జీవనాధారం పోతే ఏం కావాలి?
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 30 ఏళ్లుగా పని చేస్తున్నాం. పారిశుధ్య పనులు చేస్తూ ఆరోగ్యం కూడా దెబ్బతినింది. ఇప్పటికే నా భర్త కృష్ణా నాయక్, బిడ్డ కవిత, అల్లుడు నాగరాజు చనిపోయారు. మనవడు, మనవరాలు గంభీర్ (డిగ్రీ), గంగోత్రి (9వ తరగతి) ఆలనా, పాలన నేనే చూసుకోవాలి. ఇప్పుడేమో ఏజెన్సీ వాళ్లు పని నుంచి తొలగిస్తామని చెబుతున్నారు. నాకుటుంబానికి ఆధారమంతా ఇదే సార్. వచ్చే డబ్బులతోనే వారిని చదివించుకుంటున్నా. ఇప్పటి వరకు ఐదారు ఏజెన్సీలు వచ్చాయి. పద్మావతి ఏజెన్సీ అంత ఘోరంగా ఎవరూ సతాయించడం లేదు.
– కాంతమ్మ, పారిశుధ్య కార్మికురాలు


