జనవరి ఒకటి నుంచి రైళ్ల రాకపోకల్లో మార్పు
అనంతపురం సిటీ: అనంతపురం మీదుగా సంచరించే పలు రైళ్ల రాకపోకల వేళలు జనవరి ఒకటి నుంచి మారనున్నాయి. ఈ మేరకు అనంతపురం స్టేషన్ మేనేజర్ అశోక్కుమార్ సోమవారం రాత్రి వెల్లడించారు. కర్ణాటకలోని కలబురిగి నుంచి బెంగళూరుకు వెళ్లే రైలు (22231) ఇక నుంచి శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు అనంతపురానికి ఉదయం 10.03 గంటలకు అనంతపురానికి చేరుకుని 10.05 గంటలకు బయలుదేరుతుంది. బెంగళూరు నుంచి కలబురిగి వెళ్లే ఎక్స్ప్రెస్ (22232) అనంతపురానికి 5.33కు వచ్చి 5.35 గంటలకు బయలుదేరుతుంది. ఽయశ్వంత్పూర్–మచిలీపట్నం మధ్య నడిచే రైలు (17212) అనంతపురానికి సాయంత్రం 4.33 గంటలకు వచ్చి 4.44 గంటలకు బయలుదేరుతుంది. బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ (18464) సాయంత్రం 6.28 గంటలకు అనంతపురానికి వచ్చి 6.30 గంటలకు వెళ్లిపోతుంది.
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం జనవరి 10, 17 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లం బయలుదేరే రైలు (07127) అనంతపురానికి ఆయా తేదీల్లో సాయంత్రం 7.53 గంటలకు వచ్చి 7.55 గంటలకు వెళ్లిపోతాయి. ఈ రెండు రైళ్లు అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి, పాకాల, కాట్పాడి మీదుగా కొల్లం జంక్షన్కు చేరుకుంటాయి.


