breaking news
Ananthapur
-
రాయదుర్గం: ఇద్దరు కూతుళ్లను చంపిన తండ్రి
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇద్దరు కూతుళ్లను చంపిన కసాయి తండ్రి కల్లప్ప.. బళ్లారి సమీపంలోని హైలెవల్ కెనాల్లో తోసేశాడు. చిన్నారుల అనసూయ (9), చంద్రకళ (10) మృతి చెందారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లులో ఘటన జరిగింది.దైవ దర్శనం కోసమని చెప్పి ఇద్దరు కూతుళ్లను చంపిన కల్లప్పకు దేహశుద్ధి చేసిన స్థానికులు.. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
క్రీడా స్ఫూర్తిని చాటాలి
● జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అనంతపురం: గెలుపు ఓటమిని సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటాలని క్రీడాకారులకు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రాంతీయ స్థాయి పాలిటెక్నిక్ కళాశాల క్రీడోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గిరిజమ్మ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించి, మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 16 కళాశాలల నుంచి మొత్తం 419 మంది క్రీడాకారులు పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి.జయచంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ రామకృష్ణారెడ్డి, మెకానికల్ విభాగాధిపతి యుగంధర్, సివిల్ విభాగాధిపతి వీరేంద్ర బాబు, ఆటోమొబైల్ విభాగాధిపతి చంద్రశేఖర్రెడ్డి, ఈసీఈ విభాగాధిపతి ఓబులేసు, జనరల్ హెడ్ శ్రీనివాసులు, పీఆర్వో కరుణ కుమార్ పాల్గొన్నారు. పెన్నహోబిలం హుండీ లెక్కింపు ఉరవకొండ రూరల్: ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సోమవారం ఆలయ ఇన్చార్జ్ ఏసీ తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు. 107 రోజులకు గాను శాశ్వత హుండీల ద్వారా నగదు రూపంలో రూ.23.81 లక్షల ఆదాయం సమకూరింది. కానుకల రూపంలో 9.5 గ్రాముల బంగారం, 256 గ్రాముల వెండి వచ్చింది. కార్యక్రమంలో అనంతపురం, బళ్లారికి చెందిన బాలాజీ సేవా సమితి, గుంతకల్లు హనుమాన్ సేవాసమితి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
సహజ వనరులు కొల్లగొడితే ఊరుకోం
● ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు సాగిస్తాం ● మాజీ మంత్రి శైలజానాథ్ బుక్కరాయసముద్రం: సహజ వనరులను కొల్లగొడితే చూస్తూ ఊరుకోబోమని, వాటి పరిరక్షణకు ఎందాకై నా పోరాటం సాగిస్తామని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ పేర్కొన్నారు. సోమవారం బీకేఎస్లోని నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా నశించి, ప్రజల జీవన ప్రమాణాలూ అడుగంటి పోయాయన్నారు. ఎటు చూసినా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై, వారి ఆస్తులపై దాడులు పెరిగి పోయాయని, ఇది మంచి పద్దతి కాదన్నారు. పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు సాగిస్తే రాజకీయం అని పేర్కొనడం సిగ్గు చేటన్నారు. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ దుర్మార్గాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. పుట్లూరు మండలంలో రైతు నాగలింగ మృతిపై ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోవడం బాధాకరమన్నారు. ఆ రోజు హడావుడిగా నాగలింగ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తరించిన వారు ఆ బాధిత కుటుంబానికి ఎందు సాయం అందించలేకపోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. నార్పలలో నిర్వహించిన రక్తదాన శిభిరంను విజయవంతం చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంతరెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, సర్పంచ్ పార్వతి, శింగనమల, నార్పల మండలాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు పూల ప్రసాద్, ఖాదర్వలి, నాయకులు పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి, నారాయణరెడ్డి, రవి, పవన్, పూల రవి, సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా టీచర్ల క్రికెట్ టోర్నీ
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రికెట్ మైదానం వేదికగా సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ టోర్నీ హోరాహోరీగా సాగింది. కళ్యాణదుర్గం, గుంతకల్లు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుంతకల్లు జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 93 పరుగులు చేసింది. అనంతరం కళ్యాణదుర్గం జట్టు 9 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. జట్టులో 39 పరుగులుచేసిన హుస్సేన్ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపిక చేశారు. అంతకుముందు పోటీలను డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో రాప్తాడు ఎంఈఓ మల్లికార్జున, బ్రహ్మసముద్రం ఎంఈఓ ఓబులపతి, క్రికెట్ సంఘం జిల్లా కార్యదర్శి యుగంధర్రెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాసులు, గోపాలరెడ్డి, మంజుల, గౌసియా తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అనంతపురం సిటీ: జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, ఆయా పోస్టుల భర్తీకి సంబంధించి కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 14 అంగన్వాడీ వర్కర్లు, 78 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. మంగళవారం నుంచి జిల్లా కార్యాలయం సహా ఆయా ప్రాంత ప్రాజెక్టు కార్యాలయాల్లో ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలకు http://ananthapuramu.ap.gov.in వెబ్సైట్ పరిశీలించవచ్చు. క్రమశిక్షణే కీలకం ● కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమంలో డీఐజీ డాక్టర్ షిమోషి అనంతపురం సిటీ: పోలీస్ శాఖ అంటే క్రమశిక్షణకు మారుపేరని, పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని అనంతపురం రేంజ్ డీఐజీ డా.షిమోషి ఆకాంక్షించారు. విశాఖపట్నం, ప్రకాశం, పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయవాడ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన 692 మంది కానిస్టేబుళ్లుగా ఎంపికై న అభ్యర్థులకు అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో సోమవారం నుంచి శిక్షణ తరగతులను డీఐజీ షిమోషి లాంఛనంగా ప్రారంభించారు. కోర్సు డైరెక్టర్ జె.మల్లికార్జున వర్మ, అనంతపురం పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఆర్.వాసుదేవన్, పీటీసీ ఇండోర్ విభాగం డీఎస్పీలు హరినాథరెడ్డి, అల్లాబకాష్, ఎం.సూర్యనారాయణరెడ్డి, ఫీల్డ్ ట్రైనింగ్ డీఎస్పీ వై.రవీంద్రనాథ్రెడ్డి పాల్గొన్నారు. ఇళ్ల మధ్యన గంజాయి సాగు ఆత్మకూరు: మండల కేంద్రంలో ఇళ్ల మధ్యన గంజాయి మొక్కలు పెంచుతున్న 69 ఏళ్ల వ్యక్తిని సోమవారం ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సయ్యద్ జాకీర్, సిబ్బంది అరెస్ట్ చేసి, సుమారు ఐదు అడుగుల ఎత్తున పెరిగిన 20 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పెద్దన్నను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక యాడికి: ఎస్జీఎఫ్ అండర్–14 జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టుకు యాడికి జెడ్పీహెచ్ఎస్లోని 8వ తరగతి విద్యార్థి ఎస్.మణికంఠ ఎంపికయ్యాడు. జనవరి 4న ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్ వేదికగా జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి. ప్రతిభ చాటిన మణికంఠను ఆ పాఠశాల హెచ్ఎం సీతారామాంజనేయులు, పీడీలు చంద్రకళ, శివశంకర్, ఉపాధ్యాయులు అభినందించారు. పలువురు పోలీసు అధికారులకు డిస్క్ అవార్డులు అనంతపురం: డీజీపీ కమండెషన్ డిస్క్ అవార్డులు సోమవారం ప్రకటించారు. ఇందులో జిల్లాకు చెందిన ముగ్గురు పోలీసు అధికారులకు సిల్వర్ (వెండి) డిస్క్ అవార్డు దక్కింది. వీరిలో అనంతపురం ఎస్ఐ షేక్ సైఫుల్లా, డీసీఆర్బీ హెడ్కానిస్టేబుల్ బి. నాగరాజు, ఎస్బీ సీఐ బి.క్రాంతి కుమార్ ఉన్నారు. అలాగే కళ్యాణదుర్గం రూరల్ సీఐ సి.నీలకంఠేశ్వర, పెద్దపప్పూరు ఎస్ఐ వి.అమానుల్లా, అనంతపురం హెడ్కానిస్టేబుల్ డి. భాస్కర్బాబు, జె.జగదీష్బాబు, డీఎస్బీ హెడ్కానిస్టేబుల్ పి.తిప్పేస్వామి, కూడేరు కానిస్టేబుల్ వి.వీర నరసింహరాజు, ఏపీఆర్సీ–83 డీఏఆర్ షేక్ మహమ్మద్ రఫీ, అనంతపురం త్రీ టౌన్ పీఎస్ డబ్ల్యూపీసీ సీహెచ్ ప్రభావతి, శెట్టూరు కానిస్టేబుల్ జి.నాగార్జున, అనంతపురం కానిస్టేబుల్ కె.రాజశేఖర్కు అవార్డులు దక్కాయి. -
మూల్యం చెల్లించక తప్పదు
● కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన వామపక్ష పార్టీల నాయకులు అనంతపురం అర్బన్: ప్రజా వ్యతిరేక పాలనకు మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సీపీఐ, సీపీఐ (ఎంఎల్ – న్యూడెమోక్రసీ), ఎస్ఈయూసీఐ, సీపీఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్ –లిబరేషన్) జిల్లా కార్యదర్శులు పాళ్యం నారాయణస్వామి, ఇండ్ల ప్రభాకర్రెడ్డి, రాఘవేంద్ర, చంద్రశేఖర్, వేమన, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నాగేంద్రకుమార్ మాట్లాడారు. మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఉపాధి హామీ చట్టానికి ఏటా నిధులు తగ్గిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేశారన్నారు. తాజాగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కొత్త బిల్లును పార్లమెంట్లో ఆమోదించడం సిగ్గుచేటన్నారు. నూతన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు కేశవరెడ్డి, పద్మావతి, లింగమయ్య, రమణయ్య, చిరంజీవి, కుళ్లాయిస్వామి, కృష్ణుడు, మంజూనాథ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు. -
శిశుగృహ పోస్టుల భర్తీకి రేపు ఇంటర్వ్యూలు
అనంతపురం సిటీ: స్థానిక బుడ్డప్పనగర్లోని శిశుగృహలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం కింద ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ జిల్లా కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. శిశుగృహలో ఓ చిన్నారి ఆకలిచావుకు గురి కాగా, అందుకు కారణమైన అక్కడి ఎనిమిది ఉద్యోగులను కలెక్టర్ ఆనంద్ శాశ్వతంగా విధుల నుంచి తొలగించిన విషయం విదితమే. మేనేజర్, సోషల్ వర్కర్, ఆయా పోస్టుల భర్తీకి ఈ నెల 6న నోటిఫికేషన్ విడుదల కాగా, అర్హత, ఆసక్తి ఉన్న పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 24న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మేనేజర్, సోషల్ వర్కర్ పోస్టుకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నర్సు, చౌకీదార్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి. నైపుణ్యాల మెరుగుతోనే వృత్తిలో రాణింపు బుక్కరాయసముద్రం: నైపుణ్యాలు మెరుగు పరుచుకున్నప్పుడే పోలీసు వృత్తిలో రాణించగలుగుతారని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని ఏపీఎస్పీ 14 బెటాలియన్కు నూతనంగా ఎంపికై న కానిస్టేబుళ్లకు ఎస్పీ జగదీష్ సూచించారు. సోమవారం బీకేఎస్ మండలం జంతలూరు వద్ద ఉన్న ఏపీఎస్పీ 14వ బెటాలియన్లో కానిస్టేబుళ్ల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ప్రభుకుమార్, అడిషనల్ కమాండెంట్ కేశవరెడ్డి, డీఎస్పీ శివారెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ మహబూబ్బాషా, ఎస్సీటీపీసీఎస్ పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. పొడరాళ్లలో టీడీపీ నేతల దౌర్జన్యం బుక్కరాయసముద్రం: మండలంలోని పొడరాళ్ల గ్రామంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంతో రస్తాను అడ్డుకున్నారు. స్థానికులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు సుబ్బరాయుడు, అతని కుమారులు సుబ్రహ్మణ్యం, లింగ, మరో ఇద్దరు కలసి పొలానికి వెళ్లే రస్తాలో ఎవరూ సంచరించకుండా అడ్డుకున్నారు. ఆ రస్తాలో 50 మంది రైతులకు చెందిన పొలాలు ఉన్నాయి. రస్తాను అడ్డుకోవడంతో పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో స్థానిక వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు నాగభూషణ సర్దిచెప్పబోతుండగా ఘర్షణకు దిగి నాగభూషణ కుమార్తె మెడలోని బంగారు నగను లాగి పడేశారు. దీంతో బాఽధిత నాగభూషణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. -
వేతన సవరణ చేసేదాకా పోరాడతాం
● డీసీసీబీ ఎదుట ఉమ్మడి జిల్లా పీఏసీఎస్ ఉద్యోగుల ధర్నా ● మద్దతు ప్రకటించిన డీసీసీబీ చైర్మన్, టీడీపీ నేతలు అనంతపురం అగ్రికల్చర్: హెచ్ఆర్ పాలసీ అమలు, వేతన సవరణ తదితర డిమాండ్లు నెరవేరే వరకూ పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల యూనియన్ నాయకులు హెచ్చరించారు. ప్రధాన సమస్యలతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై డీసీసీబీ ఉమ్మడి జిల్లా ఉద్యోగులు సోమవారం అనంతపురంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. డీసీసీబీ చైర్పర్సన్ ముంటిమడుగు కేశవరెడ్డి, శింగనమల టీడీపీ ముఖ్య నాయకులు ఆలం నరసానాయుడు, రామలింగారెడ్డి తదితరులు మద్దతు ప్రకటించి, దీక్షా శిబిరంలో కాసేపు కూర్చొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఏసీఎస్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా... చైర్మన్, ఇతర టీడీపీ నేతలు వారించకుండా పరోక్షంగా మద్ధతు ఇచ్చినట్లు సంకేతాలు ఇవ్వడం విశేషం. అనంతరం చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డికి వినతి పత్రం ఇవ్వగా... ప్రభుత్వం, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు సీపీఐ రాష్ట్ర నాయకుడు ఓబుళు, సీఐటీయూ నాగేంద్రకుమార్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్రెడ్డి మద్ధతు ప్రకటించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.శ్రీనివాసులు, డి.శ్రీనివాసులు, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు, హరికృష్ణ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ యూనియన్ ఉమ్మడి జిల్లా నాయకులు పి.హనుమంతరెడ్డి, ఎం.హనుమంతరెడ్డి, ప్రతాపరెడ్డి, దామోదర్, డి.నారాయణ, నగేష్, రామాంజనేయులు, నరేంద్రరెడ్డి, కేసీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 29న విజయవాడ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా ఉంటుందని నాయకులు ప్రకటించారు. -
వర్సిటీ అధికారులే బాధ్యత వహించాలి
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ విద్యార్థిని మాధుర్య మృతి చెందిందని, ఇందుకు యూనివర్సిటీ అధికారులే బాధ్యత వహించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. మాధుర్య కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు సోమవారం పాలక భవనం వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు హేమంత్, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గిరి శాంతరాజు, టీఎన్ఎస్ఎఫ్ యూనివర్సిటీ కార్యదర్శి నాగ తిరుపాల్ మాట్లాడుతూ అస్వస్థతకు గురైన పీజీ విద్యార్థిని మాధుర్యను ఆదివారం ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోవడం దురదృష్టకరమన్నారు. యూనివర్సిటీలో సకాలంలో వైద్యం అందకపోవడంతోనే మృతి చెందిందని, ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్యాంపస్ హెల్త్ సెంటర్ డాక్టర్లు ప్రతినెలా జీతాలు పొందుతున్నా విధులకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. హెల్త్ సెంటర్ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి వెంటనే రెండు కొత్త అంబులెన్స్ లు కొనుగోలు చేయాలన్నారు. మహిళా వసతి గృహాల్లో రాత్రి పూట ఒక డాక్టర్, ఒక నర్సు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థిని మాధుర్య కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. యూనివర్సిటీ పాత అంబులెన్స్ను ఆందోళన వద్దకు తెచ్చి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. 15 రోజుల్లో కొత్త అంబులెన్స్లు తెప్పిస్తామన్నారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు ఎల్లార్తి చంద్ర, నాగ్రేంద, నాయుడు, సూరి, పవన్, అంజి, నాగరాజు, మల్లి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో వైద్యం అందకే విద్యార్థిని మృతి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి ఎస్కేయూలో విద్యార్థినుల ఆందోళన -
అభాగ్యులకు అందని పింఛన్
● కలెక్టర్కు అర్జీల వెల్లువ అనంతపురం అర్బన్: వారంతా అభాగ్యులు. వయోభారంతో కొందరు.. ప్రమాదాల్లో వైకల్యం బారినపడిన మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. సామాజిక భద్రత పింఛన్ ద్వారా ఆర్థిక ఉపశమనం పొందుతామనుకుంటే చంద్రబాబు ప్రభుత్వంలో ఆ అవకాశం లేకుండా పోతోంది. ఏడాదిన్నర అవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం సతమతమవుతున్న అభాగ్యులు పింఛన్ కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహంచిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అర్జీలు ఇచ్చుకున్నారు. కలెక్టర్ ఆనంద్తోపాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, రమేష్రెడ్డి, తిప్పేనాయక్, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ వివిధ సమస్యలపై ప్రజల నుంచి 385 అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో.. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ఈయన పేరు మారుతీప్రకాష్. అనంతపురం శివారులోని చిన్మయనగర్లో నివాసముంటున్నాడు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించే ఈయన 2023 సంవత్సరం చివరులో ప్రమాదానికి గురవడంతో కుడికాలు తొడ వరకు తొలగించారు. గత ప్రభుత్వంలో దివ్యాంగ పింఛనుకు దరఖాస్తు చేయగా.. మంజూరు చేస్తున్నట్లు అనుమతి వచ్చింది. ఈలోగా ఎన్నికలు రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మంజూరు కాలేదని మారుతీప్రకాష్ ఆవేదన చెందాడు. ఇప్పటికై నా స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. అనంతపురంలోని కళ్యాణదుర్గం బైపాస్ సంతోష్నగర్లో నివాసముంటున్న ఈ వృద్ధుని పేరు జమాలుద్దీన్. 2011 నుంచి పింఛను తీసుకుంటున్నాడు. ఏడాది క్రితం పింఛన్ తొలగించారు. ఉన్న ఒక్క కొడుకు గుండెపోటుతో మరణించడంతో కోడులు పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆసరాగా ఉన్న పింఛను ఆగిపోవడంతో చాలా కష్టంగా ఉందని తెలిపాడు. పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కలెక్టర్ను వేడుకున్నానని చెప్పాడు. బుక్కరాయసమద్రంలో నివాసముంటున్న రేష్మా డ్రిప్ పైపుల కటింగ్ పరిశ్రమలో పని చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కుడిచేయి మిషన్లో ఇరుక్కుని ముక్కలైంది. 70 శాతంగా వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. పింఛను కోసం ఏడాదిగా తిరుగుతున్నా మంజూరు కాలేదని ఆవేదన చెందింది. భర్త పెయింటర్ అని, ఆయన సంపాదనంతా తాగుడుకు ఖర్చు చేస్తున్నాడని తెలిపింది. దివ్యాంగ పింఛను మంజూరు చేస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని చెప్పింది. -
సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
● పశు శాఖలో రూ.కోటి లూటీ వ్యవహారం అనంతపురం అగ్రికల్చర్: పశు సంవర్ధక శాఖలో వెలుగుచూసిన కుంభకోణంలో బాధ్యులపై చర్యలు మొదలయ్యాయి. ప్రాథమిక విచారణ తర్వాత ఆ శాఖ సీనియర్ అసిస్టెంట్ బి.సుశీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు సోమవారం డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఉత్తర్వుల కాపీని ఆ శాఖ మేనేజర్ ద్వారా సీనియర్ అసిస్టెంట్కు అందజేసినట్లు సమాచారం. రూ.కోటికి పైగా అక్రమార్కులు కొల్లగొట్టినట్లు ‘పశుశాఖలో గోల్మాల్’ శీర్షికన గత నెల 12న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. అనంతరం ఈ వ్యవహారంలో ఎంత మొత్తం చేతులు మారిందనే విషయంపై వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో నెల రోజులుగా ఆ శాఖ జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి ఆడిట్ బృందం, డైరెక్టరేట్ అధికారులు అంతర్గతంగా ప్రాథమిక విచారణ కొనసాగించారు. బ్యాంకు లావాదేవీలు నిర్వహించిన ఉద్యోగులు, అందుకు అనుమతించిన పనిచేస్తున్న, రిటైర్ అయిన అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పశుసంవర్ధక శాఖకు వివిధ బ్యాంకుల్లో ఉన్న ఖాతాల నుంచి బయటి వ్యక్తుల ఖాతాల్లోకి నిధులు మళ్లించినట్లు దాదాపు రుజువైనట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఎంత అనేది పూర్తిస్థాయి విచారణలో వెల్లడవుతుందని చెబుతున్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ, కొటక్ మహీంద్ర, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాల నుంచి రూ.1.03 కోట్లు వరకు నిధులు దారి మళ్లినట్లు గుర్తించారు. ఇందులో ఇరువురు కీలకపాత్ర వహించారని గుర్తించినట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా వివిధ బ్యాంకుల్లో ఉన్న పాత అకౌంట్లను జల్లెడ పట్టడం, మరికొన్ని బ్యాంకు ఖాతాల నుంచి నిధులు లేని పాత అకౌంట్లలోకి సొమ్ము మళ్లించి, అక్కడి నుంచి తమ కుటుంబ సభ్యులు, బయటి వ్యక్తుల ఖాతాల్లోకి పంపించినట్లు తేల్చారు. దీనిపై నెల రోజులుగా బాధ్యుల నుంచి వివరాలు సేకరించారు. అయితే సరైన సమాచారం, ఓచర్లు, బిల్లులు, ఇతరత్ర వివరాలు అందించకపోవడంతో చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్రస్థాయి విచారణ బృందం రానుందని సమాచారం. సీనియర్ అసిస్టెంట్తో పాటు విశ్రాంత జేడీ, అలాగే మరికొందరిని విచారణకు పిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. -
అన్నదాత వెతలు ‘అనంత’ం
అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి విపత్తులు.. పాలకుల నిరాదరణ.. అన్నదాతలను కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. వ్యయప్రయాసలకోర్చి పంటలు సాగు చేసి చేతికొచ్చే సమయంలో నష్టాలు రావడంతో కోలుకోలేకపోతున్నారు. పరిహారం ద్వారా ఆర్థిక ఉపశమనం కల్పించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో రైతులు విలవిల్లాడిపోతున్నారు. నిరాశా నిస్పృహల మధ్యే మంగళవారం జాతీయ రైతు దినోత్సవం (నేషనల్ ఫార్మర్స్ డే) నిర్వహించుకోనున్నారు. నాడు సంక్షోభం నుంచి సంక్షేమం వైపు.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న (2004 – 2009) సమయంలో వ్యవసాయ రంగం పురోగమనం వైపు పయనించింది. పెద్ద ఎత్తున సబ్సిడీలు అందించడంతో రైతులు కోలుకున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామన్న వైఎస్సార్ ప్రకటనను అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు హేళన చేశారు. విద్యుత్ తీగలు బట్టలు ఆరేసుకునేందుకు కూడా పనికిరావు. పరిహారం ఇస్తూ పోతే దానికోసమైనా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతులకు సబ్సిడీలు వేస్ట్’ అంటూ చులకన చేసి మాట్లాడారు. అయితే వైఎస్సార్ తన ఐదేళ్ల పాలనలో విమర్శలను పటా పంచలు చేసి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం బాట పట్టించారు. ఆ తర్వాత తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లూ (2019–2024) వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. ప్రకృతి కూడా సహకరించడంతో అన్నదాతలు కష్టాల నుంచి కోలుకున్నారు. ఉచిత విద్యుత్, ఉచిత బోర్లు, రైతు భరోసా, ఇన్పుట్సబ్సిడీ, ఇన్సూరెన్స్, సున్నావడ్డీ, పావలావడ్డీ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ఎక్స్గ్రేషియా, సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లు, విత్తనాలతో పాటు పాలవెల్లువ, యాంత్రీకరణ, ఎంఎస్పీ ద్వారా అమ్మకాలు చేపట్టారు. అడుగడుగునా వెన్నంటి నిలవడంతో రైతులు కష్టాల నుంచి గట్టెక్కారు. నేడు కష్టాల కడలిలో కర్షకులు ఇప్పుడు రైతుల పరిస్థితి తిరిగి మొదటికొచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం రాగానే మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వ్యవసాయంలో నష్టాలబాట పట్టారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కరువయ్యాయి. మరోపక్క ప్రకృతి కూడా సహకరించడం లేదు. అయితే అతివృష్టి.. లేదంటే అనావృష్టితో వ్యవసాయం చిన్నబోయింది. ‘సూపర్ సిక్స్’ అంటూ గొప్పగా చెప్పినా అమలుకు నోచుకోక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అన్నదాతా సుఖీభవను మొదటి సంవత్సరం ఎగ్గొట్టేసి, ఇప్పుడు రెండో ఏడాది చిల్లర విదిల్చారు. సకాలంలో విత్తనాలు ఇవ్వడం లేదు. విత్తన కేటాయింపులు, రాయితీలు కుదించేశారు. యూరియా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా చీనీ, అరటితో పాటు మొక్కజొన్న, పత్తి, కందులకు గిట్టుబాటు లేదు. అరకొరగా పండిన పంట ఉత్పత్తులను కూడా సరిగా అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా భావించే పాడి, పట్టు, పండ్లతోటల రైతులకూ ప్రోత్సాహకాలు కరువయ్యాయి. ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ తాత్సారం ‘వైఎస్సార్–జగన్’ హయాంలో రాయితీలు, ప్రోత్సాహకాలు ఫుల్ -
కరెంటోళ్ల జనబాట
● ప్రతి మంగళ, శుక్రవారాల్లో విద్యుత్ లైన్ల పరిశీలన అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ ఎస్ఈ శేషాద్రిశేఖర్ తెలిపారు. కార్యక్రమ పోస్టర్లను కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శేషాద్రిశేఖర్ మాట్లాడుతూ ప్రతి మంగళ, శుక్రవారాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది తమ పరిధిలోని గ్రామ, పట్టణ వార్డుల్లో తక్కువ ఎత్తులో ఉన్న స్తంభాలు, వేలాడుతున్న విద్యుత్ తీగలతోపాటు ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించాలన్నారు. మార్చాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు సంబంధించి నివేదికలు పంపాలన్నారు. కార్యక్రమంపై ఇప్పటికే ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దీంతో పాటు ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించి వినియోగదారుల సమస్యలపై సమాధానాలు ఇస్తూ వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు. -
శింగనమల ఎమ్మెల్యే కుటుంబం నుంచి ప్రాణహాని
● ఎస్పీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్త ఆందోళన గార్లదిన్నె: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని దళిత సామాజికవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ భార్యాపిల్లలతో కలిసి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం, శ్రావణిశ్రీ కోసం ప్రత్యేకంగా పనిచేశానని చెప్పారు. తన సేవలను గుర్తించి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించాలని కోరితే పట్టించుకోలేదన్నారు. వేరొకరికి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా తనపై కక్ష కట్టి రేప్ కేసు పెట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగానూ తనను అవమానించారని విలపించారు. ఎమ్మెల్యే శ్రావణిశ్రీ, ఆమె తల్లి బండారు లీలావతి, వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. పైగా తనపైనే ఏడు అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే అనుచరులు తనకు ఫోన్ చేసి చంపుతానని బెదిరించారని, ఈ విషయం పోలీసులకు తెలిపినా స్పందించలేదని చెప్పారు. తనకు జరుగుతున్న అన్యాయంపై విజయవాడలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్కు వెళ్లి నాయకులందరినీ కలిసి విన్నవించానన్నారు. జిల్లాలో టీడీపీ పెద్దలకు సమస్యను చెప్పుకునేందుకు వస్తే పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఒంటరివాడిని చేయాలని తనను సపోర్టు చేస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేసే పరిస్థితి కల్పిస్తున్నారన్నారు. గతంలో తనపై రౌడీషీట్, రేపిస్ట్ తదితర కేసులేవీ లేవని, అనవసరంగా ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్లు ● మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపు ఉంటే రూ.100 ఫీజు ● రూ.10 లక్షలు దాటితే రూ.1000 ఫీజు అనంతపురం టౌన్: వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూముల మార్కెట్ విలువ రూ.10లక్షల లోపు ఉంటే రూ.100, మార్కెట్ విలువ రూ.10 లక్షలు దాటితే రూ.1000 స్టాంప్ డ్యూటీ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ కోసం వారసత్వంగా ఎలా సంక్రమించింది.. వారసత్వ హక్కులు నిర్ధారించడానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, కుటుంబ పెద్ద మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు భూహక్కు పత్రాలను కచ్చితంగా జత చేయాలన్నారు. అవసరమైతే వ్యవసాయ భూమికి సబ్ డివిజన్ చేయించి సబ్ డివిజన్ పత్రాలను సైతం సమర్పించాలని తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే దగ్గరలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ సూచించారు. పర్యాటకాభివృద్ధికి చర్యలు అనంతపురం అర్బన్: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పర్యాటక అభివృద్ధి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు. వాటిపై దృష్టి సారించాలని చెప్పారు. గుత్తి కోట సమీపంలో కరిడికొండ ఐదు ఎకరాలు, ఎగువపల్లి (గార్లదిన్నె) 10 ఎకరాలు, గజరాంపల్లి (పామిడి) ఒక ఎకరా, భైరవాని తిప్ప ప్రాజెక్టు (గుమ్మఘట్ట) మూడు ఎకరాల స్థలం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని పర్యాటక శాఖ అధికారి జయకుమార్ కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్కియాలజీ మ్యూజియం, పాత జిల్లా జైలు, పీస్ మోమోరియల్ హాలు, జిల్లా సైన్స్ సెంటర్, శిల్పారామానికి ప్రజలు, పిల్లలు ఎప్పుడూ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరిలో గుత్తికోట ఉత్సవాలు గుత్తికోట ఉత్సవాలు 2026 జనవరి 24 నుంచి రెండు రోజుటపాటు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.50 లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్బాబు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, కమిటీ సభ్యులు సంధ్యామూర్తి, రవికాంత్ రమణ, నాగేశ్వరరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఐఈఎస్కు ఎంపికై న పెద్దొడ్డి యువకుడు
గుత్తి రూరల్: పెద్దొడ్డి గ్రామానికి చెందిన వంశీధర్రెడ్డి అనే యువకుడు ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్)కు ఎంపికయ్యాడు. భాస్కర్రెడ్డి, వరలక్ష్మి దంపతుల కుమారుడు వంశీధర్రెడ్డి తిరుపతి ఎస్వీ కళాశాలలో బీటెక్, ఐఐటీ ఖరగ్పూర్లో ఎంటెక్ పూర్తి చేశాడు. సివిల్ సర్వీసెస్ సాధించడమే ధ్యేయంగా ఢిల్లీలో కోచింగ్ తీసుకుని పరీక్ష రాశాడు. అయితే ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో వంశీధర్రెడ్డి ఆల్ ఇండియా 102వ ర్యాంకు సాధించి ఐఈఎస్కు ఎంపికయ్యాడు. వంశీధర్రెడ్డికి ఐఏఎస్ సాధించడమే ధ్యేయమని తల్లి వరలక్ష్మి సోమవారం తెలిపారు. వంశీధర్రెడ్డిని గ్రామస్తులు, స్నేహితులు బంధువులు అభినందించారు. -
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
ఆత్మకూరు: హంద్రీ–నీవా కాలువ పక్కన మట్టిపై టీడీపీ నేతల కన్నుపడింది. అంతే అడ్డూ అదుపు లేకుండా మట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున దందా సాగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆత్మకూరు మండలం వై.కొత్తపల్లి మీదుగా హంద్రీ–నీవా కాలువ వెళ్లింది. రెండు వారాల కిందట నుంచి టీడీపీకి చెందిన కొందరు హిటాచీ యంత్రాలు పెట్టి హంద్రీ–నీవా కాలువకు ఆనుకుని ఉన్న, సమీపంలోనే ఉన్న గుట్టలో మట్టి తవ్వుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వకాలు చేపట్టి పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా తరలించేస్తున్నారు. సారవంతమైన ఈ మట్టిని జిల్లా కేంద్రం అనంతపురం పరిసరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లకు చేరుస్తున్నారు. టిప్పర్ మట్టిని రూ.8వేల చొప్పున అమ్ముకుంటున్నారు. నిబంధనల ప్రకారం మట్టి తరలించాలంటే మైనింగ్, ఇరిగేషన్, రాయల్టీ, రెవెన్యూ అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏ శాఖల నుంచి కూడా అనుమతులు తీసుకోనట్లు తెలుస్తోంది. సాధారణంగా అనుమతి లేకుండా ట్రాక్టర్లో మట్టి తరలిస్తేనే సమాచారం అందిన నిమిషాల్లో దాడులు చేసి, వాహనాన్ని స్టేషన్కు తరలిస్తుంటారు. మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టిప్పర్ల రాకపోకలతో రోడ్డు కంకర తేలి గుంతలుపడిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లతో పాటు అధికారులకు ముడుపులు అందడం వల్లే మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హంద్రీ–నీవా కాలువ పక్కన భారీగా తరలిన మట్టికాలువ వెంట వెళ్తున్న టిప్పర్ అనుమతులు ఇవ్వలేదు హంద్రీ–నీవా కాలువ పక్కన ఉన్న మట్టిని తరలించరాదు. అక్కడ తవ్వకాలు చేపట్టేందుకు రెవెన్యూ శాఖ తరఫున ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదు. అసలు కాలువ పక్కన మట్టి తరలించడానికి అనుమతులు ఇచ్చే అధికారం మాకు కూడా లేదు. – లక్ష్మీనాయక్, తహసీల్దార్, ఆత్మకూరు హంద్రీ– నీవా కాలువ మట్టిపై ‘తమ్ముళ్ల’ కన్ను వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం అనుమతులు ఇవ్వలేదంటున్న రెవెన్యూ అధికారులు -
గుంతకల్లు.. పేకాట ఫుల్లు
ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లా, గుంతకల్లు నియోజకవర్గం నేడు పేకాటకు కేరాఫ్గా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా వెశాయి. జూదం ద్వారా కమీషన్లు ఫుల్లుగా వస్తుండటంతో శిబిరాలు విస్తరించుకుంటూ వెళ్తున్నారు. స్థానిక పోలీసుల నుంచి ఇబ్బందులు రాకుండా ముఖ్య ప్రజాప్రతినిధే చూసుకుంటుండటంతో నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.గుంతకల్లు: సులువుగా సంపాదించడం కోసం కొందరు జూదం బాట పడుతున్నారు. సంపాదన మొత్తం ఇందులో తగలేసి కుటుంబాలను కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. జూదంలో ఒకటైన పేకాట కోసం అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని వారు సమీపంలోని కర్ణాటక రాష్ట్రం బళ్లారి, రాయచూర్, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లేవారు. ఇది వ్యయప్రయాసలతో కూడుకున్నది. పేకాట స్థావరాలు స్థానికంగా ఉంటే వ్యాపారం మరింత ఎక్కువగా సాగుతుందని, నిర్వాహకులకు కావల్సినంత ఆదాయం సమకూరుతుందని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు – ప్రజాప్రతినిధులు ఆలోచించినట్టుంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరగానే గుంతకల్లు నియోజకవర్గాన్ని పేకాట స్థావరంగా మార్చేశారు.ఆదాయం భారీగా ఉండడంతో అధికార పార్టీకి చెందిన వారు పోటీపడి పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు. గుంతకల్లు పట్టణం, మండలంతో పాటు గుత్తి, పామిడి మండలాల్లోనూ విస్తరించారు. ఇప్పుడు రాయలసీమతో పాటు బళ్లారి నుంచి సైతం జూదరులు పేకాట ఆడేందుకు గుంతకల్లుకు వస్తున్నారు. దీంతో పేకాట మూడు పువ్వులు– ఆరు కాయలుగా వరి్ధల్లుతోంది. పేకాట ఆడేందుకు వచ్చిన వారికి అక్కడే మందు, మాంసాహారం, సిగరెట్లు తదితర సకల సౌకర్యాలూ సమకూర్చడంతో ఒక్కో శిబిరం వద్ద రోజూ రూ.లక్షల్లో లావాదేవీలు సాగుతున్నాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతున్న పేకాట శిబిరాలకు ‘స్థానిక పోలీసుల’ నుంచి ఇబ్బందులు రాకుండా తనే మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. దాడులతో అలజడిగుంతకల్లు నియోజకవర్గంలో విచ్చలవిడిగా వెలిసిన పేకాట శిబిరాలు, స్థానిక పోలీసుల ఉదాసీనత గురించి ఎస్పీ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సారథ్యంలోని ఎస్ఓజీ స్క్వాడ్ ఇటీవల పలు చోట్ల దాడులు చేయడంతో స్థానికంగా అలజడి రేగింది. గుంతకల్లు మండలం ఎన్.వెంకటాంపల్లి శివారులో మెరుపుదాడులు నిర్వహించి, దాదాపు రూ.19 లక్షల నగదు స్వా«దీనంతో పాటు 17 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం కసాపురం సమీపంలో మొబైల్ స్థావరంపై కసాపురం పోలీసుస్టేషన్ ఎస్ఐ వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిపిన దాడిలో రూ.1.70 లక్షల నగదుతోపాటు ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. గుత్తి మండలం జక్కలచెరువు, పూలకుంట, తొండపాడు గ్రామాల్లో ఇటీవల పోలీసులు దాడులు జరిపి రూ.2 లక్షల కు పైగా నగదు స్వా«దీనంతో పాటు 30 మందికి పైగా పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. అలాగే పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న, సహకారం అందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.పోలీసులను ఏమారుస్తారిలా..పేకాట నిర్వాహకులు పోలీసులను ఏమార్చేందుకు శిబిరాలను ఒక చోట నుంచి మరొక చోటుకు మార్చుకుంటూ పోతున్నారు. అలా గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో మొబైల్ పేకాట శిబిరాలుగా రూపాంతరం చెందాయి. ఎక్కడా రెండు రోజులకు మించి శిబిరం ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే శిబిరాలు ఎక్కడ ఉంటాయో జూదరులకు ఎప్పటికప్పుడు నిర్వాహకులు సమాచారం చేరవేస్తూ వస్తున్నారు. అలా ఎవరైనా పోలీసులు నామ్కే వాస్తుగా దాడులు చేయాలనుకున్నా దొరక్కుండా తెలివిగా తప్పించుకుంటున్నారు. -
సీఐపై కత్తితో యువకుడు దాడి
రాప్తాడురూరల్: అనంతపురం నగర శివార్లలో కాల్పుల మోత సంచలనం కలిగించింది. రెండు హత్యాయత్నాల కేసుల్లో నిందితున్ని పట్టుకోవడానికి వెళ్లిన సీఐపై కత్తితో దాడి చేయడంతో.. ప్రతిఘటించే క్రమంలో సీఐ తన సర్విస్ రివాల్వర్తో కాలి్చన సంచలన ఘటన అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి సమీపంలో జరిగింది. వివరాలు.. అనంతపురం నగరం నాయక్నగర్కు చెందిన చాకలి రాజా, సొహైల్, అక్రం, అజయ్ స్నేహితులు. వీరు ఆదివారం రాత్రి 8.15 గంటల సమయంలో నగరంలోని అరవిందనగర్లో అయ్యప్ప కేఫ్ వద్ద మద్యం సేవిస్తుండగా గొడవపడ్డారు. ఈక్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన అజయ్ తన స్నేహితుడు చాకలి రాజాను కత్తితో కడుపులో బలంగా పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు అజయ్ కోసం గాలింపు చేపట్టారు. మఫ్టీలో వెళ్లిన పోలీసులపై దాడికి యత్నం.. నిందితుడు అజయ్ సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో టీవీ టవర్ సమీపంలోని షికారు కాలనీలో ఉన్నాడనే సమాచారం అందడంతో ఇన్ఫార్మర్ ఆటోడ్రైవర్ బాబాను వెంట బెట్టుకుని టూటౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్ఐ రుష్యేంద్రబాబు, సిబ్బంది మఫ్టీలో వెళ్లారు. పోలీసులు రౌండప్ చేయడాన్ని పసిగట్టిన అజయ్.. తన దగ్గరికి వస్తున్న ఆటోడ్రైవరు బాబాను ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. ఆపై వీరంగం సృష్టిస్తూ మహిళలను కత్తితో బెదిరిస్తూ ముళ్లపొదల్లోకి దూరి పారిపోయాడు. చెరుకు తోటలో నక్కి ఉండి.. సీఐపై అటాక్.. వరుసగా దాడులకు పాల్పడుతున్న అజయ్ను పట్టుకోవాలని సవాల్గా తీసుకున్న పోలీసులకు ఆకుతోటపల్లి సమీపంలోని కందుకూరుకు వెళ్లే దారిలో ఓ చెరుకుతోటలో నిందితుడు దాక్కున్నట్లు సమాచారం రావడంతో చుట్టూ మోహరించారు. చెరుకు తోట ఏపుగా ఉండడంతో సీఐ శ్రీకాంత్ లోపలకు వెళ్లి లొంగిపోవాలని కోరాడు. అయితే సీఐ దగ్గరకు సమీపిస్తుండగా అజయ్ ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో భుజానికి గాయమైంది. మరోమారు దాడి చేసేందుకు రావడాన్ని గమనించిన సీఐ అప్రమత్తమై తన సర్విస్ రివాల్వర్తో రెండు రౌండ్లు కాల్చాడు.ఒక బుల్లెట్ అజయ్ మోకాలిలో దూరి బయటకు రావడంతో అక్కడే పడిపోయాడు. మరోవైపు సీఐ శ్రీకాంత్ గాయపడడంతో అక్కడే ఉండగా సిబ్బంది అక్కడికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అజయ్ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, సీఐ శ్రీకాంత్ పై యువకుడు కత్తితో దాడి చేయడాన్ని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయభాస్కర్ ఓ ప్రకటనలో ఖండించారు. అజయ్పై హత్యాయత్నం కేసు: ఎస్సీ జగదీష్ సీఐ శ్రీకాంత్పై కత్తితో దాడి చేసిన నిందితుడు అజయ్పై ఇటుకలపల్లి పోలీస్స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. సీఐ శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై రెండు కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీంచిన ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ నిందితుడిపై గతంలోనూ క్రిమినల్ కేసులున్నాయన్నారు. చట్టపరంగా నిందితుడిపై కఠిన చర్యలతో పాటు వారి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. -
అనంతపురంలో కాల్పుల కలకలం
సాక్షి, అనంతపురం: జిల్లాలోని ఆకుతోటపల్లిలో సోమవారం కాల్పుల కలకలం రేగింది. ఓ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్లిన టౌటౌన్ సీఐ శ్రీకాంత్పై దాడి యత్నం జరిగింది. దీంతో ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా సీఐ కాల్పులు జరపడంతో నిందితుడు గాయపడ్డాడు. స్థానికంగా ఉన్న అజయ్ అనే వ్యక్తి నిన్న మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో అజయ్ను అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అయితే నిందితుడు సీఐ శ్రీకాంత్పై కత్తితో దాడికి యత్నించగా.. ఆయన తన సర్వీస్ రివాల్వర్తో కాల్పులు జరిపారు. దీంతో అజయ్ కాలు నుంచి తూటా దూసుకెళ్లింది. ఈ ఘటనలో సీఐ శ్రీకాంత్కు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
వాసు పోస్టింగ్.. ఊస్టింగ్!
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ నేతలు అనుక్షణం సేవాభావం కలిగి ఉండాలి. సమాజ శ్రేయస్సుపై అంకితభావంతో మెలగాలి. చెప్పే మాటల్లో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి కన్పించాలి. అప్పుడే ప్రజల్లో మెప్పు, ఆయా రాజకీయ పార్టీల్లో పరపతి ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అంతే స్పీడ్గా తిరోగమనం చవిచూడాల్సి వస్తుంది. టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డే తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాసు వ్యవహారశైలితో విసిగిపోయిన టీడీపీ అధిష్టానం తాజాగా జిల్లా బాధ్యతల నుంచి తప్పించింది. జిల్లా తెలుగుదేశం పార్టీలో రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి కింగ్ పిన్... పార్టీ యావత్తు తన చుట్టే తిరిగేది. నియోజకవర్గాల్లో తాను సూచించిందే ఫైనల్. ఇది పదేళ్ల క్రితం మాట. క్రమేపీ తప్పించుకునే ధోరణి అలవాటు చేసుకున్నారు. ఉన్న కేడర్లో నమ్మకం సన్నగిల్లింది. కడప పార్లమెంటు పరిధిలో కీలక నేతగా ఉన్న ఆయన, కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. పోనీ కడప నియోజకవర్గంలో కూడా పార్టీ కేడర్కు భరోసాగా నిలిచారా?అంటే అదీ లేదు. అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనతో ఎన్నో ఏళ్లుగా టీడీపీ కోసం అంటిపెట్టుకొని వస్తున్నవారిని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. చివరికి కార్పొరేషన్ పాలకమండలిలో టీడీపీ పరువు నిలిపిన ఏకై క కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబానికి రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్నికలకు ముందు సర్వస్వం టీడీపీనే అనుకున్న వారిని క్రమేపి దూరం చేసుకుంటూ వచ్చారని పరిశీలకులు పేర్కొంటున్నారు.ఒంటెత్తు పోకడలు...దౌర్జన్యకర ఘటనలుటీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో తాను చెప్పిందే వేదం, తన మాటే శాసనం అన్నట్లు వాసు వ్యవహరించారు. కడప గడపలో వైరిపక్షానికి చెందిన రెండు బార్లు బలవంతంగా లాక్కున్న ఘటన తెరపైకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా మద్యం వ్యాపారంలో తలమునకలైనప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని సదరు మద్యం వ్యాపారి వాపోవడం గమనార్హం. టీడీపీ కేడర్పై అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనే ఇలాంటి దౌర్జన్యకర ఘటనలను ప్రోత్సహించేలా చేసిందని విశ్లేషకుల మాట. ఇలాంటి చర్యలతో విసిగిపోయిన టీడీపీ కేడర్ పొరుగు నియోజకవర్గానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి వద్దకు క్యూ కట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు పాటించడం, కమలాపురానికెళ్లి మరీ పుత్తాకు మొరపెట్టుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలను సరిదిద్దుకోవాలనే ఆలోచన లేకపోవడంతో అధిష్టానం వద్ద మరింత చులకన కావాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కడపలో నిర్దిష్ట అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టలేకపోయారు. ఎంతసేపు వైరిపక్షంపై కక్ష సాధింపు రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇలాంటి ఘటన లన్నీ కూడా అధ్యక్ష పదవి తొలగింపునకు ప్రధాన కారణమయ్యాయని పరిశీలకులు వివరిస్తున్నారు.టీడీపీ అధ్యక్షుడిగా భూపేష్కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జమ్మలమడుగు ఇన్ఛార్జి చదిపిరాళ్ల సుబ్బరామిరెడ్డి (భూపేష్రెడ్డి)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ప్రధాన కార్యదర్శిగా జబీబుల్లా (ప్రొద్దుటూరు)ను నియమించారు. కాగా భూపేష్ జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్పై ఆశలు పెట్టుకుంటే చిన్నాన్న ఆదినారాయణరెడ్డి పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవాల్సి వచ్చింది. గ్రూపు రాజకీయాలకు, అంతర్గత విభేదాలకు తావు లేకుండా ఉండేందుకే తాజాగా జిల్లా అధ్యక్ష పదవి అప్పగించి ఉంటుందని రాజకీయ వేత్తలమాట. పైగా అధిష్టానం రిమోట్ కంట్రోల్ ద్వారా పార్టీని చక్కదిద్దేందుకు కట్టబెట్టారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
జగన్ పుట్టినరోజుకు వేడుకలు చేస్తారా?
అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోలీసుల వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన వైఎస్సార్ సీపీ శ్రేణులను పోలీసులు టార్గెట్ చేశారు.బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి గ్రామ సర్పంచ్ ఆదినారాయణ రెడ్డి సహా ఐదుగురు వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా ఎందుకు నిర్వహించారంటూ పోలీసులు ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.జగన్ బర్త్డే వేడుకలకు సంబంధించి సరైన కారణాలు చెప్పకుండానే నేతలను అదుపులోకి తీసుకోవడం అక్రమ అరెస్టులేనని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన సాక్షి విలేఖరి శాంత కుమార్ని ఎస్సై నరేంద్ర దుర్భాషలాడు. -
ఫైనల్ రౌండ్కు తమిళనాడు
అనంతపురం కార్పొరేషన్: కొన్ని రోజులుగా ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ గ్రూప్ జీ మ్యాచ్లు ఆదివారంతో ముగిశాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ మ్యాచ్ల్లో తమిళనాడు జట్టు 9 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి ఫైనల్ రౌండ్ పోటీలకు జట్టు అర్హత సాధించింది. 6 పాయింట్లతో రెండో స్థానంలో పాండిచ్చేరి, మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఆంధ్ర , చివరి స్థానంలో అండమాన్ నికోబార్ జట్టు నిలిచాయి. చివరి లీగ్లో నెగ్గిన ఆంధ్ర.. చివరి లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 1–0 పాయింట్ల తేడాతో అండమాన్ నికోబార్ జట్టుపై విజయం సాధించింది. జట్టులో అక్ష రెడ్డి అద్భుత గోల్తో ఆంధ్ర విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఎన్నో ఏళ్ల తర్వాత సంతోష్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయం సాధించడం గమనార్హం. మరో మ్యాచ్లో తమిళనాడు జట్టు 3–0 గోల్స్ తేడాతో పాండిచ్చేరిపై విజయం సాధించింది. పుట్బాల్కు ఆదరణ ఎక్కువ.. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా పుట్బాల్కు మంచి ఆదరణ ఉందన్నారు. సంతోష్ ట్రోఫీలో ఆంధ్ర జట్టు విజయం సాధించడం క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపుతుందన్నారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలన్నారు. పుట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డేనియల్ ప్రదీప్ మాట్లాడుతూ... ఏపీఎఫ్ఏ అధ్యక్షుడు కోటగిరి నాయకత్వంలో ఏపీలో పుట్బాల్ క్రీడ పుంజుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది ఔత్సాహికులు పుట్బాల్ నేర్చుకుంటున్నారన్నారు. జూనియర్ గర్ల్స్ విభాగంలో ఏపీ జట్టు ఆల్ ఇండియాలో 7వ ర్యాంకు సాధించిందన్నారు. కార్యక్రమంలో పుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్, ఏపీఎఫ్ఏ కో ఆర్డినేటర్ రాయచోటి శ్రీనివాసులు, సిబ్బంది కిషోర్, చినరాజప్ప, సిరివెళ్ల శ్రీకాంత్, సాగర్, నాని పాల్గొన్నారు. ముగిసిన సంతోష్ ట్రోఫీ గ్రూప్ జీ మ్యాచ్లు -
సుదూర బస్సు సర్వీసుల బదిలీ
అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు పక్క డిపోలకు మళ్లించారు. అనంతపురం డిపో అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా బస్సుల నిర్వహణ భారంగా మారింది. సరైన మెయింటెనెన్స్ లేక బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. దీంతో జిల్లా కేంద్రం నుంచి సుదూర ప్రాంతాల సర్వీసులను తాడిపత్రి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ, గుత్తి, గుంతకల్లు డిపోలకు మళ్లించారు. వాస్తవానికి ఆ బస్సులు కూడా జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లాల్సిందే. స్వీయ తప్పిదాలు సరిదిద్దుకోలేని తనం, విధుల నిర్వహణలో సవాళ్లను స్వీకరించలేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వైఎస్సార్సీపీ హయాంలోనే కొత్త బస్సులు గత వైఎస్సార్సీపీ హయాంలోనే జిల్లాకు కొత్త బస్సులు వచ్చాయి. దీంతో సుదూర ప్రాంత సర్వీసులకు కొత్త బస్సులను కేటాయించి, ప్రయాణికులకు అప్పట్లో మెరుగైన సేవలు అందిస్తూ వచ్చారు. దీంతో ప్రయాణికులు కూడా ఆర్టీసీని ఆదరించారు. ఫలితంగా ఆర్టీసీ కొంత మేర నష్టాలను పూడ్చుకోగలిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ పూర్తిగా నిర్వీర్యమవుతూ వస్తోంది. రాబడి బాగున్న సర్వీసులన్నీ పక్క డిపోలకు పంపి, ఆయా డిపోలపై అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం ఇది వివాదాలకు కేంద్రీకృతమవుతోంది. రెండు సర్వీసులు బదిలీ.. అనంతపురం నుంచి హైదరాబాదుకు వెళ్లే రెండు సర్వీసులను బదిలీ చేస్తూ ఆర్ఎం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక సర్వీసు గుత్తికి, మరో సర్వీసు తాడిపత్రికి బదిలీ చేశారు. గతంలో చైన్నెకి 4 సర్వీసులుంటే ప్రస్తుతం ఒకటి మాత్రమే నడుస్తోంది. హైదరాబాదుకు 10 సర్వీసులుంటే, ప్రస్తుతం 6 ఉన్నాయి. నెల్లూరుకు 4 ఉండగా ప్రస్తుతం ఒకటి, ఒంగోలుకు రెండు ఉండగా, ఒకటి మాత్రమే నడుస్తున్నాయి. ఇక 14 సర్వీసులున్న బెంగళూరుకు ప్రస్తుతం 9 మాత్రమే నడుస్తున్నాయి. సమస్యకు పరిష్కారం ఇది కాదు.. సుదూర ప్రాంతాలకు జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ సర్వీసులను మళ్లించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమస్యను పరిష్కరించడమంటే పక్కకు తప్పుకోవడం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తప్పిదాలు జరగకుండా చర్యలు చేపట్టాల్సి ఉండగా... ఉన్న సర్వీసులన్నీ రద్దు చేస్తూ పోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా కేంద్రం నుంచి లాంగ్ సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో కనిపించని సర్వీసులు సవాలుగా తీసుకోని డిపో మేనేజర్లు స్వీయ తప్పిదాలను సరిదిద్దుకోలేని ఆర్టీసీ యాజమాన్యం... ఆ భారాన్ని ప్రయాణికులపై రుద్ది చేతులు దులుపుకుంది. ఫలితంగా సుదూర ప్రాంతాలకు బస్సు సర్వీసులు లేక ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. -
పాఠశాలల పని రోజుల్లోనే ‘ప్రణాళిక’ అమలుకు వినతి
అనంతపురం సిటీ: పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళికను పాఠశాలల పని రోజుల్లోనే అమలు చేయాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావుకు ఏపీ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు ఆదివారం వచ్చిన ఆయనను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రారెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ రాధాకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణప్ప, జిల్లా గౌరవాధ్యక్షులు గోపాల్, శివప్రసాద్, హెచ్.రామకృష్ణ, అరుడప్ప తదితరులు కలసి వినతి పత్రాన్ని అందించి, మాట్లాడారు. అనంతరం ఇదే వినతిని డీఈఓ ప్రసాద్బాబుకూ అందజేశారు. వంద రోజుల ప్రణాళిక అమలులో మార్పు చేయకపోతే ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒత్తిడికి గురై మంచి ఫలితాలు సాధించలేరన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. -
అప్పు చేసి.. ఐపీ పెట్టి..
బొమ్మనహాళ్: వ్యవసాయానికి పెట్టుబడులు కావాలంటూ తోటి రైతులు, వ్యవసాయ కూలీల వద్ద ఓ వ్యక్తి అప్పు తీసుకుని ఉడాయించిన ఘటనలో బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు గ్రామంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన మేరకు... దర్గాహొన్నూరు గ్రామానికి చెందిన రూపనగుడి మనోహర్ తనకున్న 4 ఎకరాల భూమిలో మిరప పంట సాగు చేయడానికి 43 మంది రైతులు, వ్యవసాయ కూలీల నుంచి రూ.40.85 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అనంతరం తన పేరు మీద ఉన్న 4 ఎకరాల భూమి, సొంత ఇంటిని ఇతరులకు విక్రయించి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం తన వద్ద ఎలాంటి ఆస్తులు లేవని, రెండు ఫ్యాంట్లు, రెండు షర్టులు మాత్రమే ఉన్నాయని, అప్పులు తీర్చలేని పరిస్ధితుల్లో ఉన్నానని 43 మంది రైతులు, వ్యవసాయ కూలీలకు ఐపీ నోటీసులు పంపాడు. దీంతో 43 మంది బాధితులు ఆదివారం బొమ్మనహాళ్ పీఎస్ వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. తన పొలం, ఇంటిని అమ్మి అప్పులు రూ.40.85 లక్షలు తీరుస్తానని నమ్మించి మోసం చేశాడంటూ వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు విన్నవించారు. రూ.40.85 లక్షలతో ఉడాయించిన వ్యక్తి -
అరటి ఎగుమతి
విదేశాలకు నిలిచిన.. తాడిపత్రి రూరల్: ఈ ఏడాది తాడిపత్రి నుంచి విదేశాలకు అరటి ఎగుమతి చేసే అవకాశాలు కనిపించడం లేదు. తాడిపత్రి రైల్వే స్టేషన్ ద్వారా ఏటా నవంబర్ నుంచి ఏసీ కంటైనర్లతో ముంబయి మీదుగా అరటిని విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఈ ఏడాది డిసెంబర్ నెల వచ్చినా ఒక్క కంటైనర్ కూడా తాడిపత్రి నుంచి ఎగుమతి కాలేదు. రైల్వే ఆదాయానికి గండి.. అరటి ఎగుమతుల ద్వారా తాడిపత్రి రైల్వే స్టేషన్కు భారీగా ఆదాయం ఉండేది. ప్రతి నెలా ఆరు నుంచి ఎనిమిది సార్లు అరటి గెలలను ముంబయికి రవాణా చేసేవారు. ప్రతి సారి 600 నుంచి 700 టన్నుల కాయలు మొత్తం 36 నుంచి 40 కంటైనర్ల ద్వారా ఎగుమతి అయ్యేవి. తాడిపత్రి నుంచి ముంబయికి ఒకసారి అరటి కాయలను ఎగుమతి చేస్తే రైల్వేకి దాదాపు రూ.17లక్షల అదాయం సమకూరేది. ఈ మూడు నెలల పాటు అరటి ఎగుమతి ద్వారా తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి రూ.3.50 కోట్ల ఆదాయం రైల్వేకు సమకూరేది. అరటికి తగ్గిన డిమాండ్.. తాడిపత్రి ప్రాంతం అరటికి విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ఆయా కంపెనీలు రైలు మార్గం ద్వారా ముంబయికి రవాణా చేయడం లేదని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మహారాష్ట్రలో ఎక్కువగా అరటి సాగులోకి రావడంతో పాటు రవాణా ఖర్చులు కూడా కలసి వస్తుండడంతో అక్కడి అరటి కొనుగోలుకు ట్రేడర్లు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఫలితంగా తాడిపత్రి నుంచి అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో తోటల నుంచి కంటైనర్లను తీసుకువచ్చే వాహనాలకు బాడగలు లేకుండా పోయాయి. కంటైనర్లలోకి అరటి బాక్స్లను లోడ్ చేయడం, చెట్ల నుంచి అరటి గెలలను కోయడం, వాటిని రసాయనాల్లో ముంచడం, కాయలను గ్రేడింగ్ చేయడం వంటి పనులు లేక వేలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. రూ.3.50 కోట్ల రైల్వే ఆదాయానికి గండి గతంలో రైల్వే ఏసీ కంటైనర్ల ద్వారా ఎగుమతి ట్రేడర్లు సంప్రదించలేదు -
‘కళ్యాణదుర్గంలో రౌడీ రాజ్యం’
అనంతపురం అర్బన్: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రౌడీ రాజ్యం సాగుతోందని సీఐటీయూ జిలా ్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఆర్వీనాయుడు, నాగేంద్రకుమార్ విమర్శించారు. ఎమ్మెల్యే పేరుతో రాజ్యాంగం, కార్మిక చట్టాలు, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఆ సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పని చేస్తున్న 670 మంది కార్మికులకు నెలలుగా వేతనాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే దౌర్జన్యాలు, బెదిరింపులు, పోలీసు ఒత్తిళ్లతో కార్మికులను అణిచివేసే చర్యలు ఊపందుకున్నాయని మండిపడ్డారు. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో రెండు నెలలుగా కార్మికులు రిలేదీక్షలు నిర్వహిస్తున్నా నేటికీ ఎమ్మెల్యే స్పందించ లేదంటే ఇది ఆయన అహంకారానికి, నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా అక్రమాలు, దౌర్జన్యాలను కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలి
రాయదుర్గం టౌన్: ఎంపీపీ ఎన్నికలో సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలని టీడీపీ శ్రేణులకు రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి హితవు పలికారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల బొమ్మనహాళ్ మండలం ఎంపీపీ రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో ఇన్చార్జ్ ఎంపీపీగా నాగరత్నమ్మను కలెక్టర్ నియమించారని గుర్తు చేశారు. మొత్తం 16 మంది ఎంపీటీసీల్లో 12 మంది వైఎస్సార్సీపీకి చెందిన వారు ఎలాంటి ప్రలోభాలకు గురికావడం లేదని, వారంతా ఐక్యంగానే ఉన్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు ప్రలోభాలకు గురవుతున్నారని, ఎంపీపీ పదవిని టీడీపీ కై వసం చేసుకుంటోందని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలకు దిగడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సమష్టి నిర్ణయంతో 12 మందిలో ఒకరిని ఎంపీపీగా త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ అన్ని మండలాల్లో ప్రజల విశ్వాసం గెలుచుకుని వైఎస్సార్సీపీ విజయఢంకా మోగిస్తుందన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు కూడా కాకుండానే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని, కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్లో ప్రజల నుంచి పాజిటివ్ అవుట్పుట్ రావడం లేదన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి మధ్య నెలకొన్న వివాదం కేవలం ఓ నాటకమని పేర్కొన్నారు. సమావేశంలో బొమ్మనహాళ్ మండల 12 మంది ఎంపీటీసీలతో పాటు వైఎస్సార్సీపీ కన్వీనర్ రామాంజనేయులు, వైస్ ఎంపీపీ రమేష్, నాయకులు కొత్తూరు తిమ్మప్ప, దేవగిరి హనుమేష్, రామకృష్ణ, వంశీ, రమేష్, వెంకటేశులు, లింగదహాళ్ చిదానంద, కోటేశ్వర్రెడ్డి, సీనియర్ నాయకులు లోకేష్, ఎంసీహెచ్ రాజ్కుమార్, సర్పంచ్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు -
ఫ్రీహోల్డ్ భూములకు పరిశీలన గ్రహణం
అనంతపురం అర్బన్: చంద్రబాబు పాలనలో అన్నదాతలను కష్టాలు వెంటాడుతున్నాయి. డి.పట్టా పొంది 20 ఏళ్లుగా అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేసి సంపూర్ణ హక్కు కల్పించి యజమానుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుని అమలు చేపట్టింది. జిల్లాలో 3.03 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ కల్పించడం ద్వారా 96 వేల మంది రైతులకు లబ్ధిచేకూర్చడమే లక్ష్యంగా ప్రక్రియ చేపట్టింది. అయితే టీడీపీ ప్రభుత్వం రావడంతో ఫ్రీ హోల్డ్ భూములకు పరిశీలనకు గ్రహణం పట్టింది. ఫ్రీహోల్డ్ చేసి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపేసింది. దీంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. భూములను పరిశీలన పేరుతో 18 నెలలుగా నాన్చుతూ వస్తోంది. పరిశీలన ప్రక్రియను 2026 జనవరి 11 వరకు పొడిగించింది. ఇదే క్రమంలో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ రిజిస్ట్రేషన్శాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. చివరికి అసైనీదారు చనిపోతే వారసులు మ్యుటేషన్ కూడా చేసుకోలేని దుస్థితిని కల్పించింది. తమ కష్టం బయటకు చెప్పుకుంటే అధికార పార్టీవాళ్లు ఎక్కడ ఇబ్బంది పెడతారోనని రైతులు భయపడుతున్నారు. 18 నెలలుగా ఎటూ తేల్చని చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో ఫ్రీహోల్డ్ భూములు 3.03 లక్షల ఎకరాలు రిజిస్ట్రేషన్లు జరగకుండా ఉత్తర్వుల జారీ -
మంత్రి ఇలాకాలో నాణ్యతకు తిలోదకాలు
● మూడు నెలలకే శిథిలమైన రహదారి ● నాణ్యత పట్టించుకోని రోడ్లు భవనాల శాఖ ● ఆగమేఘాలపై బిల్లుల చెల్లింపు విడపనకల్లు: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత ఇలాకాలో అభివృద్ధి పనుల్లో నాణ్యత పూర్తిగా లోపించింది. నాణ్యత లేకుండా నిర్మించిన పనులకు ఆగమేఘాలపై బిల్లులు చెల్లించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఫలితంగా రోడ్డు వేసిన మూడు నెలలకే కుంగిపోయి ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయి. రూ.1.50 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం.. విడపనకల్లు మండలం ఉండబండ సరిహద్దు నుంచి ఉరవకొండకు రూ.1.50 కోట్ల నిధులతో కొత్తగా తారు రోడ్డు వేశారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు పర్యవేక్షణ లోపించిన ఈ రహదారిని కేవలం 15 రోజుల్లోనే కాంట్రాక్టర్ ముగించేసి, బిల్లు చేసుకున్నాడు. ఉరవకొండ నుంచి పాల్తూరు మీదుగా ఆటోలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలే ఎక్కువగా తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఒకటి, రెండు లారీలు సంచరిస్తుంటాయి. రోడ్డు వేసిన మూడు నెలలకే ఎక్కడికక్కడ కుంగిపోయి భారీగా గుంతలు పడ్డాయి. అంతేకాక రోడ్డు శివారు భాగం పూర్తిగా నెర్రెలు చీలాయి. కేవలం కాంట్రాక్టర్ స్వలాభం కోసమే ఈ రోడ్డు వేశారని, తద్వారా రూ.1.50 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని స్థానికులు మండిపడుతున్నారు. -
జలం.. ఒడిసిపడితేనే పదిలం
రాయదుర్గం: ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాలకు జీవనాడిగా చెప్పుకునే తుంగభద్రమ్మ ఏటేటా ఉగ్రరూపం దాల్చుతోంది. అంచనాలకు మించి వరదనీరొచ్చి చేరుతోంది. ఆదేస్థాయిలో నీరూ వృథా అవుతోంది. ఎప్పటి నుంచో కార్యాచరణలో ఉండే సమాంతర కాలువను తెరకెక్కిస్తే భవిష్యత్తు తరాలకు మేలు చేకూరుతుంది. జిల్లాలోనూ అపార సాగునీటి వనరులు ఉన్నాయి. కానీ వృథా జలాలను సద్వినియోగం చేసుకోలేని దుస్థితి. తుంగభద్ర జలాశయం నుంచి ఏటా వందల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. దీనిని నివారించే దిశగా దివంగత నేత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేశారు. పలుమార్లు అప్పట్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో ఒక్కసారికూడా జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల విషయాన్ని చర్చకు తీసుకురాలేదు. దీంతో ఆశయం నెరవేరక వెక్కిరిస్తోంది. 420 క్యూసెక్కుల ఇన్ఫ్లో.. ఈ ఏడాది జూన్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు తుంగభద్ర జలాశయంలోకి 420.691 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 373.137 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని తాగు, సాగునీటి కోసం తుంగభద్ర బోర్డు 168 టీఎంసీలకు లెక్కించి వాటిని ఏపీ హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీకి 152.698 టీఎంసీలు, కర్ణాటక హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీకి 110.143 టీఎంసీలు, తెలంగాణకు 5.159 టీఎంసీలు కేటాయించింది. ఇప్పటికే కెనాళ్ల ద్వారా 116.091 టీఎంసీలు వినియోగించారు. ఈ లెక్కన గేట్ల ద్వారా 257.046 టీఎంసీల నీళ్లు దిగువన మళ్లీ సముద్రంలో కలిసిపోయాయి. వినియోగం కంటే రెట్టింపు జలాలు వృథా అయ్యాయి. ఏటా ఈ విధానం కొనసాగుతున్నా పాలకుల్లో చలనం కనిపించడం లేదు. బాబు మాటలన్నీ ఉత్తివే.. సీఎం చంద్రబాబు గతేడాది నవంబర్ 30న రాయదుర్గం నియోజకవర్గంలోని నేమకల్లులో పర్యటించారు. ఉంతకల్లు, నేమకల్లు మధ్య 5 టీఎంసీల సామర్థ్యంతో ఓ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ కార్యాచరణ చేపట్టలేదు. సమాంతర కాలువ ఏర్పాటైతేనే ఇది సాధ్యమవుతుందని ఇంజినీరింగ్ నిపుణులు చెపుతున్నారు. జిల్లాలో బీటీపీ, పీఏబీఆర్ లాంటి జలాశయాలు, మెజార్టీ చెరువులు నింపుకోవచ్చు. కేంద్రం తలిస్తే పూర్తిచేయడం కష్టమేమీకాదు. అయితే ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది. సమాంతర కాలువ చేపట్టాలిఏటా తుంగభద్ర నుంచి వందల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. సమాంతర కాలువ ద్వారా వాటికి అడ్డుకట్టు వేస్తే జిల్లాతో పాటు రాయలసీమ సస్యశ్యామలం కానుంది. అయితే సీఎం చంద్రబాబు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. – మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, రాయదుర్గం ఉంతకల్లు రిజర్వాయర్ ఏదీ?ఉంతకల్లు – నేమకల్లు మధ్య బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తామని సీఎం చంద్రబాబు గతేడాది హామీ ఇచ్చారు. నేటికీ కార్యాచరణ చేపట్టలేదు. తక్షణమే నిధులు విడుదల చేసి రిజర్వాయర్ పూర్తికి కృషి చేయాలి. – పరమేశ్వర, సర్పంచ్, నేమకల్లు జలం.. అవనికి బలం. ప్రాణకోటికి జీవనాధారం. పంట పొలాలకు ప్రాణాధారం. ఇంతటి విలువైన జలాన్ని ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తేనే కరువు జిల్లా అనంతపురానికి ప్రయోజనకరం. ఈ దిశగా చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించకపోవడంతో వందలాది క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. తుంగభద్ర నీళ్లు సముద్రంపాలు సమాంతర కాలువ ఏర్పాటుతోనే సస్యశ్యామలం -
నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు విన్నవించాలని సూచించారు. అర్జీలను meekosam.ap. gov.in వెబ్సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు. చిన్నారుల ఉజ్వల భవితకు రెండు చుక్కలు అనంతపురం మెడికల్: చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. పల్స్ పోలియోలో భాగంగా ఆదివారం నగరంలోని కోర్డు రోడ్డులో ఉన్న నెహ్రూ స్కూల్లో చిన్నారులకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు కలెక్టర్ ఆనంద్ పోలియో చుక్కల మందు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లాలో 2,84,774 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు చెప్పారు. తొలిరోజు వేయించుకోని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శశిభూషణ్రెడ్డి, ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుండెపోటుతో విద్యార్థిని మృతిరాప్తాడు రూరల్: ఎస్కేయూ విద్యార్థిని కాటెపోగు మాధుర్య (22) గుండెపోటుతో ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన కాటెపోగు పాపన్నకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కాగా, చిన్న కుమార్తె మాధుర్య ఎస్కేయూ గోదావరి హాస్టల్లో ఉంటూ క్యాంపస్ కళాశాలలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదువుతోంది. ఏడాదిన్నరగా చర్మవ్యాధితో బాధపడుతున్న ఆమె వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందింది. శనివారం స్వగ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చూపించగా ఓ ఇంజక్షన్ వేశాడు. అనంతరం వర్సిటీకి బయలుదేరి వచ్చింది. ఆదివారం ఉదయం హాస్టల్ గదిలో అపస్మారకంగా పడి ఉండడంతో సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా చర్మవ్యాధికి వైద్యులు సూచించిన మాత్రల డోస్ ఎక్కువైనందున గుండెనొప్పి లేదా, ఫిట్స్తో మృతిచెంది ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
యువకుడి ఆత్మహత్య
పెద్దపప్పూరు: మండలంలోని నరసాపురం గ్రామానికి చెందిన మల్లేష్ కుమారుడు అర్జున్ (24) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. శనివారం అర్ధరాత్రి విషపూరిత ద్రావకం తాగి అస్వస్థతకు గురి కావడంతో గమనించిన కుటుంబసభ్యులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సకు స్పందించక ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. యువతి బలవన్మరణం కళ్యాణదుర్గం రూరల్: క్షణికావేశంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు... పాలవాయి గ్రామానికి చెందిన ప్రసాద్, శివమ్మ దంపతులు బతుకు తెరువు కోసం కొన్నేళ్ల క్రితం అనంతపురానికి వలస వెళ్లి కురుగుంటలో స్థిరపడ్డారు. శనివారం చిన్నపాటి అంశానికి తల్లి మందలించడంతో క్షణికావేశానికి లోనైన వీరి కుమార్తె శ్రావణి (17) పురుగుల మందు తాగింది. అపస్మారకంగా పడి ఉన్న కుమార్తెను కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం శ్రావణి మృతి చెందింది. ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు కళ్యాణదుర్గం పోలీసులు తెలిపారు. నీటికుంటలో పడి బాలుడి మృతి పెద్దవడుగూరు: ప్రమాదవశాత్తు నీటి కుంటలోపడి ఓ బాలుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం రావులుడికి గ్రామానికి చెందిన సోమశేఖరరెడ్డి, సువర్ణ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాయలచెరువులోని సీవీ రమణారెడ్డి పాఠశాలో చదువుకుంటున్న పిల్లలు ఆదివారం సెలవు కావడంతో తల్లిదండ్రులతో కలసి పొలానికి వెళ్లారు. కాసేపటి తర్వాత కుమారుడు కమలేశ్వరరెడ్డి (9) ఒంటరిగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఉన్న కుంట వద్దకెళ్లి నీటిని చూస్తూ అదుపు తప్పి అందులో పడిపోయాడు. ఈత రాక నీటి మునిగి మృతిచెందాడు. చాలా సేపటి తర్వాత అటుగా వచ్చిన గొర్రెల కాపర్లు.. కుంటలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి, సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని వెలికి తీశారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బాలుడి మృతదేహం పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. రేషన్ బియ్యం స్వాధీనం పుట్లూరు: మండలంలోని నారాయణరెడ్డిపల్లి క్రాస్ వద్ద ఆదివారం అక్రమంగా తరలిస్తున్న 26 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సత్యబాబు తెలిపారు. నార్పల మండలానికి చెందిన డ్రైవర్ మహేంద్ర వారం రోజులుగా ఆ మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరతో పేదలనుంచి కొనుగోలు చేసి, శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బకు బొలెరోలో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వాహనాన్ని సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
భార్యను తుపాకీతో బెదిరించిన భర్త!
అనంతపురం: నగరంలో జిమ్ నిర్వాహకుడు రాజశేఖర్రెడ్డి వద్ద ‘గన్’ లభించడం కలకలంరేపింది. నగరంలోని విద్యుత్ నగర్కు చెందిన రాజశేఖర్రెడ్డి భార్య మనుషాను గన్తో బెదిరించిన విషయం తెలిసిందే. దంపతుల మధ్య కొన్నిరోజులుగా మనస్పర్థలున్నట్లు ఈనెల 11న నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో రాజశేఖర్రెడ్డి నుంచి పోలీసులు గన్ స్వా«దీనం చేసుకున్నారు. విచారణలో అతడు మధ్యప్రదేశ్ గ్వాలియర్లో గన్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఇద్దరు సీఐలతో రెండు దర్యాప్తు బృందాలు గ్వాలియర్కు వెళ్లి ఆయుధాల తయారీదారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పారిపోయినట్లు సమాచారం. పట్టుబడిన ఇద్దరిని ఓ పోలీసు బృందం అనంతపురం తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రాజశేఖర్ రెడ్డికి అనంతపురం నగరంలో సహకారం అందించిన వారిపైనా పోలీసులు దృష్టి పెట్టారు. అనంతపురం నగరానికి చెందిన ఇద్దరిని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి అక్రమ ఆయుధాలు అనంతపురంలో ఎంత మంది వద్ద ఉన్నాయనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. నగరానికి చెందిన వ్యక్తులకు అక్రమ ఆయుధాలు సరఫరా చేసే ముఠాకు సంబంధాలు ఉండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇలాంటి అక్రమ ఆయుధాలు ఇంకా ఎంత మంది వద్ద ఉన్నాయనే భయం వెంటాడుతోంది. జిమ్ నిర్వాహకుడు అయిన రాజశేఖర్ రెడ్డికి ఇంకా ఎంత మందితో పరిచయాలు ఉన్నాయనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
●జీవనోపాధి మెరుగైంది
వారిది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులతో పాటు కొడుకు కోడలు ఉంటారు. అప్పటిదాకా చిన్నపాటి టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగించేవారు. రోజూ రూ.800 నుంచి రూ.1000 దాకా వ్యాపారం జరిగేది. ఇంకాస్త పెద్దగా పెట్టుకుని వ్యాపారం పెంచుకుందామంటే ఆర్థిక ఇబ్బందులు సహకరించేవి కాదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేదోడు ఆర్థికసాయంతో పాటు, సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీ రుణాలతో హోటల్ స్థాయిని పెంచుకుంది. ఆర్థికాభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. ఇప్పుడు రోజువారి వ్యాపారం రూ.5వేలు జరుగుతోంది. కణేకల్లు మండలం కణేకల్ క్రాస్లో హోటల్ నిర్వహిస్తున్న బసవేశ్వర స్వయం సహాయక సంఘం సభ్యురాలు గోవిందమ్మ కుటుంబం సాధించిన విజయం ఇది. – అనంతపురం ఎడ్యుకేషన్/కణేకల్లు: -
వ్యవ‘సాయం’.. రైతు సుభిక్షం
●వైఎస్ జగన్ హయాంలో పండుగలా వ్యవసాయం ●అన్నదాతలకు ప్రతి అడుగులోనూ తోడుగా.. అనంతపురం అగ్రికల్చర్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పాలించిన 2019–2024 మధ్య కాలంలో అన్నదాత లోగిళ్లు సంక్షేమంతో వెల్లివిరిసాయి. వ్యవసాయ, అనుబంధ రంగాలను ఒకే గొడుగు కింద తీసుకువచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్బీకే వ్యవస్థకు నాందిపలికారు. ఏటా క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం రైతుభరోసా–పీఎం కిసాన్, ఇన్పుట్సబ్సిడీ, ఇన్సూరెన్స్, సున్నావడ్డీ అందించారు. ప్రతి నియోజకవర్గంలోనూ నాసిరకం, కల్తీ సరుకులను అరికట్టేందుకు వీలుగా రూ.కోట్లు వెచ్చించి ఆర్బీకేలు, అగ్రి, వెటర్నరీ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు మద్దతు ధరలు దక్కేలా చర్యలు చేపట్టారు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం అన్నదాతకు అండగా నిలబడ్డాడు. ఇలా వైఎస్ జగన్ హయాంలో వ్యవ‘సాయం’ రైతులకు సుభిక్షంగా మారింది. ఐదేళ్లలో రూ.1,937 కోట్ల ‘భరోసా’ వైఎస్సార్సీపీ హయాంలో పీఎం కిసాన్తో కలిపి రైతు భరోసా పథకం కింద రైతులకు ఏటా రూ.13,500 ప్రకారం అందించారు. ఐదేళ్ల కాలంలో ఒక్కొక్కరికి రూ.67,500 ప్రకారం జిల్లాలో 2.90 లక్షల మంది రైతు కుటుంబాలకు ఏకంగా రూ.1,937 కోట్ల మేర నేరుగా ఖాతాల్లోకి జమ చేశారు. రైతులపై ప్రీమియం భారం మోపకుండా ఐదేళ్లూ ఉచితంగా వాతావరణ బీమా, ఫసల్ బీమా పథకాలు అమలు చేశారు. ఐదేళ్లలో 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.1,205 కోట్ల మేర పరిహారం ఇచ్చారు. అలాగే పంట నష్టానికి రూ.377 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ జమ చేశారు. ఆత్మహత్య చేసుకున్న 280 మంది రైతు కుటుంబాల ఖాతాల్లోకి రూ.17.40 కోట్ల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. సున్నా వడ్డీ కింద 3.40 లక్షల మందికి రూ.72 కోట్లు అందించారు. మద్దతు ధర లేని సమయంలో ఎంఎస్పీ ద్వారా రూ.350 కోట్లు విలువ చేసే పంట ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ఇక 1.70 లక్షల వరకు వ్యవసాయ బోర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం రూ.వందల కోట్లు వెచ్చించారు. 40 శాతం రాయితీతో యాంత్రీకరణ పరికరాలు, 40 శాతం రాయితీతో విత్తన వేరుశనగ, విత్తన పప్పుశనగ ఇతరత్ర విత్తనాలు సకాలంలో పంపిణీ చేశారు. అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్పరికరాలు, ఉద్యాన రైతులకు ప్రోత్సాహక రాయితీలు, పాడి రైతులకు మంచి ధర లభించేలా అమూల్ పాలవెల్లువ అమలు చేశారు. ఇలా చెబుతూ పోతే 2019–24 మధ్య కాలంలో ప్రకృతి, పాలకులు సహకరించడంతో వ్యవసాయం సంక్షేమం దిశగా పయనం సాగించింది. -
డాక్టర్ కల సాకారం
ఉరవకొండ మండలం రాకెట్ల తండాకు చెందిన శ్రీనివాసులునాయక్, నాగలక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ, కంది తదితర పంటలు సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నారు. కుమార్తెలు అనితాబాయి, ఐశ్వర్య రాకెట్లలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్ ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. అనితాబాయికి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది. తల్లి ప్రోద్బలంతో 2017లో నీట్లో ఉత్తీర్ణురాలైన అనితాబాయి కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 2018లో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. రెండో సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాగానే ‘ఫీజు రీయింబర్స్మెంట్’ పథకం తల్లిదండ్రుల్లో ఎంతో ధైర్యం నింపాయి. ఫీజు రీయింబర్స్మెంట్తో చక్కగా చదువుకుని అనితాబాయి డాక్టర్ కల సాకారం చేసుకుంది. మరో అమ్మాయి ఐశ్వర్య ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా హార్టికల్చర్ కోర్సు పూర్తి చేసింది. – ఉరవకొండ అనితాబాయి -
సర్కారు బడి రూపురేఖలు మార్చారు
అనంతపురం సిటీ : ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే పాడుబడిన భవనాలు.. కూలేందుకు సిద్ధంగా ఉన్న పైకప్పులు.. గాలీ వెలుతురు లేని గదులు.. కనీసం సున్నానికి కూడా నోచుకోని గోడలు.. ఒక్కమాటలో చెప్పాలంటే భూత్ బంగ్లాలను తలపించేవి. ఇదంతా గతం. జగనన్న రాకతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. ‘నాడు–నేడు’ అమలుతో రూ.కోట్ల ఖర్చుతో ప్రభుత్వ బడుల రాత మార్చారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా డిజిటల్ బోధన– ఇంగ్లిష్ మీడియం బోధనతో సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దారు. ఊరూరా.. ప్రతి పాఠశాల అమ్మ ఒడిని తలపించేలా ప్రభుత్వ బడిని అన్ని హంగులతో పునర్నిర్మించారు. నాటి పాలన ఓ స్వర్ణయుగమని ఊరూరా కట్టిన బడులే సాక్ష్యంగా నిలిచాయి. జిల్లాలో నాడు–నేడు ఫేజ్–1 కింద రూ.213,73 కోట్లు, ఫేజ్–2 కింద రూ.365.50 కోట్లతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు. -
నాడు లాభాలు.. నేడు కన్నీరు
తాడిపత్రిటౌన్: నేను పదేళ్లుగా అరటి సాగు చేస్తున్నా. 2022 సంవత్సరం కరోనా సమయంలో పంటను అమ్ముకోలేని పరిస్థితి. అలాంటి సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ కిసాన్ రైలు ఏర్పాటు చేయించారు. మా ప్రాంతం నుంచి వేలాది టన్నుల అరటి దిగుబడులను ఢిల్లీ, ముంబాయి వంటి నగరాలకు చేర్చి రైతులు నష్టపోకుండా చూశారు. నేను అప్పట్లో ఎనిమిది ఎకరాల్లో అరటి పంట వేశా. రూ.7 లక్షల వరకు పెట్టుబడులు పెట్టా. కరోనా పరిస్థితుల్లోనూ టన్ను రూ.22 వేలతో అమ్మాను. సంవత్సరం పంట మీద దాదాపు రూ.20 లక్షలు ఆదాయం తీసుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం కావడంతో అన్న కొడుకు వివాహం ఘనంగా చేశాం. నేడు అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఏడు ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నా. నెలన్నర క్రితం పంట చేతికి వచ్చింది. టన్ను కేవలం రూ.2 వేలతో అమ్ముకోవాల్సి వచ్చింది. రూ.4 లక్షల దాకా నష్టపోయా. జగనన్న హయాం అరటి రైతులకు స్వర్ణయుగం లాంటిది. ఆనాటి ధర మళ్లీ ఏనాడూ చూడలేదు. – నాగమునిరెడ్డి, కేశవరాయునిపేట, యాడికి మండలం -
ఇదేం ‘పచ్చ’పాతం!
● వైఎస్ జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల తొలగింపు ● అధికారులు, టీడీపీ నేతల దాష్టీకం అనంతపురం క్రైం: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని అనంతపురం నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శనివారం టీడీపీ నాయకులు, అధికారులు తొలగించి ‘పచ్చ’ పాతాన్ని చాటారు. జిల్లా కేంద్రంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఒక రోజు ముందే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. టవర్క్లాక్ వంతెనకు ఇరువైపులా, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడానికి శనివారం ఉదయమే నగర పాలక సంస్థ సిబ్బంది పూనుకున్నారు. విషయం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఫ్లెక్సీలు తొలగించిన టౌన్ప్లానింగ్ సిబ్బందిని నిలదీశారు. కళ్లముందే అధికార పార్టీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకల ఫ్లెక్సీలు కనిపిస్తున్నా వాటిని ముట్టుకోకుండా.. తమ అధినేత ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తొలగిస్తున్నారని ప్రశ్నించారు. అయితే.. స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకే ఫ్లెక్సీలు తొలగించాల్సి వచ్చిందని టౌన్ ప్లానింగ్ సిబ్బంది చెప్పడం చర్చనీయాంశమైంది. 6 గంటలకే ప్రజా ప్రతినిధికి సమాచారం నగరపాలక సంస్థలోని టౌన్ప్లానింగ్ ఉద్యోగి ఒకరు స్థానిక ప్రజా ప్రతినిధికి ఉదయం ఆరు గంటలకే వైఎస్ జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల గురించి సమాచారం చేరవేశారు. దీంతో ఎలాగైనా ఫ్లెక్సీలను తొలగించాలని సదరు ప్రజాప్రతినిధి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడికక్కడ తొలగించేందుకు పూనుకున్నారు. ఫ్లెక్సీలు తొలగిస్తున్న నగరపాలక సంస్థ సిబ్బందిని వైఎస్ జగన్ అభిమానులు, నాయకులు అడ్డుకుంటున్న దృశ్యాలను సైతం వీడియోలు తీసి సదరు ప్రజాప్రతినిధికి పంపినట్లు సమాచారం. శనివారం ఉదయం నగరపాలక సంస్థ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి ఫ్లెక్సీలను తొలగింపజేసీన అధికార పార్టీ నేతలు అంతటితో ఆగలేదు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి నగర పాలక సంస్థ కమిషనర్ అనుమతించారన్న విషయం తెలుసుకున్న టీడీపీకి చెందిన అల్లరి మూకలు రాత్రి 9.30 గంటలకు టవర్క్లాక్ ఫ్లై ఓవర్పై ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో సైతం ఫ్లెక్సీలను తొలగించారు.అనంతపురంలో ఎన్నడూ లేని విధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అధికార పార్టీ నాయకులు వ్యవహరించటాన్ని వైఎస్సార్సీపీ నేతలు తప్పుబట్టారు. వైఎస్ జగన్ జన్మదిన వేడుకల ఫ్లెక్సీలను నగరపాలక సంస్థ జీపులో నుంచి తీసుకుంటున్న వైఎస్సార్సీపీ నాయకులు అనంతపురం రామ్నగర్ 80 ఫీట్ రోడ్డులో ఫ్లెక్సీలను తొలగిస్తున్న నగరపాలక సంస్థ సిబ్బందిని అడ్డుకుంటున్న వైఎస్సార్సీపీ నాయకులు దుష్ట సంప్రదాయానికి తెరతీస్తున్నారు.. నగరంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం నిర్వహించినా.. ప్లెక్సీలు కట్టే సాంప్రదాయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ నేతలు దుష్ట సాంప్రదాయానికి తెర తీస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటో చూస్తేనే .. అధికార పార్టీకి వణుకుపుడుతోంది. ఈ నెల 15న అనంతపురంలో జరిగిన భారీ బైక్ ర్యాలీ, 18న విజయవాడలో జరిగిన కోటి సంతకాల ప్రతుల భారీ ర్యాలీకి అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈనెల 21న తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్న తరుణంలో నగరంలో ప్లెక్సీలు కట్టారు. ప్రజాదరణను జీర్ణించుకోలేక ఫ్లెక్సీలు తొలగించడం సరికాదు. ఫ్లెక్సీలు ఎవరు తొలగించారో.. సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు తక్షణమే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పామిడి: పామిడి 44వ నంబర్ జాతీయ రహదారిపై నీలూరుక్రాస్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటచార్ (60), ఆయన భార్య గీతమ్మ (55) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్ఐ రవిప్రసాద్ తెలిపిన మేరకు.. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ల్లాపూర్ నుంచి వెంకటేష్ ఆచారి, అతని భార్య, గీత, కుమారుడు విష్ణుభగవాన్, కోడలు అక్షితతో కలిసి ఇటియోస్ కారులో మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనానికి శుక్రవారం అర్ధరాత్రి బయల్దేరారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో నీలూరు క్రాస్ వద్దకు రాగానే ఆగి ఉన్న వాహనాన్ని కారు వెనుకవైపు నుంచి ఢీకొనింది. ఈప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులు వెంకటాచారి, ఆయన భార్య గీతమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కోడలు అక్షిత (30), ముందు కూర్చున్న కుమారుడు విష్ణుభగవాన్ (32), డ్రైవర్ నరసింహమూర్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రవిప్రసాద్, సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పామిడి సీహెచ్సీకి తరలించారు. గాయపడిన ముగ్గురిని అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. విష్ణుభగవాన్, డ్రైవర్ నరసింహమూర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదస్థలిని పరిశీలించిన ఎస్పీ పామిడి: పామిడిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై నీలూరు క్రాస్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ప్రమాద ఘటనపై ఆయన ఎస్ఐ రవిప్రసాద్, పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ముందు నిలిపి ఉన్న, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట రైతుల ఆందోళన శెట్టూరు: అనుంపల్లి సబ్స్టేషన్ వద్ద రైతులు బైఠాయించి, శనివారం నిరసన తెలియజేశారు. అనుంపల్లి రైతులు మాట్లాడుతూ రెండు రోజులుగా త్రీపేస్ విద్యుత్ సరఫరా చేయలేదని, దీంతో నీరులేక పంట పొలాలు ఎండుముఖం పట్టాయన్నారు. సబ్స్టేషన్ పరిధిలోని ఓవర్ లోడ్తో నిత్యం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోందన్నారు. విద్యుత్ ఏఈ బాలచంద్ర రైతులతో ఫోన్లో మాట్లాడారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూసుకుంటామని ఏఈ తెలిపారు. నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించండి అనంతపురం మెడికల్: నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించాలని, ఆదివారం ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి మాట్లాడుతూ జిల్లాలో 2,84,774 మంది చిన్నారులున్నారన్నారు. 31 మండలాల పరిధిలోని 51 పీహెచ్సీలు, 25 యూపీహెచ్సీలు, 6 పీపీ యూనిట్లు , 82 యూనిట్లలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఐఓ డాక్టర్ శశిభూషణ్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి ఓబులు, హెచ్ఈఈఓ త్యాగరాజు పాల్గొన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనంతపురం అర్బన్: ప్రభుత్వాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని యువతకు కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం జేఎన్టీయూలోని రతన్టాటా ఇన్నోవేషన్ హబ్లో ‘ పర్యావరణంలో అవకాశాలు’ ఇతివృత్తంతో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ చంద్రమౌళి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్ యాదవ్, జెడ్పీ సీఈఓ శివశంకర్, డీపీఓ నాగరాజునాయుడు, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డి, ఏపీఐఐసీ మేనేజర్లు పాల్గొన్నారు. చిట్టి చేతులు..అద్భుత ప్రయోగాలు అనంతపురం సిటీ: అనంతపురం శివారు పంగల్ రోడ్డు సమీపంలోని రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్లో శనివారం నిర్వహించిన విద్యా వైజ్ఞానిక జిల్లా స్థాయి ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా నలుమూలల నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల నుంచి మొత్తం 124 ప్రదర్శనలు వచ్చాయి. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, డీఈఓ కడప ప్రసాద్బాబు, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొత్తం ఏడు గ్రూప్ ప్రాజెక్టులు, రెండు ఉపాధ్యాయ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రదర్శనకు ఎంపికయ్యాయని నిర్వాహకులు తెలిపారు. చిన్నారులు తమ చిట్టి మెదళ్లకు పదునుపెట్టి, అద్భుత నమూనాలు తయారు చేశారు. పిల్లల వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేశాయి. -
అనంతపురం
●సుపరిపాలనకు ఆద్యుడు వైఎస్ జగన్ ●నేడు వాడవాడలా జన్మదిన వేడుకలు Iఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అనంతపురం : పాలకుడంటే ప్రజల కష్టనష్టాల్లో తోడుగా ఉండాలి. ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ధైర్యమివ్వాలి. వారి ప్రగతికి బాటలు వేయాలి. కుల, మత, రాజకీయాలకు అతీతంగా మేలు చేయాలి. తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ అండగా నిలిచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి. అలాంటి పారదర్శకత, దార్శనికత కల్గిన అతికొద్దిమంది నాయకుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకరు. ఆయన సీఎంగా అధికారం చేపట్టిన మొదటిసారే సంక్షేమ విప్లవాన్ని సృష్టించారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు. ‘పాలకుడంటే ఇలా ఉండాలి’ అంటూ నిర్వచనంగా నిలిచారు. అధికారం కోల్పోయినా..ప్రతిపక్ష నేతగా ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ప్రతి సమస్యపైనా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నేడు జనహృదయ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు. జిల్లావ్యాప్తంగా వాడవాడలా బర్త్డే వేడుకలు నిర్వహించడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు సిద్ధమయ్యారు. -
మమ్మల్నే స్టేషన్కు పిలిపిస్తావా?
సాక్షి,అనంతపురం జిల్లా: ఉరవకొండ నియోజకవర్గ టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ సీఐని పోలీసుస్టేషన్లోనే నానా దుర్భాషలాడారు. విశ్వసనీయ సమాచారం మేరకు... నియోజకవర్గంలోని ‘కీలక’ పోలీసుస్టేషన్లో ఓ కేసు విచారణ నిమిత్తం సీఐ గురువారం డోనేకల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, మోపిడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడితో పాటు మరికొందరిని పిలిపించారు. దీన్ని జీర్ణించుకోలేని సదరు నాయకులు ఒక్కసారిగా సీఐ చాంబర్లోకి వెళ్లి దుర్భాషలాడారు. ‘నీకు తల తిరుగుతోందా?! మమ్మల్నే స్టేషన్కు పిలిపిస్తావా? లం.. కొడకా’ అంటూ రెచ్చిపోయారు. సీఐ చాంబర్లో సిబ్బందితో పాటు మరికొంత మంది వ్యక్తులు ఉన్నప్పటికీ వారు ఏమాత్రమూ వెనక్కి తగ్గకుండా దూషించారు. అనంతరం స్టేషన్ బయటకు వచ్చిన నేతలు ‘రేయ్.. ప్రభుత్వం మాది. మేం చెప్పినట్లు మూసుకుని వినండి. లేదంటే మీ తోకలు కత్తిరించి పోస్టింగ్ లేకుండా చేస్తాం. నా కొడకల్లారా’ అంటూ రెచ్చిపోయారు. ఈ ఘటనతో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులకే చంద్రబాబు ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని స్థానికులు చర్చించుకున్నారు. సీఐని దుర్భాషలాడిన నాయకులపై కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమవుతుండగా.. కొంతమంది అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని సర్దిచెబుతున్నట్లు తెలుస్తోంది. -
అక్కడా ఓటేస్తాం.. ఇక్కడా ఓటేస్తాం
రాప్తాడు రూరల్: ఓటు హక్కు కల్గిన వ్యక్తికి ఒక రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉంటే నిబంధనలకు విరుద్ధం. చట్టరీత్యా నేరం కూడా. దీన్ని ఉల్లంఘించిన వారికి జైలుశిక్ష కూడా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా రెండు ఓట్లు ఉంటే వారికి ఇష్టమైన ప్రాంతంలో ఒకచోట ఓటు పెట్టుకుని, రెండోచోట ఉన్న ఓటును కచ్చితంగా రద్దు చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపడుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఈ కార్యక్రమాన్ని తూతూమంత్రంగా చేపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి వారి ఓట్లు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. కొందరు ఫారం–7 దరఖాస్తు చేసుకున్నా.. తమకు అనుకూలమైన ఓట్లు తొలగిపోతాయంటూ నాయకులు ఒత్తిళ్లు చేస్తుండడంతో ఫారం–7 దరఖాస్తులను బోగస్ డిక్లరేషన్ (ఓటుదారుడికి తెలీకుండా) ఇచ్చి వాటిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. డబుల్ ఓట్లపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లిలో డబుల్ ఓట్లపై వైఎస్సార్సీపీ నాయకులు శుక్రవారం అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జ్లు సనప గోపాల్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా బూత్ కమిటీ ఉపాధ్యక్షుడు నాగమల్లేశ్వరరెడ్డి, పెరవళి జయచంద్రారెడ్డి, గ్రామకమిటీ అధ్యక్షుడు యర్రగుంట సోమశేఖర్రెడ్డి, యువజన విభాగం గ్రామ కమిటీ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డి, బండమీదపల్లి నాయకులు రాప్తాడు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ) రామ్మోహన్, అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడును వేర్వేరుగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండమీదపల్లిలో 153, 154, 155, 156 బూత్లలో దాదాపు 145 మందికి పైగా డబుల్ ఓట్లుగా ఉన్న వాటిని తొలగించాలంటూ ఫారం–7 దరఖాస్తులు అందజేసినా.. అందులో 5 మాత్రమే తొలగించి, తక్కినవి కొనసాగిస్తున్నారన్నారు. అధికార టీడీపీకి చెందిన కొందరు నాయకులు నకిలీ డిక్లరేషన్లు ఇవ్వడం, వాటి ఆధారంగా ఆ ఓట్లను కొనసాగిస్తుండటం చేస్తున్నారని పేర్కొన్నారు. డబుల్ ఓట్లను తొలగించకపోతే ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ ఫొటో చూడండి. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన మనుబోలు గోపాల్చౌదరి కుటుంబం 30 ఏళ్లకు పైగా అనంతపురం నగరంలో స్థిరపడింది. ఈయన కుటుంబానికి నేటికీ స్వగ్రామంలో ఓట్లు ఉన్నాయి. మరోవైపు అనంతపురంలోనూ వీరికి ఓట్లు ఉన్నాయి. మనుబోలు గోపాల్చౌదరి ఎన్డీఎఫ్ 2315786 నంబరులో ఓటరుగా, ఈయన కుమారుడు మనుబోలు మధుసూదన్రావు ఎన్డీఎఫ్ 2315778 ఓటరుగా బండమీదపల్లి ఓటర్ల జాబితాలో ఉన్నారు. అనంతపురంలోనూ మనుబోలు గోపాల్చౌదరి (వైడబ్ల్యూబీ 1038678) ఓటరుగా, ఆయన కుమారుడు మధుసూదన్రావు (వైడబ్ల్యూబీ 3124021) ఓటరుగా ఉన్నారు. అంటే వీరు అటు అనంతపురం, ఇటు బండమీదపల్లిలో ఓట్లు వేస్తూ వస్తున్నారు. వీరే కాదు ఈ ఒక్క పంచాయతీ పరిధిలోనే దాదాపు 250కి పైగా డబుల్ ఓట్లున్నాయి. ఫారం–7పై నామమాత్రంగా విచారణ ఊరిలో లేకున్నా ఓటర్లుగా కొనసాగింపు అధికారులపై ‘అధికార పార్టీ’ నేతల ఒత్తిళ్లు రాప్తాడు మండలం బండమీదపల్లిలోనే వందలాదిగా డబుల్ ఓట్లు -
సబ్సిడీ విత్తన వేరుశనగలో రాళ్లు
బ్రహ్మసముద్రం: రబీ సాగు కోసం ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసిన విత్తన వేరుశనగలో నాణ్యత కొరవడింది. శుక్రవారం మండల కేంద్రం బ్రహ్మసముద్రంలోని రైతు సేవ కేంద్రం (ఆర్ఎస్కే) నుంచి ఓ రైతు సబ్సిడీ విత్తన వేరుశనగ తీసుకున్నాడు. 30 కిలోల బస్తాకు రూ.1,650 చొప్పున వసూలు చేశారు. అయితే ఈ బస్తాలో కిలో వరకు రాళ్లు ఉండటంతో రైతు కంగుతిన్నాడు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇలా పంపిణీ చేస్తే ఎలా అంటూ వాపోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీఐని దూషించిన ఘటనలో నలుగురిపై కేసు ఉరవకొండ: ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది విధులకు ఆటంకం కలిగిస్తూ దూషించిన ఘటనలో బీజేపీకి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జనార్దన్నాయుడు శుక్రవారం తెలిపారు. భూతగాదా విషయంలో ఇటీవల విడపనకల్లు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైందని, దీనిపై విచారణకు రావాలంటూ బీజేపీ నేతలకు సీఐ ఫోన్లో తెలిపారన్నారు. బీజేపీ నాయకులు ఈ నెల 18న ఉరవకొండ పోలీస్ స్టేషన్కు వచ్చి ఒక్కసారిగా సీఐపై చిందులు వేస్తూ తీవ్రంగా దూషించారని పేర్కొన్నారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ఆ నాయకులను వారించినా వినలేదని తెలిపారు. దీనిపై విడపనకల్లు మండలం డోనేకల్లుకు చెందిన బీజేపీ నాయకులు సందిరెడ్డి నారాయణస్వామి, సందిరెడ్డి వెంకటరమణ, నింబగల్లుకు చెందిన జట్టి గోపాల్, మోపిడికి చెందిన దగ్గుపాటి శ్రీరాములుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. నేడు జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన అనంతపురం సిటీ: రాప్తాడు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్లో శనివారం జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ఫేర్) నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారు తమ ప్రాజెక్టులతో సంబంధిత గైడ్ ఉపాధ్యాయులతో కలిసి ఉదయం 9 గంటలకల్లా రాప్తాడుకు చేరుకోవాలని సూచించారు. గ్రూప్, వ్యక్తిగత, ఉపాధ్యాయ విభాగంలో జిల్లాస్థాయి సైన్స్ ఫేర్ విజేతలుగా నిలిచిన వారు ఈ నెల 23వ తేదీన నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్కు హాజరు కావాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ‘దుర్గం’ పోలీసులకు ఏబీసీడీ అవార్డు అనంతపురం/రాయదుర్గం: రాష్ట్రస్థాయి ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డిటెక్షన్) అవార్డును రాయదుర్గం పోలీసులు అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యంత ప్రతిభ కనబరిచే కేసుల వివరాల ఆధారంగా ప్రతి మూడు నెలలకోసారి ‘ఏబీసీడీ’ ప్రకటిస్తారు. ఈ క్రమంలో కంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్లను ఆపరేట్ చేస్తూ ఢిల్లీ కేంద్రంగా భారీగా ఫేక్ అకౌంట్లలోకి నగదు బదలాయించిన గుట్టును రట్టు చేసినందుకు గాను రాయదుర్గం యూపీఎస్, రాయదుర్గం రూరల్, జిల్లా సైబర్ విభాగం పోలీసులకు ఏబీసీడీ అవార్డు దక్కింది. దేశ వ్యాప్తంగా క్రియేట్ చేసిన 13 ఫేక్ అకౌంట్లలోకి డబ్బు వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన ఐదుగురు సభ్యులు గల సైబర్ ముఠాను అరెస్ట్ చేసి రూ.41.20 లక్షల నగదు, ఎనిమిది సెల్ఫోన్లు, కారు, 20 ఏటీఎం సిమ్కార్డులు, 15 సిమ్ కార్డులు, 10 చెక్కుబుక్కులు, రెండు రూటర్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం డీజీపీ హరీష్కుమార్ గుప్తా చేతుల మీదుగా అవార్డును అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి, ఎస్పీ పి. జగదీష్ అందుకున్నారు. -
సున్నా లేదు.. పావలా అసలే లేదు!
అనంతపురం అగ్రికల్చర్: చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. సూపర్సిక్స్ సూపర్హిట్ అంటూ డాంభికాలు ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా చూస్తే వ్యవసాయ, అనుబంధ రంగాలను పూర్తిగా విస్మరించేసింది. నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ఏ రూపంలోనూ ఉపశమనం కల్పించే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం రూ.లక్షలోపు పంట రుణాలకు సంబంధించి బడుగు రైతులకు సున్నావడ్డీ వర్తింపు లేదు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి పావలా వడ్డీ ప్రయోజనమూ కల్పించలేదు. అసలు ప్రభుత్వం పంట రుణాలు, సున్నావడ్డీ, పావలావడ్డీ వంటి ఊసే ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు. నాడు వ్యవసాయ రంగానికి పెద్దపీట వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి గత వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. పేద, బడుగు, సన్న, చిన్నకారు రైతులకు బాసటగా నిలిచారు. ఏటా ఖరీఫ్, రబీలో బ్యాంకుల ద్వారా రూ.ఒక లక్ష లోపు పంట రుణాలు (క్రాప్లోన్స్) రెన్యూవల్స్, కొత్త రుణాలు తీసుకున్న పేద రైతులపై వడ్డీ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. అందుకోసం వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల (ఎస్వీపీఆర్) పథకం అమలు చేశారు. ఏటా జిల్లా వ్యాప్తంగా ఏపీజీబీ, ఎస్బీఐ, కెనరా, యూబీఐ, కార్పొరేషన్, డీసీసీబీ... తదితర గ్రామీణ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్, సహకార బ్యాంకుల పరిధిలో పంట రుణాల కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగటున 5.80 లక్షల మంది వరకు రైతులకు ఏటా రూ.10 వేల కోట్ల వరకు పంట రుణాలు పంపిణీ చేశారు. అందులో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న సన్న చిన్నకారు, బడుగు రైతులు 7,61,502 మందికి ఏకంగా రూ.156 కోట్ల మేర సున్నావడ్డీ నేరుగా ఖాతాల్లోకి జమ చేసింది. అందులో అనంతపురం జిల్లా పరిధిలో 3,39,362 మంది రైతుల ఖాతాల్లోకి రూ.71 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో 4,32,140 మంది రైతుల ఖాతాల్లోకి రూ.75 కోట్ల మేర సున్నా వడ్డీ జమ చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పెద్ద మొత్తంలో పావలావడ్డీ ద్వారా ప్రయోజనం కల్పించారు. రూ.లక్ష లోపు పంట రుణానికి గత ప్రభుత్వం సున్నావడ్డీ వర్తింపు సకాలంలో పంట రుణాలు చెల్లించిన వారికి పావలావడ్డీ చెల్లింపు చంద్రబాబు ప్రభుత్వంలో వడ్డీ వర్తింపు ఊసే లేదు ప్రభుత్వ ప్రకటన కోసం రైతుల ఎదురుచూపు -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి వాతావరణం పెరిగింది. ఈశాన్యం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
క్రీడా పోటీల్లో ఉద్రిక్తత● తొలిరోజే రసాభాసగా అంతర్ కళాశాలల మహిళల క్రీడా పోటీలు అనంతపురం సిటీ: అనంతపురం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానం వేదికగా రెండ్రోజుల పాటు సాగే అంతర్ కళాశాలల మహిళా క్రీడా పోటీలు తొలిరోజే (శుక్రవారం) ఉద్రిక్తతకు దారి తీశాయి. నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వివాదానికి ప్రధాన కారణమైంది. వివరాల్లోకి వెళితే... ఎస్కేయూ క్యాంపస్ కళాశాల, ఆర్ట్స్ కళాశాల మధ్య తొలుత ఖోఖో పోటీ మొదలైంది. ఎస్కేయూ క్రీడాకారిణులు ఆడుతున్న సమయంలో అంపైర్లు ఫౌల్ ఇచ్చారు. ఆ సమయంలో వివాదం చెలరేగింది. అక్కడే ఉన్న ఏఐఎస్ఎఫ్, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ ఎస్కేయూ శాఖ నాయకులు జోక్యం చేసుకుని అంపైర్లను నిలదీశారు. స్పోర్ట్స్ అథారిటీ సెక్రటరీ ఆర్ట్స్ కళాశాల జట్టుకు వత్తాసు పలికేలా మాట్లాడడంతో విద్యార్థి సంఘాల నేతలు ప్రతిఘటించారు. దీంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంతలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ సమాచారంతో మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. అయితే రాత్రి 7.30 గంటలకు చెస్ ఆడుతున్న సమయంలో మరోసారి రగడ మొదలైంది. తమను అనరాని మాటలు అన్నారంటూ పలువురు క్రీడాకారిణులు కన్నీళ్లు పెట్టుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చివరకు ఏడ్చుకుంటూనే అమ్మాయిలు ఇంటిదారి పట్టారు. -
‘పచ్చ’ నేతల ఇంట పంచాయతీ ట్రాక్టర్లు
ట్రాక్టర్లు ఎక్కడ..? కంబదూరు మండలంలో మూడు పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను టీడీపీ నేతలు మాయం చేశారు. సర్పంచులను అడిగితే ట్రాక్టర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదని అంటున్నారు. ఇదే విషయాన్ని ఎంపీడీఓ, ఈఓఆర్డీల దృష్టికి తీసుకెళ్తే.. ప్రభుత్వం మంజూరు చేసిన కంపెనీ ట్రాక్టర్ కాకుండా వేరేది పంపారు. అసలు ప్రభుత్వం కేటాయించిన ట్రాక్టర్లు ఎక్కడ పోయాయో చూపాలి. – హనుమంతరాయుడు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, కంబదూరు కళ్యాణదుర్గం: గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం మెరుగు కోసం కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకం కింద కేటాయించిన ట్రాక్టర్లు పక్కదారిపట్టాయి. నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సొంత అవసరాలకు వాటిని దర్జాగా వినియోగించుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పల్లెల్లో చెత్తాచెదారం దిబ్బలుగా పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు 22 ట్రాక్టర్లు స్వచ్ఛభారత్ పథకం కింద మంజూరయ్యాయి. అందులో ఎనిమిది ట్రాక్టర్లు అధికార పార్టీ నేతలు తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ట్రాక్టర్ల మాయంపై పంచాయతీల సర్పంచులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ట్రాక్టర్లను వ్యక్తిగతంగా వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకులతో పాటు ముఖ్య ప్రజాప్రతినిధి కూడా సొంత ఆస్తి అయినట్టు పంచాయతీ ట్రాక్టర్లను వాడుకోవడాన్ని తప్పుబడుతున్నారు. ట్రాక్టర్లు లేక చెత్త పేరుకుపోయి ప్రజారోగ్యం దెబ్బతింటున్నా తమ కేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాక్టర్లు పక్కదారి పట్టాయిలా.. కంబదూరు మండలంలోని కర్తనపర్తి, పాళ్లూరు, రాళ్ల అనంతపురం పంచాయతీలకు మూడు ట్రాక్టర్లు మంజూరయ్యాయి. అయితే ఆ ట్రాక్టర్లు ఆయా పంచాయతీల పరిధిలో కనిపించడం లేదు. ట్రాక్టర్ గురించి రాళ్ల అనంతపురం సర్పంచ్ గతంలో అధికారులకు అర్జీ ఇచ్చారు. స్పందన లేకపోవడంతో మరోసారి అర్జీ ఇవ్వడంతో.. తన పంచాయతీకి కేటాయించిన ‘మహీంద్ర 275’ ట్రాక్టర్కు బదులుగా ఐషర్ కంపెనీ ట్రాక్టర్ను అధికారులు పంపారు. దీంతో సదరు సర్పంచు అనధికారిక ట్రాక్టర్ను వెనక్కిచేశ్చారు. మిగిలిన రెండు పంచాయతీల ట్రాక్టర్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీ పనులకు వినియోగిస్తున్నట్లు సర్పంచులు ఆరోపిస్తున్నారు. ● శెట్టూరు మండలంలో శెట్టూరు, కనుకూరు, లక్ష్మంపల్లి, ములకలేడు, బచ్చేహళ్ళి గ్రామాలకు కొత్త ట్రాక్టర్లు కేటాయించారు. అయితే శెట్టూరులో టీడీపీ సర్పంచ్ ఉరాల కుమార్ పంచాయతీ ట్రాక్టర్ను సొంతానికి వినియోగించుకుంటున్నారు. ● బ్రహ్మసముద్రం మండలంలో బ్రహ్మసముద్రం, పిల్లలపల్లి, సంతే కొండాపురం, భైరవానితిప్ప, పాల వెంకటాపురం గ్రామాలకు మొత్తం ఐదు ట్రాక్టర్లను కేటాయించారు. ఇందులో పిల్లలపల్లిలో మాజీ ఎంపీపీ మంజుల భర్త వన్నూరుస్వామి, పాల వెంకటాపురంలో టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు బంధువు, సంతే కొండాపురంలో సర్పంచ్ మల్లెల వనిత తమ సొంత పనులకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. ● కళ్యాణదుర్గం మండలంలో మొత్తం నాలుగు ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ఇందులో కొత్తూరు, పాలవాయి, ముద్దినాయనపల్లిలో గ్రామ పంచాయతీ పనులకు వినియోగించుకుంటుండగా.. గోళ్ల గ్రామ పంచాయితీలో టీడీపీ సర్పంచ్ తన సొంత పనులకు వాడుకుంటున్నారు. ● కుందుర్పి మండలంలో 5 ట్రాక్టర్లు మంజూయ్యాయి. ఎనుములదొడ్డి, జంబుగుంపల, మలయనూరు, కుందుర్పిలో పంచాయతీ అవసరాలకు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. బెస్తరపల్లిలో మాత్రం టీడీపీ నాయకులు వాడుకుంటున్నారు. చర్యలు తీసుకుంటాం స్వచ్ఛభారత్ పథకం కింద కేటాయించిన ట్రాక్టర్లు ఆయా పంచాయతీల పరిధిలో ఉండాలి. ఎక్కడైనా సర్పంచులు లేదా ఇతరులు సొంత పనుల కోసం వాడుకున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. అలాంటి ట్రాక్టర్లను పంచాయతీల ఆధీనంలోకి తెస్తాం. పంచాయతీలకు కేటాయించిన ట్రాక్టర్లను పంచాయతీ అవసరాలకే వాడుకోవాలి. ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వాడుతుంటే.. వాటిపై గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, డీఎల్డీఓ పల్లెల్లో పేరుకుపోయిన చెత్తదిబ్బలు ప్రజారోగ్యం దెబ్బతింటున్నా పట్టని వైనం దర్జాగా సొంత పనులకు వినియోగిస్తున్న నేతలు ట్రాక్టర్లు ఏమయ్యాయో కూడా పట్టించుకోని అధికారులు -
క్రీస్తు మార్గం అనుసరణీయం
అనంతపురం/ కల్చరల్: లోకానికి వెలుగులు నింపిన క్రీస్తు మార్గం అనుసరణీయమని రాయలసీమ డయాసిస్ ఉపాధ్యక్షుడు రెవరెండ్ బెన్హర్బాబు అన్నారు. వైఎస్సార్సీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి అనంతపురంలోని ఏ7 కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ బెన్హర్బాబు తన సందేశంలో క్రీస్తు జీవిత విశేషాలను, దివ్య అనుభవాలను వివరించారు. అంతకు ముందు సామూహిక ప్రార్థనలు చేయించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన వైఎస్ థామస్రెడ్డి మాట్లాడుతూ.. క్రీస్తు జీవిత విశేషాలను పంచుకున్నారు. వైఎస్సార్సీపీ తోనే క్రైస్తవుల అభ్యున్నతి ప్రీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జెడ్పీ చైర్పర్సన్ బోయగిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు, రాష్ట్ర కార్యదర్శి జానీ, నగర అధ్యక్షుడు సతీష్ , ముస్లిం మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, సాకే చంద్రలేఖ, కో–ఆప్షన్ సభ్యుడు మారుతి, రాష్ట్ర మైనార్టీ విభాగం జనరల్ సెక్రెటరీ కాగజ్ఘర్ రిజ్వాన్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం నాయకులు జాన్, థామస్, రాజ్కుమార్, పుట్లూరు ప్రభాకర్, హనుమంతు, పద్మాకరబాబు, ఐజయ్య, అనిల్ మోజెస్, మనేష, ఆనంద్, జహంగీర్, అబ్రహామయ్య, సాల్మన్ రాజ్, జాకోబ్, జానీ, పుల్లయ్య కార్పొరేటర్లు కళావతి, కమల్భూషణ్, హసనీబేగం, రాజి, శ్రీనివాసులు, హసీనాబేగం, అనిల్రెడ్డి, పార్టీ జిల్లా బూత్ కమిటీ చైర్మెన్ ఎద్దుల అమరనాథ రెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, సంపంగి రామాంజినేయులు, కాకర్ల శ్రీనివాసరెడ్డితో, పాస్టర్ల సంఘం ప్రతినిధులు రెవ.మోసెస్ అనిల్కుమార్, పాస్టర్లు మనుష్యే, జీఆర్ ఆనంద్ తదితరులు మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ తోనే క్రైస్తవుల అభ్యున్నతి సాధ్యమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పాస్టర్లకు క్రమం తప్పకుండా రూ.5 వేలు వేతనంపడితే.. ప్రభుత్వం మారిన తర్వాత ఆ వేతనం అందకుండా పోయిందన్నారు. రాయలసీమ డయాసిస్ ఉపాధ్యక్షుడు బెన్హర్బాబు సందడిగా సాగిన ప్రీ క్రిస్మస్ వేడుకలు -
●దారులపై ధాన్యం.. ప్రమాదాలకు కాదా ఆస్కారం!
ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి దక్కేందుకు రైతులు అహర్నిశం శ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఖరీఫ్ సీజన్లో చేతికి అందిన ధాన్యాన్ని కొందరు రైతులు ఆర బోస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా... రోడ్లపై ఆరబోసిన ధాన్యంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంది. జాతీయ రహదారి పక్కగా ఆరబోసిన ధాన్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. రాత్రి సమయాలు, తెల్లవారుజామున ధాన్యం కుప్పలు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్న వారూ ఉన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం సొరకాయలపేట క్రాస్ రోడ్డులో వరిధాన్యం ఆరబెట్టిన పరిస్థితి -
వీర జవాన్ సతీమణికి అవార్డు అందజేత
శింగనమల (నార్పల): నార్పలకు చెందిన వీర జవాన్ సుబ్బయ్య సతీమణి గవ్వల లీలావతి.. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విజయవాడలో శుక్రవారం జరిగిన సైనిక్ వెల్ఫేర్ ఫ్లాగ్డే కార్యక్రమంలో ఆమెకు అవార్డును గవర్నర్ అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, ఐఏఎస్ అధికారి వినోద్కుమార్, మాజీ సైనిక ఉద్యోగులు పాల్గొన్నారు. -
16 మందికి కారుణ్య నియామకాలు
అనంతపురం అర్బన్: కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించడం ద్వారా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కలెక్టర్ ఓ.ఆనంద్ ఆనందం నింపారు. మొత్తం 16 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం జారీ చేసిన ఉత్తర్వులను కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్ఓ మలోల శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. జీఓ మేరకు వీరిని సచివాలయల ఉద్యోగులుగా, ప్రభుత్వ శాఖల్లో అటెండర్లుగా నియమించారు. 22న జిల్లావ్యాప్తంగా ఆందోళనలు ● వామపక్ష పార్టీ నాయకులు అనంతపురం అర్బన్: ఉపాధి హామీ చట్టాన్ని సవరిస్తూ పేరు మార్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 22న జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వామపక్ష పార్టీల నేతలు వెల్లడించారు. ఈ మేరకు సీపీఐ, సీపీఎం, సీపీఎం (ఎంఎల్ న్యూ డెమోక్రసీ), ఎస్యూసీఐ, సీపీఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్ లిబరేషన్) జిల్లా కార్యదర్శులు పాళ్యం నారాయణస్వామి, ఓ.నల్లప్ప, ఇండ్ల ప్రభాకర్రెడ్డి, రాఘవేంద్ర, చంద్రశేఖర్, వేమన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పని హక్కుగా ఉన్న చట్టాన్ని మార్చి ఒక సాధారణ పథకంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిందని మండిపడ్డారు. పథకానికి నిధులు, పని దినాలు, దినసరి కూలి పెంచి ఉపాధి కూలీల జీవితాల్లో వికాసం తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పథకం అమలును రాష్ట్రాలకు అప్పగిస్తే నీరుగారిపోయే ప్రమాదం ఉందన్నారు. కొత్త ఉపాధి బిల్లుకు వ్యతిరేకంగా 22న చేపట్టిన ఆందోళనలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వ్యక్తి దుర్మరణం గార్లదిన్నె: మండలంలోని తలగాచిపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బుక్కరాయసముద్రం మండలం సిద్ధలాపురం గ్రామానికి చెందిన బండారు ఆదినారాయణ(38) కారు డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం వ్యక్తిగత పనిపై పెద్దవడుగూరు మండలం మిడతూరుకు ద్విచక్ర వాహనంపై వెళుతూ తలగాచిపల్లి క్రాస్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి టమాట లోడ్తో మహారాష్ట్రకు వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో రోడ్డుపై పడిన ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ప్రొబేషనరీ ఎస్ఐ సురేంద్రబాబు తెలిపారు. -
ఏఐతో భవిష్యత్తులో గణనీయ మార్పులు
గుంతకల్లు: ఆర్టిఫిషయల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో భవిష్యత్తులో గణనీయమైన మార్పులు వస్తాయని వక్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం స్థానిక శ్రీ శంకరనంద గిరిస్వామి డిగ్రీ కళాశాలలో ఏఐసీటీఈ సహకారంతో డిపార్టుమెంట్ ఆఫ్ కంప్యూటర్స్ సైన్స్ అండ్ అప్లికేషన్ ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ట్రెండ్స్, చాలెంజస్, ఆపర్చునిటీస్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును శుక్రవారం ప్రారంభించారు. కళాశాల కరస్సాండెంట్ కేసీ హరి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథులుగా వరంగల్ నీట్ కళాశాల ప్రొఫెసర్ ఈ.సురేష్బాబు, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సీడీసీ డీన్ ప్రొఫెసర్ రామగోపాల్ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ సురేష్బాబు, కంప్యూటర్ విభాగం అధిపతి డాక్టర్ నటరాజ్, అధ్యాపకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
గొల్లపల్లికి సంగాలప్ప స్వామి
బత్తలపల్లి: కురుబల ఆరాధ్యదైవం సంగాలప్ప స్వామి నాలుగు దశాబ్దాల తర్వాత శుక్రవారం మండలంలోని యర్రాయపల్లి నుంచి రాప్తాడు మండలం గొల్లపల్లికి చేరాడు. దీంతో గ్రామస్తులంతా ఆనందోత్సాహాలతో స్వామి వారికి స్వాగతం పలికారు. దీంతో స్వామివారి విగ్రహం అప్పగింతకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన కురుబ సామాజికవర్గంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న దశాబ్దాల నాటి వివాదానికి తెరపడింది. సుప్రీం కోర్టును ఆశ్రయించి.. కురబల గుడికట్టు దేవుళ్లయిన గొల్లపల్లయ్యస్వామి, సంగాలప్పస్వామి అన్నదమ్ములు. ఏ ఉత్సవం జరిగినా ఇరువురు దేవుళ్లనూ ఊరేగించడం ఆనవాయితీ. అయితే సంగాలప్పస్వామి విగ్రహం విషయంలో యర్రాయపల్లి కమతం వంశస్తులు, గంగలకుంట కపాడం వంశస్తుల మధ్య వివాదం నెలకొంది. స్వామి విగ్రహాన్ని తమ గ్రామంలోనే ఉంచుకుంటామంటూ ఈ రెండు గ్రామాల వారు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే 1999లో ఈ అంశంపై గంగలకుంట కపాడం వంశస్తులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో ఒక్కో ఊరిలో ఆర్నెళ్ల పాటు స్వామివారి ఉత్సవ విగ్రహం ఉండేలా 2005లో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును అమలు చేయకుండా యర్రాయపల్లి కమతం వంశస్తులు హైకోర్టును ఆశ్రయించగా.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. దీనిపై 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ నవంబర్ 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కమతం వంశస్తులు యర్రాయపల్లిలో స్వామివారి ఊరేగింపు చేశారు. అయితే సంగాలప్ప రెండోపూజ గొల్లపల్లయ్య స్వామితో కలిపి చేయడం ఆనవాయితీ కాగా, స్వామి ఉత్సవ విగ్రహాన్ని గొల్లపల్లికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే సుప్రీం తీర్పుపై తాము రివ్యూ పిటీషన్ వేశామని, అంతవరకూ స్వామివారి ఊరేగింపు జరగనివ్వబోమని కపాడం వంశస్తులు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అధికారులు రంగంలోకి దిగారు. శాంతి కమిటీ సమావేశం నిర్వహించి పరిస్థితి చక్కదిద్దారు. గొల్లపల్లిలో ఆనందోత్సహాలు.. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తమ గ్రామానికి సంగాలప్ప స్వామి ఉత్సవ విగ్రహం విచ్చేస్తుండటంతో గొల్లపల్లి వాసులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సాయంత్రం యర్రాయపల్లి గ్రామం నుంచి స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉరేగింపుగా గ్రామం చివర వరకు తీసుకువచ్చారు. అనంతరం ఐచర్ వాహనంలో ఎక్కించి భారీ పోలీసు బందోబస్తు మధ్య గొల్లపల్లికి తరలివెళ్లారు. అక్కడ రాత్రి గొల్లపల్లయ్యస్వామితో కలిసి గ్రామోత్సవం నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం సంగాలప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని తిరిగి యర్రాయపల్లికి చేర్చనున్నారు. భారీ బందోబస్తుతో గొల్లపల్లికి తరలింపు సంగాలప్ప స్వామిని శుక్రవారం గొల్లపల్లికి తీసుకువెళ్లే క్రమంలో బత్తలపల్లి మండలం యర్రాయపల్లి గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, 20 మంది ఏఎస్ఐలు, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 60 మంది పోలీసులు, మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేఽశారు. మరోవైపు బత్తలపల్లి తహసీల్దార్ స్వర్ణలతతో పాటు మండలంలోని రెవెన్యూ సిబ్బంది అందరూ గ్రామంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెర ధర్మవరం డీఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు -
ఎమ్మెల్యే అమిలినేని తిరుగుబావుటా
కళ్యాణదుర్గం: చంద్రబాబు సర్కార్పై సొంత పార్టీకి చెందిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు పారిశుధ్య పరికరాలు పంపిణీ చేసి తన నియోజకవర్గంలో పంపిణీపై చిన్నచూపు చూడటంతో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కి వెళ్లిపోయారు. కళ్యాణదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీలలో పారిశుధ్య పనులకు అవసరమైన పరికరాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యఅతిథిగా టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హాజరయ్యారు. అయితే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కాకుండా కేవలం మండలానికి రెండు గ్రామాలకు చొప్పున మాత్రమే పరికరాలు వచ్చాయని డీఎల్డీఓ నాగేశ్వరరావు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అమిలినేని జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పంపిణీ చేసినప్పుడు తన నియోజకవర్గంలో మాత్రం ఎందుకు ఇలా కొన్ని గ్రామాలకే ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. తాను అసంతృప్తితో ఉన్నానని, ఇలాంటి కార్యక్రమానికి రాకుండా ఉండాల్సిందన్నారు. కళ్యాణదుర్గానికి జరిగిన అన్యాయంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారులు సైతం కళ్యాణదుర్గం వైపు చూడకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. త్వరలోనే కలెక్టర్తో చర్చిస్తానని, తాను కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్తున్నానని మైకులో ప్రకటించి అర్ధంతరంగా కార్యక్రమం నుంచి వెనుదిరిగిపోయారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అరకొరగా వచ్చిన పంచాయతీ పారిశుధ్య పరికరాలు కార్యక్రమంలో అసహనంతో మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టీడీపీలో కలకలం సొంత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి కళ్యాణదుర్గంపై చిన్నచూపు చూస్తున్నారని మండిపాటు కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయిన టీడీపీ ఎమ్మెల్యే మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రభుత్వం, అధికారులపై అసహనం వ్యక్తం చేసి..కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్తున్నట్లు ప్రకటించడంతో టీడీపీలో కలకలం రేపుతోంది. కార్యక్రమానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సైతం షాక్కు గురయ్యారు. ఇదిలా ఉండగా.. కొంత కాలంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఈ– స్టాంపుల కుంభకోణం, సీనియర్ నేతల మధ్య సమన్వయ లోపం, మద్యం షాపుల టెండర్లు, తదితర పరిణామాల నేపథ్యంలో అమిలినేని ప్రతిష్ట మసకబారింది. ఈ క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి టీడీపీ అధిష్టానం ప్రాధాన్యత తగ్గించిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా ఏడాదిన్నర కాలంలోనే చంద్రబాబు సర్కారుపై సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబావుటా ఎగురవేసి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
ఎప్పుడు కూలుతాయో?
● దుస్థితిలో హెచ్చెల్సీ బ్రిడ్జీలు ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం కణేకల్లు: హెచ్చెల్సీ బ్రిడ్జీలు శిథిలావస్థకు చేరున్నాయి. ఎప్పుడు కూలతాయో తెలీని పరిస్థితి నెలకొంది. ఈ యేడాది అత్యంత అవసరంగా 10 బ్రిడ్జిలను గుర్తించి పనులు ప్రారంభించినా కేవలం రెండు మాత్రమే పూర్తయ్యాయి. మరో 8 బ్రిడ్జిలు ఆగిపోయాయి. మరో 44 బ్రిడ్జీలు దుస్థితికి చేరుకున్నాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాటిపై రాకపోకలు సాగిస్తున్నారు. ఎప్పుడు ఏ ఘోరం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొన్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదు. 60 ఏళ్ల క్రితం నాటివి... హెచ్చెల్సీ కాలువపై 60 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జీలు, అండర్ టన్నల్లు అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. హెచ్చెల్సీ ప్రధాన కాలువ ఆంధ్రా సరిహద్దు 105 కి.మీ వద్ద ప్రారంభమై ఉరవకొండ పరిధిలోని 189 కి.మీ వద్ద ముగిస్తోంది. హెచ్చెల్సీ నిర్మాణ సమయంలో ఆర్అండ్బీ రోడ్డు మధ్యలో బ్రిడ్జీలు, వంకలు, వాగులపై యూటీలు (అండర్ టన్నల్స్) నిర్మించారు. బ్రిడ్జిలు 33, యూటీలు 21, అక్విడెక్ట్లు 5 నిర్మించారు. మీన్లహళ్లి వద్ద ఐదేళ్ల క్రితం బ్రిడ్జి కూలిపోగా... రెండేళ్ల క్రితం కణేకల్లు చెరువు అవుట్ ఫాల్ రెగ్యులేటర్ బ్రిడ్జి వరిధాన్యంతో ఈచర్ వాహనం వస్తున్న సమయంలో కుప్పకూలింది. దీంతో గంగలాపురం, ఆదిగానిపల్లి, రచ్చుమర్రి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వాహనాలతో ముప్పులు హెచ్చెల్సీ బ్రిడ్జీలపై నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో యూటీ, బ్రిడ్జిల వద్ద ఉన్న రాళ్లు వదులుగా మారి గోడలు బలహీనంగా మారాయి. యూటీలు, అక్విడెక్ట్ల వద్ద తరచూ నీరు లీక్ అవుతుండటంతో హెచ్చెల్సీ అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. యూటీల పక్కనే రాళ్లతో నిర్మించిన ప్రొటక్షన్ వాల్స్ కూడా బలహీనంగా మారాయి. యూటీలు పటిష్టంగా ఉంటనే హెచ్చెల్సీ నీరు రాష్ట్రానికి సకాలంలో తీసుకోరావడానికి వీలవుతోంది. యూటీలకు గండ్లు పడితే నీరు తీసుకోవడం చాలా కష్టమని రైతులు చెబుతున్నారు. బొమ్మనహళ్ మండలంలోని ఉంతకల్లు సమీపంలో 113/507 కిలోమీటర్ వద్ద డిసెంబర్ 7న యూటీకి గండిపడగ్గా... జూలై 28న నాగేపల్లి అక్విడెక్ట్ వద్ద కాలువ గట్టు కోత గురైన విషయం విధితమే. జనవరి నెలాఖరుకు నీరు బంద్ హెచ్చెల్సీకి జనవరి నెలాఖరికి నీటి సరఫరా బంద్ కానున్నాయి. ఈలోపు హెచ్చెల్సీ అధికారులు అత్యవసర బ్రిడ్జిలను గుర్తించి ప్రతిపాదనలు తయారు చేసి పనులు ప్రారంభించేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కణేకల్లులోని రామనగర్, మాల్యం, గనిగెర, ఆంధ్రా సరిహద్దు 105 కిలోమీటర్ వద్ద బ్రిడ్జిలు అతి ముఖ్యమైనవి. ప్రమాదాలు జరిగి సమస్యలు తలెత్తక ముందే ఈ బ్రిడ్జిల నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కణేకల్లు మండలం మాల్యం వద్ద దుస్థితిలో హెచ్చెల్సీ బ్రిడ్జి బొమ్మనహాళ్ మండలంలోని ఉంతకల్లు యూటీ వద్ద గండిపడిన దృశ్యం (ఫైల్) ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం బ్రిడ్జిలు, యూటీలు అధ్వాన్నస్థితికి చేరుకొన్న విషయాన్ని హెచ్చెల్సీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయమని ఆదేశించడంతో ఆ పనిలో నిమగ్నమయ్యాం. అత్యవసరమైన బ్రిడ్జిలను గుర్తించాం. నిధులు మంజూరు చేస్తే కొత్త బ్రిడ్జిలు, యూటీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. – దివాకర్రెడ్డి, హెచ్చెల్సీ డీఈఈ -
రికార్డుల డిజిటలైజేషన్ ప్రారంభించాం
● కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆనంద్అనంతపురం అర్బన్: ‘జిల్లాలో 22ఏ (నిషేధిత భూముల) అంశం తీవ్రంగా ఉండింది. రెవెన్యూ రికార్డులుగా సరిగ్గా లేవు. దీంతో రికార్డుల డిజిటలైజేషన్ ప్రారంభించాం.’ అని విజయవాడలో జరుగుతున్న ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఓ.ఆనంద్ వివరించారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి రెండోరోజు గురువారం నిర్వహించిన కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వినియోగంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సర్వే నంబర్ లైబ్రెరీని తయారు చేశామన్నారు. రెవెన్యూ ఆఫీస్ టూల్ తయారు చేసి యూజర్లకు అనువుగా మార్చామని తెలియజేశారు. గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డుల లైబ్రెరీ సిద్ధంగా ఉందని వెల్లడించారు. -
నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టండి
కూడేరు: ‘తెగుళ్ల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. అయితే నకిలీ విత్తనాలు, ఎరువులను అధికారులుగా మీరు, మీ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతున్నారు’ అని సీఎం కార్యాలయ తరఫున వచ్చిన అధికారి పార్వతి, జిల్లా ఉద్యానాధికారి ఉమాదేవిని రైతులు నిలదీశారు. ‘బ్యాడిగి మిరపకు తెగుళ్లు – నివారణ చర్యలు’ అంశంపై గురువారం కూడేరు మండలం ముద్దలాపురంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని వివిధ గ్రామా ల రైతులు హాజరయ్యారు. తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తుండగా పలువురు రైతులు అడ్డుకుని నకిలీ విత్తనాలు, ఎరువులతో తామేలా నష్టపోతున్నది ఏకరవు పెట్టారు. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను సంధించడంతో సమాధానం చెప్పలేక అధికారులు తటపటాయించారు. చివరకు ఈ విషయంపై సీఎం కార్యాలయానికి నివేదిక అందజేస్తామని భరోసానిచ్చారు. అనంతరం మిరపలో ఆశించే తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో మండల ఎంపీఈఓ యాస్మిన్, ఎంపీఈఓలు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు. -
చెరువు మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్న రైతులు
● ప్రశ్నించిన బాధితులకు బెదిరింపులు ● అధికారుల తీరుపై తోపుదుర్తి చందు మండిపాటు రాప్తాడు రూరల్: అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకుండా రాప్తాడు మండలం హంపాపురం చెరువు నుంచి అక్రమంగా సాగిస్తున్న జీడ (మట్టి) తరలింపును స్థానికులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఓ నాయకుడు కొన్ని రోజులుగా చెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. దీనికి నీటి పారుదల శాఖ అధికారుల నుంచి కానీ, రెవెన్యూ అధికారుల నుంచి కాని ఎలాంటి అనుమతులు పొందలేదు. పైగా గ్రామ పంచాయతీకి రాయల్టీ సైతం చెల్లించకుండా రోజూ పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు స్పందించకపోవడంతో రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ రైతులు తిరగబడ్డారు. దీంతో బుధవారం ఉదయం చెరువులోకి గ్రామస్తులు వెళ్లి మట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. ఊరి అవసరాలకు వినియోగించుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, అలాకాకుండా అమ్ముకోవడానికి ఎలా తరలిస్తారని నిలదీశారు. మట్టి తవ్వేందుకు ఉన్న అనుమతులు చూపించాలని అడిగారు. దీంతో మట్టి తరలింపును ఆపేశారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే మళ్లీ తరలింపులను కొనసాగించారు. సమాచారం అందుకున్న రైతులు సాయంత్రం వెళ్లి చెరువు నుంచి జాతీయరహదారికి వెళ్లే మార్గంలో టిప్పర్లను అడ్డుకుని అక్కడే రోడ్డుమీద అన్లోడ్ చేయించారు. అదే సమయంలో అడ్డుకున్న రైతులకు పోలీసులు ఫోన్ చేసి స్టేషన్కు రావాలంటూ హుకుం జారీ చేశారు. అనంతరం అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో తోటలకు నీరు పెట్టేందుకు వెళుతున్న కొందరు రైతులపై దాడులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో గురువారం సంతోష్, సుధాకర్, మోహన్ తదితరులు రాప్తాడు పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. తమపై అకారణంగా దాడి చేశారని, విచారించి చట్టపరంగా చర్యలు కోవాలని కోరారు. మట్టిని అమ్ముకుంటుంటే పట్టించుకోరా? సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్రెడ్డి గురువారం సాయంత్రం రాప్తాడు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లారు. తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ అధికారితో మాట్లాడారు. బుక్కచెర్లలో అమ్మవారి దేవాలయం కోసం మట్టి తోలుకుంటుంటే కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటికీ జేసీబీ స్టేషన్లోనే ఉందన్నారు. మరి హంపాపురంలో ఎలాంటి అనుమతులు లేకుండా నెలల తరబడి మట్టిని అక్రమంగా తరలిస్తున్నా కనీస చర్యలు ఎందుకు తీసుకోలేక పోతున్నారని నిలదీశారు. పార్టీలకు అతీతంగా రైతులు అడ్డుకున్నారన్నారు. జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు, ఉద్యోగులే సహజ వనరుల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నాయకులు గంగుల సుధీర్రెడ్డి, మామిళ్లపల్లి అమర్నాథ్రెడ్డి, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, పార్టీ మండల కన్వీనర్ సాకే వెంకటేష్, రాప్తాడు జయన్న, హంపాపురం కేశవరెడ్డి, మల్లికార్జున, శింగారప్ప, చిరుతల నాగేంద్ర, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ లక్ష్మన్న ఉన్నారు. -
ఆయకట్టు స్థిరీకరణ ఎన్నడో?
బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ ఆయకట్టు స్థిరీకరణ నేటికీ కలగానే మిగిలింది. ఉమ్మడి జిల్లాలో కరువు కాటకాలను శాశ్వతంగా పారదోలడమే లక్ష్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. 2004–05 మధ్య కాలంలో అత్యల్ప వర్షపాతంతో జిల్లాలో కరువు విలయతాండవం చేసింది. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ రాజశేఖర్రెడ్డి.. తాము అధికారంలోకి వస్తే హంద్రీనీవా పథకాన్ని పూర్తి చేసి, జీడిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని పేర్కొన్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. 2005లో రూ.వంద కోట్ల నిధులు కేటాయించి సుమారు 8.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో 1.67 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జీడిపల్లి రిజర్వాయర్ను నిర్మించారు. అదే సమయంలో 2009 నాటికి హంద్రీనీవా ప్రాజెక్ట్కు సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేయించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి ఏడు లిఫ్టుల ద్వారా 2012 నుంచి నిరంతరంగా జీడిపల్లికి కృష్ణా జలాలు వస్తున్నాయి. రిజర్వాయర్ గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరుకోగానే తూము ద్వారా కొంత, మరువ ద్వారా మరికొంత నీటిని దిగువన ఉన్న పీఏబీఆర్కు వదులుతున్నారు. దశాబ్ద కాలంగా హంద్రీనీవా రెండో దశ కాలువకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టు స్థిరీకరణ జరిగితే సస్యశ్యామలమే నిండు కుండను తలపిస్తున్న జీడిపల్లి రిజర్వాయర్ 2012 నుంచి రిజర్వాయర్కు కృష్ణాజలాల రాక ఆయకట్టు స్థిరీకరణకు దశాబ్ద కాలంగా ఎదురు చూపు జీడిపల్లి రిజర్వాయర్ పరిధిలోని బెళుగుప్ప పరిసర ప్రాంతాల్లోనే 30 వేల ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు ఉంది. అయితే మండలంలో ఒక్క బెళుగుప్ప, శీర్పి చెరువులు మినహా గంగవరం, బ్రాహ్మణపల్లి, శ్రీరంగాపురం, గుండ్లపల్లి, కోనాపురం, నరసాపురం చెరువులకు రిజర్వాయర్ నుంచి నీరు అందించడంతో పాటు ఆయకట్టును సాగులోకి తీసుకువస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. -
ఏసీబీ డీఎస్పీగా ప్రసాద్రెడ్డి బాధ్యతల స్వీకరణ
అనంతపురం సెంట్రల్: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేస్తే అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ ప్రసాద్రెడ్డి సూచించారు. గురువారం నగరంలోని ఏసీబీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీ ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత సేవల కోసం ప్రభుత్వం 1064 టోల్ఫ్రీ, 9440446181 డీఎస్పీ నంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఫిర్యాదుదారులు ధైర్యంగా ముందుకు రావాలని, అప్పుడే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు జయమ్మ, మోహన్ప్రసాద్, హమీద్ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు. -
●మత్తులో సొమ్మ సిల్లి..
గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం ఉదయం ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి సొమ్మసిల్లి పోయాడు. స్థానికులు లేపడానికి ప్రయత్నించినా చలనం లేకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ముఖంపై నీళ్లు కొట్టి లేవడానికి శత విధాల ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానికుల సాయంతో అతి కష్టంపై ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెల్లవారుజామునే విచ్చలవిడిగా మద్యం లభ్యమవుతోందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. గత వారంలో ఇలాంటి ఘటనలు ఆరేడు జరిగాయి. -
మార్పులకనుగుణంగా బోధన సాగించాలి
● ఇంటర్ విద్య ఓఎస్డీ రమేష్ అనంతపురం సిటీ: ఇంటర్మీడియట్ విద్య, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం నూతన సంస్కరణలను తీసుకువచ్చిందని, వీటికి అనుగుణంగా బోధనలో ముందుకు సాగాలని అధ్యాపకులకు ఇంటర్ విద్య ఓఎస్డీ రమేష్ సూచించారు. అనంతపురంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో డీవీఈఓ వెంకటరమణానాయక్ అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆర్ఐఓ సురేష్బాబుతో కలసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 12 ఏళ్ల తరువాత ఇంటర్ విద్యలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. గణితంలో 1ఏ, 1బీ ఒకే సబ్జెక్టుగా మార్పు చేశారన్నారు. దీంతో మ్యాథ్స్ పరీక్షల్లో వంద మార్కులకు ఒక్కటే పేపర్ఉంటుందని, కనిష్టంగా 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేయగా, మొదటి సంవత్సరంలో 85 మార్కులకు పరీక్ష ఉంటుందని, అయితే 29 మార్కులు, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాస్ అయినట్లేనని వివరించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కులు చొప్పున ప్రాక్టికల్స్, గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్షలు రాయనున్న వారికి కొత్త మార్పులు వర్తించవన్నారు. కొత్తగా ఎలక్ట్రివ్ సబ్జెక్టు విధానాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం, ఏ గ్రూపు విద్యార్థులనైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసలుబాటు కల్పించిందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రధానాచార్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు పతనం తప్పదు : సీపీఐ
అనంతపురం అర్బన్: ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న సీఎం చంద్రబాబుకు పతనం తప్పదని సీపీఐ నాయకులు హెచ్చరించారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చంద్రబాబు నోట వచ్చే వరకూ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాఫర్, సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యకళాశాలలను 100 శాతం ప్రైవేటీకరిస్తూ జీఓ 590ని విడుదల చేశారని, తక్షణమే జీఓ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆస్తులను, ఆదాయాన్ని కారొరేట్లకు కట్టబెడుతున్నారని దుమ్మెత్తిపోశారు. ధర్నాలో నాయకులు శ్రీరాములు, రమణ, అల్లీపీరా, రాజేష్యాదవ్, నరేష్, కుళాయిస్వామి, పద్మావతి, చిరంజీవి, కృష్ణుడు, జయలక్ష్మి, యశోదమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం కళ్లు తెరవాలి
ప్రభుత్వ నిధులతో నిర్మించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఫీజులు భారీగా పెరిగి వైద్య విద్య అందుబాటులో ఉండదు. వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు అధికంగా పాల్గొని ప్రభుత్వంపై వ్యతిరేకత చాటారు. ప్రైవేటీకరణపై గవర్నర్ తుదినిర్ణయం తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలి. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరవాలి. – రామ్చరణ్, మెడికల్ విద్యార్థి, ఉద్దేహాళ్ -
రాష్ట్ర స్థాయి కౌశల్ క్విజ్ పోటీలకు 12 మంది ఎంపిక
అనంతపురం సిటీ: ఈ నెల 27న తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ విజ్ఞాన మండలి, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కౌశల్ క్విజ్ పోటీలకు జిల్లాక చెందిన 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో కేజీ నిఖిత (జెడ్పీహెచ్ఎస్, దోసలుడికి), ఎన్.నవీన్కుమార్, ఎం.ఓంకార్, తరుణ్ (కల్లిమఠం మున్సిపల్ హైస్కూల్, రాయదుర్గం), పసుపులేటి భార్గవి, పల్లె భవ్యశ్రీ (ఏపీఎంఎస్, తాడిపత్రి), ఎన్.అజయ్ప్రదీప్ (జెడ్పీహెచ్ఎస్, పోర్ట్ గుత్తి), ఎన్.లిఖిత (కేజీబీవీ, శింగనమల), ఎం.కల్పన (కేజీబీవీ, బుక్కరాయసముద్రం), ఎం.కమల్ వలి (ఏపీఎంఎస్, యాడికి), హెచ్.సందీప్ (ఎంపీయూపీఎస్, యలవగలవంక, బెళుగుప్ప మండలం), జరిపిటి అవంతిక (ఎంపీయూపీఎస్, మహమ్మదాబాద్ క్రాస్) ఉన్నారు. వీరిని అభినందిస్తూ అనంతపురంలోని ఉపాధ్యాయ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన సభలో ప్రశంసాపత్రాలను డీఈఓ ప్రసాద్బాబు అందజేసి, మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి గంధమనేని శ్రీనివాసులు, కౌశల్ జిల్లా సమన్వయకర్త ఆనంద భాస్కర్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు వసంతరాణి, రాము, సూరిబాబు పాల్గొన్నారు. -
తీవ్రంగా నష్టపోతారు
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంకల్పించి.. కొన్నింటిని పూర్తి చేశారు. విద్యా ర్థుల భవిష్యత్తు, పేదలకు అత్యుత్తమ వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పీపీపీని ఉపసంహరించు కోవాలి. – మల్లికార్జుననాయక్, పీజీ విద్యార్థి, ఎస్కేయూ -
‘సూపర్’లో వృద్ధురాలి మృతి
అనంతపురం మెడికల్: సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలి మృతి వివాదాస్పదమైంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వృద్ధురాలు మృతి చెందిందంటూ కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు.. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన కృష్ణమ్మ (85)ను కుటుంబసభ్యులు ఈ నెల 10న సూపర్ స్పెషాలిటీలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం ఈ నెల 11న ఆమెకు తాత్కాలిక పేస్ మేకర్ చేశారు. అనంతరం వేయాల్సిన సింగిల్ చాంబర్ పేస్ మేకర్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్గా సేకరించి ఈ నెల 16న శాశ్వత పేస్మేకర్ను వేశారు. బుధవారం సబ్క్లీవియన్ వీన్కు ఉన్న పైప్ను తొలగించిన కాసేపటికి వృద్ధురాలు కృష్ణమ్మ దగ్గుతో ఇబ్బంది పడుతూ అపస్మాకర స్థితికి చేరుకుంది. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దీంతో మృతురాలి కుటుంబీకులు ఆగ్రహానికి లోనయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కృష్ణమ్మ మృతి చెందిందంటూ ఆందోళనకు దిగారు. సింగిల్ పేస్ మేకర్ కోసం రూ.65వేలు చెల్లించేవరకూ ఆపరేషన్ను చేయలేదని ఆరోపించారు. ఈ ఆరోపణలను కార్డియాలజిస్టు డాక్టర్ సుభాష్ చంద్రబోస్ ఖండించారు. పేదలు ఇబ్బంది పడకూడదని, తమ వద్ద ఉన్న డ్యూయల్ చాంబర్ పేస్ మేకర్ను వేరే కంపెనీ వారికి ఇచ్చి సింగిల్ పేస్ మేకర్ తీసుకున్నామన్నారు. నయాపైసా తీసుకోకుండా ఉచితంగా పేస్ మేకర్ వేశామని, ఇందుకు కృతజ్ఞతభావం లేకున్నా పర్వాలేదని, అసత్య ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. వైద్యుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన -
వాహనం ఢీకొని 20 గొర్రెల మృతి
వజ్రకరూరు: ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో 20 గొర్రెలు మృతిచెందాయి. వివరాలు... గుంతకల్లు మండలం పులగుట్టపల్లికి చెందిన కాపరులు మహేష్, హేమంత్; రాము, సుధాకర్ బుధవారం తెల్లవారుజామున వజ్రకరూరు మండలం తట్రకల్లుకు గొర్రెల మందతో బయలుదేరారు. వజ్రకరూరు సమీపంలోకి చేరుకోగానే మందపైకి ఉరవకొండ నుంచి గుంతకల్లుకు వెళుతున్న ఐచర్ వాహనం దూసుకెళ్లింది. దీంతో 20 గొర్రెలు అక్కడిక్కడే మరణించాయి. మరో 33 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల మృతితో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇదెక్కడి తిరకాసు బాబూ!
పంటల నమోదు ప్రక్రియలో చంద్రబాబు సర్కారు కొత్త నిబంధనను తెరపైకి తీసుకువచ్చింది. కొత్త వెర్షన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ పేరుతో ఖరీఫ్లో నమోదు చేసిన పంటలను మళ్లీ రబీ సీజన్ కింద చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంటల నమోదు ప్రక్రియ మొదటి నుంచి చేపట్టాల్సి రావడంతో ప్రభుత్వ తీరుపై ఆర్ఎస్కే అసిస్టెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో రబీ పంట నమోదు ప్రక్రియ చాలా ఆలస్యంగా మొదలైంది. అక్టోబర్ నుంచి రబీ సీజన్ మొదలు కాగా ఇప్పటికే 70 నుంచి 80 శాతం పంట సాగు కూడా పూర్తయింది. సీజన్ ప్రారంభమైన రెండున్నర నెలల తర్వాత పంట నమోదు ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ బుధవారం పంట నమోదు ప్రక్రియ ప్రారంభించారు. ఈ–క్రాప్ అనేది ఆర్ఎస్కే అసిస్టెంట్లకు కొత్త కాకున్నా... ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టడంతో సీరియస్గా ఉన్నారు. సాఫ్ట్వేర్ మార్పుతో తిప్పలు ఖరీఫ్లోనూ ఈ క్రాస్ నమోదు ప్రక్రియ చాలా ఆలస్యంగా ఆగస్టులో మొదలు పెట్టి నవంబర్ 20న ముగించారు. 6.1 వెర్షన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కింద అప్పట్లో అతికష్టంపై ఈ ప్రక్రియను ఆర్ఎస్కే అసిస్టెంట్లు పూర్తి చేశారు. మధ్యలో సాంకేతిక సమస్యలు, సర్వర్ల సతాయింపుతో పాటు స్థానిక టీడీపీ చోటా.. మోటా నేతల ఒత్తిళ్లు, బెదిరింపులతో చాలా ఇబ్బంది పడ్డారు. ఇక రబీ సీజన్ ప్రారంభం కావడంతో పెద్దగా సమస్య ఉండదని అందరూ భావించారు. అయితే గతంలో ఉన్న 6.1 వెర్షన్ సాఫ్ట్వేర్ అప్టికేషన్ బదులు ప్రభుత్వం కొత్తగా 6.5 వర్షన్ సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ఖరీఫ్లో చేసిన విస్తీర్ణంతో పాటు రబీ విస్తీర్ణం, బీడు భూములు.. ఇలా మరోసారి పూర్తి స్థాయిలో పంట నమోదు చేయాలనే నిబంధన పెట్టి ఆర్ఎస్కే అసిస్టెంట్లపై పని ఒత్తిడి పెంచింది. గతంలో రబీలో సాగు చేసిన పంటలను మాత్రమే పంట నమోదు చేసేవారు. సాధారణంగా రబీ విస్తీర్ణం తక్కువగానే ఉండడంతో ఈ–క్రాప్ పెద్దగా సమస్య అనిపించేదికాదు. ఈ సారి ఖరీఫ్లో చేసినదంతా రబీలోనూ చేయాల్సిందేనని ఆదేశాలు రావడంతో ఆర్ఎస్కే అసిస్టెంట్లు కంగుతిన్నారు. మరోసారి 20 లక్షల ఎకరాల్లో సర్వే గత ఖరీఫ్లో మొత్తం 19.01 లక్షల ఎకరాలను ఈ–క్రాప్లో నమోదు చేశారు. ఇందులో 8.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 3.14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, 1,300 ఎకరాల్లో మల్బరీ, 7.21 లక్షల ఎకరాలను బీడు భూములుగా చూపించారు. రబీలో అన్ని పంటలు కలిపి 4 లక్షల ఎకరాలకు మించి ఉండదు. తాజాగా ఖరీఫ్లో పంటలు సాగు చేసిన భూములతో పాటు రబీ పంటలు, ఉద్యాన, మల్బరీ పంటలు, అలాగే బీడు భూములను కూడా సర్వే చేయాల్సి వచ్చింది. దీంతో మరోసారి 20 లక్షల ఎకరాల వరకూ సర్వే చేయాల్సి రావడం, అందులోనూ కొన్ని సాంకేతిక సమస్యలు నెలకొని ఉండడంతో ఆర్ఎస్కే అసిస్టెంట్లు తలలు బాదుకుంటున్నారు. వాస్తవానికి ఖరీఫ్లో కంది పంట ఏకంగా 3 లక్షల ఎకరాల వరకు సాగులోకి వచ్చినట్లు ఈ–క్రాప్లో నమోదైంది. ఇప్పుడు సాంకేతికంగా కంది పంటను తొలగిస్తే తప్ప ఈ–క్రాప్ నమోదు చేయడానికి కుదరదని ఆర్ఎస్కే అస్టిటెంట్లు అంటున్నారు. సాధారణంగా జనవరిలో కంది పంట కోతలు పూర్తవుతాయి. ఈ క్రమంలో ఫిబ్రవరి 28 లోపు రబీ ఈ–క్రాప్ ప్రక్రియ వంద శాతం పూర్తి కావాలని నిబంధన పెట్టడం తీవ్ర గందరగోళానికి తెరదీసింది. మొత్తమ్మీద రబీ ఈ–క్రాప్ తమకు గుదిబండగా మారిందని ఆర్ఎస్కే అసిస్టెంట్లు వాపోతున్నారు. ఖరీఫ్లో నమోదైన పంటలను రబీలోనూ ‘ఈ క్రాప్’ చేయాలంటూ నిబంధన ప్రభుత్వ తీరుపై ఆర్ఎస్కే అసిస్టెంట్ల సీరియస్ -
ఉపాధి చట్టాన్ని బలహీన పరచొద్దు : సీపీఎం
అనంతపురం టౌన్: ఉపాధి హామీ చట్టాన్ని బలహీన పరిచే సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకానికి పేరు మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు. డిమాండ్ సాధనలోభాగంగా బుధవారం అనంతపురంలోని డ్వామా కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. కొన్ని నెలలుగా వేతనాలు అందక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి హామి చట్టాన్ని బలహీన పరిచేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసల నివారణకు ప్రవేశపెట్టిన ఉపాధి హామి చట్టాన్ని మహాత్మ గాంధీ పేరిటనే కొనసాగించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డ్వామా పీడీ సలీంబాషాకు అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాలరంగయ్య, చంద్రశేఖర్రెడ్డి, ముత్తుజా, ప్రకాష్రెడ్డి, వలి, ఇర్ఫాన్, గోపాల్, లక్ష్మీనరసమ్మ, అశ్వని తదితరులు పాల్గొన్నారు. -
పొట్టేళ్ల దొంగ అరెస్ట్
తలుపుల: స్థానిక కుమ్మరపేటలో నివాసముంటున్న గంగయ్యకు చెందిన 19 పొట్టేళ్లను ఈ ఏడాది నవంబర్ 28న దుండగులు అపహరించుకెళ్లిన విషయం తెలిసిందే. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం కదిరి – పులివెందుల మార్గంలో బట్రేపల్లి వద్ద బుధవారం ఉదయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టిన సమయంలో పోలీసులను గమనించి సుమోలో పొట్టేళ్లను తరలిస్తున్న వారు వాహనాన్ని ఆపి ఐదుగురు పారిపోయారు. ఆ సమయంలో వాహనంలో ఉన్న రాప్తాడు పంచాయతీ పరిధిలోని చిన్మయనగర్కు చెందిన ఎరికల నాగభూషణ కుమారుడు చిన్నా పట్టుబడ్డాడు. 19 గొర్రెలను స్వాధీనం చేసుకుని విచారణ అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. తక్కువ వడ్డీతో పంట రుణాలుకూడేరు: జిల్లా వ్యాప్తంగా స్టేట్ బ్యాంకుల్లో రైతులకు తక్కువ వడ్డీతో పంట రుణాలు అందజేయనున్నట్లు ఆ బ్యాంక్ రీజినల్ మేనేజర్ రమేష్ బాబు తెలిపారు. బుధవారం కూడేరులోని స్టేట్ బ్యాంక్ వద్ద అన్నదాత వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ఎం రమేష్బాబు హాజరయ్యారు. పంట రుణాలే కాకుండా ఇతర రుణాలను అధిక మొత్తంలో తీసుకుని సకాలంలో కంతులు చెల్లిస్తున్న రైతులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పంటల సాగు, విత్తనాలు కోసం రుణాలు ఇస్తామన్నారు. వ్యవసాయ పరికరాలు, సోలార్ పంప్సెట్లు కొనుగోలుకు తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ ఈశ్వర్, సిబ్బంది ఎన్.లక్ష్మీనారాయణ, గోపీకృష్ణ, సుజినీ, బీఏ రాజు, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు. -
రిపబ్లిక్ డే పరేడ్కు ఎస్ఆర్ఐటీ విద్యార్థి
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ (అటానమస్) కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్, సీఎస్ఈ ద్వితీయ సంవత్సర విద్యార్థిని హర్షిత్ హోదయ రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపికై ంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్రెడ్డి బుధవారం వెల్లడించారు. ఎంపికై న హర్షిత్ హోదయ న్యూఢిల్లీలో ఈ నెల 30 నుంచి జరిగే శిక్షణా కార్యక్రమంలో పాల్గొననుంది. ఎంపికై న విద్యార్థిని ప్రిన్సిపాల్, వైస్ ప్రెసిడెంట్తో పాటు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, సీఎస్ఈ హెచ్ఓడీ డాక్టర్ వీరప్రకాష్, ఎన్ఎస్ఎస్ పోగ్రాం ఆఫీసర్ చిన్న పుల్లయ్య, అధ్యాపకులు అభినందించారు. -
అభివృద్ధి శూన్యం
విడపనకల్లు: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల భక్తుల ఇలవేల్పుగా విరాజిలుతున్న విడపనకల్లు మండలం పాల్తూరులోని ఉండబండ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి పూర్తిగా పడకేసింది. ఆలనపాలన చూసే దేవదాయ శాఖ అధికారి పత్తా లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా ఈ ఆలయానికి భక్తులు సమర్పించే కానుకలు రూ.20 లక్షలకు పైగానే ఉంటోంది. అయినా ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. పత్తా లేని ఈఓ దేవదాయ శాఖ పరిధిలోని ఉండబండ వీరభద్రస్వామి ఆలయ నిర్వహణకు ఆ శాఖ తరఫున ప్రత్యేకంగా ఓ కార్యానిర్వహణాధికారి నియమితులయ్యారు. అయితే సదరు అధికారి ఎక్కడ ఉంటాడో.. ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. ఏడాదిలో రెండు, మూడు సార్లు మాత్రమే చుట్టపు చూపుగా వచ్చి వెళుతుంటారు. ప్రతి నెలా జీతాలు మాత్రం ఆలయ ఆదాయ వనరుల నుంచే తీసుకుంటున్నట్లు సమాచారం. దశాబ్దాల క్రితం ఆలయంలో ఉన్న సౌకర్యాలతోనే భక్తులు నేటికీ నెట్టుకొస్తున్నారు. కొత్తగా ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. పర్యవేక్షణ లేకపోవడంతో ఆలయ ప్రాంగణంతో పాటు పరిసరాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. సరైన మరుగుదొడ్లు, బాత్రూమ్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అత్యవసర సమయంలో మహిళా భక్తులు సైతం ఆరు బయలు ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోంది. -
కుటుంబ పోషణ ఎలా?
నేను 20 ఏళ్లుగా పాలిష్ చేసిన బండలను కటింగ్ చేసే పని చేస్తున్నా. వారానికి రూ.2వేలకు పైగా సంపాదించేవాడిని. ప్రస్తుతం అరకొరగా బండలు వస్తుండటంతో సంపాదన సగానికి తగ్గిపోయింది. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాలేదు. –సూరి, చుక్కలూరు యూనిట్లు నడపలేం ప్రభుత్వం పెంచిన రాయల్టీతో బండల పాలిష్ యూనిట్లు నడపడం చాలా కష్టం. అనధికారికంగా పాత రాయల్టీతో బండలు వస్తున్నా.. పనులు చేయడానికి కార్మికులు ముందుకు రావడం లేదు. అప్పులు తెచ్చి యూనిట్లను నడుపుతున్నాం. ప్రస్తుతం వడ్డీలకు కూడా గిట్టుబాటు కావడం లేదు. ఇలా అయితే యజమానులు దివాళా తీయాల్సి వస్తుంది – గౌస్పీరా, బండల పాలిష్ యూనిట్ యుజమాని, తాడిపత్రి -
నకిలీ సర్టిఫికెట్లు హ్యాకర్ల పనే
బత్తలపల్లి: రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్న నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారం హ్యాకర్ల పనేనని ప్రాథమికంగా తేలింది. పోట్లమర్రి గ్రామ పంచాయతీ పరిధిలోని బత్తలపల్లి–3 గ్రామ సచివాలయం లాగిన్ నుంచి 1,982 బర్త్ సర్టిఫికెట్లు జారీ అయిన అంశంపై ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించడంతో అధికారులు ఉరుకులు, పరుగులు తీశారు. అయితే పోట్లమర్రి పరిధిలో ఉన్న బత్తలపల్లి–3 సచివాలయానికి బర్త్ సర్టిఫికెట్ల జారీకి లాగిన్ ఐడీ లేదని తెలుసుకున్నారు. దీంతో హ్యాకర్లు సచివాలయ లాగిన్ ఐడీని కొత్తగా క్రియేట్ చేసి మరీ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసుకున్నట్లు గుర్తించారు. నూతనంగా ఏర్పడిన పంచాయతీ బత్తలపల్లి పంచాయతీ నుంచి విడిపోయి పోట్లమర్రి గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడింది. గతంలో బత్తలపల్లి పంచాయతీ పరిధిలో బత్తలపల్లి–1, బత్తలపల్లి–2, బత్తలపల్లి–3 గ్రామ సచివాలయాలు ఉండగా.. పోట్లమర్రి పంచాయతీ ఏర్పడ్డాక బత్తలపల్లి –3 గ్రామ సచివాలయాన్ని పోట్లమర్రి పరిధిలో చేర్చారు. వాస్తవానికి పోట్లమర్రి పంచాయతీ ఏర్పడకముందు నుంచీ బత్తలపల్లి–1 సచివాలయంలో మాత్రమే బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. పోట్లమర్రి పంచాయతీగా ఏర్పడినప్పటికీ ఆ పంచాయతీ పరిధిలోని బర్త్ సర్టిఫికెట్లు కూడా బత్తలపల్లి–1 సచివాలయం నుంచే జారీ అవుతున్నాయి. బత్తలపల్లిలో ఆర్డీటీ ఆస్పత్రి ఉండడం వల్ల ఇక్కడ ఏడాదికి 5 వేలకుపైగానే బర్త్ సర్టిఫికెట్లు జారీ అవుతుంటాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న హ్యాకర్లు.. నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసుకునేందుకు పోట్లమర్రి పంచాయతీ పరిధిలోని బత్తలపల్లి–3 సచివాలయాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సచివాలయానికి బర్త్ సర్టిఫికెట్ జారీ చేసే ఐడీ లేదని తెలిసిన హ్యాకర్లు.. దొంగ ఐడీ క్రియేట్ చేసి నకిలీబర్త్ సర్టిఫికెట్లు చేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇతర రాష్ట్రాల వారివే ఎక్కువ.. పోట్లమర్రి గ్రామ పంచాయతీలో జారీ అయిన 1,982 బర్త్ సర్టిఫికెట్లన్నీ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. ఇప్పటికే శ్రీసత్యసాయి జిల్లాలోని అగళి, బత్తలపల్లి మండలాల నుంచి జారీ అయిన బర్త్ సర్టిఫికెట్లపై అధికారులు దృష్టి సారించారు. కాగా పోట్లమర్రి పంచాయతీ నుంచి జారీ అయిన బర్త్ సర్టిఫికెట్లన్నీ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. పోట్లమర్రి పరిధిలోని బత్తలపల్లి–3 సచివాలయం లాగిన్ నుంచే పత్రాల జారీ ఆ సచివాలయానికి బర్త్ సర్టిఫికెట్ల జారీకి లాగిన్ ఐడీ లేదంటున్న సిబ్బంది -
పద్మావతీ..ఏమిటీ దుర్గతి?!
● సర్వజనాస్పత్రిలో పరిశుభ్రతను గాలికొదిలేసిన ఏజెన్సీ ● బాబుగారి తాలూకా అని నోరుమెదపని అధికారులు అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సురక్షిత ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన ఏజెన్సీ నిబంధనలు పాటించకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా చికిత్సల కోసం వచ్చే రోగులు అపరిశుభ్రత కారణంగా ఇన్ఫెక్షన్లతో సతమతమవుతున్న పరిస్థితి నెలకొంటోంది. రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన బోధనాస్పత్రుల్లో అనంతపురం సర్వజనాస్పత్రి ఒకటి. ఇక్కడ పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్ట్ పద్మావతి ఏజెన్సీ చేజిక్కించుకుంది. ఈ ఏజెన్సీ నిర్వాహకుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మిత్రుడని తెలిసింది. అక్యూట్ మెడికల్ కేర్, క్యాజువాలిటీ, ఐసీసీయూ, ఆపరేషన్ థియేటర్లు, తదితర వాటిని ప్రతి మూడు గంటలకోసారి శుభ్రం చేయాలి. అలాగే మిగతా వార్డులను రోజుకు 4 నుంచి 6సార్లు క్లీనింగ్ చేయాలి. అయితే ఏజెన్సీ నిర్వాహకులు ప్రస్తుతం పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల్లో 50 ఏళ్లు నిండిన వారిని కొద్దిరోజులుగా విధులకు దూరంగా పెట్టారు. ప్రశ్నించిన వారి పట్ల ఏజెన్సీ ప్రతినిధులు దురుసుగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. దీంతో సదరు కార్మికులు తమను విధుల్లో కొనసాగించాలని కోరుతూ ఆందోళన బాటపట్టారు. కొత్తగా తీసుకొచ్చిన కార్మికులను పనిచేయకుండా అడ్డుకుంటున్నారు. ప్రజారోగ్యంపై అంతులేని నిర్లక్ష్యం పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను పద్మావతి ఏజెన్సీ పక్కన పెట్టేసింది. ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిసినా డోంట్కేర్ అంటోంది. మెడిసిన్, లేబర్, గైనిక్, ఈఎన్టీ, సర్జరీ, ఆర్థో, పల్మనాలజీ, సైకియాట్రీ, వివిధ ఆపరేషన్ థియేటర్లను శుభ్రం చేయడం లేదు. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చెత్తాచెదారం, మెడికల్ వేస్ట్లతో వార్డులు కంపు కొడుతున్నాయి. రోగులకు వినియోగించిన పరికరాలు, దూది, ముక్కలు, సిరంజీలు, క్యాన్లా వంటివి ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయి. సాధారణంగా 5 రకాల డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలి. కానీ వార్డుకు ఒకటి లేదా రెండు డస్ట్బిన్లు మాత్రమే ఉంచారు. వార్డుల నుంచి చెత్తను అట్టపెట్టెల్లో వేసుకుని తీసుకెళ్తున్నారు. ఇక ఆపరేషన్ థియేటర్లలో ప్రాణాంతక కేసులకు సంబంధిన వ్యర్థాలను శాసీ్త్రయ పద్ధతిలో ఖననం చేయాలి. కానీ అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. లేబర్ వార్డులో ప్లాస్టిక్ కవర్లలో వ్యర్థాలను వేయిస్తున్నారు. ఏజెన్సీ తీరుతో పీజీ సీట్లకు ఎసరు! ప్రభుత్వ వైద్య కళాశాలలో యూజీ, పీజీ సీట్ల సంఖ్యను అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని మంజూరు చేస్తారు. ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. దీన్ని గమనిస్తే నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనంతపురం మెడికల్ కాలేజీలో పీజీ సీట్లను రద్దు చేసే అవకాశం లేకపోలేదు. ఎన్ఏబీహెచ్ మార్గదర్శకాల ప్రకారం అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పారిశుధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీని రద్దు చేసే పరిస్థితి ఉంటుంది. రెండు నెలలుగా ఆస్పత్రిలో శానిటేషన్ అట్టర్ ఫ్లాప్ అయినా ఉన్నతాధికారులు చక్కదిద్దే ప్రయత్నం చేయలేకపోవడం విమర్శలకు తావిస్తోంది -
మద్దతు ధరకు విక్రయించండి
బొమ్మనహాళ్ మండలంలో 20,355 ఎకరాల్లో వరి సాగు చేశారు. బయట మార్కెట్లో ధాన్యం క్వింటాలు ధర తక్కువగా ఉంది. ఉద్దేహాళ్, శ్రీధరఘట్ట సహకార సొసైటీల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏ గ్రేడ్ వరి అయితే రూ. 2,389, సాధారణం అయితే రూ.2,369 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 25 వేల టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. – సాయికుమార్, వ్యవసాయాధికారి, బొమ్మనహాళ్ -
ప్రజల భావోద్వేగాలపై దాడి
● కేంద్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి శైలజానాథ్ మండిపాటు అనంతపురం: గ్రామీణ పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు తొలగింపునకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ప్రజల భావోద్వేగాలపై ప్రత్యక్ష దాడి చేయడమేనని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. 2005 ఆగస్టు 23న భారత పార్లమెంట్ ఆమోదించి.. 2006 ఫిబ్రవరి 2న నార్పల మండలం బండ్లపల్లి వేదికగా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ద్వారా గ్రామీణ పేద కుటుంబాలకు ఏటా కనీసం 100 రోజుల ఉపాధిని హక్కుగా కల్పించారని గుర్తు చేశారు. ఈ పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు గణనీయంగా తగ్గిపోయాయన్నారు. ఉన్న ఊరిలోనే పని చేసుకునే అవకాశం కలిగిందన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, చెరువులు, కాలువలు, రోడ్లు వంటి పనులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన చట్టం ఇదేనని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చట్టం పేరు మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని సూచించారు. ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమానత్వం, సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన జాతిపిత మహాత్మాగాంధీ పేరు ఈ పథకానికి ఉండటం చారిత్రక అవసరమన్నారు. అటువంటి చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని స్పష్టం చేశారు. -
క్వింటాకు రూ.1,000 తగ్గింది
గతంలో వరి క్వింటాలు ధర రూ.3,100 వరకు ఉండేది. ఈ ఏడాది బయటి మార్కెట్లో రూ. 2,100 నుంచి రూ.2,150కు పడిపోయింది. మోంథా తుపాను కారణంగా వరి పంట నేలకొరిగి దిగుబడి కూడా తగ్గింది. వరి కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ రూ. 2,389 ఉంది. అయితే ఈ–క్రాప్ బుకింగ్, ఈ–కై వైసీ నమోదు చేయించుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలా కాకుండా ప్రతి రైతు వద్దా వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి, 48 గంటల్లోలోపు నగదును ఖాతాలో జమ చేయాలి. – ప్రసాద్రెడ్డి, రైతు, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం -
‘నన్ను గెలకొద్దు..నువ్వే ఇబ్బంది పడతావ్’
అనంతపురం టవర్క్లాక్: ‘నన్ను గెలకొద్దు..నువ్వే ఇబ్బంది పడతావ్’ అంటూ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం అనంతపురంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బళ్లారికి వెళ్తూ.. మార్గ మధ్యంలో తమ సమీప బంధువుల ఇంటికి వెళ్లానని, ఆ మరుసటి రోజే తమ బంధువులపై దాడి జరిగిందన్నారు. అది ఎవరు చేశారు..ఎందుకు చేశారన్నది త్వరలోనే తేలుతుందన్నారు. దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళితే.. తనపై రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కొంత మంది టీడీపీ నాయకులు కలిసి పచ్చ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేయిస్తూ వార్తలు రాయించారన్నారు. బీజేపీతో భాగస్వాములుగా ఉంటూ ఇలా వ్యవహరించడం సబబు కాదని హితవు పలికారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా కాలవ గెలుపు కోసం తన కుటుంబం పడిన శ్రమను గుర్తు చేశారు. పార్టీ మారుతున్నట్లు పదేపదే ప్రచారం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని, తాను పార్టీ మారుతున్నట్లు ఎవరితోనైనా చెప్పానా అని ప్రశ్నించారు. -
గుప్త నిధుల ఆశతో..
అనంతపురం కల్చరల్: శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గాంజనేయస్వామి సేవలో ఉన్న అర్చక కుటుంబంపై టీడీపీ మూకలు దౌర్జన్యానికి దిగి.. ఆయన్ని గెంటేసి ఆలయానికి, కమ్యూనిటీ హాలుకు తాళాలు వేసి బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే అరాచకాలపై స్థానిక అధికారులు, పోలీసులు స్పందించకపోవడంతో బాధిత అర్చకుడు బీఈ సిరి రమణ న్యాయం కోసం కలెక్టరేట్ ఎదుట ఫుట్పాత్పై ఆమరణదీక్షకు పూనుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. దుర్గాంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధులున్నాయని, రూ.6 కోట్ల ఫండ్ ఉందని ప్రచారం జరుగుతోందని, వీటి కోసమో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ కుటుంబం కుట్ర పన్ని.. అర్చక కుటుంబంపై ఆరోపణలు చేస్తూ దాష్టీకానికి పాల్పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్చకుడు ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీల నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. అయినా న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగించాలని ప్రతిన బూనాడు. రాత్రంతా గజగజ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా దీక్ష కొనసాగించాడు. అయితే.. అర్ధరాత్రి అనంత పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చేపట్టిన ఆలయ పూజారి రమణాచారి అరెస్ట్ చేశారు. బలవంతంగా జీజీహెచ్కు తరలించారు. శ్రావణి ఆదేశాలతో సీఐ బెదిరింపులుఎమ్మెల్యే శ్రావణి ఆదేశాలతో పోలీసులు ఆలయ కబ్జాకు సహకరిస్తున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో.. కాళ్లు విరగొడతానని పూజారి రమణాచారి ని శింగనమల సీఐ కౌలుట్లయ్య బెదిరించారని తెలుస్తోంది. సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పూజారి రమణాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. గుప్త నిధుల కోసమే టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తల్లి లీలావతి ఈ దారుణానికి పాల్పడ్డారని అందులో ఆయన ఆరోపించడం ఉంది. హిందూ సంఘాల మద్దతు.. మంగళవారం అయ్యప్ప మాలధారులు, వీహెచ్పీ, హిందూ చైతన్య వేదిక, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు అర్చకునికి సంఘీభావం తెలిపారు. అర్చకుడంటే మరీ అంత అలుసా.. భగవంతుని సేవ తప్ప మరొకటి తెలియని వారిపై ఇంత అరాచకం జరుగుతున్నా పట్టనట్టు ఉంటే ఎలా అని అధికారుల తీరుపై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ మద్ధతు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. మంగళవారం అర్చకుడిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయాల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం కోసం పాటుపడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో అధికార టీడీపీ నేతల వైఖరితో అర్చకులు, అర్చక సంఘాల వారు బెంబేలెత్తిపోతున్నారని ఆవేదన చెందారు. బ్రాహ్మణుడు బలహీనుడని బాధిస్తే చూస్తూ ఊరుకోబోమని, తామంతా వెంట ఉండి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆలయాలకు భద్రత కరువు రాష్ట్రంలో ఆలయాలకు భద్రత కరువైందని ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. అర్చకుడిని పరామర్శించి, సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. నాలుగు నెలల కిందట సింహాచల దేవస్థానంలో హుండీ చోరీ జరిగిందని, ఆరు నెలల కిందట అహోబిలం దేవస్థానంలో ఎమ్మెల్యే అనుచరులు హుండీ చోరీ చేసినా, వాడపల్లి వెంకటేశ్వరస్వామి వేవస్థానంలో శ్రీనివాసరావు అనే టీడీపీ కార్యకర్త హుండీ కానుకల లెక్కింపులో చేతివాటం ప్రదర్శించినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందన్నారు. నిత్యం ఏదో ఒక ఆలయంలో టీడీపీ నాయకులు వివాదం రగిలిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నారన్నారు. శింగనమల అర్చక కుటుంబంపై ఎమ్మెల్యే కుటుంబం కుట్ర పన్ని ఇబ్బందులు సృష్టించడం తగదన్నారు. గుప్తనిధుల కోసం సాగుతున్న దాషీ్టకంపై అధికారులకు తెలియజేసినా ఏమీ స్పందించకపోతే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షకుడినంటూ గొప్పగా ప్రచారం చేసుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇదంతా కనిపించడం లేదా అని నిలదీశారు. ఆయన స్పందించాలంటే చంద్రబాబు స్క్రిప్ట్ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. -
సంక్రాంతికి ‘పాడి’ పోటీలు
● ఆకుతోటపల్లిలో నిర్వహణకు నిర్ణయం అనంతపురం అగ్రికల్చర్: రాయలసీమ జిల్లాల పరిధిలో తొలిసారిగా పాడి ఆవులతో పాల దిగుబడి, లేగదూడల ప్రదర్శన పోటీలు నిర్వహించాలని పశుసంవర్ధకశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ అంశంపై మంగళవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో డీడీలు, ఏడీలు, డాక్టర్లతో ఆ శాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్ సమీక్షించారు. ఇప్పటి వరకూ కోస్తా జిల్లాల్లోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారని, తొలిసారిగా అనంతపురం జిల్లాలోనూ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. డైరెక్టరేట్ అనుమతితో పోటీలు ఏర్పాటు, ప్రోత్సాహకాలు, ఇతరత్రా పురస్కారాలు అందజేస్తామన్నారు. రైతుల పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి రెండో వారంలో అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో పెద్ద ఎత్తున పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాల దిగుబడి పోటీలకు జిల్లా నలుమూలల నుంచి కనీసం 150 నుంచి 200 వరకు పాడి ఆవులు తరలివచ్చేలా చూడాలన్నారు. అలాగే వందల సంఖ్యలో లేగదూడలతో ప్రదర్శన నిర్వహించాలన్నారు. ఇదే సందర్భంలో గర్భకోశవ్యాధి శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన మందులు, వైద్య చికిత్సలు అందజేయాలన్నారు. పశుసంపద, జీవసంపద పరిరక్షణ, నాణ్యమైన పాడి ఉత్పత్తి కోసం పాడి రైతులను ప్రోత్సహించే క్రమంలో మొదటిసారిగా పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు జేడీ తెలిపారు. సమావేశంలో డీడీలు డాక్టర్ వై.రమేష్రెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, ఏడీలు రామచంద్రారెడ్డి, రత్నకుమార్, రాధిక, సుబ్రహ్మణ్యం, సురేష్, డాక్టర్లు గోల్డ్స్మన్, శారద, మహేష్, ఉష, సోమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
వేతన సవరణ చేయాలని నిరసన
అనంతపురం అగ్రికల్చర్: హెచ్ఆర్ పాలసీ అమలు, వేతన సవరణ చేపట్టాలనే ప్రధాన డిమాండ్లతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా సహకార అధికారి (డీసీవో) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, డి.శ్రీనివాసులు మాట్లాడుతూ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, పేస్కేల్ కూడా నిర్ణయిస్తూ 2019లో జీవో 36 విడుదల చేసినా అమలుకు నోచుకోలేదన్నారు. 2019 తర్వాత వేతన సవరణ చేయకుండా చాలీచాలనీ జీతాలు ఇస్తున్నట్లు వాపోయారు. అది కూడా ‘డ్యూటు’ పద్ధతిలో చెల్లించడం దారుణమన్నారు. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలన్నారు. రూ.20 లక్షల వరకు ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, గ్రాట్యూటీ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. కంప్యూటరీకరణ చేయలేదనే నెపంతో రూ.2.80 కోట్ల వరకు వేసిన అపరాధ రుసుం తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ సమస్యలపై డీసీవో అరుణకుమారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, సీఐటీయూ నాయకుడు నాగేంద్ర, పీఏసీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి, నాయకులు డి.నారాయణ, నగేష్, రామాంజినేయులు, నరేంద్రరెడ్డి, కేసీ ఆంజనేయులు పాల్గొన్నారు. -
వాటర్షెడ్ పనుల్లో దోపిడీ
రాప్తాడు రూరల్: దేశంలోనే అత్యల్ప వర్షపాదం నమోదయ్యే రెండో జిల్లాగా ఉన్న అనంతపురంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్షెడ్ పథకం వరం లాంటిది. ప్రతి నీటి చుక్కా వృథా కాకుండా భూమిలో ఇంకేలా చేసి భూగర్భ జలాలు పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. ఇంతటి ప్రాధాన్యత కల్గిన పథకం నిర్వహణను కొందరు అధికార తెలుగుదేశం పార్టీ అండతో నీరుగారుస్తున్నారు. వీరికి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు తోడవడంతో అక్రమాలకు తెర లేపుతున్నారు. రాప్తాడు మండలం హంపాపురం వాటర్షెడ్ పరిధిలో తవ్విన డగౌట్ పాండ్ల (ఇంకుడు గుంతల) నిర్మాణాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఎక్కడైనా పనులు చేసి బిల్లులు చేసుకోవడం పరిపాటి. అయితే ఇక్కడి పనులు పరిశీలిస్తే బిల్లుల కోసం మాత్రమే పనులు చేసినట్టు స్పష్టమవుతోంది. ఫలితంగా లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. చింతతోపు చిన్నబోయేలా.. హంపాపురం సమీపంలోని చింతతోపులో అన్ని చెట్లకూ కాయలు విరగ్గాస్తున్నాయి. అలాంటి చింతతోపే చిన్నబోయేలా చేశారు టీడీపీ నేతలు. ఒకటికాదు రెండు కాదు దాదాపు 30 చింత చెట్లను తొలగించి ఆరు డగౌట్ పాండ్లు నిర్మించారు. చాలావరకు తొలగించిన చింతచెట్లు కనిపించకుండా తవ్వినమట్టిని కప్పేశారు. చింతతోపులో పెద్దపెద్ద చెట్లను తొలగించడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో ఇంకుడు గుంతలేంటి? నీటి సరంక్షణ కోసం చెరువుల్లోనూ డగౌట్ పాండ్లు నిర్మించారు. హంపాపురం సమీపంలో ఉన్న రెండు చెరువుల్లోనూ 15 పాండ్ల దాకా నిర్మించినట్లు తెలిసింది. అలాగే హంపాపురం వాటర్షెడ్కు సంబంధం లేని జంగాలపల్లి చెరువులో సైతం 5 డగౌట్ పాండ్లు నిర్మించడం గమనార్హం. చెరువులో పూడిక తీయించే పనులు చేయొచ్చుకానీ చెరువులో గుంతలు ఎలా పెడతారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పైగా చెరువులో గుంతలు పెట్టిన దెబ్బకు రెండు ఆదాయాలు వచ్చి పడుతున్నాయి. ఒకటేమో డగౌట్పాండు బిల్లు కాగా.. మరొకటేమో ఇక్కడ గుంత తవ్వి తీసిన మట్టిని ఇటుకల తయారీ ఫ్యాక్టరీలకు విక్రయించి సొమ్ము చేసుకోవడం. ఏపీడీ పరిశీలించారా? సాధారణంగా వాటర్షెడ్ పరిధిలో జరిగిన పనులకు సంబంధించి బిల్లులు పెట్టేముందు డ్వామా అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఏపీడీ) పరిశీలించి ఆమోదం తెలపాలి. మరి హంపాపురం వాటర్షెడ్ పరిధిలో జరిగిన డగౌట్పాండ్ల నిర్మాణాలను ఏపీడీ క్షేత్రస్థాయిలో పరిశీలించారా? లేదా? అనేది ఉన్నతాధికారులకే తెలియాలి. బిల్లుల కోసం డగౌట్ పాండ్ పనులు హంపాపురంలో వెలుగుచూసిన అక్రమాలు చింతతోపులో చెట్లను తొలిగించి మరీ పాండ్ల నిర్మాణం పరిధి దాటి జంగాలపల్లి చెరువులోనూ వెలసిన పాండ్లు అక్రమాలకు తెరలేపిన అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చెట్లను తొలగించకూడదు హంపాపురం వాటర్షెడ్ పరిధిలోని చింతవనంలోని చింతచెట్లను తొలగించి గుంతలు పెట్టిన సంగతి నా దృష్టికి రాలేదు. పాండ్లు నిర్మించే క్రమంలో ఏ ఒక్క చెట్టును కూడా తొలగించరాదు. కాపుకాసే చింతచెట్లను తొలగించి గుంతలు తవ్విన వైనంపై విచారణ చేయిస్తాం. క్షేత్రస్థాయిలో ఉండే టెక్నికల్ అధికారితో పాటు ఇతరులకు నోటీసులు ఇస్తాం. – సలీంబాషా, పీడీ, డ్వామా -
జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన ఐదుగురు ఫెన్సర్లు రాణించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరిలో గీతిక, చేతన, లిఖిత, నవనీత్, సాత్విక్ ఉన్నారు. మణిపూర్లో త్వరలో జాతీయస్థాయి పోటీలు జరగనున్నాయని, ఇందులోనూ జిల్లా క్రీడాకారులు రాణించాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి మురళీకృష్ణ ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులను మంగళవారం అనంతపురంలోని కార్యాలయంలో అభినందించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కాలవ అనంతపురం టౌన్: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులును నియమించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పార్టీ అధ్యక్ష పదవులను ఎమ్మెల్యేలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కాలవ శ్రీనివాసులును ఎంపిక చేసినట్లు తెలిసింది. అలాగే శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్ష స్థానాన్ని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు కేటాయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అధికారికంగా పార్టీ అధిష్టానం వెల్లడించాల్సి ఉంది. సేకరించిన ధాన్యానికి 45 శాతం చెల్లింపులు జరిగాయి అనంతపురం అర్బన్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 4,951 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇందుకు సంబంధించి 45 శాతం చెల్లింపులు జరిగినట్లు జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ స్పష్టం చేశారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. జిల్లాలో 24 ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ నెల 16వ తేదీ నాటికి 412 మంది రైతుల నుంచి రూ.12.62 కోట్ల విలువైన 4,951.920 టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకూ రూ.5.71 కోట్లను 185 మంది రైతులకు చెల్లించామన్నారు. మిగిలిన 227 మందికి రూ. 6.91 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని ఒకట్రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యాన్ని విక్రయించడంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే 79814 50565 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు జూదరుల అరెస్ట్ గుంతకల్లు రూరల్: మండలంలోని కసాపురం గ్రామ శివారున సంగాల రోడ్డు వద్ద పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు గుంతకల్లు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టిన సమయంలో అర్ధరాత్రి పేకాట ఆడుతూ జూదరులు పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.1,66,050 నగదు, చార్జింగ్ లైట్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జూదరుల అరెస్ట్లో చొరవ చూపిన కసాపురం ఎస్ఐ టీపీ వెంకటస్వామి, ట్రైనీ ఎస్ఐ బాలముని, సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు. పనుల్లో నాణ్యత లోపించరాదు కూడేరు: పీఏబీఆర్ ధర్మవరం కుడికాలువ 4వ కిలోమీటర్ వద్ద ఇటీవల తెగిన కాలువ గట్టు మరమ్మతు పనులను క్వాలిటీ కంట్రోల్ డీఈ చంద్రశేఖర్, జేఈ ఓబుళపతి, ఇరిగేషన్ డీఈ విశ్వనాథ్ రెడ్డి, జేఈలు సుబ్రహ్మణ్యం, రమ్య మంగళవారం పరిశీలించారు. ఈ పనులకు రూ. కోటి అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం రూ.90 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించరాదని సంబంధిత కాంట్రాక్టర్కు అధికారులు సూచించారు. నేటి నుంచి సంతోష్ ట్రోఫీ మ్యాచ్లు అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్ వేదికగా బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకూ సీనియర్ మెన్స్ నేషనల్ సంతోష్ ట్రోఫీ ఫుట్బాట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందు కోసం ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్ఏ) ఏర్పాట్లు పూర్తిచేసింది. గ్రూప్ జీలో భాగంగా ఆంధ్రతో పాటు తమిళనాడు, అండమాన్, పాండిచ్చేరి జట్లు తలపడనున్నాయి. పీఏబీఆర్ కుడి కాలువ గట్టు మరమ్మతులను పరిశీలిస్తున్న క్వాలిటీ కంట్రోల్ అధికారులు -
అర్చకుడంటే అంత అలుసా..?
● రాత్రంతా చలిలోనే ఆమరణ దీక్ష● ఏ ఒక్క అధికారీ పట్టించుకోని వైనం● వైఎస్సార్సీపీ, ప్రజాసంఘాలు, అయ్యప్ప మాలధారుల సంఘీభావంఅనంతపురం కల్చరల్: శింగనమలలోని దుర్గాంజనేయస్వామి సేవలో ఉన్న అర్చక కుటుంబంపై అధికార టీడీపీ మూకలు దౌర్జన్యానికి దిగి, ఆలయానికి, కమ్యూనిటీ హాలుకు తాళాలు వేసి బీభత్సం సృష్టించారు. స్థానిక అధికారులు, పోలీసులు స్పందించకపోవడంతో బాధిత అర్చకుడు బీఈ సిరి రమణ న్యాయం కోసం కలెక్టరేట్ ఎదుట ఫుట్పాత్పై సోమవారం ఆమరణదీక్షకు పూనుకున్నాడు. రాత్రంతా గజగజ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా దీక్ష కొనసాగించాడు. కలెక్టర్, ఎస్పీల నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. అయినా న్యాయం జరిగే వరకూ దీక్ష కొనసాగించాలని ప్రతిన బూనాడు. మంగళవారం అయ్యప్ప మాలధారులు, శింగనమల నుంచి విచ్చేసిన వైఎస్సార్సీపీ నాయకులు, వీహెచ్పీ, హిందూ చైతన్య వేదిక, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు అర్చకునికి సంఘీభావం తెలిపారు. అర్చకుడంటే మరీ అంత అలుసా.. భగవంతుని సేవ తప్ప మరొకటి తెలియని వారిపై ఇంత అరాచకం జరుగుతున్నా పట్టనట్టు ఉంటే ఎలా అని అధికారుల తీరుపై మండిపడ్డారు.గుప్తనిధుల కోసమే ఆరాటంచంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. అర్చకుడిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయాల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం కోసం పాటుపడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో అధికార టీడీపీ నేతల వైఖరితో అర్చకులు, అర్చక సంఘాల వారు బెంబేలెత్తిపోతున్నారని ఆవేదన చెందారు. దుర్గాంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధులున్నాయని, రూ.6 కోట్ల ఫండ్ ఉందని ప్రచారం జరుగుతోందని, వీటి కోసమో ఎమ్మెల్యే శ్రావణిశ్రీ కుటుంబం కుట్ర పన్ని.. అర్చక కుటుంబంపై ఆరోపణలు చేస్తూ దాష్టీకానికి పాల్పడుతోందని ఆరోపించారు. బ్రాహ్మణుడు బలహీనుడని బాధిస్తే చూస్తూ ఊరుకోబోమని, తామంతా వెంట ఉండి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.ఆలయాలకు భద్రత కరువురాష్ట్రంలో ఆలయాలకు భద్రత కరువైందని ప్రభుత్వ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. అర్చకుడిని పరామర్శించి, సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. నాలుగు నెలల కిందట సింహాచల దేవస్థానంలో హుండీ చోరీ జరిగిందని, ఆరు నెలల కిందట అహోబిలం దేవస్థానంలో ఎమ్మెల్యే అనుచరులు హుండీ చోరీ చేసినా, వాడపల్లి వెంకటేశ్వరస్వామి వేవస్థానంలో శ్రీనివాసరావు అనే టీడీపీ కార్యకర్త హుండీ కానుకల లెక్కింపులో చేతివాటం ప్రదర్శించినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించిందన్నారు. నిత్యం ఏదో ఒక ఆలయంలో టీడీపీ నాయకులు వివాదం రగిలిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నారన్నారు. శింగనమల అర్చక కుటుంబంపై ఎమ్మెల్యే కుటుంబం కుట్ర పన్ని ఇబ్బందులు సృష్టించడం తగదన్నారు. గుప్తనిధుల కోసం సాగుతున్న దాష్టీకంపై అధికారులకు తెలియజేసినా ఏమీ స్పందించకపోతే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షకుడినంటూ గొప్పగా ప్రచారం చేసుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇదంతా కనిపించడం లేదా అని నిలదీశారు. ఆయన స్పందించాలంటే చంద్రబాబు స్క్రిప్ట్ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. -
ఖోఖో జిల్లా జట్ల ఎంపిక
ఉరవకొండ: పట్టణంలోని ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గల ఖోఖో కోర్టులో మంగళవారం రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనే జిల్లా సీనియర్, జూనియర్ జట్ల ఎంపిక నిర్వహించారు. ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ తరఫున పుల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ పీడీల పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ జరిగింది. ఎంపిక వివరాలు.. సీనియర్ మహిళల జిల్లా జట్టు : రాజ్యలక్ష్మి, మునెమ్మ, సునీత, స్వప్న, శ్రీజ, జ్యోతి, రేణుక, భార్గవి, శ్వేత, ఇందు, అనిత, వీణా, ఇందు, శ్రావణి, హేమలత, హష్మీ, జయశ్రీ. సీనియర్ పురుషుల జిల్లా జట్టు: పురుషోత్తం, అహ్మద్, సంతోష్, రాజమ్మ, ఆంజినేయులు, రఘు, ఆది, నిసార్, సచిన్, రవి, సురేష్, కార్తీక్, వీరశంకర్, ఉపేంద్ర, నితీష్, నరేంద్ర, అజయ్. జూనియర్ బాలికల జట్టు: శాంతి, స్వప్న, అంజలి, పూజారెడ్డి, మనీషా, వీణా, అనిత, అనంతలక్ష్మి, సుమిత్ర, హర్షిత, ఇందు, నిహరిక, నీలాంబరి, ఇందు, అనిత, అంజలి, జూనియర్ బాలుర జిల్లా జట్టు: హరికృష్ణ, సాయిచరణ్, వంశీ, అనిల్కుమార్, గణేష్, వెంకట్, మహేంద్ర, జశ్వంత్రాయుడు, లోక్నాథ్, జ్యోతిరామ్, గౌతమ్, నందకిషోర్, శివ,విన్నీ, పవన్సాయి. ఎంపికై న జూనియర్ జిల్లా జట్లు ఈ నెల 19 నుంచి 21 వరకు ప్రకాశం జిల్లా జై పంగలూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లోను, సీనియర్ జిల్లా జట్లు ఈ నెల 24 నుంచి 26 వరకు కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లోను పాల్గొంటాయి. -
సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత
● నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు : ఎస్పీ జగదీష్ రాయదుర్గం/ కళ్యాణదుర్గం రూరల్: అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ జగదీష్ తెలిపారు. రాయదుర్గం అర్బన్, రూరల్ సర్కిళ్లతోపాటు డీ హీరేహాళ్ పోలీస్స్టేషన్, కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, వాటి పురోగతిపై ఆరా తీశారు. అనంతరం రాయదుర్గం సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో నేరాల అదుపునకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఎక్కువ నేరాలు జరిగే ప్రాంతాలను క్రైమ్ హాట్స్పాట్లుగా గుర్తించామన్నారు. గ్రేవ్ కేసులను నాణ్యమైన దర్యాప్తుచేసి త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టామన్నారు. గంజాయి, జూదం, మట్కా లాంటి అసాంఘిక కార్యాకలాపాలపై ఉక్కుపాదం మోపామన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల ప్రజలంతా జాగ్రత్త పడేలా అవగాహన చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో కొత్తవ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. వచ్చే ఏడాది 2026 ఆఖరిలోగా జిల్లాకు కొత్తగా 300 మంది పోలీసులు వస్తారన్నారు. 20 మంది ఎస్ఐలు ట్రైనింగ్ పూర్తయి శిక్షణలో ఉన్నారని, త్వరలో వారందరికీ పోస్టింగ్లు ఇస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని కొనసాగిస్తున్నామన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిపరక్షణకు కమ్యూనిటీ పోలీసింగ్ను బలోపేతం చేస్తామన్నారు. అనంతరం పోలీస్స్టేషన్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అంతకు ముందు డీ హీరేహాళ్ మండలం మురడి ఆంజనేయస్వామి, పట్టణంలోని దశభుజ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రవిబాబు, ఆయా స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు తదితరులు ఉన్నారు. -
పల్స్ పోలియోను విజయవంతం చేయండి : డీఎంహెచ్ఓ
అనంతపురం మెడికల్: ఈ నెల 21న తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం తన కార్యాలయంలో ఆమె ఆవిష్కరించి, మాట్లాడారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను అందించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ డేవిడ్ సెల్వరాజ్, డీఐఓ డాక్టర్ శశిభూషణ్రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ జయలక్ష్మి, ఓబులు, శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చిరుత దాడిలో దూడల మృతి కళ్యాణదుర్గం రూరల్: కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున రైతు రాధాకృష్ణకు చెందిన రెండు ఆవుదూడలను చిరుత చంపి తినేసింది. ఘటనతో రూ.50 వేలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. ఇప్పటికై నా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నేడు ప్యాసింజర్ రైలు రద్దు..కళ్యాణదుర్గం రూరల్: కదిరిదేవరపల్లి నుంచి గుంతకల్లు మీదుగా తిరుపతికి ప్రతి రోజూ సంచరించే ప్యాసింజర్ రైలును ఈ నెల 17న పాక్షికంగా రద్దు చేసినట్లు కళ్యాణదుర్గం రైల్వే స్టేషన్ మేనేజర్ ధర్మతేజ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాయదుర్గం, సోమలాపురం మధ్యన కొత్తగా రైల్వే పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. జిల్లా ఎండోమెంటు ఏసీగా మల్లికార్జున అనంతపురం కల్చరల్: జిల్లా ఎండోమెంటు సహాయ కమిషనర్గా వైఎస్సార్ కడప జిల్లా ఏసీ మల్లికార్జున నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఇన్చార్జ్ ఏసీగా సుధారాణి వ్యవహరిస్తూ వచ్చారు. పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ మల్లికార్జునను నియమించడంతో జిల్లా ఎండోమెంట్ కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఘనంగా ఆవుల జాతర కుందుర్పి: మండలంలోని బండమీదపల్లి రెండు రోజులుగా ఆవుల జాతర ఘనంగా సాగింది. ఏటా డిసెంబరులో ఆవుల జాతర, గ్రామోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ వస్తోంది. మంగళవారం ఉదయం ఆంజనేయ స్వామి ఆలయం నుంచి వందలాది మహిళలు, రైతులు పానకం బండ్లు, బోనాలతో వెళ్లి గ్రామ శివారులోని ఈడు అగ్నిగుండం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బండమీదపల్లి, కుందుర్పి గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
సుదీర్ఘకాలం ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. ఇప్పుడు తాము దాచుకున్న సొమ్ముతో పాటు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. సర్వీస్లో దాచుకున్న డబ్బులు.. ఉద్యోగ విరమణతో అందే ఆర్థిక ప్ర
అనంతపురం కల్చరల్: ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల విషయంలో గొప్పలు చెప్పిన కూటమి పెద్దలు.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆచరణను పూర్తిగా విస్మరించారు. 30 ఏళ్ల పాటు తాము దాచుకున్న డబ్బును ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫలితంగా ఒక రిటైర్డు ఉద్యోగి తాను చేసుకున్న ప్లానింగ్ మొత్తం తల కిందులవుతోంది. ఉద్యోగ విరమణ పొందిన మూడు నెలల్లోపు పెన్షనరీ బెనిఫిట్స్ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొంటున్నా... చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తూ ఎప్పుడో ఒకసారి వాటిని జమ చేస్తామని చెబుతోంది. ఈ క్రమంలో మనోవేదనకు లోనైన పలువురు... బెనిఫిట్స్ అందకనే చనిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఇక వైద్య సేవలను ప్రభుత్వం మరింత నిర్లక్ష్యం చేయడంతో తాము పొందిన వైద్య సేవలకు ఇప్పటి వరకూ మెడికల్ రీయింబర్స్మెంట్ జమ కావడం లేదు. వివిధ రకాల బకాయిలను తక్షణమే చెల్లించకుండా కొత్త పంథాను ఎంచుకున్న ప్రభుత్వం పెన్షనర్ల జీవితాలతో ఆడుకుంటోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దుస్థితి గతంలో ఎన్నడూ తాము చూడలేదని పెన్షనర్లు అంటున్నారు. కష్టాలు పంచుకునేలా... కష్టాలు సుఖాలు, ఇబ్బందులు సౌకర్యాలు, మరెన్నో ఎత్తుపల్లాలను పంచుకునేలా పెన్షనర్ల దినోత్సవం రానే వచ్చింది. ఏటా డిసెంబరు 17న జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి లలిత కళాపరిషత్తు, ఉపాధ్యాయభవన్తో పాటు పెన్షనర్ల సంఘాలలో వేడకలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఉపాధ్యాయ భవన్లో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర గుప్తా ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పలువురు పెన్షనర్లను సన్మానించనున్నారు. అలాగే లలితకళాపరిషత్లో జరిగే కార్యక్రమంలోనూ తమ సమస్యల వాణిని వినిపించడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు తరలిరానున్నారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాల వయస్సు దాటిన పెన్షనర్లను సన్మానించనున్నట్లు నిర్వాహకులు పెద్దన్న గౌడ్ తెలిపారు. సందర్భం నేడు పెన్షనర్ల దినోత్సవం చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై పెన్షనర్ల అసంతృప్తి రిటైర్డ్ ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు ఆర్థిక ప్రయోజనాలు అందక అష్టకష్టాలు -
శిశు మరణాలపై నిర్లక్ష్యం వద్దు
అనంతపురం మెడికల్: శిశు మరణాలపై నిర్లక్ష్యం వద్దని, మరణాల్లో లోపాలు కన్పిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి హెచ్చరించారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో గత నెలలో జరిగిన ఆరు శిశు మరణాలపై డీఎంహెచ్ఓ సమీక్ష నిర్వహించారు.హైరిస్క్ కేసులను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ప్రధానంగా ప్రసవ సమయంలో అత్యవసరమైతే ఆలస్యం చేయకుండా హయ్యర్ ఇన్స్టిట్యూట్కు రెఫర్ చేయాలన్నారు. ఏమాత్రం కాలాన్ని వృథా చేసినా బిడ్డ ప్రాణాలకే ప్రమాదమన్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో వారికందే సేవల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం, ఆశాలు నిత్యం పర్యవేక్షణ ఉండాలన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ డేవిడ్ సెల్వరాజ్, డీఐఓ డాక్టర్ శశిభూషణ్ రెడ్డి, గైనకాలజిస్టు డాక్టర్ రేణుక, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ విష్ణుమూర్తి, తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారిగా రవి అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ)గా తాడిపత్రి ఏడీఏ ఎం.రవిని నియమిస్తూ మంగళవారం కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత డీఏఓ ఉమామహేశ్వరమ్మ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆమెను రిలీవ్ చేయడానికి వీలుగా సీనియర్ ఏడీఏగా ఉన్న ఎం.రవికి ఎఫ్ఏసీ డీఏఓగా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ డీఏఓగా నియమితులయ్యేదాకా రవి ఎఫ్ఏసీ హోదాలో పనిచేయనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా ఒక్క రోజు ముందుగానే ఈ నెల 30న ఉమామహేశ్వరమ్మ ఉద్యోగ విరమణ చేయనున్నట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. విజయవాడకు వెళ్లిన కలెక్టర్ అనంతపురం అర్బన్: సీఎం నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు కలెక్టర్ ఆనంద్ మంగళవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ నెల 19న తిరిగి విధులకు హాజరవుతారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పీఈటీ ప్రతిభ బ్రహ్మసముద్రం : రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పిల్లలపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ పీఈటీ జగన్మోహన్రెడ్డి ప్రతిభ చాటారు. ఈ నెల 13, 14 తేదీల్లో బాపట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటిల్లో లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, డిస్కస్ త్రో, 4 X 100 మీటర్ల రిలే పోల్లో ప్రథమస్థానం సాధించారు. అదే విధంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. త్వరలో రాజస్థాన్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బసవరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పీఈటీ జగన్మోహన్రెడ్డిని ఉపాధ్యాయ బృందం అభినందించారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టండి అనంతపురం సిటీ: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పదో తరగతి పరీక్షల్లో ప్రతి విద్యార్థీ మంచి మార్కులతో పాసయ్యేలా ఇప్పటి నుంచే కష్టపడాలని డీఈఓ ప్రసాద్బాబు ఆదేశించారు. అనంతపురంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ హైస్కూల్లో వంద రోజుల ప్రణాళిక అమలును మంగళవారం సాయంత్రం పరిశీలించారు. విద్యార్థులను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి చదువులో పూర్తి వెనుకబడి వారికి ప్రత్యేక తర్ఫీదునిచ్చి, మార్కులతో పాసయ్యేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని కోరారు. అందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. -
బొమ్మనహాళ్ ఇన్చార్జ్ ఎంపీపీగా నాగరత్నమ్మ
బొమ్మనహాళ్: మండల ఇన్చార్జి ఎంపీపీగా నాగరత్నమ్మను ఎంపిక చేశారు. బొమ్మనహాళ్ ఎంపీపీ పద్మ ఇటీవల రాజీనామా చేయడంతో వైస్ ఎంపీపీగా ఉన్న నాగరత్నమ్మకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను మంగళవారం ఆమెకు ఎంపీడీఓ విజయభాస్కర్ అందజేశారు. కార్యక్రమంలో ఏపీఓ లక్ష్మీకాంతబాయి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామాంజనేయులు, సీనియర్ నాయకులు ఎల్.లోకేష్, ఆనందరెడ్డి, అనిల్రెడ్డి, రామకృష్ణ, నుంకేష్ పాల్గొన్నారు. ఇడ్లీ బండ్లకు నిప్పు గుత్తి: స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలో శ్రీనివాసులు అనే వ్యక్తి రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న రెండు ఇడ్లీ బండ్లకు సోమవారం అర్ధరాత్రి దుండగులు నిప్పు పెట్టారు. ఇడ్లీ బండ్లు, స్టవ్ కాలిపోవడంతో రూ.50 వేల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పథకం పేరు మారిస్తే శ్రామికులకు ఒరిగేదేమీ?
● కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 22న కలెక్టరేట్ వద్ద ధర్నా ● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అనంతపురం అర్బన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చినంత మాత్రాన ఉపాధి కూలీల (శ్రామికులు)కు ఒరిగేది ఏమీ లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 22న కలెక్టరేట్ వద్ద ధర్నా తలపెట్టినట్లు తెలిపారు. మంగళవారం స్థానిక నీలం రాజశేఖర్రెడ్డి భవన్లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గం సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా నారాయణస్వామి హాజరై మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఉపాధి హామీ పథకంపై తీవ్రమైన దాడి మొదలైందన్నారు. ఇందులో భాగంగానే పథకానికి పేరుమార్చేందుకు ది వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్ను ప్రవేశపెట్టారన్నారు. అయితే పేరు మార్పు కాదని, ఉపాధి కూలీల జీవితాల్లో వికసిత్ ఉండాలనే విషయాన్ని ప్రధాని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు, పనిదినాలు పెంపు సవ్యంగా ఉండాలన్నారు. సగటు వేతనం రోజుకు రూ.240కు తగ్గించడం సబబు కాదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు కూలీల పాలిట శరాఘాతమే అవుతుందన్నారు. పథకానికి సంబంధించి కేంద్రం వాటా 60 శాతం, రాష్ట్రం వాటా 40 శాతం ప్రతిపాదించడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదన్నారు. కాబట్టి పథకాన్ని పాతపద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, దేవేంద్ర, సంగప్ప, తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీ.. రెండు కాళ్లు కోల్పోయిన వృద్ధుడు
యాడికి: లారీ డ్రైవర్ అజాగ్రత్త ఓ వృద్ధుడికి శాపంగా మారింది. ప్రమాదంలో రెండు కాళ్లనూ వృద్ధుడు కోల్పోయాడు. వివరాలు.. యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన 83 ఏళ్ల గంధోడి నారాయణ కుమారులు బస్టాండు ప్రాంతంలో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దుకాణం వద్దకు నారాయణ నడుచుకుంటూ బయలుదేరాడు. తాడిపత్రి వైపు నుంచి బళ్లారికి వెళుతున్న లారీ డ్రైవర్ స్థానిక ఓ హోటల్ వద్ద ఆపే క్రమంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న నారాయణను ఆనుకుని ముందుకు పోనిచ్చాడు. దీంతో నారాయణ అదుపు తప్పి కిందపడడంతో అతని రెండు కాళ్లపై లారీ వెనుక చక్కాలు దూసుకెళ్లాయి. రెండు కాళ్లూ నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న వృద్ధుడి కుమారులు వెంటనే కారులో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి క్షతగాత్రుడిని తరలించారు. లారీ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై సీఐ శ్రీనివాసులు దర్యాప్తు చేపట్టారు. -
వివాహిత బలవన్మరణం
తాడిపత్రి రూరల్: స్థానిక గన్నెవారిపల్లికాలనీలో నివాసముంటున్న వివాహిత సరళ(28) ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా కుటుంబంలో మనస్పర్థలు చోటు చేసుకుని తరచూ భర్త రాముడు గొడవపడేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న సరళ... మంగళవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తాడిపత్రి రూరల్ అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపారు. వేధింపుల కేసు నమోదు ధర్మవరం అర్బన్: అదనపు కట్నం కోసం వివాహితను వేధిస్తున్న భర్త, అత్త, మామపై కేసు నమోదు చేసినట్లు ధర్మవరం టూ టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు. ధర్మవరంలోని తారకరామాపురానికి చెందిన ఉప్పర నందినికి హిందూపురం మండలం బీరేపల్లికి చెందిన ఉప్పర మంజునాథ్తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అనంతరం భర్త, అత్త, మామతో కలసి బెంగళూరులోని బొమ్మసంద్ర పారిశ్రామిక వాడలో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగాలతో జీవనం సాగిస్తున్నారు. మూడు నెలలు వీరి కాపురం సజావుగా సాగింది. అనంతరం భర్త మంజునాథ్ మద్యం సేవించి భార్యపై అనుమానంతో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. 1 5రోజుల క్రితం అత్త అలివేలమ్మ, మామ రామలింగమయ్య, భర్త అందరూ కలసి అదనపు కట్నంతీసుకురాకపోతే విడాకులు ఇవ్వాలంటూ వేధించడంతో నందిని పుట్టింటికి చేరుకుంది. అయినా భర్త తరచూ ఫోన్ చేసి అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో విసుగు చెందిన నందిని ఫిర్యాదు మేరకు మంజునాథ్, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పరాకాష్టకు ‘గుమ్మనూరు’ గూండాగిరి
సాక్షి, టాస్క్ఫోర్స్: అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరులు, అనుచరుల ఆగడాలు పరాకాష్టకు చేరాయి. గుంతకల్లు నియోజకవర్గాన్ని సొంత సామ్రాజ్యంగా భావిస్తున్న గుమ్మనూరు కుటుంబీకులు.. ఎవరు ఏం చేయాలన్నా కమీషన్ చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలిచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే భౌతిక దాడులకూ వెనుకాడటం లేదు. వారి రౌడీయిజానికి ఏకంగా టీడీపీ ఎంపీయే టార్గెట్ అయ్యారు. కమీషన్ల కోసం సొంత పార్టీ ఎంపీనే గుమ్మనూరు వేధిసు్తన్నా ఆయనపై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఏం జరిగిందంటే..వెస్ట్ గుంతకల్లులోని ఎస్ఎస్ ట్యాంకు నుంచి కొత్త పైప్లైన్ల నిర్మాణానికి సెప్టెంబర్లో టెండర్లు ఖరారయ్యాయి. రాజమండ్రికి చెందిన సుబ్బారాయుడు అనే కాంట్రాక్టర్ రూ.7 కోట్లతో పనులు చేపట్టేలా టెండర్ దాఖలు చేసి పనులు చేజిక్కించుకున్నారు. ఆ తరువాత స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు దౌర్జన్యం గురించి తెలుసుకున్న ఆ కాంట్రాక్టర్ ఆ పనులను అనంతపురానికి చెందిన మారుతీప్రసాద్ అనే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్కు ఇచ్చాడు. మారుతీప్రసాద్ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు అత్యంత సమీప బంధువు అని సమాచారం. ఈ భారీ కాంట్రాక్ట్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తమ్ముడు నారాయణస్వామి రూ.7 కోట్ల టెండర్లో కమీషన్గా తమకు రూ.70 లక్షలు ఇవ్వాలని కాంట్రాక్టర్ సుబ్బరాయుడుని డిమాండ్ చేశారు. తాను ఆ పనులను అనంతపురం ఎంపీ బంధువుకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు చెప్పడంతో.. ఎమ్మెల్యే సోదరుడు ఎంపీ లక్ష్మీనారాయణకు ఫోన్చేసి కమీషన్ డిమాండ్ చేసినట్టు తెలిసింది. రూ.70 లక్షల కమీషన్ ఇవ్వకపోతే పనులు జరగనిచ్చేది లేదని బెదిరించడంతో కంగుతున్న ఎంపీ లక్ష్మీనారాయణ విషయాన్ని అధిష్టాన వర్గానికి చేరవేశారు. మంత్రి నారా లోకేశ్కు కూడా ఫోన్ చేసి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు అరాచకాల గురించి ఎంపీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.అనంతలోనూ అదే తీరుఅనంతపురంలోనూ ఈ కమీషన్ల దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. అనంతపురం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల్లో సైతం అక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుల ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. అమృత్ రైల్వేస్టేషన్లో భాగంగా రూ.కోట్లతో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో తమకూ 10 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంటూ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు సంబం«ధిత కాంట్రాక్టర్ను డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది.అధిష్టానమా.. అయితే నాకేంటి?కమీషన్లు, బెదిరింపులు విషయం చంద్రబాబుకు తెలిసినా గుమ్మనూరు ఏ మాత్రం బెదరడం లేదు. అధిష్టానం అయితే నాకేంటి? నా కమీషన్లు నాకు ముఖ్యం అంటూ భీష్మించుకుని కూర్చున్నట్టు సమాచారం. తమ సొంత సామ్రాజ్యంలో అధిష్టానం జోక్యాన్ని కూడా సహించబోని గుమ్మనూరు కుటుంబీకులు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. గుమ్మనూరు తీరుతో టీడీపీ అధిష్టానం నిర్ఘాంతపోయినట్టు సమాచారం. ఈ విషయమై సంబంధిత విభాగపు అధికారి వివరణ కోరగా.. పైప్లైన్ పనులుతోపాటు రైల్వేస్టేషన్లో పైప్లైన్లను ఆధునికీకరించడంతోపాటు సంప్, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాన్ని రూ.7 కోట్లతో చేపట్టేందుకు రాజమండ్రికి చెందిన కాంట్రాక్టర్ సుబ్బారాయుడు పనులు దక్కించుకుని సబ్ కాంట్రాక్ట్కు ఇచ్చినట్టు తెలిసిందన్నారు. మూడు నెలలు గడిచినా ఇంతవరకు పనులు ప్రారంభించలేదన్నారు. ఈ విషయమై ఆరా తీయగా కొన్ని సమస్యలు తలెత్తడం వల్ల పనులు ప్రారంభించలేకపోతున్నామని కాంట్రాక్టర్ చెప్పినట్టు తెలిపారు. -
పెళ్లి కాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య
గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన భీమన్నగారి చిదంబర కుమారుడు ప్రతాప్(31) వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడగా.. తనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుంగిపోయాడు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో అడుగుతూ వస్తున్నా... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అవి తీరాక పెళ్లి చేస్తామంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రతాప్ ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నె రైల్వేగేట్ సమీపంలో గ్వాలియర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న యశ్వంత్పూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ వెంకటేష్ సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
పొట్టిశ్రీరాములు చిరస్మరణీయుడు
అనంతపురం అర్బన్: భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యుడైన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని కలెక్టర్ ఆనంద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో పొట్టిశ్రీరాములు వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టిశ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేసి అమరులయ్యారన్నారు. ఆయన త్యాగఫలంగా 1953లో కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించిందన్నారు. అమరజీవి సేవలు ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయక్, మల్లికార్జునుడు, రామ్మోహన్, సైనిక సంక్షేమాధికారి తిమ్మప్ప, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. 24న వినియోగదారుల దినోత్సవం ● జేసీ శివ్ నారాయణ్శర్మ అనంతపురం అర్బన్: ఈ నెల 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించేందుకు అసవరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా 18 నుంచి 24 వరకు వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. వినియోగదారుల దినోత్సవం నిర్వహణపై జేసీ సోమవారం రెవెన్యూ భవన్లోని ప్రత్యేక చాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘డిజిటల్ న్యాయపాలన దారా సమర్థ, సత్వర పరిష్కారం’ అనే అంశంపై పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యర్థులకు తెలుగు, అంగ్ల భాషల్లో పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఒక పాఠశాల లేదా ఒక జూనియర్ కళాశాలను ఎంపిక చేసుకుని వినియోదారుల వలంటరీ సంఘాలతో రెండు బాషాల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ.3 వేలు, తృతీయ బహుమతి రూ. 2 వేలు ఇస్తామని తెలియజేశారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన విద్యార్థులను విశాఖపట్నంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. సమావేశంలో డీఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రమేష్రెడ్డి, ఆర్ఐఓ వెంకటరమణనాయక్, డీటీసీ వీర్రాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యలపై అర్జీల వెల్లువ ● నాణ్యమైన పరిష్కారం చూపాలి ● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, మల్లికార్జునుడు, తిప్పేస్వామి, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మలు ప్రజల నుంచి 462 అర్జీలు స్వీకరించారు. అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నిర్ణీత వ్యవధిలో అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అర్జీల్లో మచ్చుకు కొన్ని.. ● ప్రభుత్వం తమకు కేటాయించిన ఇంటి స్థలాన్ని వేరొకరు ఆక్రమించారని రాప్తాడు మండలం పుల్లలరేవుకు చెందిన కేశవరెడ్డి ఫిర్యాదు చేశాడు. విచారణ చేయించి తమకు న్యాయం చేయాలని కోరాడు. ● డి.పట్టా మంజూరు చేయాలని కణేకల్లు మండలం టి.వీరాపురానికి చెందిన గంగప్ప విన్నవించాడు. తన తండ్రి, తల్లి ఇద్దరూ మరణించారని, డి.పట్టాను తన పేరున మార్చి పాసుపుస్తకం మంజూరు చేయించాలని కోరాడు. ● తమ భూమిని సర్వేయర్ సర్వే చేయడం లేదని గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన ఇల్లూరు వలి ఫిర్యాదు చేశాడు. సర్వే నెంబరు 573–5లో 3.80 ఎకరాల భూమి ఉందని తెలిపాడు. పక్కనున్న రైతు తమ భూమిలో 79 సెంట్ల మేర జరిగాడని చెప్పాడు. ఆయన రాజకీయ పలుకుబడితో సర్వే చేసేందుకు సర్వేయర్ను రాకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించాడు. -
పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయండి
కళ్యాణదుర్గం: ఏపీ పురపాలక చట్టం నిబంధనలు ఉల్లంఘించి పార్టీ ఫిరాయించిన కౌన్సిలర్లపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల కళ్యాణదుర్గంలో జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో వైఎస్సార్సీపీ విప్ను ధిక్కరించి టీడీపీకి మద్దతు ఇచ్చిన కౌన్సిలర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఎ.సురేష్ (6వ వార్డు), ఒ.ప్రభావతి (9వ వార్డు) ఎన్నికకు గైర్హాజరవడం విప్ను ధిక్కరించినట్లుగా భావించాలని తెలిపారు. వీరితో పాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పార్టీ నామినేట్ చేసిన అభ్యర్థి ఎం.లక్ష్మన్నకు వ్యతిరేకంగా, టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారని పేర్కొన్నారు. క్రాస్ ఓటింగ్ ద్వారా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 21వ వార్డు కౌన్సిలర్ జయం ఫణీంద్ర, 17వ వార్డు కౌన్సిలర్ బాలా రాజేశ్వరి, 2వ వార్డు కౌన్సిలర్ అబ్రహం మాదిగ, 1వ వార్డు కౌన్సిలర్ జి.అనుసూయమ్మ, 24వ వార్డు కౌన్సిలర్ హరిజిన తిమ్మప్ప, 18వ వార్డు సి.మహాలక్ష్మిలను కౌన్సిలర్ పదవులకు అనర్హులుగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వైఎస్సార్సీపీ విప్ నరేంద్రరెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మన్న, అర్చన, పరమేశ్వరప్ప, కో ఆప్షన్ సభ్యులు నీరుగంటి సురేష్, అప్జల్, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, పార్టీ కన్వీనర్లు గోళ్ల సూరి, ఎంఎస్ రాయుడు, పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు యర్రంపల్లి కృష్ణమూర్తి, గోపారం శ్రీనివాసులు, దొడగట్ట నారాయణ, జాకీర్, గంగాధర్, ఆంజినేయులు, పాతలింగ, మల్లికార్జున, ఉమేష్, రామిరెడ్డి, హరి, దేవ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారులపై వేగానికి కళ్లెం
● సీసీ కెమెరాల ఏర్పాటుతో నిఘా ● స్పీడ్ లిమిట్ దాటితే జరిమానా అనంతపురం టవర్క్లాక్: జాతీయ రహదారులపై ప్రమాదాలకు కారణమవుతున్న అతివేగానికి కళ్లెం వేసేందుకు నేషనల్ హైవే అథారిటీస్ అధికారులు సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపేవారు కెమెరాల కంట పడకుండా తప్పించుకోవడం అసాధ్యం కానుంది. స్పీడ్ లిమిట్ దాటితే నంబర్ ప్లేట్ ఆధారంగా వాహన యజమాని ఇంటికే ఫైన్ చలానా అందనుంది. ఇప్పటికే కర్నూలు– ఆత్మకూరు రహదారిపై నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి ప్రయోగాత్మాకంగా అమలు చేశారు. ఇక్కడ విజయవంతం కావడంతో అదే విధానాన్ని జాతీయ రహదారులకూ అమలు చేయనున్నారు. త్వరలో బెంగళూరు నుంచి కడప – విజయవాడ జాతీయ రహదారురిపై నిఘా నేత్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అనంతపురం– గుంటూరు రహదారిలోనూ అమలు చేయనున్నారు. 24 గంటలూ పనిచేసే నిఘా నేత్రాల ద్వారా వాహన వేగాన్ని ఆటోమేటిక్గా నమోదు చేసి, నంబర్ ప్లేట్ ఆధారంగా జరిమానా విధించనున్నారు. కారు 100 కి.మీ, బస్సు 90, లారీ, అతిభారీ వాహనాలు 80 కి.మీ వేగం మించితే తప్పనిసరిగా జరిమానా విధిస్తారు. -
ఆలయానికి అన్యాయం.. అర్చకుడిపై దౌర్జన్యం
శింగనమల/అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని శ్రీదుర్గాంజనేయ స్వామి ఆలయానికి, కమ్యూనిటీ భవనానికి టీడీపీ నాయకులు తాళాలు వేశారు. సోమవారం దౌర్జన్యంగా పాత తాళాలను పగలగొట్టి వారు వెంట తెచ్చుకున్నవి వేసుకున్నారు. ఈ ఆలయానికి సంబంధించి రెండునెలల క్రితం టీడీపీ మూకలు అధికారులపై ఒత్తిడి తెచ్చి పాత కమిటీని తొలగించారు. కొత్తగా టీడీపీ నాయకులే కమిటీ వేసుకున్నారు. తరువాత ఆలయ అర్చకుడు సిరి రమణను తొలగించాలని, అక్కడి నుంచి బయటకు పంపించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇప్పటికే అర్చకుడి కుటుంబంపై నానా దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన కొంతమంది సోమవారం ఆలయం వద్దకు చేరుకుని హల్చల్ చేశారు. వారి ఆగడాలు శృతిమించడంతో అర్చకుడు రమణ జిల్లా కలెక్టరేటులో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఆయన తండ్రి ఒక్కరే ఆలయం వద్ద ఉన్నారు. దీంతో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా ఆలయానికి, కమ్యూనిటీ భవనానికి సొంత తాళాలు వేసుకున్నారు. అర్చకులు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట అర్చకుడి దీక్ష ‘వంశపారంపర్యంగా మా ముత్తాతల కాలం నుంచి దాదాపు 150 ఏళ్లుగా శ్రీదుర్గాంజనేయస్వామి దేవస్థానంలో అర్చకత్వం చేస్తున్నాం. ఇప్పడు కొందరు వ్యక్తులు వచ్చి దేవస్థానం విడిచి వెళ్లాలంటూ దాడులు చేస్తున్నారు. పోలీసులకు, ఎంపీడీఓకి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు’ అంటూ దేవస్థానం ప్రధాన అర్చకుడు బీఈ సిరి రమణ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఫుట్పాత్పై కూర్చుని దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దేవాలయానికి ఆదాయం లేకున్నా సొంత ఖర్చుతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 25 ఆవులనూ సొంత ఖర్చు, భక్తుల కానుకలతో పోషిస్తున్నాం. అయినా దేవస్థానం విడిచివెళ్లాలని మాపై కొందరు ఏడాది కాలంగా దౌర్జన్యం చేస్తున్నారు. భౌతిక దాడికి ప్రయతి్నస్తున్నారు. శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. పైగా.. నాపైనే తప్పుడు కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ గొడవకు ఐదుగురు వ్యక్తులు కారణం. అందులో ఒక విలేకరి (సాక్షి కాదు), రిటైర్డు తహసీల్దారు కూడా ఉన్నారు. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు కలెక్టరేట్ వద్దనే కూర్చుని నిరాహార దీక్ష చేస్తా’నని ఆయన చెప్పారు. -
ప్రజా శ్రేయస్సు పట్టదా?
విద్య, వైద్యం రెండూ ప్రభుత్వ రంగంలో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకు విరుద్ధంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారు. ఇక తన అనుయాయులైన కార్పొరేట్లకు విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారు. వైద్యం చేయించుకున్నందుకు పేదలతో డబ్బు వసూలు చేసి.. ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపుతున్నారు. ప్రజా శ్రేయస్సు గురించి ఈ ప్రభుత్వానికి ఏమాత్రమూ పట్టడం లేదు. – మెట్టు గోవిందరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త, రాయదుర్గం -
జనవరి ఒకటి నుంచి రైళ్ల రాకపోకల్లో మార్పు
అనంతపురం సిటీ: అనంతపురం మీదుగా సంచరించే పలు రైళ్ల రాకపోకల వేళలు జనవరి ఒకటి నుంచి మారనున్నాయి. ఈ మేరకు అనంతపురం స్టేషన్ మేనేజర్ అశోక్కుమార్ సోమవారం రాత్రి వెల్లడించారు. కర్ణాటకలోని కలబురిగి నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు (22231) ఇక నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు అనంతపురానికి ఉదయం 10.03 గంటలకు అనంతపురానికి చేరుకుని 10.05 గంటలకు బయలుదేరుతుంది. బెంగళూరు నుంచి కలబురిగి వెళ్లే ఎక్స్ప్రెస్ (22232) అనంతపురానికి 5.33కు వచ్చి 5.35 గంటలకు బయలుదేరుతుంది. ఽయశ్వంత్పూర్–మచిలీపట్నం మధ్య నడిచే రైలు (17212) అనంతపురానికి సాయంత్రం 4.33 గంటలకు వచ్చి 4.44 గంటలకు బయలుదేరుతుంది. బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ (18464) సాయంత్రం 6.28 గంటలకు అనంతపురానికి వచ్చి 6.30 గంటలకు వెళ్లిపోతుంది. శబరిమలకు ప్రత్యేక రైళ్లు శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం జనవరి 10, 17 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లం బయలుదేరే రైలు (07127) అనంతపురానికి ఆయా తేదీల్లో సాయంత్రం 7.53 గంటలకు వచ్చి 7.55 గంటలకు వెళ్లిపోతాయి. ఈ రెండు రైళ్లు అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పాకాల, కాట్పాడి మీదుగా కొల్లం జంక్షన్కు చేరుకుంటాయి. -
పరిష్కార వేదికకు 96 వినతులు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై 96 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డివిజన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ మహిబూబ్బాషా, అధికారులు పాల్గొన్నారు. బస్సుల్లేనప్పడు ‘ఉచిత ప్రయాణం’ ఎందుకు? ● ఉరవకొండ డీఎం కార్యాలయం ఎదుట విద్యార్థినులు, తల్లిదండ్రుల నిరసన ఉరవకొండ: బస్సులు నడపలేనప్పుడు ఉచిత ప్రయాణ పథకం ఎందుకు పెట్టారంటూ ఉరవకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ను విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు నిలదీశారు. ఈ మేరకు సోమవారం డీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కూడేరు మండలం జల్లిపల్లి, ఉదిరిపికొండ, కోనాపురం తదితర గ్రామాల నుంచి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలకు వస్తున్న తమ పిల్లలు తిరుగు ప్రయాణంలో బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసులు నడపలేనప్పుడు ఉచిత ప్రయాణ పథకం ఎందుకు పెట్టారని డీఎం హంపన్నను నిలదీశారు. కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణించే సమయంలో అమ్మాయిల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల్లో బాలికలకు భద్రత లేకుండా పోతోందన్నారు. స్పందించిన డీఎం వెంటనే ఉరవకొండ అర్బన్ సీఐ మహానందిని రప్పించుకుని విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా సర్వీసులు నడుపుతామని, ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉంటూ తమకు ఫోన్ చేసి సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని డీఎంతో పాటు సీఐ హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. మెరిట్ లిస్ట్ విడుదల అనంతపురం మెడికల్: నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెరిట్ లిస్ట్ జాబితాను www.anantapuramu.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ మేరకు డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సైకాలజిస్టు, ఆడియాలజిస్టు, ఆప్తమాలజిస్టు, ఫార్మసిస్టు, డేటా ఎంటీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జాబితాపై అభ్యంతరాలపై డీఎంహెచ్ఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు. -
మరో నకిలీ బాగోతం
● జిల్లాలోని మరో పంచాయతీ లాగిన్ హ్యాక్! ● 1,500 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు సమాచారం ● విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ● గుట్టుగా విచారణ చేస్తున్న అధికారులు ● ఇప్పటికే సంచలనం రేపిన కొమరేపల్లి పంచాయతీ లాగిన్ వ్యవహారం ● ఏకంగా 3,981 నకిలీబర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు నిర్ధారించిన అధికారులు ● తాజాగా మరో పంచాయతీలోనూ ఇదే తతంగం మడకశిర: నకిలీ బర్త్ సర్టిఫికెట్లకు శ్రీసత్యసాయి జిల్లా కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. అగళి మండలంలోని కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి ఏకంగా 3,981 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయిన అంశం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించగా...ఈ కేసు విచారణ కొలిక్కిరాకముందే జిల్లాలోని మరో పంచాయతీ లాగిన్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. సదరు పంచాయతీ నుంచి ఏకంగా 1,500 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు సమాచారం. రాష్ట్ర స్థాయి అధికారులు ఈ విషయాన్ని గుర్తించి జిల్లా అధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. జిల్లా అధికారులు గుట్టుగా విచారణ జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. హ్యాకర్ల పనేనా? తాజాగా వెలుగు చూసిన 1,500 నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. సదరు పంచాయతీ లాగిన్ నుంచే ఇతర రాష్ట్రాల వారికి బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్థానిక అధికారులను జిల్లా అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతున్న అధికారులు...ఇది హ్యాకర్ల పనేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందరూ ఇతర రాష్ట్రాల వారే.. కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి 3,981 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ కాగా, ఈ బర్త్ సర్టిఫికెట్లు పొందిన వారంతా ఇతర రాష్ట్రాల వారేనని విచారణ అధికారులు గుర్తించారు. ప్రధానంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారు ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్లను పొందినట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్లు పొందిన వారిలో ఎక్కువగా ఒకే సామాజిక వర్గం వారు ఉండడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన మరో గ్రామ పంచాయతీ నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై కూడా జిల్లా అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి రేపో మాపో పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. హ్యాకర్లే పంచాయతీల లాగిన్లను హ్యాక్ చేసి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు విచారణ అధికారులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం. హ్యాకర్లు ఇంకెన్ని పంచాయతీ లాగిన్లు హ్యాక్ చేశారో అన్నది ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బర్త్ సర్టిఫికెట్ల జారీపై నిఘా.. కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి వేలాదిగా నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు బర్త్ సర్టిఫికెట్లను జారీ చేసే ప్రక్రియపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలోనే జిల్లాలోని మరో గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు సమాచారం అందించి విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఈ గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి జారీ అయిన సర్టిఫికెట్లన్నీ నకిలీవేనని విచారణ అధికారులు తేల్చినట్లు సమాచారం. ఈ ఫేక్ సర్టిఫికెట్లన్నీ కూడా రద్దు చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. -
యువకుడి దుర్మరణం
శింగనమల(నార్పల): ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు...నార్పల మండలం మూగేతిమ్మంపల్లికి చెందిన శేఖర్ కుమారుడు సతీష్(21) ఫొటోగ్రాఫర్ వృత్తిలో కొనసాగుతూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. ఈ క్రమంలో ఆదివారం తాడిపత్రిలో జరిగిన ఓ ఫంక్షన్కు ఫొటోలు తీసేందుకు వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని అదే రోజు రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. నాయనపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కరెంట్ షాక్తో యువకుడి మృతి ఆత్మకూరు: విద్యుత్ షాక్కు గురై ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ (32) మృతి చెందాడు. ఆయనకు భార్య లక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న రెండు ఎకరాల పొలంలో వ్యవసాయంతో పాటు కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. సోమవారం పొలం పనికి వెళ్లేందుకు ఉదయాన్నే నిద్రలేచి బాత్రూమ్లోకి వెళ్లిన చంద్రశేఖర్... ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ తగిలి విద్యుత్ షాక్కు గురై కుప్పకూలాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని జీజీహెచ్కు తీసుకెళ్లడంతో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఆత్మకూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
జనవరిలో మిల్లెట్ మేళా
అనంతపురం అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన స్వచ్ఛంద సంస్థల ఫోరం ఆధ్వర్యంలో జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అనంతపురంలో మిల్లెట్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ ఓ.ఆనంద్ విడుదల చేసి, మాట్లాడారు. సహజ వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, మార్కెటింగ్, స్థానిక వినియోగంపై దృష్టి సారించి మిల్లెట్ మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎకాలజీ సెంటర్ రూపొందించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లావ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ వైవీమల్లారెడ్డి, టింబక్టు ప్రతినిధి శ్రీకాంత్, రెడ్స్ డైరెక్టర్ భానూజా, తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో యువరైతు మృతి గార్లదిన్నె: విద్యుత్షాక్కు గురై గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన యువరైతు దేవేంద్ర (21) మృతి చెందాడు. వివరాలు.. తమకున్న ఐదు ఎకరాల పొలంలో రైతు దేవేంద్ర చీనీ పంట సాగు చేశాడు. సోమవారం ఉదయం చీనీ చెట్లకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. స్విచ్ ఆన్ చేసినా మోటార్ ఆడక పోవడంతో అనుమానం వచ్చి తమ పొలం పక్కనే ఉన్న 11కేవీ విద్యుత్ మెయిన్ స్విచ్ బోర్డును పరిశీలిస్తూ స్వీచ్ ఆన్ చేస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించుకుని బోరున విలపించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్మహమ్మద్ బాషా తెలిపారు. ఢిల్లీ సదస్సుకు సర్పంచ్ మోనాలిసా వజ్రకరూర్: ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు న్యూఢిల్లీ వేదికగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) ఆధ్వర్యంలో జరిగే ‘సర్పంచ్ శక్తి’ సదస్సుకు వజ్రకరూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మోనాలీసా ఎంపికయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు అందడంతో సోమవారం ఆమె ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రం నుంచి నలుగురు మహిళా సర్పంచ్లు ఎంపికగా కాగా, ఇందులో ఉమ్మడి జిల్లా తరఫున మోనాలిసాను ఎంపిక చేయడం గమనార్హం. రిమాండ్కు యువకుడు పామిడి: స్థానిక మెయిన్ బజార్లోని వస్త్ర దుకాణాల వద్ద ఆదివారం హల్చల్ చేసి భయభ్రాంతులకు గురి చేసిన సంతమార్కెట్ వీధికి చెందిన యువకుడు మాల రవిని పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. ఈ మేరకు వివరాలను పామిడి ఎస్ఐ బి.రవిప్రసాద్ సోమవారం వెల్లడించారు. చేతికి చిక్కన కట్టె, రాడ్, కత్తిని మాల రవి చేత పట్టుకుని దుకాణాలపై రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించడంతో పాటు, పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం చేశాడన్నారు. అడ్డుకోబోయిన జమేదార్ శ్రీనివాసులపై కత్తితో దాడికి విఫలయత్నం చేసి పరారయ్యాడన్నారు. ఈ క్రమంలో కల్లూరు అగ్రహారం తచ్చాడుతున్న నిందితుడు మాల రవిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు వివరించారు. పెళ్లి కాదనే బెంగతో యువకుడి ఆత్మహత్య గార్లదిన్నె/అనంతపురం సిటీ: కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక తనకు పెళ్లి కాదనే బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన భీమన్నగారి చిదంబర కుమారుడు ప్రతాప్(31) వ్యవసాయ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. తన ఈడు పిల్లలందరూ పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడగా.. తనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో కుంగిపోయాడు. తనకు పెళ్లి చేయాలని ఇంట్లో అడుగుతూ వస్తున్నా... అప్పులు ఎక్కువగా ఉన్నాయని, అవి తీరాక పెళ్లి చేస్తామంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ప్రతాప్ ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నె రైల్వేగేట్ సమీపంలో గ్వాలియర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న యశ్వంత్పూర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ నుంచి సమాచారంఅందుకున్న రైల్వే ఎస్ఐ వెంకటేష్ సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
● మోంథా తుపానుతో తీవ్ర నష్టం ● సాయం చేయడంలో సర్కారు విఫలం
ఉరవకొండలో మగ్గం గుంతలో చేరిన నీరు (ఫైల్) ఉరవకొండ: మోంథా తుపాన్ ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా నేతన్నలు చితికిపోయారు. మగ్గం గుంతల్లోకి నీరు చేరి సుమారు 20 రోజులుగా నేత పనికి దూరమయ్యారు. బాధిత నేతన్నలకు సంబంధించి నష్టం నివేదికను ప్రభుత్వానికి అందించినా ఇంకా పరిహారమే అందలేదు. దీంతో నేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. దెబ్బ తిన్న 147 మగ్గాలు చేనేతకు ప్రసిద్దిగాంచిన ఉరవకొండలో 800 చేనేత మగ్గాలు ఉన్నాయి. వీటిపై ప్రత్యక్షంగా 2,100 మంది, పరోక్షంగా మరో 2వేల మంది ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఉరవకొండలో మోంథా తుఫాన్ కారణంగా 147 మగ్గాలు దెబ్బతిన్నాయి. ఈ మేరకు నివేదికను చేనేత, జౌళి శాఖ అధికారులు వెల్లడించారు. అయితే అయితే సంబందింత అధికారులు సక్రమంగా ఎన్యుమరేషన్ చేయకపోవడంతో తాము నష్టపోతున్నట్టు పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మగ్గం గుంతల్లో నీరు చేరడంతో 20 రోజుల పాటు నేత పనికి దూరం కాగా, పాడైపోయిన వాటిని మరమ్మతు చేసుకునేందుకు మరో పది రోజుల సమయం పట్టింది. టీడీపీ నేతలు సిఫారసు చేసిన వారి పేర్లు మాత్రమే జాబితాలో చేర్చి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలున్నాయి. వైఎస్సార్సీపీ సానుభూతి పరుల మగ్గాలు పూర్తిగా దెబ్బతిన్నా వారిని సహయం కోసం ఎంపిక చేయకపోవడం గమనార్హం. దెబ్బతిన్న చేనేత మగ్గాలకు సంబంధించి రూ.5 వేలు నగదు, కార్మిక కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, చక్కెర తదితర నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇప్పటి వరకూ ఏ ఒక్క కార్మికుడికీ నగదు, నిత్యావసరాలు అందలేదు. నిత్యం చేనేత కార్మికులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. వారికి సరైన సమాధానం చెప్పే వారు కరువయ్యారు. -
పత్తి కొనుగోలులో కొర్రీలు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోళ్లు మందగించాయి. మార్కెటింగ్శాఖ సహకారంతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో వారంలో ఒక్క రోజు మాత్రమే కనీస మద్ధతు ధర (ఎంఎస్పీ)తో కొనుగోళ్లు చేస్తున్నారు. అది కూడా కేవలం అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్యార్డులో మాత్రమే చేపట్టడం రైతులకు ఇబ్బందిగా మారింది. నాణ్యత లేదంటూ.. గతంలో తాడిపత్రి, గుత్తి కేంద్రాల ద్వారా వారంలో ఐదు రోజుల పాటు పత్తి కొనుగోళ్లను చేపట్టేవారు. అయితే ఈ సారి కేవలం గుత్తికి మాత్రమే పరిమితం చేసి అందులోనూ ఒక్కరోజు మాత్రమే కొనుగోలు చేస్తుండటం విశేషం. పత్తి పొడవు రకం క్వింటా రూ.8,110 తో మద్ధతు ధర ఖరారు చేసినా... తేమ శాతం, పరిపక్వత (మైక్రోనైర్), రంగు మారడం, దుమ్ము, ధూళి పేరుతో ఎంఎస్పీ కన్నా తక్కువ ధర చెల్లిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ప్రధానంగా నిబంధనల మేరకు 8 శాతం తేమ ఉన్న వాటికి ఎంఎస్పీ ఉంటుంది. ఆ పై ప్రతి ఒక శాతం పెరుగుదలకు ఒక శాతం చొప్పున రేటు తగ్గిస్తున్నారు. శుభ్రంగా ఉంటేనే తీసుకురండి పత్తిని బాగా ఆరబెట్టి శుభ్రంగా ఉన్నదానిని మాత్రమే మార్కెట్కు తీసుకురావాలని అధికారులు చెబుతున్నారు. తడిసిన పత్తి, రంగుమారినది, చెత్తాచెదారం ఉన్నది, గుడ్డి, పురుగుపట్టినది, నీళ్లు చల్లినది, పాత పత్తి, ముడుచుకుపోయినది తీసుకురావద్దని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ఈ–క్రాప్ ఆధారంగా బ్యాంకు పాస్పుస్తకం, ఆధార్తో పాటు మొదట శ్యాంపిల్గా తీసుకువస్తే... ప్రతి బుధవారం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. వారంలో ఒక్కరోజే కొనుగోలు చేస్తామంటున్న అధికారులు గుత్తిలో ప్రతి బుధవారం కేంద్రం నిర్వహణ నాణ్యత లేదంటూ ఎంఎస్పీ కంటే ధర తక్కువ చెల్లింపు -
మృత్యువులోనూ వీడని బంధం
రాయదుర్గంటౌన్: పెళ్లయిన నాటి నుంచి ఆ దంపతులిద్దరూ అన్యోన్యంగా జీవించారు. ఏడు పదుల వయసులోనూ కష్ట, నష్టాలు కలిసి పంచుకున్నారు. చివరకు మృత్యువులోనూ ఒక్కటిగానే కలిసిపోయారు. రాయదుర్గం మండలం పల్లేపల్లి గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని కొనసాగరం గ్రామానికి చెందిన హరిజన తిప్పన్న (72)కు కణేకల్లు మండలం గోపులాపురం గ్రామానికి చెందిన తిప్పమ్మ (68)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి పల్లేపల్లిలో నివాసముంటూ వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య తిప్పమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంచాన పడింది. ఇదే దిగులుతో భర్త తిప్పన్న బాధపడుతూ వచ్చాడు. సోమవారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో తిప్పన్న మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక అదే రోజు ఉదయం 10 గంటలకు తిప్పమ్మ తుదిశ్వాస విడిచింది. ఐదు గంటల వ్యవధిలోనే దంపతులిద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. దంపతులిద్దరి అంత్యక్రియలను గ్రామస్తులు, బంధువులు కలిసి ఘనంగా నిర్వహించి తుది వీడ్కోలు పలికారు. -
ఇష్టారాజ్యం.. ప్రాణాలతో చెలగాటం
అనంతపురం క్రైం: మెడికల్ వేస్టేజ్ తరలింపులో పాటించాల్సిన నిబంధనలను అనంతపురంలోని ఏ ఒక్క ఆస్పత్రి పాటించడం లేదు. కాసుల కోసం జనం ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. చెత్తను కవర్లలో పెట్టి ఇవ్వాలని పారిశుధ్య కార్మీకులు చెబుతున్నా.. ‘నెలవారీ మామూళ్లు ఇస్తున్నాం కదా? మీరే జాగ్రత్తగా తీసుకెళ్లాలి’ అంటూ చెబుతున్నట్లు తెలిసింది. బయో మెడికల్ వేస్టేజ్ 2016 మార్గదర్శకాల ప్రకారం నిబంధనలు పాటించని ఆస్పత్రుల యాజమాన్యాలపై రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చు. అదే తప్పు పునరావృతమైతే రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించి అనుమతులు కూడా రద్దు చేయవచ్చు. క్రిమినల్ కేసులకు కూడా సిఫార్సు చేసే అవకాశం ఉండడం గమనార్హం. పర్యవేక్షణ ఏదీ..? నగరపాలక సంస్థ అధికారులు వారి విధులను మరచిపోయారు. నెలవారీ మామూళ్ల మోజులో పడి ప్రైవేటు ఆస్పత్రులపై అజమాయిషీ విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. 30 రోజుల మెడికల్ వేస్టేజ్ ఆడిట్, లైసెన్స్ లేని ఆస్పత్రుల వివరాలు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం వారి అలసత్వానికి అద్దం పడుతోంది. చాలా ప్రమాదం.. రోగికి వినియోగించిన ఇంజెక్షన్లు, రక్త నమూనాలు, సూదులు, క్యాన్యులాలు, రక్త పరీక్షల అనంతరం వచ్చే రక్త, మూత్ర నమూనాల కంటైనర్లు, శస్త్రచికిత్సలో మిగిలిపోయే పదార్థాలే బయోమెడికల్ వ్యర్థాలు. వీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్లతో కేవలం రోగులకే కాదు, ప్రజలకు కూడా హాని కలిగే ప్రమాదం ఉంది. తరలించే సమయంలో కార్మికుల చేతికి చిన్న సూది గుచ్చుకున్నా, చర్మంపై గీత పడ్డా హెపటైటిస్, హెచ్ఐవీ వంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకవచ్చు. ఈ క్రమంలో మెడికల్ వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినా, ప్రైవేటు హాస్పిటల్స్ వాటిని పాటిస్తున్నాయా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. నగరంలో కొన్ని చోట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వ్యర్థాలను నిల్వ ఉంచడానికి డబ్బు చెల్లించాల్సి వస్తుందని, అధికారిక బయోమెడికల్ వాహనాల కోసం అదనపు ఖర్చు అవుతుందని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్పి తప్పించుకుంటున్నాయి. ఈ సమయంలో శానిటేషన్ కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు డబ్బు కోసం కళ్ల మూసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి నిబంధనలు అమలయ్యేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబుకు హైకోర్టు నోటీసులు
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ-స్టాంపుల కుంభకోణం బయటపడింది. నకిలీ స్టాంపులు బ్యాంకులకు సమర్పించి వందల కోట్ల రూపాయల రుణాలను అక్రమంగా తీసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థ. సురేంద్ర బాబు సహా 12 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 18వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.కళ్యాణదుర్గం కేంద్రంగా సాగిన ఈ బాగోతం.. రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా కాంట్రాక్టు పనులు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ఈ ఏడాది బ్యాంకుల నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది.ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీనికోసం ముందుగా స్టాంప్ డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ స్టాంప్ పొందాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, ఎస్ఆర్సీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా కేవలం రూ.1,51,700 చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించకపోవడం గమనార్హం. -
వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న పాలకులు
అనంతపురం: ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను పాలకులు హరిస్తున్నారని, చివరకు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి తిండి తినాలి అనే అంశాలను కూడా పాలకులు నిర్ణయిస్తున్నారని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు విమర్శించారు. అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.గురుప్రసాద్ అధ్యక్షతన జన విజ్ఞాన వేదిక, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) సంయుక్తంగా అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ‘రాజ్యాంగ పరిరక్షణ’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతో ప్రాధాన్యత పొందిన ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం పలికిన వ్యక్తికి ఐదేళ్ల కారాగార శిక్ష విధించడం చూస్తే మనం ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నామో అర్థం అవుతుందన్నారు. ప్రజా సమస్యలను పాలకులు గాలికొదిలేసి.. ప్రభుత్వ సంస్థల పేర్లను మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును పూజ్య బాపు రోజ్గార్ యోజనగా మార్చేందుకు బిల్లు ప్రవేశపెట్టారన్నారు. నెహ్రూ లైబ్రరీని ప్రధానమంత్రి లైబ్రరీగా, ఔరంగా బాద్ నగరాన్ని శంభాజీ నగర్గా, ఇస్లామిక్ నగర్ను ఈశ్వర్నగర్గా మారుస్తున్నారన్నారు. ఉన్న పేర్లను తీసేసి కొత్త పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వందేమాతరాన్ని కూడా రాజకీయం చేశారన్నారు. బ్రిటిషర్లతో పోరాడి ఉరి తీయబడిన వారి పేర్లు అండమాన్ విమానాశ్రయానికి పెట్టకుండా.. బ్రిటీషర్లను క్షమించమని కోరిన సావర్కర్ పేరు పెట్టారని విమర్శించారు. సావర్కర్ పేరుతో ఉత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలోనే బీజేపీ అతి సంపన్న పార్టీ అన్నారు. రూ.10,070 కోట్లు అధికారికంగా కలిగి ఉందన్నారు. ఇదంతా కార్పొరేట్ల నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో వచ్చిన డబ్బు అన్నారు. ఇలాంటి బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, అక్రమమని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిందని గుర్తు చేశారు. బీజేపీ ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా అలాగే ఎందుకు పెట్టుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడీని ఉపయోగించుకుని బీజేపేతర పార్టీ నాయకులపై కేసులు పెడుతూ.. చట్టాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారని మండిపడ్డారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై బూటు విసిరిన లాయర్ను కనీసం అరెస్ట్ కూడా చేయలేదన్నారు. న్యాయవ్యవస్థ పెద్ద ప్రమాదంలో పడిందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. న్యాయ వ్యవస్థను రక్షించుకోకపోతే అన్యాయం రాజ్యమేలుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ఐలు జాతీయ నాయకులు నర్రా శ్రీనివాసరావు, ఎస్కేయూ న్యాయ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీరాములు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎ.చంద్రశేఖర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ వంశీకృష్ణ, జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ పి.ప్రసూన, డాక్టర్ హేమలత, నరసింహులు, వెంకటస్వామి, ఐలు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరమాసప్ప, సతీష్, జేవీవీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేపీ చిత్తప్ప, కే వీరరాజు పాల్గొన్నారు. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడాలి మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు -
పొట్టి చిత్రం.. గట్టి సందేశం
ఉరవకొండ: విడపనకల్లు మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన పేద దళిత రైతు కూలీ అంజనయ్య కుమారుడు భోగాల సుధాకర్ సందేశాత్మక బుల్లి చిత్రాలతో పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. అనంతపురం బైపాస్ వద్ద రాములమ్మ గుడి వద్ద ఓ హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తునే మరో వైపు రైతాంగ సమస్యలు, మహిళలపై అఘాత్యాలు, బెట్టింగ్ బారిన పడి యువత పెడదోవ పడుతున్న తీరుపై సొంతగా స్క్రిప్ట్ రాసుకుని తీసిన షార్ట్ ఫిలింలు విమర్శకులను సైతం మెప్పించాయి. 2023, నవంబర్ నుంచి ఏఎస్ఆర్ షార్ట్ ఫిలిమ్స్ పేరుతో తీయడం మొదలు పెట్టిన ఆయన ఇప్పటి వరకూ దాదాపు 170కు పైగా సందేశాత్మక చిత్రాలతో పాటు హాస్యాన్ని పంచేలా మరికొన్ని వినోదభరిత చిత్రాలనూ రూపొందించారు. తన షార్ట్ ఫిలింలకు 4 లక్షలకు పైగా వీవ్స్ రావడంతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు దక్కించుకున్నాడు. రైతు దయనీయ పరిస్థితి కళ్లకు కట్టేలా: ఒక పక్క నకిలీ విత్తనాలు పురుగు మందులు చీడపీడలు, మరోపక్క దళారులు, గిట్టుబాటు కాని ధరలు... ఇంకో వైపు ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతున్న అన్నదాతల దయనీయ స్థితిపై వ్యవసాయకుడు పేరుతో సుధాకర్ తీసిన షార్ట్ ఫిలం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. దీంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి పనిపై వెళ్లిన మహిళలు మరుగుదొడ్లు అందుబాటులో లేక పడే ఇబ్బందులపై ‘నగరంలో నరకయాతన’ పేరుతో తీసిన చిత్రం ప్రశంసలు అందుకుంది. ఐపీఎల్ బెట్టింగ్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతకు గొప్ప సందేశాన్ని ఇస్తూ ‘బెట్టింగ్ ఆడకురా మామా’ పేరుతో తీసిన షార్ట్ ఫిలిం, తల్లిదండ్రుల మాటను గౌరవించకుండా హేళన చేస్తూ, వారిని రోడ్డు మీదకు ఈడుస్తున్న నేటి తరం పిల్లల తీరుపై ‘శిక్ష ఎవ్వరికి’ అనే లఘ చిత్రం విశేష ఆదరణ పొందాయి. సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న అవమానాలపై ‘మానవత్వం’ పేరుతో తీసిన షార్ట్ ఫిలిం అందరినీ ఆలోచింపజేసింది. ట్రాఫికర్ పేరుతో ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో చూపించారు. ఉత్తమ అవార్డులు.. ఈ ఏడాది మార్చిలో విజయవాడలో జరిగిన ఉత్తమ షార్ట్ఫిలిం అవార్డుల ప్రధానోత్సవంలో సుధాకర్ నిర్మించిన వ్యవసాయకుడు ఫిలింకు రైతు విభాగంలో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కింది. దీంతో పాటు అనంతపురంలో ఇదే ఏడాది ఫిబ్రవరిలో అనంత ఫిలిం ఫెస్టివల్లో అనంతపురం నగరంలో మహిళలకు మరుగుదొడ్ల కష్టాలపై తీసిన ‘నగరంలో నరకయాతన’ చిత్రానికి, ‘కొత్త సంవత్సరంలో కొత్త ప్రియురాలు’ అనే హాస్య చిత్రానికి అవార్డులు దక్కాయి. సందేశాత్మక చిత్రాలతో దూసుకెళుతున్న హోటల్ నిర్వాహకుడు ప్రశంసలు అందుకుంటున్న కొట్టాలపల్లి రైతుకూలీ బిడ్డ బొగాల సుధాకర్ డబ్బు కంటే సందేశం ముఖ్యం డబ్బుకు ప్రాధాన్యతనివ్వకుండా సమాజంలో మార్పు రావాలని కోరుకుంటూ షార్ట్ ఫిలింలు తీస్తున్నా. రైతుల దయనీయస్థితి, మహిళలపై అఘాయిత్యాలు, యువత పెడదారి పడకుండా చైతన్యం తీసుకొచ్చే లఘచిత్రాలను రూపొందించాను, మిత్రుడు సుంకరాజు సహకారం మరువలేను – సుధాకర్, ఏఎస్ఆర్ షార్ట్ఫిలిం సంస్థ వ్యవస్థాపకులు, డైరెక్టర్ -
కవలలకు జన్మనిచ్చి కానరాని లోకాలకు..
కళ్యాణదుర్గం: కవలలకు జన్మనిచ్చిన తల్లి తనివితీరా పిల్లలను చూసుకోకుండానే ఆరోగ్యం విషమించి కన్నుమూసిన హృదయ విదారక ఘటన ఆదివారం వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు... బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన శివ, గంగమ్మ (25) దంపతులు. శివ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత గంగమ్మ గర్భం దాల్చింది. ఒక్కసారిగా ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అప్పటి నుంచి గంగమ్మ క్రమం తప్పకుండా ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకుంటోంది. ఈ నెల 12న పురిటినొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు కళ్యాణదుర్గంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిశీలించిన వైద్యులు సిజేరియన్ చేసి ఇద్దరు కవల(ఆడశిశువు)లను బయటకు తీశారు. బరువు తక్కువగా ఉండటంతో శిశువులను ఎన్ఐసీయూలో ఉంచారు. సాయంత్రం తర్వాత గంగమ్మకు బ్లీడింగ్ మొదలైంది. ఎంతకూ ఆగకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అంబులెన్స్లో అనంతపురం సవీర ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య సేవలు అందించినప్పటికీ కోలుకోలేకపోయింది. ఆదివారం ఉదయం గంగమ్మ మృతి చెందింది. పెళ్లయిన చాలా ఏళ్లకు గర్భం దాల్చి.. పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చి ఇలా దూరమైపోతివా తల్లీ అంటూ కుటుంబ సభ్యులు రోదించారు. పసికందులకు తల్లి లేకుండా చేస్తివా దేవుడా.. ఎంత పనిచేశావయ్యా అంటూ రోదించారు. అనంతరం మృతదేహాన్ని గంగవరం తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆరోగ్యం విషమించి బాలింత మృతి -
త్వరలో జీఎంసీల్లో ఫిజియోథెరపీ కోర్సు
● ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ అనంతపురం మెడికల్: రానున్న రోజుల్లో ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)ల్లో ఫిజియోథెరపీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనంతపురంలోని కస్తూరి ఫిజియోథెరపీ కళాశాలలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డేకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లను అందజేసి, మాట్లాడారు. కార్యక్రమంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బెన్డెక్ట్, న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. విద్వేషాలు రెచ్చగొడుతూ పోస్టింగ్ నల్లచెరువు: విద్వేషాలు రెచ్చగొడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేసిన యువకుడిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు నల్లచెరువు గ్రామ యువకులు ఫిర్యాదు చేశారు. వివరాలు.. నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అనే యువకుడు రెండేళ్ల క్రితం మతం మారి తన పేరును షేక్ మహమ్మద్ ఆసీఫ్గా మార్చుకున్నాడు. ఇటీవల పాకిస్తాన్కు అనుకూలంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేస్తూ వివాదాలకు తెరలేపాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఐ మక్బూల్బాషాకు ఆదివారం స్థానిక యువకులు ఫిర్యాదు చేశారు. కారు ఢీ – విద్యార్థులకు తీవ్ర గాయాలుఓడీ చెరువు: కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ఓడీచెరువులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న భార్గవ్ (8వ తరగతి), నరసింహ (9వ తరగతి) ఎస్సీ సంక్షేమ వసతి గృహంలో ఉంటున్నారు. ఆదివారం భోజనాలు తీసుకుని వచ్చేందుకు అయ్యప్పస్వామి ఆలయం వద్దకు హాస్టల్ సిబ్బందికి చెందిన స్కూటీలో వెళుతుండగా ఎం.కొత్తపల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన భార్గవ్, నరసింహను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, కొన్ని రోజులుగా హాస్టల్లో విద్యార్థులకు భోజనాలు సిద్ధం చేయకుండా సమీపంలోని ఆలయం వద్ద పెడుతున్న ఆహారాన్ని సమకూరుస్తున్నట్లుగా సమాచారం. దుకాణంలోకి దూసుకెళ్లిన బస్సుహిందూపురం: స్థానిక బెంగళూరు రోడ్డు లోని బోయపేటలో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి సెల్ఫోన్ దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు. టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉపాధ్యాయుడి దుర్మరణంఓడీచెరువు(అమడగూరు): ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ముదిగుబ్బకు చెందిన హరికృష్ణ (36) అమడగూరు మండలం జవుకలకొత్తపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనిపై కర్ణాటకలోని బాగేపల్లికి వెళ్లిన ఆయన అక్కడ పనిముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. అమడగూరు సబ్ స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే మహమ్మదాబాద్ వైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుమతి అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, హరికృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కొనసాగుతున్న ఉద్రిక్తత
అనంతపురం మెడికల్: పారిశుధ్య కార్మికుల ఆందోళనతో అనంతపురం సర్వజనాస్పత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 50 ఏళ్లు దాటిన వారు విధుల్లోకి రావొద్దంటూ పద్మావతి ఏజెన్సీ మేనేజర్లు హరి, సాయితేజారెడ్డి అల్టిమేటం జారీచేయడమే కాకుండా వారి స్థానాల్లో కొత్త కార్మికులను తీసుకున్నారు. దీంతో ఆదివారం పారిశుధ్య కార్మికులు, ఏజెన్సీ మేనేజర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. కొత్త కార్మికులను పనిచేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి.. కార్మికులను బయటకు పంపారు. ఇక్కడికి ఎవరూ రాకూడదని ఆంక్షలు విధించారు. దీంతో పారిశుధ్య కార్మికులు సర్వజనాస్పత్రి ముందు బైఠాయించారు. చివరకు పోలీసులు 16 మంది మహిళా పారిశుధ్య కార్మికులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజారోగ్యం కోసం శ్రమిస్తున్న తమను విధుల్లోకి తీసుకోకపోగా అరెస్టు చేస్తారా అంటూ కార్మికులు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళనకు దిగారు. మాలాంటోళ్లని ఇంత ఇబ్బంది పెడుతున్నారేంటంటూ కన్నీటి పర్యంతమయ్యారు. కార్మికుల అరెస్టును వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, జిల్లా కార్యదర్శి అనిల్కుమార్ గౌడ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, నాయకులు రామిరెడ్డి, ఏటీఎం నాగరాజు, ముర్తుజా, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ఖండించారు. సమస్యను ఎస్పీ జగదీష్, డీఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లి మాట్లాడారు. అనంతరం కార్మికులను పోలీసులు విడిచిపెట్టారు. కొత్తవారిని ఇప్పుడే తీసుకోవద్దు.. పారిశుధ్య కార్మికుల సమస్య పరిష్కారమయ్యే వరకు కొత్తవారిని ఇప్పుడే విధుల్లోకి తీసుకోకూడదని, సర్వజనాస్పత్రిలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని పద్మావతి ఏజెన్సీ మేనేజర్లు సాయితేజారెడ్డి, హరిలను ఆర్డీఓ కేశవ నాయుడు ఆదేశించారు. ఆదివారం ఆర్డీఓ తన కార్యాలయంలో ఏజెన్సీ మేనేజర్లు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. రెండు నెలలుగా ఏజెన్సీ మేనేజర్లు నోటికొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అందరి ముందూ అవమానపరుస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎవ్వరూ తమ పట్ల ఇంత దురుసుగా వ్యవహరించలేదన్నారు. ఆర్డీఓ స్పందిస్తూ ఏజెన్సీ కాంట్రాక్టర్ తక్షణం తమను కలవాలని మేనేజర్లకు సూచించారు. సాధ్యమైనంత త్వరగా కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. 50 ఏళ్లు దాటిన వారిని విధుల్లోకి తీసుకోని ఏజెన్సీ మేనేజర్లు ఆందోళనకు దిగిన కార్మికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు -
ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ వెలుగులు
అనంతపురం టౌన్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ గృహాలపై రూఫ్టాప్ సోలార్ ఏర్పాటుకు ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైసా ఖర్చు లేకుండా 2 కిలోవాట్ల సామర్థ్యమున్న సోలార్ ప్లాంట్ను ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. తొలుత మూడు డివిజన్లలో పనులు.. పీఎం సూర్యఘర్ పథకానికి జిల్లా వ్యాప్తంగా 17,480 మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను విద్యుత్ శాఖ అధికారులు ఎంపిక చేశారు. వీరి ఇళ్లపై 2 కిలోవాట్ల సామర్థ్యమున్న రూఫ్టాప్ సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతలో కళ్యాణదుర్గం, గుత్తి, అనంతపురం డివిజన్లలో పనులు చేపట్టనున్నారు. లబ్ధిదారులపై నయాపైసా భారం పడకుండా సోలార్ ఫలకాలను విద్యుత్ సంస్థ ఏర్పాటు చేయిస్తోంది. ఒక్కో ఇంటిపై రూఫ్టాప్ సోలార్ ఏర్పాటుకు రూ.1.40 లక్షల చొప్పున వెచ్చించనున్నారు. ఎస్సీ, ఎస్టీ గృహాల వినియోగదారులు సౌర విద్యుత్ను వారి అవసరాలకు వినియోగించుకోగా మిగులు విద్యుత్ను సంస్థకు అమ్ముకునే వెసులుబాటునూ కల్పించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఉచితంగా ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా 17వేల మంది లబ్దిదారుల గుర్తింపు 20వ తేదీ నుంచి రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పనులు 20న పనులు ప్రారంభం ఎస్సీ, ఎస్టీ గృహాల సోలరైజేషన్కు ఏపీఎస్పీడీసీఎల్తో తిరుపతికి చెందిన రోటోమ్యాగ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే రూ.219 కోట్లకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ నెల 20న కళ్యాణదుర్గంలో పనులు ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తాం. – శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ, అనంతపురం -
మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా వ్యాపారవేత్త!
అనంతపురం అగ్రికల్చర్: రైతులకు సేవలందించే అనంతపురం వ్యవసాయ మార్కెట్యార్డ్ చైర్పర్సన్ పదవిని వ్యాపార వేత్త అయిన మాజీ కార్పొరేటర్ బల్లా పల్లవికి కట్టబెట్టాలని టీడీపీ అధిష్టానం ప్రతిపాదించింది. స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుతో చైర్పర్సన్, వైస్ చైర్మన్తో పాటు 13 మంది డైరెక్టర్ల పేర్లతో కూడిన జాబితా ఆమోదం కోసం మార్కెటింగ్ శాఖకు పంపారు. త్వరలోనే ప్రభుత్వం జీఓ రూపంలో పాలక వర్గాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు మార్కెట్ కమిటీ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత జాబితాలో చైర్పర్సన్గా బల్లా పల్లవిని వృత్తిపరంగా ట్రేడర్గా పేర్కొన్నారు. అలాగే వైస్ చైర్మన్గా డెయిరీ ఫార్మర్ కింద కమ్మూరు మహమ్మద్ అర్షదుల్లా పేరు ప్రతిపాదించారు. డైరెక్టర్లుగా జాంబవంతుడు, బోయపాటి బాలప్ప, రూపనగుడి రవికుమార్, దళవాయి మారెక్క, సి.లక్ష్మిదేవి, పువ్వాడ లావణ్య, పి.మంజుల, కాంతాదేవి, అవుకునాగిశెట్టి విజయకుమార్, ముప్పూరి క్రిష్ణ, కొనకొండ్ల వెంకటేష్, బి.లక్ష్మిరమణమ్మ, శాంతిసుధ తదితరుల పేర్లు పేర్కొన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ‘దిద్దుబాటు’ చర్యలు.. వ్యాపారాలు చేసుకునే వారిని మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా ప్రతిపాదించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో టీడీపీ అధిష్టానం ‘దిద్దుబాటు’ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ట్రేడర్ నుంచి ఫార్మర్ కింద చూపించడానికి తాజాగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. 15 మంది జాబితాలో 8 మంది ఓసీ వర్గానికి చెందిన వారుండగా.. ముగ్గురు బీసీ, ఇద్దరు ఎస్సీలు, ఒకరు ఎస్టీ, మైనార్టీ ఒకరు ఉన్నారు. టీడీపీకి ఏళ్లపాటు సేవలందించిన పలువురు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కోసం 18 నెలలపాటు ఎదురుచూసినా నిరాశే ఎదురవడంతో ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బల్లా పల్లవి పేరు ప్రతిపాదించిన టీడీపీ అధిష్టానం -
ఆటో డ్రైవర్ బలవన్మరణం
విడపనకల్లు: అప్పులు తీర్చే మార్గం కానరాక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం హవళిగి గ్రామానికి చెందిన రాము (28) అలియాస్ గరుడచేడుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆటోకు సరైన గిరాకీ లేక ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయాడు. దీంతో కుటుంబ పోషణతో పాటు ఆటో మరమ్మతులకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.7 లక్షలకు చేరుకుంది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మానసిక వేదనకు లోనైన రాము... ఆదివారం గ్రామ శివారున చెట్టుకు ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఎస్ఐ మురహరి తెలిపారు. -
త్వరలో గుత్తి కోట అప్రోచ్ రోడ్డు పనులు
గుత్తి: చారిత్రక గుత్తి కోటపైకి ఎన్హెచ్ –44, ఎన్హెచ్ –67 నుంచి అప్రోచ్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆదివారం కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి కోటను సందర్శించారు. కింది భాగంలోని ఆంగ్లేయుల సమాధులతో పాటు కొండ పైభాగాన గుర్రపు శాలలు, ఏనుగుశాలలు, చీకటి గదులు, బావులు, ఆలయాలను తిలకించారు. తర్వాత అధికారులతో కలిసి కొత్తకోట వద్ద జాతీయ రహదారుల నుంచి గుత్తి కోటకు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు నిర్మించనున్న ప్రదేశాన్ని పరిశీలించారు. హైదరాబాద్, బెంగళూరు, చైన్నెతో పాటు ఇతర జిల్లాల నుంచి అనేకమంది జాతీయరహదారుల మీదుగా ప్రయాణం చేస్తుంటారని, గుత్తి కోటపైకి అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేస్తే కోట పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని కొత్తపేట సర్పంచ్ గురుమస్తాన్, గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చౌదరి విజయభాస్కర్ కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, తహసీల్దార్ పుణ్యవతి, కమిషనర్ జబ్బార్మియా, డీటీ సూరి, వీఆర్ఓ సురేంద్ర, కోట గైడ్ రమేష్, కోట సిబ్బంది పాల్గొన్నారు. -
మహోద్యమంలా ప్రజా ఉద్యమం
అనంతపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం మహోద్యమంగా మారింది. విద్యార్థులు, యువత, మేధావులు, ప్రజాసంఘాలు సహా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సర్కారు తీరుపై నిరసన గళం వినిపించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైద్య కళాశాలలు నిర్వహించాలని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు అధునాతన వైద్య సేవలందించాలని నినదించారు. రెండు నెలలుగా సాగిన సంతకాల సేకరణ జిల్లాలో విజయవంతమైంది. ఊరూవాడా సాగిన కోటి సంతకాల ‘సమరం’ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాడిపత్రి నియోజకవర్గంలో సంతకాల సేకరణకు జేసీ వర్గీయులు అడ్డంకులు సృష్టించినా వైఎస్సార్సీపీ నాయకులు వెరవకుండా కార్యక్రమం పూర్తి చేశారు. నియోజకవర్గాల వారీగా సేకరించిన సంతకాల ప్రతులను వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రానికి చేర్చారు. జిల్లా అంతటా 4,55,840 సంతకాలు సేకరించారు. ఈ నెల 18న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో కోటి సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్కు అందించనున్నారు. నేడు భారీ బైక్ ర్యాలీ.. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం పది గంటలకు అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి ఫ్లై ఓవర్, టవర్క్లాక్, సప్తగిరి సర్కిల్, ఐరన్ బ్రిడ్జి, వన్టౌన్ పోలీస్ స్టేషన్, పాతూరు గాంధీ విగ్రహం, చెరువు కట్ట మీదుగా బుక్కరాయసముద్రంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు, యువత, విద్యార్థులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై భగ్గుమన్న ప్రజలు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జిల్లాలో విద్యార్థులు, యువత, మేధావులు, ప్రజల మద్దతు జిల్లా వ్యాప్తంగా 4.55 లక్షల సంతకాల సేకరణ పూర్తి నేడు అనంతపురంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ -
పంటల బీమా ఉన్నట్టా... లేనట్టా..?
అనంతపురం అగ్రికల్చర్: రబీ పంటల బీమా పథకాలకు ప్రీమియం చెల్లింపు గడువు సోమవారంతో ముగియనుంది. అయితే ఇంత వరకూ పంటల బీమా అమలు గురించి ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో అసలు పథకం ఉందా లేదా అన్నది తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రబీలో ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి, పప్పు శనగకు వర్తింపజేశారు. జనరలీ సెంట్రల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో అమలు కానున్న బీమా పథకంలో వ్యవసాయ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పప్పుశనగ ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఖరారు చేయగా.. అందులో రైతులు తమ వాటా కింద రూ.450 ప్రకారం ప్రీమియం చెల్లించాలి. వేరుశనగ ఎకరాకు రూ.32 వేలు కాగా ప్రీమియం రూ.480 ప్రకారం, జొన్నకు రూ.21 వేలు కాగా ప్రీమియం రూ.315, మొక్కజొన్నకు రూ.35 వేలు కాగా ప్రీమియం రూ.525, వరికి రూ.42 వేలు కాగా ప్రీమియం రూ.630 ప్రకారం చెల్లించాలి. వరికి ఈ నెలాఖరు వరకు గడువు ఉండగా.. మిగతా పంటలకు ఈ నెల 15లోపు ప్రీమియం గడువు విధించారు. అయితే ప్రీమియం చెల్లించడానికి రైతులు సిద్ధంగా ఉన్నా... చంద్రబాబు ప్రభుత్వం, వ్యవసాయశాఖ బీమా పథకాలు, ప్రీమియం చెల్లింపు అంశాల గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. పంటల బీమా పథకాల అమలు, ప్రీమియం చెల్లింపు, పరిహారం విడుదల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించకపోవడంతో రెండేళ్లుగా అస్తవ్యస్తంగా మారినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అతికించిన బీమా పోస్టర్లు దిష్టిబొమ్మలుగా కనిపిస్తున్నాయి. నేటితో ముగియనున్న పంటల బీమా ప్రీమియం గడువు పథకం అమలుపై నోరు మెదపని ప్రభుత్వం, వ్యవసాయశాఖ -
ఎంప్లాయీస్ టోర్నీ విజేత గుంతకల్లు రైల్వే ఇంజినీర్స్
అనంతపురం కార్పొరేషన్: ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఎంప్లాయీస్ క్రికెట్ టోర్నీ విజేతగా గుంతకల్లు రైల్వే ఇంజినీర్స్ జట్టు నిలిచింది. ఆదివారం ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్లో గుంతకల్లు రైల్వేస్ ఇంజినీర్, అనంతపురం పోలీసు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వే ఇంజినీర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. జట్టులో తేజ 54, నాగరాజు 43, రమేష్ 34, శివ 25 పరుగులు చేశారు. అనంతపురం పోలీసు జట్టులో షఫీ 3, వర్ధన్, ప్రభు చెరో 2 వికెట్లు తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం పోలీసు జట్టు 19.3 ఓవర్ల వద్ద 171 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వర్ధన్ 77, ప్రభు 42 పరుగులు చేశారు. రైల్వే ఇంజినీర్ జట్టులో శ్రీధర్, అశోక్, రమేష్, శివ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 8 పరుగుల తేడాతో రైల్వే ఇంజినీర్స్ జట్టు గెలుపొందింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా రమేష్, బెస్ట్ బౌలర్గా అశోక్, బెస్ట్ బ్యాటర్గా నాగరాజు ఎంపికయ్యారు. విజేతలను అభినందిస్తూ ట్రోఫీని గుంతకల్లు రైల్వే డీఎస్టీఈ గోపీకృష్ణ అందజేశారు. ఏపీ వెటరన్ క్రికెటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి, సీసీఎస్ సీఐ జయపాల్ రెడ్డి, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగంధర్, ఏఎస్టీఈ వెంకటేశ్వర్లు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విజయరాజు, తదితరులు పాల్గొన్నారు. -
అవమానించాడని హతమార్చారు
పుట్టపర్తి టౌన్: మూడు నెలల క్రితం అమడుగూరు పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న రైతు హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. కర్ణాటకలోని చిక్బళ్లాపురం జిల్లా బాగేపల్లి తాలూకా హెబిలిదేవరవంక గ్రామానికి చెందిన రైతు ముత్తప్ప తన అన్న కుమార్తెతో కర్ణాటకలోని చామాలవారిపల్లికి చెందిన సోమశేఖర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సోమశేఖర్ను ముత్తప్ప చెప్పుతో కొట్టించాడు. ఈ అవమానాన్ని తాళలేని సోమశేఖర్ అప్పటికే ముత్తప్పతో భూతగాదా ఉన్న బాగపల్లి తాలూకా కొత్తూరుకు చెందిన రైతు సురేష్తో జత కట్టాడు. అనంతరం ఇద్దరూ కలసి ఎలాగైనా ముత్తప్పను హతమార్చాలని నిర్ణయించుకుని బాగేపల్లి తాలూకా బోయపల్లికి చెందిన ఆనంద్ సహకారం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గత సెప్టెంబర్ 3న అమడగూరు మండలం ఆకులవారిపల్లి శివారున టమాట పంట వద్ద కాపలాకు వెళ్లిన ముత్తప్పను దారుణంగా హతమార్చి ఉడాయించారు. ఘటనపై ముత్తప్ప భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అమడగూరు పీఎస్ పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించి, ఆదివారం ఉదయం ఓడీచెరువు మండలం మహమ్మదాబాద్ క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన నల్లమాడ సీఐ నరేంద్రరెడ్డి, ఓడీచెరువు పీఎస్ సిబ్బంది లోకేశ్వర్రెడ్డి, కరుణాకర్రెడ్డిని అభినందించారు. రైతు హత్య కేసులో వీడిన మిస్టరీ ముగ్గురి అరెస్ట్.. నిందితులందరూ కర్ణాటక వాసులే వివరాలు వెల్లడించిన శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్కుమార్ -
అరటి కష్టనష్టాలపై అధ్యయనం
అనంతపురం అగ్రికల్చర్: అరటి తోటలు ‘అనంత’ రైతుల్లో అలజడి రేపుతున్న తరుణంలో సమగ్ర అధ్యాయనానికి తిరుపతి చీనీ, నిమ్మ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసరెడ్డి బృందం ఇటీవల మూడు రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించింది. ఉద్యానశాఖ జిల్లా అధికారులు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్, దేవానంద్ తదితరులను వెంటబెట్టుకుని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, కళ్యాణదుర్గం, శెట్టూరు, బెళుగుప్ప, పుట్లూరు, యల్లనూరు, నార్పల, పెద్దపప్పూరు తదితర మండలాల్లో అరటి తోటలను పరిశీలించి రైతుల అనుభవాలు, మార్కెటింగ్ పరిస్థితులు తెలుసుకున్నారు. చాలా మంది రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం లేదని గుర్తించారు. అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి ఎరువులు వేయడం, విచ్చలవిడిగా పురుగు మందులు పిచికారీ చేస్తుండటం వల్ల పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నట్లుగా నిర్ధారించారు. ఫ్రూట్కేర్ యాక్టివిటీపై దృష్టి సారించాలి.. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం, సిగటోక తెగులు వల్ల నాణ్యత లేనందున వ్యాపారులు ‘అనంత’ అరటిపై మొగ్గుచూపడం లేదని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గత రెండు మూడేళ్లుగా అరటి సాగు పెరగడం, అక్కడ నాణ్యత బాగున్న కారణంగా ట్రేడర్లు అటువైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలిపారు. అక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేయడానికి కూడా ‘అనంత’తో పోల్చుకుంటే ఖర్చు తక్కువగా ఉండటం కూడా కారణమన్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో ఫ్రూట్కేర్ యాక్టివిటీపై దృష్టి సారిస్తే... మున్ముందు మార్కెటింగ్ సమస్యను అధిగమించవచ్చన్నారు. లోపాల గుర్తింపు.. ‘సాక్షి’తో డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది రైతులు డ్రిప్ ద్వారా పురుగులు, తెగుళ్ల మందు వదులుతుండటం వల్ల సిగటోక తెగులు, మచ్చలు, కాయలపై చారలు లాంటివి తొలగడం లేదన్నారు. ఇది ఒక విధంగా నష్టాలకు కారణమవుతోందన్నారు. అరటిలో దిగుబడులు, నాణ్యతను తామర పురుగు దెబ్బతీస్తోందన్నారు. సిగటోక లక్షణాలు గుర్తించిన తర్వాత ప్రొపికొనజోల్ +మినరల్ఆయిల్, కార్బండిజమ్ + మాంకోజెబ్ + మినరల్ ఆయిల్, టిబుకొనజోల్ + ట్రైఫ్లాక్సోస్ట్రోబీన్ + మినరల్ ఆయిల్, ఆజాక్సీస్ట్రోబీన్ + టిబుకొనజోల్ + మినరల్ ఆయిల్, పైరాక్సోస్ట్రోబీన్ + ఏపినికోనజోల్ + మినరల్ ఆయిల్... ఈ ఐదు రకాల కాంబినేషన్ మందులు దశల వారీగా పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఎండ అధికంగా ఉన్నప్పుడు గెలలు వచ్చిన తర్వాత మినరల్ ఆయిల్ వాడకూడదన్నారు. ప్రతి పిచికారీ మధ్య 20 రోజుల విరామం ఉండాలన్నారు. గెలలకు పలుమార్లు పురుగుమందులు పిచికారీ చేయడం వల్ల ఖర్చు పెరగడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇది తగ్గించుకోవాలంటే పూమొగ్గ ఏర్పడే సమయంలో 0.3 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్ 500 మి.లీ నీటిలో కలిపి సూది సహాయంతో ఒక్కో పూమొగ్గకు 1 మి.లీ మందు వేయాలన్నారు. చివరి హస్తాలు ఎదుగుదలకు 10 రోజుల ముందు మగ పుష్పగుచ్చాలు చెట్టు నుంచి తొలగించాలన్నారు. గెలలపై 5 గ్రాముల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (0–0–50) పిచికారీ చేయాలని, హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత గెలకు 17 జీఎస్ఎం మందం కలిగిన పాలిప్రోపిలిన్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ కవర్ తొడగాలని సూచించారు. గెలలు కోతకు వచ్చే 35 నుంచి 45 రోజుల ముందు ఎలాంటి మందులు పిచికారీ చేయకూడదన్నారు. పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, పచ్చిరొట్ట ఎరువుల ద్వారా భూసారం పెంచుకుంటే రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల ఖర్చులు గణనీయంగా తగ్గిపోతాయని వివరించారు. లోపాలు గుర్తించిన ‘తిరుపతి’ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బి.శ్రీనివాసరెడ్డి డ్రిప్ ద్వారా పురుగు మందులు ఇవ్వడం వల్ల సిగటోక తెగులు పూమొగ్గకు ఇంజెక్షన్ ఇవ్వకపోవడంతో నాణ్యతపై ప్రభావం మోతాదుకు మించి పెట్టుబడులతో తగ్గిన లాభాలు -
యువకుడి హల్చల్
పామిడి: మండల కేంద్రం పామిడిలో పట్టపగలే అందరూ చూస్తుండగా ఓ యువకుడు హల్చల్ చేశాడు. వివరాలు... పామిడిలోని సంతమార్కెట్ వీధిలో నివాసముంటున్న యువకుడు మాల రవి ఆదివారం ఉదయం స్థానిక మెయిన్బజార్లోని ఓ దుకాణంలోకి వెళ్లి దుస్తులు కొనుగోలు చేశాడు. డబ్బు ఇవ్వకుండా దౌర్జన్యంగా దుస్తులు తీసుకెళుతుండడంతో యజమాని నుంచి సమాచారం అందుకున్న సోదరులు అడ్డుకుని డబ్బు ఇచ్చి వెళ్లాలని నిలదీశారు. దీంతో తననే డబ్బు అడుగుతారా అంటూ తన వద్ద ఉన్న కత్తి బయటకు తీశాడు. మెయిన్ బజార్లోని వారి వస్త్ర దుకాణాలపై రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించాడు. అడ్డుకోబోయిన వారిపై కట్టెతో దాడికి ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకోగానే వారిపై కత్తితో దాడి చేయబోతుండగా త్రుటిలో తప్పించుకుని వాహనంలోకి ఎక్కారు. ఆ సమయంలో రాళ్లు రువ్వడంతో పోలీసు వాహనం అద్దం బద్దలైంది. ఘటనలో జమేదార్ శ్రీనివాసులుకు తీవ్ర రక్తగాయమైంది. అనంతరం స్కూటర్పై ఎక్కి పారిపోతున్న రవిని పోలీసులు వెంబడించి కల్లూరు అగ్రహారం వద్ద అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ : కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యల గురించి అర్జీల ద్వారా విన్నవించవచ్చని తెలిపారు. అరటి తోటలో కొండచిలువ పుట్లూరు: కుమ్మనమల సమీపంలోని అరటి తోటలో ఆదివారం కొండచిలువ కలకలం రేపింది. అంకన్న అనే రైతు తన అరటి తోట వద్దకు వెళ్లిన సమయంలో ఎనిమిది అడుగులకు పైగా ఉన్న కొండ చిలువ ఏదో జంతువును మింగేసి కదలలేని స్థితిలో కనిపించింది. వెంటనే ఆయన తోటి రైతులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కాసేపటికి అక్కడకు చేరుకున్న రైతులు అరటి తోటల్లో ఇలాంటి కొండచిలువ ఉంటే ప్రమాదమని భావించి అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖ అధికారులు వచ్చి కొండ చిలువను పట్టుకుని సురక్షితంగా అటవీప్రాంతంలో వదిలేశారు. నేడు డయల్ యువర్ సీఎండీ అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు నేరుగా 89777 16661 నంబర్కు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు ఫోన్ చేయాలని సూచించారు. ఇంధన పొదుపులో.. గుంతకల్లు రైల్వేకు అవార్డులు గుంతకల్లు: ఇంధన పొదుపులో గుంతకల్లు రైల్వే డివిజన్కు జాతీయస్థాయి పురస్కారాలు లభించాయి. గుంతకల్లులోని డీజిల్ ట్రాక్షన్ శిక్షణ కేంద్రంతోపాటు వసతి గృహం, డివిజన్ పరిధిలోని రాయచూర్ రైల్వేస్టేషన్ విద్యుత్ను ఆదా చేసి జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయి. న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆదివారం జరిగిన బహుతుల పంపిణీ కార్యక్రమంలో ‘2025 నేషనల్ ఎనర్జీ కన్వర్షన్’ అవార్డును డీజిల్ ట్రాక్షన్ శిక్షణ కేంద్రం, వసతి గృహం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ్ రాష్ట్రపతి దౌప్రదిముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. రాయచూర్ రైల్వేస్టేషన్ ‘ఉత్తమ ఇంధన పొదుపు రైల్వేస్టేషన్’ అవార్డును కేంద్ర మంత్రి మనోహర్లాల్ చేతుల మీదుగా డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ శ్రీనిబాష్ సంయుక్తంగా అందుకున్నారు. షీల్డ్తోపాటు రూ.10 లక్షల నగదు పురస్కారం అందజేసినట్లు వారు తెలిపారు. పోలీస్స్టేషన్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం పెద్దపప్పూరు: పొలాన్ని దౌర్జన్యంగా ట్రాక్టర్తో చదను చేయించడంతో మనస్తాపానికి గురైన రైతు స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు... పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లికి చెందిన రైతు అశిత్తుకు భార్య, కుమార్తె ఉన్నారు. తమకున్న పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంత కాలంగా ఆ పొలంపై సొంత తమ్ముడు పెద్ద కుళ్లాయిస్వామి కన్నేసి, దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేపట్టాడు. ఈ క్రమంలోనే పొలాన్ని ఆదివారం ట్రాక్టర్తో దున్నించడంతో మనోవేదనకు లోనైన అశిత్తు పోలీసు స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని, తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగబోతుండగా పోలీసులు వెంటనే అడ్డుకుని పురుగు మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. పెద్దకుళ్లాయి స్వామి, అతని కుమారుడు నందపై కేసు నమోదు చేసి, సోమవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయనున్నట్లు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. -
చలి పంజాతో గజగజ
● మడకశిరలో 8.2 డిగ్రీలు, శెట్టూరులో 10.1 డిగ్రీలు అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత పెరిగిపోయింది. ఈ నెల 8న ఎన్నడూ లేనంతగా పొగమంచు పూర్తిగా కమ్మేసింది. క్రమంగా పొగమంచు తగ్గినా.. చలి మాత్రం పంజా విసురుతోంది. రోజురోజుకూ చలితీవ్రత పెరగడంతో జనం గజగజ వణుకుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలవుతోంది. శీతల గాలులలో మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు చలి ప్రభావం కనిపిస్తోంది. ఆదివారం మడకశిర మండలంలో 8.2 డిగ్రీలు, శెట్టూరులో కూడా 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో కనిష్టం 9 నుంచి17 డిగ్రీలు, గరిష్టం 27 నుంచి 32 డిగ్రీలు రికార్డయ్యాయి. ప్రధానంగా మడకశిర, హిందూపురం, పెనుకొండ, ఉరవకొండ, శింగనమల ప్రాంతాల్లో చలి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల అటు మనుషులు, ఇటు జంతుజాలం, పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మూడు రోజుల కిందటితో పోల్చితే గాలి నాణ్యత కొంత మెరుగ్గా ఉన్నా అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితిలోనే ఉన్నట్లు తెలిపారు. -
బాబుగారి తాలూకా.. కక్షకట్టి.. పొట్ట కొట్టి
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పాలన గాడితప్పింది. దశాబ్దాలుగా పారిశుధ్య పనులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులపై ‘పద్మావతి ఏజెన్సీ’ కత్తిగట్టింది. వయసు, విద్యార్హత ఆంక్షల పేరుతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 50 ఏళ్లు వయసు పైబడిన వారు ఉద్యోగాలకు అవసరం లేదని తెగేసి చెప్పింది. జీవనాధారం కోల్పోతే కుటుంబ పోషణ ఎలా అన్న మానసిక క్షోభ కార్మీకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో కార్మీకులు తమ జీవనాధారాన్ని దెబ్బ తీయొద్దంటూ ఏజెన్సీ నిర్వాహకులను ప్రాధేయపడ్డారు. ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ పరిస్థితుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా ఫ్రంట్ వారియర్స్గా పనిచేసిన తమకు ఇదేనా మీరిచ్చే గుర్తింపు అని ప్రశ్నిస్తే.. కర్కశంగా సమాధానమిచ్చారు. మీరెటైనా చావండి.. మేము ఇతరులను పనిలోకి తీసుకుంటున్నాం అని తెగేసి చెప్పడంతో గుండె ఆగినంత పనైంది. ఎప్పుడు తమకు డ్యూటీ చివరి రోజు అవుతుందోనని భయం భయంతో విధులకు హాజరవుతూ రెండు నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ నిర్వాహకుల బెదిరింపులతో మనస్తాపం చెందిన పద్మావతి అనే పారిశుధ్య కార్మీకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. చేతులెత్తేసిన అధికార యంత్రాంగం.. పారిశుధ్య కార్మీకుల సమస్యతో సర్వజనాస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది. ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన పారిశుధ్యంపై అధికార యంత్రాంగం నోరు మెదపడం లేదు. నిబంధనల మేరకు కార్మీకులపై చర్యలుంటాయని, స్టేట్ పాలసీ అంటూ మాట దాటవేస్తున్నారు. దీనికి తోడు ఏజెన్సీ నిర్వాహకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిత్రులని, ఈ విషయంలో తామేమి చేయలేమని అధికారులే బహిరంగంగా చెబుతుండడం దుమారం రేపుతోంది. జిల్లా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే ఎవ్వరూ కార్మికుల సమస్యను పట్టించుకోలేదు. దుర్వాసన వెదజల్లుతున్న వార్డులు.. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో శనివారం పారిశుధ్య కార్మీకులు విధులకు గైర్హాజరయ్యారు. రోజుకు మూడు, నాలుగుసార్లు శుభ్రం చేయాల్సిన వార్డులను ఒక్కసారి కూడా శుభ్రం చేయలేదు. ఎమర్జెన్సీ, అక్యూట్ మెడికల్ కేర్, ఐసీసీయూ, పీఐసీయూ, గైనిక్, లేబర్, ఆర్థో, మెడిసిన్, ఈఎన్టీ, ఆపరేషన్ తదితర వార్డులన్నీ దుర్వాసన వస్తున్నాయి. ఇప్పటికే శానిటేషన్ నిర్వాహకులు కనీసం డస్ట్బిన్లు, కవర్లను ఇవ్వలేదు. దీంతో రోగికి వినియోగించిన వస్తువులను ఎక్కడపడితే అక్కడ వేస్తున్నారు. పారిశుధ్యం నిర్వహణకు గాను ప్రతి నెలా రూ.70 లక్షలు ఏజెన్సీకి చెల్లించేలా ఒప్పందంలో ఉంది.జీవనాధారం పోతే ఏం కావాలి? ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 30 ఏళ్లుగా పని చేస్తున్నాం. పారిశుధ్య పనులు చేస్తూ ఆరోగ్యం కూడా దెబ్బతినింది. ఇప్పటికే నా భర్త కృష్ణా నాయక్, బిడ్డ కవిత, అల్లుడు నాగరాజు చనిపోయారు. మనవడు, మనవరాలు గంభీర్ (డిగ్రీ), గంగోత్రి (9వ తరగతి) ఆలనా, పాలన నేనే చూసుకోవాలి. ఇప్పుడేమో ఏజెన్సీ వాళ్లు పని నుంచి తొలగిస్తామని చెబుతున్నారు. నాకుటుంబానికి ఆధారమంతా ఇదే సార్. వచ్చే డబ్బులతోనే వారిని చదివించుకుంటున్నా. ఇప్పటి వరకు ఐదారు ఏజెన్సీలు వచ్చాయి. పద్మావతి ఏజెన్సీ అంత ఘోరంగా ఎవరూ సతాయించడం లేదు. – కాంతమ్మ, పారిశుధ్య కార్మికురాలుఇంతలా అంగలాపిస్తే ఎలా..? నేను, నా భర్త సిరాజ్ ఉంటున్నాం. ఆయన ఏ పనీ చేయలేని పరిస్థితి. 12 ఏళ్లుగా సర్వజనాస్పత్రిలో పని చేస్తున్నా. ఇక్కడ వచ్చే డబ్బులతోనే కుటుంబం గడుస్తుంది. ఈ వయసులో ఉద్యోగం లేదని, పనికి రావొద్దని చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేశాం. ఇప్పుడు ఉన్నఫళంగా వెళ్లిపొమ్మంటే ఏం చేయాలి. ఇంత అంగలాపిస్తే ఎలా? ఏజెన్సీ మేనేజర్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు మాతోటి స్వీపర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీళ్లు మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? – షమీమ్, పారిశుధ్య కార్మీకురాలు ఏజెన్సీ ముసుగులో దురుసు ప్రవర్తన..ఈ నెల 12న పద్మావతి అనే పారిశుధ్య కార్మీకురాలి పట్ల పద్మావతి ఏజెన్సీ మేనేజర్లు హరి, సాయితేజరెడ్డి దురుసుగా మాట్లాడారు. చస్తే చావు అంటూ కర్కశంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురైన పద్మావతి చిన్నపిల్లల విభాగం అంతస్తుపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసి, ప్రస్తుతం సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ⇒ సర్వజనాస్పత్రిలో ఏజెన్సీ నిర్వాహకులు, పారిశుధ్య కార్మీకులకు మధ్య 20 సార్లకుపైగా వాగ్వాదం జరిగింది. పదుల సంఖ్యలో ఆందోళనలు చేపట్టారు. నెల రోజులుగా కార్మీకులు తమకు న్యాయం చేయాలంటూ రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. ⇒ పద్మావతి ఏజెన్సీ నిర్వాహకులు ఇప్పటికే 50 మంది వరకు సూపర్వైజర్లు, పారిశుధ్య కార్మీకులను విధుల్లోకి తీసుకున్నట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన వారిని విధుల్లోకి పురమాయించినట్లు తెలుస్తోంది. దీనికితోడు పారిశుధ్య కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఏజెన్సీ మేనేజర్లు ఆస్పత్రిలో భయాందోళన వాతావరణం సృష్టిస్తున్నా రు. ఎప్పుడెప్పుడు సాగనంపుదామా అనే ఆలోచనలో నిమగ్నమయ్యారు.కార్మీకురాలికి పరామర్శ ఏజెన్సీ మేనేజర్లు దురుసుగా మాట్లాడటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికురాలు పద్మావతిని శనివారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు పరామర్శించారు. కార్మీకులందరికీ యూనియన్ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, కార్యదర్శి బి.రాజశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి, జిల్లా కార్యదర్శి అనిల్కుమార్గౌడ్, నగర కార్యదర్శి రామాంజి రాయల్, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ హుస్సేన్, కాకర్ల శ్రీనివాస్రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ రాయల్, నగర కార్యదర్శి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. -
వామ్మో.. ఘాట్ రహదారి
తాడిపత్రి టౌన్: నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆలూరు కోన రంగనాథ స్వామి క్షేత్రానికి వెళ్లే ఘాట్ రహదారి ప్రమాదకరంగా మారింది. ఘాట్ రోడ్డుకు ఉన్న రక్షణ గోడ కొన్ని చోట్ల దెబ్బతినగా.. మరి కొన్ని చోట పూర్తిగా నేలవాలింది. యాత్రికులు, భక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల్లో ఘాట్ రోడ్డులో ప్రయాణించేందుకు జంకుతున్నారు. తాడిపత్రి పట్టణం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలూరు కోన క్షేత్రం.. ప్రకృతి రమణీయతతో శోభాయమానంగా వెలుగొందుతోంది. క్షేత్రంలో స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేత శేషతల్పంపై భక్తులకు దర్శనం ఇస్తారు. ఏటా వైశాఖ మాసంలో స్వామికి బ్రహోత్సవాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి శని, ఆదివారాల్లో ఆలూరు కోనకు పెద్ద ఎత్తున పర్యాటకులు విచ్చేసి జలపాతంలో సేదతీరుతారు. ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఆలయానికి వెళ్లే రోడ్డు మాత్రం అధ్వానంగా మారింది. రోడ్డుపై మోకాలు లోతు గోతులు పడటంతో భక్తులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే ఘాట్ రోడ్డులో కొండకు ఒక వైపు రక్షణ గోడ కూలిపోయింది. మరోవైపు రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు, పర్యాటకులు భయపడుతూ ఆలయానికి చేరుకుంటున్నారు. ఏవైనా పెద్ద ప్రమాదాలు జరగక ముందే అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు గుంతలమయం..తాడిపత్రి నియోజకవర్గంలో ఆలూరు కోన రంగనాయకుల స్వామి దర్శనానికి రోజూ పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు. కోనకు వెళ్లే ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రక్షణ గోడ కూలిపోగా.. కొండకు మరో వైపు రక్షణగోడ లేకుండానే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. రోడ్డు కూడా గుంతలమయంగా మారింది. కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతింది. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రోడ్డుకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. – యోగేశ్వర రెడ్డి, పర్యాటకుడు, తాడిపత్రి -
టెక్నా'లేజీ'.. అతివినియోగంతో తగ్గుతున్న జ్ఞాపకశక్తి
టెక్నాలజీ.. కాస్త టెక్నా‘లేజీ’ అవుతోంది.. పాశ్చాత్య నాగరికతకనుగుణంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. వయో భేదంలేదు అసలేలేదు.. అరచేతిలో స్వర్గం.. అనర్థాలు అధికమన్న విషయం తెలిసినా సామాజిక మాధ్యమాల్లోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది.. అతివినియోగంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది.. అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి.. ఫలితంగా చిన్నారులేకాదు.. 15 నుంచి 32 ఏళ్ల యువత కూడా డేంజర్ జోన్లోకి వెళ్లిపోతోంది.. సాక్షి, పుట్టపర్తి: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. గత మూడు దశాబ్దాలతో పోలిస్తే.. టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా ప్రజలకు అందిన మేలు ఊహలకు అందదు. చావు కబురు చెప్పాలంటే టెలిగ్రామ్ పంపే రోజుల నుంచి నిమిషాల్లో సమాచారం చేరవేసే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. బంధువులను పండుగలు, శుభకార్యాల్లో మాత్రమే కలిసి రోజుల నుంచి నిత్యం టచ్లో ఉండేలా టెక్నాలజీ అందిపుచ్చుకున్నారు. మధ్య మధ్యలో మంచీచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలే దిక్కయ్యేవి. ఆ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్ యుగంలోకి వచ్చాం. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సగటున స్మార్ట్ఫోన్ ఉంది. ఇంటింటా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఇంట్లో నుంచి ప్రపంచాన్ని చూసే అవకాశం లభిస్తోంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్లో దొరుకుతోంది. పండుగలు, శుభకార్యాల కోసం మంచి బ్రాండ్ దుస్తులతో సహా ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొంటున్నారు. వ్యాపార రంగంలో ఆన్లైన్ బిజినెట్ వాటా సుమారు సగం పైగా ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా పిల్లల వీడియో గేమ్స్ యాప్స్ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగించకుండా రోజు గడవని స్థితి నెలకొంది. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. గూగుల్ మ్యాప్లో వెతుక్కుని వెళ్లే స్థితికి వచ్చారు. ఇదంతా పక్కన బెడితే.. మరో కోణంలో టెక్నాలజీని అతిగా వినియోగించి అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. అలాంటి వారిలో 15 – 35 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. టెక్నాలజీ ప్రభావంతో చదువులో వెనుకబడడం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా దృష్టి సారించలేకపోవడం, ఒకరినొకరు మాట్లాడడం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి. నిద్రలేమి వేధిస్తోంది. చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకోవడం వంటి ప్రభావాలు పడుతున్నాయి. ఆఖరుకు చిన్న పిల్లలు కూడా డేంజర్ జోన్లోకి వెళ్తున్నారని వైద్యనిపుణులు చెప్తున్నారు. ⇒ ఒకే ప్రదేశంలో కూర్చొని కంప్యూటర్ చూస్తూ గడిపే వారికి వెన్ను సమస్యలు అధికం అవుతున్నాయి. ఈ నొప్పితో ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. నిత్యం ఉద్యోగ ఒత్తిళ్లతో బిజీలో ఉండటంతో పాటు మధ్య మధ్యలో స్నేహితులతో ముచ్చటించటం.. పలు విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో కంప్యూటర్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.. ఫలితంగా మూడు పదుల వయసుకే వెన్నెముక బారిన పడుతున్నారు. ఇటీవల పుట్టపర్తిలో 36 ఏళ్ల వ్యక్తి వెన్నెముక నొప్పి బారిన పడడమే నిదర్శనంగా చెప్పవచ్చు. ⇒ స్మార్ట్ఫోన్లతో జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు. కనీసం కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు కూడా గుర్తు పెట్టుకోలేని పరిస్థితి. గణాంకాల విషయానికొస్తే క్యాలిక్యులేటర్ వాడుతున్నారు. ప్రైమరీ పాఠశాల నుంచి చిన్నారులు స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడటంతో ఏ విషయం గుర్తుంచుకోలేకపోతున్నారు. ఫోన్ లేకుంటే ఏ పనీ చేయలేని స్థితిలోకి వెళ్తున్నారు. ఫలితంగా టీనేజీలోనే జ్ఞాపక శక్తి కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రెండు నెలల క్రితం హిందూపురంలో 16 ఏళ్ల బాలుడు జాపకశక్తి కోల్పోయి.. మానసికంగా దెబ్బ తిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ⇒ పండుగ వచ్చినా.. ఫంక్షన్ రోజయినా.. ఎలాంటి శుభకార్యం కోసమైనా.. నేరుగా వెళ్లి పిలిచే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సమీప బంధువులను తప్ప మిగతా అందరినీ టెక్నాలజీ ఆధారంగా ఆహ్వానిస్తున్నారు. శుభవార్త, చేదువార్తలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే తెలియజేస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరూ అర్ధరాత్రి వరకు ఫోన్లతోనే గడిపేస్తున్నారు. మెసేజీలు, ఫోన్ కాల్స్, రీల్స్కు బానిసలుగా మారారు.పెరిగిపోతున్న ఒత్తిడి.. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్తోనే టెక్నాలజీని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా చిన్నపిల్లలు, యువతకు ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. 40 ఏళ్ల లోపు వయసున్న వారికి టెక్నాలజీ అతి వినియోగం కారణంగా మానసిక, శారీరక సమస్యలు అధికమయ్యాయి. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో సమయం గడుపుతుండడంతో సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ఫోన్ తక్కువగా వాడేవారు పాజిటివ్ ధోరణితో ఉండగా.. అతిగా వినియోగించే వారు నెగిటివ్ ఆలోచనలో ఉంటారని నిపుణులు చెప్తున్నారు. ట్యాబ్లు, కంప్యూటర్లపై ఎక్కువగా ఆధారపడేవారు కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఇంకొంత మందికి తలనొప్పి, భుజం, వెన్నునొప్పి సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యం ప్రధానం నిద్రపోయే గంట ముందే స్మార్ట్ఫోన్ వాడకం, టీవీ చూడటం మానేయాలి. అతి దగ్గరగా కూర్చొని టీవీ, ఫోన్ కూడా చూడరాదు. టెక్నాలజీని అవసరం మేరకే వాడుకోవాలి. లేదంటే సోమరితనం పెరిగిపోతుంది. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల వాడకం పూర్తిగా తగ్గించాలి. స్మార్ట్ఫోన్లలో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం గమనించడం తల్లిదండ్రుల బాధ్యత. లేదంటే పెడదారిలో వెళ్లే అవకాశం అధికంగా ఉంటుంది. – ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, శ్రీసత్యసాయి జిల్లా -
ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్లతో భూకబ్జాకు ఎత్తుగడ
రాప్తాడురూరల్: అది ప్రైవేట్ పట్టా భూమి. అలాంటి భూమికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఉండదు. అయినా తహసీల్దార్ పేరుతో ఫేక్ పొజిషన్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఏకంగా ఫెన్సింగ్ వేశారు. బాధితులు వెళ్తే దౌర్జన్యానికి దిగుతున్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతోంది. రాప్తాడు మండలం మరూరులో జరుగుతున్న ఈ వ్యవహారం హాట్టాపిక్లా మారింది. బాధితురాలు తెలిపిన మేరకు...మరూరుకు చెందిన ఎం.గోపాల్రెడ్డి (లేట్) సతీమణి ఎం.వెంకటలక్ష్మమ్మ సర్వే నంబరు 978 (పాత సర్వే నంబరు 646)లో 1.47 ఎకరాల ప్రైవేట్ పట్టా భూమిని 1987లో కొనుగోలు చేసింది. ఇటీవల అదే గ్రామానికి చెందిన పి.ఆదినారాయణ, పి.ప్రభాకర్, చీర్ల భాస్కర్ జేసీబీలతో తన భూమిలోకి వచ్చి చదును చేశారని వెంకటలక్ష్మమ్మ వాపోతోంది. పి.వెంకటమ్మ, జె.నల్లమ్మ, చీర్ల లక్ష్మీదేవి, సావిత్రి, చీర్ల రాముడు పేర్ల మీద తన భూమిలో తహసీల్దార్ పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు నకిలీవి సృష్టించుకున్నారని ఆరోపించింది. ప్రైవేట్ భూమికి అధికారులు ఎలా పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తారని ప్రశ్నించింది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులను అడిగితే.. ఆ సర్వే నంబరులో అధికారికంగా తాము ఎవరికీ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని ధ్రువీకరించారని తెలిపింది. ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించుకుని తన భూమిని ఆక్రమించాలని చూస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాప్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పింది. కోర్టులు అనుకూలంగా తీర్పు ఇచ్చినా... తన అనుభవంలో ఉన్న ఈ భూమిపై గతంలోనే తకరారు చేయడంతో జిల్లా కోర్టు, హైకోర్టును ఆశ్రయించానని బాధితురాలు వెంకటలక్ష్మమ్మ తెలిపింది. తనకే హక్కు ఉన్నట్లు రెండు కోర్టులూ ఉత్తర్వులు జారీ చేశాయని చెప్పింది. శాశ్వత ఇంజక్షన్ ఆర్డరు కూడా వచ్చిందని వెల్లడించింది. ఆర్డీఓ కోర్టు ద్వారా పాసు పుస్తకాలు కూడా మంజూరు చేశారని పేర్కొంది. అలాంటి భూమిలోకి కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వస్తున్నారని వాపోయింది. కలెక్టర్, ఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని వెంకటలక్ష్మమ్మ వేడుకుంటోంది. -
పెన్నోబులేసునికి.. రాజకీయ గ్రహణం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కార్యనిర్వహణాధికారి (ఈఓ) దీర్ఘకాలిక సెలవుల కారణంగా ఆలయ నిర్వహణ – మాన్యం భూముల రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మాన్యం భూములు దక్కించుకున్న అధికార పార్టీ నాయకులు లీజు ఎగ్గొట్టడమే కాకుండా అనధికారికంగా భూములు విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఆలయ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉరవకొండ/అనంతపురం కల్చరల్: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తదితర ప్రాంతాల భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అనంతపురం జిల్లా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సాగాల్సిన పాలనా వ్యవహారాలపై చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) గా ఎవ్వరు వచ్చినా కొద్దిరోజులకే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ భూముల లీజుల కేటాయింపు–నిధుల ఖర్చు చేయాలంటూ వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉండే ఆలయంలో ఏమి జరిగినా దిక్కు లేకుండా పోతోంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2,114 ఎకరాల మాన్యం ఉంది. ఇందులో 146 ఎకరాల ఈనామ్ భూమి, 412 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. మిగతా 1,554 ఎకరాలు ఆమిద్యాల, మోపిడి, కోనాపురం, పెద్దముస్టూరు, మూలగిరిపల్లి, రాచెర్ల, చిన్నముసూ్టరు పరిధిలో ఉన్నాయి. ఆలయ మాన్యాలు కొంతమంది అధికార పార్టీ నేతల చేతుల్లో చిక్కుకున్నాయి. సొంత భూములు ఉన్నా సరే నామమాత్రపు కౌలు చెల్లిస్తూ కొన్నేళ్లుగా ఆలయ భూమిని అనుభవిస్తున్నారు. సాధారణంగా వర్షాధారం అయితే ఎకరాకు రూ.6 వేలు, సాగునీటి సౌకర్యం ఉంటే ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలు చెల్లించాల్సి ఉన్నా.. ఇక్కడ నారసింహుడికే నామాలు పెట్టి ఎకరాకు నామమాత్రంగా రూ.500 నుంచి రూ.2,500 ఏడాదికి చెల్లిస్తున్నారు. కౌలుదారుల్లో చాలామంది అనధికారికంగా సబ్లీజుకు ఇచ్చుకున్నారు. కొందరు అధికార పార్టీ నేతలైతే కౌలు భూమి తమ సొంత ఆస్తి అయినట్టు ఇతరులకు విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి సుమారు 1,400 ఎకరాలకు సంబంధించి కౌలు లీజు ముగిసినా నేటికీ ఆలయ భూములకు బహిరంగ వేలం పాటను అధికారులు నిర్వహించలేదు. 20 శాతం మంది మాత్రమే అసలైన కౌలుదారులు సక్రమంగా ఆలయానికి సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలయ భూముల టెండర్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు అన్నీ తామై సిండికేట్గా మారి టెండర్లు దక్కించుకోవాలని చూడటంతో గతేడాది ఆగస్టు నుంచి వరుసగా మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఏడాదికి సగటున 20 వేల మంది స్వామివారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. 2024–25 ఏడాదికి ఉరవకొండకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు రూ.27 లక్షలకు తలనీలాల సేకరణ హక్కులను దక్కించుకున్నాడు. అయితే ఇందులో రూ.9.5 లక్షలు మాత్రమే సదురు టీడీపీ నాయకుడు ఆలయానికి చెల్లించి, మిగతా సొమ్ము నేటికీ జమ చేయలేదు. ఈ సొమ్ములో కూడా గతంలో ఈఓగా విధులు నిర్వహించిన ఓ అధికారి తన సొంతానికి రూ.3 లక్షలు వాడుకున్నట్లు ఆలయ సిబ్బందే గుసగులాడుకోవడం గమనార్హం. = భక్తులు పరమపవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం పెన్నహోబిలంలో కొంతకాలంగా కనుమరుగైంది. లడ్డూ ప్రసాదం టెండరు ప్రక్రియ ఆగిపోయి చాలా కాలమైంది. అధికార పార్టీ నేతలు – దేవదాయ శాఖ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో భక్తులకు లడ్డూ ప్రసాదమే లేకుండా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరగానే పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా రమేష్బాబు బాధ్యతలు చేపట్టారు. అయితే టీడీపీ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో భరించలేకపోయిన ఆయన దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లారు. దీంతో అప్పటి జిల్లా సహాయ కమిషనర్ (ఏసీ) తిరుమలరెడ్డికి ఆలయ ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయనకూ అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పలేదు. దీంతో ఆయన కూడా సెలవులోకి వెళ్లిపోయారు. తదుపరి ఈఓ బాధ్యతలు గుంతకల్లుకు చెందిన మల్లికార్జున తీసుకుంటారని ఎండోమెంటు అధికారులు చెప్తున్నా.. ఆయన మాత్రం ముందుకు రాలేదు. ఈ క్రమంలో అనంతపురంలోని చెన్నకేశవస్వామి ఆలయం ఈఓగా ఉన్న సుధారాణికి తాత్కాలికంగా పెన్నహోబిలం ఆలయ బాధ్యతలు అప్పగించారు. పెన్నహోబిలం ఆలయ నూతన పాలక మండలి ఇంకా కొలువుదీరలేదు. అయినా సభ్యులుగా తామే ఉంటామని, మేము చెప్పినట్లుగా మీరు పనిచేయాల్సి ఉంటుందని కొందరు అధికార పారీ్టనేతలు ఈఓలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి అయ్యే రూ.5 లక్షల ఖర్చును ఆలయ నిధుల నుంచే వెచ్చించాలని షరుతు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఈ అంశం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. చేసేది లేక సెలవుపై వెళ్తున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాంపెన్నహోబిలంలో మేం గుర్తించిన సమస్యలను పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ కొన్నాళ్లుగా ఈఓ లేనిమాట నిజమే. సెలవులో ఉన్న తిరుమలరెడ్డి ఈ నెల 19న వస్తారు. అప్పటి వరకు నేను ఇన్చార్జ్గా మాత్రమే కొనసాగుతాను. కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా మేము కూడా ఎండోమెంటు ఇన్స్పెక్టర్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. – సుధారాణి, పెన్నహోబిలం ఆలయ ఇన్చార్జ్, దేవదాయ శాఖ ఇన్చార్జ్ ఏసీ -
అవమానపరిచాడని అంతమొందించాడు!
గుంతకల్లు: మంచి నీటి కొళాయి వద్ద జరిగిన ఘర్షణలో వ్యక్తిని దారుణంగా నరికి చంపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం పట్టణంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు వివరాలను వన్టౌన్ సీఐ మనోహర్ శనివారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. పాత గుంతకల్లులోని అంకాళమ్మగుడి సమీపంలో కురుబ చంద్రశేఖర్, శివకుమార్ ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. చంద్రశేఖర్, పుష్పావతి దంపతులకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లయినా పిల్లలు కలగలేదు. దీంతో శివకుమార్ కన్ను పుష్పావతిపై పడింది. చంద్రశేఖర్ ఇంట్లో లేని సమయంలో అక్కడికి వెళ్లి తలుపులు కొడుతూ ఉండేవాడు. విసిగిపోయిన పుష్పావతి విషయాన్ని భర్త చంద్రశేఖర్కు చెప్పడంతో శివకుమార్తో పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలోనే బంధువులు, చుట్టుపక్కల వారి ఎదుట శివకుమార్ను చంద్రశేఖర్ అవమానపరిచాడు. దీంతో ఆవేశంతో రగిలిపోయిన శివకుమార్ ఎలాగైనా చంద్రశేఖర్ను తుద ముట్టించాలని భావించాడు. శనివారం ఉదయం మంచి నీటి కొళాయి వద్ద చంద్ర, పుష్పావతి ఇరువురు కలిసి నీళ్లు పట్టుకుంటుండగా శివ గొడవకు దిగాడు. ఈ క్రమంలో పుష్పావతి గతంలో శివకుమార్ తలుపులు కొట్టిన విషయాన్ని మరలా ప్రస్తావించడంతో ఆగ్రహం చెందిన శివకుమార్ ‘నన్ను ప్రతి సారీ అవమానపరుస్తున్నారు. ఈ రోజు వదిలిపెట్టేది లేదు’ అంటూ ఇంట్లోకి వెళ్లి కొడవలి తీసుకువచ్చి చంద్రశేఖర్ మెడపై నరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. శివకుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. శివకుమార్ శనివారం వేరే ఊరికి వెళ్లేందుకు పట్టణంలోని హనుమన్ రైల్వేస్టేషన్లో ఉన్నట్లు సమాచారం రావడంతో వెంటనే అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. హత్యకు వాడిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు చంద్ర హత్య కేసులో నిందితుడి అరెస్ట్ -
ఇసుక టిప్పర్ పట్టివేత
శింగనమల: వైఎస్సార్ కడప జిల్లా వేటూరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పరును శనివారం శింగనమల క్రాస్లో మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కేసు నమోదు చేసి శింగనమల పోలీస్స్టేషన్కు తరలించినట్లు జిల్లా మైనింగ్ శాఖ డీడీ ఆదినారాయణ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాడికిలో.. యాడికి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని రాయలచెరువు గ్రామంలో శనివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నల్లమేకల పల్లి గ్రామానికి చెందిన తమ్మినేని రాజశేఖర్ నాయుడు టిప్పర్లో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డాడన్నారు. పెద్దపప్పూరు మండలం నుంచి రాయలచెరువు, చందన గ్రామం మీదుగా డోన్కు తరలిస్తున్నట్లు వెల్లడైందన్నారు. టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించి రాజశేఖర్ నాయుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ నూతన కమిటీ అనంతపురం అగ్రికల్చర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల యూనియన్ నూతన కమిటీ ఎన్నికైంది. శనివారం స్థానిక యాదవ కల్యాణ మంటపంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా డి. శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షుడిగా హనుమంతరెడ్డి, ఉపాధ్యక్షుడిగా నారాయణ, కోశాధికారిగా ఎం.హనుమంతరెడ్డిని ఎన్నుకున్నారు. నూతన కమిటీకి డీసీసీబీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, డీసీఎంస్ చైర్మన్ నెట్టం వెంకటేష్, సీఐటియూ జిల్లా అధ్యక్షుడు నాగేంద్రకుమార్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. -
భళా బసవన్న
● 98 వరి ధాన్యం బస్తాలను ఒక్కటిన్నర కిలోమీటర్ లాగిన వృషభం బొమ్మనహాళ్: మండలంలోని కల్లుదేవనహళ్లి గ్రామానికి చెందిన రైతు వన్నూరుస్వామి వృషభం 98 వరి ధాన్యం బస్తాలను ఒక్కటిన్నర కిలోమీటర్ లాగి భళా అనిపించుకుంది. 98 వరి ధాన్యం బస్తాలు (ఒక్కో బస్తా 52 కేజీలు) 8 ఎడ్ల బండ్లలో నింపి ఒకదానికొకటి జత చేశారు. ముందుభాగంలోని బండికి వన్నూరుస్వామికి చెందిన వృషభాన్ని కట్టి ముందుకు పోనివ్వగా.. ఎడ్ల బండ్లను ఒకటిన్నర కిలోమీటర్ మేర ఎద్దు లాగడం గమనార్హం. ఈ సందర్భంగా అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలు వృషభ ‘రాజసాన్ని’ చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. మరో పక్కన ఉండే మనుషులు మారుతున్నా వృషభం మాత్రం అలాగే ముందుకు సాగడం చూసి కేరింతలు, ఈలల వేస్తూ జేజేలు పలికారు. అనంతరం వృషభానికి పూలమాలు వేసి గ్రామంలో ఘనంగా ఊరేగించారు. -
సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుందాం
రాయదుర్గంటౌన్: హిందూ ధర్మం గొప్పతనం, సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అఖిలభారత ధర్మజాగరణ ప్రముఖ్ శ్యాంకుమార్, ఉరవకొండ గవిమఠం పీఠాధిపతి శ్రీకరిబసవరాజేంద్ర మహాస్వామి అన్నారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణంలో శనివారం సాయంత్రం హిందూ ధర్మ సమ్మేళన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వారు మాట్లాడుతూ.. ప్రపంచంలో అన్ని ధర్మాల కన్నా ముందు హిందూ ధర్మం పుట్టిందన్నారు. హిందువులు ధర్మ కర్తవ్యం తీసుకోవాలని, ధర్మ యుద్ధం చేసే సమయం ఆసన్నమైందన్నారు. దేశ స్వాతంత్య్రం సమయంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలతో విలువైన భూభాగాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ఆక్రమిత కశ్మీర్ ఉగ్రవాదులకు నిలయంగా మారడానికి కాంగ్రెస్ కారణమన్నారు. వందేళ్లుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో స్వయం సేవకులు దేశభక్తితో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దేశంలో మతమార్పిడులు ఆపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పొరాళ్ల శిల్ప, మాజీ మున్సిపల్ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ గౌని ఉపేంద్రరెడ్డి, హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ అధ్యక్షుడు బీసా శ్రీనివాసులు, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు ‘అనంత’లో సున్నీ కాన్ఫరెన్సు
అనంతపురం కల్చరల్: నగరంలో రెండో రోడ్డులోని బహువుద్దీన్ మసీదు వేదికగా ఆదివారం సున్నీ కాన్ఫరెన్సు జరగనుంది. తెహరికె ఫైజానే ఉమర్ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాన్ఫరెన్స్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. మహ్మద్ ప్రవక్త (స) కేశదర్శనం, ప్రవక్త ధరించిన అరుదైన దుస్తులు, ఇతర వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. సున్నీ కాన్ఫరెన్స్కు వివిధ రాష్ట్రాల నుంచి పేరుగాంచిన మత పెద్దలు హాజరై ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తారు. శనివారం సాయంత్రం మసీదు వద్ద నిర్వాహకులు వివరాలను వెల్లడించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారి సౌకర్యార్థం రాత్రి భోజన సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. మహిళలకు ప్రత్యేకంగా పరదా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తెహరిక్ అధ్యక్షుడు హసన్రాజా, బహువుద్దీన్ మసీదు ముతవల్లి ఫరీదుద్దీన్, పర్వీస్, షబ్బీర్ అహమద్, అబ్దుల్ సమీ, క్విజాన్, అర్వాజ్ తదితరులు పాల్గొన్నారు. -
బధిర ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
అనంతపురం అర్బన్: ఏపీ బధిర ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. శనివారం స్థానిక సంఘం జిల్లా బ్రాంచ్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యదర్శి డి.చంద్రమోహన్ వ్యవహరించారు. కార్యక్రమాన్ని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, బధిర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కుమార్ పర్యవేక్షించారు. నూతన కార్యవర్గం ఇలా.. ఏపీ బధిర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎస్.నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా పి.హెచ్.శ్రీరాములు ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా జి.సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎం.గోవింద కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.మోహన్బాబు, సంయుక్త కార్యదర్శిగా జి.దుష్యంత్, కోశాధికారిగా సి.కుళ్లాయిస్వామి, మహిళ కార్యదర్శిగా ఎ.అక్మమ్మ, కార్యనిర్వాహక సభ్యులుగా జి. మహబూబ్బాషా, జి.శ్రీనాథ్రెడ్డి, ఎం.రాజశేఖర్రెడ్డి ఎన్నికయ్యారు. -
చెరువు మట్టి.. కొల్లగొట్టి
రాప్తాడురూరల్: రాప్తాడు మండల పరిధిలోని హంపాపురం చెరువులో మట్టి (జీడ)పై కన్నేశాడు అదే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు. సహజవనరును ఇక్కడి నుంచి అనంతపురం నగరం చుట్టుపక్కల ఉన్న ఇటుక పెల్లల తయారీ కేంద్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీతో అంటకాగుతున్న ఈ వ్యక్తి చెరువు జీడను అక్రమంగా తరలిస్తుండడంపై రైతులు, గ్రామస్తులతో పాటు గ్రామంలోని టీడీపీకే చెందిన వారు సైతం మండిపడుతుండడం గమనార్హం. 24 గంటలూ తవ్వుడే.. తవ్వుడు.. ప్రారంభంలో జేసీబీతో చెరువులో జీడను తవ్విన సదరు నాయకుడు...ఇప్పుడు ఏకంగా రెండు ఇటాచీలు పెట్టి మరీ తోడేస్తున్నాడు. టిప్పర్లతో 24 గంటలూ తరలిస్తున్నాడు. ఒక్కో ట్రిప్పు రూ. 10 వేల దాకా ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ లెక్కన రోజూ లక్షలాది రూపాయలు అప్పనంగా దోచుకుంటున్నాడు. ఆందోళనలో రైతులు, గ్రామస్తులు.. చోటా నేత నిర్వాకం కారణంగా చెరువులో పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో రైతులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చెరువులో మట్టిని తరలించడంతో సమీపంలో సాగు చేసిన చీనీచెట్లలో జవుకు పెరిగి ౖరైతులకు తీవ్ర నష్టం కల్గిస్తోందని వాపోతున్నారు. చెరువులో గుంతలు ఏర్పడి కట్టనాణ్యత సైతం లోపిస్తోందని, పొరబాటున తెగితేఎస్సీ కాలనీపై తీవ్ర ప్రభావం చూపుతుందని దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేష్టలుడిగి చూస్తున్న అధికారులు.. రోజూ చెరువు జీడ లోడుతో టిప్పర్లు అనంతపురం వెళ్తున్నా అధికారులు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదు. విజిలెన్స్, పోలీసు, రెవెన్యూ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు తప్పితే కనీస చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. 24 గంటలూ రాప్తాడు పోలీస్స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం సమీపం నుంచే ఈ వాహనాలు వెళ్తుండడం విశేషం. విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు ఫోన్లు చేసినా స్పందించడం లేదని చెబుతున్నారు. కలెక్టర్ అయినా స్పందించి హంపాపురం చెరువు నుంచి జీడ తరలించ కుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.‘తమ్ముడి’ బరితెగింపు హంపాపురం చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు నిత్యం రూ.లక్ష విలువైన మట్టి ఇటుక బట్టీలకు విక్రయం ‘పచ్చ’ నాయకుడి నిర్వాకంతో చెరువులో పెద్దపెద్ద గుంతలు చేష్టలుడిగి చూస్తున్న విజిలెన్స్, పోలీసు, రెవెన్యూ అధికారులు -
మళ్లీ ఇంటింటికీ వెళ్లండి!
● సచివాలయ ఉద్యోగులపై మరో సర్వే భారం ● నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం అనంతపురం అర్బన్: సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. ఒక రకంగా వారిని చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. పది మంది చేయాల్సిన పనిని ఒకరికి అప్పగించి తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడికి గురిచేస్తోంది. ఇప్పటికే 14 సర్వేలు, బీఎల్ఓ విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ ఉద్యోగులపై మరో సర్వే భారం మోపింది. ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర కుటుంబ, ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ సంబంధ సమాచారం సేకరించాల్సి ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలోని ప్రతి సభ్యుని వివరాలను సేకరించాలి. ఈనెల 15న సర్వే ప్రారంభించి జనవరి 12కు పూర్తి చేయాలి. సర్వేలో సేకరించాల్సిన సమాచారం.. ● వందశాతం ఈ–కేవైపీ తప్పనిసరి. ప్రతి వ్యక్తి ఆధార్ ద్వారా వెరిఫై చేయాలి. ● మొబైల్ యాప్ సమాచారాన్ని డిజిటల్గా నమోదు చేయాలి. ● వ్యక్తిగత డేటా, కుటుంబస్థాయి డేటా తప్పనిసరిగా సేకరించాలి. ● పేరు, లింగ (జెండర్), పుట్టినతేదీ, ఆధార్ సేకరణ తప్పనిసరి. ● మొబైల్ నంబరు– ఒక నంబరు ఒక వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. ● ప్రస్తుత చిరునామాను డాక్యుమెంట్ ఆధారంతో చెక్ చేయాలి. ● నైపుణ్యాలు, వృత్తి, ఆదాయానికి సంబంధించి సెల్ఫ్ రిపోర్ట్, డాక్యు మెంట్ల ద్వారా నిర్ధారణ చేసుకోవాలి. ● ఇంటి వివరాలు– నీటి సరఫరా, ఎల్పీజీ, విద్యుత్, టాయిలెట్, రూఫ్ వంటివాటిని సర్వేయర్ వెరిఫై చేయాలి. ● ఇంటి యజమాని (హౌజ్హోల్డ్) కలిగి ఉన్న ఆస్తులు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వ్యవసాయ సామగ్రి, పశువులు, తదితర వివరాల నమోదు. సజావుగా నవోదయ ప్రవేశ పరీక్ష అనంతపురం సిటీ : జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష శనివారం ఉమ్మడి జిల్లాలో సజావుగా జరిగింది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం 29 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 6,634 మంది విద్యార్థులకు గాను 3,899 మంది హాజరయ్యారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో జిల్లా జట్ల తడబాటువీరవాసరం: పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం ఎంఆర్కే జెడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్ బాల్ పోటీల్లో జిల్లా బాల, బాలికల జట్లు తడబడ్డాయి. జిల్లా బాలికల జట్టు నెల్లూరు జట్టుపై 11–01 తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరినా.. అక్కడ తూర్పుగోదావరి జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. ఇక.. బాలురకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్లో జిల్లా జట్టు పరాజయం పాలైంది. -
వయ్యారం.. మయూరం
దట్టమైన పొగ మంచు.. ఎటుచూసినా కొండలు, గుట్టలు.. ఇలా ప్రకృతి పంచిన అందాలు.. ఇలాంటి ప్రాంతంలో మయూరాలు ప్రకృతికి మరింత సోయగాలు అద్దుతున్నాయి. తెల్లవారు జామున మయూరాల కూతతో పరిసర గ్రామాల ప్రజలు నిద్ర నుంచి మేలుకుంటున్నారనడం అతిశయోక్తి కాదేమో. మయూరాలు పచ్చని పొలాల్లో ఆహారాన్ని అన్వేషిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ దృశ్యాలు అనంతపురం శివారులోని నాగి రెడ్డిపల్లి, ఎ.నారాయణపురం గ్రామాల ప్రజలకు నిత్యకృత్యంగా మారాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
పేదలకు పెద్ద కష్టం
అనంతపురం టౌన్: పెద్ద దిక్కును కోల్పోయిన పేద కుటుంబానికి అండగా ఉండే బీమా పథకానికి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. 18 నెలలు పూర్తి కావస్తున్నా బీమా పథకం అమలుపై ఎటువంటి ప్రకటనా చేయకపోవడంతో పేదలు మండిపడుతున్నారు. రేషన్కార్డు కలిగిన కుటుంబ పెద్ద ఆకస్మిక, సహజ మరణం పొందినపుడు ఆ కుటుంబం రోడ్డునపడకుండా ఆర్థిక ఉపశమనం కలిగించడం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్ బీమా’ పథకం ప్రవేశపెట్టింది. కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.5 లక్షలు, శాశ్వత వికలాంగులుగా మారితే రూ.5 లక్షలు, 70 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.3 లక్షలు అందించే విధంగా పథక రూపకల్పన చేసింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ఆధ్వర్యంలో బీమా పథకం అమలు చేసేవారు. ఇందు కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూంతోపాటు 24 గంటలూ పని చేసే విధంగా అధికారులను కేటాయించారు. ఫోన్ ద్వారా సమాచారం అందిన వెంటనే వివరాలు నమోదు చేసుకొని, దగ్గరలోని ఏపీఎంలకు, యానిమేటర్లకు విషయం తెలిపి మానిటరింగ్ చేసి సకాలంలో బీమా మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేసేలా చర్యలు తీసుకునేవారు. ఇందు కోసం గత ప్రభుత్వం ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించింది. పేదల సంక్షేమం గాలికి.. చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న బీమా పథకం అమలులో తాత్సారం చేస్తోంది. జిల్లాలో రేషన్కార్డులు కలిగిన కుటుంబాలు 6.50 లక్షలు ఉన్నాయి. గత ఏడాది (2024–25) జరిగిన వివిధ ప్రమాదాల్లో 540 మంది చనిపోయారు. ఈ ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఇప్పటి వరకు 464 మంది మరణించారు. ఇక ఏటా 1200 నుంచి 1500 సహజ మరణాలు నమోదవుతున్నాయి. వందలాది మంది ప్రమాదాల కారణంగా వైకల్యం బారినపడి మంచానపడ్డారు. బీమా పథకం లేకపోవడంతో ఆయా కుటుంబాల వారు రోడ్డునపడ్డారు. అయినా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం స్పందించి బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. చంద్రన్న బీమా.. ధీమా ఇచ్చేదెప్పుడు? తాము అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా పథకం అమలు చేస్తామని ‘ప్రజాగళం – ఉమ్మడిమ మేనిఫెస్టో–2024’లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. గతం కన్నా మిన్నగా ఆర్థికప్రయోజనం చేకూరుస్తామని గొప్పలు చెప్పారు. సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని పొందుపరిచారు. అయితే ఇంతవరకూ చంద్రన్న బీమా పథకం గురించి మాట్లాడే నాథులే లేరు. ఏడాదిన్నర గడిచినా అతీగతీ లేకపోవడంతో ఈ మధ్యలో ఎంతోమంది పెద్దలను కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. బీమా అమలు చేసి ఉంటే కాసింత ఉపశమనం కలిగేదని అంటున్నారు. బీమా పథకానికి మంగళం! రేషన్కార్డుదారులకు వర్తించని బీమా కుటుంబ పెద్దను కోల్పోతే సభ్యులు రోడ్డుపాలేనా? ఏడాదిన్నర అవుతున్నా చంద్రన్న బీమాపై స్పష్టత ఇవ్వని సర్కార్ బీమా సిబ్బందిని ఇతర విభాగాలకు సర్దుబాటు చేసిన వైనం ఇంకా ప్రకటన రాలేదు బీమా పథకం అమలు కోసం ఇదివరకు డీఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎనిమిది మంది సిబ్బంది పని చేసేవారు. 24 గంటలూ పని చేసే విధంగా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి బీమాకు సంబంధించి ప్రకటన ఏదీ రాలేదు. అందుకని సిబ్బందిని ఇతర విభాగాలకు మళ్లించాం. బీమా పథకం అమలుపై ఏదైనా ప్రకటన వస్తే సిబ్బందిని తిరిగి బీమా విభాగంలో విధుల కోసం కేటాయిస్తాం. – శైలజ, పీడీ, డీఆర్డీఏ -
ఇంతలా అంగలాపిస్తే ఎలా..?
నేను, నా భర్త సిరాజ్ ఉంటున్నాం. ఆయన ఏ పనీ చేయలేని పరిస్థితి. 12 ఏళ్లుగా సర్వజనాస్పత్రిలో పని చేస్తున్నా. ఇక్కడ వచ్చే డబ్బులతోనే కుటుంబం గడుస్తుంది. ఈ వయసులో ఉద్యోగం లేదని, పనికి రావొద్దని చెబుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేశాం. ఇప్పుడు ఉన్నఫళంగా వెళ్లిపొమ్మంటే ఏం చేయాలి. ఇంత అంగలాపిస్తే ఎలా? ఏజెన్సీ మేనేజర్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు మాతోటి స్వీపర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీళ్లు మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు? – షమీమ్, పారిశుధ్య కార్మికురాలు -
రాజీపడితే ఓడినట్లు కాదు.. గెలిచినట్లే
అనంతపురం: రాజీపడితే ఓడినట్లు కాదు.. గెలిచినట్లే అని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ.భీమారావు అన్నారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లోనూ లోక్ అదాలత్ నిర్వహించారు. అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ను ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు ప్రారంభించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో 9 బెంచులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ తీర్పుల్లో ఎటువంటి అప్పీలుకూ అవకాశం ఉండదన్నారు. రెగ్యులర్ కోర్టులలో కేసులు పరిష్కారమైనప్పుడు ఆ కేసుల్లో ఎవరో ఒక్కరే గెలిచే అవకాశం ఉంటుందన్నారు. లోక్ అదాలత్లో రాజీ మార్గమే రాజ మార్గమని, ఇందులో ఇద్దరూ విజేతలేనని స్పష్టం చేశారు. మోటారు వాహనాల ప్రమాద కేసులు 54 పరిష్కారం కాగా.. మొత్తం రూ.97.45 లక్షలు, ప్రి లిటిగేషన్ కేసులు మొత్తం 41 పరిష్కారం కాగా, రూ.92.88 లక్షలు, సివిల్ దావాల్లో పరిష్కారం అయిన మొత్తం రూ.2.72 కోట్లు, ఎన్ఐ యాక్టులో రూ.81.36 లక్షల పరిహారం అందించినట్లు పేర్కొన్నారు. మొత్తం 15, 574 కేసులకు గాను రూ.7.43 కోట్ల పరిహారం దక్కింది. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి సత్యవాణి పాల్గొన్నారు. -
జీవనాధారం పోతే ఏం కావాలి?
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 30 ఏళ్లుగా పని చేస్తున్నాం. పారిశుధ్య పనులు చేస్తూ ఆరోగ్యం కూడా దెబ్బతినింది. ఇప్పటికే నా భర్త కృష్ణా నాయక్, బిడ్డ కవిత, అల్లుడు నాగరాజు చనిపోయారు. మనవడు, మనవరాలు గంభీర్ (డిగ్రీ), గంగోత్రి (9వ తరగతి) ఆలనా, పాలన నేనే చూసుకోవాలి. ఇప్పుడేమో ఏజెన్సీ వాళ్లు పని నుంచి తొలగిస్తామని చెబుతున్నారు. నాకుటుంబానికి ఆధారమంతా ఇదే సార్. వచ్చే డబ్బులతోనే వారిని చదివించుకుంటున్నా. ఇప్పటి వరకు ఐదారు ఏజెన్సీలు వచ్చాయి. పద్మావతి ఏజెన్సీ అంత ఘోరంగా ఎవరూ సతాయించడం లేదు. – కాంతమ్మ, పారిశుధ్య కార్మికురాలు -
కార్మికురాలికి పరామర్శ
ఏజెన్సీ మేనేజర్లు దురుసుగా మాట్లాడటంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న పారిశుధ్య కార్మికురాలు పద్మావతిని శనివారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు పరామర్శించారు. కార్మికులందరికీ యూనియన్ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, కార్యదర్శి బి.రాజశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి, జిల్లా కార్యదర్శి అనిల్కుమార్గౌడ్, నగర కార్యదర్శి రామాంజి రాయల్, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ హుస్సేన్, కాకర్ల శ్రీనివాస్రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్ రాయల్, నగర కార్యదర్శి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు వైఎస్సార్సీపీ భారీ బైక్ ర్యాలీ
● విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత పిలుపు అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా ఈ నెల 15న అనంతపురంలో నిర్వహించనున్న భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం పది గంటలకు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి ఫ్లై ఓవర్, టవర్క్లాక్, సప్తగిరి సర్కిల్, ఐరన్ బ్రిడ్జి, వన్టౌన్ పోలీస్ స్టేషన్, పాతూరు గాంధీ విగ్రహం, చెరువు కట్ట మీదుగా బుక్కరాయసముద్రంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుందన్నారు. ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలి రావాలని కోరారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లాలోని అనంతపురం అర్బన్, శింగనమల, ఉరవకొండ, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, రాప్తాడు నియోజకవర్గాల్లో 4,55,840 సంతకాలు సేకరించినట్లు చెప్పారు. ఈ నెల 18న పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాయకత్వంలో గవర్నర్కు కోటి సంతకాల ప్రతులు అందజేస్తామని తెలిపారు. రేపు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’ అనంతపురం అర్బన్ : కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ‘ప్రజాసమస్యల పరిష్కారవేదిక’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఆ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దాని రసీదును వెంట తీసుకురావాలన్నారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekosam.ap.gov.in ద్వారానూ సమర్పించవచ్చని పేర్కొన్నారు. ‘హలో అవుట్ సోర్సింగ్’కు స్పందన అనంతపురం అగ్రికల్చర్: అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఏపీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఫోన్ ఇన్ ద్వారా గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. నగరంలోని జేఏసీ కార్యాలయంలో ఎం.ఈశ్వరయ్య, వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఫోన్ ద్వారా సమస్యలను తెలియజేశారు. పని ఒత్తిడి అధికంగా ఉందని, సకాలంలో జీతాలు రావడం లేదని, పండుగలు, పర్వదినాల్లో పనిచేయాల్సి వస్తోందని పలువురు సిబ్బంది వాపోయారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. -
పెన్నోబులేసునికి.. రాజకీయ గ్రహణం
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామిఆలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కార్యనిర్వహణాధికారి (ఈఓ) దీర్ఘకాలిక సెలవుల కారణంగా ఆలయ నిర్వహణ – మాన్యం భూముల రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోయింది. మాన్యం భూములు దక్కించుకున్న అధికార పార్టీ నాయకులు లీజు ఎగ్గొట్టడమే కాకుండా అనధికారికంగా భూములు విక్రయించి సొమ్ము చేసుకుంటూ ఆలయ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉరవకొండ/అనంతపురం కల్చరల్: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తదితర ప్రాంతాల భక్తుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న అనంతపురం జిల్లా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో సాగాల్సిన పాలనా వ్యవహారాలపై చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ నేతల జోక్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) గా ఎవ్వరు వచ్చినా కొద్దిరోజులకే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయ భూముల లీజుల కేటాయింపు–నిధుల ఖర్చు చేయాలంటూ వస్తున్న ఒత్తిళ్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉండే ఆలయంలో ఏమి జరిగినా దిక్కు లేకుండా పోతోంది. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 2,114 ఎకరాల మాన్యం ఉంది. ఇందులో 146 ఎకరాల ఈనామ్ భూమి, 412 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. మిగతా 1,554 ఎకరాలు ఆమిద్యాల, మోపిడి, కోనాపురం, పెద్దముస్టూరు, మూలగిరిపల్లి, రాచెర్ల, చిన్నముసూ్టరు పరిధిలో ఉన్నాయి. ఆలయ మాన్యాలు కొంతమంది అధికార పార్టీ నేతల చేతుల్లో చిక్కుకున్నాయి. సొంత భూములు ఉన్నా సరే నామమాత్రపు కౌలు చెల్లిస్తూ కొన్నేళ్లుగా ఆలయ భూమిని అనుభవిస్తున్నారు. సాధారణంగా వర్షాధారం అయితే ఎకరాకు రూ.6 వేలు, సాగునీటి సౌకర్యం ఉంటే ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలు చెల్లించాల్సి ఉన్నా.. ఇక్కడ నారసింహుడికే నామాలు పెట్టి ఎకరాకు నామమాత్రంగా రూ.500 నుంచి రూ.2,500 ఏడాదికి చెల్లిస్తున్నారు. కౌలుదారుల్లో చాలామంది అనధికారికంగా సబ్లీజుకు ఇచ్చుకున్నారు. కొందరు అధికార పార్టీ నేతలైతే కౌలు భూమి తమ సొంత ఆస్తి అయినట్టు ఇతరులకు విక్రయించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది. 2024 నాటికి సుమారు 1,400 ఎకరాలకు సంబంధించి కౌలు లీజు ముగిసినా నేటికీ ఆలయ భూములకు బహిరంగ వేలం పాటను అధికారులు నిర్వహించలేదు. 20 శాతం మంది మాత్రమే అసలైన కౌలుదారులు సక్రమంగా ఆలయానికి సొమ్ము చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆలయ భూముల టెండర్లు వాయిదా పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు అన్నీ తామై సిండికేట్గా మారి టెండర్లు దక్కించుకోవాలని చూడటంతో గతేడాది ఆగస్టు నుంచి వరుసగా మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఏడాదికి సగటున 20 వేల మంది స్వామివారికి తలనీలాలు సమర్పిస్తుంటారు. 2024–25 ఏడాదికి ఉరవకొండకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు రూ.27 లక్షలకు తలనీలాల సేకరణ హక్కులను దక్కించుకున్నాడు. అయితే ఇందులో రూ.9.5 లక్షలు మాత్రమే సదురు టీడీపీ నాయకుడు ఆలయానికి చెల్లించి, మిగతా సొమ్ము నేటికీ జమ చేయలేదు. ఈ సొమ్ములో కూడా గతంలో ఈఓగా విధులు నిర్వహించిన ఓ అధికారి తన సొంతానికి రూ.3 లక్షలు వాడుకున్నట్లు ఆలయ సిబ్బందే గుసగులాడుకోవడం గమనార్హం. భక్తులు పరమపవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదం పెన్నహోబిలంలో కొంతకాలంగా కనుమరుగైంది. లడ్డూ ప్రసాదం టెండరు ప్రక్రియ ఆగిపోయి చాలా కాలమైంది. అధికార పార్టీ నేతలు – దేవదాయ శాఖ మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో భక్తులకు లడ్డూ ప్రసాదమే లేకుండా చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు కొలువుదీరగానే పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా రమేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. అయితే టీడీపీ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో భరించలేకపోయిన ఆయన దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లారు. దీంతో అప్పటి జిల్లా సహాయ కమిషనర్ (ఏసీ) తిరుమలరెడ్డికి ఆలయ ఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయనకూ అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పలేదు. దీంతో ఆయన కూడా సెలవులోకి వెళ్లిపోయారు. తదుపరి ఈఓ బాధ్యతలు గుంతకల్లుకు చెందిన మల్లికార్జున తీసుకుంటారని ఎండోమెంటు అధికారులు చెప్తున్నా.. ఆయన మాత్రం ముందుకు రాలేదు. ఈ క్రమంలో అనంతపురంలోని చెన్నకేశవస్వామి ఆలయం ఈఓగా ఉన్న సుధారాణికి తాత్కాలికంగా పెన్నహోబిలం ఆలయ బాధ్యతలు అప్పగించారు. పెన్నహోబిలం ఆలయ నూతన పాలక మండలి ఇంకా కొలువుదీరలేదు. అయినా సభ్యులుగా తామే ఉంటామని, మేము చెప్పినట్లుగా మీరు పనిచేయాల్సి ఉంటుందని కొందరు అధికార పార్టీనేతలు ఈఓలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి అయ్యే రూ.5 లక్షల ఖర్చును ఆలయ నిధుల నుంచే వెచ్చించాలని షరుతు విధించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఈ అంశం అధికారులకు ఇబ్బందికరంగా మారింది. చేసేది లేక సెలవుపై వెళ్తున్నారని తెలుస్తోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం పెన్నహోబిలంలో మేం గుర్తించిన సమస్యలను పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ కొన్నాళ్లుగా ఈఓ లేనిమాట నిజమే. సెలవులో ఉన్న తిరుమలరెడ్డి ఈ నెల 19న వస్తారు. అప్పటి వరకు నేను ఇన్చార్జ్గా మాత్రమే కొనసాగుతాను. కొత్త సమస్యలు ఉత్పన్నం కాకుండా మేము కూడా ఎండోమెంటు ఇన్స్పెక్టర్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. – సుధారాణి, పెన్నహోబిలం ఆలయఇన్చార్జ్, దేవదాయ శాఖ ఇన్చార్జ్ ఏసీ


