరి జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల కర్ణాటకలోని టీబీ డ్యాం గేటు కొట్టుకుపోవడం, తాజాగా విజయవాడలోని కృష్ణా బ్యారేజీ గేట్లు దెబ్బతినడం ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడి మొత్తం గేట్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి భారీ వరదలు వచ్చినా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జూరాల ప్రాజెక్టు గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరుగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రమేనా..? 2009 సంవత్సరం మాదిరిగా మరోసారి వరద పోటెత్తితే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అంటే.. ప్రాజెక్టులోని తెగిన గేట్ల రోప్లు, ధ్వంసమైన రబ్బర్ సీల్ నిర్మాణాలను చూస్తే నిస్సందేహంగా లేదనే మాటే వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులకు సాగునీరందిస్తూ.. కీలకపాత్ర పోషిస్తున్న పెద్దన్నకు పెనుముప్పు తరుముకొస్తే.. అన్న ఆలోచన కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా పాలమూరుకు సాగు, తాగు నీరందిస్తున్న ప్రాజెక్టును.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అధికార యంత్రాంగం, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు.. కృష్ణాబేసిన్ పరిధిలో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఇందిరా ప్రియదర్శిని జూరాలను 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 37,700 ఎకరాలు, కుడి కాల్వ పరిధిలో ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 63,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. జూలై నాటికి పూర్తి.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల కిందట రూ.11 కోట్ల నిధులు వచ్చాయి. అయితే 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. కానీ, 2023లో గ్యాంటీక్రేన్కు సమస్య తలెత్తడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం గ్యాంటీక్రేన్ను పూర్తిస్థాయిలో రిపేరు చేశాం. శుక్రవారం నుంచి పనులు వేగవంతం చేసి జూలై నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – జుబేర్, ఈఈ జూరాల డ్యాం 18 చోట్ల రబ్బర్సీల్ దెబ్బతినడంతో లీకేజీలు మరమ్మతు నేపథ్యంలో నిలిచిన గ్యాంటీక్రేన్ సేవలు మూడేళ్లుగా 50 శాతం కూడా పూర్తికాని రిపేర్లు ఆందోళన కలిగిస్తోన్న అధికార యంత్రాంగం, పాలకుల వైఖరి -
రిపేర్లతో లీకేజీలు..
ప్రాజెక్టు మొత్తం 62 గేట్లలో 18 గేట్ల నుంచి ఏడాదిగా నీరు లీకేజీ అవుతోంది. ప్రధానంగా గేట్లు దెబ్బతినకుండా, రాపిడికి గురికాకుండా రక్షణ కల్పించే రబ్బర్ సీల్ పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు సహాయపడుతున్న ఇనుప రోప్లు పూర్తిగా దెబ్బతిని 8 గేట్లను ఆపరేటింగ్ చేయలేకపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన అధికారులు మొత్తం 62 గేట్లు మొదలుకొని రబ్బర్ సీల్స్, రోప్స్, పెయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెంథనింగ్ వంటివి మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసింది. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఒప్పందం గడువు ముగిసి.. మరోసారి పొడిగించిన గడువు ముగిసిపోయినా పట్టుమని 50 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ● ప్రస్తుతం డ్యాం పైభాగాన ఉన్న హయిస్ట్ బ్రిడ్జి, గేట్ల వద్ద ఉన్న వాక్వే బ్రిడ్జికి సంబంధించి సాండ్ బ్లాస్టింగ్ పనులు పూర్తి చేయగా.. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. రబ్బర్ సీల్ దెబ్బతినడంతో గేటు ద్వారా లీకేజీ అవుతున్న నీరు -
‘ఉపాధి’ కూలీలకు అధిక వేతనం వచ్చేలా చూడాలి
ఎర్రవల్లి/ఇటిక్యాల: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పఽథకంలో పనిచేసే కూలీలతో సరైన కొలతల ప్రకారం పనులను చేయించి అధిక వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. గురువారం ఎర్రవల్లి, ఇటిక్యాల మండలాల్లో పలు చోట్ల జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంత రైతుల యొక్క రవాణా సౌకర్యాల మెరుగుదలకు అవసరమయ్యే పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పనులు జరుగుతున్న ప్రదేశంలో కనీస వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు అబ్దుల్ సయ్యద్ఖాన్, అజార్ మెహియుద్దీన్, టిఎలు కృష్ణ, పురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
గద్వాలకు.. ప్రత్యేక సం‘స్థానం’
గద్వాల: అది క్రీస్తుశకం 16వ శతాబ్దం. అనగనగా ఒక రాజు.. ఒక రోజు వేటకు బయల్దేరాడు. ఇంతలో రాజు వెంట వచ్చిన కుక్కల్ని కుందేళ్లు తరిమికొట్టాయి. ఆ నేల విశిష్టతకు అబ్బురపడిన ఆ రాజు అక్కడే రాజ్యం స్థాపించాడు. అదే గద్వాల సంస్థానం.. (Gadwal Samsthanam) ఆ రాజు పేరు నలసోమనాద్రి (పెద సోమభూపాలుడు). ప్రస్తుతం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సోమనాద్రి కాలనీలో కోట (ప్రస్తుత ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం) నిర్మించుకున్నారు. పూడూరు రాజధానిగా గద్వాల సంస్థానాన్ని అలంపూరు, కర్నూలు, కర్ణాటక (Karnataka) వరకు రాజ్యాన్ని విస్తరించారు. 1663లో రాజ్యస్థాపన జరిగితే.. 1948 అంటే భారతదేశంలో విలీనమయ్యే వరకు గద్వాల సంస్థానం కొనసాగింది. గద్వాల సంస్థానాన్ని చివరగా ఆదిలక్ష్మీ దేవమ్మ మహారాణి పాలించారు.ఎల్లలు దాటిన రాజ్య విస్తరణ.. గద్వాల సంస్థానాన్ని నలసోమనాద్రి (పెద సోమభూపాలుడు) 1663లో స్థాపించారు. ఆయన 1712 వరకు పాలన కొనసాగించారు. నలసోమనాద్రి పాలనలో గద్వాల సంస్థానం ఎల్లలు దాటి విస్తరించింది. గద్వాల, అలంపూర్ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రంలో కూడా సోమనాద్రి పాలన కొనసాగింది. గద్వాలలో సోమనాద్రి పాలనలోని కోటగోడలు, పురాతన కట్టడాల ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి. పూడూరు, అయిజ, రాజోళి, ప్రాగటూరు, అలంపూరు, కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటకలోని రాయచూరు, సిరిగుప్ప ప్రాంతాల్లో నేటికీ సోమనాద్రి పాలన ఆనవాళ్లు సజీవంగా కనిపిస్తాయి. గద్వాల కోటలో నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయం, రాజుల నివాసాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అధికారంలో ఉన్న భూ భాగాలు ఇవే.. నడిగడ్డ ప్రాంతంలో.. గద్వాల, పూడూరు, ధరూరు, అయిజ, రాజోళి, బోరవెల్లి, ప్రాగటూరు, అలంపూరు. కర్నూలు ప్రాంతంలో.. కందనోలు, బండి ఆత్మకూరు, నంద్యాల, వెలుగోడు, శ్రీశైలం, చాగలమర్రి, అహోబిలం, సిరివెళ్ల, బనగానెపల్లె, బేతంచర్ల, డోన్, ఆదోని. కర్ణాటక ప్రాంతంలో.. మానవ (ప్రస్తుతం మాన్వి), రాయచూరు, సిరిగుప్ప ప్రాంతాలు నలసోమనాద్రి పాలనలో గద్వాల సంస్థానం కింద పరిపాలన కొనసాగించాయి.సాహిత్య పోషకులు.. గద్వాల సంస్థానాదీశులు సాహిత్య పోషకులుగా పేరుగాంచారు. వీరి హయాంలో పండితులు స్వర్ణయుగం (Golden era) చూశారనే చెప్పవచ్చు. అందుకే గద్వాలకు విద్వత్ గద్వాల అని పేరు వచ్చినట్లు చరిత్రకారులు నేటికీ చెబుతారు. -
భూ భారతితో రైతులకు మేలు
కేటీదొడ్డి: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం కేటీదొడ్డిలోని రైతువేదికలో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందని, భూ పరిపాలన వ్యవస్ధ అనేక దశల్లో అభివృద్ధి చెందిందని గతంలో జరిగిన కొన్ని చట్టాలు, సర్వేలు, పాసుబుక్లు, ఆర్.ఓ.ఆర్ చట్టం వంటి చర్యలను గుర్తుచేశారు. అనేక సమస్యలకు భూ భారతి చట్టం ద్వార పరిష్కారం లభించనుందని, ఇందులో ఆరు మాడ్యూల్స్ మాత్రమే ఉండడంతో దరఖాస్తు ప్రక్రియ సులభంగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస రావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, గ్రందాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, తహసీల్ధార్ హరికృష్ణ, నాయబ్ తహసీల్ధార్ శివశంకర్, ఏఓ సాజీద్ రెహమ్మాన్, ఆర్ఐ దేవెందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు. -
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
గద్వాల: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా నిరుపేదలైన అర్హులకు మాత్రమే అందించాలన్నారు. ఎల్–1 జాబితాలో ఉన్న 50వేల మంది లబ్ధిదారుల నుంచి నియోజకవర్గానికి 3500 చొప్పున ఏడు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉందన్నారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో బేస్మెంట్ స్థాయి పూర్తి చేసుకున్న 20 మందికి మొదటి విడతగా రూ.1లక్ష చొప్పున నిధులు విడుదల చేశామన్నారు. పనులు వేగవంతంగా పూర్వయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ గడువు ఈనెల 30వ తేదీన ముగుస్తుందని గడువు పెంచే అవకాశం లేనందున అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో నిర్ణీత లక్ష్యం మేరకు పన్ను వసూళ్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్రావు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు హౌసింగ్శాఖ అధికారులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల నియామకం.. గద్వాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య కాలేజీలో అవసరమైన ట్యూటర్లు, సీనియర్ రెసిడెంట్లు, అసోసియోట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తదితర నియామకానికి సంబంధించిన వివరాలను శనివారం నాటికి అందజేయాలన్నారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ఈసమావేశంలో ఆసుపత్రి సూపరిండెంట్ ఇందిర, కాలేజీ ప్రిన్సిపల్ నాగేశ్వర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఉగ్రదాడిపై పెల్లుబికిన నిరసనలు
గద్వాలటౌన్: జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై ఆగ్రహావేశాలు పెల్లుబిక్కాయి. ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు మృత్యువాత పడటంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని నిరసిస్తూ బుధవారం వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు వేర్వేరుగా నిరసనలు వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని నిరసిస్తూ వీహెచ్పీ, బీజేపీ తదితర సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోట నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు ప్రధాన రహదారుల వెంట భారీ కాగాడాలు, కొవ్వొత్తులు, జాతీయ జెండాలు చేతపట్టి ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతి చెందిన పర్యాటకులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్పాష, జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, ధర్మ ప్రసార సమితి ప్రాంత సంయోజక్ జగదీశ్వర్రెడ్డి, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు కరేంద్రనాథ్, మాట్లాడారు. ఉగ్ర శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశమంతా ఐక్యంగా ఉందన్నారు. పర్యాటకులపై జరిపిన ఉగ్రదాడులకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దేశంపై ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న ఉగ్ర మూకలను అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడులకు ప్రభుత్వం నుంచి ప్రతిచర్యను దేశ ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు గోపాల్రావు ఏక్బోటే, వైండింగ్ రాములు, దేవదాసు, రజక నర్సింహా, విజయ్కుమార్, ప్రభాకర్గౌడ్, గంట రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగడాలతో ర్యాలీ, మృతులకు నివాళి -
కల్తీ కల్లుతో బేజారు
కల్లుకు బానిసై తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతం ఏడాదిన్నర కిందట కల్తీ కల్లు సేవించి మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి సమీపంలోని తిమ్మసానిపల్లి, కోయినగర్, దొడ్లోనిపల్లి గ్రామాలకు చెందిన 20 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో చేరి వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్తీ కల్లు వినియోగిస్తూ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి క్రమంగా పెరుగుతోంది. ‘ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లక్ష్మయ్య. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలకేంద్రానికి చెందిన ఈయన కొన్నేళ్లుగా కల్తీ కల్లు తాగుతుండటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మెదడు దెబ్బతిని నోటమాట రాని పరిస్థితికి చేరుకున్నాడు. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో మెంటల్ హెల్త్ విభాగంలో చికిత్స తీసుకుంటున్నాడు. గ్రామాల్లో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్నారని, తనలాంటి బాధితులు ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని వాపోయాడు.’ -
ఎందుకీ వెనుకంజ..?
ఫలితాలపై పునశ్చరణ జరిగేనా..? ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు, ప్రత్యేక తర్ఫీదు ఇవ్వడంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరించారు. వీటితో పాటు ప్రధానంగా జిల్లాలో సుమారు 200 –250 మంది విద్యార్థుల వరకు పరీక్షలకు గైర్హాజరయ్యారు. వీటి వలన ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా, డీఐఈఓ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉండటం, కళాశాల ప్రిన్సిపల్కే అదనపు బాధ్యతలు అప్పగించి విద్యా సంవత్సరాలు నెట్టుకొస్తున్నారు. కళాశాలల తనిఖీకి వెళ్లి అక్కడ లోటుపాట్లు కన్పించినా అక్కడ సహచర ప్రిన్సిపల్ ఉండటంతో వారిపై చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తుండటంతో ఆ ప్రభావమూ విద్యార్థుల భవిష్యత్తుపై చూపుతోంది. నాణ్యమైన విద్య అందించినప్పుడే ఫలితాలు సైతం మరింత మెరుగ్గా ఉంటాయి. ఆ దిశగా ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఫలితాలపై పునశ్చరణ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ● ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో జిల్లా 20, 21వ స్థానం ● కొరవడుతున్న కార్యాచరణ, పర్యవేక్షణ ● ఫలితాల మెరుగుపై దృష్టి సారించని అధికారులు గద్వాలటౌన్: విద్యార్థుల ఉజ్వల భవితకు పునాదిగా భావించే ఇంటర్ ఫలితాలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల రెండింటా విద్యార్థులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గతేడాది కన్నా ఈ సారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగినా రాష్ట్రంలో 20, 21వ స్థానాలలో జిల్లా ఉండటం ఆందోళనకు గురిచేస్తుంది. ప్రత్యేక కార్యచరణ లోపించడం, పర్యవేక్షణ కొరవడటం పిల్లల చదువులపై దుష్ప్రభావం చూపుతుందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. జిల్లాలో మొత్తం 8 ప్రభుత్వ కళాశాలలు, 14 ప్రభుత్వ గురుకుల కళాశాలలు, ఆరు కస్తూర్బాగాంధీ విద్యాలయాలు, 13 ప్రైవేటు కళాశాలల్లో ఇంటర్ విద్య కొనసాగుతుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం 3,260 మంది విద్యార్థులకుగాను 1,864 మంది విద్యార్థులు మాత్రమే (57.18శాతం) ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2,963 మంది విద్యార్థులకుగాను 2,017 మంది విద్యార్థులు మాత్రమే (68.07 శాతం) ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలోనే 20వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రభుత్వ కళాశాలల్లో ఇలా.. జిల్లాలోని 8 ప్రభుత్వ కళాశాలల్లో సైతం ఫలితాలు నిరుత్సాహ పర్చాయి. మొదటి సంవత్సరంలో 1,360 మంది విద్యార్థులకు గాను 706 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే 41.91 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,208 మంది విద్యార్థులకుగాను 872 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అంటే 72.18 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడా దితో పోల్చితే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది.. ● ముఖ్యంగా కొన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఫలితాలు తీవ్ర నిరాశపర్చాయి. ఒక్క కళాశాలలో మినహా మిగిలిన ఏడు కళాశాలలో 60 శాతం ఉత్తీర్ణత దాటలేదు. మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫలితాలు మరి అధ్వానంగా వచ్చాయి. ఫస్టియర్లో కేవలం 20 శాతం మాత్రమే ఫలితాలు వచ్చాయి. అలంపూర్లో 31 శాతం, మానవపాడులో 37 శాతం మాత్రమే ఉత్తీర్ణత రావడం ఆందోళన కలిగిస్తుంది. గట్టు, ధరూర్ ప్రభుత్వ కళాశాల ఫలితాలు సైతం నిరాశజనకంగా ఉన్నాయి. సెకండియర్లో అలంపూర్ మినహా మిగిలిన అన్ని కళాశాలలో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ద్వితీయ సంవత్సరంలో గట్టు, అయిజ, అలంపూర్ కళాశాలల ఫలితాలు ఫర్వాలేదనిపిచ్చాయి. సీఈసీలో మరి దారుణం.. ప్రభుత్వ కళాశాలల సీఈసీ విభాగంలో దారుణమైన ఫలితాలు వచ్చాయి. గట్టు ప్రభుత్వ కళాశాల సీఈసీ ప్రథమ సంవత్సరం తెలుగు మీడియంలో జీరో ఫలితాలు వచ్చాయి. 11 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే అందరూ ఫెయిల్ అయ్యారు. సెకండియర్లో 19 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే కేవలం ఒక్కరే ఉత్తీర్ణులయ్యారు. మల్దకల్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 24 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే కేవలం ఇద్దరూ మాత్రమే పాస్ అయ్యారు. మానవపాడు కళాశాలలో తెలుగు మీడియంలో పది మందికి ఇద్దరూ, ఇంగ్లీష్ మీడియంలో 14 మందికి నలుగురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అలంపూర్లో ఇంగ్లీష్ మీడియంలో ఎనిమిది మందికి గాను కేవలం ఒక్కరే పాస్ అయ్యారు. గట్టు, ధరూర్లలో హెచ్ఈసీ ప్రథమ సంవత్సరం ఫలితాలు సైతం నిరాశపర్చాయి. ● ధరూర్ కళాశాల రెండో సంవత్సరం బైపీసీలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 22 మంది విద్యార్థులకు గాను 22 మంది ఉత్తీర్ణత సాధించారు. గద్వాల ప్రభుత్వ కో–ఎడ్యుకేషన్ కళాశాల ద్వితీయ సంవత్సరం సీఈసీ విభఈగంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. 31 మంది విద్యార్థులకు 31 మంది పాస్ అయ్యారు. కళాశాల ప్రథమ ద్వితీయ సం. సం. గద్వాల ప్రభుత్వ కళాశాల 59 74.8 గద్వాల బాలికల కళాశాల 57 70 ధరూరు కళాశాల 54 77 అలంపూర్ కళాశాల 31 56 గట్టు కళాశాల 46 64 మానవపాడు కళాశాల 37 70 మల్దకల్ కళాశాల 20 86 అయిజ కళాశాల 62.16 73.3 ఇంటర్లో నిరాశపరిచిన ఉత్తీర్ణత శాతం కారణాలెన్నో.. ఇంటర్ ఫలితాల్లో ఆశించిన ఉత్తీర్ణత రాకపోవడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. జిల్లాలో ఇంటర్ విద్యపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కళాశాలలకు సరైన దిశానిర్దేశం చేయకపోవడం, తరచూ బోధన తీరును సమీక్షించకపోవడం వంటి కారణాల వల్ల ఫలితాలపై ప్రభావం పడిందన్న భావన విద్యావేత్తల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక తరగతులు నిర్వహించినా విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలపై దృష్టి సారించకపోవడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడికి వచ్చే వారంతా పేద కుటుంబాలకు చెందిన వారే. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు పూర్తిగా తరగతులకు హాజరు కాకుండా మధ్యాహ్నం తర్వాత ఇంటికి వెళ్లిపోయే వారు. దీంతో వారికి అన్ని సబ్జెక్టులపై పట్టు లేకుండా పోయింది. విద్యార్థులు గైర్హాజరవుతున్నా అధ్యాపకులు చూసీ చూడనట్లు వ్యవహరించ డం మౌళిక వసతులేమి వంటివి ఫలితాలను దెబ్బతీశాయనే భావన వ్యక్తమవుతుంది. -
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
అలంపూర్: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అధికారులను ఆదేశించారు. కర్నూల్లోని నివాసంలో వారు ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇంట్రా, వాటర్ గ్రిడ్ అధికారులతో మంగళవారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు జీవనదులైన కృష్ణా, తుంగభద్ర నదుల్లో ప్రస్తుతం నీటి నిల్వలపై ఆరా తీశారు. నదుల్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కు చేరుకునే సమయంలో కలుషితమయ్యే అవకాశం ఉందని, నీటి నిల్వలు అడుగంటిన సమయాల్లో ఫిల్టరైజేషన్ సరిగ్గా నిర్వహించాలని సూచించారు. వేసవిలో నీటి నిల్వలు తగ్గిన సమయాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సాధారణ సమయంలో తాగునీటి కష్టాలు పడే గ్రామాల్లో వేసవిలో మరింత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, అలాంటి గ్రామాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు నీటిని అందించాలని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని అధికారులను సూచించారు. సమావేశంలో అధికారులు వెంకటరమణ, శ్రీధర్ రెడ్డి, పరమేశ్వరి, డీఈలు, ఏఈలు తదితరులు ఉన్నారు. -
‘పాలమూరు’ పనుల పరిశీలన
కొల్లాపూర్ రూరల్: మండలంలోని ఎల్లూరు సమీపంలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ పనులను ఈఎన్సీ అనిల్ కుమార్తో పాటు ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా 1, 2, 3 ప్యాకేజీల పనుల పురోగతిని తెలుసుకున్నారు. 3వ ప్యాకేజీ పనులను డ్రోన్ కెమెరాలతో పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో పాటు ప్రధాన కాల్వ పనులను పరిశీలించారు. పంప్హౌజ్, ప్రధాన కాల్వ హెడ్ రెగ్యులెటరీ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం కేఎల్ఐ మొదటి లిఫ్ట్ను సందర్శించి.. పంప్హౌజ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఎన్సీ మాట్లాడుతూ.. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 817 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కరివెన, వట్టెం రిజర్వాయర్ల పనులను త్వరగా పూర్తిచేసి.. 50 టీఎంసీల నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఈ సత్యనారాయణ రెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈలు, జేఈలు పాల్గొన్నారు. -
భూ భారతి చట్టం రైతులకు వరంలాంటిది
లింగాల/ బల్మూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం–2025 రైతులకు వరం లాంటిదని ఎంపీ మల్లురవి అన్నారు. మంగళవారం లింగాల, బల్మూరులోని రైతువేదికల్లో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు ఎంపీతోపాటు అదనపు కలెక్టర్ అమరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసి ధరణి వల్ల పేద రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారని, భూములు కోల్పోయారని దానిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో మార్పులతో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. అధికారులు వచ్చే నెలలో గ్రామాల వారిగా పర్యటించి సదస్సులు నిర్వహిస్తారని, ఇందుకోసం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని, ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించడానికి కసరత్తు జరుగుతుందని చెప్పారు. ఆధార్ కార్డు తరహాలో భూమికి భూదార్ సంఖ్య కేటాయించడం జరుగుతుందని, దీనివల్ల భూములు ఆక్రమణకు గురయ్యే అవకాశాలు ఉండవన్నారు. ప్రతిపక్షాలు తమ ఉనికి చాటుకోవడానికి ముఖ్యమంత్రిపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా వారి ఆటలు సాగవని, అలా చేస్తే ప్రజలే బట్టలూడదీసి ఉరికించి కొడతారన్నారు. అదనపు కలెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ సాదాబైనామాలు, వారసత్వ, అసైన్డ్, పొరంబోకు భూములలో ఉన్న లోపాలను సరి చేసుకోవచ్చన్నారు. భూ భారతి పోర్టల్లో పొందుపర్చిన రికార్డుల ఆధారంగా బ్యాంక్లు రుణాలు ఇస్తాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ చైర్మన్ రజిత, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, తహసీల్దార్లు పాండునాయక్, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు రంగినేని శ్రీనివాస్రావు, నాగేశ్వర్రావు, వెంకట్రెడ్డి, కాశన్నయాదవ్, రాంప్రసాద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రతిభ’ విద్యార్థుల విజయఢంకా
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయఢంకా మోగించారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో వైష్ణవి 468, ఉపేంద్ర 468, విజయలక్ష్మి 467, గణేశ్ 467, అక్షితారెడ్డి 467, సాయిచరణ్ 467, కీర్తి 466, భవనేష్ 466, అయిసా తహరీన్ 466, హర్షిత 466, వర్షిణి 466, హూరియా రశీద్ 466, విశాల్ 466, శోభారాణి 466, నవీన్కుమార్ 466, శ్రీనితీన్ 466, త్రిష 466 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో నెక్కొండ హాసి 436, వైష్ణవి 436, సుప్రజ 435 మార్కులతో ప్రతిభ చాటారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో అక్షిత 994, అమోఘ్ 993, భవిత 992, శివజ్యోతిక 992, అమిమ ఫాతిమా 992, వర్షిత్గౌడ్ 992 మార్కులు సాధించగా.. బైపీసీ విభాగంలో అక్షిత 994, అజీం కౌసర్ 991, జైన్బిన్ మొహమ్మద్ 990, భూమిక 990 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరంలో 400 పైగా 514మంది, ద్వితీయ సంవత్సరంలో 900 మార్కులకు పైగా 432 మంది సాధించినట్లు యాజమాన్యం పేర్కొంది. -
రైతు సంబరాలను అడ్డుకున్న పోలీసులు
గట్టు: మండలంలోని బల్గెరలో దిగంబరస్వామి జాతర సందర్భంగా మంగళవారం నిర్వహించాల్సిన రైతు సంబరాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గట్టు ఎస్ఐ మల్లేష్,మల్దకల్ ఎస్ఐ నందికర్, కేటిదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్తోపాటు భారీగా పోలీసు బలగాలు బల్గెరకు చేరుకున్నాయి. రైతు సంబరాలను నిర్వహించే బీఆర్ఎస్ నేత బల్గెర హనుమంతును అతని ఇంటి దగ్గరే హౌస్ అరెస్టు చేశారు. రైతు సంబరాలను నిర్వహించడానికి వీలు లేదని, అలా కాదని ఎవరైనా ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున హనుమంతునాయుడు ఇంటికి చేరుకున్నారు. కొంత సేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొన్నేళ్లుగా ప్రశాంతంగా నిర్వహిస్తున్న రైతు సంబరాలను ఇప్పుడు అడ్డుకోవడం ఏమిటని, రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసపూరితంగా అడ్డుకుంటున్నట్లు హనుమంతునాయుడు ఆరోపించారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎద్దుల యజయానులను పంపించేశారు. రాత్రి వరకు పోలీసులు బల్గెరలో పికెట్ ఏర్పాటు చేశారు. -
అనవసర భయం విద్యార్థి ప్రాణం తీసింది..
● ఇంటర్ ఫస్టియర్లో ఉత్తీర్ణత సాధించిన మల్లెందొడ్డి విద్యార్థి మల్దకల్: ఇంటర్లో ఫెయిల్ అవుతానేమోనన్న భయంతో మల్దకల్ మండలంలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. అయితే సదరు విద్యార్థి మంగళవారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. వివరాల్లోకి వెళ్తే.. మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన వినోద్ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్ వార్షిక పరీక్షల అనంతరం విద్యార్థి తాను రాసిన పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వినోద్ పాస్ కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అనవసర భయమే తమ బిడ్డ ప్రాణం తీసిందని వాపోయారు. తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి రాజోళి: తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజోళి మండలం మాన్దొడ్డి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మాన్దొడ్డికి చెందిన నడిపి ఆంజనేయులు (52) కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వాడు. ప్రస్తుతం తాటిముంజల సీజన్ కావడంతో, వాటిని విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే గ్రామ సమీపంలో తాటికాయలు తెంచేందుకు చెట్టుపైకి ఎక్కిన ఆయన.. ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. రేపు జాబ్ మేళా గద్వాల: నిరుద్యోగ యువతకు గద్వాల, హైదారాబాదు కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఈ నెల 24న జాబ్మేళా నిర్వహించునున్నట్లు ఎంప్లాయిమెంట్ జిల్లా అధికారి ప్రియాంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్మేళాలో పాల్గొనే నిరుద్యోగులు 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉండి ఎస్ఎస్సీ, ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు 24వ తేదీన గద్వాల పట్టణంలో బీసీ స్టడీసర్కిల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగే పాల్గొనాలని సూచించారు. నవభారత్ ఫర్టిలైజర్స్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుందని యువత సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.5,939 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు మంగళవారం 409 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 5939, కనిష్టం రూ. 2899, సరాసరి రూ. 3669 ధరలు పలికాయి. అలాగే, 20 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6319, కనిష్టం రూ. 5806, సరాసరి రూ. 3669 ధరలు వచ్చాయి. 117 క్వింటాళ్ళ ఆముదాలు రాగా గరిష్టం రూ. 5939, కనిష్టం రూ. 5639, సరాసరి రూ. 5879 ధరలు పలికాయి. 2294 క్వింటాళ్ళ వరి (సోన) రాగా గరిష్టం రూ.2046, కనిష్టం రూ. 1701, సరాసరి రూ.1945 ధరలు లభించాయి. -
నాసిరకం మట్టితో రైల్వే స్టేషన్ పనులు
అలంపూర్: జోగుళాంబ రైల్వే స్టేషన్ వద్ద నాసీరకం మట్టితో పనులు చేపడుతున్నారని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అలంపూర్ చౌరస్తా సమీపంలోని జోగుళాంబ రైల్వే స్టేషన్ వద్ద చేపడుతున్న పనులను ఆయనతోపాటు నాయకులు మంగళవారం సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సెంట్రల్ రైల్వే అధికారులు రెండేళ్లుగా పనులు చేపడుతున్నారని, అయితే, అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ట్రాక్ల పక్కన ఎర్రమట్టికి బదులుగా సుద్ద మట్టితో పనులు చేస్తున్నారని ఆరోపించారు. వర్షాకాలంలో ట్రాక్ పక్కన వేసిన సుద్ద మట్టి జిగురుగా మారి ప్రయాణికులు జారిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాసీరకం మట్టిని తరలించి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని రాజగోపాల్, పిడుగు వెంకటేష్, రాజశేఖర్ శర్మ, నాగేశ్వరరెడ్డి, సుధాకర్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, రవి, సుంకన్న, ఉపేంద్ర తదితరులు ఉన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో ‘రిషి’ సంచలనం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సంచలనం సృష్టించారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటినట్లు కళాశాల చైర్పర్సన్ చంద్రకళా వెంకటయ్య తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో భావన 468 మార్కులు సాధించగా.. మరో ఏడుగురు విద్యార్థులు 467 మార్కులతో ప్రతిభ చాటారు. బైపీసీలో మలిహా కహేకశ 438 మార్కులు సాధించగా.. ముగ్గురు 437, మరో ముగ్గురు 436 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో మేఘన 993తో పాటు మరో ఐదుగురు 990 మార్కులు సాధించారు. బైపీసీలో మలిహ తహనీయత్ 992 మార్కులు, మరో ఐదుగురు 990 మార్కులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంగళవారం కళాశాల యాజమాన్యం అభినందించింది. కార్యక్రమంలో కళాశాల అడ్వైజర్ వెంకటయ్య, అకాడమిక్ డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసన్నలక్ష్మి, రాఘవేందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డలు
సాక్షి, నాగర్కర్నూల్/వెల్దండ/వంగూరు/అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో పాలమూరు బిడ్డలు సత్తా చాటారు. నల్లమలలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన మండలి సాయికిరణ్ మంగళవారం విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో ఆలిండియా 298 ర్యాంకు సాధించారు. హైదరాబాద్లోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ, ఎంబీఏ పూర్తిచేసిన సాయికిరణ్.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం విశేషం. సాయికిరణ్ తల్లి పుష్పమ్మ గృహిణి కాగా.. తండ్రి మండలి లింగమయ్య ప్రస్తుతం పెద్దకొత్తపల్లి మండలంలో ఎంపీఓగా పనిచేస్తున్నారు. ● వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్యావత్ యశ్వంత్ నాయక్ సివిల్స్ ఫలితాల్లో 432వ ర్యాంకు సాధించారు. ఆయన గతేడాది యూపీఎస్సీ ఫలితాల్లో 627వ ర్యాంక్ సాధించి ఐపీఎస్గా మహారాష్ట్రకు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లోని నేషనల్ పోలీసు అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్ లక్ష్యంగా మరోసారి యూపీఎస్సీ పరీక్ష రాసి.. మెరుగైన 432వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని యశ్వంత్ నాయక్ చెప్పారు. కాగా, యశ్వంత్ తండ్రి ఉమాపతి హైదరాబాద్లో ఎస్పీఐ ఏజీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్, ఐఐటీ మద్రాస్లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. ● వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లికి చెందిన గోకమొల్ల ఆంజనేయులు పట్టుదలతో చదివి ఆలిండియా 934వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆంజనేయులు.. 1నుంచి 7వ తరగతి వరకు స్వగ్రామమైన తిప్పారెడ్డిపల్లిలో.. 8నుంచి 10వ తరగతి వరకు గాజరలోని ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇంటర్, ఐఐటీని కడప జిల్లా ఇడుపులపాయలో పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు. సివిల్స్లో అత్యుత్తమ ప్రతిభ చాటడంతో ఆయన తల్లిదండ్రులు శ్రీనివాసులు, కృష్ణమ్మతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. ●ఆన్లైన్లో శిక్షణ తీసుకున్నా.. నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ సాధించాలని లక్ష్యం ఉండేది. హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేశాక.. ఎంబీఏ చేస్తూనే సివిల్స్కు సన్నద్ధం అయ్యాను. ఏడాదిపాటు ఆన్లైన్లో శిక్షణ తీసుకుని ఇంటి వద్దే ఉండి ప్రిపేర్ అయ్యాను. నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం ఆనందంగా ఉంది. – సాయికిరణ్, మన్ననూర్ ● మూసాపేట మండలం నిజాలాపూర్కు చెందిన మునుగల్చేడ్ సత్యయ్య, యశోద దంపతుల కుమారుడు ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ జాతీయ స్థాయిలో 700 ర్యాంకు సాధించారు. గత మార్చి 30న విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 27వ ర్యాంకు సాధించిన అతడు.. ఈసారి యూపీఎస్సీ ఫలితాల్లోనూ సత్తా చాటారు. ఆయన అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి విద్యా సంస్థల్లో ఇంటర్(ఎంపీసీ), డిగ్రీ(బీఎస్సీ ఫిజిక్స్), పీజీ పూర్తి చేశారు. మొదటిసారి యూపీఎస్సీ పరీక్ష రాసి 700 ర్యాంకు సాధించారు. ఇదిలా ఉంటే, వెంకటేశ్ ప్రసాద్ తండ్రి సత్యయ్య ప్రస్తుతం కోయిలకొండ మండలంలో ఎలక్ట్రికల్ ఏఈగా పనిచేస్తుండగా.. తల్లి యశోద గృహిణి. పదేళ్లుగా సత్యయ్య కుటుంబంతో కలిసి మహబూబ్నగర్లోని శేషాద్రినగర్లో నివాసముంటున్నారు. ఐఏఎస్ కావడమే లక్ష్యం.. అమ్మా, నాన్న పోత్సాహంతో చదువులో రాణించాను. దూర ప్రాంతాల్లో నా విద్యాభ్యాసం పూర్తిచేశాను. యూపీఎస్సీ పరీక్ష కోసం ఢిల్లీలోని వాజీరాం కోచింగ్ సెంటర్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా. 15 నెలలపాటు కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే 700 ర్యాంకు వచ్చింది. ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. ఇందుకోసం మరోసారి ప్రయత్నం చేస్తాను. – ఎం.వెంకటేశ్ ప్రసాద్ సాగర్ ,నిజాలాపూర్