breaking news
Telangana
-
అసెంబ్లీలో పాడి వేడి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీపీ గౌస్ ఆలం, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మధ్య వార్ ముదురుతోంది. ఇంతకాలం జిల్లాకు పరిమితమైన ఈ గొడవకు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మారింది. సీపీ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి ఆరోపణల డోసు పెంచారు. ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో సీపీ ఆయన మిత్రులతో కలిసి ఫైరింగ్ సాధన చేయడంతోనే బోనాలపల్లెలో అమృతమ్మ అనే వృద్ధురాలికి తూటా గాయమైందని ఆరోపించారు. కరీంనగర్ కమిషనరేట్కు చెందిన పలువురు కానిస్టేబుళ్లు, వాహనాలను హైదరాబాద్లో సీపీ ఇతర పనులకు మోహరిస్తున్నారని సభలో పేర్కొన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించాలని మంత్రి శ్రీధర్బాబుతోపాటు, మంత్రులు పొన్నం, అడ్లూరికి విజ్ఞప్తి చేశారు. పాడి ఆరోపణలపై స్పందించిన మంత్రి శ్రీధర్బాబు ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.దొంగ ఆఫీసర్లు.. డ్రగ్స్ తీసుకున్నారా? అంటూ..సభ అనంతరం పాడి కౌశిక్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో కాల్పులు జరిగిన సమయంలో సీపీ గౌస్ ఆలం లీవ్లో ఉన్నట్లుగా పోలీసులు విడుదల చేసిన ప్రకటనను తప్పుబట్టారు. అదంతా డీటీపీ చేశారంటూ కొట్టిపారేశారు. ముందే రాసుకున్న లీవ్ లెటర్పై పెన్నుతో డేటు వేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి దొంగ పోలీసాఫీసర్లకు మద్దతుగా నిలవడమేంటని ఐపీఎస్ ఆఫీసర్లను ప్రశ్నించారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట రూరల్ సీఐ, హుజురాబాద్ ఏసీపీలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. తన ఆరోపణలపై విచారణ జరిపించి తప్పు మాట్లాడితే.. ముక్కు భూమికి రాస్తానంటూ పునరుద్ఘాటించారు. కరీంనగర్ పోలీసు డిపార్ట్మెంట్ అంతా ఆలంకు వ్యతిరేకంగా ఉన్నారని, అందువల్లే తనకు సీపీ గురించిన సమాచారం అంతా అందుతోందని వెల్లడించారు. తన మీద సీఐడీ కేసులు పెట్టడం కాదని, చేతనైతే సీపీ మీద విచారణకు సిట్ వేయాలని కోరారు.ఈనెల 30వ తేదీ వరకే డెడ్లైన్సీపీ పవిత్ర రంజాన్మాసంలో జల్సాలు చేసుకున్నారని, ఆ పార్టీలో పోలీసులు ఎగిరిన తీరు చూస్తుంటే.. పీకల్లోతు మందు తాగారా, డ్రగ్స్, గంజాయి ఉన్నాయా అని ప్రశ్నించారు. కరీంనగర్ యువతకు పోలీసులు ఏం సందేశం ఇస్తున్నారు అని నిలదీశారు. వెంటనే డీజీపీ, మంత్రి శ్రీధర్బాబు చర్యలు తీసుకోవాలని, 30వ తేదీలోగా చర్యలు తీసుకోవాలని లేకపోతే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు. ఇటీవల ప్రెస్మీట్లో సీపీకి సంబంధించిన ఆధారాలు బయటపెడతానని చెప్పిన పాడి అన్నంత పనిచేశారు. 30వ తేదీలోగా సీపీపై చర్యలు లేకపోతే మరిన్ని విషయాలు వెల్లడిస్తానని చెబుతుండటంతో.. పాడి ఆరోపణలపై ఇటు డిపార్ట్మెంట్, అటు రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. -
మిగులు పోస్టులెన్ని?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ‘కొలువుల జాతర’ద్వారా చేపట్టిన నియామక పత్రాల పంపిణీ అనంతర పరిస్థితులపై సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) పరిశీలన చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండేళ్ల కాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్–1 నుంచి గ్రూప్–4 వరకు, టీచర్లు, లెక్చరర్లు, పోలీస్ విభాగాల్లో కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు, మెడికల్ ఆఫీసర్, నర్సు లు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్... ఇలా దాదాపు 70 వేల ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు నిర్వహించి అర్హులకు నియామకపత్రాలను జారీ చేసి నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో మెజార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామకపత్రాలు పంపిణీ చేశారు. పత్రాలు అందుకున్న వారిలో ఎంతమంది ఉద్యోగాల్లో చేరారు? ఎంతమంది ఉద్యోగాలను వద్దనుకున్నారు? అందుకు ప్రధాన కారణాలను గుర్తించేందుకు జీఏడీ పరిశీలన ముమ్మరం చేసింది. ఇలా ఇవ్వండి... ఉద్యోగ ఖాళీల భర్తీకి వివిధ నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ప్రధానంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు, తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు, తెలంగాణ వైద్య, ఆరోగ్య సర్వీసుల నియామకాల బోర్డు ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. అర్హత పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు అర్హుల జాబితాలను సమర్పించడంతో నియామక పత్రాలను ప్రభుత్వం జారీ చేసింది. గడువులోగా రిపోర్టు చేయకుంటే సదరు ఉద్యోగావకాశాన్ని రద్దు చేయనున్నట్లు ఆయా అభ్యర్థులకు స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించిన జీఏడీ... ప్రత్యేక ఫార్మాట్ రూపొందించి ఉద్యోగాల్లో చేరిన, చేరని వారి వివరాలను ఆయా శాఖల నుంచి సేకరిస్తోంది. ఉద్యోగ కేటగిరీ, అర్హత సాధించిన అభ్యర్థి హాల్టికెట్ నంబర్, పేరు, జిల్లా/జోన్/మల్టీజోన్ కేటగిరీ, ఉద్యోగంలో చేరిన తేదీ, డిలీటెడ్ వేకెన్సీ తదితర వివరాలున్నాయి. ఉద్యోగంలో చేరకుంటే అందుకు గల కారణాన్నీ వివరించాలని సూచించింది. కొందరు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అర్హత సాధించడంతో వారంతా మెరుగైన పోస్టును ఎంచుకున్నారు. ఇలాంటి వారి వివరాలను కూడా స్పష్టంగా ఇవ్వాలని చెప్పింది. ఈ సమాచారాన్ని అందించేందుకు ఆయా శాఖలు తర్జనభర్జన పడుతున్నాయి. ఖాళీలపై స్పష్టత ఎంతమంది కొలువుల్లో చేరారో తెలుసుకునేందుకు జీఏడీ ఒకవైపు చర్యలు చేపట్టగా... మరోవైపు శాఖల వారీగా ఖాళీల వివరాలను సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో రెండు అంశాలకు వేర్వేరుగా సమాచారాన్ని ఆయా శాఖలు సిద్ధం చేశాయి. ఇటీవల జీఏడీ ఆధ్వర్యంలో ఉద్యోగాల్లో చేరికలకు సంబంధించి సమీక్షలు కూడా జరిగాయి. నియామకపత్రాలు అందించిన వాటిలో అన్ని కేటగిరీల్లో రిపోర్టింగ్ గడువు ముగిసింది. వచ్చే సోమవారం కల్లా ఆయా శాఖలు వివరాలను అందించాల్సి ఉంటుంది. గ్రూప్–1 కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ గతేడాది పూర్తయింది. ప్రభుత్వం పలు ఆటంకాలను అధిగమించి ఒకేసారి 563 ఉద్యోగాలను భర్తీ చేసింది. తొలి నోటిఫికేషన్ కావడం... అందులోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం టీజీపీఎస్సీ పరపతికి గీటురాయిగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా భర్తీ చేసిన గ్రూప్–1 ఉద్యోగాల్లో ఎంతమంది అభ్యర్థులు చేరారనే అంశంపై కమిషన్ కూడా ఆయా శాఖలకు ప్రత్యేక ఫార్మాట్ పంపి సమాచారాన్ని సేకరిస్తోంది. -
పార్టీలో మూడు రకాల మత్తు పదార్థాలు
మొయినాబాద్/ శంషాబాద్ రూరల్: సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. డ్రగ్స్ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్ బృందం విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే బుధవారం పలు కీలక విషయాలను సేకరించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలోని అజీజ్నగర్లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్ వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కొకైన్, ఎండీఎంఏ, మెథోఇథిఫిన్ వినియోగించినట్లు తెలుసుకున్నారు. కౌశిక్ రవి సిమ్లాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి వద్ద రూ.15 వేలకు కొకైన్ కొనుగోలు చేసినట్లు పట్టుబడిన రోజే పోలీసులకు చెప్పాడు. సిట్ విచారణలో భాగంగా ఎండీఎంఏ, మెథోఇథిఫిన్ డ్రగ్స్ను సాఫ్ట్వేర్ ఉద్యోగి అభిషేక్ నుంచి రోహిత్రెడ్డి డ్రైవర్ శరత్ హైదరాబాద్లోని అప్పా జంక్షన్ వద్ద కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అభిషేక్ కొన్నేళ్లుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు, గతంలో అతనిపై ఓ కేసు నమోదైనట్లు సిట్ అధికారులు కనుగొన్నారు. కస్టడీపై తీర్పు రిజర్వు పార్టీలో రోహిత్రెడ్డి రెండు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అధిక కిక్కుకోసం ఖరీదైన మద్యంలో కొకైన్, మెథోఇథిఫిన్ కలుపుకొన్నారని, ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నారని విచారణలో తేలింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిన నిందితులను మంగళవారం విచారించిన సిట్ అధికారులు డ్రగ్స్ మూలాలపైనే దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పార్టీలో మూడు రకాల డ్రగ్స్ వాడిన విషయం తెలిసింది. జ్యుడీíÙయల్ రిమాండ్లో ఉన్న రోహిత్రెడ్డి, రితే‹Ùరెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి తీసుకుంటే అసలు విషయాలు బయటకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. వీరిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇరువురి వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 20కి రిజర్వ్ చేసింది. సీపీ సమావేశం: డ్రగ్స్ కేసు విచారణ చేపడుతున్న సిట్ అధికారుల బృందంతో ఫ్యూచర్ సిటీ కమిషనర్ సు«దీర్బాబు సమావేశమయ్యారు. శంషాబాద్ పోలీస్స్టేషన్లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులు డ్రగ్స్ పార్టీ నిర్వహించడానికి గల కారణాలను విచారణలో రాబట్టాలని సీపీ సూచించినట్లు తెలిసింది. -
త్రిముఖ కోణం!
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంచనాలు త్రిముఖ కోణంలో ఖరారవుతున్నాయి. ఎప్పటిలాగే అభివృద్ధి, సంక్షేమంతో పాటు విజన్–2034 (ఒక ట్రిలియన్ ఎకానమీ) లక్ష్య సాధన దిశగా 2026–27 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు సర్కారు తుదిరూపు ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ప్రభుత్వ ఆలోచనలు, ప్రణాళికలను విశదీకరిస్తూ ఆయా ప్రణాళికల అమలుకు తగినట్టుగా అంచనాలను రూపొందించినట్లు సమాచారం. బడ్జెట్ను శుక్రవారం సభలో ప్రవేశపెట్టనుండగా.. బుధవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ లాబీల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలు, శాఖల వారీగా కేటాయింపులు, కొత్త పథకాల ప్రకటన, తుది అంచనాల ఖరారుపై కసరత్తు జరిగింది. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అసెంబ్లీలోని ఆయన చాంబర్లో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ అధికారులు ఆయనతో సమావేశమయ్యారు. బడ్జెట్కు సంబంధించిన ప్రతిపాదనలు, పథకాలు, కేటాయింపులను ఆయన దృష్టికి తీసుకెళ్లగా పలుసూచనలు చేసినట్టు సమాచారం. ఈ సూచనల మేరకు 2026–27 బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిమెరుగులు దిద్దే పనిలో ఆర్థిక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. పాత వాటితో పాటు కొత్తగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటికే అమల్లో ఉన్న సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగిస్తూనే కొత్తగా ఆరు పథకాలను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యంగ్ ఇండియా కిట్స్ పేరుతో సంక్షేమ హాస్టళ్ల నుంచి ఇంటిగ్రేటెడ్ గురుకులాల వరకు అన్ని స్థాయిల్లో చదువుకునే విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వారికి అవసరమయ్యే అన్ని వస్తువులతో కూడిన కిట్లను అందజేసే పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తారని సమాచారం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యార్థినులకు ఈవీ స్కూటర్ల పంపిణీ, పాడి రైతుకు సబ్సిడీపై పశువుల పంపిణీ ఆరు పథకాల్లో భాగంగా ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద మహిళలు, రైతులు, యువత, చిన్నారుల సంక్షేమం, వైద్యరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, జీవన ప్రమాణాలు, ఆర్థిక సాధికారత ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్ రూపుదిద్దుకుంటోందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. -
మూసీ మంటలు.. కేటీఆర్ వర్సెస్ శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు అంశం బుధవారం శాసనసభను కుదిపేసింది. బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్, మంత్రి శ్రీధర్బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, సు«దీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డిలు మూసీ పునరుజ్జీవం అంశంపై ప్రశ్నించారు. దాని డీపీఆర్ సిద్ధమైందా, ప్రాజెక్టు వ్యయం అంచనా ఎంత, నిర్వాసితుల సంఖ్య, వారి పునరావాస చర్యల గురించి ప్రశ్నించారు. దీనికి మంత్రి శ్రీధర్బాబు, ప్రాజెక్టు మొదటి దశకు డీపీఆర్ సిద్ధమైందని, మొదటి దశ అంచనా వ్యయం రూ.ఆరున్నర వేల కోట్ల నుంచి రూ.ఏడు వేల కోట్లని, దాదాపు 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశముందని, నిర్వాసిత కుటుంబాలకు టీడీఆర్ను జారీ చేస్తామని, 2013 చట్టం ప్రకారం సహాయ పునరావాసాలు ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రి, మూసీనది అభివృద్ధి సంస్థ ఎండీ భిన్న ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. డీపీఆర్ తయారీకి 18 నెలల సమయం అవసరమవుతుందని రెండు నెలల క్రితం ఇదే సభలో ప్రకటించిన శ్రీధర్బాబు, ఇప్పుడు డీపీఆర్ సిద్ధమైందని చెప్పటం వింతగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని సభలోనే శ్రీధర్బాబు చెప్పారని, కానీ, ఆ బ్యాంకును జనవరి, మార్చి నెలల్లో రెండు పర్యాయాలు సంప్రదిస్తే... తమకు డీపీఆరే అందలేదని, ఎలాంటి లోన్ మంజూరు చేయలేదని వెల్లడించినట్టు పేర్కొన్నారు. సమాచార లోపం వల్ల ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారా, లేదా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చెబుతున్నారా అంటూ నిలదీశారు. ప్రాజెక్టుకు ముఖ్యమంత్రేమో రూ.లక్షన్నర కోట్లని చెబుతుంటే, ఇప్పుడు మంత్రి శ్రీధర్బాబు ఆరేడువేల కోట్లని అంటున్నారని నిలదీశారు. మంత్రి శ్రీధర్బాబు 1,400 ఇళ్లు కూలుస్తామని అంటున్నారని, మరి గెజిట్లో 10 వేలకుపైగా నిర్మాణాలు ప్రభావితానికి గురవుతాయని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. బఫర్ జోన్ విషయంలో 50 మీటర్లని మంత్రి అంటే, అధికారుల మాటల్లో అది చాలా ఎక్కువగా కనిపిస్తోందన్నారు. బురద చల్లటం ఆపాలి: మంత్రి శ్రీధర్బాబు కేటీఆర్ మాటలపై మంత్రి శ్రీధర్బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతల వైఖరి ముందు నుంచీ మేం బురద చల్లుతాం...మీరు తుడుచుకోండి అన్నట్టుగా ఉంటోందని అసహనం వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్లో రూ.6,500 నుంచి రూ.7,000 కోట్లు వ్యయం అవుతుందని తాము స్పష్టంగా చెప్పామన్నారు. కేటీఆర్ మాత్రం రూ.లక్షన్నర కోట్ల కుంభకోణం అని అవాస్తవాలతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తాము చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుగోడ కట్టాలని ఆ పార్టీ సంకుచిత ఆరోపణలు చేస్తోందని తిప్పికొట్టారు. మూసీకి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ జోన్గా గుర్తిస్తూ 2016 లో అప్పటి ప్రభుత్వం జీఓ ఇచ్చింది నిజం కాదా అని శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇళ్లెలా తొలగిస్తారని ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసం డీపీఆర్ రూపొందించిన మెయిన్ హార్ట్ అనే సింగపూర్ ఇంజనీరింగ్ సంస్థకు ఇటువంటి పనుల్లో అనుభవం ఉందని శ్రీధర్బాబు తెలిపారు. కేవలం రెండు నెలల్లో డీపీఆర్ ఎలా తయారైందని కేటీఆర్ ప్రశ్నించటం విడ్డూరమని, డీపీఆర్ తయారీ ఏడాది సమయం పట్టిందన్నారు. రుణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకుకు డీపీఆర్ ఇచ్చామని, తన తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏదైనా కారణం చేత ఆ బ్యాంకుకు సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామన్నారు. బీఆర్ఎస్కు మూసీ ప్రక్షాళన ఇష్టం లేదా: భట్టి బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి తీవ్రంగా స్పందించారు. మూసీ ప్రక్షాళన ఆ పారీ్టకి ఇష్టం లేదోమోనని, దాని పరీవాహక ప్రాంత పేదల జీవితాలు బాగవ్వాలని ఆ పార్టీ కోరుకోవటం లేదేమోనని ఆరోపించారు. మూసి నిర్వాసిత పిల్లల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ను ఆ ప్రాంతంలోనే నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో తమ ప్రశ్నలకు మంత్రి నుంచి సరైన సమాధానాలు రాలేదని, ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ ప్రకటించడంతో ఆ పార్టీ సభ్యులు సభ నుంచి నిష్క్రమించారు. -
మళ్లీ తొక్కుకుంటూ వస్తాం.. : సీఎం రేవంత్రెడ్డి
⇒ రామాయణంలో రావణాసురునికి పట్టిన గతే ప్రతిపక్ష నేతలకు పడుతుంది. మంచి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆలోచనలు చేస్తూ పథకాలు అమలు చేస్తుంటే.. రాక్షసుల మాదిరి విఘ్నాలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి రాక్షసులకు రామబాణం సమాధానం చెబుతుంది ⇒ మేం ఏం చేసినా కించపరిచేలా, అహంకారంతో మాట్లాడుతున్నారు. అది తమ జన్మహక్కు అని అనుకుంటున్నారు. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా (ప్రతిపక్ష హోదా) ఉండదు. భూకంపంలో కొట్టుకుపోతారు⇒ టీడీఆర్, హిల్ట్ పాలసీపై విచారణకు లేఖ రాయండి. వెంటనే మా ప్రభుత్వం విచారణ చేపడుతుంది. విచారణకు వెనకాడినా లేదా వెనక్కి తగ్గినా క్షమాపణ చెబుతాంసాక్షి, హైదరాబాద్: 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిమ్మల్ని మళ్లీ తొక్కుకుంటూ అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ‘2023 ఎన్నికల్లో బరాబర్ మీ నెత్తిపై కాళ్లు పెట్టి తొక్కుకుంటూ ఇక్కడకు వచ్చాను. 2029లో మళ్లీ చూసుకుందాం. మళ్లీ తొక్కకపోతే చూడండి. మీరు ఎట్లా గెలుస్తారో చూస్తాను’అని ఆవేశంగా ప్రకటించారు. బుధవా రం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిస్తూ రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా సీఎం ప్రసంగించారు. ‘ఇప్పటికైనా మీరు మర్యాదగా ఉండడం నేర్చుకుంటే మంచిది. కనీస మర్యాద దక్కుతుంది’అని హెచ్చరించారు. 2029 ఎన్నికలు కూడా కేవలం పాసింగ్ క్లౌడ్ మాత్రమే. 2034 వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది. అప్పటికే తెలంగాణ ఒక ట్రిలియన్ ఎకానమీగా ఎదుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’అని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్న హిల్ట్–పి, టీడీఆర్లకు సంబంధించి వారు లేఖ రాస్తే ఏ విచారణ కోరినా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘కొందరు తమను తాము రాజులుగా భావిస్తున్నారు. రాచరిక పోకడలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకుని అధికారం దక్కలేదనే దుఃఖంతో ఆరోపణలు, దు్రష్పచారంతో సభను తప్పుదోవ పట్టించారు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారి పోకడలు మారలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి తమ సేవకులను నియమించుకుంటారన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది’అని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వల్లనే ఈ దుస్థితి రాష్ట్ర ఆదాయంపెంచాలి.. పేదలకు పంచాలి అనే పాలసీ తీసుకొస్తే కూడా అభినందించాలనే ఆలోచన ప్రతిపక్షాలకు రాకపోతే వారిని ఏమనాలని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్ పట్ల సభావేదిక నుంచి వివరించాను. అధికారం పోయిందనే బాధతో ఇది కొందరికి రుచించదు. వారు కక్కిన విషాన్ని శివుడి మాదిరిగా గొంతులోనే పెట్టుకుంటాను’అని అన్నారు. తమపై గత ప్రభుత్వం పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల అప్పు భారాన్ని, దానికి 11 శాతం అధిక వడ్డీ మోపినందుకు, దానిని భరించడం వల్లనే తమ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ను ఆవిష్కరిస్తూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని రేవంత్రెడ్డి చెప్పారు. ‘గవర్నర్ ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక’అని రేవంత్ పేర్కొన్నారు. విపరీత పోకడలకు పోవద్దు ‘కొత్త గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు విపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనిప్రజలు ఆశించారు. సభాసంప్రదాయాలను గౌరవించకపోవడం తెలంగాణకు, ప్రజలకు తీరని మచ్చ’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘వారసత్వాలతో అధికారం రాదు.. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటామంటే కుదరదు. సొంతంగా సత్తా ఉండాలి. ఔరంగజేబుగా మారతామంటే అది దురాశగా మారుతుంది. విపరీత పోకడలు, విధానాలకు పోవద్దు, అధికారం రాలేదని బాధ, దుఃఖం ఉండొద్దు’అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘కొందరు తమను తాము దైవాంశ సంభూతులమని అనుకుంటున్నారు. మీరు (బీఆర్ఎస్ నేతలు) దేవుళ్లు కాదు, దోపిడీదారులు. నోటిఫికేషన్లు, ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేకపోయారు. అసంపూర్తిగా వదిలి వేసిన అసమర్థులు మీరు. మీలాగా గాలికి వచ్చిన వాళ్లం కాదు. ‘నేను కష్టజీవిని. తెలియకపొతే నేర్చుకుంటాను. ఇతరులకు నేర్పుతాను. ఇదే పంథాలో ముందుకు సాగి అనుకున్నవి కచ్చితంగా సాధిస్తాను’అని ఆయన పేర్కొన్నారు. ‘పారిశ్రామిక భూముల బదలాయింపులపై 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు హిల్ట్ పాలసీతో సహా దేనిపై అయినా సీబీఐ, ఈడీ, సిట్, లేదా ఏ అంతర్జాతీయ సంస్థతో విచారణకైనా మేం సిద్ధం. అని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు.. ‘కేసీఆర్ అసెంబ్లీలో ఇదే స్థానం నుంచి తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి శాసనసభ కృతజ్ఞతలు చెబుతున్నది, ఆమె దయతోనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’అని సీఎం రేవంత్ అన్నారు. తండ్రి బతికి ఉండగానే తద్దినం పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బావమరుదులు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. వారిద్దరు అలాగే వ్యవహరిస్తే.. పార్టీ ముక్కలు అవుతుందని, అది కాకుండా చూసుకోవాలని, అధికారంలోకి వచ్చేది కల్ల అని వ్యాఖ్యానించారు. మేము చేసిన అప్పులు రూ. 3.47,294 కోట్లు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మొత్తం అప్పులు రూ. 3,47,294 కోట్లు అయితే.. తాము చెల్లించిన అసలు, వడ్డీ కలుపుకొని రూ. 3,30,570 కోట్లు అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తాము అధికారంలో ఉన్న ఈ రెండున్నరేళ్లలో నికరంగా చేసిన అప్పు కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. 2014 జూన్ 2న అధికారం చేపట్టిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు అప్పటి వరకున్న అప్పులు కేవలం రూ.69 వేల కోట్లు అయితే.. వారు తమకు 2023 డిసెంబర్లో అధికారం అప్పగించే నాటికి అప్పులు రూ. 6,71,757 కోట్లకు తోడు చేతి బదులుగా, కాంట్రాక్టర్లకు బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సినవి కలుపుకొంటే మరో రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నాయని మొత్తంగా తమకు వారు అందించిన అప్పులు రూ. 8.11 లక్షల కోట్లు అని రేవంత్ వెల్లడించారు. కమీషన్లకు కక్కుర్తిపడి వారు 11 శాతం వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను రీస్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలా చేయడం వల్ల వడ్డీ భారం ఏటా దాదాపు రూ. 4000 కోట్లు ఆదా అవుతాయన్నారు. వైద్యానికి రూ. 4400 కోట్లు వ్యయం చేశాం పేదల వైద్యం కోసం తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 4,400 కోట్లు వ్యయం చేసిందని సీఎం రేవంత్ చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 2,300 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2046 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేద వారిపేట తీసుకుని వాటిని స్వాహా చేశారని, అలాంటి వారు తమను ప్రశ్నిస్తారా అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీని బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే రూ. 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు. నా కాలి గోటికి సరిపోవు... ‘వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి (హరీశ్రావు)ని మంత్రిగా చేసింది దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. కనీసం కృతజ్ఞతా భావం ఉండాలి కదా? చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా (కేటీఆర్) గెలిచారు. నేను స్వశక్తితో జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాతే రాజకీయ పారీ్టలోకి వచ్చాను. నాతో నీకు పోలిక ఏమిటి? నాతో పోటీ ఏమిటి? నా కాలిగోటికి కూడా సరిపోవు’ అని సీఎం రేవంత్ అన్నారు. ‘2009లో పొత్తుధర్మంలో భాగంగా పాలమూరు బిడ్డలం కేసీఆర్ను భుజాన వేసుకుని ఎంపీగా గెలిపించాం. అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఏదైనా పూర్తిచేశారా?’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. విధులకు హాజరుకాకుండా జీతాలా? ‘2023 డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్ష నేత రూ.1,06,56,674 జీతభత్యాలు పొందారు. విధులకు హాజరుకాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఉద్యోగులైనా రాజకీయ నేతలైనా కూడా చర్యలు తీసుకోవాలి’ అని రేవంత్రెడ్డి చెప్పారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు విజ్ఞప్తి... సభకు రండి, చర్చలో పాల్గొనండి.. మాజీ సీఎంకు ఆహ్వానం పలుకుతున్నాం. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వస్తా యని ఆశించాను. ఆశించిన మేర ప్రధాన ప్రతిపక్షం వ్యవహారశైలి లేదు’ అని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏఐ సునామీ రాబోతుంది... భవిష్యత్లో ఏఐ సునామీ రాబోతుందని రేవంత్రెడ్డి చెప్పారు. ‘దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్ను గవర్నర్ ప్రసంగంలో వివరించారు. రాబోయే రోజుల్లో వైట్కాలర్ జాబ్లు పోయి బ్లూకాలర్ జాబ్లు రానున్నాయి. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను కనీసం చూశారా? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవు. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించుకున్నాం. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్గా విభజించుకున్నాం’ అని సీఎం వివరించారు. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువ...గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో సీఎంగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మాట్లాడిన మాటలను ట్యాబ్ ద్వారా సభలో సభ్యులకు సీఎం వినిపించారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. అప్పుడు సక్రమమని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయింది? మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూద్దాం రండి. ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువగా ఉంది. బుల్డోజర్లతో కొట్టేయమని చెప్పింది అప్పుడే మరిచిపోయారా’ అని పేర్కొన్నారు.ఈవీ వాహనాలకు పన్ను మినహాయింపుకాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించామని సీఎం తెలిపారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నట్టు ప్రకటించారు. ‘క్యూర్ ప్రాంతంలో ప్రక్షాళన చేస్తాం. 3 వేలకు పైగా డీజిల్తో నడుపుతున్న ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో ప్రత్యామ్నాయం చేశాం. డీజిల్, కిరోసిన్తో నడిచే ఆటోలను రెట్రోఫిటింగ్తో ప్రత్యామ్నాయం చేస్తాం. కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. హైదరాబాద్ను పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మెట్రో విస్తరించాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.25 వేల కోట్ల విలువైన మెట్రోను రూ.15 వేల కోట్లకు కొంటున్నాం. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుంటే.. మేం మాత్రం ప్రైవేట్ సంస్థను కొనుగోలు చేస్తున్నాం. 76 కి.మీ. మెట్రోకు మేం కేంద్రానికి ప్రతిపాదనలను పంపాం’ అని చెప్పారు. చైనా నుంచి నేర్చుకుని ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ‘కొంగరకలాన్ రోడ్డుకు టాటా దిగ్గజం రతన్ టాటా పేరు పెడితే అడ్డం పడుకుంటున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో మార్పు తీసుకురావాలని చూస్తే పాలకుండలో విషం చుక్కలాగా ప్రవర్తిస్తున్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి’ అని సీఎం రేవంత్ చెప్పారు. -
లూటీకి సహకరిస్తున్న అధికారుల తోకలు కత్తిరిస్తాం
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, ఆరు నూరైనా పూర్తి చేస్తామంటూ తమ పరిధికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరిట సీఎం చేస్తున్న దోపిడీకి సహకరిస్తున్న అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, తాము అధికారంలోకి వచ్చాక తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు. శాసనసభ లాబీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్షం చాంబర్లో కేటీఆర్ బుధవారం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. మూసీ సుందరీకరణకు సంబంధించి అందరి అభిప్రాయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తోందన్నారు. మూసీ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం వచ్చిందని, డీపీఆర్ పూర్తయిందని సీఎం, మంత్రులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. డీపీఆర్ పూర్తయినట్లు సభలో ఆధారాలు చూపకపోతే అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెడతామని కేటీఆర్ చెప్పారు. 3,297 ఎకరాల భూ సేకరణ, 10 వేల నిర్మాణాలపై ప్రభావం చూపుతుందని నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. అసెంబ్లీలో మాత్రం 1,400 నిర్మాణాలు ఉన్నాయని మాత్రమే చెప్తోందన్నారు. బ్లాక్ లిస్ట్లో మూసీ కాంట్రాక్టు సంస్థ ‘మూసీ పరిసరాలను సుందరీకరణ చేయడం మినహా ప్రభుత్వం చేసేదేమీ ఉండదు. మధు రిడ్జ్ పార్కువాసులపై వల్లమాలిన ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న సీఎం ఇతర నిర్వాసితులనూ అదే రీతిలో ఎందుకు చూడటం లేదు. మూసీ ప్రాజెక్టు అప్పగించిన మెయిన్హార్ట్ కాంట్రాక్టు సంస్థను సింగపూర్, పాకిస్తాన్తోపాటు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కూడా బ్లాక్ లిస్టులో పెట్టింది. బఫర్జోన్లో 50 మీటర్లు దాటి ఎక్కడో 5 కి.మీ. దూరంలో ఉన్న హనుమాన్నగర్ వాసులకూ నోటీసులు ఇస్తున్నారు.పలువురు మంత్రులు, సీఎం సోదరుడు, పలువురు నేతల ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నాయి. నార్సింగి, మంచిరేవుల వరకు మూసీ బఫర్లో అనేక నిర్మాణాలు ఉన్నాయి. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) అంటే సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అనే విమర్శ ఉంది. హైదరాబాద్లో ఏవీ రెడ్డి, కొండల్రెడ్డి, అనిల్రెడ్డి, రాజేందర్రెడ్డి తదితరులు ముఠాగా ఏర్పడి రిటైర్డ్ అధికారుల అండతో భూ దందా సాగిస్తున్నారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి పాలనపై పట్టులేదు.. ‘సీఎంకు, మంత్రులకు పాలనపై పట్టులేదు. మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. మంత్రులకు అధికారులు బిజినెస్ రూల్స్ చెప్పాలి. ఐటీ రంగం కుప్పకూలితే హైదరాబాద్లో ఆతిథ్య, రియల్ ఎస్టేట్ రంగాలు దెబ్బతింటాయి. ఫ్యూచర్ సిటీ పేరిట ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన 14 వేల ఎకరాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. ఫార్మా భూముల్లో ఎమ్మెల్యేలు, జర్నలిస్టులు, జడ్జీలు, జూ పార్కులకు భూములు కేటాయిస్తామని ప్రభుత్వం చెప్తోంది’అని కేటీఆర్ చెప్పారు. అసెంబ్లీకి ఎప్పుడు రావాలో కేసీఆర్కు తెలుసు ‘అసెంబ్లీకి ఎప్పుడు రావాలో కేసీఆర్కు తెలుసు. మా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ధాటిని తట్టుకోలేక అసెంబ్లీ ఎందుకు పెట్టామా అని మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. రేవంత్ మమ్మల్ని దూషిస్తున్నా స్పీకర్ ఖండించే పరిస్థితి లేదు. అలాంటపుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డిపై ఇప్పటికే తాత్కాలిక సస్పెన్షన్ విధించాం. ఆయన నుంచి సమాధానం వచ్చిన తర్వాత తుది నిర్ణయం ఉంటుంది. కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరికపై ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు జరపలేదు’అని కేటీఆర్ వెల్లడించారు. -
ఎక్కడపడితే అక్కడ బుల్డోజర్ల చప్పుళ్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో గెలిస్తే 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇష్టానుసారంగా ఇళ్లను కూల్చే దందాకు ప్రభుత్వం తెరలేపిందని..ఎక్కడపడితే అక్కడ బుల్డోజర్ల చప్పుళ్లు వినపడుతున్నాయని బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. పట్టా భూములనూ నిషేధిత జాబితాలో చేర్చారని తప్పుబట్టారు. జాబితాలో ఒకప్పుడు 64 లక్షల ఎకరాల భూములుండగా, ఇప్పుడు కోటి ఎకరాలకు పెంచి దందాలకు తెరలేపారని సర్కారును విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని భూములను నిషేధిత జాబితాలో చేర్చారు? ఎన్ని భూములను తొలగించారు? అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు కోసం ముఖ్యమంత్రి చెపితేనే నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) జారీ చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం శాసనసభలో రెండో రోజు జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. యాచారం భూములపై విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు.రూ.2.5 లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్భూములు అన్యాక్రాంతమైనట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో మీడియాకు వెల్లడించారని గుర్తు చేస్తూ వాటిని తిరిగి స్వా«దీనం ఎందుకు చేసుకోలేదని నిలదీశారు. ఆర్ఆర్ (రేవంత్రెడ్డి) ట్యాక్స్తో స్థిరాస్తి రంగం కుప్పకూలిందని, జీఎస్టీ ఆదాయం 5 శాతం తగ్గిందని, వృద్ధి తిరోగమనం పాలైందని విమర్శించారు. 317 జీవో సమస్యను పరిష్కరించాం.. పొన్నం నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు సంబంధించిన ఆధారాలుంటే సభ ముందు ఉంచాలని, లేకుంటే ఫిర్యాదు చేయాలని ఏలేటికి మంత్రి పొన్నం సూచించారు. జీవో 317 బాధిత ఉద్యోగుల సమస్యలను వీలైనంతగా పరిష్కరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. స్థానికత, రాష్ట్రపతి ఉత్తర్వులు అడ్డంకిగా మారడంతో కొందరి సమస్య పరిష్కారం కాలేదన్నారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఏలేటి చేసిన ఆరోపణలను పొన్నం తోసిపుచ్చారు. రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెచ్చారా? గాడిద గుడ్డు తెచ్చారా? అనే అంశంపై సభలో మాట్లాడాలని ఆ పార్టీ సభ్యులకు పొన్నం సూచించారు. 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.12–13 లక్షల కోట్ల వరకు నిధులిచి్చందని, దీనిపై సభలో చర్చ పెడితే మాట్లాడడానికి సిద్ధమని ఏలేటి బదులిచ్చారు. బీసీలకి ఏలేటి క్షమాపణ చెప్పాలి: మంత్రి శ్రీధర్ కోళ్ల పెంపకాన్ని పర్యవేక్షించే ప్రాధాన్యత లేని బీసీ శాఖను మంత్రి పొన్నంకు ఇచ్చారని, ఆయనకు విద్య, హోం వంటి ప్రధాన శాఖలు ఇవ్వాలని ఏలేటి మహేశ్వర్రెడ్డి సభలో పేర్కొనగా, మంత్రి డి.శ్రీధర్బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొన్నంతోపాటు లక్షలాది మంది బీసీలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.శ్రీధర్బాబు చర్చను తప్పుదోవ పట్టించడానికి తనపై ఆరోపణలు చేశారని, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా తనకు కేటాయించిన శాఖతో ఏం చేసుకోవాలో అని ప్రశ్నించారని గుర్తు చేశారు. దీంతో వాకిటి అభ్యంతరం తెలిపారు. తాను చిన్నప్పుడు ఏం కష్టం చేశానో దానికి సంబంధించిన శాఖను తనకు కేటాయించడం అదృష్టంగా భావిస్తున్నట్టు గతంలో తాను పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. వెలుగుమట్లపై చర్చకు సిద్ధం: తుమ్మల ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై మాట్లాడితే కోర్టు ధిక్కరణ అవుతుందని ఏలేటికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బదులిచ్చారు. దీనిపై చర్చకు సిద్ధమన్నారు. -
సుత్తెతో మోది.. డీజిల్ పోసి దహనం
కాజీపేట అర్బన్: కన్న బిడ్డనిచ్చిన పాపానికి మామను, కట్టుకున్న భార్యను అతికిరాతకంగా సుత్తెతో తలపై మోది, ఇద్దరిపై డీజిల్ పోసి నిప్పంటించి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హను మకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలోని రాజీవ్గృహకల్ప సముదాయంలో బుధవారం చోటు చేసుకుంది. మృతు రాలి సోదరి తేజస్వి కథనం ప్రకారం.. కడిపికొండ రాజీవ్గృహకల్ప సముదాయంలోని 5వ బ్లాక్ 24వ ప్లాట్లో బాషబోయిన రాజశేఖర్ (51) ఉంటున్నాడు. భార్య శ్రీలత సుమారు పదిహేనేళ్ల క్రితం గుండె నొప్పితో మృతి చెందింది. వీరికి ముగ్గురు కుమార్తెలు రాజశ్రీ, తేజస్వి, మనోజ్ఞ ఉన్నారు. రాజశేఖర్ ఆటో డ్రైవర్గా, వంట మనిషిగా పనులు చేస్తూ పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. పెద్ద కుమార్తె రాజశ్రీని 2023లో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట హవేలికి చెందిన పొక్కుల ప్రవీణ్కు ఇచ్చి పెళ్లి చేశాడు. రెండవ కుమార్తె తేజస్విని హనుమకొండలో ఉంటుండగా, మరో కుమార్తె డిగ్రీ చదువుతోంది. రాజశ్రీకి పెళ్లి సమయంలో రూ.3 లక్షల కట్నంతోపాటు ఇంటిసామగ్రి పెట్టి ఘనంగా పెళ్లి చేశాడు. వీరికి 2024లో బాబు జయాంశ్ జని్మంచగా, ఆరు నెలల క్రితం పాప పుట్టింది. ప్రవీణ్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్లోని మౌలాలిలో కోకాకోలా కంపెనీలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాప పుట్టిన నాటినుంచి వరకట్న వేధింపులతోపాటు అమ్మాయి పుట్టిందని, మరింత కట్నం తీసుకురమ్మని నిత్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో రాజశ్రీ ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో కుడి చెయ్యి విరిగింది. దీంతో పనులు కూడా సరిగా చేయడం లేదని విసిగిస్తున్నాడు. నెలరోజుల క్రితం పాపకు అన్నప్రాసన చేయాలని తండ్రి వద్దకు రాగా, వారం రోజుల క్రితం వచ్చిన ప్రవీణ్ కూడా ఇక్కడే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఏమి జరిగిందో తెలియదు. బుధవారం తెల్లవారుజామున ప్రవీణ్ మామ రాజశేఖర్, భార్య రాజశ్రీలపై వెంట తెచ్చుకున్న సుత్తెతో నుదుటిపై దాడిచేశాడు. ఇద్దరికి తలలు పగిలి తీవ్రరక్తస్రావమైంది. ఇంకా బతికి ఉంటారని భావించిన ప్రవీణ్.. ఇద్దరిపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఆ తరువాత నిందితుడు తనకు వరుసకు అత్త (రాజశ్రీ పిన్ని) అయ్యే ఆమెకు ఫోన్ చేసి తన భార్య, మామ కాల్చుకుని చనిపోయారని సమాచారం ఇచ్చాడు. ఆమె వెంటనే రాజశేఖర్ రెండవ కూతురు తేజస్వికి ఫోన్ చేసి సమాచారం తెలిపింది. హుటాహుటిన ఆమె రాజీవ్గృహకల్ప క్వార్టర్స్కు వచ్చారు. అప్పటికే రాజశేఖర్, రాజశ్రీ పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్ధితిలో ఉన్నారు. నుదిటిపై బలమైన గాయాలు ఉన్నాయి. తేజస్వి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మడికొండ ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కాగా, ప్రవీణ్ ఫిబ్రవరిలోనే వీరిని చంపాలని ప్లాన్ చేసుకున్నట్లు , అప్పుడే డీజిల్ కొనుగోలు చేసి క్యాన్ను క్వార్టర్లో ఓ మూలన పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కొడుకు ఆత్మహత్య.. గుండెపోటుతో తల్లి మృతి
జగిత్యాల క్రైం: ఒకే రోజు తల్లీకొడుకులు మృతిచెందిన సంఘటన జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. మోతె గ్రామానికి చెందిన దొడ్ల రాములు, మల్లవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు. ఐదేళ్ల క్రితం రాములు అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటినుంచి మల్ల వ్వ ఇద్దరు కుమారులతో గ్రామంలోనే రైతుల భూ ములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. చిన్నకొడుకు సంపత్ జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లి వచ్చి ఇక్కడే వ్యవసాయం చేస్తున్నాడు. పెద్ద కుమారుడు సంతోష్ ఉపాధి కోసం తుర్కియే వెళ్లాడు. మల్లవ్వ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణంతోపాటు వ్యవసాయ పెట్టుబడికి కొన్ని అప్పులయ్యా యి. అప్పు తీర్చడం కష్టంగా ఉందంటూ సంపత్ (25) నిత్యం మధనపడుతున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన మంగళవారం సాయంత్రం పురుగుల మందుతాగా డు. బంధువులు అతడిని కరీంనగర్లోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చేరి్పంచగా బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా.. పోస్టుమార్టంకు తరలిస్తున్న సమయంలో మల్లవ్వ (55)కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆమెను అత్యవసర వార్డు కు తరలించిన వైద్యులు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. ఒకేరోజు కొడుకు, తల్లి మృతిచెందడంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సాయంత్రం ఇద్దరు మృతదేహాలను గ్రామంలో అద్దెకుంటున్న ఓ రేకులòÙడ్డుకు తరలించారు. సంతోష్ విదేశాల నుంచి వచ్చాక అంత్యక్రియలు చేయనున్నారు. ఈ ఘటనతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. -
రాళ్ల వాన, ఈదురు గాలులు
డొంకేశ్వర్(ఆర్మూర్)/ కొందుర్గు/వికారాబాద్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కురిసిన వడగళ్ల వానకు పలు జిల్లాల్లో పంటనష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు 1,520 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇందులో వరి 1,110 ఎకరాలు, మొక్కజొన్న 110 ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపింది. అయితే జరిగిన పంట నష్టమంతా బోధన్ డివిజన్లోనే ఉంది. సాలూరాలో 360, రుద్రూర్లో 980, వర్నిలో 130, పొతంగల్లో 50 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. నాలుగు మండలాలు కలిపి 891 మంది రైతులు పంటనష్టం బాధితులుగా ఉన్నారు. వికారాబాద్జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వడగళ్లు, పిడుగుపాట్లతో పదికి పైగా పాడి ఆవులు మృత్యువాత పడ్డాయి. పూడూరు మండలం నిజాంపేట్ మేడిపల్లి వద్ద మంద పెట్టిన 217 మేకలు మృత్యువాత పడ్డాయి. చెట్లు నేలకొరిగి, ప్రధాన రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. పోలేపల్లిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దోమ మండలం కొండాయపల్లిలో రైతు చిన్న పిరంగికి చెందిన రెండు ఆవులు, శివారెడ్డిపల్లిలో రాంరెడ్డికి చెందిన ఓ ఆవు, కుల్కచర్ల మండలం చిన్నరామయ్య తండాకు చెందిన రైతు రాజుకు చెందిన ఓ ఆవు, యాలాల మండలం అక్కంపల్లిలో ఓ కాడెద్దు మృతి చెందాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లా కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లోని వివిధ గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈ వానతో పంటలు దెబ్బతిని నేలకొరిగాయి. వరి, మొక్కజొన్న, కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఏఓ రాజేందర్రెడ్డి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. -
19,000 మెగావాట్లకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: యాసంగి పంటలు, వేసవి ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతున్నందున, 19 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని, ఈ నేపథ్యంలో అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు, సిబ్బందికి సూచించారు. వేసవికాలం, యాసంగి సాగు సీజన్ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత సంవత్సరం మార్చి 20న నమోదైన గరిష్ట విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లు కాగా, ఈ సంవత్సరం మార్చి 2న 17,606 మెగావాట్ల డిమాండ్ను చేరుకుని గత రికార్డును దాటిందని చెప్పారు. మార్చి 13న 18,228 మెగావాట్లకు చేరి, 341.08 మిలియన్ యూనిట్ల వినియోగంతో కొత్త రికార్డును సృష్టించిందని వివరించారు. డిమాండ్ భారీగా పెరిగినా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, ఓవర్లోడింగ్ సమస్యలు తలెత్తకుండా విద్యుత్ సంస్థలు సమర్థంగా వ్యవహరించాయని పేర్కొన్నారు. ఈ కృషికి విద్యుత్ సిబ్బందిని అభినందించారు. అలాగే, విద్యుత్ డిమాండ్ 19 వేల మెగావాట్లకు మించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కొత్త సబ్స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, తెలంగాణ ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, తెలంగాణ డిస్కమ్ల సీఎండీలు ముషారఫ్ ఫరూఖీ, జితేష్ పాటిల్, వరుణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడులకు అనుకూల రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్, ఐటీ రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. బుధవారం శాసనసభ కమిటీ హాల్లో స్లోవేనియా ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. మధ్య యూరప్కు చెందిన సంపన్న దేశం స్లోవేనియా నుంచి వారి భారత్ రాయబారి టోమాజ్ మెన్సిన్ ఆధ్వర్యంలో వచ్చిన వాణిజ్య, పారిశ్రామిక ప్రతినిధులకు మంత్రి సాదర స్వాగతం పలికారు. యూరోపియన్ యూనియన్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కారణంగా తెలంగాణ నుంచి యూరప్కు ఎగుమతి చేసే 99.95% ఉత్పత్తులపై సుంకాలు ఉండవని తెలిపారు. ఎఫ్టీఏతో విదేశీ పెట్టుబడిదారులకు రాష్ట్రంలో మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్లో అపార అవకాశాలు తెలంగాణలో ఫార్మా, జీవ విజ్ఞాన రంగాలు, వాహనాల విడిభాగాల ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి చెప్పారు. ఔషధ, బయో టెక్నాలజీ రంగాల్లో కూడా రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందని, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నందున ఇక్కడి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలతో భాగస్వామ్యం పెట్టుబడిదారులకు లాభదాయకమవుతుందని వివరించారు. ఐటీ అభివృద్ధి, క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా ఇక్కడ అపారమైన అవకాశాలున్నాయని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, స్లోవేనియా ప్రతినిధులు ఆసిఫ్ ఇక్బాల్, సుజిత్ నాయర్, కీర్తి చిలుకూరి తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల ప్రకారమే బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపీ పుట్టా మహేశ్తో పాటు ఇతర నిందితులకు స్టేషన్ బెయిల్ లభించడం నిబంధనల ప్రకారం జరిగిందే తప్ప అందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని అన్నారు. బుధవారం పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ‘మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కొందరు స్టేషన్ బెయిల్ పొందారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారు తాము బాధితులమని చెబుతున్నారు. ఈ కేసుల్లో బాధితులుగా ఉన్నవారికి స్టేషన్ బెయిల్ పొందే అవకాశం చట్టరీత్యా ఉంటుంది. ఇందులో ప్రభుత్వం గానీ, మరెవరు గానీ చేసేదేమీ లేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు. కేసును పక్కదారి పట్టనివ్వకుండా పూర్తిస్థాయిలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకే ప్రతేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని చెప్పారు. ముందస్తు ముచ్చటే లేదు... తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని సీఎం తోసిపుచ్చారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే అంటే 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. ‘2028లో ఎన్నికలు జరుగుతాయని వస్తున్న వార్తల్లో నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం ముందుగా జాతీయ జనగణన పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ మొదలవుతుంది. ఇవన్నీ జరగడానికి సమయం పడుతుంది..’రేవంత్ వివరించారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని, అది మంచి పరిణామమని సీఎం వ్యాఖ్యానించారు. రాహుల్, ప్రియాంకతో భేటీలు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాం«దీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. పార్టీ తరఫున ఇటీవల రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్రెడ్డిని వారికి పరిచయం చేశారు. కాగా వేం నరేందర్రెడ్డిని రాహుల్, ప్రియాంక అభినందించారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించినందుకు రాహుల్, ప్రియాంకలకు వేం నరేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి, ఎంపీలు మల్లు రవి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురామిరెడ్డి, అనిల్కుమార్ యాదవ్, చామల కిరణ్కుమార్రెడ్డి, కాంగ్రెస్ నేత రోహిణ్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీ మాజీ మంత్రి రోజాకు పలకరింపు పార్లమెంటు ఆవరణలో వైఎస్సార్సీపీకి చెందిన ఏపీ మాజీ మంత్రి రోజాను ముఖ్యమంత్రి పలకరించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి రోజా పార్లమెంటుకు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి ఎదురుకావడంతో ఒకరినొకరు మర్యాద పూర్వకంగా పలకరించుకున్నారు. -
సీఎం రేవంత్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మూడు గంటల ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మూడు గంటల ప్రసంగంలో సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మోడల్ చోర్ మోడల్. మూసి సుందరీకరణకు 16 వేల కోట్ల రూపాయలతో చేయొచ్చు. దానికి లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ చెప్పాల్సింది అభినందన కాదు, అభిశంసన.వీధి రౌడీ మాదిరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. స్పీకర్కు ఇంగితం ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలి. రేవంత్ రెడ్డి కన్ను తెలంగాణ భూములపై ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందని కేటీఆర్ విమర్శించారు. -
పన్నీరు, పచ్చళ్లు తెగ లాగించేస్తున్నారా?.. అయితే బిగ్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో కల్తీ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిన్న(మంగళవారం) కుళ్లిన చికెన్, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వ్యవహారం వెలుగులోకి రాగా.. తాజాగా కల్తీ పన్నీర్, పచ్చళ్లు కూడా బయటపడ్డాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ.. కల్తీ పన్నీర్, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) బృందం రట్టు చేసింది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి. సాహితితో కలిసి సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజ్ బజార్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ దాడుల్లో ఆరు హోల్సేల్, రిటైల్ దుకాణాలపై దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా కల్తీ ఉత్పత్తులను విక్రయిస్తున్న జైపాల్ సింగ్ రాజ్పురోహిత్, కొలారియా వైభవ్, నరేష్ కొలారియా, ప్రేమ్ అనిల్ వ్యాస్, రామ్ కిషోర్ కొలారియా, లక్ష్మీనారాయణ కొలారియాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితులు గుర్తు తెలియని ప్రాంతాల నుండి కల్తీ, అపరిశుభ్రమైన పనీర్, ఇతర పాల ఉత్పత్తులను భారీ మొత్తంలో సేకరించి, వాటిని నాణ్యమైన ఉత్పత్తులుగా నమ్మిస్తూ కిలో రూ. 280 చొప్పున హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు, సామాన్య ప్రజలకు విక్రయిస్తున్నారు. తనిఖీ సమయంలో ఈ ఉత్పత్తులను ప్లాస్టిక్ కవర్లలో ఉంచి, దుమ్ము, ఈగలు వాలే అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉత్పత్తులపై ఎటువంటి బ్రాండ్ పేరు, తయారీ తేదీ, గడువు తేదీ (Expiry Date) లేకపోవడమే కాకుండా, కనీస పేస్ట్ కంట్రోల్ రికార్డులు కూడా లేవని తేలింది.ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 3,892 కేజీల కల్తీ పాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు, వీటి విలువ సుమారు రూ.11,11,600 ఉంటుంది. స్వాధీనం చేసుకున్న సొత్తులో 2,572 కేజీల పనీర్, 927 కేజీల కోవా, 249 కేజీల వైట్ క్రీమ్, 132 కేజీల అజ్మీరా కలకండ్ మరియు 12 కేజీల నెయ్యి ఉన్నాయి. ఈ అక్రమ వ్యాపారంలో ప్రధానంగా శంకర్లాల్ మిల్క్ ప్రొడక్ట్స్, విజయ మిల్క్ షాప్, వైభవ్ మిల్క్ డెయిరీ, శ్రీ బాలాజీ డెయిరీ ప్రొడక్ట్స్, జగదాంబ మిల్క్ మర్చెంట్ మరియు తులసి గిరిరాజ్ డెయిరీ ప్రొడక్ట్స్ అనే సంస్థలు పాల్గొన్నట్లు గుర్తించారు.కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై దాడికుల్సుంపురాలో కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కుల్సుంపురా సబ్-ఇన్స్పెక్టర్ ఎం. నరసింహ తన సిబ్బందితో కలిసి జియాగూడ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా, వెంకటేశ్వర నగర్లోని ఒక గోదాములో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించారు. అక్కడ సోదాలు నిర్వహించగా, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు (License) లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పచ్చళ్లను తయారు చేస్తున్నట్లు తేలింది. నిందితులు కుళ్ళిపోయిన కూరగాయలు, నాణ్యత లేని ముడి పదార్థాలను ఉపయోగిస్తూ పచ్చళ్లను తయారు చేసి, స్థానిక దుకాణాలకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.72 డ్రమ్ముల వివిధ రకాల పచ్చళ్లు (నిమ్మకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉసిరి, మరియు గోంగూర), 6 డ్రమ్ములు టమోటా, చింతపండు పేస్ట్. 1 చిన్న డ్రమ్ము అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 ఎలక్ట్రానిక్ బరువు తూచే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎన్. నరసింహ, ఎన్. నరేష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
వారు అహంకారం ప్రదర్శించారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి విశిష్ఠ ప్రణాళిక అని అన్నారు. ప్రతిపక్షం ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించామని, హుందాగా ప్రవర్తించకుండా అహంకారం ప్రదర్శించిందని అన్నారు.‘ఎన్నో త్యాగాల ఫలితం మన దేశ స్వాతంత్య్రం. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘపోరాటంతో స్వాతంత్య్రం వచ్చింది. పేదవాడికి బ్యాంకింగ్ రంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఇందిరా గాంధీ. నెహ్రూ కట్టిన ప్రాజెక్టులను మనం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. బీఆర్ఎస్ ఇంకా అహంకార ధోరణి మార్చుకోలేదు. అభివృద్ధిలో కలిసి వస్తారనుకుంటే ప్రతిపక్షం అహంకారం చూపిస్తోంది. 4 కోట్లమంది ప్రజలను నిరాశపర్చేలా విపక్షాల తీరు ఉంది. అధికారం పోయినా రాచరిక పోకడలు పోలేదు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వాళ్ల తీరు మారలేదు. కొందరు తమను తాము రాజులనుకుంటున్నారు. ఇప్పటికీ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. ‘దేవుళ్ల కాలం నుంచే మారీచుల రూపంలో అడ్డంకులు సృష్టించే వారు ఉన్నారు. చెరువులు, నాలాలు, ఫుట్పాత్లను కబ్జాల నుంచి కాపాడుతున్నాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. అందుకే హైదరాబాద్ను కాలుష్యం, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం’ అని తెలిపారు.’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. -
‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
సాక్షి, హైదరాబాద్: మూసాపేటలోని రెయిన్బో విస్టాస్ రాక్ గార్డెన్లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరగనున్నాయి. గురువారం సాయంత్రం నుంచి ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 5.55 గంటలకు జ్వోతి ప్రజ్వలనతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.6 గంటలకు శృంగేరీ శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తారు. అనంతరం ‘సంవత్సర పురుషోపాసన’ అనే అంశంపై ప్రముఖ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పాతూరి నాగరాజు ప్రసంగిస్తారు. ఇంకా భజన తదితర ఇతర కార్యక్రమాలూ నిర్వహించనున్నారు. -
ఎల్పీజీ సిలిండర్ల సరఫరా.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్లకు కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో నిన్న(మార్చి 17, మంగళవారం) 2 లక్షల 35 వేల 678 LPG సిలిండర్లను డెలివరీ చేసినట్లు తెలిపింది.ఎల్పీజీ సిలిండర్లు రీ ఫిల్లింగ్ కోసం ఆందోళన చెందవద్దని వినియోగదార్లకు ప్రభుత్వం సూచించింది. సిలిండర్ల డెలివరీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా మానిటరింగ్ చేయడానికి పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసింది. సగటున రోజుకు 2,15,151 ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ జరిగేవని.. నిన్న అంతకు మించి డెలివరీ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న IOCL నుండి 93,887(+1%) సిలిండర్లు, HPCL నుండి 84,156 (+11,98%)సిలిండర్లు, BPCL నుండి 57,635 (+22.63%)సిలిండర్లు మొత్తం 2,35,678 సిలిండర్లు పంపిణీ జరిగినట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. -
తెలుగువారందరికీ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘పరాభవ నామ ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు మాట్లాడే సోదరులు, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తెలుగు నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు, సమృద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.‘ఉగాది ఆనందం, ఆశల పండుగ. ఈ నూతన సంవత్సరం కొత్త ఉత్సాహం, ప్రకాశవంతమైన భవిష్యత్తును తీసుకురావాలి. ఉగాది స్ఫూర్తిని, సంప్రదాయ ఉగాది పచ్చడిలోని విభిన్న రుచులు సూచించే భావాన్ని ఆమోదించి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆశావాద దృక్పథంతో ఎదుర్కొందాం. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, సమృద్ధి, ఐక్యత, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలి’ అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. -
ఏపీలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఒకరి మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. అమరావతిలో భారీ వర్షం కురిసింది. తుళ్లూరులోని మేరీ మాత హై స్కూల్కు సమపీంలో పిడుగుపడి ఓ విద్యార్థి తండ్రి మృతిచెందారు. కృష్ణాజిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరులో వర్షం పడింది. విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఏలూరు జిల్లాలోని నూజివీడులో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఓ ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఇంటి టెర్రస్ పైన పిట్టగోడ పాక్షికంగా ధ్వంసమైంది.రాగల మూడు గంటల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పారు.తెలంగాణనూ వదలని వానలు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు కురిసిన వర్షానికి పలుచోట్ల పెద్దఎత్తున పంట నష్టం తలెత్తింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెద్దపెల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగపేటల్లో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలరాలింది.కరీంనగర్ జిల్లా వీణవంకలోనూ అపార పంటనష్టం జరిగింది. నర్సింగాపూర్లోనూ మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతింది. కొన్ని చోట్ల మామిడి పిందెలు రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు.. చేతికొచ్చిన పంట నేలరాలింది. భారీగా పంట నష్టం తలెత్తడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి మిర్చి రైతులు విలవిలలాడారు. మిర్చి కుప్పలపై టార్పాలిన్లు కప్పి పంటను కాపాడుకుంటున్నారు రైతులు. -
దారుణం : సోదరిని చంపి, ముక్కలుచేసి...!
సాక్షి,అబ్దుల్లాపూర్మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారంలో దారుణం చోటు చేసుకుంది. ప్రవర్తన సరిగా లేదనే ఆగ్రహంతో సోదరిని అత్యంత దారుణంగా హతమార్చాడో కర్కోటకుడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడిసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇవాళ, రేపు భారీ వర్షాలు 40-50 కి.మీ. వేగంతో గాలులు
-
డ్రగ్స్ కేసు.. సిట్ అంటేనే కూర్చోవడం: బీజేపీ సెటైర్లు
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సిట్ అంటేనే కూర్చోవడం అంటూ ఎద్దేవా చేశారు. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే అలా జరిగితే.. ఫాంహౌస్కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. సిట్తో జరిగేదేమీ ఉండదు. డ్రగ్స్, ల్యాండ్, లిక్కర్ దందాలన్నీ కాంగ్రెస్ కనుసన్నల్లో సాగుతోందిఆర్ఎస్ఎస్ ని నిషేధించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భారత నిఘా విభాగం ‘రా’ను కూడా నిషేధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చండూరులో కాంగ్రెస్ దుండగులు బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స అందించకుండా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. తెలంగాణలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నల్లగొండలో ప్రజాస్వామ్యం లేదు. రాచరిక పాలన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిపై పోలీసులు చేయి చేసుకున్నారు.పెద్దపల్లి, మంచిర్యాలలో పోలీసుల బలంతో బీజేపీని అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేస్తే ఓ చిన్న కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు స్వార్థం కోసమే పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తోంది. బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. అలాగే, తెలంగాణలో కరెంట్ కోతలు విపరీతంగా ఉన్నాయి. కరెంట్ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగించాలి. పంటలు కూడా ఎండిపోతున్నాయి అని వ్యాఖ్యలు చేశారు. -
ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించిన గృహిణి
శ్రీకాకుళం: మండలంలోని పెంటూరుకు చెందిన పొందూరు కుమారి ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికైంది. బడబంద గ్రామానికి చెందిన పొందూరు వైకుంఠరావు, భారతమ్మల చిన్న కుమార్తె అయిన కుమారిని పెంటూరు చెందిన నడుపూరు హరీష్ కు 2022లో ఇచ్చి వివాహం చేశారు. భర్త ఏఆర్ కానిస్టేబుల్గా విజయవాడలో పనిచేస్తుండడంతో అక్కడే కోచింగ్ తీసుకొని ఈ ఉద్యోగాలు సాధించినట్లు ఆమె తెలిపారు. రీజనల్ రూరల్ బ్యాంక్(ఆర్ఆర్బీ) పీవో, ఆర్ఆర్బీ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్(కెనరా బ్యాంకు)గా నాలుగు ఉద్యోగాలు పొందటమే, కాకుండా ఎల్ఐసీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మూడు విడత ఇంటర్వ్యూలు పూర్తి చేసుకొని చివరి విడత ఇంటర్వ్యూకు ఎదురు చూస్తోంది. అయితే వీటిలో రీజనల్ రూరల్ బ్యాంకు పీవోగా విధుల్లో చేరుతానని, తన భర్త హరీష ఇచ్చిన సహకారంతోనే ఈ ఉద్యోగాలు సాధించానని కుమారి తెలిపారు. -
ఏసీబీ దాడులు.. సీఐ రాము అరెస్ట్
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఏసీబీ సోదాలు ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, అవినీతి కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రామును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సోదాల సందర్భంగా భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.వివరాల మేరకు జగిత్యాల ధరూర్ క్యాంపులోని ఎక్సైజ్ సీఐ రాము నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఇంట్లో భారీ మొత్తంలో నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఐ రామును అరెస్ట్ చేశారు. అయితే, గతంలో ఆయన సిరిసిల్ల ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడినట్లు ఏసీబీకి ఆధారాలు లభించాయి. మరోవైపు.. సీఐకి మీడియేటర్గా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్న వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఐ రాము ఫోన్ కాల్ డేటా, మెసేజ్లపై ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. -
రాజకీయాలు కంటే వివాదాలే ఎక్కువ..!
వికారాబాదు జిల్లా: తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రెస్గా మారారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఏదో ఒక అంశంపై మీడియాలో కేంద్ర బిందువుగా నిలుస్తూ వచ్చారు. 2016 నుంచి మొదలైన కేసుల పరంపర ఏటా పెరుగుతూ వస్తున్నాయి. మూడేళ్ల క్రితం బెంగళూరు ఫామ్హౌస్లో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడం.. 2022లో మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల ఎర.. మున్సిపల్ ఎన్నికల సమయంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు అధికారులతో గొడవ వంటి అనేక కేసులు ఆయనపై ఉన్నాయి. తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్లో పలు రాష్ట్రాలకు చెందిన తాజా, మాజీ ప్రజా ప్రతినిధులతో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ ఈగల్ టీమ్కు పట్టుబటడం రోహిత్రెడ్డి వ్యవహారం మరోసారి చర్చకు దారి తీసింది. ఇందర్చెడ్ గ్రామానికి చెందిన రోహిత్రెడ్డి 2008లో క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో మన పార్టీ నుంచి తాండూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి 270 ఓట్లతో ఘోరపరాజయం పొందారు. తర్వాత 2011లో టీఆర్ఎస్ పారీ్టలో చేరారు. నాటి నుంచి అందులోనే కొనసాగుతూ వచ్చారు. 2014లో పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అప్పట్లో నాటి మంత్రి పట్నం మహేందర్రెడ్డికి, రోహిత్రెడ్డికి అనేక వివాదాలు ఉండేవి. ఈ క్రమంలో ఆయన్ను పారీ్టలో నుంచి బహిష్కరించారు. 2018లో కాంగ్రెస్ టికెట్ సాధించి పట్నం మహేందర్రెడ్డిపై స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించారు. గెలిచిన రోహిత్రెడ్డి ఆరు నెలలకే బీఆర్ఎస్ గూటికి చేరారు. వివాదాలతో హైలెట్ 2018లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాటి నుంచి రోహిత్రెడ్డి వివాదాలతో హైలెట్గా నిలుస్తూ వచ్చారు.. బెంగుళూరు కేంద్రంగా సాగిన డ్రగ్స్ కేసులో.. సోదరుడు రితీష్రెడ్డి పబ్లో చేసిన గొడవతో.. పట్టభద్రుల ఎన్నికల సమయంలో దొంగ ఓట్ల వివాదం.. 2023లో తాండూరులో నిర్వహించిన రాజశ్యామల యాగం సమయంలో పోలీసు సిబ్బందితో రీల్స్ చేయడంపై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోలీసు అధికారులతో గొడవ పడ్డారు. ఇలా ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వారం రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి కోర్టు నుంచి బెయిల్ పొందన తర్వాత బయటకు వచ్చారు. ప్రతి సోమవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చి నగరంలో ఉంటున్నారు. రోహిత్రెడ్డి ఇలా ప్రతిసారీ ఏదో ఒక అంశంలో కేంద్ర బిందువుగా నిలుస్తూ వార్తల్లో ఉంటున్నారు. -
భార్య, మామను హత్య చేసి పెట్రోల్తో తగలబెట్టిన అల్లుడు
హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లాలోని కడిపికొండ రాజీవ్ గృహాకల్పలో ఒక వ్యక్తి తన భార్యను, మామను అత్యంత కిరాతకంగా చంపి, పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడు ప్రవీణ్కు, అతని భార్య రాజశ్రీకి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. చిన్నపాటి మనస్పర్థలు కాస్తా ముదిరి పెద్ద గొడవలకు దారితీశాయి. ఈ క్రమంలోనే బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రవీణ్, తన భార్య రాజశ్రీతో పాటు మామ రాజశేఖర్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. వారు స్పృహ కోల్పోయిన తర్వాత, పక్కా పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న పెట్రోల్ను వారిపై పోసి నిప్పంటించాడు.ఈ ఘటనలో ఇద్దరూ పూర్తిగా కాలిపోయి బూడిదగా మారినట్లు సమాచారం.అనంతరం నిందితుడు తన కుమారుడు, కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. -
మంత్రి పదవిపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: మరోసారి మంత్రిపదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘అధికారం శాశ్వతం కాదు. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. నేను కూడా చాలా ఓపికతో ఉన్నాను. వివిధ కారణాలతో అధిష్టానం మంత్రి పదవి ఇవ్వలేకపోయింది. సమయం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది’ అని ఆయన అన్నారు." -
Updates : తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్మూసి అభివృద్ధిపై ప్రభుత్వం ఇచ్చిన సంతృప్తికరంగా లేనందున BRS వాకౌట్మూసి- డీపీఆర్ లేదు అని ప్రకటన చేశారు -మంత్రి డీపీఆర్ రెడీగా ఉన్నదని ప్రకటించారు.మూసిపై డీపీఆర్ ఉంటే అసెంబ్లీలో టేబుల్ చేయాలి.ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారు?మూసి అభివృద్ధిపై ప్రభుత్వానికి క్లారిటీ లేదు - కేటీఆర్లక్షన్నర కోట్ల దోపిడీకి మేము దూరం - మూసి అభివృద్ధికి కాదు.మొక్కజొన్న రైతుకు మద్దతుగా హరీష్ 8 లక్షల ఎకరాల్లో మొక్కలు రైతులు పండించారు.మద్దతు ధర లేక రైతులు నష్ట పోతున్నారు వర్షాల కారణంగా రైతులు నష్ట పోతున్నారు 25 శాతం పంట దళారుల చేతికి వెళ్లిందిపంటల బీమా అమలు చేయడం లేదు వడగండ్ల వానతో రైతులు నష్ట పోయారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు..వెంటనే ఇవ్వాలి 2400 మద్దతు ధర..500 బోనస్ వెంటనే ప్రభుత్వం ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తతమొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేపట్టిన నిరసనఅసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుబీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న మార్షల్స్ ఈ సమయంలో తోపులాట జరిగి మాజీ మంత్రి హరీష్ రావు చేతికి గాయం మొక్కజొన్న రైతులకు మద్దతుగా గన్పార్క్ వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనమొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి మొక్క జొన్నకు 500 బోనస్ ప్రకటించాలి మొక్క జొన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన -
Hyderabad: 2 వేల హోటళ్లు మూత!
సాక్షి,హైదరాబాద్: నగర హోటళ్లకు గడ్డుకాలం దాపురించింది. టిఫిన్ సెంటర్లు, తోపుడుబండ్ల పరిస్థితి మరీ దారుణం. వాణిజ్య సిలిండర్ సరఫరాలో కోత విధించడమే దీనికి కారణం. హోటల్ పరిశ్రమకు అందాల్సిన గ్యాస్లో మెజారిటీ వాటాను ఆసుపత్రులు, పాఠశాలలు వంటి అత్యవసర విభాగాలకు అధికారులు మళ్లిస్తున్నారు. దీంతో వాణిజ్య సిలిండర్ల డిమాండ్కు, సరఫరాకు మధ్య భారీ అగాధం ఏర్పడింది. నగరంలో 70 వేల నుంచి 80 వేల వరకు రెస్టారెంట్లు, టిఫిన్స్ సెంటర్లు ఉండగా, వారం రోజుల్లో 1,500 నుంచి 2 వేల వరకు మధ్య, చిన్న తరహా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు మూతపడ్డాయి. చాలా హోటళ్లలో మెనూ కుదించారు. ఎక్కువ సమయం ఉడికించాల్సిన వంటకాలను మెనూ నుంచి తొలగిస్తున్నారు. చాలా హోటళ్లు ఇండక్షన్ స్టౌలు, కట్టెల పొయ్యిల వైపు మళ్లుతున్నాయి. భారీ వంటకాలకు విద్యుత్ స్టౌలు సరిపోక సమస్య తలెత్తుతోంది. గృహ, రవాణాకు పూర్తిగా..కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యతలు మారాయి. వాణిజ్య అవసరాలకు (హోటళ్లు, రెస్టారెంట్లు) గ్యాస్ సరఫరాను కనిష్ట స్థాయికి తగ్గించారు. ప్రథమ ప్రాధాన్యం కింద సరఫరా గృహ అవసరాలకు, రవాణా రంగానికి పూర్తిస్థాయిలో గ్యాస్ కేటాయిస్తున్నారు. రెండో ప్రాధాన్యత కింద ఆసుపత్రులు, పాఠశాలలు (మిడ్ డే మీల్స్), అనాథ శరణాలయాలు, విద్యాసంస్థల హాస్టళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. పెట్రో కెమికల్ పరిశ్రమలకు సరఫరాను పూర్తిగా నిలిపివేసి, గృహ అవసరాలకు మళ్లిస్తున్నారు. దీని ప్రభావం హోటల్ రంగంపై పడింది. హోటల్ రంగానికి రోజుకు సుమారు 18 వేల నుంచి 23 వేల వాణిజ్య సిలిండర్ల అవసరం ఉండగా, 6,200 సిలిండర్లకు మించి సరఫరా కావడంలేదు. వచ్చే 15 రోజులు అత్యంత కీలకం మారాయి. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే హైదరాబాద్ హోటల్ రంగం భారీగానే నష్టపోయే ప్రమాదముందని హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. సామాన్యుడికి బయట భోజనం భారం కావడమే కాకుండా, హోటల్ రంగంపై ఆధారపడిన సుమారు 5 లక్షల మంది కారి్మకుల ఉపాధి ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యకం చేస్తున్నారు. -
Hyderabad: టిఫిన్ బిల్లులో 5 శాతం గ్యాస్ చార్జీలు
సికింద్రాబాద్లోని ఓ ఉడిపి హోటల్ నోటీసు ఇలా.. ‘‘ప్రస్తుతం జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ ధరలు, ముడి పదార్థాల ఖర్చులు పెరిగిన కారణంగా మా ధరలను 5 శాతం పెంచాల్సి వచ్చినట్లు తెలియజేస్తున్నాం. మీ సహకారానికి నిరంతర, హృదయపూర్వక కృతజ్ఞతలు. మద్దతుకు మా ధన్యవాదాలు’’.సాక్షి, హైదరాబాద్: అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సెగ భాగ్యనగరంలోని హోటల్ కంచానికి తాకింది. గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని హోటళ్లు ’గ్యాస్ చార్జీల’పేరిట అదనపు బాదుడు మొదలుపెట్టాయి. బెంగళూరు, చెన్నై బాటలోనే ఇక్కడ కూడా బిల్లులపై అదనపు చార్జీలు వసూలు చేస్తూ వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే హోటల్ ఫుడ్ బిల్లులో జీఎస్టీ, సీజీఎస్టీ 2.5 శాతం చొప్పున మొత్తం 5 శాతం పన్ను చెల్లిస్తున్న వినియోగదారులపై ‘గ్యాస్ సర్చార్జీల రూపంలో మరో 5 శాతం అదనపు భారం పడుతోంది. ఆహార పదార్థాలకు రూ.500 బిల్లు అయ్యే చోట, పన్నులన్నీ కలిపి ఇప్పుడు కస్టమర్ దాదాపు రూ.50 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. వారం రోజుల్లోనే టిఫిన్లు నుంచి భోజనం వరకు ప్రతి ఆహార పదార్థంపై రూ.10 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎక్కువ గ్యాస్ వినియోగించే వంటకాల ధరలు ఎగబాగాయి. తగ్గిన వాణిజ్య సిలిండర్ల లభ్యత కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాపై గణనీయంగా కోత విధించాయి. దీంతో హోటళ్లకు సిలిండర్ల లభ్యత పడిపోయింది. ఇది కూడా అధికారిక కనెక్షన్లు ఉన్న వాటి సంగతి. మరోవైపు రూ.2,105 ఉండాల్సిన వాణిజ్య సిలిండర్ ధర బ్లాక్లో రూ.4,500 నుంచి రూ.5,500 వరకు పలుకుతోంది. గ్యాస్ కోతకు తోడు బొగ్గు, కట్టెల ధరలు కూడా పెరగడంతో బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొనాల్సి వస్తోందని, ఆ భారాన్ని భరించలేక బిల్లుపై డైరెక్ట్గా 5 శాతం ‘గ్యాస్ చార్జీ’వేస్తున్నామని హోటల్ యజమానులు సమరి్థంచుకుంటున్నారు. -
కేర్.. డోంట్ కేర్!
హైదరాబాద్: ఈ రెండు ఫొటోలను చూశారుగా! ఒకటి కేరింగ్కు నిదర్శనంగా నిలిస్తే,మరోటి డోంట్ కేర్.. అన్నట్టుగా ఉంది కదూ! ఒడిలో ఒద్దికగా కూర్చున్న చిన్నారికి కూడా హెల్మెట్ పెట్టి బండి మీద భద్రంగా బడికి తీసుకెళ్తున్నాడు ఓ వ్యక్తి, భద్రతకు, బాధ్యతకు ప్రతీకగా! ఒకరుకాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలుగురు పిల్లల్ని బైక్పై కూర్చోబెట్టుకొని ప్రమాదకరంగా తీసుకెళ్తున్నాడు మరో వ్యక్తి, బాధ్యతారాహిత్యంగా! మాదాపూర్, హిమాయత్నగర్లో కనిపించిన ఈ దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. -
చీటీ తీసుకువచ్చావా.. రూ.1090 ఇచ్చి సిలిండర్ తీసుకో..
హైదరాబాద్: చీటీ తీసుకువచ్చావా.. రూ.1090 ఇచ్చి సిలిండర్ తీసుకో.. గ్యాస్ గోడౌన్లో తనిఖీలకు వెళ్లిన హైదరాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారికి ఎదురైన ప్రశ్న ఇది. శ్రీనగర్కాలనీలోని బంజారా గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ను, కార్యాలయాన్ని మంగళవారం డీఎస్వో శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ చేశారు. లోపలికి వెళ్లిన ఆయనకు అక్కడ సిబ్బంది ఒక్కో సిలిండర్కు రూ.1090 ఇవ్వాలని, చీటీ రాయించుకుని రావాలని చెప్పారు. దీంతో ఆయన అవాక్కయ్యారు. సిలిండర్ ధర రూ.965 కదా.. అధిక మొత్తం ఎందుకు వసూలు చేస్తున్నారని సిబ్బందిని ప్రశి్నస్తే మాకు తెలవదు.. రెండు వారాల నుంచి ఇలాగే వసూలు చేస్తున్నామని చెప్పారు. అక్కడి నుంచి బంజారా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి ఖైరతాబాద్ సర్కిల్–7 జ్యోతితో కలిసి వెళ్లి తనిఖీలు చేశారు. గత వారం రోజుల నుంచి రికార్డులు నిర్వహించడం లేదని, గ్యాస్ సరఫరా అప్డేట్ కూడా లేదని గుర్తించారు. మేనేజర్ కూడా లేకపోగా, లెక్కాపత్రాలు అసలే నిర్వహించడం లేదని తేలింది. సరైన సమాచారం కూడా ఇవ్వడం లేదని గుర్తించారు. సిలిండర్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని సరఫరా అవుతున్నాయి తదితర అంశాలపై సరైన లెక్కలు లేవని కూడా తేల్చారు. దీంతో ఈ గ్యాస్ ఏజెన్సీపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇండేన్ అయిల్ కంపెనీ సేల్స్ ఆఫీసర్కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ గ్యాస్ ఏజెన్సీపై కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. -
హైదరాబాద్లో భారీ వర్షం.. జిల్లాల్లో ఉరుములు, మెరుపుల వాన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, హైదరాబాద్లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. సిటీలోని పలుచోట్ల వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.హైదరాబాద్ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి 2 గంటల సమయంలో వాన దంచికొట్టింది. నగర వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినట్లు అయింది. ఉరుములు, మెరుపులు మెరిశాయి. చల్లని గాలులు వీచడంతో పూర్తిగా వాతావరణం మారిపోయింది.🚨TELANGANA WEATHERHyderabad: Heavy rains lashed several parts of the city, leading to waterlogging in low-lying areas and traffic disruptions on key roads. In Hyderabad, Uppal, and surrounding areas, commuters faced difficulties due to inundated streets.@metcentrehyd… pic.twitter.com/2P3byKyDVs— prudvi charan (@pudvicharan) March 17, 2026అమీర్పేట, ఎస్ఆర్నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్, షాపూర్, జీడిమెట్ల, మహేశ్వరం, షాద్నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్, బహదూర్పురా, కార్వాన్, కాటేదాన్, బార్కస్, చాంద్రయణగుట్ట, చార్మినార్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, సంతోష్నగర్, చాదర్ఘాట్, కోఠి, నల్లకుంట, రాంనగర్, తార్నాక, హబ్సిగూడ, సికింద్రాబాద్, ఖైరతాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, సోమాజిగూడ, మెహిదీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.రంగారెడ్డి, మహబూబ్నగర్, వికారాబాద్, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లోనూ వర్షం కురిసింది. అకాల వర్షానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల నేపథ్యంలో మామిడి కాయలు నేలరాలయి. వరి ధాన్యం కూడా అక్కడక్కడ తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. RURAL TG WARNING - 1.20 AM ⚠️⛈️While South Hyderabad gears up for POWERFUL THUNDERSTORM, districts like Rangareddy, Mahabubnagar, Wanaparthy, Gadwal, Vikarabad, Nagarkurnool to get SEVERE DOWNPOURS, T-STORMS, WINDS during next 3hrs STAY ALERT EVERYONE 🙏 These SEVERE… https://t.co/ArSOpr01Kd— Telangana Weatherman (@balaji25_t) March 17, 2026పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. బెల్లంపల్లి, చెన్నూరులో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్, హుజురాబాద్, శంకరపట్నం మండలల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షం పడుతోంది. పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలంలో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. కోల్బెల్ట్ ఏరియా రామగుండంలో వడగళ్ల వాన కురుస్తోంది. -
ఆ ఉత్తర్వులు చూపిస్తే రాజీనామా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం చూపిస్తే తాను తక్షణమే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా సంఘాలకు రూ.57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు మంత్రి సీతక్క చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 28 నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఎగ్గొట్టిందని విమర్శించారు. కాగితాలపైనే హామీలు ‘మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు? కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్ పెంపు, తులం బంగారం వంటి హామీలు అన్నీ కాగితాలపైనే మిగిలిపోయాయి. కేసీఆర్ కిట్ వంటి పథకాలను నిలిపివేయడం వల్ల తల్లీబిడ్డల సంక్షేమం దెబ్బతింటుంది. కేసీఆర్ పేరు ఇష్టం లేకపోతే రాహుల్గాంధీ కిట్ అని పేరు పెట్టి అయినా అమలు చేయండి. నిరుద్యోగులకు 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు పదే పదే అబద్ధాలు చెపుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 11,921 ఉద్యోగాలే ఇచ్చింది. మిగిలినవన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే. రేవంత్రెడ్డి ప్రభుత్వం యువతను మోసం చేస్తోంది.జాబ్ క్యాలెండర్లో జాబులు లేవు.. కేవలం తేదీలు మాత్రమే ఉన్నాయి. రైతులకు మూడు సీజన్లలో రైతు భరోసా ఎగ్గొట్టారు. డిసెంబర్లో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం పంటలు కోతకు వచ్చే టైంలో కూడా అందలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఉందని అప్పుడిస్తాం.. ఇప్పుడిస్తాం అంటూ లీకులిస్తున్నారు. 22 లక్షల మంది కౌలు రైతులకు ఇచ్చిన హామీలను కూడా పూర్తిగా తుంగలో తొక్కారు. ఏ గ్రామంలోనైనా రుణమాఫీ 100 శాతం అమలు జరిగిందని నిరూపిస్తే ఆ ఊరికి వెళ్లి నా రాజీనామా అందజేస్తా..’అని కేటీఆర్ మరో సవాల్ చేశారు. ఇబ్బందుల్లో విద్యార్థులు, ఉద్యోగులు ‘విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి. గురుకులాల్లో విషాహార ఘటనలు, మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గురుకులాలను మూసివేసే కుట్రలు సాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. భూముల విషయంలో చాలా కుట్రలు నడుస్తున్నాయి.హెచ్ఎండీఏ వంటి సంస్థల భూములను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. హిల్ట్ పాలసీ పేరుతో 9 వేల ఎకరాలు సంతర్పణ చేసేందుకు జరుగుతున్న కుట్రలను అడ్డుకుంటాం. ఉన్న సిటీని వదిలేసి ఫ్యూచర్ సిటీ పేరుతో గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. హైదరాబాద్లో దోమలు ఎన్నడూలేని విధంగా పెరిగిపోతే కనీసం ఫాగింగ్ చేసే నాథులు లేరు. మూసీ బ్యూటిఫికేషన్కు మేం వ్యతిరేకం కాదు. పేదలకు అన్యాయం చేయొద్దని అంటున్నాం. కాళేశ్వరంపై కుట్రలు ఆపి, మేడిగడ్డను నింపి రైతాంగానికి మేలు చేయాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మీరు ఎగ్గొట్టిన వడ్డీని మేం కట్టాం: భట్టి కేటీఆర్ మాట్లాడుతుండగా మధ్యలో జోక్యం చేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు రుణాలు ఇచ్చి ఎగ్గొట్టిన వడ్డీని తమ ప్రభుత్వం కట్టిందని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలకు ఇచ్చిన అన్ని రుణాలు కలిపి రూ.74 వేల కోట్లు అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.57 వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. -
ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో కలిసి ఇటీవల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్రెడ్డిని ఖర్గే, కేసీల వద్దకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఆయన్ను పరిచయం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మొన్నటి వరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్రెడ్డి చేసిన కృషిని వారికి వివరించారు. కాగా.. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ఖర్గే, కేసీలకు వేం నరేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. నరేందర్ రెడ్డిని వారు అభినందించారు. ఎంపీగా తనదైన ప్రత్యేక ముద్ర కనిపించేలా పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే.. ఆయనతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ పనితీరుపై చర్చించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కుదిరేలా, ప్రభుత్వ పథకాల అమలులో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకుకోవాలని ఖర్గే సూచించినట్లుగా తెలిసింది. ప్రతీ రెండు నెలలకోసారి ఈ కమిటీ సమావేశమై.. సమన్వయ అంశాలపై చర్చించాలని ఖర్గే తెలిపినట్లు చెబుతున్నారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి.. సీపీపీ చైర్మన్ సోనియాగాంధీ, లోకస్భలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాం«దీలను కలిసే అవకాశం ఉంది. అలాగే.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో జరిగిన భేటీలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, సురేశ్ షెట్కార్ ఉన్నారు. -
ఫామ్హౌస్ డ్రగ్స్పై సిట్
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్/శంషాబాద్ రూరల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా పలువురు హైప్రొఫైల్ వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటంతో ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. 9 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ బి.శివధర్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుదీర్బాబు పర్యవేక్షణలో ఈ బృందం పనిచేయనుంది. చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతం నేతృత్వంలో దర్యాప్తు చేయనుంది. మూడు నెలల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. సిట్ దర్యాప్తు సమయంలో కేసు మూలాలను పరిశీలించడంతోపాటు, నేరం జరగడానికి సంబంధించిన అన్ని అంశాలనూ విచారించాలని డీజీపీ పేర్కొన్నారు. పుట్టా మహేశ్, రోహిత్రెడ్డి ఈ పార్టీ ఎందుకు పెట్టారు? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫాంహౌస్లో ఒక భారీ డీల్ గురించే మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, ఏపీలోని ఏలూరుకు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్, వారి మిత్రులు కలిసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్లో రియల్ఎస్టేట్ లావాదేవీలపైనా డ్రగ్పార్టీ మీటింగ్లో చర్చించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో పలు రాష్ట్రాల వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉండటం.. ఏకంగా పోలీసులను బెదిరించేందుకు కాల్పులకు తెగబడటంతో వారంతా ఏదో పెద్ద డీల్ గురించే చర్చలు చేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. రియల్ఎస్టేట్, ఆర్థిక లావాదేవీలు వీరి మధ్య ఉన్నాయని, సెటిల్మెంట్లలోనూ కలిసి పనిచేస్తున్నారని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఫామ్హౌస్లో కొంతకాలంగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. ప్రధానంగా ఫామ్హౌస్ కేంద్రంగా రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న వీకెండ్ పార్టీలు, వాటికి హాజరవుతున్న హైప్రొఫైల్ వ్యక్తులు సహా రోహిత్ డ్రగ్స్ నెట్వర్క్పై వివరాలు సేకరించనుంది. కేసు విచారణలో రాబట్టాల్సిన కీలక విషయాలపై సిట్ అధికారులు శంషాబాద్ పోలీస్స్టేషన్లో సమావేశమయ్యారు. ఈ కేసు మూలాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి.. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు.. డ్రగ్స్ పార్టీ ఎందుకు నిర్వహించారు.. పార్టీ తరువాత వీరంతా ఏం చేయాలనుకున్నారు.. వంటి కీలక విషయాలను విచారణలో రాబట్టాలని చర్చించినట్లు తెలిసింది. దీంతోపాటు పోలీసులపై కాల్పులకు దిగిన ఢిల్లీకి చెందిన నమిత్ శర్మపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. ఆయన చేసే వ్యాపారాలు ఏంటి? రోహిత్ రెడ్డితో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి. గతంలో వీరంతా ఎప్పుడైనా కలిశారా..? వీరి మధ్య ఇప్పటివరకు ఏమైనా రియల్ఎస్టేట్ వ్యాపారం జరిగిందా? ఇలా పలు కోణాల్లో సిట్ వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఫాంహౌస్ సీజ్! పోలీసులు ఇప్పటికే చంచల్గూడ జైలు రిమాండ్లో ఉన్న రోహిత్రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ మినహా మిగతా 8 మంది నిందితులను మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విచారించారు. అయితే ఈ విచారణకు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్తోపాటు మరో నలుగురు నిందితులు హాజరు కాలేదు. పుట్టా మహేశ్ తరఫున న్యాయవాది విచారణకు హాజరైనట్లు తెలిసింది. నమిత్శర్మకు సంబంధించిన వివరాలతోపాటు పార్టీలో డ్రగ్స్ వినియోగం, కాల్పులకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ వివరాలతో సిట్ బృందం బుధవారం నుంచి దర్యాప్తు ప్రారంభించనుంది. ఏపీకి చెందిన పుట్టా మహేశ్, ఢిల్లీకి చెందిన నమిత్శర్మ సహా పలు రాష్ట్రాలతో లింకులు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లోనూ సిట్ దర్యాప్తు చేయనుంది. కాగా, రోహిత్రెడ్డి, రితేష్రెడ్డి, నమిత్ శర్మలను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన గన్ లైసెన్స్ను రద్దు చేయాలని సిట్ అధికారులు ఫ్యూచర్ సిటీ కమిషనర్ సు«దీర్బాబుకు లేఖ రాశారు. మరోవైపు అసైన్డ్ భూమిలో ఉన్న రోహిత్రెడ్డి ఫాంహౌస్ను సీజ్ చేయాలని సిట్ అధికారులు రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. -
కొత్తగా.. ఓ మెట్టు ‘ఎత్తు’గా!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు ఉన్నట్టుండి ఎత్తు పెరిగాయి. కొత్తగా తయారై రోడ్డెక్కుతున్న బస్సులు, సాధారణ బస్సుల కంటే చాలా ఎత్తుగా కనిపిస్తున్నాయి. దీంతో వాటి ముందుభాగం కలరింగులో కూడా స్వల్పంగా మార్పు చేసి ప్రత్యేకతను చాటేలా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. సాధారణ బస్సుల్లో ఐదు మెట్లు ఉండగా, బస్సు ఫ్లోర్ ఎత్తు పెరగడంతో ఇందులో ఆరు మెట్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా రెండు తలుపుల వద్ద ఫ్లోర్ సగం మేర మెట్టుగా మారింది. పాత తరహా బస్సుల ఫ్లోర్ అలవాటుతో వచ్చే ప్రయాణికులకు ఇది కొంత కొత్తగా, ఏమరపాటుగా ఉంటే ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు ప్రమాదాలకు గురికాకుండా వెంటనే, మెట్లు ఎత్తుగా మారిన విషయం గుర్తించేలా ఆర్టీసీ వాటికి పసుపు రంగు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసింది. మరి ఇంతకూ ఉన్నట్టుండి బస్సులు ఎత్తుగా ఎందుకు మారాయంటే...! ఆటోమోటివ్ ఇండస్ట్రీ ప్రమాణాల మార్పుతో... ఇటీవల కేంద్రప్రభుత్వం ఆటోమోటివ్ ఇండస్ట్రీ ప్రమాణాలను సవరించింది. బస్సు బాడీకి సంబంధించిన ఏఐఎస్–153 నిబంధనను సవరించింది. ఇది బస్బాడీ నిర్మాణంలో అదనపు అవసరాలకు సంబంధించింది. దీని ప్రకారం బస్సు ఫ్లోర్లో చక్రాలుండే చోట వేరుగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వీల్ డోమ్ ఉంటుంది. మిగతా ఫ్లోర్ అంతా సమంగా ఉండగా, వీల్ డోమ్ మాత్రం అరడుగు మేర ఎత్తుగా ఉంటుంది. అక్కడి సీటులో కూర్చుండే వారికి ఈ ఎత్తు చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాళ్లు ముడుచుకుని కూర్చోవాల్సిందే. ఇక టైర్ పేలినప్పుడు ఆ డోమ్ ఒక్కసారిగా ఒత్తిడితో లేచిపోయి అక్కడి ప్రయాణికులను గాయపరుస్తుంది. కొన్ని ప్రమాదాల్లో చనిపోయిన వారూ ఉన్నారు. దీంతో ఆ సీట్లలో కూర్చునే ప్రయాణికులు ప్రమాదాలకు గురి కాకుండా, అసౌకర్యానికి గురికాకుండా ఉండాలంటే ఫ్లోర్ అంతా సమంగా ఉండాలన్నది కొత్త నిర్ణయం. దీంతో వీల్ డోమ్ ఎంత ఎత్తుంటుందో... ఫ్లోర్ను అంత ఎత్తుకు పెంచి బస్సంతా సమాంతరంగా ఫ్లోర్ ఉండేలా మార్చారు. ఫలితంగా బస్సు ఫ్లోర్ ఎత్తు పెరిగి యావత్తు బస్సు బాడీ ఎత్తుగా మారింది. ఫలితంగా ఒక అదనపు మెట్టు వచ్చి చేరింది. ఇక కొత్తగా తయారయ్యే బస్సులన్నీ ఎత్తు బస్సులే. ఇలాంటి 300 కొత్త బస్సులు తాజాగా రోడ్డెక్కాయి. ప్రతి బస్సుకు రూఫ్ హాచ్.. ప్రీమియం కేటగిరీ బస్సుల్లో రూఫ్కు ప్రత్యేక హాచ్ (పైకి తెరుచుకునే భాగం) ఉంటుంది. లోనికి గాలి రావడానికి దాన్ని తెరిచి పెడుతుంటారు. కానీ, నిజానికి అది అత్యవసర ద్వారం. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు తలుపు ఉండేవైపు ఒరిగితే... నేలకు తగిలి ద్వారాలు మూసుకుపోయి ప్రయాణికులు అత్యవసర సమయంలో తప్పించుకోవడం కష్టంగా మారుతుంది. అలాంటి సందర్భాల్లో రూఫ్కు ఉండే అత్యవసర ద్వారం నుంచి వెలుపలికి వచ్చే వీలుంటుంది. తాజా మార్పుల మేరకు, ఇక నుంచి ప్రతి బస్సులో రూఫ్ హాచ్ తప్పనిసరి. ప్రీమియం కేటగిరీ బస్సు నుంచి పల్లెవెలుగు బస్సు వరకు అన్నింటా ఇది ఉండాల్సిందే. కాగా, తరచూ బస్సులు అగి్నప్రమాదాలకు గురవుతుంటాయి. మంట వచ్చేముందు పొగ రాగానే గుర్తించగలిగితే చాలా మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకునే వీలుంటుంది. ఇందుకోసం పొగను గుర్తించి అలారం మోగే వ్యవస్థ ఉండాలి. ఈ వ్యవస్థ కూడా ఇప్పుడు ప్రతి బస్సులో తప్పనిసరి చేశారు. కొత్త బస్సుల్లో ఈ వ్యవస్థ కూడా ఏర్పాటవుతోంది. -
ఆన్లైన్లో కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సును దూర విద్య, ఆన్లైన్ విధానంలో నేర్చుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, అప్లైడ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్టŠస్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, డిజైన్ అండ్ ప్లానింగ్ కోర్సులను కూడా ఆన్లైన్ ద్వారా నిర్వహించేందుకు వీలు కల్పించింది. 2026–27 విద్యా సంవత్సరానికి పలు కోర్సుల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ను ఏఐసీటీఈ తాజాగా విడుదల చేసింది. కొత్త సాంకేతిక విద్యా సంస్థల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న సంస్థల్లో కోర్సుల పొడిగింపు, దూరవిద్య, ఆన్లైన్ మోడ్లో కోర్సుల నిర్వహణకు మార్గదర్శకాలను పొందుపర్చింది. కంప్యూటర్ కోర్సులు పూర్తిగా సాంకేతికమైనవి కావడంతో నిపుణులైన బోధకులు ఉండాలని, అప్పుడే కోర్సుల నిర్వహణకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. కంప్యూటర్ కోర్సులు బోధించే అధ్యాపకులు ఆయా రంగాల్లో కనీసం మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. బోధన అనుభవం పదేళ్లకు తగ్గకుండా ఉండాలని సూచించింది. ఆన్లైన్ ద్వారా బోధించే అధ్యాపకుల పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఐసీటీఈ నిబంధన పెట్టింది. ఆన్లైన్ మెటీరియల్పై కూడా మండలి నిష్ణాతులు ముందుగా పరిశీలిస్తారు. ఎమర్జింగ్ కోర్సులకు ఆధునిక బోధన ప్రణాళిక ఉండాలని తెలిపింది. నైపుణ్యం కీలకంగా ఏఐసీటీఈ చెబుతోంది. కంప్యూటర్ కోర్సులను ఆన్లైన్లో బోధించే విద్యార్థులకు అవసరమైన స్కిల్ను నేర్పాలనే షరతు పెట్టింది. దీనికోసం విద్యా సంస్థలు సాఫ్ట్వేర్ సంస్థల భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవాలి. ఎన్ని గంటలు ప్రాక్టికల్ అనుభవం కలి్పస్తారనేది స్పష్టం చేయాలి. ఒక్కో కోర్సుకు ఒక్కో విధమైన నైపుణ్యం ఉంటుంది. ముఖ్యంగా ఎమర్జింగ్ కోర్సులకు కోడింగ్ను సాఫ్ట్వేర్ నిష్ణాతులతో అందించే ఏర్పాటు చేయాలని విద్యా సంస్థలను ఆదేశించింది. మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు గుర్తింపు ఉండే సంస్థల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇప్పించాలని సూచించింది. -
డ్రగ్స్ టెస్ట్కు సీఎం వస్తారు... మీ నేతలను తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయని ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చాక్లెట్ల రూపంలో కొకైన్ ఎక్కడపడితే అక్కడ దొరికిందని ఆరోపించారు. డ్రగ్స్తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేశారని, చిన్నపిల్లలు కూడా మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారని, తల్లిదండ్రులు పిల్లలను రక్షించుకునేందుకు ఎంతో ఆందోళన చెందారన్నారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై మంగళవారం శాసనమండలిలో కృతజ్ఞత తీర్మానాన్ని మహేశ్ గౌడ్ ప్రవేశపెట్టారు. మరో సభ్యుడు అద్దంకి దయాకర్ ఈ తీర్మానాన్ని బలపర్చారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు పూర్తిస్థాయిలో అమలయ్యాయని, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. మరో మూడేళ్ల సమయం ఉందని, ఈ లోపు ప్రతి హామీని అమలు చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు తగ్గకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముహూర్తం ఖరారు చేస్తా.. ఇటీవల మొయినాబాద్ ఫామ్హౌస్లో పరిస్థితి చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా కనిపించిందని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా చట్టసభలకు ఎన్నికైన వాళ్లే మాదకద్రవ్యాలు వాడుతూ బహిరంగంగా దొరకడం సిగ్గుచేటన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. బాధ్యత గల ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వ్యక్తి బహిరంగంగా డ్రగ్స్ తీసుకోవడంతో సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. ఇంత ఘోరం జరిగినా ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇంతలో బీఆర్ఎస్ సభ్యులు కలగజేసుకునే ప్రయత్నం చేయగా, మహేశ్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ను, యువనేత కేటీఆర్ను అసెంబ్లీకి తీసుకొచ్చి డ్రగ్స్ టెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. రేపే ముహూర్తం ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన వస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఒప్పించి పరీక్ష చేయిస్తామన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ బీఫామ్పై పోటీ చేసిన వాళ్లందరికీ డ్రగ్స్ టెస్టు చేయించాలని, కాంగ్రెస్ సభ్యులంతా కూడా ఈ పరీక్షలు చేయించుకుంటారని సవాలు విసిరారు. రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా చేశారని, అందుకే రేవంత్రెడ్డి డ్రగ్స్రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఈగల్ టీమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చివేశారని ఆగ్రహించారు. ప్రజలను మోసం చేశారు: మధుసూదనాచారి అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. రెండేళ్లు గడిచినా హామీల అమలును దాటవేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. మహిళలకు రూ.2,500, కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అంటూ కామారెడ్డి డిక్లరేషన్, రైతులకు ఇచ్చిన హామీలు ఇలా అన్నింటా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. స్వయం ఉపాధి రుణాలు అంటూ గతేడాది చేసిన ఆర్భాటం ఇప్పుడు జాడలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి చేతులెత్తేసిందన్నారు. యూరియా కోసం రైతులు కిలోమీటర్ల కొద్దీ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని, ఏవర్గం కూడా సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు. -
‘కోచ్’.. తూచ్!
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో రైల్వే శాఖ దోబూచులాడుతోంది. నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి చేయటానికి అంతా సిద్ధమైనప్పటికీ, అక్కడ ఉత్పత్తి ప్రారంభించేందుకు కనీస ఏర్పాట్లు కూడా మొదలు కాలేదు. విదేశాల నుంచి ఆధునిక యంత్రాలు దిగుమతి అయి దాదాపు 9 నెలలు అవుతోంది. ప్రధాన లైన్తో ట్రాక్ అనుసంధానం కూడా పూర్తయింది. ఈపాటికే ఉత్పత్తి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, రైల్వే శాఖ కనీసం టెండర్లు కూడా పిలవలేదు. ఎన్నో పోరాటాల పిదప సాకారమైన కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందో తెలియని గందరగోళం నెలకొంది. దీనివల్ల ప్రత్యక్షంగా 3 వేల కుటుంబాలకు, పరో క్షంగా మరో ఆరేడు వేల కుటుంబాలకు ఉపాధి లభించనుండటంతో ఆయా కుటుంబాలు ఉత్పత్తి ప్రారంభం కోసం ఆశతో ఎదురుచూస్తున్నాయి. దేశంలో వందేభారత్, వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం, వాటికి విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సిద్ధమైంది. ఇక్కడ ఆధునిక రైళ్లను తయారీ చేసే లక్ష్యంతో అందుకు వీలుగా మౌలిక వసతులు కల్పించారు. సాధారణ రైళ్లే కాకుండా మెట్రో రైళ్లను కూడా ఉత్పత్తి చేయగలిగే వసతి ఇక్కడ ఉంది. తొలుత ఏసీ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లను తయారు చేసేందుకు అనుమతించారు. ఎంఎంటీఎస్ తరహా లోకల్ రైళ్లను ఉత్పత్తి చేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా వందేభారత్ రైళ్ల తయారీకి నిర్ణయించారు. అయితే ఉత్పత్తి బాధ్యతను ఏ సంస్థకు అప్పగించాలన్న విషయంలో టెండర్లు పిలిచే పనిని చెన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి అప్పగించారు. ఈ క్రమంలో మార్చిలోనే ఉత్పత్తి మొదలవుతుందని భావించారు. కానీ ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియే మొదలు కాలేదు. దీంతో ఉత్పత్తి ఇప్పట్లో ప్రారంభం కాదన్న చర్చ అధికార వర్గాల్లో నడుస్తోంది.ఉత్తుత్తి హడావుడి..కాజీపేట శివారు మడికొండలో దాదాపు 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.521 కోట్ల వ్యయంతో భారీ ఫ్యాక్టరీని నిర్మించారు. నాలుగు రకాల ఉత్పత్తికి వీలుగా నాలుగు భారీ షెడ్లు నిర్మించారు. వాటికి వేరువేరు ట్రాక్లు ఏర్పాటు చేశారు. కాజీపేట–సికింద్రాబాద్ ప్రధాన లైన్తో అనుసంధానించారు. దాదాపు 13.15 కి.మీ. నిడివితో ఈ ట్రాక్ నిర్మాణం పూర్తయింది. జపాన్ సహా కొన్ని విదేశాల నుంచి ఆధునిక యంత్రాలు, స్థానికంగా తయారైన మరికొన్ని యంత్రాలు గతేడాదే వచ్చాయి. గతేడాది జూలైలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి 2026 మొదట్లోనే ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలూ ముందుకు సాగక పోవడం గమనార్హం. ప్రైవేటుకు పనులు?ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పర్యవేక్షించింది. కానీ ఉత్పత్తి బాధ్యతను రైల్వే శాఖ దానికి అప్పగించలేదు. చెన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ద్వారా టెండర్లు పిలిచి ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించే యోచనలో ఉన్నారు. ప్రైవేటు సంస్థకు ఉత్పత్తి బాధ్యత అప్పగిస్తే అందులో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కువ జీతాలకు పని చేసే వారిని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుని పనులు అప్పగిస్తే స్థానిక నిరుద్యోగ యువతకు అవకాశాలు సన్నగిల్లుతాయని అంటున్నారు. అయితే ఇటీవల ఉన్నట్టుండి ట్రాక్ మీద రైలుతో ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో ఉత్పత్తి కసరత్తు మొదలవుతోందనే ప్రచారం జరిగింది. కానీ.. ఏదో చేస్తున్నామనే హడావుడి కోసం ఢిల్లీ నుంచి రైల్వే అధికారులు చేసిన సూచన మేరకు ఉత్తుత్తి ట్రయల్ రన్ నిర్వహించారని స్థానిక అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఉద్యోగాల పేరిట దందా ఇటీవల వాట్సాప్లో కొన్ని ప్రకటనలు చక్కర్లు కొడుతున్నాయి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల ఎంపిక ఉందని, వివిధ సాంకేతిక పోస్టుల కోసం సంప్రదించాలంటూ కొందరు ఫోన్ నంబర్తో ప్రకటన ఇచ్చారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడానికే ఇలా చేశారని తెలుస్తోంది. ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని, ఇది మోసపూరిత ప్రకటన అని, రైల్వే ఉద్యోగాలకు అధికారికంగా పత్రికల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
డాక్టర్ల నియామకాల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశాఖలో జరుగుతున్న వైద్య నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా మారింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా చేపడుతున్న ఈ నియామకాల్లో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి 607 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ గత సంవత్సరం జూన్ 28న విడుదల కాగా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 600 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ కూడా గత ఏడాదే ఆగస్టు 22న వెలువడింది.అయితే తొలుత విడుదలైన డీఎంఈ నియామకాన్ని పక్కనపెట్టి, టీవీవీపీ నియామకాలు మొదట జరపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. కాగా టీవీవీపీలో అనస్తీషియా, పీడియాట్రిక్, గైనకాలజీ విభాగాలకు సంబంధించి ఈనెల 12 నుంచే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మిగతా బ్రాంచ్లకు సంబంధించి కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పూర్తి చేసి, నియామకాలు చేపట్టనున్నారు. డీఎంఈలో ఉద్యోగం వస్తే టీవీవీపీకి రాజీనామాలు? వైద్య వృత్తిని ఎంచుకునే వాళ్లు ఎక్కువ మంది డీఎంఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకే ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా టీవీవీపీ నియామకాలు పూర్తిచేస్తే, అభ్యర్థులు తాత్కాలికంగా ఆ పోస్టుల్లో చేరి, తరువాత డీఎంఈలో అవకాశం లభిస్తే రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఇప్పటికే భర్తీ చేసిన స్పెషలిస్ట్ పోస్టులు ఖాళీ కావడంతో పాటు, వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే టీవీవీపీ ఆస్పత్రుల్లో నిపుణుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఇలాంటి విధానం వల్ల పరిపాలనా వైఫల్యం మరోసారి బట్టబయలైందని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, డీఎంఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలను ప్రాధాన్యంగా పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని పేర్కొంటున్నారు. సీనియర్ రెసిడెంట్లు ఆందోళన టీవీవీపీ స్పెషలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసిన సీనియర్ రెసిడెంట్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము డీఎంఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు కాకపోవడంతో టీవీవీపీ నియామకాలపైనే ఆధారపడుతున్నామని, ముందుగా డీఎంఈ నియామకాలు పూర్తైతే, ఆ పోస్టులను ఆశించే అభ్యర్థులు నేరుగా అక్కడే చేరతారని, తద్వారా టీవీవీపీ పోస్టులు ఖాళీగా ఉండి నిజమైన అర్హులకు అవకాశాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. కానీ టీవీవీపీ నియామకాలు ముందుగా జరిగితే, కొంతమంది అభ్యర్థులు తాత్కాలికంగా చేరి తరువాత రాజీనామా చేయడం వల్ల సీట్లు వృథా కావడంతో పాటు, సీనియర్ రెసిడెంట్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నియామకాల క్రమాన్ని సవరించి ముందుగా డీఎంఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు, అనంతరం టీవీవీపీ స్పెషలిస్ట్ నియామకాలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేస్తే సీట్ల వృథా నివారించడంతో పాటు, అందరికీ న్యాయం జరిగి, వైద్య సేవలు, వైద్య విద్య రెండూ బలోపేతం అవుతాయని అభిప్రాయపడుతున్నారు. -
హవాలా సొమ్ము కొట్టేద్దామని..
మూసాపేట: యజమాని హవాలా సొమ్మును కొట్టేద్దామనుకున్న ఓ ముఠా గుట్టును పోలీసులు కొన్ని గంటల్లోనే చేధించారు. కేసు వివరాలను కూకట్పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ మంగళవారం కూకట్పల్లి పోలీస్స్టేషన్లో వెల్లడించారు. బహదూర్పురాలోని సిద్రా ఎంటర్ప్రైజెస్ యజమాని అమీర్ వద్ద మహ్మద్ ఖుస్రీద్దీన్, మహమ్మద్ అజీముద్దీన్ ఏసీ మెకానిక్లుగా పనిచేస్తున్నారు. దీంతోపాటు వీరు యజమాని ఆదేశాల మేరకు హవాలా నగదు బదిలీ కూడా చేసేవారు. రూ.10 కరెన్సీ నోటును టోకెన్గా చూపించగానే అవతలి వ్యక్తి నగదు ఇచ్చేవారు. దాన్ని వీరు షేక్ ఇబ్రహీం అనే వ్యక్తికి అందజేసేవారు. కొంతకాలానికి తాము చేస్తున్న నగదు లావాదేవీలు చట్టవిరుద్ధమైనవని ఖుస్రీద్దీన్ గ్రహించాడు. దీన్ని అవకాశంగా తీసుకుని.. ఆ డబ్బును కాజేయాలని ప్లాన్ వేశాడు. దీని కోసం తనకు పరిచయస్తుడైన డ్రైవర్ మహ్మద్ ఒమర్ షరీఫ్కు ఈ హవాలా లావాదేవీల గురించి చెప్పాడు. అవకాశం దొరకగానే డబ్బును కాజేయాలని స్కెచ్చేశారు. ఇలా చేసి.. దోచేద్దాం..సోమవారం జరిగే హవాలా లావాదేవీ సమయంలోనే తమ ప్లాన్ను అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. తమకు తెలిసిన డ్రైవర్లు అబ్దుల్ హమీద్, మహ్మద్ గౌస్ సద్దాంలతోపాటు చోటు, సల్మాన్, జీషాన్, జమ్మూలకు కూడా దోపిడీ గురించి చెప్పి.. అందరూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. నగదుతో తాను, అజీముద్దీన్ వస్తున్నప్పుడు దాడి చేసి ఆ సొమ్మును లాక్కుని వెళ్లాలని, అనంతరం ఆ డబ్బును పంచుకుందామని ఖుస్రీద్దీన్ చెప్పాడు. సోమవారం ఎప్పట్లాగే.. ఖుస్రీద్దీన్, అజీముద్దీన్ మోటార్ సైకిల్పై కూకట్పల్లికి వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తికి రూ.10 నోట్ను చూపించగానే.. ఒక దూది పెట్టెలో రూ.కోటి ఇచ్చాడు. అదే సమయంలో తమ కదలికలను ఖుస్రీద్దీన్ ఎప్పటికప్పుడు ఒమర్ షరీఫ్కు తెలిపాడు. దీంతో ఒమర్ షరీఫ్ తన అనుచరులతో కలిసి మూడు మోటార్ సైకిళ్లపై వాళ్లను వెంబడించాడు. రాత్రి 9.30 గంటల సమయంలో ఖుస్రీద్దీన్, అజీముద్దీన్ కూకట్పల్లిలోని పిల్లర్ నంబర్ 836 వద్దకు చేరుకోగానే వారిపై కారం చల్లారు. గందరగోళంలో ఎదురుగా ఉన్న బస్సును వారి బైక్ ఢీకొట్టింది. వాళ్లు కింద పడిపోయారు. అజీముద్దీన్ వద్ద ఉన్న డబ్బు బాక్స్ను ఒమర్ షరీఫ్ లాక్కున్నాడు. అయితే, ఈ దాడిలో సద్దాం కళ్లలో కూడా కారం పొడి పడటంతో రోడ్డుపై పడిపోయాడు. ఈ హడావుడిలో సద్దాంకు చెందిన వాహనాన్ని అక్కడే వదిలేసి ఖుస్రీద్దీన్ సహా నిందితులందరూ పారిపోయారు. ఈ వ్యవహారాన్ని అక్కడే గస్తీలో ఉన్న కానిస్టేబుల్ వైభవ్ గమనించి కూకట్పల్లి ఇన్స్పెక్టర్ కె.వి. సుబ్బారావుకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకొని, మహ్మద్ అజీముద్దీన్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.వాహనం నంబర్ ఆధారంగా..దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలోని సద్దాం వాహనాన్ని పోలీసులు గమనించారు. సద్దాం తల్లి ఫాతిమా పేరుపై బైక్ రిజిస్టర్ అయి ఉంది. ఆ వాహనం నంబర్తో ఇంటి చిరునామా తెలుసుకొని అక్కడికి వెళ్లారు. సద్దాం ఫోన్ నంబర్ తీసుకుని ట్రేస్ చేయగా శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఉన్నట్లు తెలిసింది. వెంటనే కూకట్పల్లి ఇన్స్పెక్టర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు అక్కడికి వెళ్లి నిందితులు మహ్మద్ ఒమర్ షరీఫ్, హమీద్, సద్దాంలను ఒక బ్యాగ్తో సహా పట్టుకున్నారు. వారిని విచారించగా డబ్బు తీసుకుని లక్నోకు వెళ్తున్నామని తెలిపారు. వారి నుంచి రూ. 77,39,000 నగదు, రూ.39,195 విలువైన విమానం టికెట్లు, ఒక వాహనం, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకు న్నారు. మిగిలిన డబ్బు, హవాలా లావాదేవీల వ్యవహారాలు వంటి వివరాలు దర్యాప్తు అనంతరం తెలుస్తాయని, ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని, మిగతావారు పరారీలో ఉన్నట్లు డీసీపీ రితిరాజ్ తెలిపారు. 24 గంటల్లోనే కేసును చేధించిన కూకట్పల్లి పోలీసులు, సీసీఎస్ బాలానగర్ బృంద సభ్యులను అభినందించి, రివార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, సీసీఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, కూకట్పల్లి ఎస్హెచ్ఓ కె.వి. సుబ్బారావు, సీసీఎస్ సీఐ రవికుమార్, అడ్మిన్ ఎస్ఐ రామకృష్ణ, ఎస్ఐలు చంద్రశేఖర్, గిరీష్ పాల్గొన్నారు. -
నాలుగు నెలల గర్భిణిని చంపిన భర్త
కోరుట్ల రూరల్: నాలుగు నెలల గర్భిణిని భర్త దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో జరిగింది. కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి ఏడాదిన్నర కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్న వారిద్దరి మధ్య ఇటీవల తరచూ చిన్నచిన్న గొడవలు తలెత్తాయి. నాలుగు నెలల కిందట వైష్ణవి గర్భం దాల్చింది. అప్పటి నుంచి వైష్ణవి మాదాపూర్లోని తల్లి గారింట్లోనే ఉంటోంది. కోరుట్ల ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేసిన హరిబాబు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. భార్య మాదాపూర్లోనే ఉండటంతో హరిబాబు కూడా అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో హరిబాబు భార్యను కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మంగళవారం వేకువజామున ఎవరూ నిద్రలేవక ముందే హరిబాబు గదికి బయట నుంచి గడియవేసి వెళ్లిపోయాడు. ఉదయం వైష్ణవి తల్లిదండ్రులు అనుమానంతో గదిలోకి వెళ్లి చూడగా మృతిచెంది ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు హరిబాబు పరారీలో ఉన్నాడు. అదనపు కట్నం కోసమే కూతురు వైష్ణవిని చంపారని.. ఆమె మృతికి కారణమైన భర్త హరిబాబు, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు గంధం ప్రసాద్–రాణి డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మెట్పల్లి డీఎస్పీ రాములు తెలిపారు. -
పిల్లలు చూస్తుండగానే.. భార్య గొంతు కోసి..
సనత్నగర్ (హైదరాబాద్): అనుమానం పెనుభూతమై కట్టుకున్న ఆలిని కడతేర్చింది. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావంటూ కూరగాయలు కోసే కత్తితో భార్యను హతమార్చిన ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అశోక్ వివరాలు తెలిపారు. తాండూరుకు చెందిన నరేశ్ (40), రేణుక (38) దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ఫతేనగర్లోని వాసవీ బృందావన్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి పదేళ్లలోపు వయసున్న ముగ్గురు కుమార్తెలున్నారు. రేణుక గుర్తుతెలియని వ్యక్తులతో ఫోన్ మాట్లాడుతోందంటూ తరుచూ ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో మరోసారి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాగి్వవాదం తీవ్రరూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన నరేశ్ అక్కడే ఉన్న కూరగాయలు కోసే కత్తితో రేణుక గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పిల్లల కళ్లముందే తల్లిని హతమార్చడం అందరినీ కలచివేసింది. పిల్లలు బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కేటీఆర్ X మంత్రులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండోరోజు మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతిసవాళ్లకు శాసనసభ వేదికైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే సమయంలో విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ మంత్రులు అన్నట్టుగా సభ సాగింది. కేటీఆర్.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధతను ప్రశ్నిస్తూ, ఆ ఆరు అంశాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని ధ్వజమెత్తారు. కేటీఆర్కు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రశ్నల వర్షం సుమారు 1.40 గంటల పాటు మాట్లాడిన కేటీఆర్.. గవర్నర్ ప్రసంగంలోని అంశాలతో పాటు రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభు త్వం విఫలమైనందుకు ధన్యవాదాలు తెలపాలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్కార్డుల విషయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డికి మధ్య సమన్వయ లోపం ఉందని వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్న సీఎం సంతకానికి విలువలేకుండా పోయిందని విమర్శించారు. ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు. దీనిపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఎం సంతకానికి జీరో వాల్యూ అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి విమర్శలతో మంత్రుల ఫైర్ కేటీఆర్ ప్రసంగానికి పలుమార్లు అడ్డుపడిన మంత్రులు.. ప్రతి విమర్శలకు దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలను ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగాన్ని చదివి ఉపన్యాసా లు ఇవ్వాలని మంత్రి శ్రీధర్బాబు హితవు పలికా రు. గోబెల్స్ సదస్సులో రూ.లక్షల కోట్లు పెట్టుబడు లు వచ్చాయని చెప్తున్నా, టీజీఐఐసీ గణాంకాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యల పై స్పందిస్తూ.. ఎంఓయూలు కుదిరినా అవి ఆచరణలోకి వచ్చేందుకు సమయం పడుతుందంటూ వివరణ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి.. తెల్లరేషన్కార్డులు, సన్న బియ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా మిస్ బ్రిటన్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి..సీతక్కకు మద్దతుగా మాట్లాడారు. అనర్హత పిటిషన్లపై కేటీఆర్ మాట్లాడినప్పుడు మంత్రి పొంగులేటి..కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!‘శోభాకృత నామ, క్రోదీకృత నామ సంవత్సరాలు పోయాయి. విశ్వావసునామ సంవత్సరం 19న పోతోంది. రేపు పరాభవ నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మిగిలింది పరిహాసమే. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే. ఉగాదులు వస్తున్నయి.. పోతున్నయి. గ్యారంటీలు మాత్రం రావడం లేదు. గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీలు, డిక్లరేషన్ల ఊసే లేదు. మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా రు. ప్రభుత్వ అర్ధభాగం గడిచిపోయింది. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. సినిమా పేరు అభయహస్తం.. లోపల కథ చూస్తే భస్మాసుర హస్తం అని ప్రజలకు అర్థమైంది. మూడు ముక్కల్లో చెప్పాలంటే హామీలు ఎగ్గొట్టు.. కట్టిన వాటిని కూలగొట్టు.. ఉన్న పథకాలను చెడ గొట్టు..అన్నట్టుగా కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన ఉంది..’ అంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు. రైతు భరోసా, మహాలక్ష్మీ, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లను ఉద్దేశించి..ఈ ఆరు గ్యారంటీల (అభయ హస్తం) ఫైలు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఆ ఫైలు ఆచూకీ కోసం సిట్ వేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ ‘ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై సీఎం రేవంత్ తొలి సంతకం చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పానికి నిదర్శనమని 2023 డిసెంబర్ 15న కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన తన తొలి ప్రసంగంలో నాటి గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. సీఎం సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది? ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? తొలి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పటికే 50–60 కేబినెట్ సమావేశాలు జరిగినా అతీగతీ లేదు. కొంతమంది ఆస్తులకు జీరో వేల్యూ చేసినట్టు సీఎం రేవంత్ అన్నారు. సీఎం సంతకానికి, ఆయన సంతకం చేసిన ఫైల్కి, మీ గ్యారంటీల కార్డుకి, మీ డిక్లరేషన్లకి, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి ఎక్కడ? ‘ఆరు గ్యారంటీలతో ఏటా ప్రతి కుటుంబానికి రూ.2.50 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చారు. ఏటా రూ.2.75 లక్షల కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఖర్చు చేశారా? రూ.2.5 లక్షల లబ్ధి పొందిన ఒక్క కుటుంబాన్నైనా చూపించగలరా? నేనే రాజు నేనే మంత్రి.. అని మిడిసిపడ్డ వారెవరూ సంపదలను, పదవులను మూటగట్టుకుని పోలేదని భాగవతంలో బలి చక్రవర్తి అన్నారు..’ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇటీవల ‘నేనే రాజు..నేనే మంత్రి’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంపై పరోక్ష విమర్శలు చేశారు. ఎవరికి ధన్యవాదాలు తెలపాలి? ‘ధన్యవాద తీర్మానంపై చర్చలో ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి? రూ.4 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న 46 లక్షల మందికా? రూ.6 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న దివ్యాంగులకా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులకా? డీఏలు, పీఆర్సీ, బెనిఫిట్స్ అందని 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకా? నెలకు రూ.2,500 కోసం నిరీక్షిస్తున్న కోటి 65 లక్షల మంది ఆడపడుచులకా? విషాహారంతో చస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలా?..’ అని కేటీఆర్ నిలదీశారు. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే.. ‘ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే. నేను కర్ణుడిలాంటి వాడిని అని ఇటీవల సీఎం అన్నారు. ఎన్నికలయ్యాక కుంభకర్ణుడు అయ్యారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరి గినా తెలంగాణలో గొప్ప పాలన చేస్తున్నామంటూ ప్రజాధనంతో ప్రకటనలు ఇస్తున్నారు. పీసీ సర్కారు మాయాజాలాన్ని ఈ సర్కారు మరిపించింది. అట్టర్ ఫ్లాప్ సినిమాకి సంబరాలు చేస్తారా?. ఢిల్లీకి పోయి నిధులు తెస్తారనుకుంటే ఇచ్చి వస్తున్నారు. బాకీలు.. బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు! చెప్పుకోవడానికి ఏం ఉంది? బాకీలు..బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు. బుల్డోజర్ల చప్పుళ్లు..బూతుల మోతలు. ఆల్టైమ్ రికార్డు అప్పులు.. క్యూలైన్లో చెప్పులు. 420 హామీల ఎగనామాలు.. మూడున్నర కోట్ల మందికి పంగనామాలు. నోటిఫికేషన్లు నిల్.. లూటిఫికేషన్లు ఫుల్లు. చెక్డ్యామ్ల పేలి్చవేతలు..అడుగడుగున అణచివేత. క్రెడిట్ చౌర్యం.. భూముల బేరం. స్కాముల కళకళ.. స్కీముల వెలవెల. రైతన్నలకు బేడీలు.. నిరుద్యోగులపై లాఠీలు. ఫిరాయింపుల కంపు.. బస్సు చార్జీల వాయింపు. ఫుడ్ పాయిజనింగ్ చావులు.. ఫుట్బాల్ సరదాలు. గల్లీల్లో చెత్తకుప్పలు.. ఢిల్లీలో విమానయాత్రలు. మాటలు ధడేల్.. చేతలు తుఫేల్. దరఖాస్తులు.. దండాలు.. దఫ్తర్లు..’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంకో 4 రోజులైతే ట్రిలియన్ డాలర్లు వచ్చేవి..! ‘గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు, ఐటీ ఉద్యోగాలు 9.39 లక్షలకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. అయితే 2023–24లోనే 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలున్నాయి. మరి కాంగ్రెస్ వచ్చాక 7 వేల ఉద్యోగాలు తగ్గాయా? ఐటీ ఎగుమతులు రూ.3.60 లక్షల కోట్లకు చేరాయని మంత్రి శ్రీధర్బాబు చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. తప్పుదోవ పట్టించిన ఐటీ శాఖ కార్యదర్శిని తీసి చెత్తబుట్టలో పారేయండి. గోబెల్స్ (గ్లోబల్) సమ్మిట్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. కానీ టీజీఐఐసీ వెబ్సైట్ ప్రకారం 2022–23లో 3,010, 2023–24లో 4 వేలు కొత్త పరిశ్రమలు వస్తే కాంగ్రెస్ వచ్చాక 2024–25లో 2,050, 2025–26లో 1,026కి ఎందుకు తగ్గాయి? 2031 కల్లా ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తామన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రూ.100 కోట్లు పెట్టి డేరా నగర్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలినప్పుడు.. సమ్మిట్ ఇంకో నాలుగు రోజులు నడిపిస్తే అక్కడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమయ్యేది. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. రూ.కోటి కోట్లు సమకూరితే రాష్ట్రం 100 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుంది. పెట్టుబడులు వెల్లువెత్తినట్టు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తల కణతపై తుపాకులు పెడితే వారు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తర్వాత. ముందు వారికి నెలకు రూ.2,500 ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు పెట్టాలి. రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇవ్వలేదు..’ అంటూ కేటీఆర్ విమర్శించారు. ఎంఓయూలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ స్థలాలపై కోర్టుకు ఒకటి.. బయటకు ఇంకొకటి ‘ఫార్మాసిటీ కోసం మా ప్రభుత్వం 14వేల ఎకరాలను సేకరిస్తే అప్పుడు భట్టి రైతులకు వెనక్కి ఇస్తామన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ప్రభు త్వం చెప్పుతున్నట్టు అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులకు ఇళ్లు, జూపార్క్, స్టేడియం కట్టడం కుదరదు. ఫార్మాసిటీకి ఆ స్థలాలను వాడతామని ప్రభు త్వం కోర్టుకు చెప్పింది. బయట ఇంకొకటి అంటున్నారు..’ అని తప్పుబట్టారు. ‘హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలప్పుడు మిస్ బ్రిటన్ దేశం వదిలి పారిపోయింది. ఆమెను వ్యభిచారిణిలాగా భావన కలిగేలా వ్యవహరించారని సన్ మ్యాగజైన్లో వచ్చింది. మిస్ బ్రిటన్కు వేధింపులు ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే జీరో చేశారు ‘రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్గా చేసి ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. ఈ రోజు ఆదాయం అంచనాలు తప్పుతున్నాయి. బడ్జెట్ అంచనాలు బోల్తా కొడుతున్నాయి. కరోనా కాలం తరహాలో తిరోగమనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది. డే ఎకానమీ ఢమాల్ అన్నది. ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట. మేము దిగేసరికి రూ.3.47 లక్షలతో తలసరి ఆదాయంలో నంబర్ వన్గా ఉండగా, ఈ రోజు అదీ తగ్గింది. జీఎస్టీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. మందుగమనం ఒక్కటే జోరుగా ఉంది. 2023 డిసెంబర్ నుంచి ఈ రాష్ట్రంలో జీరో వేల్యూ మిషన్ ప్రారంభమైంది. అన్నీ ఫాల్.. మీరేమో జాకీలు పెట్టి రైజింగ్ అంటున్నారు. నీరో చక్రవర్తి గురించి విన్నాం. జీరో చక్రవర్తిని చూస్తున్నాం..’ అని కేటీఆర్ విమర్శించారు. మాజీ సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్రెడ్డిలను ప్రస్తావించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును విస్మరిస్తున్నారని విమర్శించారు.మీదే ఫ్లాప్ సినిమా!‘శాసనసభకు 2023లో జరిగిన ఎన్నికల్లో ఫ్లాప్ అయింది మీరు. లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. మల్ల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయ్యారు. అన్నిసార్లు ఫ్లాప్ అయ్యి మమ్మల్ని ఫ్లాప్ అంటారు ఏంటి?’ అని బీఆర్ఎస్ నేత కేటీఆర్పై శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు మండిపడ్డారు. తీరు మార్చుకుంటే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెరుగయ్యే అవకాశం ఉంటదని హితవు పలికారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో సర్కారుపై కేటీఆర్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఎవరో రాసిన స్క్రిప్్టను చదువుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అధిష్టానాన్ని కలిసేందుకు ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తామని అన్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం ఎన్నిసార్లు అయినా ప్రధానిని, మంత్రులను కలుస్తాం. రాష్ట్ర ప్రజల అబివృద్ధి. సంక్షేమానికి నిధులు ఇచ్చేందుకు తప్పకుండా ఢిల్లీకి పోతాం. మీరు ప్రాంతీయ పార్టీ (బీఆర్ఎస్)గా ఉండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీరు ఎన్నిసార్లు బీజేపీ ప్రధానమంత్రి వద్దకు పోలేదు?..’ అని శ్రీధర్బాబు నిలదీశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ పరిశ్రమలు వస్తే వాటికి అనుబంధంగా నివాస, వినోద, క్రీడా, ఐటీ రంగ సదుపాయాలూ వృద్ధి చెందుతాయన్నారు. గ్రీన్ఫార్మా పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని కోర్టుకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంవోయూలపై శ్వేతపత్రం ప్రకటిస్తాం.. ‘గ్లోబల్ సమ్మిట్లో రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంవోయూలు ఎందుకు చేసుకున్నారని కేటీఆర్ అంటున్నారు. ఎంవోయూలు చేసుకోకపోతే బాగుండుననేది వారి ఆలోచనగా కనపడుతోంది. కేటీఆర్ కూడా దావోస్కు వెళ్లారు. ఆయనకు అన్నీ తెలుసు. ఎంవోయూల్లో 30–40 శాతమే సఫలీకృతం అవుతాయని మన సీఎంకు మహారాష్ట్ర సీఎం తెలియజేశారు. త్వరలో వీటిపై శ్వేతపత్రం ప్రకటిస్తాం. మహిళలను లక్షాధికారులను చేస్తామని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అన్నారు. దానికి కొనసాగింపుగానే వారిని కోటీశ్వరులను చేయాలని సంకల్పించాం. ఈ విజన్ను కూడా హేళనగా, చులకనగా మాట్లాడడం సరికాదు. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు బీఆర్ఎస్ వారు ఇక్కడ ఉండేవారా? సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్కు మించిన దిట్ట లేరు. ఐటీ ఉద్యోగాలు తగ్గిన విషయం పరిశీలిస్తాం. ఐటీ ఎగుమతుల విలువలో సంఖ్యాపరంగా తప్పులుంటే సరిచేసుకుంటాం..’ అని మంత్రి అన్నారు. దళితుడిని సీఎం చేశారా?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘హామీలు అమలు కావడం లేదని ఆరోపించడం సరికాదు. దళితుడిని సీఎం చేస్తామనని..భూమి లేని పేదలకు మూడెకరాల భూమి ఇస్తామని మీ లెక్క హామీలిచ్చి విస్మరించలేదు. మీరు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నాం..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చింది వాస్తవమేనని, ఒక్కో కుటుంబానికి ఎన్ని లక్షలు వారి ఖాతాల్లో జమ చేశామో లెక్కలతో సహా వివరిస్తానన్నారు. 53–54లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్టు గుర్తుచేశారు. రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా వేశామన్నారు. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కి రూ.500 బోనస్ ఇస్తున్నామని, రూ.12 వేలు రైతు భరోసా, బోనస్ కలిపి ఒక్కో ఎకరానికి రూ.25 వేలు చొప్పున రైతులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. మహిళలంటే కోపం ఎందుకు ?: సీతక్క మహిళలంటే మీకు ఎందుకంత వ్యతిరేకత అని కేటీఆర్పై మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. తరతరాలుగా అణచివేతకు గురైన మహిళలు స్వశక్తితో ఎదుగుతుంటే సహకరించాలని హితవు పలికారు. వైఎస్ ప్రభుత్వం తెచ్చిన అభయహస్తం పథకం నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ‘పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారు? ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? దళితులకు భూములు ఎందుకు పంచలేదు?’ అని నిలదీశారు. దళితుడిని సీఎం చేసిందుకా? బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క తెల్లరేషన్కార్డు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని హామీ ఇచ్చి చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలా? సన్న బియ్యం ఇస్తున్నందుకు, యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం, ఆరీ్టసీలో మహిళలకు ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినందుకు తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలన్నారు. మా హక్కులను రక్షించాలి.. తలసాని కేటీఆర్ మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే జోక్యం చేసుకోవడం సభా మర్యాదలకు భంగం కలిగించడమేనని బీఆర్ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తమ హక్కులను సభాపతి రక్షించాలని విజ్ఞప్తి చేశారు.అలా ఎలా సార్?‘అధ్యక్షా మీరు కూడా.. మాపార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తే ఎలా సార్?, ఆయనను ఆడ కూర్చోబెడితే..’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం శాసనసభలో ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడిన ఆయన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ను ఇటీవల స్పీకర్ కొట్టివేయడాన్ని ప్రస్తావించారు. ‘మీరు నిర్ణయం తీసుకున్నారు. దాంతో మాకు విభేదం లేదు.. నా ప్రార్థన..’అని కేటీఆర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా స్పీకర్ అడ్డు తగిలారు. ‘కోర్టులో జడ్జి తీర్పు ఇస్తే నచ్చకపోతే పైకోర్టుకు పోతాం. మీరు కూడా జడ్జిమెంట్ చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసిన్రు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. జడ్జిమెంట్ పూర్తిగా చదివితే మాట్లాడాలి. మీకు చెపుతున్నా..ఈ ప్రశ్నించేదానిని తగ్గించుకుంటే మంచిగుంటది..’అని అన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అయినా ప్రశ్నించే అధికారం సభ్యుడిగా నాకుంటది. మీరు జ్యుడీషియరీ నేను కాదనడం లేదు. ప్రజాస్వామ్యంలో నిలదీయడం, అడగడం మా బాధ్యత..’అని అన్నారు. మంత్రి పొంగులేటి ఆగ్రహం కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. ‘జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని, మీ జడ్జిమెంట్ను కూడా ప్రశ్నించే స్థాయిలో మాట్లాడుతున్నారంటే..వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో గమనించాలి. అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో నాలుగుసార్లు ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా మీరు గమనించాలి. పార్టీలు మారడాన్ని పోత్సహించిందే మీరు..’అని బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. మంత్రి మాటలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘హైకోర్టు తీర్పు ఇస్తే సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే రివిజన్కు వెళ్లే హక్కు ఉంటుంది. హరియాణలో ఆయారాం గయారాం విధానాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ..’అని చెప్పారు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. ‘ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నా, మీరు అడ్డుకోవడం లేదు. మీరు మారాలి. బడివె అని సీఎం అంటే కూడా స్పందించలేదు. గ్రహణం కొన్ని గంటలే ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు..’అని వ్యాఖ్యానించారు. -
జమ్మూ కాశ్మీర్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారిణి ప్రతిభ
సాక్షి,హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్లో మార్చి 7 నుంచి 13 వరకు జరిగిన ఫెన్సింగ్ ఈవెంట్ (కబడ్డీ క్లస్టర్)లో తెలంగాణ పోలీస్ క్రీడాకారిణి షేక్ ఫౌజియా (PC 13109) విశేష ప్రతిభ కనబరిచారు. భోంగిర్ రూరల్ పోలీస్ స్టేషన్కు చెందిన ఆమె మహిళల ఫోయిల్ విభాగంలో ఫైనల్కు చేరుకొని రజత పతకం సాధించారు. ఈ విజయంపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆమెను, కోచ్ ఎస్.ఆర్. అర్జున్ను అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. ఐజీపీ (స్పోర్ట్స్) డాక్టర్ గజారావు భూపాల్, ఏసీపీ & స్పోర్ట్స్ ఆఫీసర్ రామారావు సమక్షంలో ఈ విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. షేక్ ఫౌజియా సాధించిన ఈ రజత పతకం తెలంగాణ పోలీస్ క్రీడా విభాగానికి గర్వకారణంగా నిలిచింది. -
వికారాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు.. ఆర్ఐ రిచర్డ్ సైమన్ అరెస్ట్
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని పెద్దేముల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) రిచర్డ్ సైమన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సమాచారం ప్రకారం.. గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మోటేషన్ ఫైల్ కోసం ఆర్ఐ రిచర్డ్ సైమన్ వద్ద పని చేయించుకోవడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా రూ.15,000 లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు పెద్దేముల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బాసర ట్రిపుల్ ఐటీలో ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT)లో మరో విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థిని తేజస్విని(17) అనారోగ్యంతో మృతి చెందారు. లుకేమియాతో బాధపడుతున్న ఆమె.. క్యాంపస్లో అనారోగ్యానికి గురై.. ఇంటికి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచినట్లు విశ్వవిద్యాలయ అధికారులు వెల్లడించారు.అట్టుడికిన పరిపాలన భవనంతేజస్విని మృతి వార్త తెలిసిన వెంటనే క్యాంపస్లో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్లే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి వరకు విద్యార్థులు పరిపాలనా భవనాన్ని (అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్) ముట్టడించారు. 'వీసీ రావాలి.. మాకు న్యాయం చేయాలి' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు. సుమారు 4 వేల మంది విద్యార్థులు అర్ధరాత్రి దాటాక కూడా ఆందోళన చేశారు.ప్రాణాల మీదకు తెస్తున్న సదుపాయాల లేమి!ధర్నాలో పాల్గొన్న విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్యాంపస్ ఆసుపత్రిలో కనీస వైద్య పరికరాలు, నిపుణులైన వైద్య సిబ్బంది లేరని విద్యార్థులు మండిపడ్డారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సైతం గుర్తించడంలో అధికారులు విఫలమవుతున్నారని, పరిస్థితి విషమించిన తర్వాతే ఇంటికి పంపిస్తున్నారని ఆరోపించారు.సకాలంలో సరైన చికిత్స అందకపోవడం వల్లే విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యాలయం వద్దే భోజనాలురాత్రి వరకు ఆందోళన కొనసాగడంతో విద్యార్థులు హాస్టళ్లకు వెళ్లడానికి నిరాకరించారు. దీంతో అధికారులు దిగివచ్చి, పరిపాలనా భవనం వద్దనే విద్యార్థులకు భోజన ఏర్పాట్లు చేశారు. విద్యార్థిని మృతి పట్ల అధికారులు సంతాపం ప్రకటించినప్పటికీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.ఉద్రిక్తత.. పోలీసుల అప్రమత్తతబాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. సుమారు 9000 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ విద్యాసంస్థలో, కేవలం కొందరు విద్యార్థులు నాయకులుగా ముందుకు వచ్చి ఆందోళనలు చేపట్టడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చినట్లు పోలీసులు ఆరోపించారు.విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశంతో చేపట్టిన ఆందోళనలు, కొన్నిసార్లు నియంత్రణ దాటే ప్రమాదముండడంతో పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. శాంతి భద్రతలను కాపాడటం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం తమ ప్రధాన బాధ్యత అని నిర్మల్ జిల్లా SP జానకి షర్మిల తెలిపారు. తాను స్వయంగా విశ్వవిద్యాలయాన్ని చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులతో మాట్లాడుతున్నట్లు ‘సాక్షి వెబ్డెస్క్’తో చెప్పారు.“ప్రతి విద్యార్థికి తన అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు ఉంది. అయితే అది చట్టబద్ధంగా, శాంతియుతంగా ఉండాలి. కొందరి చర్యల వల్ల మిగతా విద్యార్థులకు, సంస్థ ప్రతిష్టకు ఇబ్బంది కలగకూడదు” అని ఆమె పేర్కొన్నారు. కొందరి ఆందోళనల కారణంగా సంస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత విద్యార్థిని ముందు నుంచే అనారోగ్యంతో బాధపడ్డారని, మెరుగైన వైద్యం కోసం ఇంటికి వెళ్లారని చెప్పారు.ఆర్జీయూకేటీ సంతాపంతేజస్విని మరణం పట్ల విశ్వవిద్యాలయ యంత్రాంగం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ‘మెదక్ జిల్లా రామచంద్రాపురం నివాసి అయిన తేజస్విని (తండ్రి: నారాయణ), గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం నిమిత్తం ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. గత కొన్ని నెలల నుంచి తేజస్విని ఇంటిదగ్గరే చికిత్స తీసుకుంటున్నారు’ అని వివరించింది. తేజస్విని మృతి పట్ల విశ్వవిద్యాలయం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు మీడియాకు వాట్సాప్ ద్వారా ప్రకటనలను విడుదల చేసింది. -
HYD: మీరు తినేది అల్లం పేస్ట్ కాదు.. ఏం కలుపుతున్నారంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలో రెండు కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇరువురిని అరెస్టు చేయగా.. సుమారు రూ.7 లక్షల విలువైన సరుకు స్వాధీనం చేసుకున్నారు. బోరబండలోని మధురా నగర్, టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలైమెట్ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా.. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో భారీగా కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.బోరబండలోని మధురా నగర్లో 'A1 సహారా గోల్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్' పేరుతో ఈ అక్రమ తయారీ సాగుతోంది. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి. రాఘవేందర్ నేతృత్వంలోని బృందం, GHMC ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జంగారెడ్డితో కలిసి ఈ దాడి నిర్వహించారు. నిందితుడు మొహమ్మద్ అబ్దుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, దుమ్ము, ఈగలు ముసిరే ప్లాస్టిక్ టబ్బులలో పేస్ట్ను నిల్వ చేస్తున్నారు. నాణ్యత లేని ముడిసరుకుతో పాటు అసిటిక్ యాసిడ్, అధిక మొత్తంలో ఉప్పు, వెల్లుల్లి పొట్టును కలిపి కల్తీ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో తయారైన ఈ ప్రమాదకరమైన పేస్ట్ను హోల్సేల్ కిరాణా షాపులకు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ నిందితుడు భారీగా లాభాలు గడిస్తున్నట్లు గుర్తించారు.సుమారు రూ. 4,50,000 విలువైన నిల్వలను, యంత్రాలను సీజ్ చేశారు. 4275 కిలోల వెల్లుల్లి ముడిసరుకు (95 బస్తాలు), 150 కిలోల వెల్లుల్లి పొట్టు, 55 కిలోల విడి అల్లం వెల్లుల్లి పేస్ట్, 800 కిలోల ఉప్పు, పసుపు, ప్యాక్ చేసిన వివిధ పరిమాణాల పౌచ్లు, మిక్సర్, గ్రైండర్, పీలింగ్ మెషీన్, ప్యాకింగ్, వెయిట్ మెషీన్లు స్వాధీనం చేసుకున్నారు.టప్పాచబుత్రాలో..టప్పాచబుత్రాలో మరో కేంద్రంపై హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) బృందం దాడి చేసింది. టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని మలైమెట్ ప్రాంతంలో సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నిందితుడు మొహమ్మద్ జాఫర్ ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్లో సిట్రిక్ యాసిడ్, అధిక మొత్తంలో ఉప్పు వంటి రసాయనాలను కలిపి కల్తీ చేస్తున్నారు.ఈ పేస్ట్ను దుమ్ము, ఈగలు ముసిరే ప్లాస్టిక్ టబ్బులలో, బహిరంగంగా నిల్వ చేస్తున్నారు. సుమారు రూ. 2,50,000 విలువైన నిల్వలను, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ పేస్ట్ను నగరంలోని వివిధ హోల్సేల్ కిరాణా దుకాణాలు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ నిందితుడు అక్రమంగా లాభాలు గడిస్తున్నాడు. FSSAI లైసెన్స్లో పేర్కొన్న చిరునామాకు, ప్రస్తుతం తయారీ సాగుతున్న చిరునామాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు గుర్తించారు. -
హైదరాబాద్లో ఇలాంటి చికెన్ తింటున్నామా..?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఓ చికెన్ సెంటర్పై వారసిగూడ పోలీసులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్ బాపూజీ నగర్లోని 'ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్' (A-1 Fresh Chicken Mart) యజమాని షేక్ షకీల్ కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నాడు. అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్ను స్థానిక ప్రజలకు, చిన్న వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఇవాళ మధ్యాహ్నం సమయంలో వారసిగూడ సబ్ ఇన్స్పెక్టర్ కే.రామచంద్రారెడ్డి తన సిబ్బందితో చికెన్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. సుమారు 610 కిలోల చికెన్ అత్యంత అపరిశుభ్రమైన స్థితిలో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. నిల్వ ఉంచిన మాంసం పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రదేశంలో ఎలుకలు, పిల్లుల సంచారం ఉండటంతో మాంసం పూర్తిగా కలుషితమైంది. కాగా, సదరు చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ ఏడాది క్రితమే ముగిసినప్పటికీ, నిందితుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. -
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాన
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ఇన్సాపూర్లో వర్షం పడింది. సంగారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాలకు మామిడి, వరి పంట నేల రాలుతోందని రైతులు అంటున్నారు.కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, సోమవారం రాత్రి కూడా హైదరాబాద్. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది.తెలంగాణలోని 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ‘సైబర్ హైజీన్ వర్క్షాప్’
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) #OnlineButUnafraid థీమ్తో మహిళా జర్నలిస్టుల కోసం సైబర్ హైజీన్ వర్క్షాప్ను నిర్వహించింది. ఈ వర్క్షాప్ ద్వారా మీడియా వృత్తి నిపుణులకు డిజిటల్ ప్రపంచంలో భద్రతగా ఉండెందుకు అవసరమైన అవగాహన , ప్రాయోగిక జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీజీసీఎస్బీ తెలిపింది.తెలంగాణా డీజీపీ బి. శివధర్ రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, శిఖా గోయల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ మీడియా సంస్థల నుంచి మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, పెరుగుతున్న సైబర్ నేరాల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలను సాధ్యమైనంత త్వరగా రిపోర్ట్ చేయడం అత్యంత అవసర మని సూచించారు. మీడియా వృత్తి నిపుణులు తమను తాము రక్షించుకోవడమే కాకుండా, తమ వేదికల ద్వారా ప్రజలకు సైబర్ భద్రత, బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తనపై అవగాహన కల్పించాలని సూచించారు.డిజిటల్ ప్రపంచం ఎన్నో అవకాశాలను అందిస్తున్నప్పటికీ, ముఖ్యంగా ప్రజల ముందుకు వచ్చే వృత్తుల్లో ఉన్న మహిళలకు కొత్త రకాల ముప్పులను కూడా తెస్తుందని TGCSB డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు. సైబర్ భద్రతలో అవగాహన సైబర్ హైజీన్ మొదటి రక్షణ రేఖలని, అవగాహన ఉన్న వ్యక్తులు సైబర్ నేరాలకు తక్కువగా గురవుతారని తెలిపారు. అలాగే జర్నలిస్టులు సమాజంలో సైబర్ నేరాలపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.#OnlineButUnafraid కార్యక్రమం కింద చేపట్టిన ఈ కార్యక్రమం డిజిటల్ నమ్మకాన్ని పెంపొందించడంతో పాటు, ఆన్లైన్లో బాధ్యతాయుతంగా ఉండేలా చూడటం, సైబర్ భద్రతా చర్యలను అలవాటు చేయించడం లక్ష్యంగా కొనసాగిస్తున్న ప్రయత్నంలో భాగమన్నారు. సైబర్ ముప్పు ఉన్నప్పటికీ, అవగాహన, అప్రమత్తత, సమయానుకూల చర్యల ద్వారా వాటిని సమర్థంగా తగ్గించవచ్చన్నారు. వీటిపైస్పష్టమైన అవగాహన ఉన్నపుడు డిజిటల్ ప్లాట్ఫారంలను భయపడకుండా, అవగాహనతో, అప్రమత్తంగా భద్రంగా వినియోగించు కోవచ్చని ఆమె సూచించారు.ఈ వర్క్షాప్లో వేటిన్స్ (Vatins) సీఈవో ఎన్వీ సన్నీ ఎన్వీ సైబర్ హైజీన్, అభివృద్ధి చెందుతున్న సైబర్ ముప్పు,ఆన్లైన్ భద్రతపై వివరణాత్మక ప్రజెంటేషన్ అందించారు. సైబర్ నేరాల ధోరణులు, జర్నలిస్టులు ఎదుర్కొనే డిజిటల్ ముప్పులు, మహిళలను లక్ష్యంగా చేసుకునే సాధారణ సైబర్ నేరాలు వంటి అంశాలు చర్చించారు. ముఖ్యంగా సైబర్ స్టాకింగ్, ఆన్లైన్ వేధింపులు, లైంగిక బెదిరింపులు, వేధింపులు నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఫోటో మోర్ఫింగ్ , మ్యాట్రిమోనియల్ మోసాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే సైబర్ నేరాల్లో నమ్మకం, వ్యక్తిత్వం మరియు డిజిటల్ ప్రవర్తనను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో వివరించేందుకు వాస్తవ సంఘటనల ఆధారంగా కేస్ స్టడీస్ను కూడా వివరించారు.పాల్గొన్న వారికి సైబర్ నేరాలకు సంబంధించిన సందేహాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించడం, వ్యక్తిగత, వృత్తిపరమైన డిజిటల్ భద్రతను కాపాడుకోవడం, ఆన్లైన్ వేధింపులను ఎదుర్కోవడం మరియు సైబర్ ఘటనలకు సమర్థంగా స్పందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే 1930 నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్, ఆన్లైన్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయడంప్రాముఖ్యతను కూడా వివరించారు. -
లేడీ కాదు.. మహా కిలాడీ.. వైద్యురాలిగా నటిస్తూ!
సాక్షి, హైదరాబాద్: వైద్యురాలిగా నటిస్తూ రోగులను మత్తులో ముంచి దోచుకుంటున్న కిలేడీ, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలానికి చెందిన గౌండ్ల శిరీష.. వివిధ ఆసుపత్రులలో వైద్యరాలిగా నటిస్తూ రోగులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుంటోంది. ఆమెకు సహకరిస్తున్న భర్త ఎడులపల్లి సాయి కుమార్ను కూడా సికిందరాబాద్ జోన్ టాస్క్ఫోర్, మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితురాలు శిరీష ప్రస్తుతం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (Pharm.D) చదువుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సులభంగా డబ్బు సంపాదించేందుకు తన భర్తతో కలిసి ఆసుపత్రులలో దొంగతనాలకు ప్లాన్ చేసింది. తన వైద్య పరిజ్ఞానంతో వృద్ధ మహిళా రోగులను లక్ష్యంగా చేసుకునేది. డాక్టర్ ఆప్రాన్ (Apron) ధరించి ఆసుపత్రిలోకి ప్రవేశించి, తన వెంట తెచ్చుకున్న 'డయాజెపామ్' (Diazepam) అనే మత్తు ఇంజక్షన్ను బాధితులకు ఇచ్చేది. వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యేది.గత మార్చి 11న సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో, అలాగే చందానగర్లోని సిటిజన్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వీరు ఇదే తరహాలో చోరీలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొమ్మును విలాసాలకు, షాపింగ్కు ఖర్చు చేసేవారు. వీరి నుంచి సుమారు 11 తులాల బంగారం, మారుతీ సుజుకీ బాలెనో కారు, రెండు సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు
హైదరాబాద్: నగర శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ ఉంటారు. సిట్ సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ ఎం.రవీందర్, షాద్నగర్ డీసీపీ శిరీష, ఈగల్ ఫోర్స్ ఆఫీసర్లు సి.హరీష్ చంద్రారెడ్డి, ఎన్.బుచ్చయ్య, మొయినాబాద్ ఎస్హెచ్వో మల్లికార్జున రెడ్డి, ఎస్సైలు కోటేశ్వరరావు, సదాత్ అలీని ప్రభుత్వం నియమించింది. మరోవైపు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదారుడు రితేష్ రెడ్డి గన్లైసెన్స్ను రద్దు చేయాలని సీపీకి సిట్ అధికారులు లేఖ రాశారు. రితేష్రెడ్డికి 2017లో గన్ లైసెన్స్ జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. రివాల్వర్ మిస్ యూజ్పై చర్యలు తీసుకోవాలని సీపీని సిట్ అధికారులు కోరారు. అలాగే, అసాంఘిక కార్యక్రమాలకు పైలెట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ అడ్డాగా మారిందని, దాన్ని సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు పోలీసులు లేఖ రాశారు. కాగా, మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు రాజకీయంగానూ కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. పలువురికి డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కూడా ఈ కేసులో దొరికిపోయిన విషయం తెలిసిందే. -
కూలేశ్వరం వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
-
జగిత్యాల జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్నానని చెబుతున్న సంజయ్.. నన్ను తనతో కలిసి పనిచేయాలని ఎలా అడుగుతారంటూ ప్రశ్నలు సంధించారు. నాడు ప్రతిపక్షంలో ఉండి ఒంటిచేత్తో అధికారపార్టీతో పోరాటం చేసిన నేను మంత్రి కావాలనుకోవడం తప్పా?. పార్టీ ఫిరాయింపునకు నాకు అవకాశం లేకుండేనా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు దశాబ్దాల బంధాన్ని విడిచి పెట్టుకోవడం ఎవరికైనా ఇబ్బందే. ఆ స్థితిలో నేను ఇవాళ బాధ పడుతున్నాను. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ.. నన్నే తనతో కలిసి పని చేయాలని ఆఫర్ ఇస్తున్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయడంలో తప్పు లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, హక్కులను కాల రాయడం, అభ్యర్థుల ఎంపిక చేయడం ఇవన్నీ సమంజసమా?. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను పార్టీలో ఎదురవుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశాను. ఇందుకు ఎమ్మెల్యే సంజయ్ కారణం కాదా. 1995లో చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఎక్కడా పోటీకి కూడా వెనుకంజ వేసిన కాలంలో జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం అన్నీ గెల్చుకున్నాం. వీడిపోవడానికి కారకుడైన వ్యక్తి ఇవాళ కలిసి పని చేస్తానంటున్నాడు. నేను ఎక్కడ ఉన్నా అంకితభావంతో పనిచేస్తా. ఈ ఎమ్మెల్యే సంజయ్ ఒత్తిడితో ఓ ఆడబిడ్డ మున్సిపాలిటీలో ఇబ్బంది పడింది నిజం కాదా?. నాకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు?. నేను పార్టీ వీడుతానని ఆయనకు చెప్పానా?. పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు?. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు?. నన్ను ఎలా కలిసి రమ్మంటారు?. సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని సంజయ్ అంటున్నారు. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టించుకోడు. చట్టసభల్లో ఎంపికైన వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలి. నేను ఇంతవరకు కూడా కాంగ్రెస్లోనే ఉన్నాను. ఉండాలని ఇంకా కోరుకుంటున్నా. ఇంట్లో ఉడుం లాగా వచ్చి చేరితే ఆయనతో కలిసి ఎలా పనిచేస్తాం. నిన్నటి వరకు రాష్ట్రానికి జగిత్యాల ఆదర్శంగా ఉంటే ఇవాళ వివాదాలకు కేరాఫ్ చేశాడు. రాముడు నాకు ఆదర్శం. అందుకే శ్రీరామనవమి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టుకున్నా. నేను పార్టీ మారితే దానికి కారణం ఎమ్మెల్యే సంజయ్, ఆయన వెనుకున్న వారే కారణం అవుతారు. ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ అధిష్టానానిదే బాధ్యత. నాకు పార్టీ మారాలనే యోచనకు కారణం ఈ ఆవేదనే’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ.. కేటీఆర్ Vs కాంగ్రెస్..
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్..కేటీఆర్ కామెంట్స్..మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు.మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు.రూ.16వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేయవచ్చు.ఎరువులు అడిగితే రైతులపై దాడులు చేస్తున్నారు.షాపులో ఇవ్వాల్సిన యూరియా యాప్లో ఇస్తామంటున్నారు.బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.ఈసారైనా బడ్జెట్లో బీసీలకు కేటాయింపులు చేయాలి.దళిత బంధును బొందపెట్టారు.. ఇప్పటికైనా ఇవ్వాలి.హిల్ట్ పాలసీలో పెద్దపెద్ద కుంభకోణాలు జరగబోతున్నాయి.20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కడతామన్నారు? ఏమైంది?.రాజకీయం, అధికారం శాశ్వతం కాదు.. కానీ, తెలంగాణ శాశ్వతం.తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణకు విఘాతం కలిగించేలా ఉన్నాయి.ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వ్యవసాయాన్ని బాగు చేసింది కాళేశ్వరమే.మా మీద కోసం రైతుల మీద చూపెట్టకండి.మేము ఏ ప్రాజెక్ట్ కట్టినా దేవుళ్ల పేర్లు పెట్టాం.మీలా పార్టీ నాయకుల పేర్లు పెట్టలేదు.సింగరేణిలో పెద్దపెద్ద కుంభకోణాలు బయటపడుతున్నాయి.నైనీ టెండర్ రద్దు చేశారు. మిగతా టెండర్లు కూడా రద్దు చేయాలి.మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకిద్దాం.బస్తీ దవాఖానాలు మూతపడుతున్నాయి.బస్తీ దవాఖానాల్లో మందులు లేవు.మా ఎమ్మెల్యేలపై దాడులు చేస్తున్నారు. కేటీఆర్ కామెంట్స్..మహిళలకు న్యాయం చేస్తున్నాం అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ ఇంగ్లాండ్ ఇండియా వదిలి వెళ్లారు.మిస్ ఇంగ్లాండ్ పట్ల అసభ్య ప్రవర్తన చేసి తెలంగాణ పరువు అంతర్జాతీయంగా చేశారు.మిస్ ఇంగ్లాండ్ ఘటనపై సిట్ వేయాలి. మంత్రి సీతక్క కామెంట్స్..కేటీఆర్కు మహిళలు అంటే అంత కోపం ఎందుకు?ఉచిత బస్సు ఇచ్చినా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేశారు.మేడారంలో మహిళలు 9 కోట్లు సంపాదించారు.పదేళ్లు మహిళలకు ఎందుకు న్యాయం చేయలేదు.పథకాలు ఎందుకు ఇవ్వలేదు.మహిళల అభయహస్తం నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుంది.మహిళలను ఎదుగనివ్వండి.మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..మాది జాతీయ పార్టీ.పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఢిల్లీకి ఎన్ని సార్లు వెళ్లింది.రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ఢిల్లీకి వెళ్తాం.సోనియా గాంధీ నిర్ణయం మేరకే తెలంగాణ ఏర్పాటు జరిగింది.తెలంగాణ ఏర్పాటులో అందరిని ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది.సోనియా గాంధీ నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ ఎక్కడ ఉండేది.ఒక లక్ష్యంతో తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నాం.5లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి.బీఆర్ఎస్ పాలనను ముందుకు తీసుకెళ్లడం తప్పా?మహిళలు కోటీశ్వరులు కావడం తప్పా?తెలంగాణ ప్రజల విశ్వాసాలపై వ్యంగ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. కేటీఆర్ విమర్శలు..గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీ, డిక్లరేషన్ పదం రాకుండా చూసుకున్నారురెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో డైవర్షన్లు, కమీషన్లు మాత్రమే ఉన్నాయి.మొన్న ఇండియా టీ-20 గెలిచింది కానీ కాంగ్రెస్ పోటీలో ఉంటే 420 గెలుస్తారు.కాంగ్రెస్ పాలన అంటే పని చారానా.. ప్రచారం బారానా..గ్రాఫిక్స్ మాయాజాలంలో కాంగ్రెస్ కనికట్టు చేస్తోంది.కాంగ్రెస్ సినిమా బయట అభయహస్తం.. లోపల చూస్తే భస్మాసుర హస్తం!మీరు ఢిల్లీకి వెళ్తే మాకేం అభ్యంతరం లేదు.ఢిల్లీ నుంచి నిధులు తెస్తారనుకున్నాం.కానీ, నిధులు ఇచ్చి వస్తున్నారు.మొన్న రూ. వెయ్యి కోట్లు ఇస్తాం అన్నారు.కేబినెట్ ఆమోదించిన గవర్నర్ ప్రసంగంలోనూ విశ్వసనీయత లేదు. డిప్యూటీ సీఎం భట్టి కామెంట్స్..బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంత మందికి వచ్చాయి??మేము 4.5లక్షల ఇందిరమ్మ ఇండ్లను పేదలకు కట్టిస్తున్నాం.వీటి కోసం రూ.22500 కోట్లు ఖర్చు చేశాం. హామీల అమలుపై కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదు.కోటీ ఆరు లక్షల కుటుంబాలకు సన్నబియ్యం ఇస్తున్నాం.రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. తెలంగాణ శాసన సభలో గందరగోళంకేటీఆర్ కామెంట్స్..అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరు.వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు కానందుకు ధన్యవాదాలు చెప్పాలా?గ్యారెంటీ కార్డు పేరుతో మోసం చేస్తే ధన్యవాదాలు చెప్పాలా?ఆరు గ్యారెంటీలపై మాట్లాడుతున్న కేటీఆర్ స్పీచ్ను అడ్డుకున్న మంత్రి కోమటిరెడ్డికోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్కేటీఆర్ మా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి.రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రుణమాఫీ చేసినందుకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పాలి.మీలాగా దళిత ముఖ్యమంత్రి అని మాట తప్పలేదు.కేటీఆర్ ఓపికతో వినాలి.బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నం చేస్తున్నాంఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలి.కేసీఆర్ చేసిన అప్పులు తీర్చుతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి.తలసాని కామెంట్స్..సభలో సభ్యుల హక్కులను కాపాడాల్సింది స్పీకర్ప్రతీసారి ప్రసంగానికి అడ్డుతగలడం సరికాదు. రైతుల వినతిపత్రాలతో అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలురైతుల వినతిపత్రాలతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలువినతిపత్రాలు లోపలికి తీసుకెళ్లకుండా అడ్డుకున్న పోలీసులుఅసెంబ్లీ లాబీలో బీజేపీ ఎమ్మెల్యేల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకున్న పోలీసులుతామే అసెంబ్లీలోనికి దరఖాస్తులు పంపిస్తామని తెలిపిన పోలీసులుపోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం 20న అసెంబ్లీలో బడ్జెట్..గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చఇవాళ, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చబీఆర్ఎస్ తరపున శాసనసభలో మాట్లాడనున్న కేటీఆర్, పల్లా రాజేశ్వర్రెడ్డిబీఆర్ఎస్ తరపున మండలిలో మాట్లాడనున్న మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్ఈనెల 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వంరెండో రోజు ప్రశ్నోత్తరాలు రద్దుఅసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ప్రశ్నోత్తరాలు రద్దుగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నేడు అసెంబ్లీలో చర్చతీర్మానాన్ని ప్రతిపాదించనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్తీర్మానాన్ని బలపరచనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్సభ ముందుకు ఇన్ఫర్మేషన్ కమిషన్ పెండింగ్ నివేదికలుబీఏసీ నిర్ణయాలను సభ ముందు ఉంచనున్న సీఎం రేవంత్రెడ్డిసభ టేబుల్పై తెలంగాణ ఇన్ఫర్మేషన్ కమిషన్ వార్షిక నివేదికలుబీజేపీ వాయిదా తీర్మానంశాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానంఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయాలని వాయిదా తీర్మానంబీఆర్ఎస్, సీపీఐ వాయిదా తీర్మానంఉభయసభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానంరిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లింపు జాప్యంపై వాయిదా తీర్మానంరిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానంరిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్పై అసెంబ్లీలో చర్చించాలని సీపీఐ వాయిదా తీర్మానం -
రోహిత్రెడ్డి ఫాంహౌస్పై ప్రత్యేక నిఘా
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డికి చెందిన అజీజ్నగర్ ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం కేసులో పోలీసులు కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. విందులో వాడిన కొకైన్ ఎవరు సరఫరా చేశారు..? ఎంత కాలం నుంచి ఇక్కడ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయి..? ఎప్పుడెప్పుడు జరిగాయి? ఎవరెవరు వస్తుంటారు..? తదితర అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తర్వాత ఇక్కడ పలుసార్లు విందులు జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. తాజా ఘటన నేపథ్యంలో నిశిత పరిశీలన చేస్తున్నారు. నెలలో రెండు, మూడుసార్లు రోహిత్రెడ్డి ఫాంహౌస్లో పార్టీలు నిర్వహిస్తుంటారని తెలుస్తోంది. అప్పుడప్పుడు తప్ప ప్రతిసారీ కొత్త వ్యక్తులే వస్తారనే ప్రచారం ఉంది. ఇలా ఇప్పటివరకు వచి్చనవారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పార్టీలో విదేశీ మద్యం, గాంజా, డ్రగ్స్ వినియోగించారా? ఎక్కడినుంచి వచ్చాయి. ఎవరు తెచ్చారు. ఎవరెవరు తీసుకున్నారు? అనే వివరాలను రాబడుతున్నారు. వరుస వివాదాల నేపథ్యంలో గట్టి నిఘా పెట్టారు. డ్రగ్స్ పార్టీ, కాల్పుల తర్వాత ఎవరెవరు వచ్చారనేది తెలుసుకునేందుకు గస్తీ కాస్తున్నారు. ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. -
మాట్లాడుకుందామని పిలిచి అంతమొందించాడు
ఉప్పల్: ఏఆర్ కానిస్టేబుల్ హత్య కేసులో పోలీసులు నిందితులను ఆరుగంటల్లోపే ఛేదించారు. ఉప్పల్ డీసీపీ కె.సురేష్ కుమార్ తెలిపిన మేరకు.. బానోతు సంతోష్ తరుణ్, సుధీర్ కుమార్ ముగ్గురూ స్నేహతులు. మూడు రోజుల క్రితం సుదీర్ తన బావ ఇంటి గృహప్రవేశానికి వీరిని పిలిచాడు. అయితే ఫంక్షన్ రోజున సంతోష్ చేసిన ఫోన్ కాల్స్ను సుధీర్ రిసీవ్ చేసుకోలేదు. ‘నన్ను పిలిచి.. నా ఫోన్ ఎత్తవా అంటూ ఆగ్రహానికి గురయ్యాడు. వాట్సాప్లో తీవ్ర పదజాలంతో ఇద్దరి మధ్యా చాటింగ్ జరిగింది. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ‘మాట్లాడుకుందాం రా’ అని సుదీర్ను చిలుకానగర్ ఖాళీ స్థలానికి పిలిచారు. అక్కడ సంతోష్.. సుదీర్ను విచక్షణా రహితంగా పొడిచాడు. సు«దీర్ రోడ్డుపైకి పరుగులు తీసినా వదలకుండా వెంటాడి అందరూ చూస్తుండగానే పొడిచి చంపేశాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. సంతోష్ తోపాటు తరుణ్ నాగారంలోని సంతోష్ అక్క ఇంటికి చేరుకున్నారు. తెల్లవారే ముందే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే నిందితుల ఫోన్ సిగ్నల్స్, సీసీ ఫుటేజీలను ఆధారంగా నిందితులను తెల్లవారుజామున 4 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని, తన ఇన్స్ర్ట్రాగామ్లో కూడా స్ట్రీట్ ఫైటర్ నంటూ పోస్టులు పెట్టుకున్నాడని తెలిపారు.సోమవారం రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
తెలంగాణలో వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో వడగళ్ల వాన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. సోమవారం రాత్రి సంగారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇక, నేడు(మంగళవారం) కూడా పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలో సోమవారం రాష్ట్రంలోనే అత్యధికంగా 6.4 సెం.మీ, మెదక్ జిల్లా నర్సాపూర్లో 3 సెం.మీల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది. నిజామాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబ్నగర్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, నారాయణపేట, వికారాబాద్, సిద్దిపేట తదితర జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిశాయి.Today's FORECAST - March 17, 2026 ⚠️⛈️Today, scattered INTENSE THUNDERSTORMS along with HAILSTORMS ahead in Vikarabad, Sangareddy, Rangareddy, Kamareddy, Bhadradri - Kothagudem, Mulugu, Mahabubabad, Yadadri - Bhongir, Jangaon, Medak, Siddipet during afternoon to nightIsolated…— Telangana Weatherman (@balaji25_t) March 17, 2026కాగా, మంగళ, బుధవారాల్లో చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈదురు గాలులు 40 నుంచి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో పంటలకు, తోటలకు నష్టం వాటిళ్లే ప్రమాదముందని అధికారులు సూచిస్తున్నారు. నేడు ఖమ్మం, సిరిసిల్ల, వరంగల్, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. హైదరాబాద్లో రాత్రి సమయంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉంటుంది. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి. Sangareddy District Heavy Hailstorm Rain pic.twitter.com/OqnO9TmSuy— Ts Troller (@Ts_Troller) March 16, 2026 -
Kukatpally : కోటి రూపాయల హవాలా మనీ ఎవరిది?
సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లిలో కోటి రూపాయల హవాలా మనీ చోరీకి గురైంది. హవాలా డబ్బును బైక్పై తీసుకుని వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కళ్లల్లో కారం కొట్టి కోటి హవాలా మనీ కొట్టేశారు. బహుదూర్ పూరా నుంచి జీడిమెట్లకు తరలిస్తుండగా దోపిడీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల నుంచి హవాలా డబ్బు ఎక్కడికి వెళ్తుందని దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
అన్నదాతకు భరోసా
మెదక్ అర్బన్: అన్నదాతల ఎదురుచూ పులు ఫలించే వేళ ఆసన్నమైంది. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొదటి విడత రైతు భరోసా విడుదల చేయనున్నారు. మూడు విడతల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. జిల్లాలో సుమా రు 2,62,043 రైతులకు గానూ రూ.220.84 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ఎకరానికి రూ.6 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మూడు సార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించారు. 2023–24 యాసంగి సీజన్లో ఎకరానికి రూ. 5 వేలు, 2024–25 యాసంగిలో రూ. 5 వేలు, 2025–26లో వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు కావొస్తున్నా, రైతు భరోసా నిధులు జమ చేయలేదు. సాగులో 2,86,225 ఎకరాలు జిల్లాలో యాసంగికి సంబంధించి 2,86,225 ఎ కరాల్లో పంటలు వేశారు. సుమారు 2,62,043 రైతులు ఉన్నారు. గత వానాకాలం లెక్కలకు సంబంధించి అప్పట్లో రైతు భరోసా కింద రూ.220,84,32,452 నిధులు విడుదలయ్యాయి. ఈసారి నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధుల జమ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 22న ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు, 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరు లోపు మూడో విడతగా మొత్తం మంది రైతులకు భరోసా నిధులు జమచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవకుమార్ను వివరణ కోరగా తమకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని తెలిపారు. -
30 వరకు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నెల 20న బడ్జెట్ను ప్రవేశ పెట్టి ఆయా ప్రాతిపాదనలపై చర్చిస్తారు. అలాగే ఈ నెల 30న ద్రవ్య వినిమియ బిల్లుపై చర్చించి ఆమోదించాలని సర్కారు ప్రతిపాదించింది. సోమవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన ఆయన చాంబర్లో శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు, విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, విప్ కేపీ వివేకానంద్, బీజేపీ నుంచి మహేశ్వర్రెడ్డి, ఎంఐఎం నుంచి కౌసర్ అలీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. శాసనసభ కార్యదర్శి ఆర్.తిరుపతిరెడ్డి కూడా హాజరయ్యారు. ఈ భేటీలో సర్కారు సమావేశాల ఎజెండాను ప్రతిపాదించింది. షెడ్యూల్ ఇలా.. మంగళ, బుధవారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు. ఈ నెల 19న ఉగాది పర్వదినం నేపథ్యంలో విరామం ప్రకటించి 20న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశ పెడతారు. రంజాన్ పండుగ నేపథ్యంలో 21, 22 తేదీల్లో సభకు విరామం ప్రకటించి 23 నుంచి బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చిస్తారు. 26న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సభకు విరామం ఉంటుంది. 27 నుంచి 30వ తేదీ వరకు సమావేశాలు కొనసాగించి బడ్జెట్ పద్దులతో పాటు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోదిస్తారు. అనంతరం బడ్జెట్ సమావేశాలను వాయిదా వేసేలా ప్రభుత్వం షెడ్యూలును ప్రతిపాదించింది. ఈ మేరకు బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు. 31 వరకు నిర్వహించాలి: హరీశ్రావు ‘ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని బీఏసీలో ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే రెండు ఆదివారాలు, మూడు పండుగలు ఉండటంతో 31వ తేదీ వరకు సమావేశాలు జరపడంతో పాటు ఉదయం 9 గంటలకే సభ ప్రారంభించాలని కోరాం. ఆదివారాలు కూడా సభ నడిపి పనిదినాలు పెంచాలని అడిగాం’అని బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. బీఏసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. హౌస్ కమిటీల ఏర్పాటులో ఆలస్యం, ప్రశ్నోత్తరాలు లేకపోవడం, జీరో అవర్ తదితర అంశాలను స్పీకర్ వద్ద ప్రస్తావించాం. ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి ప్రైవేటు మెంబర్ బిల్లుకు అవకాశం ఇవ్వాలని కోరాం. బడ్జెట్పై బీఆర్ఎస్ తరఫున ప్రసంగించేందుకు ఇద్దరు సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరాం. మేము ప్రసంగిస్తున్న సమయంలో సంబంధిత శాఖ మంత్రి మినహా సీఎం, శాసనసభ వ్యవహారాల మంత్రి, ఇతరులకు అవకాశం ఇవ్వకూడదని చెప్పాం. డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంతో సభ్యులు ఇచ్చే ప్రివిలేజ్ మోషన్లను స్పీకర్ పరిశీలించాలని కోరాం. అసెంబ్లీలో గ్రంథాలయం నిర్వహణ దారుణంగా ఉందని తెలియజేశాం. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకుంటే వచ్చే బీఏసీ సమావేశాలకు హాజరు కాబోమని స్పష్టం చేశాం..’అని హరీశ్రావు తెలిపారు. ఆ తర్వాత రెండు వారాలు కొనసాగించాలి: ఏలేటి ‘బడ్జెట్ ప్రతిపాదనలు, పద్దులపై చర్చకు తక్కువ సమయం ఉన్నందున ఈ నెల 31వ తేదీలోగా బడ్జెట్ను ఆమోదించాలి. అనేక అంశాలపై చర్చించాల్సి ఉన్నందున ఆ తర్వాత కూడా మరో రెండు వారాలు సభ కొనసాగించాలి. ప్రభుత్వ బిల్లులను కూడా బడ్జెట్ భేటీలోనే చర్చించడం సరికాదు. జీహెచ్ఎంసీ విభజన, పంచాయతీరాజ్ బిల్లులపై బడ్జెట్ ఆమోదం తర్వాత చర్చించాలి. హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి. హామీల అమలు కమిటీ ఏర్పాటు చేయాలి..’అని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి బీఏసీ భేటీలో కోరారు. తాము ప్రతిపాదించిన 20 అంశాలపై చర్చించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని కోరారు. -
అధికారం పోతే.. అందరికీ పోతుంది
సాక్షి, హైదరాబాద్: ‘అధికారంలో ఉంటేనే అందరికీ గౌరవం ఉంటుంది. అధికారం పోతే ఏ ఒక్కరిదో పోదు. అందరికీ పోతుంది. నన్ను అనలేదు కదా అని ఏమీ మాట్లాడకుండా ఉంటే అందరం నష్టపోతాం. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదు. వ్యవస్థ మొత్తం డ్యామేజీ అవుతుంది. వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుంది. పార్టీ, ప్రభుత్వ లైన్లోనే అందరూ స్పందించాలి. ఇప్పుడు మనం వేసుకునే రోడ్మ్యాపే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుంది’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రెండేళ్లపాటు గత ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు చెప్పుకున్నామని, ఇప్పుడు ఆ టైం అయిపోయిందని, ప్రజలకు సమాధానం చెప్పుకునే సమయం వచ్చిందని, చేసింది చెప్పుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సోమవారం మధ్యాహ్నం శాసనమండలి సమావేశ మందిరంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశంలో ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ, ప్రభుత్వ పరంగా సమష్టిగా ముందుకెళ్లాల్సిన తీరును వారికి వివరిస్తూనే వ్యక్తిగత వ్యవహారశైలిపైనా ఆయన క్లాస్ తీసుకున్నారు. జీవిత లక్ష్యం వృధా చేసుకోవద్దు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు గురించి రేవంత్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ‘జీవిత లక్ష్యంగా పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా మీరు చట్టసభలకు వచ్చారు. కానీ ఆ పదవికి న్యాయం చేయనప్పుడు ఎందుకు? నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీనియర్లు ఉండేవారు. నాకు మాట్లాడటానికి మైక్ ఇచ్చేవారు కాదు. అయినా కొట్లాడి మాట్లాడాలని ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు సభకు కూడా రావడం లేదు. వచి్చనా సంతకం పెట్టి వెళ్లిపోతున్నారు. సభలో కూర్చోకపోతే ఎమ్మెల్యే ఎందుకు కావాలి? కొందరు సీఎల్పీ సమావేశానికి కూడా రాలేదు. సీఎల్పీ సమావేశానికి రాలేనంత బిజీగా ఉన్నారా? కష్టపడి సాధించుకున్న ఎమ్మెల్యే పదవికి అన్యాయం చేయొద్దు. సభకు రాకపోయినా, ఏం చేసినా ఏం కాదులే అనుకోవద్దు. ఇప్పటికిప్పుడే ఏమీ కాకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటారు. బీఫారం ఇచ్చేటప్పుడు అన్ని లెక్కలూ చూస్తారు’అని చెప్పారు. సమర్థవంతంగా తిప్పికొట్టాలి అసెంబ్లీ, మండలిలో జరిగే చర్చల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం రేవంత్రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించా రు. బాగా చదువుకున్న మహిళా ఎమ్మెల్యేలున్నారని, వారంతా సభకు హాజరు కావడమే కాకుండా చర్చల్లో పాలుపంచుకోవాలని కోరారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వంలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని, ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలను గవర్నర్ ప్రసంగంలో వివరించారని సీఎం చెప్పారు. ఈ ప్రసంగం ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ లాంటిది. మన భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి సారించాలి. మూడో బడ్జెట్తోపాటు మిగిలిన సంవత్సరాల బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ప్రజారంజకంగా ఉండబోతున్నాయి. ఈ విషయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలి. సభలో మాట్లాడే అంశాలపై విప్ల మధ్య సమన్వయం ఉండాలి. అసెంబ్లీ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వ విధానాల ను అధ్యయనం చేయాలి. అవసరమైతే చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకూ వెళ్లి రావాలి’అని దిశానిర్దేశం చేశారు. మంత్రులు సమయం ఇవ్వాలి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్మోహన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలుగా తాము మంత్రులు, అధికారులకు ఇచి్చన వినతులకు సరిగా స్పందన ఉండడం లేదని వాపోయారు. ఎమ్మెల్యేలకు మంత్రులతోపాటు సీఎం టైం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మంత్రులు తమను కలిసేందుకు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వా లని సూచించారు. తాను కూడా ఇస్తానని చెప్పారు. ఏదో ఒక సమయం ఇందుకోసం ఫిక్స్ చేసుకోవాలని, ఎమ్మెల్యేలిచ్చే వినతిపత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించే దిశలో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, తన దగ్గరకు వచి్చ న ఎమ్మెల్యేలే మళ్లీ వచ్చి కలుస్తున్నారని, అలా కలవడం ఎందుకని ప్రశ్నించారు. ప్యానెల్ స్పీకర్గా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ బాగా హ్యాండిల్ చేస్తున్నారని కొనియాడారు. అడ్లూరి లక్ష్మణ్కు ఎమ్మెల్యే కావడానికి 30 ఏళ్లు పట్టిందని, అంత కష్టపడితే లభించిన పదవికి అడ్లూరి లక్ష్మణ్తో సహా అందరు ఎమ్మెల్యేలు న్యాయం చేయాలని సూచించారు. మీడియాతో జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రేవంత్ సూచించినట్టు సమాచారం. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మీడియాతో చిట్చాట్లు చేయొద్దని, వ్యక్తిగతంగా ఎవరూ మాట్లాడవద్దని చెప్పినట్టు తెలిసింది. విలేకరులు అడిగే ప్రశ్నలు ఎమ్మెల్యేలు, మంత్రులపై ప్రేమతో కాదని, వార్తల కోసం మాత్రమే వారు ప్రశ్నలు అడుగుతారని చెప్పినట్లు సమాచారం. అబద్ధాలను తిప్పికొట్టండి: పీసీసీ చీఫ్ గత రెండేళ్లలో ప్రజలకు ఇచి్చన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేశామని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. ఆరు గ్యారంటీల విషయంలో ప్రతిప క్షాల అబద్ధపు ప్రచారాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్రెడ్డిని సీఎల్పీ అభినందించింది. -
అన్నలకు ‘ఆధార’మేదీ..?
2025 జనవరిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా పరిసరాల్లో సుమారు 25 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉండి లొంగిపోయిన కోరుట్లకు చెందిన పసుల వసంతకు ఇప్పటికీ పునరావాస సాయం అందలేదు. కారణం.. ఆమెకు ఆధార్ కార్డు లేకపోవడమే! 2025 అక్టోబర్లో ఛత్తీస్గఢ్లో సుమారు 197మంది, మహారాష్ట్రలో 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో కొత్తగా రిక్రూట్ అయిన 140 మంది మినహా మిగతావారికి ఆధార్కార్డులు లేవు. 2026 ఫిబ్రవరిలో మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు, కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావుతోపాటు సుమారు 180 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో సగానికిపైగా మావోయిస్టులకు ఎలాంటి ఆధారాలూ లేవు. కొత్త ఆధార్ కోసం తిప్పలుఈ లెక్కన లొంగిపోయిన మావోయిస్టుల్లో చాలామందికి ఆధార్కార్డులు లేవు. కొత్తగా ఆ«ధార్ కార్డు సృష్టించుకోవడం సమస్యగా మారింది. ఆధార్ కార్డులు లేని మావోయిస్టులు తమ సొంత గ్రామాల్లో ఉన్న ఇళ్లల్లో.. లేకుంటే కొత్తగా అద్దె ఇంట్లో ఉన్నట్లు చిరునామాపై రెవెన్యూ అధికారుల నుంచి రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్స్తోపాటు తాము మావోయిస్టు పాలో అజ్ఞాతంలో ఉండి లొంగిపోయిన సందర్భంలో పోలీసు ఉన్నతాధికారుల నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రం జతచేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న తరువాత కొన్ని సాంకేతిక సమస్యలతో ఆధార్కార్డులు వెంటనే రావడం లేదు. ఒకటికి రెండు సార్లు అన్ని డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ఆధార్ జారీ సంస్థ నుంచి కొత్త ఆధార్ కార్డు వస్తుంది. అనంతరం పాన్కార్డు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది.పునరావాసంలో జాప్యం తప్పదా..!?కొత్త ఆధార్ కార్డులు తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యం ఫలితంగా పునరావాస కల్పనలో జాప్యం జరుగుతోంది. ఏళ్ల తరబడి అజ్ఞాతంలో ఉన్నవాళ్లు కావడంతో వారికి ఎలాంటి గుర్తింపు కార్డులూ లేవు. వీరిలో చాలామంది పెద్దగా చదువుకున్న వారు కాకపోవడంతో పాఠశాలల్లో పుట్టిన తేదీలు లేక ఆధార్ నమోదు చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ అధికారులు రెసిడెన్స్ సరి్టఫికెట్ ఇవ్వాలన్నా.. పంచనామాలో సాక్షులు సరిగా దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా ఆధార్ కార్డు నమోదు కావడానికి నెల నుంచి రెండు నెలల కాలం పడుతోంది. పేరున్న మావోలకు ఉన్నతాధికారుల నుంచి ఉన్న సహకారంతో త్వరగానే ఆధార్కార్డులు వస్తున్నప్పటికీ సాధారణ మావోయిస్టులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఈ క్రమంలో లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డుల అందజేత, పునరావాస కల్పనలో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. – కోరుట్ల -
కాల్పులు జరిపి తప్పించుకోవాలని..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిప్రకారం ఫాంహౌస్ను ‘ఈగల్’ బృందం, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అవాక్కైన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్కుమార్ , పైలట్ రోహిత్ల బృందం వారిపై కాల్పులు జరిపి తప్పించుకోవాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ 0.32 జర్మనీ తయారీ రివాల్వర్తో తొలుత మూడు రౌండ్లపాటు కాల్పులకు దిగాడు. తాము పోలీసులమని, సోదాలకు వచ్చామని చెబుతున్నా నమిత్ శర్మ మాత్రం తమను లక్ష్యంగా చేసుకొని కూడా ఒక రౌండ్ కాల్పులు జరిపాడని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ బుల్లెట్ ఎవరికీ తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాల్పుల శబ్దాలు వినగానే తాము అప్రమత్తం అయ్యామని.. అదే సమయంలో ‘కాల్చి పారేయండి.. మొత్తం నేను చూసుకుంటాను. ఏం జరిగినా నాదే బాధ్యత’ అంటూ ఒకరు గట్టిగా అరిచినట్లు వినిపడిందని వివరించారు. తమను భయభ్రాంతులకు గురిచేసి కాల్పులు జరిపి ఫాంహౌస్ నుంచి తప్పించుకొని పారిపోవాలని అక్కడున్న వారు ప్లాన్ వేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం, ఎక్సైజ్ చట్టాలతోపాటు ఆయుధాల చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కాల్పులతో సంబంధం ఉన్న పైలట్ రోహిత్రెడ్డి, అతని సోదరుడు రితేశ్రెడ్డి, నమిత్ శర్మలను అరెస్ట్ చేశారు. కాల్పులుకు తెగబడ్డ నమిత్ శర్మను ఏ–1గా, ఫాంహౌస్ యజమాని, పార్టీ ఏర్పాటు చేసిన పైలట్ రోహిత్రెడ్డిని ఏ–2గా, అతడి సోదరుడు, కాల్పుల జరిగిన తుపాకీ లైసెన్స్ కలిగిన రితేశ్రెడ్డిని ఏ–3గా పేర్కొన్నారు. పోలీసులపై హత్యాయత్నం, వారి విధులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం నిందితులకు జ్యుడీíÙయల్ కస్టడీ విధించింది. మరింత కిక్కు కోసమే మద్యంలో కొకైన్.. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం.. మత్తు కిక్కు కోసమే టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, వారి మిత్రులు మద్యంలో కొకైన్ కలుపుకొని తాగారు. పార్టీని రంజుగా ఎంజాయ్ చేసేందుకే ఖరీదైన పలు బ్రాండ్ల మద్యంతోపాటు కొకైన్ తెప్పించుకున్నారు. పోలీసుల సోదాల అనంతరం పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ టెస్ట్లు, అనంతరం రక్త పరీక్షలు నిర్వహించగా పుట్టా మహేశ్, రోహిత్రెడ్డి, రితేశ్రెడ్డి, అర్జున్రెడ్డి, కౌశిక్ రవి, నమిత్ శర్మలకు పాజిటివ్ వచ్చింది. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయింది. పార్టీలో వాడిన కొకైన్ను తానే తెచ్చానని కౌశిక్ రవి పోలీసుల ఎదుట అంగీకరించాడు. సిమ్లాలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్ పార్టీ కోసమే కొకైన్ను ఒక్కో గ్రాము రూ. 15,000 చొప్పున చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ అంగీకరించాడు. -
ప్రగతి తెలంగాణే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణకు గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ దిశగా బలమైన పునాదులు వేసేందుకు ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. ఇదే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్–2047 విజన్కు శ్రీకారం చుట్టింది. దేశ పురోగతిలో ప్రధాన భూమిక పోషించే స్థాయికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెరిగేలా చర్యలు చేపట్టింది..’అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెప్పారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని సోమ వారం ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ప్రజా పాలన స్ఫూర్తి కొనసాగింపు రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను స్మరిస్తూ, వారిని గౌరవిస్తూ ప్రభుత్వం ప్ర జా పాలన స్ఫూర్తిని కొనసాగిస్తోంది. అమలు చేసే ప్రతి పథకం, ప్రతి విధానం, ప్రతి కార్యాచరణలో ప్రజల ఆత్మగౌరవం, సంక్షేమం, సామాజిక సమానత్వాన్ని ప్రభుత్వం పాటిస్తుందని విశ్వసిస్తున్నా. అదే ప్రజా పాలనకు గీటురాయి. రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ కేంద్రంగా జరగాలనే పాత మోడల్కు ప్రజా ప్రభుత్వం ముగింపు పలికింది.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా, సమతుల్యంగా, సమ్మిళితంగా అభివృద్ధి చేసేందుకు ముందడుగు వేసింది. క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్, ప్యూర్ (పెరీ అర్బన్ రీజియన్), రేర్ (రూరల్ అగ్రి రీజియన్)తో వికేంద్రీకత వ్యూహాన్ని అనుసరిస్తోంది. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసి భవిష్యత్తు తెలంగాణను నిర్మిస్తోంది. ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ’తెలంగాణ రైజింగ్ విజన్–2047’డాక్యుమెంట్ను ఆవిష్కరించింది. ’వికసిత్ భారత్– 2047 విజన్’కు అనుగుణంగా, నీతి ఆయోగ్, ఐఎస్బీ, నల్సార్ వర్సిటీని సంప్రదించి దీన్ని రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణ ఆర్థికంగా సుస్థిర స్థానంలో ఉంది. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సుస్థిర వృద్ధి నమోదు చేస్తోంది. 2025–26లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) రూ.17.82 లక్షల కోట్లు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.99 శాతం. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కి చేరుకుంది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణాన్ని 0.2 శాతానికి ప్రభుత్వం నియంత్రించింది. ధరల స్థిరత్వం కొనసాగించింది. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు గత రెండేళుŠాల్గ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. రాష్ట్రం వేగంగా పట్టణీకరణ చెందుతోంది. 2031 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుకుంటుందని అంచనా. పట్టణాల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది.ఇది నగర పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. మహా నగరంలో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు హైదరాబాద్ పోలీసు అధికార పరిధిని విస్తరించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, కొత్తగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్లుగా పునర్వవ్యస్థీకరించింది. నీటి వనరుల పునరుద్ధరణకు హైడ్రా క్యూర్ పరిధిలోని ప్రాంతాన్ని పారిశ్రామిక కాలుష్యం నుంచి విముక్తి కల్పించేందుకు కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని నిర్ణయించింది. దీంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. క్యూర్ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. క్యూర్ పరిధిలోని నీటి వనరులను పునరుద్ధరించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసి దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన 1,045 ఎకరాలకు పైగా ఆక్రమణకు, కబ్జాలకు గురైన చెరువు భూములు, ప్రభుత్వ భూములను తిరిగి స్వా«దీనం చేసుకుంది.ఫలితంగా బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్ రుక్ ఉద్దౌలా చెరువులు పూర్వ వైభవం సంతరించుకున్నాయి. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ఉన్న ప్యూర్ ప్రాంతాన్ని ఇ¯న్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. తెలంగాణ పశి్చమ ప్రాంతంలో ఉన్న కొడంగల్ ఏరియా ఇండ్రస్టియల్ హబ్ గా మారనుంది. జహీరాబాద్లో 3,245 ఎకరాల్లో నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ స్మార్ట్ సిటీ అభివృద్ధి జరుగుతోంది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు హైదరాబాద్లో 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్–1 ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుంది. గోదావరి నీటిని ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్కు అనుసంధానించడం ద్వారా 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అందిస్తారు. దీంతో క్యూర్ ప్రాంతానికి రోజుకి 300 మిలియన్ గ్యాలన్ల తాగునీరు అందుతుంది.హైదరాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ, అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీ¯న్ఫీల్డ్ హైదరాబాద్–అమరావతి ఎక్స్ప్రెస్వేను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రం హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణెలకు మూడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 56 గ్రామాలు, ఏడు మండలాలతో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు కానుంది. భారీగా పెట్టుబడుల ఆకర్షణ తెలంగాణను గ్లోబల్ హబ్గా మార్చేలా ఆవిష్కరణలకు, పెట్టుబడుల సాధనకు, సుస్థిర అభివద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇటీవల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించింది. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక రంగంలోని ప్రముఖులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. ఇటీవలి 23వ బయో ఏషియా సదస్సులో దాదాపు రూ.1,700 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. సాగునీటికి, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత రాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, పునరావాస ప్రక్రియను కొన్ని నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ ఉత్పాదకత పెంచేందుకు అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించటంతో పాటు రైతు సంక్షేమ పథకాలు అమలు చేసింది.రైతు భరోసా పెట్టుబడి సహాయ పథకం కింద ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ.8,744 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రూ.2 లక్షల లోపు రైతుల పంట రుణాలను మాఫీ చేసింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 3.38 కోట్ల మందికి ఆహార భద్రత రాష్ట్రంలో 3.38 కోట్ల మందికి ఆహార భద్రతను కల్పిస్తోంది. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. 42.90 లక్షల కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ సిలిండర్లను అందిస్తోంది. 53.09 లక్షల కుటుంబాలు గృహజ్యోతి ఉచిత కరెంటు సరఫరాతో ప్రయోజనం పొందుతున్నాయి. విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్ చార్జీలను 212 శాతం పెంచింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. డ్రగ్స్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎ¯న్ఫోర్స్మెంట్)ను ఏర్పాటు చేసింది. రూ.3.13 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దాదాపు 9.39 లక్షల మంది యువతీ యువకులు ఐటీ ఉద్యోగాల్లో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత ప్రోత్సహించడానికి, రూ.15 వేల కోట్లతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీ 2025–2030 ప్రకటించింది. దీంతో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. చారిత్రక మార్పు దశలో రాష్ట్రం రాష్ట్రం ఒక చారిత్రక మార్పు దశలో నిలబడింది. ఈ బడ్జెట్ కేవలం ఆర్థిక కేటాయింపులకే పరిమితం కాదు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతనమైన భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి మార్గదర్శనం. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను తీర్చేందుకు, తెలంగాణ సమగ్ర అభివద్ధికి ఉపయోగపడే రోడ్ మ్యాప్. రాష్ట్ర సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధిపై ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది.అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ప్రభుత్వాన్ని ఎవరూ ఆపలేరు. అభివృద్ధి చెందిన దేశాలు, నగరాలతో పోటీపడే స్థాయికి తెలంగాణ చేరుకుంటుంది. ప్రజా ప్రభుత్వ స్వప్నాన్ని సాకారం చేయడానికి ఐకమత్యంతో, ఆత్మవిశ్వాసంతో నిలువెత్తు నిబద్ధతతో మనమందరం కలిసి పని చేద్దాం. తెలంగాణాను ప్రపంచంలోనే అగ్రభాగాన నిలుపుదాం. -
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని టీ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ ఈ రోజు( సోమవారం) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు. 2026 T20 ప్రపంచ కప్ గెలిచి దేశం గర్వపడేలా చేసినందుకు గాను ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.అంతకు ముందు తిలక్ వర్మకు శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకొని ఎయిర్పోర్టు వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణం సందడిగా మారింది. కాగా ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్లో భారత్ విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో తిలక్ వర్మ సభ్యునిగా ఉన్నారు. -
ప్రత్యూష మృతి కేసు: సిద్ధార్థరెడ్డి లొంగుబాటు
హైదరాబాద్: సినీ నటి ప్రత్యూష మృతికేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థరెడ్డి కోర్టులో లొంగిపోయాడు. ఈ రోజు(సోమవారం, మార్చి 16వ తేదీ) నాంపల్లి కోర్టులో సిద్ధార్థరెడ్డి లొంగిపోయాడు. అమెరికా నుంచి వచ్చి నాంపల్లి కోర్టులో సరెండర్ అయ్యాడు. 2002 ఫిబ్రవరి 23న సినీ నటి ప్రత్యూష మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. డ్రింక్లో పురుగుమందు కలిపిన సిద్ధార్థరెడ్డి.. అతను తాగడంతో పాటు ప్రత్యూషకు కూడా ఇచ్చాడు. ఇది తాగిన ప్రత్యూష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, సిద్ధార్థరెడ్డి కోలుకున్నాడు. ఇటీవల ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ హత్య కేసులో నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి వెంటనే పోలీసుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం పేర్కొంది. బెయిల్ కోసం ఆయన వేసిన పిటీషన్ను కొట్టివేసింది. ప్రత్యూష హత్య కేసులో సిద్దార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతుండగా సిద్ధార్థ్ రెడ్డి అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే, ప్రత్యూష హీరోయిన్గా రాణిస్తున్నప్పడు సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్లో ఉన్నాడు. ఈ క్రమంలో కొంత కాలం తర్వాత వారిద్దరి మధ్య విబేదాలు రావడంతో 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వారిద్దరూ విషం తీసుకున్నారు.చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారిద్దరిని చేర్పించగా ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ రెడ్డి డిశ్చార్జి అయ్యాడు. కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీమ్ ఒక నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు నిందితుడు సిద్ధార్థరెడ్డి పురికొల్పారని సీబీఐ నివేదిక ఇచ్చింది.నాలుగు వారాల్లో లొంగిపోవాలిసీబీఐ విచారణ తర్వాత సిద్ధార్థరెడ్డిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్ వేసింది. దీంతో 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షను ఖరారు చేసింది. ఆపై రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే, తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే 2011లో జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ ఆయనకు అనకూలంగా తీర్పు రావడంతో కాస్త ఉపశమనం దక్కింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రెండేళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డికి న్యాయస్థానం సూచించింది.ఆ రోజు ఏం జరిగింది.. ప్రత్యూష తల్లి చెప్పిన మాటలు ఇవే..అది 2002, ఫిబ్రవరి 23 సాయంత్రం. తెల్లవారి బెంగళూరుకి బయలుదేరాలి. కన్నడ సినిమాలో తొలి అవకాశం రావడంతో సంతోషంగా ఉన్నాం. ఫేషియల్, వ్యాక్సింగ్ చేయించుకోవడానికి తన కజిన్ శిరితో కలసి బ్యూటీపార్లర్కెళ్లింది. పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి వచ్చాడు. ప్రత్యూష ఫేషియల్ పూర్తయ్యే వరకు అక్కడే వెయిట్ చేశాడు. ఆ తర్వాత సిద్ధార్థతో ఓ పదిహేను నిమిషాలు బయటకు వెళ్లి వస్తానని శిరిని వెయిట్ చేయమని చెప్పింది.అయితే, కొంత సేపటికి ప్రత్యూష నుంచి నాకు ఫోన్ వచ్చింది... ‘జయం సినిమాలో హీరోయిన్గా కన్ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, జయం ఆఫీస్కెళ్లి వస్తాను’ అని చెప్పింది. అదే ప్రత్యూష నుంచి నాకు వచ్చిన చివరి ఫోన్ కాల్.. కానీ, వాళ్లు మాత్రం తేజ గారి ఆఫీస్కు వెళ్లనే లేదు. బ్యూటీపార్లర్లో ఉన్న శిరికి ఫోన్ చేస్తే జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత శిరి ఫోన్ చేసినా సరే ప్రత్యూష ఫోన్ తియ్యలేదట. ఆ తర్వాత అంతా మిస్టరీగానే మిగిలిపోయింది. -
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న వారు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, కూకట్పల్లి, చార్మినార్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం పడుతున్న సమయంలో మెట్రో పిల్లర్ల కింద వాహనాలు ఆపి వర్షం వెలిసేదాక ఎదురుచూశారు.మరోవైపు మెదక్ జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. తూప్రాన్ మండలంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగలులతో కూడిన భారీ వర్షం పడింది. పోచమ్మరాల్ గ్రామంలో పెద్ద ఎత్తున వడగళ్ల వాన కురిసింది. అర్ధ గంటపాటు కురిసిన వడగళ్ల వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ అకాల వర్షాలతో వరి పంటతో పాటు మామిడికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతన్నలు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టి సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. నారాయణ ఖేడ్, ఆందోలులోనూ జోరుగా వర్షం కురిసింది. -
జీవన్రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు
జగిత్యాల : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద ఉన్న పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను తొలగించారు. జగిత్యాలలోని జీవన్రెడ్డి రెడ్డి నివాసం వద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలతో పాటు ఇంటి లోపల ఉన్న ఫ్లెక్సీలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి ఫోటోలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఈనెల 24 లేదా 25వ తేదీన జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటివద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీవన్రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై ఉతంఠ నెలకొంది.బీఆర్ఎస్లో చేరతారా..?తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత ప్రముఖంగా ఉన్న పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు. మరి జీవన్రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం వార్త హల్చల్ చేసింది. బీఆర్ఎస్ గూటికి జీవన్రెడ్డి చేరబోతున్నారనేది ఆ వార్త సారాంశం. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడానికి జీవన్రెడ్డి సన్నద్ధమవుతున్నారని, ఆ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత తనకు కాంగ్రెస్లో తగిన గౌరవం లభించలేదని భావిస్తున్న జీవన్రెడ్డి.. దానికి పార్టీని వీడటం ఒక్కటే సరైన మార్గమని అనుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. -
‘సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?’
హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు. అసెంబ్లీ మీడియా హాల్లో హరీష్ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ల హక్కులను కాపాడటం కోసం కేసీఆర్ పోరాటం చేశారు. కృష్ణా నదీ జలాల పున:పంపిణీని కేసీఆర్ సాధించారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు,ఏపీకి 531 టీఎంసీలు వచ్చాయి. కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరిపై ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు.కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత రెండు రోజుల క్రితం లెటర్ రాశామని లెటర్ రిలీజ్ చేస్తున్నారు. గోదావరి జలాలపై ఏపీ కన్ను పడింది. జనవరి 30 న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల మీటింగ్ జరిగింది. తెలంగాణ నుంచి వెళ్లిన అధికారులు డూడూ బసవన్నల్లా తల ఊపారు. గోదావరిలో ఏ రాష్ట్రానికి కేటాయింపులు లేవని సీడబ్ల్యూసీ చెప్పింది. ఫిబ్రవరి 12 వ తేదీన తెలంగాణకు మినిట్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి దాసోహం అయ్యారా...?, రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఏపీకి తాకట్టు పెట్టారా...?’ అని ప్రశ్నించారు. -
రానున్న 4 రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
-
ప్రముఖ కవి నందిని సిధారెడ్డికి వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి : ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలియజేశారు వైఎస్ జగన్. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటాన్ని ప్రత్యేకంగా కొనియాడారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు వైఎస్ జగన్.‘సాహిత్య రంగంలో జాతీయ స్థాయి అత్యున్నతమైన పురస్కారం లభించడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. నందిని సిధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేశారు. తన అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ఠ సేవలు అందించారు. నందిని సిధారెడ్డిగారికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం, వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవం’ అని ప్రశంసించారు. ఇదీ చదవండి:నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు -
నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డి (nandini sidhareddy)ని వరించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 2026 సంవత్సరానికి గాను ఆయన రాసిన "అనిమేష" కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులు, మానవీయ కోణాలను ఈ కవితా సంపుటిలో సిధారెడ్డి చిత్రించారు. సాహిత్య అకాడమీ అవార్డు కింద రూ. లక్ష నగదు, తామ్రపత్రం, శాలువాను ప్రదానం చేస్తారు. సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం రాష్ట్రానికే గర్వకారణమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలంగాణ మట్టి సువాసనను, ఉద్యమ స్ఫూర్తిని తన కలంతో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కవి, సాహితీవేత్త శ్రీ నందిని సిధారెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం అత్యంత సంతోషదాయకంఇది తెలంగాణ సాహిత్యానికి దక్కిన గౌరవం. వారికి నా హృదయపూర్వక అభినందనలు. pic.twitter.com/o1wqCEcSPu— KTR (@KTRBRS) March 16, 2026మెదక్ జిల్లా బందారం గ్రామంలో సిధారెడ్డి 1955లో జన్మించారు. ఆయన తండ్రి నర్రా బాలసిద్ధారెడ్డి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేసి, ‘ఆధునిక తెలుగుకవిత్వంలో సూర్యుడు’ అనే అంశంపై ఎం.ఫిల్ (1981) పట్టా ఆ తర్వాత ‘ఆధునిక కవిత్వం, వాస్తవికత – అధివాస్తవికత’ పై పరిశోధన చేసి పి.హెచ్.డి (1986) పట్టా పుచ్చుకున్నారు. నందిని సిధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా పనిచేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలుతెలంగాణ మట్టి పరిమళాన్ని, సామాజిక చైతన్యాన్ని తన కలం ద్వారా జాతీయ స్థాయికి చేర్చిన ప్రఖ్యాత కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించడం పట్ల పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రచించిన 'అనిమేష' వచన కవితా సంపుటికి గాను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును కేంద్రం ప్రకటించింది. సిధారెడ్డికి ఈ గౌరవం దక్కడం పట్ల మంత్రి జూపల్లి హర్షం వ్యక్తం చేశారు.నందిని సిధారెడ్డి కేవలం ఒక కవి మాత్రమే కాదు, తెలంగాణ సాంస్కృతిక పునర్వైభవానికి బాటలు వేసిన దార్శనికుడు. ఆయన రాసిన 'అనిమేష' కవితా సంపుటి ఆధునిక వచన కవిత్వంలో ఒక అద్భుత సృష్టి. ఈ పురస్కారం ఆయన సుదీర్ఘ సాహిత్య కృషికి దక్కిన సరైన గౌరవం. తెలంగాణ మట్టిలో పుట్టిన ఒక గొప్ప మేధావికి ఈ స్థాయి గుర్తింపు రావడం రాష్ట్రానికే గర్వకారణం అని పేర్కొన్నారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు.మలిదశ ఉద్యమంలో అక్షరాన్ని ఆయుధంగా మలచి ప్రజల్లో చైతన్యం నింపడంలోనూ ఆయన పాత్ర చిరస్మరణీయమని మంత్రి జూపల్లి కొనియాడారు. -
ఫోటో దిగుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయి..
ఖమ్మం: ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా స్టేజ్లపైనే కుప్పకూలిపోయి మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లి గుండె పోటుతో మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరానికి చెందిన ఓ మహిళ.. బంధువుల గృహ ప్రవేశ వేడుకకు వెళ్లింది. అయితే అక్కడ ఫోటో దిగుతున్న సందర్భంలో పక్కనున్న మరొక మహిళతో మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయింది. ఆ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఖమ్మం టూటౌన్కు చెందిన బొమ్మ సుస్మిత అనే మహిళ.. ఖమ్మంలోని ఓ గృహ ప్రవేశ వేడుకకు వెళ్లారు. అయితే అప్పటివరకూ అందరితో కలివిడిగా మాట్లాడుతూ తిరిగిన మహిళ.. ఫోటో దిగుతున్న సమయంలో గుండెపోటుకు లోనైంది. ఒక్కసారిగా పక్కనున్న మహిళపై చేయి వేస్తూనే కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్ డ్రగ్స్ పార్టీ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్పూల్ దగ్గర డ్రగ్స్తో పాటు మందు పార్టీ జరిగింది. ఫామ్హౌస్లోకి వెళ్లగానే మొదట బుల్లెట్ సౌండ్ వినపడింది. బుల్లెట్ సౌండ్ విని వెంటనే అప్రమత్తమయ్యాం. మేం పోలీసులం కాల్చవద్దు.. ఎలాంటి చర్యలు తీసుకోమని గట్టిగా అరిచాం. మేము చెప్తున్నప్పటికీ కూడా.. పట్టించుకోలేదు. మరో రెండుసార్లు బుల్లెట్ సౌండ్ వినపడింది. మరోవైపు మీరు కాల్పులు జరపండి.. నేను మొత్తం చూసుకుంటా.. ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా వినపడింది. మేమంతా గట్టిగా అరిచేసరికి ఫైరింగ్ సౌండ్ నిలిచిపోయింది. మేమంతా ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నాం. ఫామ్హౌస్ సెర్చ్ చేసేందుకు మేము వారెంట్ తీసుకున్నాం. ఫామ్హౌస్లోకి వెళ్లిన వెంటనే.. సెర్చ్ వారెంట్లను రోహిత్రెడ్డికి ఇచ్చాం. బాత్రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో.. తుపాకీని మేం స్వాధీనం చేసుకున్నాం.బుల్లెట్ షెల్స్ పట్టుకొని మరొకరున్నారు. అతనిని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఫామ్హౌస్లో ఓ మహిళతో పాటు 10మందిని అదుపులోకి తీసుకున్నాం. జర్మన్ మేడ్ రివాల్వర్ పాయింట్ 32ని స్వాధీనం చేసుకున్నాం. 11 మందిని విడివిడిగా విచారించాం. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని బుకాయించే ప్రయత్నం చేశారు. అందరినీ పదేపదే విచారించడంతో చివరికి శరత్కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతనిని చెక్ చేసినప్పుడు 2 గ్రాముల కొకైన్ బయటపడింది. కొకైన్ ఎవరు తెచ్చారనే విషయాన్ని ముందుగా అడిగితే చెప్పలేదు.పైలెట్ రోహిత్రెడ్డి డ్రైవర్ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడింది. కొకైన్ తానే తెచ్చానని కౌషిక్ ఒప్పుకున్నాడు. సిమ్లా బిజినెస్ ట్రిప్కు వెళ్లినప్పుడు తానే కొకైన్ తీసుకొని వచ్చానని చెప్పాడు.’అని తెలిపారు. నగరానికి అతి చేరువలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఒప్పందానికి వేదికగా మారింది. పోలీసులు దాడి చేసి ఆ గుట్టును రట్టుచేశారు. తాజాగా శనివారంరాత్రి ఆయన ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా ఈగల్ టీం పోలీసులు అక్కడికి చేరుకోగా గన్తో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇందులో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, మరో తొమ్మిది మంది పట్టుబడ్డారు. -
అసెంబ్లీలో చిరునవ్వులు.. రాజాసింగ్ను ఆటపట్టించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే రాజాసింగ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆటపట్టించారు. వారిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. అనంతరం, మీడియ ఏదో అనుకుంటుంది అంటూ.. ఇరువురు నేతలు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి నేడు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అనంతరం, అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేఎల్పీ చాంబర్ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ అటుగా వెళ్తుండగా.. రాజాసింగ్ను గమనించారు. దీంతో, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి బీజేఎల్పీలోకి ఎలా వెళ్లారు అంటూ నువ్వుతూ సెటైర్ వేశారు.బీజేఎల్పీ నుంచి బయటికి రా అంటూ రాజాసింగ్ను సరదాగా కేటీఆర్ ఆటపట్టించారు. ఇంతలో అక్కడే ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కల్పించుకుని.. సరదాగా మీరు కూడా బీజేఎల్పీ చాంబర్లోకి రండి అంటూ కేటీఆర్ను ఆహ్వానించారు. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ.. తాను బీజేఎల్పీ చాంబర్లోకి వస్తే మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య సరదా సంభాషణ కొనసాగింది.అనంతరం, బీజేఎల్పీలోకి వెళ్ళడంపై ఎమ్మెల్యే రాజసింగ్ స్పందిస్తూ..‘పాత ఇల్లు.. పాత ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోతాను.. ఎప్పుడైనా వస్తాను. పార్టీలో మళ్లీ చేరడంపై ఇంకా డిసైడ్ కాలేదు. ఎవరు ఎవరిని బతిమాలుతున్నారో భవిష్యత్తులో తెలుస్తుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార పార్టీ పక్షంవైపు కూర్చోవడం గమనార్హం. ఈ కమ్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కాలే యాదయ్యను బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. కానీ, కాలే యాదయ్య మాత్రం తాను కాంగ్రెస్ వైపే కూర్చుంటానని చెప్పుకొచ్చారు. ఇక, ఇటీవలే పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపుల విషయంలో క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
నార్సింగిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య
హైదరాబాద్: హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే ఆరేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. చిన్నారి అదృశ్యంపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బాధితురాలి ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి, తన వెంట తీసుకువెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తెలిపాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిందితుడు చూపిన ప్రాంతంలో పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించే ప్రక్రియలో ఉన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా వేగంగా విచారణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. -
కట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దు
వరకట్నం.. వివాహ సమయంలో వధువు కుటుంబం నుంచి వరుడి కుటుంబా నికి నగదు, బంగారం, ఆస్తుల రూపేణ బదిలీ చేసే ఒక సామాజిక దురాచారం. ఆడపడుచు కుటుంబా నికి ఇబ్బందిగా మారిన దీనిని రూపుమాపేందుకు ప్రభుత్వాలు చట్టాలెన్ని చేసినా క్షేత్రస్థాయిలో అమలుకు మాత్రం నోచుకోని దుస్థితి. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా గుర్తించిన ఆదివాసీ తెగలు వరకట్నం నిషేధం వైపు మొగ్గు చూపుతున్నాయి. కట్నం ఇవ్వొ ద్దు.. తీసుకోవద్దు అని గ్రామాల్లో తీర్మానాలతో పాటు అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. ‘హైరి కీవల్ సిల్లే’ ‘కట్నం ఇదే కాద్ తోద్’ వంటి తీర్మానాలతో ముందడుగు వేస్తున్న ఆయా తెగలపై ఈ వారం సండే స్పెషల్. కట్నం ఇడే కాద్ తోద్.. అంటున్న ‘కొలాం’సాత్నాల: వరకట్న సమస్య కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని కొలాం తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెళ్లి అనేది పవిత్ర బంధమని.. దానిని డబ్బు, ఆస్తులతో కొలవకూడదని భావించింది. ఇకపై వరకట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగా సాత్నాల మండలంలోని టెంబ్రీగూడలో పటేళ్లు, కులస్తులు ఇటీవల సమావేశమయ్యారు. సాత్నాల, బేల, జైనథ్, ఇంద్రవెల్లి మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 150 పాల్గొన్నారు. వరకట్నం అనేది తమ సంస్కతిలో భాగం కాదని నిషేధించాలని తీర్మానం చేశారు. ఆడంబరాలకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. పెళ్లిళ్లు సాంప్రదాయబద్ధంగా ఉండాలని, రూ.లక్షలు ఖర్చయ్యే రెడీమేడ్ మండపాలకు దూరంగా ఉండడంతో పాటు మద్యపానం నిషేధించాలన్నారు. డీజేలు వంటి వాటి జోలికి వెళ్లకుండా పిప్రి వాయిద్యాలతో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పెళ్లిలో చదివింపుల్లో భాగంగా వస్తువులు కాకుండా నగదు రూపంలో అందిస్తే కుటుంబాలనికి ఆసరాగా ఉంటుందని తీర్మానించారు.ఆడబిడ్డ పెళ్లికి ఊరంతా సాయంసిరికొండ: ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లంటే ఆ కుటుంబంపై ఆర్థిక భా రం చెప్పనవసరం లేదు. కట్నా లు, కానుకలు, ఆర్భాటాలు వంటివి చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే అవుతోంది. అలాంటిది తమ గూడెంలో అమ్మాయి పెళ్లిని ఆర్భాటం లేకుండా సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఊరి పెద్దలు భావించారు. ఈనెల 9న సమావేశమయ్యారు.‘హైరి కీవల్ సిల్లే’ వరకట్నం నిషేధించడంతో పాటు పెళ్లి కూతురు కుటుంబానికి తలా కొంత ఆర్థికంగా చేదోడుగా నిలవాలని నిర్ణయించారు. వెంటనే అమలులోకి తెచ్చారు సిరికొండ మండలంలోని కోసుపటేల్ గూడవాసులు.కొలాం సంస్కృతిలో లేదువరకట్నం అనేది కొలాం సంస్కృతిలో లేదు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. – దేశ్ముఖ్ లేతు, టెంబ్రీగూడ పటేల్తల్లిదండ్రులకు భారం కావద్దని..ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో వరకట్నాన్ని నిషేధించాం. ఇకపై కొలాం సమాజంలో జరిగే వివాహాలు సాదాసీదాగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాం. వరకట్న నిర్మూలనలో సమాజంలో సమానత్వం పెరిగి, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. – కొడప సోనేరావు, కొలాం సంఘ రాష్ట్ర అధ్యక్షుడుకట్నమియ్యలే.. మొన్ననే నా బిడ్డ పునేశ్వరి లగ్గం చేసిన. ఉట్ను ర్ మండలం సుద్దగూడ కు ఇచ్చిన. వరకట్నం మాత్రం ఇయ్యలే. నేను కూలీ పని చేస్తుంటా. బిడ్డ పెండ్లీడుకు రావడంతో గుబులు పడ్డా. అయితే గ్రా మస్తులంతా కలిసి వరకట్నం నిషేధించడంతో పాటు లగ్గానికి రూ.20 వేలు సాయం కూడా చేశారు. – పెందుర్ జంగుబాయి,కోసుపటేల్ గూడవరకట్నం నిషేధించాం..మా గూడెంలో అంతా పేదవారే. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి చేయలంటే చాలా కష్టంగా మారింది. దీంతో మేము ఇటీవల సమావేశమయ్యాం. వరకట్నం నిషేధించాం. అలాగే అమ్మాయి కుటుంబానికి తలా కొంత జమ చేసి రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.– కుమురం రావుజీ, పటేల్, కోసుపటేల్గూడపెళ్లింటికి.. ఆర్థిక చేయూతఇంద్రవెల్లి: ఆదివాసీ, గోండు తెగల్లోనూ చాలామంది వరకట్నాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే అమ్మాయి, అబ్బాయి పెళ్లి ఎవరిదైనా ఆయా గ్రామాల్లో కులస్తులు కానుకలు ఇవ్వకుండా ఆర్థిక సాయం అందజేస్తున్నారు. పెళ్లింటికి చేదోడుగా నిలుస్తున్నారు. మండలంలోని వడగామ్ గ్రామంలో కనక కోసేరావ్ పెళ్లి రెండు రోజుల క్రితం జరిగింది. ఈమేరకు గ్రామస్తులంతా కలిసి రూ.25 వేలు అందించారు. కేస్లాపూర్ గ్రామానికి చెందిన పెళ్లి కూతురు ఆత్రం రోష్ణకు గ్రామస్తులు రూ.26 వేలు అందించారు. మండలంలోని పిప్రి గ్రామంలో ఆదివారం పెళ్లి పీటలు ఎక్కనున్న ఆత్రం సుజాతకు గ్రామస్తుల ఆధ్వర్యంలో రూ.7,100 అందించారు. ఇలా ఆదివాసీలు తలా కొంత నగదు సేకరించి పెళ్లి కుటుంబాలకు అందించి ఆర్థికంగా మద్ధతిస్తున్నారు. -
ఒకే చితిలో తల్లీకుమారుడు… కన్నీటి మడుగైన మందమర్రి
మందమర్రి(మంచిర్యాల జిల్లా): తల్లీకుమారుడి అంత్యక్రియలు ఒకే రోజు ఘటన మందమర్రిలో అందరినీ కంటతడి పెట్టించింది. వివరాలు ఇలా ఉ న్నాయి.. పట్టణంలోని రెండోజోన్కు చెందిన వీరవేణి–సత్యనారాయణ దంపతులకు ప్రసాద్, నాగసత్యవేణి సంతానం. నాగసత్యవేణికి హైదరాబాద్ (బోరబండ)కు చెందిన మురళీవేణుతో 13 మార్చి 2019లో వివాహమైంది. రుద్రాన్ష్ (5), ధన్విక (2) సంతానం. కొంతకాలం వీరి దాంపత్యం సాఫీగా సాగింది. పెళ్లయిన ఏడాది తర్వాత మురళీవేణుకు జెన్కోలో ఇంజినీర్గా ఉద్యోగం వ చ్చింది. అప్పటినుంచి భార్యను వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు కట్నం వచ్చేది. నిన్ను చేసుకున్నందుకు కట్నం ఇవ్వలేదనే, భార్యను పుట్టింటివారితో మాట్లాడనిచ్చేవాడు కాదు. అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. తల్లిగారింటికి వెళ్తే త్వరగా తిరిగి రావాలని ఆంక్షలు విధించేవాడు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి తన అన్న ప్రసాద్కు ఫోన్చేసి అమ్మను, తన కుమారుడు (మేనల్లుడు)ని బాగా చూసుకోవాలని చెప్పింది. మళ్లీ రాత్రి 9:30 గంటలకు మురళీవేణు మందమర్రిలోని ప్రసాద్ ఫోన్చేసి మీ చెల్లి ఆత్మహత్య చేసుకుందని చెప్పగా హైదరాబాద్ వెళ్లాడు. గాంధీ ఆసుపత్రిలో నాగసత్యవేణి, రుద్రాన్ష్ మృతదేహాలు, ధన్విక నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు చెప్పారు. శనివారం సాయంత్రం పోసుమార్టం అనంతరం మృతదేహాలను అప్పగించారు. ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు. తల్లికుమారుడి మృతి కారకులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. -
కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..అధికార పక్షంవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు..అసెంబ్లీలో అధికార పక్షం వైపు కూర్చున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలుఇటీవల పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని కాలే యాదయ్యను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికాంగ్రెస్ వైపే కూర్చుంటానన్న కాలే యాదయ్యఅసెంబ్లీలో ఆసక్తికర పరిణామంఅసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామంBJLP చాంబర్ లోకి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్అదే సమయంలో బయటికి వెళ్తూ గమనించిన కేటీఆర్సస్పెండ్ అయిన వ్యక్తి BJLPలోకి ఎలా అంటూ సెటైర్ వేసిన కేటీఆర్BJLP నుంచి బయటికి రా అంటూ రాజాసింగ్ను సరదాగా అన్న కేటీఆర్మీరు కూడా BJLP చాంబర్లోకి రండి అంటూ ఆహ్వానించిన పాయల్ శంకర్నేను వస్తే మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయిన కేటీఆర్ తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదాతెలంగాణ శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్.వందేమాతరం గీతం అసెంబ్లీలో ప్రదర్శించినందుకు వాకౌట్ముగిసిన గవర్నర్ ప్రసంగం.. తెలంగాణ శాసనసభలో ముగిసిన గవర్నర్ స్పీచ్.గంట పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో సాగిన ప్రసంగం.కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించాం.రాష్ట్ర తలసరి ఆదాయం 4.18 లక్షలకు చేరింది.క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు.రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం.2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా.జీహెచ్ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా విభజించాం.హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం.హైడ్రా ద్వారా 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం.హైడ్రా ద్వారా 60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం.కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది.23వ బయోఆసియా సదస్సు ద్వారా 1,700 కోట్ల పెట్టబడులు ఆకర్షించాం.1.61 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతో రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉంది.సేవారంగం 13.5 శాతం వృద్ధితో దోహదపడుతోంది.జీసీసీలలో 20 శాతం ఆతిథ్యం ఇస్తూ హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్గా మారింది.ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్య స్థానంగా కొనసాగుతోంది.ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి.ఐటీ రంగం 9.39 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోంది.వ్యవసాయరంగ అభివృద్ధికి రేర్ నమూనా రూపొందించాం. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నిరసన.జూట్ అంటూ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.ప్రసంగంలో పథకాల అమలు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ జూట్ అంటూ నిరసన.గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉభయ సభలను ఉద్దేశించి మొదలైన గవర్నర్ ప్రసంగంతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంతెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు హాజరు.అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలునల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్న అసెంబ్లీ, మండలి.కాసేపట్లో అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా విగ్రహావిష్కరణ.మధ్యాహ్నం రెండు గంటలకు బీఏసీ సమావేశం.పని దినాలు, అజెండాపై బీఏసీలో చర్చ. అసెంబ్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. గన్పార్క్కు బీఆర్ఎస్ నేతలు..కేటీఆర్ ఆధ్వర్యంలో గన్ పార్క్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలురైతులకు వెన్నుపోటు.. రాహుల్కు వెయ్యి కోట్లు అంటూ నినాదులురాహుల్ బందు కాదు.. రైతుబందు కావాలి అంటూ నినాదులుఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించాలని ప్లకార్డులతో నిరసనకాంగ్రెస్ హఠావో.. తెలంగాణ బచావో అంటూ నినాదాలు. అసెంబ్లీలో మంత్రుల చాంబర్లు మార్పు..తెలంగాణ శాసనసభలో మారిన పలువురు మంత్రుల చాంబర్లు.లాబీలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కు మంత్రుల చాంబర్లను షిఫ్ట్ చేసిన అధికారులు.మంత్రులు తుమ్మల, దామోదర రాజనర్సింహ చాంబర్లను ఫస్ట్ ఫ్లోర్కు తరలింపు.ఫస్ట్ ఫ్లోర్లో మంత్రి సీతక్క చాంబర్ మార్పు.సీతక్క చాంబర్ను మంత్రి తుమ్మలకు కేటాయింపు.సీతక్కకు సీపీఐ ఛాంబర్ పక్కన బ్యాక్ సైడ్ కేటాయింపు.చాంబర్ల మార్పు స్పీకర్ నిర్ణయం అంటున్న అసెంబ్లీ అధికారులు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..తెలంగాణ శాసనసభ నిబంధనలపై బులిటెన్ విడుదలఉదయం 11:45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ప్రారంభంఎమ్మెల్యేలు గేట్ నెం.2, గేట్ నెం.4 ద్వారా ప్రవేశంవాహనాలపై అసెంబ్లీ కార్ పాస్ తప్పనిసరిగేట్ నెం.1, 2, 4 వద్ద వాహనాల సెక్యూరిటీ చెకింగ్స్వయంగా నడిపే వాహనాలకు మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలో అనుమతిడ్రైవర్తో వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ఎమ్మెల్యేలు ఆయుధాలు తీసుకురావడం పూర్తిగా నిషేధంఅసెంబ్లీ లోపల మొబైల్తో ఫొటోలు, వీడియోలు నిషేధంస్పీకర్ అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం నిషేధంఅసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు, నిరసనలు పూర్తిగా నిషేధంసమావేశం జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ వినియోగం నిషేధంటీ/లంచ్ బ్రేక్ సమయంలో మాత్రమే మీడియా పాయింట్ వినియోగంఅసెంబ్లీ లాబీల్లో అధికారిక ఫోటోగ్రాఫర్లకు మాత్రమే అనుమతిమాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు లోపల లాబీల్లో ప్రవేశం లేదుమండలి చైర్మన్ కీలక ఆదేశాలుతెలంగాణ శాసన మండలి సమావేశాల నేపథ్యంలో చైర్మన్ కీలక ఆదేశాలుఉదయం 11:45కి తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ 26వ సెషన్ ప్రారంభంకౌన్సిల్ ప్రాంగణంలో పబ్లిక్ మీటింగ్స్ నిర్వహణ నిషేధంఆయుధాలు, బ్యానర్లు, ప్లకార్డులు తీసుకురావడం నిషేధంనినాదాలు, ప్రసంగాలు చేయడం నిషేధంప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు పూర్తిగా నిషేధంఇతర సభ్యులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయరాదుచైర్మన్ అనుమతి లేకుండా మొబైల్, ల్యాప్ టాప్లలో వీడియోలు లేదా ఫొటోలు చూపరాదుకౌన్సిల్ ప్రాంగణంలో సభ్యులు సందర్శకులను తీసుకురావద్దని ఆదేశంకౌన్సిల్ లోపలికి సభ్యుల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అనుమతి లేదుసభ్యులు తమ సెక్యూరిటీ సిబ్బందిని బయటే ఉంచాలని సూచనకార్ పాస్ తప్పనిసరిగా వాహనం ముందు ప్రదర్శించాలిసభ్యుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్ ఏర్పాటుసభ్యుల పీఏలు తమ పార్టీ కార్యాలయాల వరకు మాత్రమే అనుమతి -
Hyderabad: ఫాంహౌసుల్లో అసాంఘిక కార్యకలాపాలు
వారాంతపు విడిది కోసమని నిర్మించుకున్న ఫాంహౌస్ల్లో చీకటి వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. మందు, రేవ్, డ్రగ్స్, ముజ్రా పార్టీలతోపాటు వ్యభిచారం వంటి అపాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయి. అప్పుడప్పుడు పోలీసులు దాడి చేసి గుట్టురట్టు చేస్తున్నా అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. కొన్ని రకాల సెటిల్మెంట్లు, రాజకీయ నేతల రహస్య భేటీలు సైతం ఫాంహౌసుల్లోనే జరుగుతుండటం విశేషం. హైదారబాద్: నగర శివారుల్లోని మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, శంషాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో చాలామంది ప్రముఖులు ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. హైదరాబాద్కు అతి చేరువలో ఉన్న మొయినాబాద్ మండలంలో 10 గుంటల నుంచి ఎకరం వరకు భూమి కొనుగోలు చేసి ఫాంహౌస్లు నిర్మిస్తున్నారు. అడ్డగోలు దందాలు... ఫాంహౌస్ యజమానులు గెట్టుగెదర్, ఫ్యామిలీ పార్టీలు, బర్త్డేలకు రోజువారీగా అద్దెకు ఇస్తున్నారు. అయితే కొందరు నిర్వాహకులు రేవ్, ముజ్రా పార్టీలు, జూదం, కోడి పందేలు సైతం నిర్వహిస్తున్నారు. ప్రముఖుల ఫాంహౌస్ల్లో.. నగరానికి అతి చేరువలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఒప్పందానికి వేదికగా మారింది. పోలీసులు దాడి చేసి ఆ గుట్టును రట్టుచేశారు. తాజాగా శనివారంరాత్రి ఆయన ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా ఈగల్ టీం పోలీసులు అక్కడికి చేరుకోగా గన్తో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇందులో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, మరో తొమ్మిది మంది పట్టుబడ్డారు. వెలుగుచూస్తున్న వరుస ఘటనలు కొంత కాలం క్రితం కనకమామిడి రెవెన్యూలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు మహిళలను ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఏడాదిన్నర క్రితం నజీబ్నగర్ రెవెన్యూలోని ఓ ఫాంహౌస్ ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతోపాటు ఆరుగురు యువకులు, నలుగురు యువతులను పట్టుకున్నారు. రెండేళ్ల క్రితం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఫాంహౌస్పై దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు నిర్వాహకులు, నలుగురు విటులు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఏడాది క్రితం అజీజ్నగర్ సమీపంలోని ఓ ఫాంహౌస్లో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి జూదరులను అరెస్టు చేశారు. పది నెలల క్రితం ఎత్బార్పల్లిలోని ఫాంహౌస్లో బర్త్డే పార్టీ పేరుతో నిర్వహిస్తున్న ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. 13 మంది యువకులు, ఏడుగురు యువతులను పట్టుకున్నారు. వారి నుంచి గంజాయి, హుక్కా పాట్స్, మద్యం, నగదు స్వా«దీనం చేసుకున్నారు. -
ఎండల ఎఫెక్ట్… రైళ్లలో ఏసీ బోగీలకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండుతుండటంతో రైళ్లలో ఏసీ బోగీలకు డిమాండ్ పెరిగింది. సాధారణంగా స్లీపర్ బోగీల్లో ప్రయాణం చేసేవారు సైతం ఏసీ ఉంటేనే జర్నీ అనే పరిస్థితి నెలకొంది. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్ల కంటే థర్డ్క్లాస్ ఏసీ బోగీలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. పూర్తిస్థాయి ఏసీ సదుపాయం కలిగిన వందేభారత్ రైళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. వందశాతానికి పైగా ఆక్యుపెన్సీతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. వెయిటింగ్లిస్ట్ కూడా పెరుగుతోంది. రాజధాని, సూపర్ఫాస్ట్ వంటి రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీల్లో కూడా పెద్ద సంఖ్యలో వెయిటింగ్ దర్శనమిస్తోంది. వేసవి ప్రారంభంలోనే ప్రయాణికుల డిమాండ్ ఇలా ఉంటే పిల్లలకు వేసవి సెలవులు, పెళ్లిళ్లు, పండుగలు తదితర వేడుకల కారణంగా ఏప్రిల్, మే నెలల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. థర్డ్ ఏసీదే టాప్.. సాధారణ స్లీపర్తో పోల్చుకుంటే ఏసీ చార్జీలు రెట్టింపే. హైదరాబాద్ నుంచి విశాఖకు స్లీపర్ సుమారు రూ.450 వరకు ఉంటుంది. థర్డ్ ఏసీలో ఇది రూ.1,190 అయినా సరే కనీసం 12 గంటల ప్రయాణం కావడంతో టికెట్ ధర ఎక్కువే అయినా ఏసీనే కోరుకుంటున్నారు. ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్షిట్లు అందజేయడం, రెండు వైపులా డోర్లు లాక్ చేసే సదుపాయం వల్ల ప్రయాణంలో భద్రత లభించడం కూడా ప్రధాన కారణాలే. రాత్రంతా ప్రశాంతంగా నిద్రించి ఉదయాన్నే గమ్యస్థానానికి చేరుకొనే సదుపాయం ఉండడంతో ఈ బోగీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. స్లీపర్ తగ్గుముఖం.. ఏటా ఏసీ బోగీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కొంతకాలంగా అన్ని ప్రధాన రైళ్లలో స్లీపర్ కోచ్లను తగ్గించి థర్డ్ ఏసీ బోగీలను పెంచారు. గతంలో అన్ని రైళ్లలో 1.5 లక్షల వరకు స్లీపర్ బెర్తులు అందుబాటులో ఉండేవి. థర్డ్ ఏసీ బెర్తులు పెంచడంతో స్లీపర్ల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు అంచనా. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఏసీ వైపు మొగ్గుచూపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతి, నర్సాపూర్, చెన్నై, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారు ఏసీ ప్రయాణాలకే మొగ్గు చూపుతుండగా, ఉత్తరాదికి వెళ్లే కొన్ని రైళ్లలో మాత్రం స్లీపర్ బోగీలకు ఆదరణ ఉందని పేర్కొన్నారు. -
నమ్మండి.. సిలిండర్ హోమ్ డెలివరీ చేస్తాం
ప్రియమైన కస్టమర్, అధిక/పదేపదే రీఫిల్ బుకింగ్ కాల్స్ కారణంగా స్పందించడంలో తాత్కాలిక ఆలస్యం జరగవచ్చు. వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. భయపడవద్దు. దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలందిస్తున్న ఆయిల్ కంపెనీని నమ్మండి. హోమ్ డెలివరీ చేస్తాం. ఏజెన్సీల వద్దకు పరుగు తీయవద్దు. ఇంధనాన్ని ఆదా చేయండి. –వినియోగదారుల ఫోన్కు ఐవోసీ పంపుతున్న సందేశం.సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ సిలిండర్ కొరత వస్తుందనే భయం నగర వాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సరఫరాపై ఆంక్షలు విధించి.. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. వినియోగదారులు ఒక్కసారిగా బుకింగ్లకు ఎగబడడంతో ‘డొమెస్టిక్ గ్యాస్’ సంక్షోభం తారస్థాయికి చేరింది. కమర్షియల్ గ్యాస్ వాడకంపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని ‘ముంచుకొస్తున్న ముప్పు’నకు సంకేతంగా సామాన్యులు భావిస్తున్నారు. అందుకే సిలిండర్ అయిపోకముందే అడ్వాన్స్ బుకింగ్లకు పోటీ పడుతున్నారు. లక్షలాది బుకింగ్లతో ఆయిల్ కంపెనీల టెక్నికల్ సర్వర్లు జామ్ అవుతూ యాప్లు, వెబ్సైట్లు మొరాయిస్తున్నాయి.వారం దాటినా... నగరంలో హోమ్ డెలివరీ వెయిటింగ్ పిరియడ్ పెరగడం ఆందోళకు గురిచేస్తోంది. సాధారణంగా 24 నుంచి 48 గంటల్లో వచ్చే సిలిండర్, ప్రస్తుతం వారం దాటినా చేరడం లేదు. ఫోన్లలో బుక్ కాకపోవడం, డెలివరీలో జాప్యంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. పౌర సరఫరాల శాఖ, ఆయిల్ కంపెనీల లెక్కల ప్రకారం హైదరాబాద్లో బఫర్ స్టాక్ కనీసం 15 నుంచి 20 రోజులకు సరిపడా ఉంది. అయితే, కేంద్రం ఆంక్షలు విధించడంతో 30 శాతం వరకు అదనపు గ్యాస్ గృహ అవసరాలకు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకర సందేశాలు, వదంతులు నమ్మొద్దని చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. సరఫరా గొలుసు నిరంతరాయంగా కొనసాగుతోంది. ‘‘హోం డెలివరీలో స్వల్ప జాప్యం వాస్తవమే. అది బుకింగ్ల రద్దీ వల్ల మాత్రమే. ఏజెన్సీల వద్దకు రావాల్సిన అవసరం లేదు’’ అని చమురు సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.కార్గో కంగారు సికింద్రాబాద్కు చెందిన వెంకటయ్య కుమారుడు దినేష్ భార్య పిల్లలతో ఖతర్లో ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 17న కుమారుడి బర్త్డే పారీ్టకి అవసరమైన వస్తువులను నగరం నుంచి తెప్పించాలని భావించి తండ్రికి లిస్టు పంపించాడు. అయితే పశ్చిమాసియా యుద్ధంతో చాలా కార్గో కంపెనీలు పార్సిళ్లు పంపలేమన్నాయని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఒకటి, అరా ముందుకు వచ్చిన చార్జీలను మాత్రం 3–4 రెట్లు ఎక్కువగా పెంచడంతో పార్సిల్ పంపడం మానుకున్నారు.టౌలిచౌకీకి చెందిన ఓ కుటుంబం సౌదీ అరేబియాలో ఉంటోంది. ఏటా రంజాన్ పండుగకు నగరం నుంచే సామగ్రితోపాటు ఈద్ నమాజ్ కోసం దుస్తులను తెప్పించుకుంటుంది. యుద్ధ ప్రభావంతో కార్గో సర్వీస్ సక్రమంగా లేక ఈసారి అలా కుదరడం లేదు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. పండుగలు, జన్మదినం, మ్యారేజ్ డే.. ఇలా ఏ ఫంక్షన్ ఉన్నా నగరంలోని తమ వారి ద్వారా వస్తువులు, దుస్తులు, పిండి వంటలు, పూజ సామగ్రిని కార్గో సరీ్వసుల ద్వారా తెప్పించుకునేవారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల కార్గో సరీ్వస్లు పూర్తి స్థాయిలో కొనసాగకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వేళ ఇక్కడి నుంచి ఎవరైనా పార్సిల్స్ పంపించాలన్నా చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఇదివరకు ప్రతిరోజూ వేల సంఖ్యలో నగరం నుంచి అక్కడికి పార్సిల్స్ వెళ్లేవి. ఇతర దేశాలకు ఓకే.. అమెరికా, లండన్, యూరప్, ఆ్రస్టేలియా, ఇతర దేశాలకు నగరం నుంచి కార్గో సరీ్వసులు నిరాంటకంగా కొనసాగుతున్నా చార్జీలు మాత్రం పెరిగాయి. డెలివరీ టైమ్ కూడా ఎక్కువ పడుతోంది. గతంలో ఉన్న రేట్ల కంటే ప్రతి కేజీపై రూ 200–250 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అమెరికాకు 5 రోజుల్లో వెళ్లే పార్సిల్ ప్రస్తుతం 10–12 రోజులు పడుతోంది. యూకేకు కూడా ఇదే పరిస్థితి. ఆస్ట్రేలియా పార్సిల్స్కు ఎలాంటి ఇబ్బంది లేదు. పౌర సరఫరాల శాఖ కన్నెర్ర పౌర సరఫరాల శాఖ బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి తనిఖీ బృందాలను రంగంలోకి దించింది. గ్యాస్ ఏజెన్సీలు కావాలని ‘నో స్టాక్’ బోర్డులు పెడితే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. బుక్ అయిన 48 గంటల్లో డెలివరీ అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. -
చికిత్సకొస్తే చిల్లర చేష్టలు
మహబూబాబాద్ జిల్లా: జ్వరంతో చికిత్స కోసం క్లినిక్కు వచ్చి న ఓ మహిళతో ప్రభుత్వ ఆయుర్వేదిక్ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో జరిగిన ఈ సంఘట నపై బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ మహిళకు తీవ్రంగా జ్వరం రావడంతో శనివారం రాత్రి విజయలక్ష్మి క్లినిక్కు తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆ యుర్వేదిక్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న డాక్ట ర్ కిరణ్కుమార్ విజయలక్ష్మి క్లినిక్ను నిర్వహిస్తున్నాడు. వైద్య పరీక్షలు చేసి సెలైన్ ఎక్కిస్తున్న క్ర మంలో.. డాక్టర్ కిరణ్ తనతో అసభ్యంగా ప్ర వర్తించినట్లు బాధిత మహిళ తన భర్త, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆగ్ర హానికి గురైన మహిళ భర్త, తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం డాక్టర్ కిరణ్కుమార్తో గొడవపడి దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతింపజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డాక్టర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ గణేశ్, ఎస్ఐలు ఉపేందర్, అంజమ్మ తెలిపారు. -
చెల్లిని చూడాలని వెళ్తూ.. అనంతలోకాలకు
మేడ్చల్ జిల్లా: మల్కాజిగిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెల్లిని చూడా లని బైక్పై వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గోదావరిఖనికి చెందిన మర్రి ప్రశాంత్ (35) మెడికల్ రిప్రజెంటేటివ్. భార్య శ్రావణి (33), కుమారుడు సహస్రన్ (10)తో కలిసి రాంనగర్లో నివసిస్తున్నారు. ఆదివారం మేడిపల్లిలో నివాసం ఉంటున్న తన చెల్లి ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా స్పార్క్ ఆస్పత్రి సమీపం వరంగల్ హైవేలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కియా కారు అదుపుతప్పి బైక్ను బలంగా ఢీకొట్టి కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య శ్రావణికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడు సహస్రన్కు స్వల్పగాయాలు కాగా అత న్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నా రు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపా రు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్, యజమాని ఉన్నారు. వీరిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని కార్ను సీజ్చేసి విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. -
రికార్డు స్థాయికి చికెన్ ధరలు
నల్లగొండ టూటౌన్ : చికెన్ ధర కొండెక్కింది. కిలో రూ.300 దాటింది. వేసవికాలం కావడం.. ప్రస్తుత సీజన్లో శుభాకార్యాలు అత్యధికంగా ఉండడం, రంజాన్ మాసం కావడంతో చికెన్ వినియోగం పెరిగింది. దీంతో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గత ఆదివారం రూ.250 ఉన్న కిలో చికెన్.. ఇప్పుడు రూ.300లకు చేరింది. ధరల పెరుగుదలతో వ్యాపారం తగ్గిందని చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. రూ.100 పెరుగుదల..చికెన్ ధర సాధారణంగా రూ.180 నుంచి రూ.220 మధ్య ఉంటుంది. కానీ కొంతకాలంగా ధరల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇటీవలే ఒక్కసారిగా దాదాపు రూ.100 పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ధర ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.తగ్గిన కోళ్ల ఫారాలుగతంలో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోళ్ల ఫారాలు వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ ఇటీవల చౌటుప్పల్, స్థానికంగా గ్రామాల్లో ఉండే కోళ్ల ఫారాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. గ్రామాల్లో యువత ఉపాధి కోసం గతంలో కోళ్ల ఫారాలు పెట్టేవారు. కానీ సరైన ఆదాయం రాకపోవడం, వాటి నిర్వహణలో అనుభవం లేకపోవడం, మార్కెటింగ్ తదితర కారణాలతో గ్రామాల్లో కోళ్ల ఫారాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. మరోవైపు ఎండల తీవ్రగా కారణంగా కోళ్లు చనిపోతాయని వ్యాపారులు ఫారాల్లో కోళ్లను పెంచడంలేదు. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటుండడంతో రవాణా ఖర్చుల పెరగడం, కోళ్లు సరిపడ లేకపోవడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.ఎండలతో కోళ్లు తక్కువగా ఉన్నాయిఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రత ఏటా ఎక్కువగా ఉంటుంది. దాంతో చాలా మంది కోళ్లు చనిపోతాయని ఈ కాలంలో కోళ్ల పెంపకం తగ్గించారు. అందువల్ల ధరలు పెరిగాయి. ప్రతి ఎండాకాలంలో ఈ సమస్య ఉంటుంది. ఎండలు తగ్గాక కోళ్లను పెంచడం మొదలు పెడుతారు. – వింజమూరి లక్ష్మణ్, చికెన్ దుకాణాల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
అమ్మా.. ఎందుకిలా..!
భువనగిరి : కుటుంబాలలో నెలకొనే చిన్నచిన్న తగాదాలు, సమస్యలతో చాలా మంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతూ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో తమతో పాటు నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డలను సైతం చంపుతున్నారు. ఫలితంగా వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇటీవల ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ట్రైన్కు ఎదురెళ్లి దుర్మరణం చెందగా, ఇద్దరు పిల్లలను ఊపిరాగకుండా చేసి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మరవకముందే తాజాగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలపై కత్తితో దాడికి పాల్పడి తాను ఆత్మహత్య చేసుకుంది. నెలన్నర వ్యవధిలోనే చోటుచేసుకున్న ఈ మూడు ఘటనల్లో బాధితులు బీబీనగర్ మండలానికి చెందిన వారు కావడం గమనార్హం. పిల్లలపై కత్తితో దాడి చేసి..బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జం నరేందర్రెడ్డి భార్య రత్నకళ (నీలిమ) మానసిక స్థితి సరిగా లేక పిల్లలతో తల్లిగారి గ్రామమైన భువనగిరి మండలం తుక్కాపురానికి వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున నిద్రలో ఉన్న కుమార్తె కృతిరెడ్డి(14)పై కత్తితో దాడి చేసి చంపింది. అనంతరం పన్నెండేళ్ల కుమారుడి అక్షిత్రెడ్డిపై దాడికి యత్నంచగా అతడు తప్పించుకుని కేకలు పెట్టుకుంటూ బయటకు వచ్చాడు. అనంతరం ఆమె అదే గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డింది. ఈ ఘటన బీబీనగర్ మండలంలో కలకలం సృష్టించింది.గతంలో రెండు ఘటనలు ఇలా..అయితే బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన పిన్నింటి విజయశాంతిరెడ్డి అనే మహిళ జనవరి 31న ఘట్కేసర్ వద్ద తన ఇద్దరు పిల్లలు చేతన, విశాల్రెడ్డితో కలిసి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే ఈ నెల 2న ఇదే మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మహిళ ఐశ్వర్య కుటుంబ కలహాలతో తన ఇద్దరు పిల్లలైన ఝాన్సీ, పండును ఊపిరాడకుండా చేసి చంపింది. తర్వాత తాను ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నెలన్నర వ్యవధిలోనే ఒకే మండలానికి ఇద్దరు మహిళలు తమ పిల్లలను చంపి తాము చావాలనుకోవడం లాంటి ఘటనలు మరువక ముందే ఇదే మండలానికి చెందిన తమ మరో మహిళ తన తల్లి గారి ఊరిలో తన కుమార్తెను చంపి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం చర్చనీయాంశంగా మారింది. -
ఇది మూడోసారి!
సాక్షి, హైదరాబాద్: ఏలూరు ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత పుట్టా మహేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి తదితరులు పాల్గొన్న రేవ్ పార్టీతో మెయినాబాద్ అజీజ్నగర్లో ఉన్న ఫామ్హౌస్ మరోసారి వార్తల్లో నిలిచింది. గడిచిన ఐదున్నరేళ్ల కాలంలో ఇది వివాదాస్పదం కావడం ఇది మూడోసారి. కాగా పైలెట్ రోహిత్రెడ్డికి చెందిన ఈ ఫామ్హౌస్లో తాజాగా రేవ్ పార్టీకి తోడు కాల్పుల కలకలం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. తొలిసారి..: ఈ ఫామ్హౌస్ తొలిసారిగా 2022 అక్టోబర్లో వార్తల్లోకి ఎక్కింది. ఆ నెల 26 రాత్రి నిఘా విభాగం, సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్న తిరుపతికి చెందిన సింహయాజులు, ఫరీదాబాద్లోని ఓ దేవాలయంలో ఉండే ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, హైదరాబాద్ వాసి నందకుమార్లను పట్టుకున్నారు. అక్కడ మొదలైన ఈ కథ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు, రోహిత్రెడ్డి సహా అనేక మంది విచారణ వరకు వెళ్లింది. ఈ ‘ఎర’కు సంబంధించిన ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. మరోవైపు సీబీఐ, సిట్ల్లో ఎవరు దర్యాప్తు చేయాలనే అంశంపై ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. మలిసారి..: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ట్యాపింగ్పై 2024 మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన సిట్ కొన్ని కీలకాంశాలు గుర్తించింది. 2022లో మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ జరిగిన ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటకు వచ్చినట్లు తేల్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారానే ఈ విషయాన్ని నాటి నిఘా వర్గాలు గుర్తించినట్లు సిట్ తేల్చింది. అందుకు అవసరమైన ఉపకరణాలను సైతం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించింది. తాజాగా..: ఈ ఫామ్హౌస్లో శనివారం మధ్యాహ్నం మొదలైన రేవ్ పార్టీ రాత్రి వరకు కొనసాగింది. ఈగల్, ఫ్యూచర్ సిటీ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో రోహిత్రెడ్డి, పుట్టా మహేశ్ సహా 11 మంది చిక్కారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పోలీసుల దాడికి ముందు కాల్పులు సైతం చోటు చేసుకోవడంతో ఈ కేసులో మాదకద్రవ్యాల చట్టంతో పాటు ఆర్మ్స్ యాక్ట్ను జోడించారు. పుట్టా మహేశ్, రోహిత్ రెడ్డి సహా ఇతర నిందితులను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. -
చిన్న పార్టీ కాదు.. పెద్ద డ్రగ్స్ మాఫియా
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో జరిగింది చిన్న పార్టీ కాదని, అదో పెద్ద డ్రగ్స్ మాఫియా అని, బడా రాకెట్ నడుస్తోందని తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ యువతను చెడగొట్టడానికి ఈ డ్రగ్స్ మాఫియా పనిచేస్తోందని విమర్శించారు. ఈ ముఠా వెనుక ఉన్న వారిని ఈగల్ టీం బయటకు లాగుతుందని, త్వరలోనే ఈ రాకెట్లో ఉన్న వారి పేర్లు బయటకు వస్తాయని అన్నారు. ఆదివారం గాం«దీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.పదేళ్ల పాటు ఆడిందే ఆట పాడిందే పాటగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని, ఇప్పుడు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వ్యవహారం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉందని మనోహర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన వెనుక నిలబడినందుకు తాండూరు ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. తెలంగాణలో డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్లతో పెకిలించేలా అందరూ సహకరించాలని, రోహిత్రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ వద్ద దిష్టిబోమ్మల దహనం కేటీఆర్తోనే తెలంగాణలోనే డ్రగ్స్ కల్చర్ వచ్చిందని రోహిత్రెడ్డి వ్యవహారంతో మరోమారు రుజువైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావు అన్నారు. ఆదివారం ఉదయం గాంధీభవన్ ఎదుట కేటీఆర్ దిష్టిబోమ్మను దహనం చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై కేటీఆర్ స్పందించాలని, ఇప్పటికైనా తన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి నేతృత్వంలో ఆదివారం సాయంత్రం గాం«దీభవన్ ఎదుట కేటీఆర్, పైలెట్ రోహిత్రెడ్డిల దిష్టిబోమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుర్రం శ్యాంచరణ్రెడ్డి, ఎర్రమల్ల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్కు పూర్తిగా వ్యతిరేకం
సాక్షి, హైదరాబాద్: మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి డ్రగ్స్ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులిస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అందరికీ ఆదర్శంగా నిలుద్దాం ‘డ్రగ్స్, ఇతర అక్రమ పదార్థాల వాడకానికి నేను పూర్తిగా వ్యతిరేకం. మా పార్టీ బీఆర్ఎస్ డ్రగ్స్ వాడకాన్ని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను తీవ్రంగా ఖండిస్తుంది. డ్రగ్స్ వాడుతున్న వారు లేదా విక్రయిస్తున్న వారు (పెడ్లర్లు), వారి రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించబడాలి. అయితే నీచమైన రాజకీయాల కోసం మా పార్టీ బీఆర్ఎస్ను ఇందులోకి లాగుతున్న తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నా. డ్రగ్స్ కేసును బీఆర్ఎస్ పార్టీపై రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం మీ అసహ్యకరమైన రాజకీయాలకు నిదర్శనం.నేను ఏ పరీక్షకైనా సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ సూచనను నేను స్వాగతిస్తున్నా. అందరికీ మనమే ఆదర్శంగా నిలుద్దాం. అంతేకానీ.. ప్రతి డ్రగ్స్ కేసులోకి నా పేరును లాగాలని చూస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటా..’అని కేటీఆర్ హెచ్చరించారు. -
డీప్గా మౌనం..!
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఓ ప్రముఖ నటికి సంబంధించిన మా ర్పింగ్ వీడియో 2023లో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఆమె ముఖాన్ని వేరొక మహిళ శరీరానికి అంటించిన ఆ క్లిప్ భారతీయులకు ఒక చేదు నిజాన్ని చెప్పకనే చెప్పింది. అదేమిటంటే మహిళలకు వ్యతిరేకంగా అత్యంత శక్తివంతమైన ఆయుధాలలో ఒకటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతరించడమే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చర్యలు తీసుకునేలోపే ఆ వీడియో 80 లక్షలకుపైగా వ్యూస్ను పొందింది. ఈ రెండేళ్లలో ఇటువంటి డీప్ఫేక్ కంటెంట్ విస్తృతమైంది.ప్రపంచవ్యాప్తంగా డీప్ఫేక్ బాధితుల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. ఏఐ సేఫ్టీ సంస్థ ‘పై ల్యాబ్స్’నివేదిక ప్రకారం.. అంతర్జాతీయంగా డీప్ఫేక్ బాధితుల్లో 93% మంది మహిళలే. ఇటీవలి కాలంలో మహిళలను లక్ష్యంగా చేసుకుని సృష్టించిన అనధికారిక కృత్రిమ కంటెంట్ ఏకంగా 900% పెరిగింది. భారత్లో మహిళలు బాధితులుగా నమోదైన సైబర్ నేరాల ఫిర్యాదులు 2024లో సుమారు 50వేలు ఉండగా.. 2025 నాటికి 80 వేలకు చేరుకున్నాయి.ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన డీప్ఫేక్ వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటర్నెట్లో కనిపిస్తున్న కంటెంట్లో డీప్ఫేక్ పోర్నోగ్రఫీ అత్యధికంగా ఉంటోంది. వాస్తవ వ్యక్తుల పోలికలు లేకుండా పూర్తిగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన మహిళా రూపాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. మౌనంగా బాధితులు.. మహిళలకు సంబంధించిన 62% డీప్ఫేక్ వేధింపుల ఘటనలు అసలు బయటకే రావడం లేదు. సామాజిక వివక్ష, అవమానం జరుగుతుందనే భయంతో బాధితులు మౌనంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఎటువంటి చర్యలకు ఉపక్రమించడం లేదు. చాలామంది ఎదురుదాడి చేయడానికి బదులుగా నిశ్శబ్దంగా తమ డిజిటల్ ఉనికిని (సామాజిక మాధ్యమాల వినియోగాన్ని) తగ్గించుకుంటున్నారు. 33% మందికి తమను రక్షించడానికి ఉన్న చట్టాల గురించి కనీస అవగాహన కూడా లేదు.పరిశ్రమలా విస్తరించాయి..డీప్ఫేక్ వీడియోలతో వేధింపులు కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. విస్తృతంగా ప్రచారంలోకి వచి్చన ఒక కేసులో.. మాజీ భాగస్వామి ఒకరు ఏఐ టూల్స్ను ఉపయోగించి ఒక మహిళ చిత్రంతో అసభ్యకరమైన ఇన్స్ట్రాగామ్ ప్రొఫైల్ను సృష్టించాడు. ఈ విషయాన్ని గుర్తించేలోపే 1.4 మిలియన్ల ఫాలోవర్లను ఆ ప్రొఫైల్ సంపాదించింది.ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐదువేల కంటే ఎక్కువ ఫేస్–స్వాప్ టూల్స్, 1,000 వాయిస్–క్లోనింగ్ అప్లికేషన్స్ ద్వారా ఈ వేధింపులు ఒక పరిశ్రమలా విస్తరించాయి. సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీలకు సమానంగా ప్రమాదంలో ఉన్నారు. డీప్ఫేక్లను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. జెనరేటివ్ ఏఐ టూల్స్ అందరికీ అందుబాటులో ఉండటం, దురి్వనియోగం చేసే వారి సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. వీటిని గుర్తించే సాంకేతికతలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు. -
తెలంగాణ 'బడ్జెట్'కు వేళాయె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందనుంది. ఉదయం 11:45 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా.. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడనుంది. తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. ఇందులో సమావేశాల ఎజెండాను ఖరారు చేస్తారు. ఈ నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఈ నెల 20న బడ్జెట్ను ప్రవేశ పెడతారని, 30 లేదా 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది. కాగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శుక్లా సోమవారం ఆవిష్కరించనున్నారు. ఉదయం 11:27 నుంచి 11.37 నిమిషాల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. ఉగాది, రంజాన్ రోజుల్లో సెలవు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో చర్చను ప్రతిపాదించనుంది. మంగళ, బుధవారాల్లో చర్చ అనంతరం తీర్మానాన్ని ఆమోదించనున్నారు. మరుసటి రోజు ఉగాది కారణంగా సభ జరగదు. మళ్లీ 20న ఉభయ సభలు సమావేశం కానుండగా, అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాతి రోజు రంజాన్ కావడంతో మళ్లీ 23న సభ ప్రారంభమై వారం రోజుల పాటు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరగాలి? బిల్లుల ప్రతిపాదన లాంటి అంశాలతో కూడిన ఎజెండా ఖరారు కానుంది. ఇలావుండగా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరగనుంది. తొలిసారి ఒకే ప్రాంగణంలో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఒకే ప్రాంగణంలో కొలువు దీరనున్నాయి. ఇప్పటివరకు జూబ్లీహాల్ వేదికగా జరుగుతున్న మండలి సమావేశాలు ఈసారి పునరుద్ధరించిన పాత అసెంబ్లీ భవనంలో జరగనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఈ భవనాన్ని ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం కేటాయించగా, ఏపీ అసెంబ్లీ అమరావతికి వెళ్లిన తర్వాత ఆ భవనం ఖాళీగా ఉంటోంది. దీంతో ఈ భవనాన్ని పునరుద్ధరించి అందులో మండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో ఈ భవనంలో మండలి సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజల ముందుకు అభివృద్ధి, ప్రణాళికలు బడ్జెట్ సమావేశాలు ఈసారి వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు వచ్చే ఏడాదికి సంబంధించిన తమ ప్రణాళికలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలును బట్టి మూసీ పునరుజ్జీవంతో పాటు తెలంగాణ ఉద్యమకారుల అంశంపై చర్చ జరపాలని యోచిస్తోంది. మరోవైపు పలు బిల్లులను కూడా ప్రవేశపెట్టనుంది. కేసీఆర్ హాజరయ్యే అవకాశం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్.. పలు అంశాలపై ప్రభుత్వాన్ని తూర్పారబట్టేందుకు సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాలకు ఆ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత కేసులో అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ తీవ్ర అసహనంతో ఉంది. సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదనే భావనలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం.. ఈ సమావేశాల్లో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అయితే బలం సరిపోతుందా లేదా అన్న దానిపై ఊగిసలాడుతున్నట్టు సమాచారం. దీంతో ఇందుకు సంబంధించిన నిబంధనలు మార్చి, అవిశ్వాసం ప్రతిపాదించే సభ్యుల సంఖ్యను తగ్గించాలని కోరుతూ ప్రైవేటు మెంబర్ బిల్లును పెట్టాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ బిల్లు పెట్టేందుకు 12 మంది సభ్యులు సరిపోతారని తెలుస్తోంది. అయితే ఈ బిల్లును సభలో ప్రతిపాదించి చర్చ చేసే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉండడంతో ఏం చేయాలన్న దానిపై బీఆర్ఎస్ నేతలు సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా గత రెండేళ్ల కాలంలో జరిగిన బడ్జెట్ కేటాయింపులు, వాటి ఖర్చులో డొల్లతనంతో పాటు ఆరు గ్యారంటీల అమలు, రైతు భరోసా, కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం, కృష్ణా నదీజలాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, మూసీ పునరుద్ధరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలే బీజేపీ ఎజెండా బీజేపీ కూడా అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు నేతృత్వంలో ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. హైడ్రాతో పాటు మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వర్గాల ఇళ్లను కూల్చివేయడంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. పలు కీలకాంశాలను ప్రస్తావించాలని, రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను, వారి ఆకాంక్షలను అధికార పక్షం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు ఎంఐఎం, సీపీఐ కూడా ఈ సమావేశాల్లో తమ వాణిని విన్పించేందుకు సిద్ధమయ్యాయి. నిర్వహణ, భద్రత, వసతులపై సమీక్ష అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశాల నిర్వహణ, కల్పించాల్సిన వసతులు, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. గతంలో మాదరిగానే ఈ సమావేశాలకూ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సహకరించాలని స్పీకర్ కోరారు. సభ లోపల, బయట ప్రశాంత వాతావరణం ఉండేలా, అనుకోని ఘటనలు, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలకు అవకాశం ఇవ్వకూడదని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వాలని కోరారు. మండలి చైర్మన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ, మండలి ఒకే ప్రాంగణంలో జరుగుతున్నందున అవసరమైన అదనపు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ సభ సజావుగా జరగడానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను ప్రభుత్వం పక్షాన అందిస్తామని చెప్పారు. సమన్వయం కోసం ప్రతి శాఖ నుంచి ఓ ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు తెలిపారు. కాగా ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావు, మండలి కార్యదర్శి వి.నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఐకమత్యమే అభివృద్ధికి ఇంధనం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై గంగా–జమునా తెహజీబ్ వర్ధిల్లుతోందని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండటమే రాష్ట్ర అభివృద్ధికి అసలైన ఇంధనమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. దేశంలో మతపరమైన విభజనలకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ మత సామరస్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడ అశాంతి నెలకొన్నా, మన రాష్ట్రంలో మాత్రం మత సామరస్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మైనారిటీలకు పెద్దపీట మైనారిటీల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయంగా, పరిపాలనలో పెద్దపీట వేస్తున్నామని సీఎం చెప్పారు. ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడిన మహమ్మద్ అజహరుద్దీన్ను మైనారిటీ శాఖ మంత్రిగా నియమించుకున్నామని, అదనంగా 8 మంది మైనారిటీ నేతలకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత షబ్బీర్ అలీ సేవలను గుర్తిస్తూ ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నామని తెలిపారు. ఆ 4 శాతం రిజర్వేషన్ల వల్లే వేలాది మంది ముస్లిం యువకులు డాక్టర్లు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన క్రికెటర్ సిరాజ్, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్లను డీఎస్పీలుగా నియమించడమే కాకుండా, వారికి భారీగా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచామని పేర్కొన్నారు. సేవా భావానికి ప్రతీక రంజాన్ రంజాన్ కేవలం పండుగ మాత్రమే కాదు.. అది క్రమశిక్షణ, ఆత్మశుద్ధి మానవతా విలువలను గుర్తు చేసే పవిత్ర మాసం అని రేవంత్రెడ్డి అన్నారు. ఒక నెల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ, తోటి వారికి సహాయం చేయడమే ఈ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకంలో మైనారిటీలకు సింహభాగం దక్కేలా చూస్తున్నామని, తెలంగాణ అభివద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని, మీ దువా (ప్రార్థనలు) రాష్ట్రానికి రక్షణ కవచంలా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజహరుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, వేలాది మంది మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. -
మెట్రో టేకోవర్ చెల్లింపులపై స్పష్టత
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో టేకోవర్ ప్రక్రియ ఊపందుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా ప్రాజెక్టును స్వాదీనం చేసుకొనే దిశగా ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. ఎల్అండ్టీ సంస్థకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. 16వ తేదీ నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో టేకోవర్లో భాగంగా రూ.15 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకోనున్న సంగతి తెలిసిందే.. ఇందులో ఎల్అండ్టీకి ఇవ్వాల్సిన రూ.2 వేల కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వ నిధుల నుంచి అందజేయనున్నారు. మిగతా రూ.13 వేల కోట్ల బ్యాంకు రుణాలను చెల్లించేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) ఇప్పటికే ముందుకు వచి్చంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్, ఐఆర్ఎఫ్సీ సంస్థల మధ్య పరస్పర అవగాహన కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు. రూ.3 శాతం వడ్డీ చొప్పున ఐఆర్ఎఫ్సీ అందజేసే నిధులతో ప్రభుత్వం బ్యాంకు రుణాలను చెల్లించనుంది. మెట్రో టేకోవర్ గడువు సమీపిస్తున్న దృష్ట్యా ఒప్పందంలోని అన్ని అంశాలపై అధికారులు సీరియస్గా దృష్టి సారించారు. ఏప్రిల్ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఆధ్వర్యంలోనే అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఒప్పందం మేరకు ఈ ఏడాది నవంబర్ వరకు ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ సంస్థ రైళ్లను నడపనుంది. త్వరలో రెండో దశ.. మొదటి దశ టేకోవర్ ప్రక్రియ ముగిసిన అనంతరం మెట్రో రెండో దశ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఇప్పటికే పాతబస్తీలో మెట్రో విస్తరణకు అవసరమైన అన్ని చర్యలను పూర్తి చేసింది. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7.5 కి.మీ. కారిడార్లో భాగంగా రోడ్ల విస్తరణ చేపట్టారు. అలాగే ఆస్తుల తొలగింపు, పరిహారాల చెల్లింపు కూడా తుదిదశకు చేరుకుంది. రెండో దశకు కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే మొదట పాతబస్తీ కారిడార్ను ప్రారంభించి ఆ తర్వాత దశలవారీగా ప్రతిపాదిత అన్ని రూట్లలో పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో దశ ‘ఏ’ విభాగం కింద ఐదు కారిడార్లలో మెట్రో విస్తరణకు ప్రణాళికలను రూపొందించిన సంగతి తెలిసిందే. ‘బి’ విభాగం కింద మరో మూడు మార్గాలను ప్రతిపాదించారు. మొత్తం 8 కారిడార్లపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్)లను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో ఏడాదిన్నర క్రితమే కేంద్రానికి అందజేశారు.కేంద్రం నుంచి సావరిన్ గ్యారెంటీ లభిస్తేనే అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాలను తీసుకొనే అవకాశం ఉంది. జైకా వంటి సంస్థలు మెట్రో రెండో దశకు రుణాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి అనుమతి లభించకపోవడంతోనే ఏడాదిన్నర కాలంగా ఈ ప్రాజెక్టు పెండింగ్లో పడిన సంగతి తెలిసిందే. -
పాతాళంలోకి వే'గంగా'..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు వేగంగా పాతాళానికి జారుకుంటున్నాయి. ఓ వైపు వేసవి తీవ్రత పెరుగుతుండటం.. మరోవైపు బోరుబావుల కింద యాసంగి పంటల సాగుకి యథేచ్ఛగా తోడేస్తుండటంతో గత జనవరితో పోల్చితే ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాష్ట్ర భూగర్భ జలాల సగటు నీటిమట్టం ఏకంగా ఒక మీటర్ మేర పడిపోయింది. జనవరిలో సగటున రాష్ట్రంలో 6.28 మీటర్ల లోతులో లభ్యమైన జలాలు ఫిబ్రవరి నాటికి 7.25 మీటర్ల లోతుల్లోకి దిగజారాయి. వాస్తవానికి గత వర్షాకాలంలో సాధారణానికి మించి 37 శాతం వర్షపాతం నమోదు కావడంతో ప్రస్తుత నీటి సంవత్సరం 2025–26లో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గత సెపె్టంబర్ నాటికి రాష్ట్ర భూగర్భ జలాల సగటు మట్టం 4.41 మీటర్లకు ఉబికి వచ్చాయి. వేసవి ప్రారంభం కావడంతో ఫిబ్రవరి నాటికి 7.25 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. రాష్ట్ర భూగర్భ జల శాఖ ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి, నివేదికను విడుదల చేస్తూ ఉంటుంది. వికారాబాద్లో ఆందోళనకరం ఖమ్మం జిల్లాలో 4.08 మీటర్ల లోతుల్లోనే భూగర్భ జలాల లభ్యత ఉండగా, వికారాబాద్ జిల్లాలో మాత్రం 12.87 మీటర్ల లోతుల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా, కేవలం 6 జిల్లాల్లో 0–5 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు లభిస్తున్నాయి. 21 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతుల్లో, 10 జిల్లాల్లో 10 మీటర్లకి మించిన లోతుల్లో జలాలున్నట్టు తేలింది. 10 మీటర్లకన్నా లోతుకు పడిపోతే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు భావిస్తారు. అంటే, వేసవి ప్రారంభంలోనే 10 జిల్లాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోయినట్టు ఈ గణాంకాలు చెబుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో 12.87, కామారెడ్డి జిల్లాలో 10.69 మీటర్లు, మెదక్ జిల్లాలో 10.67 మీటర్లు, నిజామాబాద్ జిల్లాలో 10.64 మీటర్లు, సంగారెడ్డి జిల్లాలో 10.36 మీటర్లు, భూపాలపల్లి జిల్లాలో 10.28 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి. 77 మండలాల్లో సగటు కంటే తక్కువే.. రాష్ట్రంలో 621 మండలాలుండగా, 544 మండలాల్లో (88శాతం) భూగర్భ జలాల మట్టం గత దశాబ్ద కాల సగటు కంటే మెరుగైన స్థితిలో ఉంది. ఈ మండలాల్లో 0.01–18.97 మీటర్ల మేర దశాబ్ద కాల వృద్ధి నమోదైంది. మిగిలిన 77 మండలాల్లో (12శాతం) దశాబ్ద కాల సగటు కంటే 0.01 నుంచి 11.22 మీటర్ల మేరకు లోతుల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, నల్లగొండ, నారాయణపేట, మేడ్చడల్, భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాల్లో భూగర్భ జలాల పతనం కనిపించింది. కొన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో బోరుబావుల కింద సాగుచేస్తున్న యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. దీంతో ట్యాంకర్లతో నీళ్లను సరఫరా చేసేందుకు రైతన్నలు తంటాలు పడుతున్నారు. ఎండిపోయిన పంటలను పశువులకు మేత కోసం వదిలేస్తున్నారు. -
టీడీపీ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ వద్ద ఫాంహౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారికి జరిపిన పరీక్షల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్టు ఈగల్ అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకోలేదని బుకాయిస్తూ టీడీపీ ఎంపీ పుట్టా యూరిన్లో నీళ్లు కలిపి తొలుత ఎత్తులు వేసినా తుదకు అవి పారలేదు. ఈగల్ అధికారులు రక్త నమూనా పరీక్షలు చేయించడంతో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. అజీజ్నగర్ సమీపంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి చెందిన ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారంతో ఈగల్ టీం, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాలకు సంబంధించి ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) డైరెక్టర్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ నిబంధనల ప్రకారం డ్రగ్ పాజిటివ్ వచ్చినా, గన్ ఫైరింగ్తో సంబంధం ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, అతని సోదరుడు రితేష్రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మలను మాత్రమే పోలీసులు ఆదివారం రాజేంద్రనగర్ కోర్టు జడ్జి నివాసానికి తీసుకెళ్లి ఆయన ముందు ప్రవేశపెట్టగా, ఆయన వారికి రిమాండ్ విధించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్తోపాటు మరో ఏడుగురికి పోలీసులే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ కేసు నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ను తప్పించేందుకు పోలీసులపై తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. అందుకే డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫాం హౌస్లో శనివారం కొందరు పార్టీ చేసుకుంటున్నారని, అందులో డ్రగ్స్ కూడా వాడుతున్నట్టు ఈగల్ టీం అధికారులకు సమాచారం అందింది. వారు ఫ్యూచర్ సిటీ ఎస్ఓటీ, స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి శనివారం రాత్రి 10 గంటకు ఆ ఫాం హౌస్ వద్దకు సోదాల కోసం వెళ్లారు. అదే సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం రావడంతో పోలీసులు హుటాహుటిన లోపలికి వెళ్లి చూశారు. ఫాం హౌస్లోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో సోఫాల్లో కొంత మంది కూర్చుని మద్యం సేవిస్తుండగా, వాష్రూం దగ్గర ఉన్న వ్యక్తి నమిత్ శర్మ చేతిలో 0.32 జర్మన్ డ్ రివాల్వర్, అతడి పక్కన ఉన్న సిల్వరి శరత్కుమార్ చేతుల్లో ఖాళీ బుల్లెట్ కేస్లు గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఫాంహౌస్లో సోదాలు జరపగా మరో తొమ్మిది మంది మద్యం, ఇతర మత్తు పదార్థాలు తీసుకుటున్నట్టు గుర్తించారు. 0.26 గ్రాముల కొకైన్ పట్టుబడింది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి పీఏ/డ్రైవర్ సిల్వరి శరత్ కుమార్ కొకైన్ను అందరికీ పంచి, మిగిలిన రెండు ప్యాకెట్లు తన జేబులో పెట్టుకోవడంతో అది పోలీసులకు దొరికింది. దీన్ని తన యజమాని రోహిత్రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి తెచ్చాడని తెలిపాడు. తాను వ్యాపార పర్యటనలో సిమ్లాకు వెళ్లినప్పుడు తెలియని వ్యక్తి నుంచి కొకైన్ను కొన్నానని, దానిని ఈ పార్టీకి తీసుకువచ్చినట్టు కౌశిక్ రవి కూడా అంగీకరించాడు. రాత్రి నెగెటివ్.. ఉదయానికి పాజిటివ్ సోదాల అనంతరం పోలీసులు పార్టీలో పాల్గొన్న 11 మందికీ డ్రగ్ టెస్ట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. తొలుత టెస్ట్కు శాంపిల్ ఇచ్చేందుకు ఎంపీ మహేశ్కుమార్ అంగీకరించలేదని, పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. పోలీసులు, ఈగల్ అధికారులు టెస్ట్ చేయాల్సిందేనని స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గిన ఆయన కొత్త ఎత్తులు వేసినట్టు సమాచారం. టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వాలని కోరగా, పుట్టా మహేష్ యూరిన్కు బదులు వాటర్ ఇవ్వడంతో తాత్కాలికంగా శనివారం రాత్రి చేసిన టెస్ట్లో నెగెటివ్ వచ్చింది. దీన్ని అదనుగా చూపుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే, నిబంధనల మేరకు డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన వారందరికీ రక్త పరీక్షలు తప్పనిసరి అని చెప్పడంతో ఎర్రగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి 11 మంది రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేయించారు. దీంతో ఎంపీ మహేశ్ కుమార్ రక్త నమూనా పరీక్షలో డ్రగ్ పాజిటివ్గా తేలింది. పెద్ద ఎత్తున మద్యం సీసాలూ లభ్యం కింగ్ ఫినిష్డ్ ఆల్ట్రా 330 ఎంఎల్ 48 సీసాలు, రెండు డాన్జులియో 700 ఎంఎల్ సీసాలు, రాయల్ సెల్యూట్ 21 ఏళ్ల మద్యం లీటర్ సీసా ఒకటి, చివాస్ 18 ఏళ్ల మద్యం సీసాలు 2, బెలివడెరీ వోడ్కా 700 ఎంఎల్ రెండు సీసాలు పట్టుబడ్డాయి. ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు ఫాంహౌస్ డ్రగ్ పార్టీకి సంబంధించి మొయినాబాద్ పోలీస్స్టేషన్ ఎస్సై నయాముద్దీన్ ఫిర్యాదు మేరకు నిందితులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఆదివారం క్రైం నంబర్ 150/2026 కింద కేసు నమోదైంది. డ్రగ్స్ వినియోగం, మారణాయుధాల వాడకం, నేరానికి ప్రేరేపించారనే కారణంతో ఎన్డీపీఎస్ యాక్ట్లోని సెక్షన్ 8 (సీ), 22(ఏ), 27, 29 ఆరŠమ్స్ యాక్ట్లోని సెక్షన్ 25(1–బి)(ఏ), సెక్షన్ 30, తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్లోని సెక్షన్ 34 (ఏ), బీఎన్ఎస్ సెక్షన్ 109,131 రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీళ్లంతా ఎందుకు కలిశారు? మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫాం హౌస్ పార్టీలో పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఒకచోట చేరడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యాపార లావాదేవీలతోపాటు వీరి మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమైన డీల్ విషయమై చర్చించేందుకే వీరంతా స్నేహ పూర్వకంగా శనివారం రాత్రి పార్టీ ఏర్పాటు చేసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పట్టుబడిన వారిలో స్థానిక రాజకీయ నాయకుడు రోహిత్రెడ్డి, అతడి సోదరుడు రితేశ్రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కుమార్లు ఉండడం, వీరితోపాటు బిజినెస్లో ఉన్న మోరవినేని రమేశ్, వరమచనేని శ్రవణ్కుమార్, నల్లపనేని విజయ్ కృష్ణ, అర్జున్రెడ్డి, అడ్వొకేట్ రవి ఉన్నారు. ఏ డీల్ కోసం భేటీ అయ్యారన్నది దర్యాప్తులో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. టీడీపీ ఎంపీ సహా ఆరుగురికి పాజిటివ్ : ఈగల్ ఎస్పీ గిరిధర్ ‘మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌజ్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు శనివారం మాకు పక్కా సమాచారం అందింది. మా ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులతో కలిసి ఫామ్హౌజ్పై రైడ్ చేసేందుకు వెళ్లాం. అక్కడికి వెళ్లిన సమయంలో మాకు అక్కడ గన్ కాల్చినట్టు శబ్దం వినిపించింది. వెంటనే మా అధికారులు, సిబ్బంది పరుగెత్తుకుని ఫాం హౌస్లోకి వెళ్లి గన్ పట్టుకున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నాం. అతడు ఆకాశం వైపు గన్ ఎక్కుపెట్టి కాల్చినట్టు నిర్ధారణ అయ్యింది. అతడి పక్కన ఉన్న వ్యక్తి దగ్గర ఉపయోగించిన నాలుగు క్యాట్రిజెస్ స్వాదీనం చేసుకున్నాం. ముందుగా కస్టడీలోకి తీసుకున్న ఇద్దరితోపాటు ఆ ఫాంహౌస్ పార్టీలో పాల్గొన్న ఒక మహిళ సహా తొమ్మిది మందికి వెంటనే డ్రగ్స్ టెస్ట్ చేశాం. అందులో తొలుత ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 4 ప్రకారం.. పట్టుబడిన వారందరికీ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేయించగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఎంపీ పట్టా మహేశ్ కుమార్తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, అతడి సోదరుడు రితేశ్రెడ్డి, నమిత్శర్మ, తిరువీధుల అర్జున్రెడ్డి, కౌశిక్ రవి ఉన్నారు. నెగిటివ్ వచ్చిన వారిలో మొరవినేని రమేశ్, వరమచనేని శ్రవణ్కుమార్, నల్లపనేని విజయకృష్ణ, సిలివేరి శరత్కుమార్, ఆర్.ప్రియాంకరెడ్డి ఉన్నారు. మాకున్న సమాచారం ప్రకారం పార్టీ మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. కొందరు కొందరుగా యాడ్ అవుతూ వచ్చారు. ఇలా మొత్తం 11 మంది వచ్చిన సమయంలో మేం అదుపులోకి తీసుకున్నాం. వెపన్ కాల్చిన వ్యక్తిని జైపూర్కు చెందిన నమిత్ శర్మగా గుర్తించాం. రితేశ్రెడ్డి పేరిట ఆ తుపాకీ లైసెన్స్ ఉన్నట్టు అతను తెలిపాడు. అతడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. అతడు ఎందుకు వచ్చాడన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి తన ఫాంహౌస్లో ఏర్పాటు చేశారు’అని ఆదివారం ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియాకు తెలిపారు. రెండు గ్రాముల కొకైన్ను పార్టీ కోసం తీసుకురాగా.. ఒక గ్రామ్ వరకు కొకైన్ను ఫాం హౌస్లో గుర్తించామని, పట్టుబడిన డ్రగ్ కచ్చితంగా ఏంటనేది ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుందని చెప్పారు. ముగ్గురికి రిమాండ్.. మిగతా వారికి స్టేషన్ బెయిల్ ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని రిమాండ్కు తరలించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని పక్కన పెట్టి.. కేవలం గన్ ఫైరింగ్తో సంబంధం ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, అతని సోదరుడు రితేష్రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మను మాత్రమే పోలీసులు రిమాండ్ చేశారు. నిందితుల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్తోపాటు మరో ఏడుగురికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కాగా, ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ చేయడంలో పోలీసులు తాత్సారం చేసినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి ఘటన జరిగితే ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. శనివారం రాత్రి పట్టుబడిన 11 మందిని తొలుత శంషాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు. మొయినాబాద్ పీఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత రిమాండ్ రిపోర్టు తయారు చేసి దాన్ని శంషాబాద్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచే ముగ్గురిని రిమాండ్కు తరలించి, మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. నిందితులు మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. -
యాసంగి రైతులకు ‘రైతు భరోసా’
సాక్షి, హైదరాబాద్: యాసంగి పంట పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం తేదీ ఖరారు చేసింది. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం వరకు రైతు భరోసా కింద రూ.3,590 కోట్లను నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. దీనికి కొనసాగింపుగా రెండో విడతను సుమారు 20 రోజుల తర్వాత విడుదల చేసి రూ. 2,650 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. మూడో విడతను ఏప్రిల్ నెలాఖరులోపు విడుదల చేసి మొత్తం రైతు భరోసా నిధుల పంపిణీ పూర్తిచేస్తామని చెప్పారు. మూడు విడతలు గా కలిపి రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్లు జమ అవుతాయని వివరించా రు. రైతులకు ఎకరాకు రూ. 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందజేయడం ప్రభు త్వ సంకల్పమని తుమ్మల పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. రైతు భరోసా నిధుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఆదివారం చర్చించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పాల్గొన్నారు. -
నగరం చుట్టూ ఔటర్పై ఆర్టీసీ టెర్మినళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలో కేవలం ఎలక్ట్రిక్ బస్సులే ఆర్టీసీ సిటీ సర్వీసులుగా తిరిగేలా వేగంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం, జిల్లాల నుంచి వచ్చే డీజిల్ బస్సులు కూడా నగరంలోకి ప్రవేశించకుండా కట్టడి చేయబోతోంది. తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డీజిల్ ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) ఆవలికే పరిమితం చేయబోతోంది. ఇందుకోసం ప్రధాన రూట్లు ఔటర్ రింగురోడ్డుతో అనుసంధానమయ్యే ప్రాంతాల్లో ఆర్టీసీ టెర్మినల్స్ నిర్మించే యోచనలో ఉంది. నగరంలో వాహనాల సంఖ్య కోటికి చేరుతున్న నేపథ్యంలో వాతావారణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు పెట్రోలు/డీజిల్ వాహనాలను కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ లోపల సిటీ సర్వీసులుగా కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరిగేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వ పథకం పీఎం ఈ–డ్రైవ్ కింద 2,800 ఎలక్ట్రిక్ బస్సుల కోసం దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో కేంద్రం రెండువేల బస్సులు మంజూరు చేసింది. మరో వైపు 200 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా రెట్రోఫిట్మెంట్ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఫేమ్–2 పథకం కింద మంజూరైన 500 ఎలక్ట్రిక్ బస్సులు దశలవారీగా వచ్చి చేరుతున్నాయి. ఇక్కడ నడిచే డీజిల్ బస్సులను విడతలవారీగా జిల్లాలకు తరలించనున్నారు. ఆ తర్వాత సిటీ రోడ్లపై ఆర్టీసీకి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే కనిపించాలన్నది ప్రభు త్వ కసరత్తు. కానీ, జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే ఆర్టీసీ బస్సులు డీజిల్తో నడిచేవే ఉండటంతో ఇప్పుడు వాటిని కూ డా నగరంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ప్రభు త్వం భావిస్తోంది. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం చేరువలో భారీ టెర్మినల్కు ప్లాన్ చేసింది. నగరానికి మంజూరైన హైస్పీడ్ రైళ్లకు సంబంధించి శంషాబాద్లో భారీ టెరి్మనల్ నిర్మించనున్నారు. దీన్ని మెట్రో రైలుతో అనుసంధానిస్తారు. అక్కడే ఆర్టీసీ టెర్మినల్ కూడా నిర్మించాలని నిర్ణయించారు. బెంగళూరు రోడ్డు మీదుగా వచ్చే ఆర్టీసీ జిల్లా సర్వీసులు అక్కడికే పరిమితమవుతాయి. వాటిల్లో వచ్చి నగరానికి చేరుకోవా ల్సిన ప్రయాణికులు అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సుల్లో గమ్యం చేరాల్సి ఉంటుంది. ఇదే తరహాలో హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ ప్రధాన రోడ్డు మార్గాలతో అనుసంధానమయ్యే ప్రాంతాల్లో కూడా టెరి్మనళ్లు నిర్మించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఆర్టీసీ బస్సులపై ప్రభావం ఉండదా? నగరంలో తిరిగే బస్సుల్లో ఆర్టీసీ సర్వీసులు మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు ఉండేలా ప్లాన్ జరుగుతోంది. కానీ, ప్రైవేటు బస్సులు మాత్రం ఎప్పటిలాగే తిరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారు ప్రైవేటు బస్సుల్లో అయితే నేరుగా గమ్యస్థానం వరకు వచ్చే వీలుంటుంది. అదే ఆర్టీసీ బస్సుల్లో వస్తే, శివారులో దిగి మళ్లీ సిటీ బస్సు ఎక్కి రావాల్సి ఉంటుంది. దీన్ని చికాకుగా భావించి ప్రయాణికులు ప్రైవేటు బస్సుల వైపు మళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. ఫలితంగా ఆర్టీసీపై ప్రభావం ఉండనుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి పరిష్కార నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఆరాంఘర్లో స్థలం ఏమైనట్టో... ప్రస్తుతం ఆరాంఘర్ కూడలిలో జిల్లా సర్వీసులు, సిటీ సర్వీసులు మారే ప్రయాణికులతో నిత్యం రద్దీ ఉంటోంది. దీంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. దీనికి పరిష్కారంగా, ఆరాంఘర్ కూడలిలోనే ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయిస్తే టెర్మినల్ నిర్మిస్తామని ఆర్టీసీ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. కానీ, ఆ భూమిని ప్రభుత్వం ఇప్పటికే పోలీసు శాఖకు కేటాయించింది. దీంతో, సమీపంలోనే ఉన్న రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో స్థలాన్ని పోలీసు శాఖకు కేటాయించి, ఆరాంఘర్ స్థలాన్ని ఆర్టీసీకి ఇవ్వాలన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు శంషాబాద్లో ఆర్టీసీ టెరి్మనల్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని ఇటీవల సీఎం స్వయంగా వెల్లడించటంతో, ఆరాంఘర్ స్థలం ఆర్టీసీకి ఇస్తారా లేదా అన్న విషయంలో సందిగ్ధత వీడలేదు. -
కన్న తల్లి కర్కశత్వం
భువనగిరి: కన్న తల్లి తన కుమార్తె, కుమారుడిపై కత్తితో దాడి చేయగా.. కుమార్తె మృతిచెందింది. కుమారుడు తప్పించుకున్నాడు. అనంతరం ఆమె కూడా ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తుక్కాపురం గ్రామానికి చెందిన నోముల నారాయణరెడ్డి, అమృత దంపతుల కుమార్తె రత్నకళ (నీలిమ)ను 15 ఏళ్ల క్రితం బీబీనగర్ మండలం జైనపల్లికి చెందిన బెజ్జంకి నరేందర్రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె కృతిరెడ్డి (14), అక్షిత్ రెడ్డి సంతానం. కృతిరెడ్డి 8వ తరగతి, అక్షిత్రెడ్డి 6వ తరగతి చదువుతున్నారు. తన తల్లిగారి ఊరిలో గృహ ప్రవేశం ఉందని, పిల్లలకు కొత్త దుస్తులు తీసుకోవడానికి తమను తుక్కాపురం తీసుకెళ్లాలని శనివారం రత్నకళ తన భర్తను కోరింది. దీంతో నరేందర్రెడ్డి భార్యతోపాటు ఇద్దరు పిల్లలను తుక్కాపురంలో వదిలి వెళ్లాడు. కృతిరెడ్డి రాను అని వాదించినా.. ఆమెనూ వెంట తీసుకెళ్లారు. శనివారం రాత్రి రత్నకళ, ఆమె పిల్లలు తన తల్లిగారింట్లో ఓ గదిలో నిద్రించగా.. రత్నకళ తల్లిదండ్రులు హాల్లో నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రత్నకళ కత్తితో కృతిరెడ్డి మెడపై పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం కుమారుడు అక్షిత్రెడ్డిపై కూడా కత్తితో దాడికి యత్నించగా.. అతడు వెంటనే మేల్కొని గాయాలతో కేకలు వేస్తూ తలుపులు తీసి హాల్లోకి పరిగెత్తాడు. హాల్లో నిద్రిస్తున్న రత్నకళ తల్లిదండ్రులు గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వగా.. వారు వచ్చేసరికి రత్నకళ తలుపులు వేసుకుని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు తలుపులు తీసి రత్నకళతో పాటు గాయపడిన ఆమె కుమారుడిని భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. పోలీసులు గ్రామానికి చేరుకుని కృతిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆదివారం కృతిరెడ్డికి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. రత్నకళ సోదరుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. తండ్రికి దగ్గరవ్వడంతో.. రెండేళ్ల నుంచి రత్నకళ మానసికస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. తరచూ యూట్యూబ్లో రీల్స్ చేస్తూ ఉంటుందని, ఈ క్రమంలో పిల్లలను సరిగా పట్టించుకోవట్లేదని, అంతేకాకుండా పిల్లలు సహజమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని వారిపై ఒత్తిడి చేసేదని పేర్కొన్నారు. దీంతో పిల్లలిద్దరూ తండ్రితో ప్రేమగా ఉంటూ ఆయనకు దగ్గరయ్యారని, ఇది తట్టుకోలేని రత్నకళ మానసిక క్షోభకు గురై ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని తెలిపారు. -
కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా
రాయికల్ (జగిత్యాల): కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దశాబ్దాలకాలం కాంగ్రెస్కు సేవలందించానని, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇమడలేకపోతున్నానని, ఈ క్రమంలో మొదటగా పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజీనామా లేఖను ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి అందజేస్తారా? అని ప్రశ్నించగా.. ఇక్కడే చేస్తానని తెలిపారు. రంజాన్, ఉగాది పండుగల అనంతరం మరోసారి అభిమానులతో సమావేశమై ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. -
మెట్ల దారిన.. దేవుని చెంతకు!
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీనివాసగిరి భక్తుల కోలాహలంతో నిండిపోయింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన తిరుకల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన భార్య మాధురితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. పొంగులేటి దంపతులు 1,600 మెట్లను కాలినడకన ఎక్కి గిరి శిఖరానికి చేరుకున్నారు. దారి పొడవునా గోవింద నామస్మరణ చేస్తూ, తనను పలకరించిన భక్తులకు చిరునవ్వుతో సమాధానమిస్తూ ముందుకు సాగారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పట్టువ్రస్తాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వారికి వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. పర్యాటక ప్రాంతంగా శ్రీనివాసగిరి.. ‘ప్రకృతి ఒడిలో ఉన్న శ్రీనివాసగిరిని దర్శించుకోవడం నా అదృష్టం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అటవీ శాఖ అధికారుల సహకారంతో ఈ క్షేత్రాన్ని గొప్ప ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతాం. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’అని మంత్రి పొంగులేటి చెప్పారు. స్వామివారి కల్యాణ వేడుకలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా పాల్గొన్నారు. -
TG: బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్కు ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు పుష్పగుచ్ఛం అందించి.. శాలువాతో సత్కరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఉప ముఖ్యమంత్రితో పాటుగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసిన వారిలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్-ప్లానింగ్ సెక్రెటరి గౌరవ్ ఉప్పల్, ఆర్థిక శాఖ కార్యదర్శి స్కితా పట్నాయక్ తదితరులున్నారు.కాగా, రేపటి(సోమవారం, మార్చి 16వ తేదీ) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 20వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. మార్చి 16 వ తేదీ నుంచి 30 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరపాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తొలుత ఫిబ్రవరి 26వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావించినా.. ఆ తేదీని కాస్త వెనక్కు జరిపింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్కు సంబంధించి తుది మెరుగులు దిద్దే క్రమంలోనే అసెంబ్లీ సమావేశాల తేదీని కాస్త వెనక్కు జరపాల్సి వచ్చినట్లు సమాచారం. ఆర్థికశాఖ మల్లు భట్టి విక్రమార్క. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను మార్చి 20వ తేదీన అసెంబ్లీ ప్రవేశపెడతారు. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. -
‘కాంగ్రెస్ పాలనపై తిరగబడే కాలం వచ్చింది’
హైదరాబాద్: ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్కు అతిగతి లేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారుస్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమం మాటల్లోనే తప్ప పనుల్లో కనిపించడం లేదనీ, రాబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు.అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతా అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హరీశ్ రావు గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నక్క మల్లేష్ గౌడ్, కాసా ధనుంజయ్ గౌడ్, నక్క పవన్ గౌడ్, నక్క చరణ్ గౌడ్, నక్క వికాస్ గౌడ్, కాసా వినయ్ గౌడ్, పట్లోళ్ల తిరుపతి రెడ్డి, నక్క వీర స్వామి గౌడ్, నక్క సాయి గౌడ్, బచ్చుగూడెం ఎల్లయ్య యాదవ్, కాసా రాజు గౌడ్, అత్తెల్లి శ్రీకాంత్ రెడ్డి, పెద్దోళ్ల రాజు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. -
తెలంగాణ రైతులకు శుభవార్త
హైదరాబాద్: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధుల విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్రెడ్డి. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నిధుల్ని మొత్తం మూడు విడతల్లో విడుదల చేయనున్నారు . తొలి విడతగా రూ. 3, 590 కోట్ల నిధులు విడుదల చేయనుండగా, రెండో విడతగా రూ. 2, 650 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. ఈ నెల 22వ తేదీన తొలి విడత, ఆపై 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం మూడు విడతల్లో రూ. 9 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు.డైలమాకు తెర..!గత యాసంగిలో రైతు భరోసా పెట్టుబడి సాయం ముందుగానే రైతుల ఖాతాల్లో ఎకరానికి 6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత యాసంగిలో రైతు భరోసా ఇంకా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తమైంది. చెందుతున్నారు. ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుందో చేయదో అన్న ఆందోళనలో ఉన్న సమయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో రైతుల డైలమాకు తెరపడింది.ప్రస్తుత యాసంగి సీజన్ జిల్లా వ్యాప్తంగా 5,16,327 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు సాగయ్యాయి. వరి సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెట్టుబడుల సమయంలో రైతుభరోసా అందక రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని యాసంగి సాగును పూర్తి చేశారు. రైతు భరోసా వస్తుందనే ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. తాజాగా రైతు భరోసా నిధులపై ప్రభుత్వ ప్రకటనతో రైతులకు ఊరట లభించింది. -
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి,హైదరాబాద్: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో తన పేరును లాగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు డ్రగ్స్ టెస్టులు చేయించుకునేందుకు తాను రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.‘మాదకద్రవ్యాలు మనుషులుని రాక్షసులుగా మారుస్తాయి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు కూడా డ్రగ్స్ వాడటం దురదృష్టకరం. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. రాజకీయంగా ఎంతటి వారైనా మాదక ద్రవ్యాల్ని వినియోగించినా, అక్రమంగా విక్రయించినా, వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. అయితే డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ పార్టీని లాగడాన్ని ఖండిస్తున్నాను. డ్రగ్స్ కేసును బీఆర్ఎస్పై రాజకీయ ప్రతీకారంగా వాడుకోవడం మీ రాజకీయాల ప్రతిబింబం. నేను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లుగా ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నాను. అలాగే, ప్రతి డ్రగ్స్ కేసులో నా పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులు ఇస్తాం’అని హెచ్చరించారు. Drugs create monsters out of human beings. It is unfortunate that even people in responsible positions are resorting to drug usageI personally am strictly against drugs and usage of illicit substances. My party BRS condemns usage of drugs and any illegal activities. Any one…— KTR (@KTRBRS) March 15, 2026హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్లో వీకెండ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకుని ఏపీ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పాటు పలువురు పట్టుబడ్డారు. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫాం హౌస్ జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై కేటీఆర్ స్పందించారు. -
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,నల్లగొండ: చింతపల్లి మండలం చెన్నారం గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్నఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని తొలుత దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏడుగురిని హైదరాబాద్కు తరలించారు.మరణించిన వారిలో ఇద్దరు బీహార్కు చెందినవారిగా, మరో ఇద్దరు బొత్య తండాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. స్థానికులు రోడ్లపై లారీలు నిర్లక్ష్యంగా నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
చంద్రబాబు, రేవంత్కు హాట్లైన్ సంబంధాలు: మార్గాని భరత్
తూర్పుగోదావరి జిల్లా: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన ఎంపీ మహేష్ యాదవ్పై టీడీపీ ఓ నిర్ణయం తీసుకుంటుందో.. లేదో స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ఇంతవరకు టీడీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ‘ఏపీ సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హాట్లైన్ సంబంధాలు ఉన్నాయి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబుతో చెప్పి నిలుపు చేయించానని రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు.పైకి నో టు డ్రగ్స్ అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అందుబాటులో ఉంటున్నాయి. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన మహేష్ యాదవ్తో పదవికి రాజీనామా చేయించాలి, ఆయనను చంద్రబాబు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి. గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ అదుపు చేయటానికి అనేక చర్యలు తీసుకున్నారు’ అని తెలిపారు. ఇదీ చదవండి: పుట్టా మహేష్ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు -
ఆ రెండు ఐఫోన్లను ఎందుకు ధ్వంసం చేసినట్లు..?
సాక్షి,హైదరాబాద్: మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్ టీం పోలీసులు దాడులు జరిపే సమయంలో ఫాంహౌస్లో ధ్వంసమైన రెండు ఐఫోన్ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ రెండు ఫోన్లు పైలెట్ రోహిత్రెడ్డి అతని పీఏ శ్రవణ్దేనని తెలుస్తోంది.అయితే, ఆ ఫోన్లను ధ్వంసం చేసింది పైలెట్ రోహిత్రెడ్డేనని పోలీసుల విచారణలో తేలింది. ఇదే అంశంపై పైలెట్ పీఏ శ్రవణ్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణతో డ్రగ్స్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన ఫాంహౌస్ జరిగిన వీకెండ్ పార్టీలో పైలెట్ రోహిత్రెడ్డి,అతడి సోదరుడు రితేష్ రెడ్డి ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని పోలీసులకు దొరికాడు. వీరితో పాటు పలువురు సైతం డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈగల్ టీం పోలీసులు ఫాం హౌస్పై దాడులు జరిపి మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. -
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ.. పోలీసులపై ఒత్తిడి మొదలైందా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. వీఐపీలతో పాటు ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. అయితే, పుట్టా మహేష్ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పుట్టా మహేష్ను తప్పించడానికి పెద్ద తలకాయలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ‘‘హైదరాబాద్ పోలీసులపై అప్పడే ఒత్తిడి మొదలైందా?. పుట్టా మహేష్ను తప్పించడానికి రాజకీయ, ఆర్థిక బలాలు ఉపయోగిస్తున్నారా?. పుట్టా మహేష్ను కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారా?. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఆరుగురిపై పోలీసుల నెక్ట్స్ ఎలా ఉండబోతుంది’’ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ పాజిటివ్గా తేలిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. నిన్న రాత్రి 7.30 సమయంలో మాకు సమాచారం అందింది. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లాం. 11మందికి టెస్టులు చేశాం.. ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. మేం లోపలికి వెళ్లేటప్పుడే గన్ ఫైర్ సౌండ్స్ వచ్చాయి. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్టు గుర్తించాం. ఎంపీ అయినా.. ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవు’’ అని ఎస్పీ స్పష్టం చేశారు. -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)
-
ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్
సాక్షి,హైదరాబాద్: నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఈ వీకెండ్ పార్టీలో ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అతని సోదరుడు పలువురు డ్రగ్స్ తీసుకున్నట్ల నిర్ధారించారు. వారందరికి ప్రస్తుతం డ్రగ్స్ టెస్టులు జరుగుతున్నాయన్న పోలీసులు.. వాళ్లు తీసుకున్నది ఎలాంటి డ్రగ్స్ అనేది పూర్తిస్థాయిలో టెస్టులు ఫలితాల తరువాతే తెలుస్తాయని చెప్పారు. డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలుఅయితే మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూరిన్ టెస్ట్ విషయంలో ఎంపీ పుట్టా మహేష్ నాటకం ఆడినట్లు తేలింది. యూరిన్ శాంపిల్ బదులు వాటర్ ఇచ్చారు. అనుమానం రావడంతో శాంపిల్ బాటిళ్లను టెస్టు చేయగా..శాంపిల్ బాటిల్లో ఉంది యూరిన్ కాదని నీళ్లని గుర్తించారు. దీంతో ఎంపీ పుట్టాపై పోలీసులు సీరియస్ అయ్యారు. టెస్టులు కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వాలని.. నీళ్లు కాదని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్పై పోలీసులు సీరియస్ అయ్యారు. అనంతరం పుట్టా మహేష్ నుంచి యూరిన్ సేకరించి టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో ఎంపీ పుట్టా మహేష్ బ్లడ్ టెస్టులో పాజిటీవ్గా నిర్ధారణైంది.డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్..డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియాతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి 3గంటల నుంచి ఫాం హౌస్లో పార్టీ జరుగుతోంది. రాత్రి 7.30 సమయంలో ఎంపీ పుట్టా మహేష్ ఫాం హౌస్కు వచ్చారు. సోదాల సమయంలో కాల్పులు జరిపారు. గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం.డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 11మందిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించాం’అని పేర్కొన్నారు. -
యాద్రాద్రి భువనగిరి జిల్లాలో దారుణం
సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి మండలం తొక్కాపురం దారుణం జరిగింది. మానసికంగా బాగాలేక కూతురు, కుమారుడిపై తల్లి కత్తితో దాడి చేసింది. అనంతరం తల్లి నీలిమ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీలిమను ఉప్పల్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి దాడిలో కూతురు కృతికరెడ్డి మృతి చెందింది.బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన బెజ్జంకి నరేందర్రెడ్డితో 15 ఏళ్ల క్రితం వివాహమయ్యింది. నిన్న(శనివారం) సాయంత్రం నీలిమ.. తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఘటనకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. -
దేవుడా ఇందుకిలా చేశావు?
మెదక్జోన్: కొడుకా నిన్నపుట్టిన రోజు జరు పుకొని.. ఇవాలా చనిపోయావా.. దేవుడా ఇందుకిలా చేశావని మహిళ రోదించింది. రోడ్డు ప్రమాదంలో భర్త, కొడుకు, అల్లుడు చనిపోవడంతో.. ఆ కుటుంబ సభ్యులు రోదించిన తీరు అందరిని కంట తడిపెట్టించింది. హవేళిఘనాపూర్ మండలం భూర ్గుపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి అమృత్గౌడ్(50),యాదమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. మొదటి కూతురుని ఇదే మండలం బొగుడభూపతిపూర్ గ్రామానికి చెందిన గోకని సాయాగౌడ్(32)కు ఇచ్చి పెళ్లి చేశారు. రెండో కూతురు బానును కొల్చారం మండలం రంగంపేటకు సాయిరాంగౌడ్కు ఇచ్చి వివాహం చేశారు. మూడో సంతానం రిషివర్ధన్గౌడ్(14)ను గ్రామంలో చదివించుకుంటూ కల్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండో కూతురు కొడుకు తొట్టెల కార్యక్రమానికి బైక్పై వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో అమృత్గౌడ్(50) తోపాటు తన కొడుకు రిషివర్ధన్గౌడ్(14), అల్లుడు సాయాగౌడ్ దుర్మరణం చెందారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మార్చురీ వద్ద తన కొడుకు మృతదేహంపై పడి యాదమ్మ రోదించిన తీరు అక్కడ ఉన్నవాళ్లను కంటతడి పెట్టించింది. ఈనెల 13న ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ మరుసటి రోజున ప్రమాదంలో దుర్మరణం చెందటంతో ఆమె బోరున విలపించింది. ప్రమాదంలో కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కొడుకు, అల్లుడు ముగ్గురు చనిపోగా రెండు కుంటుబాల్లో తీరని విషాదం చోటు చేసుకుంది. మృతుడు సాయాగౌడ్కు భార్యతో పాటు 6 ఏళ్లలోపు ముగ్గురు సంతానం ఉన్నారు. -
కొట్టుకున్న డ్వాక్రా మహిళలు
జోగిపేట(అందోల్): వాయిదాల డబ్బులు బ్యాంకులో చెల్లించలేదని డ్వాక్రా సంఘం మహిళలు కొట్టుకున్నారు. వివరాలు ఇలా... జోగిపేటకు చెందిన లక్ష్మినర్సింహ డ్వాక్రా గ్రూపునకు చెందిన మహిళలు స్థానిక బ్యాంకు నుంచి వనిత వ్యాపార వృత్తి పేర రుణాలు తీసుకున్నారు. సభ్యురాలు మళ్లీశ్వరి కూడా రుణం తీసుకొని ఆమె అత్త వెంకమ్మకు ఇవ్వగా వాడుకొని వాయిదాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు రుణం తీసుకున్న మహిళలకు ఫోన్ చేశారు. దీంతో సభ్యురాలు అనిత, ఆమె బంధువులు వెంకమ్మను పిలిపించి డబ్బుల విషయమై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి కట్టెలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. వెంకమ్మకు గాయాలయ్యాయి. స్థానికులు 100కు డయల్ చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గాయపడ్డ వారిని జోగిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం మళ్లీశ్వరి, అనిత మాత్రమే డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారని మెప్మా అధికారులు తెలిపారు. -
జూబ్లీహిల్స్లో భారీ చోరీ
హైదరాబాద్: జూబ్లీహిల్స్లో భారీ చోరీ జరిగింది. అన్నం పెట్టిన ఇంటికే ఓ నేపాలీ దంపతులు కన్నం వేశారు. పనిమనుషులుగా చేరిన నెలన్నరకే చేతివాటం ప్రదర్శించారు. యజమాని లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి 8 డైమండ్ నెక్లెస్లు, బంగారు ఆభరణాలు, 10 రోలెక్స్ వాచీలను దోచుకుని పరారయ్యారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాలు... జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–25లోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనురు««ద్రెడ్డి అనే వ్యాపారి, భార్య దీపికారెడ్డితో కలిసి ఉంటున్నాడు. నగరంలోని పేరు మోసిన హోటల్ యజమాని కుమార్తె అయిన దీపికారెడ్డి దంపతులు శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళాలు వేసి విమానంలో ఊటీకి వెళ్లారు. 45 రోజుల క్రితమే ఈ ఇంట్లో నేపాల్కు చెందిన మహేష్ షాయి(30), అప్సర(25) దంపతులు పనిమనుషులుగా చేరారు. యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించారు. పక్కా పథకంతో ఇంట్లో చేరిన నేపాలీ దంపతులు అవకాశం కోసం ఎదురుచూశారు. నాలుగైదు రోజుల నుంచి ఇంట్లోకి ఎలా వెళ్లాలి.. నగలు, నగదు ఎక్కడ భద్రపరిచారు.. వంటి వాటిపై రెక్కీ నిర్వహించారు. రాత్రంతా అల్మారా, లాకర్లను పగులకొడుతూ.. యజమానులు అనిరు«ధ్రెడ్డి, దీపికారెడ్డి ఊటికి వెళ్లడంతో శుక్రవారం రాత్రి 12.30 గంటల సమయంలో కత్తులు, కటార్లు, రాడ్ల సహాయంతో నేపాలీ దంపతులు ప్రధాన ద్వారం తాళం పగులగొట్టారు. బెడ్రూమ్లోకి వెళ్లి అల్మారాను, లాకర్లను శనివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు పగులగొట్టారు. 8 డైమండ్ నెక్లెస్లు, 10 రోలెక్స్ వాచీలు, బంగారు నగను బ్యాగ్లో సర్దుకుని ఉడాయించారు. ఉదయం ఇంటికి వచ్చిన డ్రైవర్ గమనించి యజమానికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వేలిముద్రలు తీసుకున్నారు. ఈ దంపతులను పనిలో కుదిర్చిన పాత పనిమనుషులు హరత్సింగ్, రీమాసింగ్ల కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితులు పేరు మోసిన కుటుంబానికి చెందినది కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం సాయంత్రం నేపాల్ సరిహద్దులకు ముంబై, బిహార్లకు పోలీసు బృందాలు చేరుకుని నిఘా పెట్టాయి. కాగా, హరత్సింగ్ గదిలో కూడా మహేశ్సాయి దంపతులు కొంత సామాను తస్కరించడం గమనార్హం. -
Hyderabad: మూతపడనున్న బావర్చి రెస్టారెంట్..!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ల కొరత, ఖర్చులు పెరగడంతో చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ధరల పట్టికలను సవరిస్తున్నాయి. టిఫిన్¯ సెంటర్లు రూ.10 నుంచి 20, హోటళ్లు బిర్యానీ, మీల్స్పై రూ.50 వరకు పెంచేశాయి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలుతుండడంతో పాటు కొందరు డీలర్లు కృత్రిమ కొరత సష్టిస్తున్నారు. దీంతో హోటల్ నిర్వహకులు ఒక్కో సిలిండర్పై అదనంగా రూ.300–500 చెల్లించాల్సి వస్తోంది. కాగా, గ్యాస్ మాత్రమే కాక రవాణా చార్జీలు కూడా పెరగడంతో కిరాణం సరుకులు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఇది హోటల్ యజమానులకు భారంగా మారింది. మేడ్చల్ జిల్లాలోని హాస్టళ్లలో టిఫిన్లు బంద్ చేశారు. మూడు పూటలా భోజనమే వడ్డిస్తున్నారు. బావర్చి... పార్సిళ్లకే పరిమితం హైదరాబాద్ బిర్యానీ అంటే.. బావర్చి అనేంతగా ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బావర్చి హోటల్పైనా సిలిండర్ కొరత ప్రభావం పడింది. నిర్వాహకులు బిర్యానీని పార్సిళ్లకు మాత్రమే పరిమితం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ నడపడం చాలా కష్టమేనని బావర్చి హోటల్ నిర్వాహకుడు సల్మాన్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో పార్సిల్ సెంటర్ కూడా మూతపడేలా ఉంది. క్రాస్ రోడ్స్లోని మరో ప్రముఖ రెస్టారెంట్ కూడా మూతపడింది. రైల్వేస్టేషన్లో పెరుగుతున్న రద్దీ సికింద్రాబాద్: ఎండలు ముదరడం.. గ్యాస్ కొరత వల్ల వీధి వ్యాపారాలు మూతపడటం.. కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగియడం, శుభముహూర్తాలకు అనువైన వాతావరణం ఉండటంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రెండు రోజులుగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్యాస్ కొరతతో ఫుట్పాత్ వ్యాపారాలు ఇప్పటికే మూతపడ్డాయి. హాస్టళ్లు, హోటళ్లు కూడా మెను ఐటమ్స్ను తగ్గించి నేడోరేపో మూసివేసే స్థితికి చేరే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కారి్మకులు సైతం సొంత ఊర్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు వస్తున్నారు. జనరల్ ప్రయాణికులను అదుపు చేసేందుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
క్షణికావేశం.. తీరని శోకం
రహమత్నగర్: క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తాను లేని బతుకు పిల్లలకు ఎందుకనుందోగానీ ముక్కుపచ్చలారని చిన్న పిల్లల గొంతు నులిమేసింది. ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ ఘటనలో తల్లి, కొడుకు మృతి చెందగా పాప మృత్యువుతో పోరాడుతోంది. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడెంకు చెందిన మురళివేణుకు మందమర్రికి చెందిన సత్యవాణి (33)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రుద్రాన్‡్ష (5), తన్విక(2) పిల్లలున్నారు. ప్రైవేటు పనులు చేసుకునే మురళి వేణు తన భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో బోరబండ డివిజన్లోని పెద్దమ్మగుడి నగర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. మురళివేణు తండ్రికి కిడ్నీలు పాడైపోవడంతో రెండు రోజులకుకోమారు డయాలసిస్ చేయిస్తుంటాడు.తల్లి హౌస్ కీపింగ్ పనికి వెళ్తోంది. ఐదు సంవత్సరాల క్రితం మురళివేణుకు ట్రాన్స్కో జూనియర్ లైన్మెన్గా ప్రైవేటు ఉద్యోగం వచ్చింది. గత కొన్ని రోజులుగా సత్యవాణి, మురళిల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తనతో, పిల్లలతో గడపడం లేదంటూ, బయట పనులే ఎక్కువయ్యాయని ఇంట్లో గొడవ పడేవారని తెలిసింది. ఈ క్రమంలోనే తమ పెళ్లి రోజైన శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసిన సత్యవాణి తన పిల్లలు రుద్రాన్‡్ష, తన్వికల గొంతు నులిమేసింది. వారు చనిపోయారని భావించాక తానూ ఉరి వేసుకుని బలవర్మణం చెందింది.ఆమె అత్త హౌస్ కీపింగ్ పని ముగించుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాక గమనించి 100 డయల్కు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న బోరబండ ఎస్హెచ్ఓ సురేందర్ గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే తల్లి సత్యవతి, కొడుకు రుద్రాన్‡్ష మృతి చెందారు. కూతురు తన్విక కొన ఊపిరితో ఉండగా చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పాప పరి«స్థితి విషమంగా ఉందని సమాచారం. బోరబండ పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
నూకలతో డిజైనర్ బియ్యం
సాధారణ వరి బియ్యం కన్నా మూడు రెట్లు అధిక ప్రొటీన్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన సరికొత్త డిజైనర్ వరి బియ్యం మన వంటగదిలోకి త్వరలోనే రానున్నాయి. పసుపు రంగులో ఉండే ఈ పోషక సంపన్న బియ్యం చూడ్డానికి, తినటానికి సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయని చెబుతున్నారు. కేంద్ర శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (సీఎస్ఐఆర్)కు అనుబంధంగా తిరువనంతపురంలోని నేషనల్ ఇంటర్ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ) శాస్త్రవేత్తలు ఈ డిజైనర్ రైస్ను ఉత్పత్తి చేసే సాంకేతికతను రూపొందించారు.దేశంలో తెల్ల బియ్యం తినే కోట్లాది మందిని వేధిస్తున్న సూక్ష్మ పోషకాహార లోపాన్ని పరిష్కరించటం, షుగర్ ముప్పును తగ్గించే లక్ష్యంతో ఈ బియ్యాన్ని రూపొందించినట్లు ఎన్ఐఐఎస్టీ ప్రకటించింది. సాధారణ తెల్ల వరి బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ను పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ పెరుగుదలకు దోహదం చేస్తుంది.డిజైనర్ బియ్యం అంటే?వరి బియ్యం నూకను పిండి చేసి.. అందులో ఉండే పిండి పదార్థం, మాంసకృత్తులు, పీచును వేరుచేస్తారు. ఎక్కువ మోతాదులో ఉండి బ్లడ్ షుగర్ పెంచుతున్న పిండి పదార్ధాన్ని తగ్గించి, ప్రొటీన్లను మూడు రెట్లు పెంచేలా, సమతుల్యత పొందేలా బియ్యాన్ని తిరిగి తయారు చేస్తారు. ఇది జీవక్రియ సంబంధమైన అనారోగ్యానికి చురుకైన, నిర్మాణాత్మక పరిష్కారంగా పనిచేసే పోషక–సాంద్రత గల ఆహారమని చెబుతున్నారు. మన అభీష్టానికి అనుగుణమైన సుగుణాలతో రూపొందించింది కాబట్టి ‘డిజైనర్ బియ్యం’ అని పిలుస్తున్నారు.పౌష్టికాహార లోపానికి చెక్మన దేశం ఒక విలక్షణమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధిక గ్లైసెమిక్ సూచిక (జీఐ)తో కూడిన తెల్ల బియ్యంతో భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర ప్రమాదకరమైన వేగంతో పెరుగుతుంది. మరోవైపు, లక్షలాది మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. తగినన్ని కేలరీల అన్నం తిన్నప్పటికీ ప్రొటీన్, ఖనిజాల లోపం వస్తోంది.డిజైనర్ రైస్ ప్రయోజనాలుతక్కువ జీఐ (55 కంటే తక్కువ): శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. ప్రొటీన్ పవర్హౌస్: సాధారణ బియ్యంలో 6–8% ప్రొటీన్ ఉంటుంది. ఈ బియ్యంలో 20% కంటే ఎక్కువే ఉంటుంది.బలవర్థకమైన రక్షణ: ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12ను కలిపి తయారు చేసిన బియ్యం కావటంతో రక్తహీనతను తగ్గిస్తుంది.పిండి తగ్గించి ప్రొటీన్లు పెంచాండిజైనర్ బియ్యాన్ని ఒక ‘ఆహార భవన నిర్మాణం’గా భావించండి. ఉదాహరణకు.. సాధారణ బియ్యం లాంటి ఒక భవనం ఉందనుకోండి. ఇది ఎక్కువగా ‘చక్కెర ఇటుకల’ (పిండి పదార్థం)తో తయారైన ఇల్లు. ఎన్ఐఐఎస్టీ పరిశోధకుల బృందం ఆ ఇంటిలోని ఇటుకలన్నింటినీ విడదీశారు. ఆ ఇటుకల్లో ఎక్కువగా ఉన్న పిండి పదార్ధాన్ని చాలావరకు తొలగించి, ఆ ఖాళీని ప్రొటీన్ల ఇటుకలతో భర్తీ చేశారు. జన్యుమార్పిడి సాంకేతికతకు బదులు ఆహార శుద్ధి సాంకేతికతను ఉపయోగించి ఈ బియ్యాన్ని రూపొందించారు. తక్కువ ధరకు అమ్ముడయ్యే వరి నూకను మెత్తని పిండిగా చేసి.. అందులో పిండి పదార్ధాన్ని తీసేసి.. ఆ మేరకు ప్రొటీన్లు, ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్–బీ12 వంటి సూక్ష్మపోషకాలను కలిపారు.ఈ మిశ్రమాన్ని లేత పసుపు రంగులో ఉండే సన్న వరి బియ్యపు గింజలుగా తయారు చేశారు. మనకు తెలిసిన బియ్యంలాగా ఇవి కనిపిస్తాయి. రుచిగా, సంతృప్తికరంగా ఉండేలా డిజైనర్ బియ్యాన్ని తయారు చేశారు. అధిక ప్రొటీన్ ఉన్న కారణంగా ఈ బియ్యంతో వండిన అన్నం మామూలు అన్నం కంటే రుచిగా ఉంటుంది. నూకలకు విలువ పెరుగుతుంది కాబట్టి రైతులకూ ఉపయోగకరమే. –డాక్టర్ ఆనందరామకృష్ణన్, సీఎస్ఐఆర్–ఎన్ఐఐఎస్టీ డైరెక్టర్, డిజైనర్ రైస్ ప్రాజెక్ట్ రూపశిల్పి -
‘మూసీ’.. కాంగ్రెస్ భూ ఆక్రమణ పథకం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16వేల కోట్లతో ఒక్క ఇల్లూ కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కి.మీ. మేర విజయవంతంగా అభివృద్ధి చేశామన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శనివారం హిమాయత్ సాగర్ వేదికగా ‘మూసీ పునరుజ్జీవం– పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్‘కార్యక్రమాన్ని కేటీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ప్లానింగ్ రిపోర్టు లేకుండా సోషల్ ఇంపాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు లేకుండా, ప్రజలతో చర్చలు నిర్వహించకుండా వేలాదిమంది ఇళ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘అభివృద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు. అవినీతికి, కాంగ్రెస్ భూదాహానికి, రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకం. రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకుంటాం. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటాం. బాధితుల వెంట బీఆర్ఎస్ ఉంటుంది’అని కేటీఆర్ చెప్పారు. రెండేళ్లపాటు మూసీ బాధితులు సమష్టిగా ప్రభుత్వంపై పోరాడితే, తమ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యాన్ని పారదోలి అందరి ఇళ్లు, భూములను కాపాడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవన్నారు.. ఇచ్చిన హామీలకు, అభివృద్ధికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతానంటున్నాడని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘రూ.లక్షన్నర కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారు... అందాల పోటీలకు, ఫుట్బాల్ ఆటలకు వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ తీరు తయారైంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పీపీటీ ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పీపీటీ ఇచ్చాడు’అని విమర్శించారు. రూ.లక్షన్నర కోట్లు ఎందుకు? నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసీ సర్వనాశనమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి రేవంత్రెడ్డి ముక్కు నేలకి రాసి, ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోవాలని హితవు పలికారు. వందల కిలోమీటర్ల నమామి గంగే పథకానికి కేవలం రూ.42 వేల కోట్లు వ్యయమైతే, 55 కి.మీ. మూసీకి రూ.లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోబోమన్నారు. మూసీ పేరుతో రూ.వేల కోట్ల సొమ్మును దోచుకుంటామంటే మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ ఆయన పేరుతో మూసీలో దోపిడీ చేయొద్దని విజ్ఞప్తి చేసినా రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఎవరూ అడ్డుకోవద్దని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టే కుట్ర చేస్తున్నాడని చెప్పారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6 కి.మీ. మూసీని విజయవంతంగా అభివృద్ధి చేసిందని, అయినా కాంగ్రెస్ మాదిరి ప్రచారం చేసుకోలేకపోయామన్నారు.మా అంచనా వ్యయం 16 వేల కోట్లు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని కేటీఆర్ తెలిపారు. దాని కోసం కేవలం రూ.1100 కోట్లతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఇదే కార్యక్రమానికి రూ. 10 వేల కోట్లకు అంచనాలు పెంచిన రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా అవినీతి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మూసీని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తమకు వచ్చిన అంచనా వ్యయం రూ. 16 వేల కోట్లు మాత్రమే కాగా, రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారన్నారు. బఫర్ జోన్తో భయపెట్టి.. ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్లో ఉంది కదా., దాని గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ల సోదరుడి ఇల్లు హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉంది. మంత్రుల ఫామ్హౌస్లు, ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నా.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’అని పేర్కొన్నారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్మెంట్లు, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జో¯న్లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్మెంట్లను మాత్రం ముట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.3,300 ఎకరాలపై కన్నేసి.. రేవంత్ 3,300 ఎకరాల భూమిపై కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ మొత్తం భూముల విలువ రూ.1,50,000 కోట్లని, ఇందుకోసమే రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారన్నారు. డిజైన్ చేసే కంపెనీకే రూ.160 కోట్లు ఇచ్చారంటే, ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రేవంత్రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంత ఉందో కూడా అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్వామి గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
ఇంకెందరున్నారు? ఎక్కడున్నారు?
సాక్షి, హైదరాబాద్: అడవులను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చినా..మావోయిస్టు మాజీ నేతలు ఇంకా ‘నిఘా’నీడలోనే ఉన్నారు. ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు మాజీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నర్సింహ్మారెడ్డి అలియాస్ గంగన్న సహా మరికొందరు తెలంగాణ పోలీసుల వద్దే సేఫ్ షెల్టర్లో ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. మావోయిస్టులకు సంబంధించి డెడ్లైన్ మార్చి 31 సమీపిస్తుండడంతో కీలక సమాచారం కోసం తెలంగాణ పోలీస్ ప్రత్యేక బృందాలతో కేంద్ర నిఘా ఏజెన్సీలు, ఇతర రాష్ట్రాల పోలీసు నిఘా వర్గాలు హైదరాబాద్కు క్యూ కడుతున్నాయి. వీలైనంత మేరకు వారికి అవసరమైన సమాచారం కోసం అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సేఫ్ షెల్టర్లో బస... జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులను వారివారి స్థాయిని బట్టి కొంత కాలం పాటు పోలీసులు తమ అ«దీనంలో పెట్టుకోవడం సర్వసాధారణమే. అదేవిధంగా మావోయిస్టు మాజీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నర్సింహ్మారెడ్డి అలియాస్ గంగన్న సహా మరికొందరు ఇంకా తెలంగాణ ఎస్ఐబీ పర్యవేక్షణలోనే సేఫ్ షెల్టర్లో ఉన్నారు. వీరికి డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో భద్రత కల్పిస్తున్నారు. సాధారణ జనజీవితానికి అలవాటు పడేలా రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. పార్టీకి సంబంధించిన మరింత సమాచారం రాబట్టేందుకు దేవ్జీ సహా నలుగురితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. అజ్ఞాతంలో గడిపిన జీవితానికి భిన్నంగా.. రోజూ ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రించేంత వరకు వారివారి అభీష్టానికి అనుగుణంగా దినచర్యకు సహకరిస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్తున్నారు. పత్రికలు చదవడం, టీవీలో వార్తలు చూడడంతో పాటు వ్యాయామం సహా షెడ్యూల్ ప్రకారం వారికి నచ్చిన భోజనం అందిస్తున్నారు. వరుసకట్టిన దర్యాప్తు ఏజెన్సీలు... ఇప్పటికే జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు అగ్రనేతలనుంచి తమకు కావాల్సిన సమాచార సేకరణపై తెలంగాణ పోలీస్లతోపాటు ఇతర ప్రత్యేక విభాగాలు దృష్టి పెట్టినట్లు సమాచారం. అదేవిధంగా మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి జాడ కోసం అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలిసింది. గణపతి సహా మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏడుగురు లొంగుబాటు కోసం తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)తోపాటు ఆయా జిల్లాల పోలీసు యూనిట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సుదీర్ఘ కాలంపాటు మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకపాత్ర పోషించిన దేవ్జీ, మల్లా రాజిరెడ్డి , బడే చొక్కారావు ఇతరులను సేకరించే సమాచారం కీలకం కావడంతో తెలంగాణ నిఘా విభాగాలు ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థతోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన అధికారులు సైతం వారిని పలు అంశాలపై ప్రశ్నించినట్టు తెలిసింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, బిహార్ రాష్ట్రాల నిఘా అధికారులు సైతం వీరిని ఆరాతీస్తున్నట్టు తెలిసింది. ‘ఇప్పటికే తెలంగాణ ఎస్ఐబీతోపాటు ఎన్ఐఏ అధికారులు, ఐబీ అధికారులు మమ్మల్ని ప్రశ్నించారు. రోజుకు ఒకరు వచ్చి మాట్లాడుతున్నరు. ఇంకా ఎంత మంది వస్తారో ’అని మావోయిస్టు అగ్రనేత ఒకరు చెప్పారు. నిఘా అధికారుల సమాచార సేకరణ ఇంకా కొనసాగుతుందనడానికి ఇదే నిదర్శనం. -
రోహిత్రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ..
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు కేంద్ర బిందువుగా వార్తల్లోకెక్కిన తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్నగర్లో ఉన్న ఆయన అతిథిగృహంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.ఫామ్ హౌస్లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. పార్టీలో రోహిత్ రెడ్డి, అతడి సోదరుడు రితేష్ రెడ్డి, ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, రాజస్తాన్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మ (జైపూర్) సైతం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అలాగే, ఎనిమిది మంది వీఐపీలు ఉన్నట్లు సమాచారం. పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.వీరిలో రోహిత్ రెడ్డి, అతడి సోదరుడితోపాటు మరో ఐదుగురు కొకైన్ తీసుకున్నట్టుగా నిర్ధారించారు. మిగిలిన వారిని పరీక్షల కోసం ఎర్రగడ్డ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఈగల్ టీమ్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయనే వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. జైపూర్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మను టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ పార్టీకి తీసుకొచ్చినట్లు తెలిసింది. నితీశ్ శనివారం సాయంత్రమే హైదరాబాద్కు వచ్చారు. అజీజ్నగర్లోని రోహిత్రెడ్డి ఫామ్ హౌస్పోలీసులపైకి కాల్పులు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు ఫాంహౌస్లోకి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్న యువకులు సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులను అడ్డుకుని హంగామా సృష్టించారు. మఫ్టీలో ఉన్న పోలీసులను చూసి, ఎవరో వచ్చారన్న ఆందోళనతో తుపాకీతో గాలిలోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిద్ మిశ్రా కూడా కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఈ తుపాకీ రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. కాల్పులతో ఫాంహౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొద్దిక్షణాల్లోనే పోలీసులు ఫాంహౌస్ను చుట్టుముట్టారు. లోపలి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా పారీ్టలో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సోదాల్లో కొకైన్, ఇతర మత్తు పదార్థాలు లభించాయి. అలాగే, మద్యం బాటిళ్లతోపాటు కాల్పులు జరిపిన తుపాకీ, బుల్లెట్లను స్వా«దీనం చేసుకున్నారు. రహస్యంగా విచారణ విందులో పాల్గొన్న వారిలో పేరున్న నాయకులు కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా, లోతుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగింది మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ కావడం, గతంలోనూ ఇక్కడ ఇలాంటి పెద్ద కేసే నమోదు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా ఉన్నవారెవరు, పరోక్షంగా ఉన్నవారెవరనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోందని సమాచారం.స్వాధీనం చేసుకున్న రివాల్వర్ పట్టుబడింది వీరే.. 1) ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్కుమార్ యాదవ్ 2) బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి 3) రాజస్తాన్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మ 4) వర్గనేని రమేష్ 5) వి.శ్రవణ్ కుమార్ 6) రితీశ్రెడ్డి 7) నల్లపునేని విజయకృష్ణతోపాటు మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. -
చరిత్ర సృష్టించిన తెలంగాణ విద్యుత్ శాఖ
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు చరిత్రలో ఒకే రోజున అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు (MU) విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. మార్చి 13, 2026 న ఉదయం 11:17 గంటలకు 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ను తట్టుకుని విజయవంతంగా సరఫరా చేసింది.మార్చి 13, 2026న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకుంది. ఆ రోజున రాష్ట్రం 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి, గత రికార్డు అయిన 335.19 మిలియన్ యూనిట్లు (18.03.2025) ను అధిగమించింది. అదే విధంగా, 18,228 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ ను కూడా విజయవంతంగా తీర్చింది. ఇది గతంలో నమోదైన 17,162 మెగావాట్ల గరిష్ట డిమాండ్ (20.03.2025) కంటే ఎక్కువ. ఉష్ణోగ్రతలు పెరగడం మరియు వ్యవసాయ అవసరాలు అధికమవడం వల్ల విద్యుత్ అవసరం మరియు గరిష్ట లోడ్ రెండూ పెరిగాయి. భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థరాబోయే రోజుల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు తమ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తూ కొనసాగుతాయి. రోజుకు 350కు పైగా మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం మరియు సుమారు 19,000 మెగావాట్ల గరిష్ట లోడ్ ను నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది. బలమైన విద్యుత్ గ్రిడ్ మరియు సమన్వయంతో కూడిన కార్యాచరణ ప్రణాళికతో ఈ అవసరాలను ఎదుర్కొనే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది.ఈ అధిక డిమాండ్ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించినందుకు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల సిబ్బందిని గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి అభినందించారు.. -
బీఆర్ఎస్లోకి జీవన్రెడ్డి..?
జగిత్యాల: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి.. బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. కారు ఎక్కేందుకు జీవన్రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపే కాంగ్రెస్ రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల సోషల్ మీడియా డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అదే సమయంలో జీవన్రెడ్డి సోషల్ మీడియా గ్రూపుల డీపీలు, ప్రొఫైల్స్ కూడా మారిపోతున్నాయి. తాను కాంగ్రెస్లో సీనియర్గా ఉండి కూడా ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడాన్ని జీవన్రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో జీవన్రెడ్డి వేరే స్టెప్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు కూడా. ఇదే జీవన్రెడ్డిలో అసంతృప్తి జ్వాలలు పుట్టడానికి ప్రధాన కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే జీవన్రెడ్డి పార్టీ మారే యోచనకు వచ్చారనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే జీవన్రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
చిన్నారుల మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం
కామారెడ్డి: గోసంగి కాలనీలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. పట్టణంలోని రాజానగర్ కాలనీలోని ఒక బావిలో ఆ ఇద్దరు చిన్నారులు శవాలై తేలారు. ఈ నెల 6వ తేదీన ఇంటి నుండి బయటకు వెళ్లారు విజయ్(10), సింహాద్రి(9) అనే ఇద్దరు చిన్నారులు. అప్పటి నుంచి చిన్నారుల ఆచూకీ లభించలేదు. దాంతో చిన్నారుల మిస్సింగ్పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. తొమ్మిదిరోజులుగా చిన్నారుల కోసం ఆశగా ఎదురు చూశారు కుటుంబ సభ్యులు. చివరికి కుంటలో విగతజీవులుగా కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వ్యవసాయ బావిలో పడి ముగ్గురి దుర్మరణం
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కొరికశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ముగ్గురు దుర్మరణం చెందారు. వ్యవసాయ బావిలో పూడిక తీసే క్రమంలో ఈ దారుణం జరిగింది. క్రేన్ వ్యవసాయ బావిలో పడటంతో విషాదం నెలకొంది. క్రేన్తో సహా నలుగురు వ్యవసాయ బావిలో పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పైడి(50), దేవరావు( 48), అభిలాష్(16) అనే ముగ్గురు మృతిచెందగా, మరో వ్యక్తి మోహన్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
కీలక రంగాల్లో భాగస్వామిగా తెలంగాణ.. టాంజానియా బృందంతో మంత్రి
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, మహిళా సాధికారత, ఎమర్జింట్ టెక్నాలజీస్, డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం, కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలెప్మెంట్ తదితర కీలక రంగాల్లో టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు.శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టాంజానియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నోవేషన్ ముద్రిక్ రమదాని సోరాగా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ‘తెలంగాణ - టాంజానియా' మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సామాజిక, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి బలమైన పునాదిగా మారిందన్నారు. ఆ దిశగా తెలంగాణ వేసిన అడుగులు ప్రపంచ పటంలో మన రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేశాయన్నారు. ఇదే స్ఫూర్తితో డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారం, మెంటార్ షిప్, నైపుణ్య మార్పిడి అందిస్తామన్నారు. అక్కడ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్ ను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.‘మీ సేవ’ ద్వారా డోర్ స్టెప్ సిటిజన్ సర్వీసెస్ డెలివరీ, ‘వీ హబ్’ మార్గ నిర్దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహాం, స్టార్టప్ ఎకో సిస్టం బలోపేతం తదితర అంశాల్లో ఒక ‘నాలెడ్జ్ పార్ట్నర్’గా వ్యవహరిస్తామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ పై మార్గనిర్దేశం చేస్తామన్నారు. బ్లూ ఎకానమీ, టూరిజంలో టాంజానియా అవలంభిస్తోన్న బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేసి... తెలంగాణలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.‘డిజిటల్ ఎకానమీగా మారాలన్న మా లక్ష్య సాధనలో తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఆవశ్యకం. ఐటీ, హెల్త్ కేర్, మెడికల్ టూరిజం, డిజిటల్ గవర్నెన్స్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో సాధించిన ప్రగతి, చేపట్టిన సంస్కరణలు మాకు స్ఫూర్తిదాయకం. అందుకే.. తెలంగాణతో కలిసి పని చేసేందుకు త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకుంటాం’ అని టాంజానియా మంత్రి ముద్రిక్ రమదాని సోరాగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో టాంజానియా కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఫాత్మా మబ్రూక్ ఖమిస్, జాంజిబార్ ఐసీటీ అథారిటీ సీఈవో శుకూరు అవాద్ సులేమాన్, ప్రెసిడెంట్స్ డెలివరీ బ్యూరో - హెడ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ జాన్ మహుండి తదితరులు పాల్గొన్నారు. -
మామిడి చెట్ల పెళ్లి.. గ్రామంలో సంబరాలు
రాజన్న సిరిసిల్ల జిల్లా: కథలాపూర్ మండలం ఇప్పపెల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెంచిన మామిడిచెట్లకు శుక్రవారం పెళ్లి జరిపించారు. గ్రామశివారులో ముదిరాజ్ సంఘం తరఫున 5 ఎకరాల మామిడితోట నిర్వహిస్తున్నారు. మామిడిచెట్లకు పెళ్లి జరిపిస్తే కాయలు బాగా కాస్తాయనేది వారి నమ్మకం. దీంతో సంఘం సభ్యులు అల్లనేరేడు, మామిడిచెట్లకు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. అనంతరం సంఘం సభ్యులు సామూహిక భోజనాలు చేశారు. అర్చకులు పులికాంత ప్రమోద్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
మంచిర్యాల: వృద్ధురాలి చేతిని పీక్కుతిన్న పిల్లులు!
సాక్షి, మంచిర్యాల జిల్లా: హృదయ విదారక స్థితిలో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చనిపోయిన ఆమె చేతిని పెంపుడు పిల్లులు పీక్కుతిన్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని భగత్సింగ్ నగర్కు చెందిన జక్కనబోయిన లక్ష్మి (80) తన రెండో కుమారుడు సమేందర్ దగ్గర ఉంటున్నారు. అతను పని నిమిత్తం బెల్లంపల్లికి వెళ్లగా లక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉండిపోయారు.ఈ క్రమంలో ఆమె గడప తగిలి కింద పడిపోగా తలకు గాయమై అచేతన స్థితికి చేరుకున్నారు. ఇంట్లో లైట్లు వెలగకపోవడం.. అలికిడి లేకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లిచూడగా కదల్లేని స్థితిలో ఆమె ఉండడం చూసి కుమారులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి ఆమె చనిపోయి ఉన్నారు.అయితే, ఇంట్లో ఉన్న రెండు పెంపుడు పిల్లలు ఆమె చేతిని చాలా వరకు పీక్కుతినడం స్థానికులను కలచివేసింది. సీఐ పర్స రమేష్, ఎస్సై నరేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జనగణన అప్పటినుంచే.. వివరాలు ఇవ్వకుంటే జరిమానే..!
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో జనగణనపై ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. మే 11 నుండి జూన్ 9 వరకూ తొలివిడత జనగణన చేపట్టనున్నట్లు తెలిపింది. రెండో దశ జనగణన 2027 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకూ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలు సెన్సెస్ డైరెక్టర్ భారతి హోలికేరీ వెల్లడించారు. సర్వేలో 33 రకాల ప్రశ్నలుంటాయని పేర్కొన్నారు.16 ఏళ్ల తర్వాత దేశంలో జనగణన చేపడుతున్నామని కనుక ప్రజలందరూ తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా సమాచారం ఇవ్వకపోతే వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపారు. కాగా జనగణన ఆధారంగానే ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకుంటాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ తదితరాలన్నింటికీ జనగణనే కీలకం.దేశంలో చివరగా 2011లో జనగణన జరిగింది. తర్వాత 2021లోనే జరగాల్సి ఉండగా కోవిడ్–19 ప్రభావంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ప్రారంభమైన సెన్సెస్–2027 ప్రక్రియలో ఎన్యూమరేటర్ తన మొబైల్ ఫోన్లో వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్/పోర్టల్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు స్వీకరిస్తారు. -
హైదరాబాద్లో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పోచారంలో ‘రాంబాయి’ సినిమా తరహాలో ఘటన జరిగింది. పెళ్లికి నిరాకరించిన యువతికి యువకుడు ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించాడు. యువకుడితో పాటు తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ సోకింది. యువకుడు మనోహర్తో యువతికి వివాహం నిశ్చయమైంది. ఎయిడ్స్ ఉందని తేలడంతో యువతి.. పెళ్లికి నిరాకరించింది.ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలంటూ మనోహర్ ఒత్తిడి తెచ్చాడు. పెళ్లికి నిరాకరించడంతో మనోహర్ ఎయిడ్స్ ఇంజెక్షన్ చేశాడు. నిందితుడిని పోచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కాళ్లు మొక్కుతాం సార్.. జీతాలివ్వండి
సిరిసిల్లటౌన్: ‘కాళ్లు మొక్కుతాం.. ఎన్ని రోజులు జీతాలు ఇవ్వకుండా ఉంటారు’ అంటూ కొందరు దివ్యాంగులు రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) లక్ష్మీరాజం కాళ్లపై పడిన సంఘటన చర్చనీయాంశమైంది. శుక్రవారం డీడబ్ల్యూవో లక్ష్మీరాజం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్కు రాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్బంక్లో పనిచేసే దివ్యాంగ కార్మికులు తిరుపతి, లింగప్రసాద్, మన్మోహన్ తదితరులు అక్కడకు చేరుకుని జీతాలు ఇవ్వాలంటూ ఆయన కాళ్లపై పడ్డారు. అనంతరం దివ్యాంగులు మీడియాతో మాట్లాడుతూ, 2024లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్లో మొత్తం 24 మంది దివ్యాంగులను అప్పటి కలెక్టర్ సందీప్కుమార్ ఝా నియమించారని తెలిపారు. అయితే సంక్షేమ శాఖ అధికారి పర్యవేక్షణలో నడిచే బంక్లో ఆకస్మికంగా కొందరు దివ్యాంగులైన వర్కర్లను తొలగించి, పది మంది మాత్రమే ఉండాలని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతాలు లెక్కచేసి ఇవ్వాలని కోరగా.. ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జీతాలు లేక తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పినా కనికరించడం లేదని వాపోయారు. దివ్యాంగులపై డీడబ్ల్యూవో నిర్దయగా ప్రవర్తించడం సరికాదన్నారు. పది నెలలుగా జీతాలు లేవని, సీఎం రేవంత్రెడ్డి తమపై కరుణ చూపి న్యాయం చేయాలని, లేనిపక్షంలో కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. -
మాఫియా డాన్ ఇంట్లోనే చోరీ చేసిన ‘బాంబే సలీం’ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అతడి పేరు సలీం హబీబ్ ఖురేషీ.. బాంబే సలీం, మున్నా అనే మారు పేర్లూ ఉన్నాయి. 53 ఏళ్ల వయసున్న ఈ ఘరానా దొంగపై దేశ వ్యాప్తంగా 200 కేసులు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన మహ్మద్ గౌస్ పాషా, ముంబైకి చెందిన సాబేర్లను అనుచరులుగా మార్చుకుని పంజా విసురుతున్నాడు. సాబేర్ మినహా మిగిలిన ఇద్దరినీ గోల్కొండ జోన్ టాస్్కఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. అతని నుంచి 220 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.1 కేజీల వెండి సహా రూ.33.71 లక్షల విలువైన సొత్తు స్వా«దీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. ముంబైలోని గోవంది ప్రాంతంలోని టాటానగర్ స్లమ్లో ఉన్న డియోనార్ బుచ్చర్ హౌస్కు చెందిన సలీం ఆరో తరగతి వరకు చదివాడు. తొలినాళ్లలో ముంబైలో చిన్న చిన్న చోరీలు చేసినా 2000 నుంచి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నాడు. 2001లో ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో రెక్కీ చేసిన బాంబే సలీం గ్యాంగ్ ఓ ఇంటిని టార్గెట్గా చేసుకుంది. అదేరోజు రాత్రి ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసింది. మర్నాడు పత్రికలు చూసిన సలీంకు.. తాము చోరీ చేసింది మాఫియా డాన్ ఛోటా రాజన్ ఇంట్లో అని, దొంగిలించిన సొత్తు విలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది. కొన్నాళ్ల తరవాత బాంబే సలీంను అరెస్టు చేసిన ముంబై పోలీసులు సొత్తు రికవరీ చేశారు. అయితే రాజన్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో.. బెయిల్పై వచి్చన వెంటనే వారిని సలీం కలిశాడు. జరిగింది చెప్పి ముంబై వదిలేస్తానని హామీ ఇచ్చి బయటపడ్డాడు. ముంబై నుంచి సలీం తన కుటుంబాన్ని బెంగళూరులోని పీన్యా సెకండ్ స్టేజ్లోని అత్తగారింటికి మార్చేశాడు. తాను కూడా అక్కడే ఉంటూ.. గ్యాంగ్ను వదిలి ఒంటరిగా పుణేలో పంజా విసరడం ప్రారంభించాడు. చోరీ సొత్తును బెంగళూరు తీసుకువచ్చి విక్రయించేవాడు. ఇతని కోసం తీవ్రంగా గాలించిన పుణే పోలీసులు బెంగళూరు అధికారుల సాయంతో 2011 ఫిబ్రవరిలో పట్టుకున్నారు. ఆపై తన ఇద్దరు భార్యలతో కలిసి హైదరాబాద్ వచ్చి వేర్వేరు ఇళ్లు తీసుకుని కాపురాలు పెట్టాడు. టోలిచౌకి ప్రాంతంలో ఫాస్ట్ఫుడ్ సెంటర్ పెట్టి కొన్నాళ్లు నడిపాడు. నష్టాలు రావడంతో మళ్లీ ముఠా కట్టి చోరీల బాటపడ్డాడు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 200కు పైగా నేరాలు చేశా>డు. బెంగళూరుకు చెందిన మహిళను మూడో పెళ్లి చేసుకుని అక్కడికి మకాం మార్చాడు. సలీం 2012 తర్వాత తన స్టైల్ పూర్తిగా మార్చేశాడు. టార్గెట్ చేసిన నగరానికి విమానంలో ప్రయాణించడం, అక్కడి సంపన్నుల ఇళ్లలో అనుచరులతో కలిసి చోరీలు చేయడం మొదలెట్టాడు. గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేష ఎస్ఐ జి.విజయానంద్లతో కూడిన బృందం గురువారం రాత్రి మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద సలీం, గౌస్లను పట్టుకుని సొత్తు స్వా«దీనం చేసుకుంది. నిందితుడిని హబీబ్నగర్ పోలీసులకు అప్పగించిన టాస్్కఫోర్స్.. పరారీలో ఉన్న సాబీర్ కోసం గాలిస్తోంది. -
నాన్నను అమ్మే చంపేసింది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రియుడి సాయంతో భర్తను హతమార్చిన మహిళ.. మద్యం మత్తులో కింద పడి గాయాలై మృతి చెందాడని అందరినీ నమ్మించింది. నిజమేనని భావించి కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, ఈ దంపతుల ఎనిమిదేళ్ల కుమార్తె తన తండ్రిని అమ్మతోపాటు మరో వ్యక్తి చంపేశాడని చెప్పడంతో విషయం బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన సెంట్రింగ్ కూలీ ఎస్డీ జాఫర్కు 13 ఏళ్ల క్రితం ఏపీలోని ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన ఖతిజాతో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. కుమారుడు హాస్టల్లో ఉంటూ చదువుతుండగా, కూతురు వీరితోనే ఉంటోంది. వివాహం తర్వాత వీరు పదేళ్లపాటు తిప్పనపల్లిలోనే ఉన్నారు. అనంతరం ఈ దంపతులు మూడేళ్లు చింతలపూడిలో ఉన్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మీరాతో ఖతిజాకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం జాఫర్కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆరు నెలల క్రితం మళ్లీ తిప్పనపల్లి వచ్చేశారు. అయినా మీరాతో ఖతి జా ఫోన్లో రహస్యంగా మాట్లా డేది. ఈ విషయాన్ని కూడా జాఫర్ గుర్తించడంతో పది రోజులుగా తీవ్రంగా గొడవలు జరుగుతున్నా యి. దీంతో తమకు అడ్డుగా ఉన్న భర్తను హతమార్చాలని నిర్ణయించుకున్న ఖతీజా ఈనెల 11న ప్రియుడికి సమా చారం ఇచ్చింది. అదేరోజు మీరా అర్ధరాత్రి తిప్పనపల్లి చేరుకున్నాడు. ఖతీజా సాయంతో నిద్రిస్తున్న జాఫర్ ముఖంపై దిండుతో అదిమి పట్టి చంపేశాక మీరా తిరిగి వెళ్లిపోయాడు. అయితే, మద్యం తాగి వచ్చిన భర్త కింద పడటంతో గాయాలయ్యాయని, గురువారం ఉదయంకల్లా చనిపోయాడని ఖతిజా అందరినీ నమ్మించింది. దీంతో కుటుంబీకులు సహజ మరణంగా భావించి అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, కుటుంబీకులు శుక్రవారం మృతుని కూతురుతో మాట్లాడుతుండగా తండ్రిని తల్లి సహా మరో వ్యక్తి కలిసి చంపేశారని చెప్పింది. దీంతో వారు ఖతిజాను చితకబాది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జూలూరు పాడు సీఐ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. -
తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు (ఫొటోలు)
-
తండ్రీకొడుకు.. ఒక ఆర్టీసీ బస్సు!
సిద్ధిపేట జిల్లా: ఒకే బస్సులో తండ్రీకొడుకు విధులు నిర్వహించారు. ఈ ఆసక్తికరమైన ఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నా బాద్ బస్టాండ్లో చోటు చేసుకుంది. హుస్నాబాద్కు చెందిన బంధనాపురం ఎల్లయ్య 34 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్గా సేవలు అందిస్తున్నాడు. ఆయన కుమారుడు బంధనాపురం ప్రేమ్ కండక్టర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రీకొడుకు ఇద్దరూ ఒక్కటే బస్సులో డ్యూటీ చేయడం ప్రయాణికులు ఆసక్తిగా గమనించారు. ఎల్లయ్య ఆర్టీసీ డ్రైవర్గా సేవలు అందిస్తూ ఉత్తమ డ్రైవర్గా పలుసార్లు అవార్డులు అందుకున్నాడు. ప్రమాదరహిత డ్రైవర్గా సేవలు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కుమారుడితో కలిసి ఒకే బస్సులో విధులు నిర్వహించడంపై తండ్రి ఎల్లయ్య సంతోషం వ్యక్తం చేశాడు. -
పరీక్ష రోజే తండ్రి మరణం.. శోకాన్ని దిగమింగుతూ
సాక్షి, మెదక్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడి పరీక్ష రోజే దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. దీంతో పుట్డెడు దుఃఖాన్ని దిగమింగుతూ. అంతటి శోకంలోనూ ఆ పిల్లాడు పదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు.. ఈ ఘటన పలువురిని కంటతడికి గురిచేసింది. శివంపేట మండలం ఉసిరిలకాపల్లి గ్రామ శివారులో ఈ రోజు ( శనివారం) అర్ధరాత్రి శివాoపేట మండలం పంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాగా నేడు అతని అంత్యక్రియలు జరగాల్సి ఉంది. అయితే అంతటి దుఃఖంలోనూ అతని కుమారుడు కుమ్మరి ధనుష్ తన బాధను దిగమింగుకుంటూ తూప్రాన్ లోని బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. తన తండ్రి ఎంతో కష్టపడి తమని చదివిస్తున్నాడని అందుకు అతను ఇప్పుడు భౌతికంగా తమవద్ద లేకపోయినటప్పటికీ నాన్న కష్టం వృధా కాకూడదని పరీక్షలకు హాజరవుతున్నానని విలపించాడు. ఈ ఘటన అక్కడి స్థానికులను ఎంతగానో కలిచివేసింది. -
హైదరాబాద్లో ఒక్కొక్కటిగా మూతపడుతున్న హోటళ్లు..!
సాక్షి,రంగారెడ్డి జిల్లా: బంజారాహిల్స్ పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం నగరంలోని సామాన్యుడిని ఆకలి సెగల్లోకి నెడుతోంది. కమర్షియల్ గ్యాస్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సిలిండర్ల సరఫరా స్తంభించడాన్ని ఆసరాగా చేసుకుని ఉన్న కొద్దిపాటి నిల్వలను దళారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో హోటళ్లు, హాస్టళ్లు, చిన్న టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లు మూతపడుతున్నాయి. తద్వారా రోజువారీ కూలీలు, చిరుద్యోగుల ఆహార అవసరాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. విద్య, ఉద్యోగాలకు వచ్చి హాస్టళ్లు, మెస్లపై ఆధారపడుతున్న లక్షలమంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఐటీ కారిడార్ (గచ్చిబౌలి, మాదాపూర్), అమీర్పేట, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, యూసుఫ్గూడ, రహ్మత్నగర్, దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో 11 వేల హాస్టళ్లున్నాయి. వీటిలో 10 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉంటున్నారని అంచనా. అయితే, నిర్వాహకులు గ్యాస్ వాడకం తగ్గించేందుకు మెనూలో కోత విధిస్తున్నారు. దోశ, పూరీ, చపాతీ వంటివి తొలగించి.. కేవలం ఉప్మా, పొంగల్ వంటి తేలికైన బ్రేక్ఫాస్ట్, అన్నం–పప్పుతో సరిపెడుతున్నారు. ⇒ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మధురానగర్, ఫిలింనగర్ ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. వందలాది టీ స్టాల్స్ బంద్ చేశారు. అమీర్పేట్, ఎస్ఆర్నగర్, ఫిలింనగర్లలో ‘సాక్షి’ పరిశీలించగా.. శనివారం నుంచి హోటళ్లు బంద్ చేస్తామని ఇంకొందరు వ్యాపారులు చెప్పారు. చాలా హాస్టళ్లలో రెండ్రోజుల కిందటే మెనూ కోత పెట్టగా, తాజాగా ఒకపూట భోజనం లేదని చెప్పేస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్ వినియోగంపై నిఘా కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో చాలామంది హోటల్ యజమానులు గృహావసరాల సిలిండర్లను వాడుతున్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ మెరుపుదాడులకు దిగింది. మూడు రోజులుగా వందల సిలిండర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేసింది. కాగా, చిరు వ్యాపారులకు బ్లాక్లో కమర్షియల్ సిలిండర్ల ధరలు షాక్ కొడుతున్నాయి. ‘‘మాకు ఎప్పుడూ రూ.1,800కు సిలిండర్ ఇచ్చేవారు. ఇప్పుడు రూ.3,100 తీసుకుంటున్నారు’’ అని ఫిలింనగర్కు చెందిన రంజిత్ చెప్పారు. రూ.4 వేలు, ఇంకొన్నిచోట్ల రూ.5 వేలకూ విక్రయిస్తున్నారన్నారు.ఈ–కుక్కర్లు, ఇండక్షన్ స్టౌలు దొరకట్లేగ్యాస్ సిలిండర్ల కొరత ఆందోళనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లకు డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో ఇలా ఆర్డర్ చేస్తే అలా వచ్చేవి. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్కార్ట్ సైట్లలో కనిపించడం లేదు. ఉత్పత్తి కంపెనీలు సహా వెబ్సైట్లలో ఇండక్షన్ స్టవ్ల ఫొటోలు, ధరలు పేర్కొంటున్నా, ఆర్డర్పై క్లిక్ చేస్తే సారీ చెప్పేస్తున్నాయి. మార్కెట్లో వీటి ధరలను అమాంతం పెంచారు. ఎలక్ట్రికల్ కుక్కర్ల వినియోగంతో నగరంలో విద్యుత్ వినియోగం మరింత పెరుగుతోంది. నిన్నటివరకు గ్రేటర్లో 3300 మెగావాట్లకు మించని వాడకం.. తాజాగా 3500 మెగావాట్లు దాటడం గమనార్హం.కమర్షియల్గా వినియోగిస్తే చర్యలు గృహపయోగ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇప్పటికే గృహ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నందుకు 233 కేసులు నమోదు చేసి 381 గృహ ఎల్పీజీ సిలిండర్లు స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. తగిన నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన స్పష్టం చేశారు. సర్వర్ డౌన్.. నో స్టాక్..! బంజారాహిల్స్: గృహావసర వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో కావొచ్చు, స్టాక్లో కావొచ్చు సమస్యలు లేవని ఒకవైపు కేంద్రం ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం వందలాది విని యోగదారులు బుకింగ్ కోసం యూసుఫ్గూడ గణ పతి కాంప్లెక్స్ దగ్గర ఉన్న బంజారా గ్యాస్ ఏజెన్సీకి వచ్చారు. ఆన్లైన్ చేద్దామంటే రావడం లేదని, వాట్సాప్లో కూడా బుక్ కావడం లేదని, పేటీఎం, ఫోన్ పే ద్వారా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వినియోగదారులు వాపోయారు. ఏజెన్సీ వద్దకు రాగా.. సర్వర్ బిజీ అంటూ పోస్టర్లు కనిపించాయని చెప్పారు. ఏజెన్సీ ఆఫీస్ మూసి ఉండటంతో ఉసూరుమంటూ వెళ్లిపోయారు. -
‘ఇదేం న్యాయం ?
హైదరాబాద్: ’ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలను, డబ్బాలను శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులను కూల్చివేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి తొలగిస్తుండటంతో వ్యాపారులు వాగ్వివాదానికి దిగారు. కాస్త సమయమివ్వాలని కోరినా వినకుండా నేలమట్టం చేశారు. -
అమ్మాయిల ఆసక్తి క్రికెట్ వైపు
న్యూఢిల్లీ: భారతదేశంలో గత ఆరేళ్లలో అమ్మాయిలు క్రికెట్ ఆట వైపు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. 2020తో పోలిస్తే ఇది ఈ సంఖ్య దాదాపు రెట్టింపుగా ఉంది. ‘బీబీసీ–కలెక్టివ్ న్యూస్రూమ్’ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఇది తేలింది. దాదాపు 10 వేల మంది మహిళలతో మాట్లాడి ఈ సర్వే ఫలితాలు వెల్లడించారు.గతంలో క్రికెట్లో చేరే అమ్మాయిల సంఖ్య ఐదు శాతం మాత్రమే ఉండగా ఇప్పుడు ఇది పది శాతానికి పెరిగింది. ముఖ్యంగా 15–24 మధ్య వయసు అమ్మాయిలు 2020లో ఆరు శాతం మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 16 శాతానికి పెరగడం విశేషం. ఈ వయో విభాగంలో ప్రతీ నలుగురిలో ఒక అమ్మాయి క్రికెట్ను పూర్తి స్థాయిలో కెరీర్కు మలచుకోవడం కోసం శ్రమిస్తున్నారని సర్వే చెబుతోంది. గత ఏడాది భారత జట్టు తొలిసారి వన్డే క్రికెట్ వరల్డ్ కప్ను గెలుచుకోవడం ఒక్కసారిగా అందరి దృష్టీ మహిళా క్రికెట్పై నిలిచింది. మరోవైపు బ్యాడ్మింటన్ క్రీడపై పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అమ్మాయిల ఆసక్తి పెరిగిందని తేల్చిన సర్వే... వేర్వేరు కారణాలతో 13 శాతం అమ్మాయిలు అసలు ఏ క్రీడను ఆడటం లేదని వెల్లడించింది. -
అనసూయపై అసభ్యకర పోస్ట్..నిందితుడి అరెస్టు
సాక్షి,హైదరాబాద్: సామాజిక మాధ్యమాలలో నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్పై అసభ్యకర పోస్టు చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 23న పలువురు సోషల్ మీడియాలోలో తనపై పరువు నష్టం కలిగించే విధంగా, అశ్లీల వ్యాఖ్యలను పోస్ట్ చేసి, అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేశారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కడప జిల్లాకు చెందిన జనార్ధన్గా గుర్తించి అరెస్టు చేశారు. మరో కేసులో...సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్ట్ చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. వెస్ట్ మారేడ్పల్లికి చెందిన కొండాపురం అరుణ్ కుమార్ అనే ఆటో డ్రైవర్ యూట్యూబ్లో వీడియోలు, రీల్స్ చేసేవాడు. ఈక్రమంలో యూట్యూబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఓ ప్రముఖ నటి పోస్ట్ చేసిన రీల్ను కిరణ్ చూశాడు. ఆ తర్వాత నిందితుడు తన యూట్యూబ్ ఖాతా నుంచి నటి రీల్స్పై అసభ్యకర రీతిలో అభ్యంతర వ్యాఖ్యను ప్రస్తావిస్తూ పోస్టు చేశాడు. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. ఈనెల 12న నిందితుడు ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు కిరణ్ను అరెస్టు చేశారు. -
TG: పదవ తరగతి పరీక్షలు ప్రారంభం
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన పరీక్షలు మద్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకూ సాగనున్నాయి. ఎగ్జామ్స్ సజావుగా సాగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 16తో ముగుస్తాయి. పరీక్షల కోసం 2,676 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్స్కు మొత్తంగా 5, 28, 239 మంది హాజరవుతున్నారు. వీరిలో రెగ్యులర్గా రాసే విద్యార్థుల సంఖ్య 5,17,727. కాగా 5,329 ప్రభుత్వ స్కూల్స్ నుంచి 2,07,573 మంది, 1057 గురుకులాల నుంచి 60,139 మంది, 5,288 ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్ నుంచి 2,50,015 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు.పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్యా డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ శుక్రవారం జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్న పత్రాలను తెరవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతీ కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిఘా సిబ్బంది, పరీక్షల సిబ్బంది విద్యార్థులను ఆందోళనకు గురిచేసేలా వ్యవహరించవద్దన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని సిబ్బందిని కోరారు. మరో వారం రోజుల్లో ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకన కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. -
నేటి నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలు శనివారం నుంచి మొదలుకానున్నాయి. ఇవి ఏప్రిల్ 16 వరకూ కొనసాగుతాయి. పరీక్షలకు మొత్తంగా 5,28,239 మంది హాజరవుతున్నారు.వీరిలో రెగ్యులర్గా రాసే విద్యార్థుల సంఖ్య 5,17,727. కాగా 5,329 ప్రభుత్వ స్కూల్స్ నుంచి 2,07,573 మంది, 1057 గురుకులాల నుంచి 60,139 మంది, 5,288 ప్రైవేటు, ఎయిడెడ్ స్కూల్స్ నుంచి 2,50,015 మంది పరీక్షలకు హాజరవుతున్నారు.ఉదయం 9.30 నుంచి మొదలయ్యే పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను తేలికగా తెలుసుకునేందుకు హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ కోరారు. పరీక్షల నేపథ్యంలో ఆయన శుక్రవారం జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్నపత్రాలను తెరవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు ముందే చేరుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. పటిష్టమైన నిఘా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రతీ కేంద్రానికి సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ నిఘా సిబ్బంది, పరీక్షల సిబ్బంది విద్యార్థులను ఆందోళనకు గురిచేసేలా వ్యవహరించవద్దన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని సిబ్బందిని కోరారు. మరో వారం రోజుల్లో ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకన కేంద్రాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. -
టోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,హైదరాబాద్ : టోలిచౌకిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చారిత్రక కుతుబ్షాహీ సమాదులైన సెవెన్టూంబ్స్ సబ్స్టేషన్ పక్కనే పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో వాణిజ్య సముదాయాల్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పాయి. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే మసీదు ఉంది రంజాన్ మాసం కావడంతో వందల సంఖ్యలో ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. -
నగరంలో నయా ప్రపంచం
నిజాం నగరంలో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతం కానుంది. కుతుబ్ షాహీ కాలంలో అభివృద్ధి చెందిన భాగ్యనగరంలో మూసీ నది నీటిని తాగునీటితోపాటు వ్యవసాయం, వర్తకానికి వినియోగించేవారు. 300 ఏళ్లకుపైగా చరిత్రగల మూసీ భాగ్యనగరికి వెన్నెముకగా నిలిచింది. కానీ కాలక్రమేణా పట్టణీకరణ, ఆక్రమణలు, మురుగు, వ్యర్థాల పారబోత, నిర్లక్ష్యం తదితర కారణాలతో జీవం కోల్పోయిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత తరుణంలో మూసీ పునరుద్దరణ ఒక ఎంపిక కాదు ఆవశ్యకతగా మారింది. ప్రభుత్వం మూసీని ఆర్థిక, సాంస్కృతిక, విద్య, పర్యాటక, వినోద రంగంగా అభివృద్ధి చేయనుంది. మాస్టర్ ప్లాన్, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను సిద్ధం చేసింది. మూసీ ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై ఈ మేరకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) ఎండీ నర్సింహారెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. – సాక్షి, హైదరాబాద్ఐదు జోన్ల అద్భుతం.. తొలిదశలో ఉస్మాన్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 21 కి.మీ. మేర మూసీని అభివృద్ధి చేయనున్నారు. దశలవారీగా గండిపేట నుంచి గౌరెల్లి వరకు మొత్తం 55 కి.మీ. మేర మూసీ అభివృద్ధి జరుగుతుంది. ఎకోలాజికల్, హెరిటేజ్, ఫ్యూచర్ జోన్ వర్గాలవారీగా వాటిని అభివృద్ధి చేస్తారు. నది ప్రక్షాళనలో భాగంగా మూసీలో పేరుకుపోయిన పూడికతీత, చెత్త తొలగించి హైడ్రాలజీ అధ్యయనంతో నదీ గర్భానికి రూపకల్పన చేసి పరిధులను నిర్ణయిస్తారు. వరదల నివారణ, నదీ తీర వాలు స్థిరీకరణ చేస్తారు. అలాగే నదీ తీరం ఇరువైపులా రహదారుల నిర్మాణం, ప్రధాన మురుగునీటి పైప్లు, ఇరువైపులా వర్షపు నీటి కాలువలు, నాలాల నిర్మాణంతోపాటు రిజర్వాయర్లు, బ్యారేజీల వంటి నీటి నిల్వ నిర్మాణాలతో నదీ తీరాన్ని అభివృద్ధి చేస్తారు. తొలిదశ అభివృద్ధి పనులకు రూ. 6,500 కోట్ల నుంచి రూ. 7,000 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.ఈస్ట్–వెస్ట్ కారిడార్..మూసీ నది నగరంలో పశ్చిమం నుంచి తూర్పునకు ప్రవహిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ ప్రాంతంలోని గండిపేట నుంచి గౌరెల్లికి ప్రయాణించాలంటే.. ఔటర్ నార్త్ మీదుగా 91 కి.మీ., లేదా ఔటర్ సౌత్ మీదుగా అయితే 69 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. అలా కాకుండా వెస్ట్ టు ఈస్ట్ మార్గంలో హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే ప్రయాణ దూరం 43 కి.మీ.కి తగ్గిపోనుంది. దీంతో ప్రధాన నగరంలో ట్రాఫిక్ తగ్గడంతోపాటు ప్రయాణ సమయం 50 శాతం తగ్గుతుంది. ఈ కారిడార్ బుద్వేల్ వద్ద మొదలవుతుంది. నెల రోజుల్లో డీపీఆర్ తయారు కానుంది. మూసీని సాంస్కృతిక వారధిగా అభివృద్ధి చేస్తారు. మంచిరేవుల వద్ద హిందూ దేవాలయం, పురానాపూల్ వద్ద మసీదు, గౌలిగూడ వద్ద గురుద్వారా, నాగోల్ వద్ద చర్చిని నిర్మించనున్నారు. 200 ఎకరాల్లో గాంధీ సరోవర్.. మూసీ, ఈసా నదుల సంగమమైన బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ను అభివృద్ధి చేస్తారు. ఇది మొత్తం 200 ఎకరాల్లో ఉంటుంది. అందులో 123 అడుగుల ఎత్తయిన ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’గాంధీ విగ్రహంతోపాటు చేనేత శిక్షణాæ కేంద్రం, విద్య, జ్ఞాన కేంద్రం, మెడిటేషన్, వెల్నెస్ విలేజ్, నేషనల్ మ్యూజియం, కల్చరల్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ల వంటివి ఉంటాయి.మూసీ చుట్టూ ఎస్టీపీలు.. ప్రస్తుతం బాపూఘాట్, పురానాపూల్, అఫ్జల్గంజ్, గోల్నాకా వంటి మూసీ పరీవాహక ప్రాంతాల చుట్టూ 25 మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)ఉన్నాయి. ఇవి 772 ఎంఎల్డీ నీటిని శుద్ధి చేస్తున్నాయి. మరో 27 ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధమవుతుండగా.. ఇవి 1,106 ఎంఎల్డీల నీటిని శుద్ధి చేస్తాయి. ఇక అమృత్ స్కీమ్ కింద మరో 39 ఎస్టీపీలను నిర్మించనున్నారు. వాటితో 972 ఎంఎల్డీ మురుగునీరు శుద్ధి అవుతుంది. ఈ ప్రతిపాదిత ఎస్టీపీలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు నిర్మితమవుతాయి. ఉస్మాన్సాగర్ మార్గంలో నార్సింగి, తారామతి, హైదర్షాకోట వద్ద, అలాగే హిమాయత్సాగర్ మార్గంలో అత్తాపూర్ వద్ద భూగర్భ ఎస్టీపీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే అత్తాపూర్, అంబర్పేట, నాగోల్లలో మూసీ బఫర్ జోన్లోని ప్రధాన ఎస్టీపీ స్థానాలలో మూడు బ్యాలెన్సింగ్ గ్రే వాటర్ రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే శుద్ధి చేసిన నీటిని నిర్మాణ రంగం, డేటా సెంటర్ల వంటి పరిశ్రమ అవసరాలకు తక్కువ ధరకు అంటే సుమారు కిలోలీటర్ నీటిని రూ. 70–80 చొప్పున సరఫరా చేస్తారు. అలాగే నగరంలోని పార్క్లు, ల్యాండ్ స్కేపింగ్ ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తారు. మరోవైపు మూసీపై 14 వంతెనలను నిర్మిస్తారు. అందులో 9 కొత్తవి కాగా.. 5 అప్గ్రేడెడ్ బ్రిడ్జీలు. నీటి నిల్వ కోసం మూడు బరాజ్లు కడతారు.బఫర్లో ఏముంటాయంటే.. నదికి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఇందులో విహార ప్రదేశాలు, నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్లు, పార్క్లు, సీటింగ్ ప్రాంతాలు, వీక్షణ డెక్లు, యాంఫీ థియేటర్లు, ప్లాజాల వంటివి ఉంటాయి. అలాగే వాహనాల పార్కింగ్ స్థలాలు, అనుసంధాన రోడ్లతోపాటు ఇంటర్సెప్టర్ మురుగు కాలువలు, వరదనీటి కాలువలు, భూగర్భ డ్రైనేజీలను అభివృద్ధి చేస్తారు. ఇందులో నివాసాల వంటి ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టకూడదు. ఇక మూసీలో 24/7 మంచినీరు ప్రవహించేలా 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవం కోసం కేటాయించారు. ఔటర్ రింగ్రోడ్ వెంబడి అనుసంధానం కానున్న గోదావరి నదీ అనుసంధాన ప్రాజెక్టు నుంచి ఈ నీటిని సేకరిస్తారు. విదేశాల్లోని నదీ తీర ప్రాంతాలిలా..ప్రపంచ దేశాల్లోని నదీ తీర ప్రాంతాలన్నీ పునరుజ్జీవంతో కొత్త ఆర్థిక రూపును సంతరించుకున్నాయి. గుజరాత్లోని సబర్మతి సహా దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని చెయోంగ్యెచియోన్, లండన్లోని థేమ్స్, ఫ్రాన్స్లోని సీన్, టోక్యోలోని సుమిదా, సింగపూర్ రివర్ఫ్రంట్ తదితర నదీ తీర నగరాలన్నీ ఇలా అభివృద్ధి చెందినవే. దీంతో ఆయా దేశాల్లోని అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ఏడాదిన్నరపాటు అధ్యయనం చేసి మూసీ పునరుజ్జీవానికి సంకల్పించారు. వివిధ దేశాల్లో నదీ తీరాల అభివృద్ధి ఇలా.. ⇒ సియోల్లోని చెయోంగ్యెచియోన్ నదీ తీరం మీదుగా సాగే 5.8 కి.మీ. ప్రవాహ మార్గాన్ని అభివృద్ధి చేయగా రోజుకు 50 వేల మంది సందర్శకులు వస్తున్నారు. నదీ తీర అభివృద్ధితో 9 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. గత పదేళ్లలో 190 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. ⇒ లండన్లోని థేమ్స్ నది 39 కి.మీ. పునరుద్ధరించగా.. రోజుకు 27 వేలకుపైగా సందర్శకులు వస్తున్నారు. 2.98 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. సుమారు లక్షకుపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. ⇒ టోక్యోలో 23.5 కి.మీ. మేర సుమిధ నదీ తీర అభివృద్ధితో 67.14 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. రోజుకు 1.5 లక్షల మంది సందర్శకులతో ఏటా సుమారు 300 మిలియన్లకుపైగా పర్యాటకుల కేంద్రంగా మారింది. ⇒ 3.2 కి.మీ. మేర విస్తరించిన సింగపూర్ రివర్ఫ్రంట్ అభివృద్ధితో ఏటా 23.9 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది. రోజుకు 40 వేలకుపైగా సందర్శకులతో ఏటా 16.9 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. ⇒ ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 29 కి.మీ. మేర ప్రవహించే సీన్ నదీ అభివృద్ధితో పారిస్ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం ద్వారా 30 శాతం ఆదాయం సమకూరుతోంది. ఏటా 40 మిలియన్ల మంది సందర్శిస్తున్నారు. అలాగే 7.4 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మారింది. ⇒ గుజరాత్లోని అహ్మదాబాద్లో తొలిదశ కింద సబర్మతి నదిని 11.5 కి.మీ. మేర సుందరీకరించారు. ఫలితంగా నిత్యం 7 వేల మందికిపైగా సందర్శకులు వస్తున్నారు. అలాగే 85 వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మారింది. రెండో దశ కింద మరో 13 కి.మీ. మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. -
మేం లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు
సాక్షి, హైదరాబాద్: ‘షెల్టర్లో ఉన్నప్పుడు పోలీసులు అరెస్టు చేశారే తప్ప.. మేం లొంగిపోలేదు. అలా అనివార్య పరిస్థితుల్లో బహిరంగ జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్నాం. మేం ఆయుధాలు వీడినా, మావోయిస్టు సిద్ధాంతాలను వదల్లేదు. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తాం’అని ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి వెల్లడించారు. ఫిబ్రవరి 18న హైదరాబాద్లో షెల్టర్లో ఉన్నప్పుడు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారన్నారు. అంతకు రెండు రోజుల ముందే అడవుల నుంచి బయటకు వచ్చామని, ఏళ్లపాటు అడవుల్లో మేం సేఫ్గా ఉన్నామని... కానీ అర్బన్లో రెండు రోజులకే పట్టుబడ్టట్టు చెప్పారు.దండకారణ్యంలో ప్రతి క్షణం తూటాల మధ్యే ఉద్యమం చేశామని వెల్లడించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి దగ్గర హామీ ఇచ్చినట్టుగా ఇకపై బహిరంగ జీవితంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని రేవంత్రెడ్డి ద్వారా కేంద్రాన్ని కోరామని చెప్పారు. నిషేధం ఎత్తివేస్తే పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) సహా మావోయిస్టులు అంతా ఆయుధాలు వదిలి లొంగిపోయేలా కృషి చేస్తామన్నారు. త్వరలోనే మావోయిస్టు అమరుల కుటుంబాలను కలిసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మావోయిస్టు అగ్రనేత గణపతి ఆచూకీ తనకు తెలియదని, చివరి సారిగా 2024లో చూసినట్టు తెలిపారు. శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దేవ్జీ అనేక అంశాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... మీరు ఎత్తివేస్తే.. మేం రద్దు చేస్తాం అని చెప్పాం మేం ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రేవంత్రెడ్డితో జరిగిన సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టాం. మావోయిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి చట్టబద్ధంగా ఒక రాజకీయ పార్టీగా గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరిస్తే.. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులంతా ఆయుధాలు అప్పగించి లొంగిపోతారని, అవసరమైతే పీఎల్జీఏను కూడా రద్దు చేస్తామని చెప్పాం. అయితే మేమే మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామన్నట్టుగా తప్పుగా ప్రచారమైంది. సీఎంతో చర్చలో రెండో ముఖ్యమైన అంశం... మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారని కేసులు పెట్టి, జైళ్లలో ఉంచిన వారందరినీ రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలని కోరాం. ఆ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారు. పార్టీ దెబ్బతిన్నది.. విప్లవ ఉద్యమం దెబ్బతిన్నదని ఒప్పుకోక తప్పదు ప్రస్తుతం అజ్ఞాతంలో ఇంకా కొందరు ఉన్నారు. అయితే, పార్టీ దెబ్బతిన్నది.. విప్లవోద్యమం దెబ్బతిన్నదని ఒప్పుకోక తప్పదు. అయితే మేం అనుసరించిన విధానం, సిద్ధాంతం తప్పని కాదు. ప్రజలను సంఘటితం చేసే వరకు పార్లమెంటరీ పార్టీ విధానంలో ఎన్నికలకు పోయేది లేదు. ఆ ఇద్దరూ పార్టీలో చీలిక తెచ్చారు పార్టీ కార్యదర్శి పదవి విషయంలో మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోనుకు నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆ మాటకొస్తే కుల, వర్గ, ప్రాంత వివక్ష, లింగబేధాలకు తావులేనిది మావోయిస్టు పార్టీలోనే. అయితే, బసవరాజు బతికుండగానే సరెండర్ అవుదామని ప్రతిపాదన పెట్టిన వ్యక్తి మల్లోజుల. మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఈ స్థితికి రావడానికి ప్రధాన కారణంగా సోను, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలే. వారే పార్టీని చీల్చారు. ఆయుధాలు తీసుకెళ్లవద్దంటే ఆయుధాలతో వెళ్లి లొంగిపోయారు. ఆ తర్వాత లొంగుబాట్లను మేం నియంత్రించలేని స్థితికి పరిస్థితి వెళ్లింది. వారు శత్రువుతో చేతులు కలిపారు. మా తప్పు వల్లే పార్టీ నష్టపోయిందని ఒప్పుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అప్పుడే వారితో కలిసి పనిచేసేందుకు ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. మా దగ్గర రూ. కోట్ల డబ్బు..కిలోల కొద్దీ బంగారం అన్నది ఉత్త ప్రచారమే మీడియాలో వార్తలు వచ్చినట్టుగా మావోయిస్టు పార్టీ దగ్గర వందల కోట్ల రూపాయల డబ్బు, కిలోల కొద్ది బంగారం లేదు. అదంతా పూర్తి అవాస్తవం. అయితే పార్టీ నడిపేందుకు, జనతన సర్కార్ నడిపేందుకు కొన్ని ఖర్చులు తప్పవు. అందుకు తగ్గట్టుగా బడ్జెట్ పెట్టుకొని ఆ మేరకే కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేస్తాం. నా దగ్గర డబ్బు ఎప్పుడూ లేదు. అర్బన్ నక్సలిజం అన్న పదమే చట్ట విరుద్ధం ప్రజల తరఫున పోరాడే వారి గొంతు నొక్కడానికి, రాసే వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు పెట్టిన పదమే అర్బన్ నక్సలిజం. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని రాజ్యాంగంలో చెబుతూనే ప్రభుత్వ వ్యతిరేకంగా స్వేచ్ఛగా మాట్లాడితే అర్బన్ నక్సలిజం అంటున్నారు. ఆ పదమే తప్పు. మార్చి 31 తర్వాత మావోయిజం అంతం సాధ్యం కాదు. కానీ, మేం పెట్టిన డిమాండ్లకు ప్రభుత్వాలు ఒప్పుకుంటే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన వారు ఆయుధాలతో బయటికి వచ్చేలా మేం కృషి చేస్తాం. అమరుల కుటుంబాలకు అండగా నిలబడతాం మావోయిస్టు ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు మేం అండగా ఉన్నామని చెప్పేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతాం. వారంతా ఒంటరివారు కాదు.. మేం ఉన్నామన్న భావన వారిలో కల్పించేలా అందరినీ కలవాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇందులో ప్రజలను భాగస్వాములను చేసి వారి ద్వారా ఆరి్థక సాయం అందేలా చేస్తాం. సివిల్ సొసైటీలో పెద్దల ద్వారా వారికి ఆ ఆర్థిక సాయం అందేలా చూస్తాం. ఇదొక దీర్ఘకాలిక కార్యక్రమంగా పెట్టుకుంటాం. తొలుత తెలంగాణలో ప్రారంభించి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాం. -
పేదలకు శత్రువులం కాదు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ పథకం అమలులో ఏవైనా లోపాలుంటే సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, మరింత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామని, అసలు పథకమే వద్దంటే మాత్రం వినే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం పేదలకు శత్రువు కాదని, వారిని నిరాశ్రయులను చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంలో నిరాశ్రయులకు ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలం ఉంటే.. అక్కడే ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి ఆస్తులూ గుంజుకునేందుకు కాదని అన్నారు. పేదలతో శత్రుత్వం పెంచుకుంటే మళ్లీ ఎవరైనా అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించారు. ఇది భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి అని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. దాదాపు 115 సంవత్సరాల కిందట అప్పటి నిజాం నవాబు ఎంతో దూరదృష్టితో చేసిన మంచి పనుల్లో కనీసం మనం పది శాతం కూడా చేయకుండా ఈ నగరాన్ని అలాగే వదిలేద్దామా? అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ‘మూసీ ఇన్వైట్’పేరుతో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తర్వాత ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పర్యావరణవేత్తలు, మేధావులు, పలు సంస్థల కన్సల్టెంట్లను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అంటూ అసత్యాలు ‘ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపడుతున్నప్పుడు మేధావులు దానిని సమర్థించేలా మాట్లాడాలి. కొన్ని రాజకీయ పార్టీలు కడుపులో కుళ్లు, మాటల్లో విషం, చూపుల్లో పగతో వ్యవహరిస్తున్నాయి. రాజకీయ స్వార్థం కోసం ఘనమైన చరిత్రను కాలగర్భంలో కలిపేలా వ్యవహరిస్తున్నాయి. అక్రమ సంపాదనతో ప్రతీనెలా రూ.5 కోట్లు వ్యయం చేస్తూ సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అంటున్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహానికి రూ.75 కోట్లు మాత్రమే.. రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం అంటూ సొంత తెలివి ప్రదర్శిస్తున్నారు. నిజానికి గాంధీ విగ్రహానికి అయ్యే వ్యయం రూ.75 కోట్లు మాత్రమే. ఈ ప్రాజెక్టు మొత్తం 55 కిలోమీటర్లు కాగా.. తొలిదశలో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల అభివృద్ధికి అయ్యే వ్యయం కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే. మహాత్ముడి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనపై లేదా? మన చరిత్రను తిరిగి రాసుకునే అవకాశాన్ని మనం వదులుకుందామా? దేవతలు యజ్ఞాలు చేసినపుడు రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారు. సుబాహు, మారీచుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞం ఆగిందా? లోకకళ్యాణం కోసం చేసే పనులకు సహకరించక పోయినా పరవాలేదు. కానీ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. నది చుట్టూనే నాగరికత అభివృద్ధి: ‘మానవ నాగరికత నది చుట్టూనే అభివృద్ధి చెందింది. 1908 మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తిన తర్వాత.. నగరాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పటి నిజాం ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లను నిర్మించారు. ప్రస్తుతం వందేళ్లు దాటినా ఆ రిజర్వాయర్లు నగర ప్రజలతో పాటు, వలసలు వచ్చిన లక్షలాది మంది దాహార్తి తీరుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని నిజాం ఎకనామిక్ జోన్గా తీర్చిదిద్దారు. పాలకులు మారినా నగర అభివృద్ధి ఆగలేదుం. అలాంటి నగరాన్ని కాపాడుకోవడం మనకర్తవ్యం. 1994 నుంచి ఇప్పటివరకు పరిపాలనలో విధా న నిర్ణయాల్లో వెనుకబడటం ఎప్పుడూ లేదు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్లు ఎందుకు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారు? వారసత్వ సంపద కలిగిన ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? మూసీ పునరుజ్జీవం జరిగితే కాంగ్రెస్కు, రేవంత్రెడ్డికి మంచి పేరు వస్తుందని, ఇక వాళ్లకు అధికారం కలగా మిగిలిపోతుందనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దార్శనికతతో అభివృద్ధి ప్రణాళికలు రచించి అభివృద్ధి చేసిన వారే చరిత్రలో గుర్తుంటారు..’అని అన్నారు. సంగమంలో మహాత్ముడి అస్తికలు..: ‘మూసా, ఈసా నదుల సంగమం వద్ద ఆనాడు మహాత్మాగాంధీ అస్థికలు కలిపారు. అంతటి చరిత్ర బాపూఘాట్కు ఉంది. కానీ బాపూఘాట్ను ఎవరైనా సందర్శిస్తున్నారా? ఎందుకది మరుగున పడిపోయింది? ప్రస్తుతం ఈ నదులు పూర్తిగా కాలుష్యంతో విషతుల్యంగా మారాయి. ఈ నీరుతో నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. విషతుల్యమైన నీరు కారణంగా మహిళలు గర్భవతులు కూడా కావడం లేదు. ఇది కేవలం మూసీ పునరుజ్జీవనం మాత్రమే కాదు. మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవడం. అందులో భాగంగానే నల్ల చెరువు, బతుకమ్మ కుంట బమృక్ ఉద్దౌలా వంటి చెరువులను పునరుద్ధరించాం. అడ్డుకుంటున్న వాళ్లు అక్కడ ఉండగలరా? ఇవాళ మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకుంటున్నవారు మూసీ పరీవాహకంలో నివసించగలరా? వాళ్లు ఉంటానంటే అన్ని సౌకర్యాలతో కంటైనర్ హౌస్ ఇస్తా. మూడు నెలలు అక్కడ ఉండగలరా? ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పేదలకు సరైన మౌలిక వసతులు కల్పించొద్దా? బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయొద్దా? పర్యాటక అభివృద్ధి జరగొద్దా? నైట్ ఎకానమీ అభివృద్ధి చెందొద్దా? అభివృద్ధిని అడ్డుకుని ఇంకా వెనక్కి రాతి యుగాల వైపు వెళ్ళిపోదామా? ఓఆర్ఆర్ నిర్మాణం జరిగినపుడు కూడా కొందరు భూములు కోల్పోయారు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవనంతో రాష్ట్రం గ్రోత్ ఇంజన్గా మారుతుంది. మూసీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇద్దామో చెప్పండి. దానిని అమలు చేద్దాం. మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం..’అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


