breaking news
Telangana
-
తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తుదారులకు బిగ్ అలర్ట్!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తు దారులకు అలెర్ట్. కొత్తగా పెన్షన్ అప్లయ్ చేసుకోవాలనుకునే వారి గడువు నేటితో (సెప్టెంబర్ 15) ముగియనుంది. అర్హులైన పేదలు ఎవరైనా ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే, ఇవాళ్టిలోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది (సుమారు 4.8 లక్షలకు పైగా) దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 25 నాటికి క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరు వరకు అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను పరిశీలిస్తారు. పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత, అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు. అర్హులైన నిరుపేదలు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. -
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యవస్థల తీరుపై మండిపడుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘కొన్నిసార్లు దాడులు, హత్యలు నేరుగా ప్రాణం తీయడంతో మొదలవవుని, పూర్తి భద్రత ఉండాల్సిన పోలీస్ స్టేషన్లోనే, యూనిఫామ్ ధరించిన అధికారుల కళ్ల ముందే, అత్యంత పక్కాగా ప్లాన్ చేసిన దాడితో మొదలవుతాయని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలే ఈ గూండాగిరిని ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తున్నాయని, ఇదే తీరు కొనసాగితే త్వరలోనే రోడ్లపై దాడులు, మూకదాడులు, హింస మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.పోలీస్ స్టేషన్ లోపల తన పీఆర్ మహేష్ మాణిక్య, పీఏ మహేందర్ రెడ్డిలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అణచివేతకు తలవంచని తెలంగాణలోని ఏ సామాన్య పౌరుడికైనా రేపు ఈ పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణ పూర్తి అరాచకత్వం అంచున నిలిచిందని విమర్శిస్తూ..‘వెల్ డన్ కాంగ్రెస్.. వెల్ డన్ రాహుల్ గాంధీ’ అంటూ వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు. Lynching doesn’t always start as an act of killingSometimes it starts as a carefully planned attack inside a fully functional police station, in front of uniformed officialsThe way goodaism is being sponsored and enabled by state machinery, I am worried that very soon we will…— KTR (@KTRBRS) September 14, 2026 -
పోలీస్ స్టేషన్లో దాడి యత్నంపై సమగ్ర దర్యాప్తు చేయాలి..
సాక్షి, హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్స్టేషన్లో విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో, పీఏపై కొందరు ముసుగులు ధరించిన వ్యక్తులు దాడికి యత్నించినట్లు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.పండగ రోజున సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో దాదాపు 15 మంది ముసుగులు ధరించి ఇంటరాగేషన్ రూమ్లోకి వెళ్లినట్లు తెలిపారు. అయితే, అక్కడున్న బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు వారిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.దీంతో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్స్టేషన్లోనే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర విషయమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే, ముసుగులు ధరించిన వ్యక్తులు పోలీస్స్టేషన్లోకి ఎలా వచ్చారు? వారెవరు? వారి వెనుక ఎవరున్నారు? అనే విషయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.ఘటనకు సంబంధించి పోలీస్స్టేషన్లో ఉన్న ప్రతి వ్యక్తి వివరాలను సేకరించాలని ఆయన సూచించారు. అలాగే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాల పూర్తి ఫుటేజ్ను ఎలాంటి మార్పులు లేకుండా భద్రపరచాలని డిమాండ్ చేశారు. సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించి అసలు ఏం జరిగిందో తేల్చాలని అన్నారు.హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఘటనపై స్పందించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా విచారణ జరిపి, దాడికి యత్నించిన వ్యక్తులను గుర్తించాలని అన్నారు. ఘటన వెనుక ఉన్న వారిని కూడా గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: కవిత జోరు.. మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త సారథులు -
పోలీస్ స్టేషన్లోనే కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై దాడి.. వాళ్ల పనేనా?
సాక్షి,హైదరాబాద్: సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్లు విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. ఇటీవల అసెంబ్లీ గేట్ నంబర్-3 వద్ద జరిగిన ఆందోళనల ఘటనకు సంబంధించి పోలీసులు వీరిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా పోలీసులు వారికి 41ఏ సీఆర్పీసీ (35(3) BNS) కింద నోటీసులు అందించారు.విచారణ ముగిసే సమయానికి పోలీస్ స్టేషన్ వెలుపల భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్టేషన్ గేటు వద్ద నుంచి వెంటనే వెళ్లిపోవాలని పోలీసులు సూచించగా, తాము బయటే ఉంటామని కార్యకర్తలు పట్టుబట్టడంతో అక్కడ తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్లో తన పీఏ, పీఆర్వోలపై దాడి జరిగిన పరిణామాలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీసుస్టేషన్లోకి ఏకంగా గుండాలు అక్రమంగా చొరబడి నా పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోంది. ఇది కాంగ్రెస్ గుండాల పనా ?? లేక మఫ్టీలో పోలీసులకే ముసుగులు వేసి కుట్రపన్ని ఈ దాడి చేయించరా ?? వెంటనే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.రాజకీయ కక్షతో పెట్టిన పోలీసు కేసు విచారణ కోసం స్టేషన్కు పిలిపించి ఖాకీల సమక్షంలో ఈ దాడి చేయించడం వెనక ముమ్మాటికి ముఖ్యమంత్రి హస్తం ఉంది. ఉదయం విచారణకు రమ్మని చెప్పి చీకటి పడే వరకూ కాలయాపన చేయడం చూస్తే, ముందే ఈ దాడి చేయాలన్న కుట్ర పన్నినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. హైకోర్టు తదుపరి ఆదేశాల వరకూ మహేష్, మహేందర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కక్ష సాధింపులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనకు హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి.ముసుగు ధరించిన గుండాల దాడిలో గాయపడ్డ పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డికి వెంటనే రక్షణ కల్పించి వారికి మెరుగైన చికిత్స అందించాలి. పోలీస్ స్టేషన్ లోపల, బయట ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని వెంటనే భద్రపరచాలి. ఈ అరాచక పర్వానికి పాల్పడిన ప్రతి ఒక్క కాంగ్రెస్ గుండాను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలి. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు’అని పేర్కొన్నారు.మరోవైపు తమపై జరిగిన దాడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ పీఏ, పీఆర్వోలు కూడా పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఈ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీసుస్టేషన్ లోకి ఏకంగా 15 మంది గుండాలు అక్రమంగా చొరబడి నా పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడుస్తోంది. ఇది కాంగ్రెస్ గుండాల పనా…— KTR (@KTRBRS) September 14, 2026 -
కేటీఆర్ పీఏ,పీఆర్వో విచారణలో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన తీరును పరిశీలించేందుకు పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇద్దరినీ అసెంబ్లీ ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సైఫాబాద్ పోలీసులు ప్రయత్నించగా, పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర వాదనలు చోటుచేసుకున్నాయి.అసెంబ్లీ ఎదుట ఈ ఘటన ఎలా జరిగిందనే కోణంలో కూపీ లాగుతున్న పోలీసులు, సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం కేటీఆర్ పీఏ, పీఆర్వో అక్కడికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే దీనిని న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. నిబంధనల ప్రకారం ముందుగా నోటీసులు ఇవ్వాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఈ విచారణ కొనసాగుతోందని న్యాయవాదులు ఆరోపించారు.మరోవైపు, ఈ వివాదం మధ్యలోనే కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్ఓ మహేష్ స్పందిస్తూ.. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం తామే స్వయంగా అసెంబ్లీ వరకు నడుచుకుంటూ వస్తామని చెప్పడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఈ విచారణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
కొండా సురేఖను అధిష్టానం పిలిచిందా?
సాక్షి, హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగానే స్పీకర్పై వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమంలో దళిత కార్డును కేసీఆర్ ఎలా వాడారో చూశాం. గద్దర్, అందెశ్రీని ఏ రకంగా అవమానించారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ 2003లో ఇచ్చిన హామీలపై డాక్యుమెంట్ విడుదల చేస్తున్నా.. కేసీఆర్ ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు.‘‘దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు? హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు. అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోదు ఆ మహాభావుని సలహాలు, విలువలు ఆచరణలో పెట్టాలి. దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం దారుణం. దళిత జాతిని కేసీఆర్ అవమానించారు. కేసీఆర్ రాజకీయాన్ని శుద్ధి చేయాలి. ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే దారుణం మరోటి లేదు’’ అని మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు.‘‘దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి కాంగ్రెస్ గౌరవించింది. రీల్ మాక్ అసెంబ్లీ పెట్టడం కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ను ప్రతిపక్ష నాయకుడిని చేయండి. పదేళ్ల బీఆర్ఎస్ బీసీ,దళిత, మైనార్టీ వ్యతిరేక పాలనను ప్రజలు మరిచిపోలేదు. దళిత స్పీకర్ను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. మీనాక్షీ విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. మీనాక్షి విషయంలో అధిస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఆ అంశంపై సమాచారం లేదు..‘‘కొత్త ఇంఛార్జ్ విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. కొండా సురేఖను అధిష్టానం పిలిచిందన్న అంశంపై నాకు సమాచారం లేదు’’ అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. కాగా, కొండా సురేఖ.. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.ఇదీ చదవండి: కొండా సురేఖది.. నాది ఒకే మాట.. సుస్మితది మాత్రం..: కొండా మురళి -
‘చచ్చిపో..’ అన్న భర్త.. నిజంగానే చచ్చిపోయిన భార్య!
వరంగల్ జిల్లా: భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రిసోల్ గ్రామానికి చెందిన గుప్తేశ్వర్ బిష్యాన్కు అతడి మేనకోడలు మిల్లీ బిస్వాస్(21)తో ఈ ఏడాది జూన్ 14న పూరి జగన్నాథ దేవాలయంలో వివాహం జరిగింది. వివాహ అనంతరం ఆ దంపతులు వరంగల్కు వచ్చి గీసుకొండ మండలం ధర్మారం గ్రామంలో కిరాయికి ఉంటున్నారు. ఈక్రమంలో గుప్తేశ్వర్ అనుమానంతో తరచూ భర్యను వేధింపులకు గురి చేసేవాడు. దీనిపై ఈ నెల 8న మిల్లీ తన తల్లికి ఫోన్ చేసి తనను భర్త వేధిస్తున్నాడని, తనకు భార్య అవసరం లేదని, ఇంటి నుంచి వెళ్లిపోయవాలని లేదా చనిపోవాలని అంటున్నాడని ఏడుస్తూ చెప్పింది. దీంతో కుటుంబీకులు ధర్మారం చేరుకుని పరిశీలించగా భర్త వేధింపులతో మిల్లీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు గుప్తేశ్వర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఇదీ చదవండి: కరీంనగర్: నెలకు 8 లక్షల జీతం.. ఏరోస్పేస్ ఇంజనీర్ నిర్వాకం -
రైలు కిందపడి తండ్రి,కొడుకు ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న తండ్రీకొడుకులు.. కేసు ట్రయల్కు రావడంతో తమకు ఎలాగైనా శిక్ష తప్పదని భావించారు. ఈ క్రమంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిశెలపేటకు చెందిన దొంత మల్లేశ్ (52), అతని కుమారుడు నాగరాజు (32) ఇద్దరూ కలిసి 2024లో జయశంకర్ భూపాలపల్లిలో వీఆర్వోగా పనిచేసిన గుల్లకోట గ్రామానికి చెందిన మల్లేశ్ తోడళ్లుడు రమేశ్ను హత్యచేశారు. ఈ కేసులో ఇద్దరూ భూపాలపల్లి జైలుకు వెళ్లారు. భర్త, కుమారుడు జైలుకు వెళ్లడంతో మల్లేశ్ భార్య సువర్ణ అనారోగ్యానికి గురై అదే ఏడాది మృతి చెందింది. జైలు నుంచి బయటకు వచ్చిన తండ్రీ కొడుకులను ఎవరూ ఆదరించడం లేదు. దీంతో కొద్దిరోజులుగా వారు హైదరాబాద్లోని ఓ హోటల్లో పనిచేసుకుంటున్నారు. మరోవైపు హత్యకేసు ట్రయల్కు వచ్చింది. తమకు ఎలాగైనా శిక్ష పడుతుందని భావించిన తండ్రీ కొడుకులు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో నివాసముంటున్న మల్లేశ్ సోదరుడు శ్రీనివాస్ ఇంటికి శుక్రవారం వచ్చారు. శనివారం ఇంటి నుంచి బయలుదేరిన వారు ఆదివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ సమీపంలో కేరళ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని జీఆర్పీ ఎస్సై తెలిపారు. -
ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తొలిపూజ
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలిపూజ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్లు గవర్నర్కు స్వాగతం పలికారు.ఖైరతాబాద్లో ఈ ఏడాది (72వ సంవత్సరం) 69 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిని రూపొందించారు. మహాగణపతి ఎత్తు, వెడల్పును బట్టి ఆగమ శాస్త్రంలో సూచించిన విధంగా కంటి ఎత్తు, వెడల్పు కచ్చితమైన స్కేలు ప్రకారం తీర్చిదిద్ది కంటిపాపను అమరుస్తామని.. తద్వారా వినాయకుడు నలు వైపుల నుంచి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఉంటుందని శిల్పి రాజేంద్రన్ తెలిపారు.వినాయక చవితి సందర్భంగా నగరం పండగ కళను సంతరించుకుంది. గణనాథుడి పూజలతో భక్తులు తరించనున్నారు. కాగా.. పూజా సామగ్రి ధరలు చుక్కలనంటాయి. నగరంలోని బేగంబజార్, సుల్తాన్ బజార్, గోషామహల్, మెహిదీపట్నం తదితర మార్కెట్లలో గత ఏడాదితో పోలిస్తే అన్ని పూజా సామగ్రి ధరలు 40 నుంచి 50 శాతం పెరిగినట్లు ప్రజలు చెబుతున్నారు.సాధారణంగా రూ.500–600తో చిన్న పూజకయ్యే ఖర్చు ఈ ఏడాది కనీసం రూ.1,200 నుంచి రూ.1,500కు చేరిందని అంటున్నారు. పూలు, పండ్లతో పాటు గరిక, తమలపాకులు, అరటి ఆకులు, జిల్లేడు, మారేడు తదితరాల ధరలు పెరిగాయి. వినాయకుడికి నైవేద్యంగా పెట్టే మోదకాలు, స్వీట్లు, లడ్డూలకు డిమాండ్ పెరగడంతో ధరలు చుక్కలనంటాయి.ఇదీ చదవండి: ఎల్లలు లేని వినాయకుడు.. వివిధ దేశాల్లో.. -
టీ తాగుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు!
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని గంటల్లో దుబాయ్ వెళ్లాల్సిన ఆ యువకుడికి అదే చివరి ప్రయాణమైంది. విమానం ఎక్కేందుకు సిద్ధమవుతున్న కరీంనగర్కు చెందిన అజ్మల్.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. శంషాబాద్ కిషన్గూడా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సృష్టించిన బీభత్సం ఘటనలో ఇది చోటు చేసుకుంది. కరీంనగర్కు చెందిన అజ్మల్ దుబాయ్ ఫ్లైట్ కోసం ఎయిర్పోర్టుకు బయల్దేరాడు. దారిలో టీ కోసమని ఆ హోటల్ వద్ద ఆగాడు. ఆ సమయంలో ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చిన బస్సు అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడతను. బస్సు సరాసరి హోటల్లోకి దూసుకెళ్లడంతో అక్కడ ఉన్న పలువురు భయాందోళనకు గురయ్యారు.వెంటనే అజ్మల్తో పాటు మరో వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో 50 మందికిపైగా స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. అజ్మల్తో పాటు తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితీ విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన బస్సు.. సెవెన్హిల్స్ ట్రావెల్స్కు చెందిందిగా ధృవీకరణ అయ్యింది. ఈ ఘటనలో మూడు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాదం ధాటికి హోటల్ పరిసరాల్లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.ఓ కంటైనర్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. అయితే వేగంగా వస్తున్న ప్రైవేట్ టావెల్స్ బస్సు దానిని తప్పించబోయి హోటల్లోకి దూసుకెళ్లిందని తెలుస్తోంది. అయితే కొన్ని గంటల్లో దుబాయ్ విమానం ఎక్కాల్సిన అజ్మల్.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులు, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది.ఇదీ చదవండి: కొత్త కారుతో రోడ్డెక్కాలన్నా భయమేనా? -
ఆర్టీసీ బస్సులో మహిళల గొడవ.. వీడియో వైరల్
వికారాబాదు జిల్లా: వినాయక చవితి పండుగ సందర్భంగా మూడ్రోజుల పాటు సెలవులు ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు గొడవ పడ్డారు. ఓ మహిళపై మరో ముగ్గురు మహిళలు దాడి చేశారు. జుట్టు పట్టుకొని లాగి కొట్టారు. దీంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పండుగ నేపథ్యంలో రద్దీ ఉంటుందని తెలిసినా ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్య పెంచకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పరిగి డీఎం ఇసాస్ను వివరణ కోరగా గొడవ జరిగింది తమ డిపోకు చెందిన బస్సులో కాదని, ఘటన పరిగి పరిధిలో జరగలేదని తెలిపారు. ఫ్రీ బస్సులో సీట్ల కోసం లొల్లిపరిగి నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు pic.twitter.com/hxbzeT19Td— Telugu Scribe (@TeluguScribe) September 13, 2026ఇదీ చదవండి: దారుణం.. ఆర్టీసీ బస్సు మీద నుంచి పోవడంతో -
తెలంగాణలో వాన మోత.. ఈ 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ శాఖ రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు మరో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.రాత్రి దంచి కొట్టిన వానతెలంగాణ అంతటా గత రాత్రి భారీ వర్షాలు దంచి కొట్టాయి. హైదరాబాద్ సహా జనగామ, భద్రాద్రి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను ముంచెత్తాయి. కొడకంట్లలో 12 సెం.మీ, పాల్వంచలో 11.7 సెం.మీ. రామన్నపేట, దేవురుప్పలలో 10.8 సెం.మీల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్లోనూ ఈ వేకువ జాము నుంచి ఎడతెరిపి లేకుండా రెండు గంటల సేపు గట్టి వాన పడడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. -
HYD: క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తి హత్య.. రెండు కుటుంబాలను విషాదంలో ముంచింది. బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని సీబీఎన్ నగర్కు చెందిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు వివరాలు ఆరా తీయడానికి శనివారం సాయంత్రం పటాన్చెరు ఠాణాకు వెళ్లిన ఆయన బంధువు శ్యామ్ గుండెపోటుతో అక్కడిక్కడే చనిపోయారు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గురువారం రాత్రి అదృశ్యం.. ఖమ్మం జిల్లా పాతర్లపాడుకు చెందిన రాజశేఖర్ (32) నగరానికి వలసవచ్చి బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని సీబీఎన్ నగర్లో స్ధిరపడ్డారు. ఈయనకు భార్య లీల, ఎనిమిదేళ్ల లోపు వయసున్న కుమార్తెలు శ్రీనిధి, అనన్య ఉన్నారు. రాజశేఖర్కు రెండు కార్లు ఉండేవి. ఒకదాన్ని తాను నడుపుతూ.. మరో దాన్ని డ్రైవర్ ద్వారా నడిపిస్తున్నారు. రాజశేఖర్ సమీప బంధువు అశోక్ మూడు రోజుల క్రితం ఓ కారు ఖరీదు చేశారు. దీన్ని ప్రస్తుతం రాజశేఖర్ నడుపుతున్నారు. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబీకులు శుక్రవారం బేగంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహం, కారు వేర్వేరు చోట్ల.. సంగారెడ్డి జిల్లా కోహిర్లోని గోల్డెన్ దాబా సమీపంలో రాజశేఖర్ కారు పోలీసులకు లభించింది. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు అక్కడికి వెళ్లారు. రాజశేఖర్ కోసం పోలీసులు, కుటుంబీకులు, స్నేహితులు వెతికారు. శుక్రవారం అర్ధరాత్రి రుద్రారం శివారులోని చెట్ల పొదల్లో రాజశేఖర్ మృతదేహం లభించింది. హతుడి సోదరుడు రాంబాబు ఫిర్యాదుతో పటాన్చెరు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రాజశేఖర్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. బెల్ట్ వంటి దాంతో మెడకు ఉరి బిగించి చంపినట్లు నిర్ధారించారు ఠాణాలో కుప్పకూలిన బంధువు.. కేసు పూర్వాపరాలు, దర్యాప్తు అంశాలను ఆరా తీయడానికి రాజశేఖర్ బంధువులు, స్నేహితులు శనివారం సాయంత్రం పటాన్చెరు ఠాణాకు వెళ్లారు. అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడుతున్న సమయంలో హతుడి సమీప బంధువు శ్యామ్ గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో అటు రాజశేఖర్, ఇటు శ్యామ్ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకొన్నాయి. కారు కోసమే ఘాతుకమా? ప్రాథమిక ఆధారాలను బట్టి రాజశేఖర్ నడుపుతున్న కారు కోసమే ఆయన హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ప్యాసింజర్ల మాదిరిగా కారు బుక్ చేసుకుని, ఆపై వెనుక సీటు నుంచి మెడకు బెల్టు బిగించి చంపేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా.. కారు మరమ్మతులకు లోనుకావడంతోనే అక్కడ వదిలేసి పారిపోయినట్లు భావిస్తున్నారు. ఇదీ చదవండి: నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం -
నార్సింగి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం
గ్రేటర్ పరిధిలో జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. మిత్రుడి పుట్టిన రోజు వేడుకకు స్నేహితులతో కలిసి ఆనందంగా వెళ్లి వస్తుండగా కారు అదుపు తప్పడంతో ఇంటర్ విద్యార్థి అసువులు బాశాడు. మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన కోకాపేటలో చోటుచేసుకోగా.. రోడ్డు పక్కన స్తంభాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ బాలుడు దుర్మరణం చెందిన మరో ఘటన అత్తాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. కీసర ఓఆర్ఆర్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా, రాంగ్రూట్లో వచ్చిన ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు మృత్యువాత పడిన ఘటన ఎల్బీనగర్ పరిధిలో జరిగింది. హైదరాబాద్: కూకట్పల్లికి చెందిన మదన్మోహన్ రెడ్డి (17) ఇంటర్ విద్యార్థి. మిత్రుడి పుట్టి న రోజు వేడుకల కోసం శనివారం రాత్రి మరో స్నేహితుడికి చెందిన కారు తీసుకుని వెళ్లాడు. వేడుకల అనంతరం కోకాపేట వైపు వెళ్లి వద్దామంటూ స్నేహితులతో కలిసి ఇన్నోవా కారులో బయలుదేరారు. కోకాపేట నియోపోలిస్ వ్యూపాయింట్ వద్ద తెల్లవారు జామున కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న మదన్మోహన్రెడ్డి డోరులో నుంచి బయటికి వచ్చి పక్కనే ఉన్న స్తంభానికి తగలటంతో తలకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులు మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నాయని కోకాపేట సెక్టార్ ఎస్సై మహేందర్, నార్సింగి ఇన్స్పెక్టర్ డి. విష్ణువర్ధన్రెడ్డి చెప్పారు. స్తంభాన్ని బైక్ ఢీకొని.. వేగంగా దూసుకు వచ్చిన ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టిన దుర్ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో మైనర్కు గాయాలయ్యాయి. ఈ ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. కార్వాన్ మొగల్ నగర్కు చెందిన పదో తరగతి విద్యార్థి (14), అదే ప్రాంతానికి చెందిన మరో బాలుడితో కలిసి ద్విచక్ర వాహనంపై కార్వాన్ నుంచి హైదర్గూడ వెళ్తున్నారు. వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డుపక్కన ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని ఇన్స్పెక్టర్ సీతయ్య తెలిపారు. రాంగ్ రూట్లో వచ్చి.. ద్విచక్ర వాహనంపై రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టడంతో బాలుడు చనిపోగా, మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మలక్పేటకు చెందిన సయ్యద్ మాజ్ హుస్సేన్ (16), నారాయణగూడకు చెందిన హంజాలా, న్యూ మలక్పేటకు చెందిన అలీఖాన్ స్నేహితులు. ముగ్గురు కలిసి ఆదివారం తెల్లవారు జామున నమాజు కోసం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఉదయం 6.30 గంటలకు ఎల్బీనగర్ చౌరస్తా సితార హోటల్ వద్ద రాంగ్ రూట్లో వచ్చి డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. సయ్యద్ మాజ్ హుస్సేన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగతా ఇద్దరు స్నేహితులు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి : ముందే పక్కా ప్లాన్.. హోటల్ గదిలో దారుణం -
కొత్త కారును అడ్డగించి రూ.2 లక్షలు డిమాండ్!
బంజారాహిల్స్: కొత్తగా కొన్న కారును అడ్డుకుని రూ.2 లక్షలు డిమాండ్ చేసిన ట్రాన్స్జెండర్లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45లో రెండు వారాల క్రితం నలుగురు ట్రాన్స్జెండర్లు కొత్త కారును అడ్డగించి అందులోని వ్యక్తి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ‘ఎక్స్’లో వీడియో పోస్ట్ అయ్యింది. ఈ వీడియో ఆధారంగా విచారణ చేపట్టగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. BMW owner harassed by transgenders in Hyderabad, demanding 2 lakh rupees after new car was delivered pic.twitter.com/zVFXKdbJh8— Mogambo (@Netajinonsense1) September 11, 2026 ఇదీ చదవండి: రెమ్యునరేషన్పై సింగర్ జంగి రెడ్డి స్పష్టత ఇదే.. -
శంషాబాద్లో బస్సు బీభత్సం.. హోటల్లోకి దూసుకెళ్లి..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ కిషన్గూడ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. హోటల్లోకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దూసుకెళ్లింది. ఎదురుగా కంటైనర్ రావడంతో అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు.. డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్ పోల్ను ఢీ కొడుతూ ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. పార్కింగ్ చేసి ఉన్న కార్లను బైక్ను ఢీకొడుతూ దూసుకెళ్లింది.ప్రమాదంలో బస్సు డ్రైవర్తో సహా పలువురు గాయపడ్డారు. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మృతుడిని కరీంనగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దుబాయ్కి వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వెళ్తూ మధ్యలో టీ తాగడం కోసం హోటల్ దగ్గర ఆగిన అజ్మల్.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అజ్మల్ మృతి చెందారు.ఇదీ చదవండి: వినాయక చవితి వేళ.. విజృంభించిన వరుణుడు -
ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్పై తెగిపడ్డ విద్యుత్ తీగలు
సాక్షి, హైదరాబాద్: మౌలాలి దగ్గర ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్పై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అప్రమత్తమైన లోకోపైలట్ రైలును వెంటనే నిలిపివేశారు. భారీ శబ్దాలు ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రయాణికులు.. రైలు దిగి పరుగులు తీశారు. రైలు విజయవాడ నుంచి సికింద్రాబాద్కు వస్తుండగా ఈ ఘటన జరిగింది.ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ తీగలను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. అనంతరం ప్రయాణికులను అదే రైలులో సికింద్రాబాద్కు తరలించారు. ఈ ఘటనపై రైల్వే, విద్యుత్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగానే విద్యుత్ తీగలు తెగిపడినట్లు అధికారులు నిర్థారించారు. -
ఖైరతాబాద్ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)
-
వినాయక చవితి వేళ.. విజృంభించిన వరుణుడు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి వేళ వరుణుడు విజృంభించాడు. అల్పపీడన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో గత రాత్రి నుంచి వానలు దంచి కొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో అధికార యంత్రాంగాలు అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్లు జారీ చేశాయి.తెలంగాణలో అర్ధరాత్రి దాటాక గట్టి వానలు కొడుతున్నాయి. ఇటు రాజధాని హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గల్లీలు, రహదారులు జలమయం అయ్యాయి. ఇవాళ, రేపు పలు జిల్లాలోనూ భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.అటు ఏపీలోనూ అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఎన్టీఆర్, మన్యం, అల్లూరి పోలవరం, కాకినాడ, గుంటూరు, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇంకా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. -
హైదరాబాద్లో వినాయక చవితి సందడి (ఫోటోలు)
-
ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!
హైదరాబాద్: ఓ మేనమామే ఆరేళ్ల వ యసున్న కోడలిపై అఘాయిత్యానికి ఒ డిగట్టాడు. కుము రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆల స్యంగా ఆదివారం వెలుగు లోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ రాఖీ పండుగకు తన ఆరేళ్ల కూతురును తీసుకుని కాగజ్నగర్ పట్టణంలోని తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చింది.ఈ సమయంలో కూతురు అమ్మమ్మ దగ్గర ఉంటానని మారాం చేయడంతో అక్కడే వదిలి వెళ్లింది. అయితే బాలిక మేనమామ అయిన శశిధర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శశిధర్కు వివాహమైనా భార్య పుట్టింట్లోనే ఉంటోంది.మూత్రం ఆగిపోవడంతో..ఐదు రోజులుగా బాలికకు మూత్రం రాకపోవడంతో కడుపు ఉబ్బిపోయింది. రెండు రోజుల క్రితం బాలిక అమ్మమ్మ తన కూతురుకు సమాచారం ఇచ్చింది. దీంతో తల్లి పుట్టింటికి వెళ్లి కూతురును తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు పరీక్షలు చేసి బాలికపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. సోదరుడిపైనే అనుమానం వచ్చిన తల్లి పుట్టింటికి వెళ్లి రోదిస్తూ తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ విషయం స్థానిక కౌన్సిలర్, కాలనీ పెద్దలకు ఆదివారం తెలిసింది.కాలనీలో విషయం వ్యాపించడంతో కాలనీ వాసులు నిందితుడి ఇంటిని చుట్టుముట్టారు. మానవ మృగాన్ని ప్రజల మధ్యలోనే శిక్ష విధించాలని ఆందోళన చేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేమ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు గంటల తర్వాత పోలీసులు నిందితుడిని ద్విచక్రవాహనంపై పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లో జోరుగా వాన -
అవకతవకలకు తావు లేదు
నాగోజు సత్యనారాయణపోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైళ్లశాఖల్లో పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా చేపడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సాంకేతికతను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీల్లో గ్రూపుల వారీగా రిజర్వేషన్లను మొట్టమొదటిసారిగా పోలీస్ రిక్రూట్మెంట్లో అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. పోలీస్ ఉద్యోగాలకు పోటీపడుతున్న దరఖాస్తుదారుల్లో ప్రతి నలుగురిలో ఒకరు మహిళా అభ్యర్థే అని తెలిపారు. మహిళా కోటాలోనూ పోటీ పెరిగిందన్నారు. ఇటీవల 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. బోర్డు ఈ నెల 16 వరకు దరఖాస్తులకు గడువు పెంచింది. ఈ నేపథ్యంలో పోలీస్ నియామక ప్రక్రియ, సిలబస్, పరీక్ష విధానం, సాంకేతికత వినియోగం తదితర అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వీవీ శ్రీనివాసరావు ఆ వివరాలు వెల్లడించారు. ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు జరుగుతున్న దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ?పోలీస్ ఉద్యోగాల ఎంపికలో రెండు దశల్లో రాత పరీక్షలు ఉంటాయి. లీకేజీకి ఆస్కారం లేకుండా గత రిక్రూట్మెంట్ల కంటే మరింత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పారదర్శకత విషయంలో 40 ఏళ్లుగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ప్రత్యేక చరిత్ర ఉంది. ఇతర రాష్ట్రాల రిక్రూట్మెంట్ బోర్డులు సైతం మన విధానాలు అనుసరిస్తున్నాయి. పేపర్ లీకేజీని అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకుంటామన్నది గోప్యత పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అంశంపై ఇంతకంటే లోతుగా వివరాలు చెప్పడం సరికాదు. ఈసారి సిలబస్లో ఏమైనా మార్పులు చేశారా?మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా 2022 రిక్రూట్మెంట్లోనే సిలబస్లో మార్పులు చేశాం. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి సిలబస్లో ఎలాంటి పెనుమార్పులు లేవు. ఈ నోటిఫికేషన్లో ఆధార్ అథెంటికేషన్ తీసుకోవడానికి కారణం ?పోలీస్ రిక్రూట్మెంట్ ప్రిలిమ్స్, దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్ ఎగ్జామ్. ఇలా మూడు అంచెల్లో చేయాల్సి ఉంది. ఒక అభ్యర్థి బదులు నకిలీ అభ్యర్థి రాకుండా నిరోధించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్ కోసం ఈసారి దేశంలోనే తొలిసారి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధార్ అథెంటికేషన్ను వాడబోతోంది. ఈసారి అన్ని పోస్టులకు కలిపి ఎంత మంది దరఖాస్తు చేసే అవకాశముంది? ఇటీవల చేసిన పోలీస్ టెరిటరీల పునర్విభజనపై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాని కారణంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి పరిధిలో ఖాళీలను ఈ నోటిఫికేషన్లో చేర్చలేదు. అందుకే గత రిక్రూట్మెంట్తో పోలిస్తే ఈసారి దాదాపు 40 నుంచి 50 శాతం పోస్టులు ఈ నియామక ప్రక్రియ పరిధిలోకి రాలేదు. గతంతో పోలిస్తే కొన్ని విభాగాలు సైతం తగ్గాయి. కాబట్టి ఈసారి సుమారు నాలుగు లక్షల మంది దరఖాస్తు చేయొచ్చని అంచనా వేస్తున్నాం. ఈ నోటిఫికేషన్లో కీలకమైన మార్పులేంటి?అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో మొట్టమొదటిసారి అన్ని పోస్టుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. ఈ రెండు శాఖల్లో ఇప్పటి వరకు మహిళా ఉద్యోగులు లేరు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి పెంపు మరో కీలక అంశం. కానిస్టేబుల్కు 34 ఏళ్లు, ఎస్ఐకు 37 ఏళ్ల వరకు దరఖాస్తు అర్హత వచ్చింది. ప్రిలిమినరీ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు క్వాలిఫై మార్కునే హోంగార్డులకు వర్తింపజేస్తూ మరో కీలక నిర్ణయం ఉంది. పోలీస్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసేవారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ?పోలీస్ నియామకాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేదు. అభ్యర్థి వారీగా అన్ని దశల్లో వివరాలు వారికి పీడీఎఫ్ రూపంలో అందజేస్తాం. దళారులను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచిస్తున్నాం. పోలీస్ ఉద్యోగాలిస్తామని మోసగించే దళారులు, మోసగాళ్లను పట్టించినవారికి రూ.5 లక్షల నగదు బహుమతి బోర్డు తరఫున ఇస్తామని ప్రకటిస్తున్నాను.గత రిక్రూట్మెంట్తో పోలిస్తే పీఎంఈ, పీఈటీ పరీక్షల్లో ఏమైనా మార్పులు చేశారా? ఫిజికల్ టెస్ట్లో పారదర్శకతకు సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నారా?గత రిక్రూట్మెంట్తో పోలిస్తే శారీరక కొలతల పరీక్షలు (పీఎంటీ), శారీరక దారుఢ్య పరీక్షలు (పీఈటీ)ల్లో ఎలాంటి మార్పులు లేవు. దేహ దారుఢ్య పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా మైదానంలోకి వెళ్లే ముందే అభ్యర్థుల చేతికి రిస్ట్ బ్యాండ్ వేస్తాం. ఆ అభ్యర్థి ఎక్కడ ఉన్నా, అతడి వివరాలు నమోదవుతాయి. ఒకరి బదులు మరొకరు ఈవెంట్స్లో పాల్గొనలేరు. పరుగుపందెంలో కచ్చితమైన సమయం గుర్తించేలా ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) సాంకేతికత, ఎత్తును కొలిచేందుకు డిజిటల్ మెజర్మెంట్తోపాటు టేప్ వాడడం. ఈ మొత్తం ప్రక్రియ నమోదుకు సీసీటీవీ కెమెరాల వినియోగం..ఇలా అవకాశమున్న అన్ని అంశాల్లో సాంకేతికత వినియోగం పెంచాం.పరిగెట్టు.. జాబ్ కొట్టు..పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడటంతో పాటు, వయో పరిమితి పెంచడంతో నల్లగొండ నాగార్జున కళాశాల మైదానంలో తెల్లవారు జామున రన్నింగ్, లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తున్న అభ్యర్థులు– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
77% నోటీసుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్)–2026లో భాగంగా ఆదివారం నాటికి 77 శాతం నోటీసుల పంపిణీ పూర్తికాగా, నోటీసులు అందుకున్న/అందుకోనున్న మొత్తం ఓటర్లలో 25శాతం మంది విచారణ ప్రక్రియ సైతం పూర్తయింది. సర్లో భాగంగా ఇటీవల 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా, వారిలో 92,88,164 మంది అన్మ్యాప్డ్, అనామలీస్ గల ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించే ప్రక్రియ కొనసాగుతోంది. ‘సర్’లో సాధించిన పురోగతిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం రూపొందించిన రోజువారీ నివేదిక ప్రకారం..ఆదివారం సాయంత్రం 4 గంటల నాటికి 100 శాతం నోటీసుల ప్రచురణ పూర్తయింది. ఇందులో 72,01,011 మంది (77.52%) ఓటర్లకు నోటీసుల పంపిణీ పూర్తి కాగా, మరో 20,87,153 మంది ఓటర్లకు నోటీసుల పంపిణీ చేయాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో 23,31,073 (25%) మందివి ఓటర్ల విచారణ పూర్తి చేశారు. నోటీసుల మీద ముద్రించిన తేదీన ఓటర్లు విచారణకు హాజరు కావాల్సి ఉండగా, వివిధ కారణాలతో 47,57,427 మంది విచారణ తేదీల గడువు ముగిసిపోయింది. దీంతో వీరి విచారణ తేదీలను రీషెడ్యూల్ చేసి కొత్త తేదీలను ఇవ్వనున్నారు. ఇప్పటికే 50,526 మంది ఓటర్లకు కొత్త విచారణ తేదీలు ఇచ్చారు. కలెక్టర్లకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన బాధ్యత ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు నిజమైనవా? కావా? అని నిర్ధారించడానికి వాటిని జిల్లా కలెక్టర్లకు పంపిస్తున్నారు. సర్ ప్రక్రియ ప్రస్తుత దశలో సంబంధిత నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్వో)దే అంతిమ నిర్ణయం. వారు ఆమోదించిన పేర్లను నవంబర్ 9న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో ఉంటాయి. వీరు అనర్హులుగా తేల్చిన ఓటర్ల పేర్లను అందుకు గల కారణాలతో తొలగించిన ఓటర్ల జాబితాలో ముద్రిస్తారు. తొలగించిన ఓటర్లు తదుపరి దశలో జిల్లా కలెక్టర్కు, అక్కడా తిరస్కరిస్తే ఆ తర్వాతి దశలో సీఈఓకు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, తొలి అప్పీల్ దశకు ముందే ధ్రువీకరణ పత్రాల పరిశీలన అధికారం కలెక్టర్లకు అప్పగించడం గమనార్హం. ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువీకరణ పత్రాలను సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయగానే వాటిలో నిజమైనవా? కావా? ధ్రువీకరించాల్సిన అవసరం ఉన్న పత్రాలను ఈఆర్వోలు కలెక్టర్లకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు కలెక్టర్లు 2,66,718 ఓటర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించగా, మరో 7,48,487 మంది ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది.ఇప్పటి వరకు 1,524 మంది అనర్హులు సర్లో భాగంగా ఇప్పటి వరకు 23,31,073 మంది ఓటర్ల విచారణకు హాజరై తన వద్ద ఉన్న ధ్రువీకరణ పత్రాలను రుజువులుగా సమర్పించగా, వారిలో 13,69,023 మంది ఓటర్లు అర్హులని తేల్చారు. విచారణ అనంతరం రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1,524 మంది ఓటర్లను అనర్హులుగా గుర్తించారు. మిగిలిన ఓటర్ల అర్హతలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. పరిశీలనలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన ఓటర్లను అనర్హులుగా తేల్చుతున్నారు. -
వైశ్యుల శ్రేయోభిలాషిని
ఉప్పల్(హైదరాబాద్): ‘ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవారు. చాలామంది పేదలున్నా, ఆత్మగౌరవం కోసం పేదలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్ట పడరు’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి రేవంత్రెడ్డి మాట్లాడుతూ కష్టాలు, బాధలు ఉన్నా సమాజంలో గౌరవం కోసం జీవించేవారు ఆర్య వైశ్యులని, తానెప్పుడూ వారి శ్రేయోభిలాషినేనని చెప్పారు. ప్రపంచంలో ఉన్నవి రెండే వృత్తులని అవి వ్యవసాయం, వ్యాపారాలేనన్నారు. మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి నుంచి మొదలు కోట్ల విజయభాస్కర్రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు గల్లాపెట్టె నిర్వహణ బాధ్యతను ఆర్యవైశ్యులకే అప్పగించారని గుర్తు చేశారు. జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పాటు అయ్యేనాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఉందంటే ఆనాటి ఆర్థికమంత్రి రోశయ్యే కారణం అన్నారు. శాసనమండలిలో దూకుడుగా తాను మాట్లాడితే రోశయ్య నన్ను పిలిచి ఆవేశం తగ్గించుకొని అనుభవంతో ముందుకు వెళ్తే పైకి వస్తావని ఆశీర్వదించారన్నారు. రోశయ్య విమర్శించే వారు కాదు..తిట్టేవారు కాదు..చురకలు వేసేవారు అని చెప్పారు. రాష్ట్రం విడిపోయినా రోశయ్య గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ స్థాయి నాయకుడు ఒకే ఒక్కరు మహాత్మాగాంధీప్రపంచస్థాయి నాయకుడు ఒకే ఒక్కరు మహాత్మాగాంధీ అని, ఏ దేశం పోయినా ఆయన గొప్పతనం తెలియనివారు ఉండరని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదిగిన ఆర్యవైశ్య బిడ్డ మహాత్మాగాంధీ అన్నారు. మహాత్మాగాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం గర్వ కారణమని చెప్పారు. పొట్టి శ్రీరాములు పోరాటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. దేశ సమగ్రత కోసం మహాత్మాగాంధీ ప్రాణాలు ఇస్తే, పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, మాజీమంత్రి టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బండారి లక్ష్మారెడ్డి, ప్రకాశ్గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, నవీన్యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, మాజీఎంపీ మధు యాష్కీ, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ పరమేశ్వర్రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐ.. రాక్షసి!!
న్యూయార్క్/సాక్షి, హైదరాబాద్: అనూహ్య వేగంతో సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్న కృత్రిమ మేథ (ఏఐ)కు కళ్లెం వేయాల్సిన సమయమొచ్చిందని కృత్రిమ మేథ (ఏఐ) దిగ్గజ సంస్థ ఆంథ్రోపిక్ సీఈఓ డారియో ఆమోడెయ్ వ్యాఖ్యానించారు. ఫార్చూన్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డారియో పలు ఆందోళకర అంశాలను పంచుకున్నారు. ‘‘ఏఐ అమితమైన వేగంతో శక్తిసామర్థ్యాలను పెంచుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దంలోగా యావత్ మానవాళిని ఇది హరించేస్తుంది. ఇప్పటికైనా ఏఐ నిపుణులు, ప్రభుత్వాలు, పౌరసమాజం మేల్కొని ఏఐకు కళ్లెం వేయాలి. భద్రతా ప్రమాణాల మెరుగుకు కృషిచేయాలి’’ అని అన్నారు. ఏఐను నియంత్రించపోతే అది మనందర్నీ చంపేస్తుందని ఆంథ్రోపిక్ నుంచి వైదొలగిన ఏఐ శాస్త్రవేత్త జాకబ్ కోక్సన్ ఇటీవల వ్యాఖ్యానించిన వేళ అదే తరహాలో డారియో ఆమోడెయ్ మాట్లాడటం గమనార్హం. ‘‘ఎప్పటికప్పుడు ఏఐ సరైన మార్గంలో వెళ్తుందో లేదో ఓ కంట కనిపెట్టే భద్రతావ్యవస్థను మెరుగుపరచాలి. లేదంటే మానవాళికి ముప్పు తప్పదు. ఏఐలో వస్తున్న పెను మార్పులను అడ్డుకోకపోతే వచ్చే 12 నెలల్లోగా యావత్ ప్రపంచ ఇంటర్నెట్ను అది గుప్పిటపట్టేస్తుంది. తమను తాము మెరుగుపరుచుకునే సామర్థ్యం ఏఐ వ్యవస్థల్లో పెరుగుతోంది. ఇది అత్యంత ప్రమాదం’ అని డారియో ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐను అడ్డుకోవడం అంటే దానిని పూర్తిగా నిలిపేయడంకాదు. ఏఐలో సేఫ్టీ రీసెర్చ్, టెస్టింగ్, పర్యవేక్షణ ఖచ్చితంగా మెరుగుపడాలి. శాస్త్రవేత్తలు అర్థంచేసుకోలేనంత స్థాయికి ఏఐ తనకుతానుగా వృద్ధి చెందకుండా అడ్డుకోవాల్సిందే’’ అని అన్నారు.వంతపాడిన మస్క్, ఆల్ట్మన్డారియో అభిప్రాయంతో ఏఐ దిగ్గజ సంస్థల చీఫ్లు సైతం ఏకీభవించారు. సూపర్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సిస్టమ్లతో ప్రమాదం పొంచి ఉందని ఓపెన్ ఏఐ చీఫ్ శామ్ ఆల్ట్మన్, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ అన్నారు. ‘‘ఏఐ అనేది మన చేతి దాటిపోతే అదుపుచేయడం చాలా కష్టం. అప్పుడు దుర్వినియోగం అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ. క్షిపణుల తయారీ, జీవఆయుధాలు, సైబర్ దాడులు వంటి రహస్యాలన్నీ ఉగ్రసంస్థలు, హ్యాకర్ల చేతికొచ్చే ప్రమాదముంది. అప్పుడు మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. డెవలప్ తరహాలో ఇతరులకూ ఏఐను అడ్డుకునే అవకాశం ఉండాలి’’ అని ఆల్ట్మన్, మస్క్ వ్యాఖ్యానించారు.ఏఐ భద్రతా పరిశోధకుల మాట ఇదీ..ఏఐ శక్తిసామర్థ్యాలు పెరిగితే అది మానవాళిని నేరుగా నాశనం చేసే అవకాశం ఉండదని ఏఐ భద్రతా పరిశోధకులు చెబుతున్నారు. అయితే మానవ ప్రయోజనాలకు అనుగుణంగా లేని లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా ఏఐ వ్యవస్థలు మానవుల కంటే చాలా ఎక్కువ సామర్థ్యాన్ని సాధించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే ఏఐ వ్యవస్థలు సిస్టమ్లను హ్యాక్ చేసే స్థాయికి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. బయో వెపన్లు, సైబర్ దాడులతో పవర్ గ్రిడ్లను దెబ్బతీయాలనుకొనే వారికి ఏఐ వ్యవస్థలు సాంకేతికంగా కొంత మేర దోహదపడే ప్రమాదం ఉందంటున్నారు. -
ప్రపంచాన్ని చుట్టేసిన వినాయకుడు
సాక్షి, అమరావతి: వినాయకుడు.. ప్రపంచాన్ని చుట్టేసిన ఆరాధ్యదైవం. వినాయకచవితి సందర్భంగా మనదేశంలో పల్లె నుంచి మహానగరం వరకు సందడి కనిపిస్తే.. విదేశాల్లోనూ భారతీయులు, హిందూ సమాజాల ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పండగ నిర్వహిస్తున్నారు. భక్తి, కళ, వ్యాపారం.. ఈ మూడు కలిసిన భారీపండగగా గణపతి ఉత్సవం మారింది. అయితే ఈ పండగకు జరిగే వ్యాపారం మామూలుగా ఉండదు. దేశవ్యాప్తంగా వేలకోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. గణనాథుడికి ఘనంగా ఉత్సవం జరపడం కోసం భక్తులు ఇష్టంగా ఈ ఖర్చు చేస్తున్నారు. ఈ వివరాలను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఒక నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. పలురంగాలకు ఆదాయం దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల గణేశ్ మండపాలు ఏర్పాటవుతున్నాయి. మండపాల ఏర్పాటు, అలంకరణ, పూజాసామగ్రి, కార్యక్రమాలు, ఆహారం, రవాణా, పూలు, స్వీట్లు.. ఇలా అనేక రంగాలకు ఈ పండగ ఆదాయాన్ని తెస్తోంది. గతేడాది గణేశోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.30 వేలకోట్ల వరకు వ్యాపారం జరిగిందని అంచనా. ఈ ఏడాది అది రూ.45 వేలకోట్లకు చేరే అవకాశం ఉంది. అంతకుముందు 2024లో రూ.25 వేలకోట్లకు పైగా వ్యాపారం జరిగింది. గతేడాది మండపాలు, అలంకరణ, పూజాసామగ్రి కోసం దాదాపు రూ.12 వేలకోట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్కు సుమారు రూ.5 వేలకోట్లు ఖర్చుచేశారు. ఆహారం, స్వీట్లు, ముఖ్యంగా మోదకాలకు సంబంధించి దాదాపు రూ.2,400 కోట్ల వ్యాపారం జరిగింది. బంగారం, వెండి తదితరాలకు సుమారు రూ.వెయ్యికోట్ల మేర డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్కెట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వినాయకచవితి పండగకు ప్రత్యేకస్థానం ఉంది. ఏటా ఒక్కో రాష్ట్రంలో సుమారు రెండులక్షల మండపాలు ఏర్పాటవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఒక్క విజయవాడలోనే కుటుంబాలు సాధారణంగా రూ.1,000–రూ.2,000 వరకు పూజాసామగ్రిపై, మండప నిర్వాహకులు రూ.50 వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చుచేస్తున్నట్లు స్థానిక మార్కెట్ నివేదికలు చెబుతున్నాయి. కొన్ని పెద్దమండపాల అలంకరణకే రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతోంది. మహారాష్ట్ర గణేశోత్సవానికి కేంద్రబిందువు. అక్కడ 7 లక్షలకుపైగా మండపాలుంటాయని అంచనా. రాయ్గఢ్లోని పెన్ ప్రాంతం గణేశ విగ్రహాల తయారీకి ప్రసిద్ధి. అక్కడ సుమారు 600 వర్క్షాప్లలో ఏడాదికి 10 లక్షల విగ్రహాలు తయారవుతుండగా దాదాపు 2.5 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. ఈ ఒక్క ప్రాంతం విగ్రహ పరిశ్రమ వార్షిక టర్నోవర్ సుమారు రూ.200 కోట్లు. విగ్రహ తయారీదారులు, రంగులు వేసేవారు, అలంకరణ కారి్మకులు, విద్యుత్ సిబ్బంది, పూల వ్యాపారులు, పూజాసామగ్రి విక్రేతలు, స్వీట్ షాపులు, క్యాటరింగ్, రవాణా, డీజేలు, సౌండ్సిస్టమ్, భద్రతా సిబ్బంది.. ఇలా భారీసంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి ఈ పండగతో ముడిపడి ఉంది. విగ్రహాల తయారీలో వందలాదిమంది కళాకారులు, కార్మికులకు ఉపాధి లభిస్తోంది.విదేశాల్లోనూ బొజ్జగణపయ్య సందడి మారిషస్, ఫిజీ, మలేసియా, సింగపూర్, నేపాల్, ఇండోనేషియా వంటి దేశాల్లో వినాయకచవితి ప్రత్యేకంగా జరుగుతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆ్రస్టేలియాల్లోను ఆలయాలు, భారతీయ సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియాలోని బాలిలో గణేశుడిని జ్ఞానం, కళలకు ప్రతీకగా భావిస్తారు. ఆగ్నేయాసియాలో అయితే గణేశుడి ఆరాధనకు శతాబ్దాల చరిత్ర ఉంది. థాయ్లాండ్లో ‘ఫ్రా ఫికానెట్’గా పూజిస్తారు. జపాన్లో ‘కాంగితెన్’ పేరుతో ప్రత్యేక రూపంలో గణేశుడిని ఆరాధించడం ఆశ్చర్యం కలిగించే విషయం. అమెరికా నుంచి ఆ్రస్టేలియా వరకు భారతీయ సమాజాల భాగస్వామ్యంతో గణేశోత్సవం విస్తరిస్తుండటం.. వినాయకుడి భక్తి విశ్వవ్యాప్తమని చాటుతోంది. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్త దారుణహత్య
కందనూలు: వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తమ బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిన ఉదంతం తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లికి చెందిన మహమ్మద్ కరీం (43), సలీమాబేగం నాగర్కర్నూల్లో నివాసం ఉంటున్నారు. సలీమాబేగం తనకు మరిది వరుసైన నాగపూర్ గ్రామానికి చెందిన గౌస్పాషాతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీన్ని గుర్తించిన కరీం తన భార్యను మందలించగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో 9న వాట్సాప్ కాల్లో రాత్రికి కరీంను చంపుతానని సలీమాబేగంకు గౌస్పాష చెప్పాడు. పదునైన కత్తి, చేతి గ్లౌజులు తీసుకొని రాత్రి 2.30 గంటల సమయంలో గౌస్పాష.. కరీం ఇంటికి వెళ్లి నిద్రలేపాడు. నిద్రమత్తులో ఉన్న కరీం డోర్ తీయగా కత్తితో గౌస్పాష అతనిపై దాడి చేసి చంపి పరారయ్యాడు. -
మ్యాపింగ్ చేయలేదా.. సాఫ్ట్వేర్ లోపమా?
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(సర్)–2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారంలో ఓటర్లు.. సర్–2002 ఓటర్ల జాబితాలోని తమ/తమ బంధువుల ఓటు వివరాలను నమోదు చేస్తే సరిపోతుంది..ఆపై వారు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం పదేపదే పేర్కొంది. ‘సర్’రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు సైతం ఇదే హామీ ఇచ్చింది. మరోవైపు ఎన్యూమరేషన్ ఫారంలో సర్–2002 జాబితాలోని వివరాలు ఇచ్చినా, పెద్ద సంఖ్యలో ఓటర్లను అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాపింగ్ చేసుకునే అవకాశం లేదని బీఎల్ఓలు చెప్పడంతో ఓటర్లు విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది. సర్–2026లో భాగంగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో 2,64,87,213 మంది ఓటర్లు ఉండగా, వారిలో 92,87,577 మంది (35.06%) ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించే ప్రక్రియ కొనసాగుతోంది. నిర్లక్ష్యమా...లేకపోతే... చివరిసారిగా 2002లో ‘సర్’నిర్వహించి రూపొందించిన ఓటర్ల జాబితాలో తమ పేరు/తల్లిదండ్రుల పేరు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్టు ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉండగా, 32,36,659 మంది ఓటర్లు ఈ వివరాలు ఇవ్వకపోవడతో వారిని అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నట్టు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. ఇక ఫారంలో సర్–2002 వివరాలను నమోదు చేసినా, ప్రస్తుత ఓటు వివరాలతో పోలిస్తే వ్యత్యాసాలుండడంతో మరో 60,50,918 మంది ఓటర్లకు సైతం నోటీసులు జారీ చేస్తున్నారు. చాలామంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలో సర్–2002 ఓటు వివరాలను ఇచ్చినా వారిని అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి నోటిసులిస్తుండడంతో ‘సర్’ప్రక్రియలో తీవ్ర లోపాలను ఎత్తిచూపుతోంది. ఎన్యూమరేషన్ ఫారంలో ఓటర్లు ఇచ్చిన వివరాల ఆధారంగా ప్రస్తుత ఓటర్ల జాబితాలోని పేరును సర్–2002 ఓటర్ల జాబితాలోని పేరుతో అనుసంధానం (మ్యాపింగ్) చేయాల్సి ఉండగా, పెద్ద సంఖ్యలో ఓటర్లను మ్యాపింగ్ చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో సర్–2026 ప్రక్రియ ప్రారంభానికి కొన్ని నెలల ముందే..ముందస్తు సన్నాహకంగా మ్యాపింగ్ ప్రక్రియను ఈసీ చేపట్టగా, తమ పేర్లను మ్యాపింగ్ చేయాలని అప్పట్లోనే స్థానిక బూత్ స్థాయి అధికారుల (బీఎల్వో)కు చాలామంది ఓటర్లు అందజేశారు. ఆ తర్వాత ఎన్యూమరేషన్ ఫారంలో సైతం సర్–2002 జాబితాలోని వివరాలను అందజేశారు. అయినా, తమను అన్మ్యాప్డ్ ఓటర్లుగా గుర్తించి ఈసీ నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాలతో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారని సామాజిక మాధ్యమాల వేదిక ఓటర్లు ఆరోపిస్తున్నారు. బీఎల్ఓలు/ బీఎల్ఓ సూపర్వైజర్లు/ఈఆర్వోల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందా? లేక సాఫ్ట్వేర్ లోపాలతో జరిగిందా? అనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో ఇలాంటి ఉదంతాలు బయటకు వస్తున్నాయి. ఎల్బీనగర్ ప్రాంతంలోని చింతల్కుంటలో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీలో వందల సంఖ్యలో ఓటర్లుండగా, వారిలో చాలామంది ఓటర్లు ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారు. వివరాలిచ్చినా బీఎల్ఓల నిర్లక్ష్యంతో మ్యాపింగ్ జరగని ఓటర్ల మ్యాపింగ్కు మరో అవకాశం కల్పించాలని ఓటర్లు కోరుతున్నారు. -
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇన్చార్జి?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వ్యవహారాల ఇన్చార్జి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం సుమారు 10 నెలల పాటు త్వరలో విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కొత్త ఇన్చార్జిని నియమించే దిశగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. దీపా దాస్మున్షీ స్థానంలో 2025 ఫిబ్రవరి 14న మీనాక్షి నటరాజన్ రాష్ట్ర బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆమె విదేశాలకు వెళ్లనుండటం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాల దృష్ట్యా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులకు ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితా, ఇతర సంస్థాగత అంశాలతో క్షేత్రస్థాయి నివేదికను మీనాక్షి పార్టీ అధిష్టానానికి సమర్పించారని సమాచారం. అయితే ఆమె గైర్హాజరుతో పార్టీ కొత్త ఇన్చార్జి కోసం పలువురు సీనియర్ నాయకుల పేర్లను ఏఐసీసీ పరిశీలిస్తోంది. ప్రధానంగా ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హ్ గోహిల్ పేర్లు రేసులో ముందున్నట్లు సమాచారం కాగా, వీరితో పాటు సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్ పేర్లను కూడా ఏఐసీసీ పెద్దలు పరిశీలిస్తున్నారు. సంస్థాగత అనుభవశీలి ముకుల్ వాస్నిక్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన ముకుల్ వాస్నిక్ పేరు ఇన్చార్జి రేసులో బలంగా వినిపిస్తోంది. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. గతంలో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దశాబ్దాలుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలకు ఇన్చార్జిగా విజయవంతంగా పనిచేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న వాస్నిక్, పారీ్టలో వివాదరహితుడిగా గుర్తింపు పొందారు. దక్షిణాది రాజకీయాలపై ఆయనకు మంచి అవగాహన ఉండటం, నాయకుల మధ్య సమన్వయం తీసుకురావడంలో నేర్పరి కావడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. వ్యూహాల రూపకల్పనలో శక్తిసిన్హ్ గోహిల్ గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు శక్తిసిన్హ్ గోహిల్ పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసిన గోహిల్కు చట్టసభలు, రాజ్యాంగపరమైన అంశాలపై పూర్తి పట్టు ఉంది. గతంలో గుజరాత్ ప్రభుత్వంలో ఆర్థిక, విద్యా శాఖల మంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఢిల్లీ, బిహార్ వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేశారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో, క్షేత్రస్థాయి శ్రేణులను సమన్వయం చేయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర పరిస్థితులపై దిగ్విజయ్కు పట్టు రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేసిన అపార అనుభవం ఉంది. రాష్ట్ర కాంగ్రెస్లోని మెజారిటీ సీనియర్ నాయకులతో ఆయనకు ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు కావడంతో ఆయన వైపు కూడా అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఆయన 1993 నుంచి 2003 వరకు పదేళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం ఉన్నారు. సమన్వయకర్తగా అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్.. రాజస్థాన్ రాష్ట్రానికి మూడు సార్లు (1998–2003, 2008–2013, 2018–2023) ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నేత. గతంలో కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా (సంస్థాగత వ్యవహారాలు) పనిచేసిన కాలంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సంక్షోభ సమయాల్లో పార్టీని నడిపించగల వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం సాధించేందుకు గెహ్లాట్ లాంటి సీనియర్ నేత అవసరం ఉంటుందని పార్టీలోని ఒక వర్గం భావిస్తోంది. కాగా కొత్త ఇన్చార్జి ఎంపికపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ త్వరలోనే ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. మీనాక్షి నటరాజన్ స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనే దానిపై త్వరలో ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
వర్షాల నేపథ్యంలో గణేశ్ మండపాలపై బండి సంజయ్ కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ ఉత్సవాలు హిందువుల ఐక్యతా స్ఫూర్తికి, భక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. హిందువులంతా సంఘటితంగా ఉంటూ ఆనందోత్సవాలతో గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గణేశ్ మండపాల నిర్వహణలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులను నిర్వహించాలని అన్నారు.హిందూ పండుగలను ఘనంగా నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బండి సంజయ్ పేర్కొన్నారు. ధర్మాన్ని కాపాడుతూ సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా గణేశ్ ఉత్సవాలను జరుపుకుంటూ భక్తిపారవశ్యంతో వినాయకుడిని కొలుద్దామని అన్నారు.విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లోని కష్టాలు, విఘ్నాలు తొలగిపోయి ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణ మరింత సుభిక్షంగా ఉండాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. ప్రతి గ్రామం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాలని, ప్రజల కష్టాలు తొలగిపోయి ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలని, గణనాథుడి ఆశీస్సులతో తెలంగాణలో ధర్మ విజయం సాధించాలని కోరుకున్నారు.ఇదీ చదవండి: ఏడాదైనా చైర్మన్ లేరు.. బాబ్జీ సంచలన నిర్ణయం -
భారతీయ భాషలు దేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు
హైదరాబాద్: భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి భారతీయ భాషలు ప్రతిబింబాలని, అవి దేశ సమున్నత సాంస్కృతిక వారసత్వానికి అమూల్యమైన ప్రతీకలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈ నెల 14 వ తేదీన జాతీయ హిందీ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.హిందీతో పాటు భారతీయ భాషల పరిరక్షణ, ప్రోత్సాహం ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. భాషలు ప్రజలను అనుసంధానిస్తూ పరస్పర అవగాహన, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని, భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ద్వారా జాతీయ సమైక్యత మరింత బలోపేతం అవుతుందని గవర్నర్ ఆకాంక్షించారు.ఇదీ చదవండి: తెలంగాణ ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు -
‘మట్టి వినాయక విగ్రహాలను పూజించాలి’
హైదరాబాద్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్, సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ గద్వాల విజయలక్ష్మి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.విఘ్నాలను తొలగించి, ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.వినాయక చవితిని ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పండుగను పర్యావరణహితంగా నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గణేష్ మండపాల వద్ద భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐకమత్యంతో జీవించాలని గద్వాల విజయలక్ష్మి ఆకాంక్షించారు.ఇదీ చదవండి: తెలంగాణ ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు -
తెలంగాణ ప్రజలకు గవర్నర్ వినాయక చవితి శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే శ్రీ గణేశుడి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం శాంతి, ఐక్యత, ప్రగతి, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభిలషించారు. శ్రీ గణేశుడిని విఘ్నవినాశకుడిగా, శుభప్రదుడిగా ఆరాధించడం భారతీయ సంస్కృతిలో విశిష్టమైన సంప్రదాయమని గవర్నర్ పేర్కొన్నారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణేశుడిని ప్రార్థించడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుందని విశ్వసిస్తారని తెలిపారు. తెలంగాణతో పాటు దేశ ఐక్యత, శాంతి, అభివృద్ధి, సౌభాగ్యానికి అడ్డుగా నిలిచే అన్ని విఘ్నాలను విఘ్నేశ్వరుడు తొలగించి, ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. వినాయక చవితి పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందం, సామరస్యం, సుఖసంతోషాలను నింపాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు లోక్ భవన్ కార్యాలయం పత్రికా ప్రకటనను విడుదల చేసింది. -
వైఎస్సార్ మరణించాక ఇక్కడి గుంటనక్కలు మోసం చేశాయి: కొండా సురేఖ
వరంగల్: కార్యకర్తలు పది రోజుల నుంచి ఎంతో బాధపడుతున్నారని మాజీమంత్రి కొండా సురేఖ చెప్పారు. సుమంత్ బెయిల్ కోసం కార్యకర్తలను కలవడం ఆలస్యమైందని తెలిపారు. ఇప్పుడున్న నాయకులు పొద్దున ఒక పార్టీలో మధ్యాహ్నం ఒక పార్టీలో తిరుగుతున్నారని అన్నారు. తాను ఎప్పుడూ పదవుల కోసం ఆరాటపడలేదని తెలిపారు.కార్యకర్తలతో కొండా సురేఖ దంపతులు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్ మరణించాక ఇక్కడున్న గుంట నక్కలు మోసం చేశాయి. కేసీఆర్ సూచనతో వరంగల్ తూర్పులో పోటీ చేసి అప్పటి మంత్రిని 55 వేల మెజారిటీతో ఓడించాను. చల్ల ధర్మారెడ్డి అక్రమంగా సంపాదించాడు. చిన్న తప్పు కానీ, చిన్న మచ్చ లేకుండా మూడు శాఖలను సమర్థవంతంగా నిర్వహించాను. పదవి అనేది అలంకారం మాత్రమే. పని చేయాలనుకుంటే పదవి అక్కర్లేదు. నన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినందుకు నేను బాధపడటం లేదు.మేము ఏ పార్టీలోకి పోయే ఆలోచన లేదు... కాంగ్రెస్ పార్టీలో పుట్టాము కాంగ్రెస్ పార్టీలో పెరిగాము. అనివార్య కారణాలవల్ల బీఆర్ఎస్ పార్టీలోకి పోయాము.. కానీ, ఎవ్వరూ ఆ పార్టీ నుంచి వెళ్లగొట్టలేదు. స్థానిక డివిజన్లో కనీసం కార్పొరేటర్ను గెలిపించుకునే స్థాయి కూడా సారయ్యకు లేదు. ఇకనుంచి ఎవరైనా మా మీద మాట్లాడాలనుకుంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నవీన్ రాజ్ భుజాలపై నుంచి 24 మంది కార్పొరేటర్లను గెలిపించుకుందాం. మాకు పైనుండి ఫోన్లు వస్తున్నాయి.. ఎటూ వెళ్లదు అని. మేము పార్టీ మారేది లేదు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తూర్పులో నాకు మళ్లీ కాంగ్రెస్ టికెట్ వస్తది. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది’’ అని చెప్పారు. -
కొండా సురేఖది.. నాది ఒకే మాట.. సుస్మితది మాత్రం..: కొండా మురళి
వరంగల్: మాజీమంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆదివారం వరంగల్లో కార్యకర్తలతో కొండా సురేఖ దంపతులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. పదవి ఉంటే ఉంటుంది.. పోతే పోతుంది.. కానీ, సారీ అని ఏ రోజూ రాతలు రాయలేదని తెలిపారు. బీసీల కోసం ముందుకు వచ్చే నాయకుడే లేడని చెప్పారు.రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కొండా దంపతుల లక్ష్యమని మురళి తెలిపారు. ‘‘మాటపై నిలుచోవాలి.. పదవులు ఉంటాయి.. పోతాయి. కృతజ్ఞత అనేది కొండా రక్తంలో ఉంది. నా కారు రంగు ఇండియాలో ఎవరికి ఉండదు.. అది ముస్లింలకు చిహ్నం. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని విడిచేది లేదు... కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం.నా శరీరంలో ఇంకా నాలుగు బుల్లెట్స్ ఉన్నాయి.. మీ ఆశీస్సులు నన్ను బతికిస్తున్నాయి. పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడవకండి. కొండా సురేఖది... నాది ఓకే మాట... నా బిడ్డ సుస్మితది వేరే మాట. వరంగల్ తూర్పులో 24మంది కార్పొరేటర్లను గెలిపిస్తాను. కొండా మురళి కబ్జా చేసినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి బయటకు వస్తా. రేవంత్ అన్నకు అన్నీ తెలుసు. ఢిల్లీ రావాలని ఫోన్ వచ్చింది నిజం. వరంగల్ తూర్పు బాధ్యతలను నవిన్ రాజ్ కు అప్పగిస్తున్నా. కష్టపడి పని చేసేవారికి.. గెలిచే వ్యక్తి కార్పోరేటర్ టిక్కెట్ దక్కుతుంది. నాకు, నా బిడ్డ సుస్మితకు సంబంధం లేదు. నన్ను నమ్ముకొని చాలా మంది నాయకులు ఉన్నారు. కొండా మురళీ మాటంటే మాటే. అన్ని వర్గాలను కల్పుకొని ముందు పోతాం. కార్యకర్తల కోసం ఇంకో 10 ఎకరాలు అయినా అమ్ముతా. కార్యకర్తలే నా బలం’’ అని కొండా మురళి అన్నారు. -
రూ.40 లక్షల చికిత్స.. గాందీలో ఉచితం
హైదరాబాద్: రక్తం గడ్డకట్టే అరుదైన రుగ్మతతో బాధపడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం విజయవంతంగా నిర్వహించారు సికింద్రాబాద్ గాందీఆస్పత్రి వైద్యులు. గాందీఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ. ఉషారాణి తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా ధర్మాపూర్ గ్రామానికి చెందిన యడ్ల లక్ష్మి(21) ప్రసవం కోసం గతనెల 21న గాం«దీఆస్పత్రిలో అడ్మిట్ అయింది. అలెగ్జాండర్స్ కన్జ్నిటల్ ఫ్యాక్టర్ 7 డెఫిసియన్సీ వ్యాధి కారణంగా రక్తం గడ్డ కట్టే అరుదైన రుగ్మత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రసవం సమయంలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు. లక్షలాది రూపాయల విలువైన రికాంబినెంట్ ఫ్యాక్టర్–7 ఔషధాన్ని తెలంగాణ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రత్యేకంగా అందించింది. పండంటి ఆడబిడ్డకు జన్మఈనెల 11న వైద్యుల పర్యవేక్షణలో లక్ష్మి ఆడ శిశువుకు జన్మనిచి్చంది. ఐదు లక్షల మందిలో ఒకరికి అత్యంత అరుదైన అలెగ్జాండర్స్ కన్జ్నిటల్ ఫ్యాక్టర్–7 డెఫిసియాన్సీ వ్యాధి ఉంటుందని, ప్రసవ సమయంలో రక్తం గడ్డకడితే తల్లిబిడ్డల ప్రాణాలకే ప్రమాదమని సూపరింటెండెంట్ ప్రొ. ఉషారాణి తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇటువంటి ప్రసవానికి సుమారు రూ.40 లక్షలు తీసుకుంటారని, గాం«దీఆస్పత్రిలో పూర్తి ఉచితంగా నిర్వహించామన్నారు. గాంధీ గైనకాలజీ వైద్యులు ప్రొ. జానకీ, ప్రొ.శకుంతల, లేబర్రూమ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత తదితరులు వైద్య సేవలందించారు. చదవండి: భర్త కళ్ళముందే ప్రాణం విడిచిన నవ వధువు -
లోన్ యాప్స్ వేధింపులు.. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: లోన్ యాప్స్ వేధింపులు భరించలేక సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. బోరబండ పోలీసులు తెలిపిన మేరకు.. ఇందిరానగర్లో నివసించే గద్దె పవన్ (30) నగరంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. పవన్ తన అవసరాల కోసం దాదాపు రూ.10లక్షలను యాప్స్లో రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేక మనస్తాపం చెందాడు. శనివారం తెల్లవారుజామున వాష్రూంలో షవర్కు లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
వివాహేతర సంబంధాల యాప్.. టాప్–5లో హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధాల యాప్ల వినియోగంలో దేశంలోని టాప్–5 నగరాల్లో హైదరాబాద్ ఉన్నట్లు తేలింది. డిస్క్రీషన్ డేటింగ్(రహస్య డేటింగ్) పేరిట వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకోవడానికి కెనడాకు చెందిన ఓ యాప్ అడ్డాగా మారింది. తాజాగా ఆ విదేశీ యాప్ సంస్థ ప్రకటించిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో 5 లక్షల మందికిపైగా యాక్టివ్ యూజర్లు ఉండగా.. ఇందులో హైదరాబాద్కు చెందిన 1.10 లక్షల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. యూజర్ల సంఖ్య ఆధారంగా దేశంలోనే టాప్–5 నగరాల్లో భాగ్యనగరం ఉందని కంపెనీ పేర్కొంది. ఐటీ కారిడార్లు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల నుంచే 60 శాతం ట్రాఫిక్ తమ యాప్నకు వస్తోందని వెల్లడించింది. మొత్తం యూజర్లలో 68 శాతం మంది 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వారు ఉంటున్నారట. కొన్ని నివేదికల ప్రకారం..ఈ యాప్ కొత్త సబ్స్క్రైబర్లలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది.యాప్ ఫీచర్లలో గోప్యతఇండియా యూజర్ ట్రెండ్స్ అండ్ డేటా ప్రైవసీ నివేదిక ప్రకారం.. ఈ యాప్ అందించే రహస్య ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఫొటోలను బ్లర్ చేసుకొనే అవకాశం ఉండటం, క్రెడిట్ కార్డులతో చెల్లింపుల విధానం, బ్యాంక్ స్టేట్మెంట్లలో యాప్పేరు కనిపించకుండా బిల్లింగ్ చేయడం వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉండటం వల్ల ఇది ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారికి ఆకర్షణీయంగా మారుతోంది.పోలీసులు, సైబర్నిపుణుల హెచ్చరికలుడేటింగ్ యాప్ల కోసం వెంపర్లాడే వారిని సైబర్నేరగాళ్లు బెదిరించి దోచుకొనే ప్రమాదం ఉందని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రై మ్ గణాంకాల ప్రకారం డేటింగ్ యాప్లకు సంబంధించిన ఫిర్యాదులు మూడేళ్లలో 40% పెరిగాయి. మరోవైపు డిజిటల్ గోప్యతకు 100% గ్యారంటీ ఉండదని, బ్లాక్మెయిల్, ఆర్థిక మోసాల ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల సామాజికంగా, మానసికంగా ఎదురయ్యే పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైవాహిక బంధాలు బలహీనపడ్డాయని డేటింగ్యాప్లను ఆశ్రయించడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని చెబుతున్నారు. ఇదీ చదవండి: ముకేశ్ కళ్ల గురించి దేబ్జానీ-నాగ్ డిస్కషన్ -
బొల్లారం ఆయుధాల కేసు.. భార్య నిలదీయడంతో నోరు విప్పిన మల్లేష్?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బొల్లారం ఆర్మీ ఏరియాలో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడు మల్లేష్ను పోలీసులు అరెస్ట్ చేయగా.. చోరీ చేసిన సైనిక ఆయుధాలను విక్రయించి డబ్బు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. అయితే మల్లేష్ వెనుక పెద్ద అక్రమ ఆయుధాల నెట్వర్క్ ఉందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అయితే, కేసు తీవ్రతను పోలీసులు మల్లేష్ భార్య, మామకు వివరించినట్లు తెలుస్తోంది. దీంతో భర్తను భార్య గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఆయుధాలు చోరీ చేసి ఉంటే తప్పును ఒప్పుకోవాలని ఆమె హెచ్చరించడంతో.. చివరకు మల్లేష్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. మరోవైపు.. మల్లేష్ మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. అక్రమ ఆయుధాల సరఫరాదారులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా దేశీయ ఆయుధ సరఫరాదారులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులకు ఆధారాలు దొరకకుండా కీలక వాట్సాప్ చాట్లు, ఆడియో, వీడియో కాల్స్, ఇతర లాగ్లను డిలీట్ చేసినట్లు వెల్లడైంది.దీంతో సైబర్ క్రైమ్, ఎఫ్ఎస్ఎల్ నిపుణుల సహకారంతో డిలీట్ చేసిన డేటాను తిరిగి రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాట్స్, మీడియా ఫైల్స్, కాల్ డేటా వంటి కీలక ఆధారాలు బయటకు వస్తే మల్లేష్ ఎవరెవరితో సంబంధాలు కొనసాగించాడు? ఆయుధాల కోసం ఎవరితో డీల్ చేశాడు? అనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ ప్రాంగణం నుంచి ఒక్కడే ఆయుధాలు చోరీ చేయడం సాధ్యమేనా? అనే అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మీలోని ‘ఇంటి దొంగల’ సహకారం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది.చోరీ చేసిన ఆయుధాలను మల్లేష్ ఎవరికి విక్రయించేందుకు ప్రయత్నించాడు? గ్యాంగ్స్టర్లకా.. ఇతర నేరస్తులకా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయుధాల కోసం జరిగిన ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. డిజిటల్ పేమెంట్లు, బ్యాంకు ఖాతాలు లేదా హవాలా మార్గాల్లో ఏమైనా డబ్బు చేతులు మారిందా? అన్నదానిపైనా దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో మల్లేష్ అరెస్టుతో ఆగకుండా.. ఈ కేసు వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు.ఇదీ చదవండి: సురేఖకు హైకమాండ్ నుంచి పిలుపు.. -
కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది?
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.కీలక బాధ్యత అప్పగిస్తారా?సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు.రాజకీయ వర్గాల్లో ఉత్కంఠఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు! -
అసెంబ్లీ గంట మోగితే.. రూ. కోట్లలోనే ఖర్చు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో స్పీకర్ గంట మోగించగానే చర్చ మొదలవుతోంది. కానీ ఆ గంట మోగడం వెనుక ప్రతి గంటకు రూ. 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చవుతుందని ఢిల్లీకి చెందిన స్వతంత్ర ఎన్జీవో సంస్థ పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సేకరించిన గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే శాసనసభ నడవాలంటే తెరవెనుక పెద్ద సైన్యమే పనిచేస్తుంది. 250 మంది అసెంబ్లీ సచివాలయ సిబ్బంది, మార్షల్స్, 300 మంది పోలీసులు, శాసనసభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడానికి వివిధ శాఖలకు చెందిన సుమారు 400 మంది సెక్షన్ ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అసెంబ్లీకి వస్తారు. వారందరికీ ఓవర్ టైం అలవెన్స్, భోజనం, రవాణా ఖర్చు ప్రభుత్వానిదే. దీనికితోడు అసెంబ్లీ హాల్లో ఏసీలు, లైటింగ్, లైవ్ టెలికాస్ట్, వాటి నిర్వహణ సిబ్బంది, క్యాంటీన్, కాగితాల ముద్రణ ఖర్చులు అదనం. ఇవి కాకుండా సభ జరిగే రోజున ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి రోజువారీ భత్యం రూ. 2,000, ప్రయాణ భత్యం, హైదరాబాద్లో ఉచిత బంగ్లా, కారు, ఇద్దరు పీఏల జీతాలను ప్రభుత్వమే భరిస్తుంది. సభకు హాజరు కాకపోయినా జీతం వస్తుంది కానీ డైలీ అలవెన్స్ మాత్రం సభకు వస్తేనే లభిస్తుంది. ఇలా అన్నీ కలిపితే కేవలం ఒక రోజుపాటు (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లెక్కన) రాష్ట్ర శాసనసభ నిర్వహణకు దాదాపు రూ. కోటి నుంచి రూ.కోటిన్నర దాకా ఖర్చవుతుంది. గతంలో ఒక బ్రీఫింగ్ మీటింగ్కే రూ. 13.59 లక్షలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతేడాది రాష్ట్ర అసెంబ్లీ 149 గంటలపాటు జరిగిందని పీఆర్ఎస్ నివేదిక చెబుతోంది. ఇదీ చదవండి :కొండా సురేఖకు ‘పెద్ద బాధ్యత’ ఏంటది? -
తెలంగాణలో గట్టి వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఆదివారం ఉదయం కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా యాదాద్రి-భువనగిరి, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీల్లో ఉదయం నుంచి 9 గంటల మధ్య మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాత్రంతా భారీ వర్షాలు కురిసిన యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్, సూర్యాపేటలోని కొన్ని ప్రాంతాలు, నల్గొండలోని కట్టంగూర్ ప్రాంతాల్లో మరో రెండు గంటల పాటు మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. WARANGAL - KARIMNAGAR - SIDDIPET - JANGAON RAINS ALERT - 6.20 AM ⚠️🌧️ ONGOING NON STOP MODERATE - HEAVY RAINS across Medak, Siddipet, Yadadri - Bhongir, Medchal - Malkajgiri to further spread across Jangaon, Hanmakonda, Warangal later into Karimnagar, Bhupalapally, Mulugu,…— Telangana Weatherman (@balaji25_t) September 13, 2026మెదక్, సిద్దిపేట, మెద్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లోనూ మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు నగరంలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేని మోస్తరు జల్లులు కొనసాగే అవకాశం ఉండగా.. దక్షిణ హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇక గత 24 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 120–200 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదైందని తెలంగాణ వెదర్మ్యాన్ పేర్కొన్నారు. యాదాద్రి-భువనగిరి, జనగామ, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి-కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొంతవరకు మెరుగుపడ్డాయని తెలిపారు. రాబోయే రోజుల్లో దక్షిణ తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.ఇదీ చదవండి: వడివడిగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. యువతి అక్కడికక్కడే మృతి!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువతి మృతి చెందగా, ఊబర్ టూవీలర్ డ్రైవర్ గాయాలతో బయటడ్డాడు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా వెంకటరాయపురానికి చెందిన వజ్జిపర్తి హేమ దుర్గ (26) అమీర్పేటలో ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఓ కార్ల షోరూంలో కస్టమర్ రిలేషన్íÙప్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తోంది. శనివారం మధ్యాహ్నం సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు అమీర్పేట హాస్టల్ నుంచి ఊబర్ బైక్ బుక్ చేసుకుంది. అమీర్పేట బిగ్బజార్ వెనకవైపు శ్రీనగర్ కాలనీ రోడ్డులో వీరు వెళ్తున్న వాహనాన్ని కూకట్పల్లి డిపో బస్సు ఢీకొట్టింది. వెనక కూర్చున్న హేమ దుర్గ కిందపడడంతో ఆమె తలపైనుండి బస్సు చక్రాలు వెళ్లాయి. దీంతో హేమదుర్గ అక్కడికక్కడే మృతి చెందింది.ఊబర్ బైక్ డ్రైవర్ ఒరిస్సాకు చెందిన హిమాంచల్ పట్రో గాయాలపాలయ్యాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు హేమ దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ షేక్ అన్వర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి... -
అమ్మేందుకే ఆయుధాలు చోరీ!
సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆర్మీ ఏరియాలో తీవ్ర కలకలం సృష్టించిన ఆయుధాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు మల్లేష్ను పోలీసులు అరెస్ట్ చేసి, కేసును మరింత వేగవంతం చేశారు. చోరీ చేసిన సైనిక ఆయుధాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో స్పష్టమైంది. కేసులోతుల్లోకి వెళ్లే కొద్దీ మల్లేశ్ వెనక పెద్ద అక్రమ ఆయుధాల నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులకు సంచలన ఆధారాలు లభించాయి. నిందితుడు ఫోన్ ఆధారంగా జరిపిన ప్రాథమిక దర్యాప్తులో అంతర్జాతీయ, అంతరాష్ట్ర అక్రమ ఆయుధాల వ్యాపారులతో ఇతనికి సంబంధాలు ఉన్నట్లు తేలింది. మల్లేశ్ తన మొబైల్ ద్వారా సామాజిక మాధ్యమాలు, వాట్సాప్ వేదికగా దేశీయ ఆయుధ సరఫరాదారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులకు దొరకకుండా నిందితుడు తన ఫోన్లోని కీలక వాట్సాప్ చాట్లు, ఆడియో, వీడియో కాల్స్ రికార్డ్లు, లాగ్లను డిలీట్ చేసినట్లు తేలింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ నిపుణులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) టీమ్ సహకారంతో డిలీట్ అయిన వాట్సాప్ మెసేజ్లు, మీడియా ఫైళ్లు, కాల్ డేటా రికార్డ్లను వెలికితీసే పనిలో పడ్డారు. కాగా, విశాలమైన ప్రాంగణం, కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉండే ఆర్మీ ఏరియా నుంచి కేవలం ఒక్కడే ఆయుధాలు చోరీ చేయడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మీలోని ఇంటి దొంగల సహకారం కూడా తప్పకుండా ఉంటుందనే కోణంలో ఆరా తీస్తున్నారు. కొట్టేసిన ఆయుధాలను మల్లేశ్ ఎవరికి విక్రయించేందుకు ఒప్పందాలు చేసుకున్నాడు? గ్యాంగ్స్టర్లకా లేక నేరస్తులకా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అలాగే డిజిటల్ పేమెంట్లు, హవాలా లేదా బ్యాంక్ ఖాతాల ద్వారా ఎంత మొత్తం చేతులు మారిందనే కోణంలోనూ పరిశీలిస్తున్నారు. -
వడివడిగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు
సాక్షి, న్యూఢిల్లీ: రక్షణ, వాణిజ్యపరంగా అత్యంత వ్యూహాత్మకమైన ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పురోగతిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో శనివారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ భేటీలో పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కిషన్రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రాజెక్టు అమలును పకడ్బందీగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు రక్షణ శాఖ, పౌరవిమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో నోడల్ అధికారిని వచ్చే వారంలోగా నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రాజెక్టు డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తీర్మానించారు. ఉత్తర తెలంగాణలో పౌర విమానయాన మౌలిక వసతుల కల్పనతోపాటు ప్రాంతీయ వైమానిక అనుసంధాన మెరుగుదలకు ఈ ప్రాజెక్టు బాటలు వేస్తుందని కిషన్రెడ్డి పేర్కొన్నారు.రక్షణ శాఖ సంపూర్ణ సహకారం..దేశ రక్షణపరంగా వ్యూహాత్మక ప్రాంతమైన ఆదిలాబాద్లో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్, ఎయిర్ఫోర్స్ స్టేషన్ అభివృద్ధికి రక్షణ శాఖ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా కీలక ముందడుగు పడిందని కిషన్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 17న రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులు ఆదిలాబాద్ విమానాశ్రయ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్ కోసం 2.75 కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మాణం అవసరమని తేల్చారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధీనంలో 369.45 ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూసేకరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. -
పెసరకు పిసరంతే...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు లేకున్నా, అడపాదడపా కురిసిన వర్షాలతో సాగు చేసిన పెసర పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వ పరంగా కొనుగోళ్లు లేక కేంద్ర ప్రభుత్వం క్వింటాకు నిర్ణయించిన రూ.8,780 ధర దక్కక, వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారుల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్కు మార్క్ఫెడ్ లేఖ రాసి చేతులు దులుపుకుంది. గణనీయంగా పెరిగిన సాగు రాష్ట్రంలో పెసర సాధారణ సాగు విస్తీర్ణం 64,610 ఎకరాలుగా అంచనా వేశారు. గత ఏడాది 61,348 ఎకరాల్లోనే సాగైంది. కానీ ఈసారి అంచనాలకు మించి 1,60,182 ఎకరాల్లో సాగు చేశారు. వర్షాభావంతో మెట్టతోపాటు తరి పంటలు లేని చోట రైతులు పెసర సాగు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే 98,834 ఎకరాల్లో అదనంగా పంట సాగవగా.. ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో విస్తీర్ణం ఎక్కువగా ఉంది. పంట చేతికి వచ్చి నూర్పిడి చేస్తున్న రైతులు వ్యవసాయ మార్కెట్లకు తీసుకొస్తున్నారు. అయితే, ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకున్నా రెండు క్వింటాళ్లు దాటలేదు. ఈ పంటకు కూడా మద్దతు ధర లేక రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. మద్దతు ధర హుష్ కేంద్ర ప్రభుత్వం పెసర క్వింటాకు రూ.8,780 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర మార్కెట్లలో ఎక్కడా దక్కడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే పరిశీలిస్తే గత నెల 14న కొనుగోళ్లు ప్రారంభం కాగా క్వింటాకు గరిష్టంగా రూ.7,600, రూ.3,400 కనిష్ట ధరగా నమోదైంది. అంటే గరిష్ట – కనిష్ట ధరకు మధ్య వ్యత్యాసం క్వింటాకు ఏకంగా రూ.4,200 తేడా ఉంది. ఈనెల 1న గరిష్టంగా రూ.7,600 పలకగా.. కనిష్ట ధర రూ.3,400కే పరిమితమైంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధర ఒక్క క్వింటాకూ దక్కలేదు. దిగుబడి లేదు.. ధర లేదు ఈ ఏడాది వర్షాలు అనుకూలించక పెసర దిగుబడి తగ్గింది. ఎకరాకు ఐదు క్వింటాళ్లకు బదులు రెండు క్వింటాళ్లు మించడం లేదు. రెండున్నర ఎకరాల్లో పెసర సాగు చేస్తే ఆరు క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. మార్కెట్లో క్వింటాకు రూ.6,700 మాత్రమే ధర పెట్టడంతో ఇక్కడ కూడా నష్టపోయాం. – తూము వీరస్వామి, చింతకాని, ఖమ్మం జిల్లా ప్రభుత్వ కొనుగోలు లేక.. అంతా దగా ప్రభుత్వ కొనుగోళ్లు చేపట్టకపోవడంతో వ్యాపారుల ఇష్టం నడుస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర కన్నా క్వింటాకు రూ.3 వేలకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. మంచి ధర పలికితే సాగు ఖర్చులైనా మిగిలేవి. – మడిపల్లి రమేశ్, రేపల్లెవాడ, కొణిజర్ల మండలం, ఖమ్మం జిల్లా -
బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం: సీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి హామీ ఇచ్చారని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డితో సమావేశమై బీసీలకు సంబంధించిన పలు సమస్యలను సీఎంకు వివరించి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని కోరగా ఈ అంశంపై సీఎం సానుకూలంగా స్పందించారని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించినట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, పలు జిల్లా కేంద్రాల్లో బీసీ విద్యార్థులకు హాస్టళ్లలో సీట్లు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 100 బీసీ కాలేజీ హాస్టళ్లు, 120 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని ,హాస్టల్ విద్యార్థుల కోసం శాశ్వత భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేయగా కొత్తగా 100 బీసీ కాలేజీ హాస్టళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆదేశించారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సాధ్యమైనంత త్వరగా దశలవారీగా చెల్లిస్తామని చెప్పారన్నారు. సీఎంను కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు జి.మల్లేష్యాదవ్, నీలా వెంకటేష్, జిల్లపల్లి అంజి, సి.రాజేందర్, పర్లగోర్ల మోడీ రాందేవ్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.266 కోట్ల పరిహారం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్లో రూ.266 కోట్ల పరిహారం కక్షిదారులకు పంపిణీ చేశారు. అలాగే 4,20,626 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రీలిటిగెంట్ కేసులు 2,78,335 ఉండగా, పెండింగ్ కేసులు 1,40,565 ఉన్నాయి. ఈ మేరకు వివరాలను లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి మీడియాకు వెల్లడించారు. లోక్ అదాలత్లో వినియోగదారుల, కార్మిక, మోటారు ప్రమాద పరిహారం, భూసేకరణ, సివిల్, క్రిమినల్ తదితర వివిధ రకాల పెండింగ్, ప్రీ–లిటిగేషన్ కేసులకు రాజీ పరిష్కారాలు కల్పించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్, టీఎస్ఎల్ఎస్ఏ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ పి.శామ్ కోషి, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ కె.లక్ష్మణ్ మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 342 లోక్ అదాలత్ బెంచీలు ఏర్పాటు చేశారు. వీటిలో 340 బెంచీలు జిల్లా కోర్టుల్లో, రెండు బెంచీలు తెలంగాణ హైకోర్టులో పనిచేశాయి. అత్యధికంగా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్కు సంబంధించి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి సమక్షంలో ఇన్సూరెన్స్ కంపెనీ రూ.5 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందజేసింది. హైకోర్టులో 182 కేసుల పరిష్కారం..తెలంగాణ హైకోర్టులో జస్టిస్ కె.సుజన, జస్టిస్ నందికొండ నర్సింగ్రావు ఆధ్వ ర్యంలో రెండు ప్రత్యేక లోక్ అదాలత్ బెంచీలు పనిచేశాయి. వీటి ద్వారా 182 పెండింగ్ కేసులు రాజీ మార్గంలో పరిష్కరించారు. మోటారు ప్రమాద పరిహా రం కేసుల్లో బాధితులకు రూ.14.81 కోట్లకు పైగా పరిహారం మంజూరైంది. -
ఇదేం పరిపాలన అధ్యక్షా
సాక్షి, హైదరాబాద్: వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెన్షన్కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం తెలంగాణ భవన్లో ‘మాక్ అసెంబ్లీ’నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలను తలపించేలా సభా మందిరాన్ని తీర్చిదిద్ది, స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రుల పాత్రలను పార్టీ నేతలకు కేటాయించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్రావు స్పీకర్గా వ్యవహరించగా, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సీఎం రేవంత్రెడ్డి పాత్ర పోషించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పాత్రలో, మాజీ మంత్రి గంగుల కమలాకర్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాత్రలో కనిపించారు. మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఇరిగేషన్పై చర్చను ప్రారంభించారు. కేటీఆర్, హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ సభ్యులు విమర్శలు గుప్పించారు. అదే సమయంలో అధికార పక్షం పాత్రధారులుగా వ్యవహరించిన నేతలు ప్రభుత్వంపై వ్యంగ్యా్రస్తాలు సంధించారు. విద్యుత్ సమస్యపై వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతున్న సమయంలో సభలో కరెంటు పోవడం, ఎమ్మెల్యే డాక్టర్ కె.సంజయ్కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని జగదీశ్రెడ్డి, కౌశిక్రెడ్డి పోడియం వద్దకు వెళ్లి స్పీకర్తో వాగ్వాదానికి దిగారు. సీఎంను విమర్శిస్తే మైక్ కట్ చేస్తానంటూ హెచ్చరికలు, కిందనుంచి తనకు చీటీ వచ్చినందున మైక్ ఇవ్వనని మాణిక్రావు చెప్పడం సభలో నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా ఎవరేం మాట్లాడారంటే... నీళ్లలోనూ కాంగ్రెస్ నిర్లక్ష్యమే: జగదీశ్రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది, తెలంగాణలో రెండు కోట్ల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్దే. మిషన్ కాకతీయతో చెరువులు, మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించాం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 22ఏతో ప్రజలకు చుక్కలు: మర్రి రాజశేఖర్రెడ్డి 22ఏ నిబంధనల పేరుతో రాత్రికి రాత్రే భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. నా నియోజకవర్గంలో సుమారు 30 వేల ఇళ్లను 22ఏ జాబితాలో చేర్చారు. మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు. నా ఇల్లు కూడా 22ఏలో ఉంది: కౌశిక్రెడ్డి హరీశ్రావు ప్రజెంటేషన్ తర్వాత పరిశీలిస్తే నా ఇల్లు కూడా 22ఏలో ఉన్నట్లు తేలింది. భూమిని జాబితా నుంచి తొలగించేందుకు ఓ బాధితుడిని 30 శాతం కమిషన్ అడిగారు. భూముల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కరెంటు లేక పరిశ్రమలకు పవర్ హాలిడే: ప్రశాంత్రెడ్డి రైతులు కరెంటు, యూరియా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాం.కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంటు కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు వస్తున్నాయి. నిరుద్యోగులకు ఏవీ ఉద్యోగాలు?: కల్వకుంట్ల సంజయ్ సీఎం కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు, కంపెనీలు వస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. తొలిఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి బీఆర్ఎస్ ఇచ్చిన వాటిని కూడా తమ ఖాతాలో వేసుకుంటోంది. ఆ హామీలు ఎక్కడ?: సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడి యావత్ తెలంగాణకు జరిగిన అవమానకరం.మహిళలను కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు కాలేదు. ప్రతి మహిళకు ప్రభుత్వం లక్ష రూపాయలు బాకీ పడింది. శాంతిభద్రతలు కనుమరుగు : సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయి. పోలీసు శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని విద్యార్థులు కోరితే సీఎం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సీఎం క్షమాపణ చెప్పాలి. పోడు గిరిజనులపై దాడులు: అనిల్ జాదవ్ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. కేసీఆర్ హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చి, రైతుబంధు కూడా అందించాం. ప్రస్తుత ప్రభుత్వం పోడు భూముల విషయంలో గిరిజనులపై దాడులకు పాల్పడుతోంది. క్యూసెక్కులు తెలియవు.. చెక్కులు తెలుసు: పల్లా ఇరిగేషన్ సబ్జెక్టుపై నేను ప్రిపేర్ కాలేదు. చంద్రబాబు సూచనల మేరకు పెట్టుకున్న సలహాదారు ఆదిత్యనాథ్దాస్ చెప్పినట్లు నడుచుకుంటా. నాకు బ్యాంకు చెక్కులు అంటే అర్థమవుతుంది. క్యూసెక్కులు అంటే అర్థం కాదు. కేంద్ర జల సంఘం సమావేశాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంగా భావించి వెళ్లాను. మేడిగడ్డను బాగు చేసి, కేసీఆర్కు పేరు వచ్చే పనులు చేసేది లేదు. మైనింగ్ అంటే మై ఎర్నింగ్: గంగుల కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నేను సొంత డబ్బు ఖర్చు పెట్టా. ఇప్పుడు ఆ డబ్బు తిరిగి సంపాదించుకోవాల్సి ఉంది. నేను ఒక్కడినే కమిషన్లు తీసుకోవడం లేదు. కర్నాటకలో 40శాతం కమిషన్లు అయితే ఇక్కడ మేము 30శాతమే తీసుకుంటున్నాం. భూ భారతి కాదు.. భూ హారతి చేస్తాం. మైనింగ్ అంటే మై ఎరి్నంగ్. ఏ వంద రోజుల్లో చేస్తామో చెప్పామా? ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నాం. ఏ వంద రోజుల్లో చేస్తామని ఏమైనా చెప్పామా? ఐదేళ్లు కాదు..25 ఏళ్లు అధికారంలో ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు హామీలు అమలు చేస్తాం.నాకు ఢిల్లీతో సమస్యలున్నాయి. పార్టీలోనూ ఉన్నాయి..చివరికి బీఆర్ఎస్తో కూడా ప్రశాంతత లేదు. ప్రాజెక్టులన్నీ ఇందిరాగాంధీ కట్టినవే. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కూడా ఆమే నిర్మించారు. నాకు పాలనలో అనుభవం లేదు.. తెలిసిందల్లా అందరినీ తొక్కుకుంటూ పైకిరావడమే. భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి వంటి అనుభవజ్ఞులున్నారు.వాళ్లు లేకపోతే మంత్రి పొంగులేటి ఉన్నాడు. పాత రోజులు తెస్తామన్నాం..తెచ్చాం. యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టే పాలన తెచ్చాం. ఉద్యోగాల గురించి హామీ ఇచ్చిన రాహుల్గాంధీని అడగాలి. నేను హార్వర్డ్ యూనివర్సిటీలో వారం రోజులు చదువుకుని అన్నీ తెలుసుకుని వచ్చా. సభలో నన్ను మాట్లాడనివ్వకపోతే పేగులు మెడలో...గుడ్లు పీకి గోటీలాడుతా..ఇలా పాత భాష మాట్లాడాల్సివస్తది. బంగారం కొనొద్దని ప్రధాని మోదీ చెప్పడం వల్లే తులం బంగారం ఇవ్వడం లేదు. పైగా దొంగలు ఎత్తుకుపోతే నన్ను బద్నాం చేస్తారు. హిట్లర్ నాకు ఆదర్శం..పాలన కూడా అలాగే చేస్తా.. నాకు తిక్కలేస్తే లోపలేయిస్తా’’. – సీఎం పాత్రలో తలసాని -
ముందస్తు బుకింగ్: నిమజ్జనానికి వాహనం కావాలా? ఆర్టీఏ కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనోత్సవానికి కావలసిన వాహనాలను ముందస్తుగా బుక్ చేసుకునేందుకు ఆర్టీఏ సదుపాయం కల్పించింది. మండపాల డిమాండ్ మేరకు వాహనాలను అందజేసేందుకు చర్యలు చేపట్టింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి తమకు చేరే కూపన్లకు అనుగుణంగా వాహనాలను అందజేయనున్నట్లు హైదరాబాద్ జేటీసీ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు.క్యూర్ పరిధిలో 14 చోట్ల వాహనాలను సేకరించి మండపాల నిర్వాహకులకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. భారీ ట్రేలర్లు మొదలుకొని టస్కర్లు, లారీలు, డీసీఎంలు, టాటా ఏస్లు వంటి వివిధ రకాల వాహనాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.ఇందుకోసం ప్రాంతీయ రవాణా అధికారులు, మోటారు వాహన తనిఖీ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గతేడాది కంటే ఈ సారి వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా.మండపాల నిర్వాహకులు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధుల నుంచి ముందస్తుగా కూపన్లు తీసుకొని తమను సంప్రదించాలని జేటీసీ తెలిపారు.ఖైరతాబాద్, అంబర్పేట్ జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం, కాటేదాన్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలీ జీఎంసీ బాలయోగి స్టేడియం, నాగోల్ డ్రైవింగ్ ట్రాక్, కర్మన్ఘాట్ మందమల్లమ్మ ఫంక్షన్ హాల్, మన్నెగూడ ఆర్టీఏ కార్యాలయం, మేడ్చల్ రవాణా కార్యాలయం, మియాపూర్ క్రాస్రోడ్స్, పటాన్చెరు, తదితర 14 చోట్ల వాహనాలను అందజేయనున్నారు.అనుభవం, నైపుణ్యం కలిగిన డ్రైవర్లు మాత్రమే నిమజ్జన వాహనాలను నడపాలని, రోడ్డుభద్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలని జేటీసీ వెంకటరమణ పేర్కొన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వొద్దన్నారు.నిమజ్జన వాహనాల అద్దెలు..రెండు ఆక్సిల్ కలిగిన భారీ ట్రేలర్లు లేదా టస్కర్ : రూ.33000మూడు ఆక్సిల్ కలిగిన ట్రేలర్లు, టస్కర్లు : రూ.350002 టైర్ల సామర్ధ్యం కలిగిన హెవీగూడ్స్ వాహనాలు: రూ.రూ.4500. (డీజిల్ ఖర్చు, డ్రైవర్కు రూ.500 బత్తా అదనం.)6 టైర్ల సామర్ధ్యం కలిగిన లారీలకు : రూ.3500,మిడిల్ గూడ్స్ వెహికల్స్కు : రూ.2500డీసీఎం వంటి లైట్గూడ్స్ వెహికల్స్కు : రూ.2000,టాటాఏస్లు : రూ.1500ఇదీ చదవండి: ఏనుగు బొజ్జ.. చిన్న ఎలుక.. ఇందులో ఇంత పెద్ద తత్త్వమా? -
12 గంటలు ఉత్త 'కోతలే'
విద్యుత్ కోతలతో నీరందించలేక ఎండిపోతున్న పొలాన్ని చూపిస్తున్న ఈ మహిళా రైతు పేరు ఈదెమ్మ. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పెగడబండకు చెందిన ఈమె పది ఎకరాల్లో వరి సాగు చేసింది. రెండు బోర్లలో నీళ్లున్నా.. కరెంట్ కోతలతో పారించలేకపోతోంది. ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు త్రీఫేస్ కరెంట్ ఇస్తున్నారని.. మధ్యమధ్యలో నాలుగైదు పర్యాయాలు కోత పెడుతున్నారని.. మొత్తంగా 8 గంటలు ఇవ్వడం లేదని చెబుతోంది. ఇప్పటివరకు 8 ఎకరాల్లో పంట ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు 1.80 లక్షల పెట్టుబడి కాగా.. కరెంట్ ట్రిప్, లోఓల్టేజీతో మూడుసార్లు మోటారు కాలిపోయిందని.. దీనికి అదనంగా సుమారు రూ.25 వేలు ఖర్చయిందని వాపోయింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎల్నినో, వర్షాభావంతో రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. వరుణుడు కరుణించకపోతాడా అనే ఆశతో వర్షాధారంగా సాగు చేసిన పంటలు ఇప్పటికే చేతికందకుండా పోయాయి. బోర్లు, బావుల కింద వేసినవి సైతం ఎండుముఖం పడుతుండటంతో రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది. వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ సరఫరాలో అప్రకటిత కోతలు అమలు చేస్తుండడమే ఇందుకు కారణం. నీళ్లున్నా, విద్యుత్ కోతలతో తడులందించలేని దుస్థితిలో పలు ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు. దాదాపుగా 5 నుంచి 8 గంటలు మాత్రమే.. రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో మొత్తంగా 1,19,55,375 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 50,92,817, పత్తి 48,21,503 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. మొత్తం సాగులో వరి, పత్తి పంటల వాటా 82.9 శాతంగా ఉంది. అయితే వ్యవసాయానికి 12 గంటలపాటు త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఐదు నుంచి ఎనిమిది గంటలే ఇస్తున్నట్లు ‘సాక్షి’బృందం పరిశీలనలో తేలింది. ఉదయం 5.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిరంతరాయంగా త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా.. దఫాల వారీగా అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. జిల్లాల వారీగా సరఫరా సమయాలతోపాటు కోతల సమయంలోనూ తేడాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కోలా.. – జోగుళాంబ గద్వాల జిల్లాలో జిల్లాలో వ్యవసాయానికి కేవలం ఐదారు గంటలు మాత్రమే త్రీఫేస్ కరెంట్ ఇస్తున్నారని.. అది కూడా లో ఓల్టేజీతో సరఫరా చేస్తుండడంతో మోటార్లు కాలి పోతున్నాయి. – ఖమ్మం జిల్లాలో రోజుకు ఐదు నుంచి ఏడు గంటలే వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కోత పెడుతుండడంతో చివరి పంటకు నీరందడం లేదు. వేంసూర్ మండలంలో బోరుబావుల్లో నీళ్లున్నా.. తడులందకపోవడంతో పలువురు రైతులు ఎండిన వరిని తొలగించి.. జొన్న సాగు చేపట్టారు. – కామారెడ్డి జిల్లాలో రోజుకు ఆరు నుంచి ఏడు గంటలు మాత్రమే వ్యవసాయానికి త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. కరెంట్ ట్రిప్ కావడం, లోఓల్టేజీ సమస్యతో మోటార్లు తరచు కాలిపోతున్నాయని.. ఒకసారి మరమ్మతుకు వస్తే అదనంగా రూ.10 వేల వరకు ఖర్చు వస్తోందన్నారు. – నిజామాబాద్ జిల్లాలో ఉదయం 8, 9 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేస్ కరెంట్ ఇస్తున్నారు. మధ్యమధ్యలో రెండు గంటల పాటు కోత పెడుతున్నారు. – ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ కరెంట్ ఉదయం 7.30 గంటలకు ఇస్తున్నారు. మధ్యమధ్యలో కోతలతో మొత్తం 8 గంటలపాటే సరఫరా చేస్తున్నట్లు రైతులు తెలిపారు. విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో.. గత ఏడాది ఇదే నెల తొమ్మిదిన గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,906 మెగావాట్లు కాగా.. ఈ సంవత్సరం అదే సమయంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఆల్టైం రికార్డుస్థాయిలో 19,543 మెగావాట్లకు చేరింది. ఈ లెక్కన 23 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. ఎల్నినో ప్రభావం, వర్షాభావంతో రైతులు పూర్తిగా బోరు బావులపైనే ఆధారపడాల్సి రావడం, పంప్ సెట్ల నిరంతర వాడకంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం అమాంతంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. కనీసం 15 గంటలు ఇవ్వాలి.. నాకు సొంతంగా ఉన్న 3 ఎకరాల్లో మిరప, మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశా. రెండు బోర్లు ఉన్నా, రోజుకు 8 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు. దీంతో పత్తి పంటకు నీరందించలేక పోతున్నా. దీంతో ఎదుగుదల లేకుండా పోగా.. ఎకరాకు కనీసం క్వింటా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. మిరపకు మాత్రమే తడులు పెడుతున్నా. వ్యవసాయానికి ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం 15 గంటలు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలి – లక్ష్మీనారాయణ, రైతు, అయిజ, జోగుళాంబ గద్వాల కోతలు లేకుండా సరఫరా చేయాలి తొలుత వచ్చిన గోదావరి జలాలు, వ్యవసాయ బోరు నమ్ముకొని ఐదు ఎకరాల్లో వరి సాగు చేశా. ఎండలకుతోడు విద్యుత్ శాఖ ఎడాపెడా కోతలు విధిస్తుండడంతో ఒక మడి తడిసి మరో మడిలోకి నీరు పోవడం లేదు. దీంతో ఏ మడికామడికి పైపులు వేస్తూ పంటను కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నా. కోతల్లేని విద్యుత్ అందిస్తేనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. – ఎ.సత్యనారాయణరెడ్డి, రైతు, అడసర్లపాడు, వేంసూరు, ఖమ్మం -
క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి
పెద్ద శంకరంపేట(మెదక్): క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలిగొంది. తల్లి హైదరాబాద్లో ఆత్మహత్యకు పాల్పడగా, ఆమె మృతిని తట్టుకోలేక కుమారుడు పెద్దశంకరంపేటలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని మక్త లక్ష్మాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగదార శివయ్య, బేతమ్మ(45) దంపతులు ఏడాది క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్కు వెళ్లి బౌరంపేటలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమా రుడు ఉన్నారు. స్వగ్రామంలోని వారి సమీప బంధువులకు చెందిన వ్యక్తికిచ్చి పెద్ద కుమార్తె శివలీల వివాహం చేశారు. మరో కుమార్తె స్వప్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం చిటుకుల్లోని ప్రభుత్వ గురుకుల హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. కుమారుడు ప్రవీణ్(19) హైదరాబా ద్లో తల్లిదండ్రులతో కాకుండా కూకట్పల్లిలోని ఓ ప్రయివేటు హాస్ట ల్లో ఉంటూ ఎలక్రీ ్టషియన్గా పనిచే స్తున్నాడు. శివయ్య, బేతమ్మ దంపతులిద్దరూ బౌరంపేటలో వాచ్మెన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్ర వారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో బేతమ్మ ఉరేసుకొని మృతి చెందింది. ఈ విషయాన్ని శివయ్య తన కుమారుడు ప్రవీణ్, చిన్నకుమార్తె స్వప్నకు ఫోన్ చేసి అమ్మకు బాగోలేదు, కిందపడితే దెబ్బలు తగిలాయని వారిద్దరినీ రావాలని చెప్పాడు. దీంతో ప్రవీణ్ వెంటనే వచ్చేశాడు. మృతి చెందిన తల్లిని చూసి భోరున విలపించాడు. ఆ సమయంలో తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తల్లి మృతిని తట్టుకోలేని కుమారుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అదే రోజు అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా పెద్దశంకరంపేట మండలానికి వచ్చాడు. సంగారెడ్డి–నాందేడ్ జాతీయ రహదారిలోని కోలాపల్లి వద్ద సా యంత్రం ఆరు గంటల సమయంలో దిగి సమీప వ్యవసాయ పొలాల్లోని ఓ చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. తండ్రి శివయ్య, బంధువులు ప్రవీణ్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలే దు. అతడిని చూసిన స్థానికులు ఈ సమాచారం చేరవేయడంతో పోలీసులు సెల్ఫోన్ ఆధారంగా అతడి కదలికలను గుర్తించారు..శుక్రవారం రాత్రి అతడు చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం స్వగ్రామానికి బంధువులు ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకువచ్చారు. కాగా, హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న బేతమ్మ మృతదేహాన్ని శుక్రవారం రాత్రి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా శనివారం మధ్యాహ్నం మక్తలక్ష్మాపూర్కు చేరుకుంది. దీంతో ఇరువురి అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించారు. అటు భార్య, ఇటు కొడుకు చితిలకు శివయ్యే నిప్పంటించాడు.కాలువలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతిఈత రాకపోవడంతో ప్రమాదంమునగాల: సూర్యాపేట జిల్లా ము నగాల మండలం ముకుందాపురం గ్రామ శివారులోని ముక్త్యాల బ్రాంచి కాలువలో శనివారం ఇద్దరు విద్యార్థులు మునిగి మృతి చెందారు. కోదాడ పట్టణానికి చెందిన ఎలమర్తి లేఖ స్వరూప్రెడ్డి (14), సారిక హరీశ్ (14) కోదాడ మండలం బాలాజీనగర్లోని ఎస్ఆర్ ఎం (సంకల్ప) పాఠశాలలో 9వ తరగతి చదువుతూ పాఠశాలకు చెందిన వసతి గృహంలో ఉంటున్నారు. వరుసగా మూడ్రోజులు సెలవులు రావడంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను శుక్రవారం సాయంత్రం ఇంటికి పంపించింది. ఇదే పాఠశాలలో చదువుతున్న చరణ్ స్వగ్రామం ముకుందాపురం కాగా.. శనివారం చరణ్, స్వరూప్రెడ్డి, హరీశ్ కలిసి ముకుందాపురం శివారులో గల ముక్త్యాల బ్రాంచి కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లా రు.కాలువలో స్నానం చేస్తుండగా.. స్వరూప్రెడ్డి, హరీశ్కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు కాలువలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై మల్లు సంజీవరెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ముక్త్యా ల బ్రాంచి కాలువకు నీటి సరఫరాను నిలిపివేసి స్థానికులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి 2 కి.మీ. దూరంలో చిలుకూరు మండలం మాదగూడెం వద్ద స్వరూప్రెడ్డి మృతదేహం, అక్కడి నుంచి మరో కిలోమీటరు దూరంలో హరీశ్ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు.వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య?పోక్సో కేసు విషయంలో ఓ నాయకుడు, బాలిక బాబాయ్ రూ.20 లక్షల డిమాండ్!సూసైడ్ లెటర్లో వెల్లడి ముదిగొండ: పోక్సో కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన యువకుడిని ఓ నాయకుడు, బాలిక బంధువు నగదు కోసం వేధించినట్లు తెలుస్తుండగా, యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగొండలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి. ముదిగొండకు చెందిన మెట్టెల వినయ్కుమార్ (21) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళా శాలలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అతనిపై మార్చి నెలలో పోక్సో కేసు నమోదు కాగా, రిమాండ్కు తరలించారు. రెండురోజుల క్రితం బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, కేసు విషయమై బాలిక బాబాయ్తో పాటు నాయకుడు నూకల నాగేశ్వరరావు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, లేకపోతే కుటుంబానికి హాని చేస్తామని బెదిరించినట్లు తెలిసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలిసి ఉండటంతో శుక్రవారం రాత్రి డాబాపై ఉన్న రేకుల గదిలో వినయ్ ఇనుప కడ్డీకి వైర్తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకు న్నాడు. ఈ విషయాన్ని కుటుంబీకులు శనివారం ఉదయం గుర్తించారు. కాగా, వినయ్ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడని, అందులో సైతం నాగేశ్వరరావు, బాలిక బాబాయి పేరు ఉందని తెలుస్తోంది. యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యా దుతో ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
పార్టీ కోసం అప్పులు చేశా.. భార్యాపిల్లల కోసం ఏమీ చేయలేదు..
వెల్గటూర్: ‘నా జీవితంలో కుటుంబానికి ఎప్పుడూ సమయం కేటాయించలేదు...పార్టీ నిర్వహణ, ఈఎంఐలకే అప్పు చేయాల్సి వచ్చింది...భార్యాపిల్లల కోసం ఏమీ చేయలేదు...వాళ్ల పాపం నాకు తగులుతుంది...నాలా ఎవరూ చేయొద్దు. అనాథలను చేసి తనువు చాలిస్తున్నందుకు నన్ను క్షమించాలని నా భార్య పల్లవిని వేడుకుంటున్నా. నా కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను, నాతో కలిసి పని చేసిన బీఆర్ఎస్ నాయకులను పేరుపేరునా వేడుకుంటున్నా..’అంటూ ఓ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది.ప్రజాసేవ చేయాలనే కోరికతో కుటుంబాన్ని వదిలి పార్టీకే అంకితమై.. పార్టీ కార్యక్రమాలకు కోసం అప్పు చేసి..వాటిని తీర్చే మార్గం లేక మానసిక వేదనతో జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోటలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సింహాచలం జగన్ (48) 2001–2010 వరకు వరుసగా రెండుసార్లు వార్డు సభ్యుడిగా.. 2013లో సర్పంచ్గా గెలుపొందాడు. పాడె మోస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తెలంగాణ ఉద్యమం సమయంలో కొప్పుల ఈశ్వర్ సమక్షంలో అప్పటి టీఆర్ఎస్లో చేరాడు. పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సుమారు రూ.18లక్షల వరకు అప్పు చేశాడు. వాటిని తీర్చేందుకు బ్యాంకులో రూ.15 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. మరో రూ.5లక్షలు పర్సనల్ లోన్, కొత్త కారు కోసం మరో రూ.5లక్షలు అప్పు చేశాడు. ఇంటి ఖర్చులు, పార్టీ నిర్వహణ, ఈఎంఐలు చెల్లించేందుకు మరో రూ.10 లక్షలు అప్పు చేశాడు. మొత్తంగా రూ.50లక్షల అప్పు అయ్యింది. వాటిని తీర్చేందుకు భార్య ఒంటిపై ఉన్న ఆభరణాలు తాకట్టు పెట్టాడు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా భార్య ఆరోగ్యం బాగలేక ఆస్పత్రిలో చూపిస్తున్నాడు. అప్పులు తీర్చే దారితోచక మనస్తాపం చెంది శనివారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. జగన్కు భార్య పల్లవి, కుమార్తె సంజన (11), కుమారుడు సుధాంష్ (5) ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. పల్లవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. జగన్ మరణ వార్త వినగానే మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ గుల్లకోట చేరుకొని మృతదేహానికి నివాళి అర్పించి స్వయంగా జగన్ పాడె మోసి అంతిమయాత్రలో పాల్గొ న్నారు. పార్టీ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
మేం కొత్తగా పెట్టిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిషేధిత 22ఏ జాబితాలో పెట్టిన భూములేవీ లేవు. మేం అధికారంలోకి వచ్చాక ఈ జాబితాను కొత్తగా తయారు చేయలేదు. 1999లో ఘట్కేసర్ రైల్వే స్టేషన్ను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ జాబితా అవసరం వచ్చింది. అప్పటి నుంచి కొనసాగుతోంది. 2009లో కోర్టు ఆదేశానుసారం ఈ జాబితా తయారు చేశారు. 2009–15 వరకు ఈ జాబితాపై హైకోర్టులో రెండువేల కేసులు పడ్డాయి. ఆ సమయంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 22ఏ జాబితా భూములను ఐదు కేటగిరీల్లో వర్గీకరించాలని చెప్పింది. కానీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేయలేదు. ఈ నేపథ్యంలో 2017–25 వరకు హైకోర్టులో 28,611 కేసులు పడ్డాయి. దీంతో 45 రోజుల్లో ఈ జాబితా పబ్లిక్డొమైన్లో పెట్టాలని, కోర్టుకు కూడా కాపీ ఇవ్వాలని, అన్ని జిల్లాల్లో ఇవ్వాలని, 22ఏ జాబితా నుంచి భూములను తొలగించాలంటే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. దీంతో కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా డిసెంబర్ 3, 2025న ఈ జాబితాను పబ్లిక్ డొమైన్లో పెట్టాం. అయితే, తక్కువ సమయం ఉన్నందున జీవో 121, ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన సమయంలో ఏ భూములు ఈ జాబితాలో ఉన్నాయో వాటిని అప్డేట్ చేయకుండా అదే కాపీని అప్లోడ్ చేశాం. స్వార్థం, స్వలాభం కోసం చేసింది కాదు. తప్పు జరిగిన మాట వాస్తవం. దీనిపై నేను విచారం వ్యక్తం చేశాను. అయితే, యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దుతున్నాం’ అని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. శనివారం అసెంబ్లీలో 22ఏ భూములపై స్వల్పకాలిక చర్చను పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడున్నర గంటల పాటు ప్రసంగించారు. చేయాల్సింది చేసి, కొల్లగొట్టాల్సింది కొల్లగొట్టి నంగనాచిల్లా మాట్లాడుతున్నారని, దొంగే పోలీసును దొంగా దొంగా అన్నట్టుగా బీఆర్ఎస్ వైఖరి ఉందని ధ్వజమెత్తారు. 47,400 ఎకరాలు తగ్గింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి 220 జాబితాలో 1,02,52,690 ఎకరాల భూమి ఉంటే, 2026 ఆగస్టు 31 నాటికి 1,02,05,250 ఎకరాలు ఉందని చెప్పారు. అంటే 47,400 ఎకరాలు తగ్గిందని, ఇంకా తాము లక్షల ఎకరాలు కొత్తగా ఈ జాబితాలో చేర్చింది ఎక్కడని నిలదీశారు. రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 1,95,812 ఎకరాల వ్యవసాయేతర భూములు 22ఏ జాబితాలో ఉంటే ఇప్పుడు 1,94,543 ఎకరాలున్నాయని, దాదాపు 800 ఎకరాలు తగ్గితే తాము కొత్తగా ఏం చేరుస్తామని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితా నుంచి తొలగించిన ప్రతి అంగుళం భూమికి కాగితాలున్నాయని, టీఎం–15 మాడ్యూల్ ద్వారా ప్రజల పట్టా భూములైన 23వేల ఎకరాలను వారికి ఇచ్చేశామని, జీవోలు, మెమోల లద్వారా మరో 20వేల ఎకరాలు ప్రజలకే ఇచ్చామన్నారు. అయితే, బీఆర్ఎస్ హయాంలో ఈ జాబితా నుంచి తొలగించిన 23వేల ఎకరాల భూమికి కాగితాల్లేవని కమిటీ చెప్పిందన్నారు. 22ఏ జాబితా కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గాయని అనడంలో వాస్తవం లేదన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటేనని, ఇక్కడ పలికే చిలుకలు మాత్రమే వేరని, కానీ పలుకులు మాత్రం ఒకటేనన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు, ఏలేటి మహేశ్వర్రెడ్డిలు ఒకే తరహాలో మాట్లాడిన మాటలను స్పీకర్ అనుమతితో సభకు వీడియో ద్వారా వినిపించారు. శకుని మామ చేసి ఉంటే.. ‘అగిపెట్టెల అబద్ధాల రావు, శకుని మామ తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్నారు. అప్పుడే వారు ఈ జాబితాను సరిచేసి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదు. వారు తెచ్చిన ధరణి కారణంగా ఎంతో మంది ఆత్మహత్యల పాలయ్యారు. ఇప్పుడేదో మాట్లాడుతున్నారు. మనిషి రక్తం మరిగిన పులి మళ్లీ మళ్లీ తిరిగినట్టు అధికారం కోసం దోచుకోవడం కోసం నోరు తెరిస్తే అబద్ధాలాడుతున్నారు. కానీ ఆ పులికి తెలియదు.. వచ్చి రేవంత్రెడ్డి అనే బోనులో పడతాడని. ముక్కుతాడు వేసి కట్టేస్తాడని తెలియదు. నిద్ర పట్టని రాత్రులు గడుపుతూ రోడ్డెక్కి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. 22ఏ జాబితాతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నప్పుడు పిల్లకాకులు అరవడమెందుకు? ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చి మాట్లాడొచ్చు కదా? సలహాలు ఇవ్వచ్చు కదా? వసతులు, ఏర్పాట్లు కావాలి కానీ ప్రజలకు సమస్య వచ్చినప్పుడు కనుచూపు మేరలో కనిపించవా? నువ్వున్నప్పుడు నేను మాట్లాడాలనే కోరిక అలానే మిగిలిపోయేట్టుంది’ అని పొంగులేటి చెప్పారు. మొహం చాటేయడం అలవాటే.. 22ఏ జాబితాలో ఉన్న భూములను చూపెట్టి పేదల కడుపుకొట్టారని, అందుకే సమాధానం చెప్పాల్సి వస్తుందని సభలో గందరగోళం సృష్టించి ప్లాన్ ప్రకారం పారిపోయారని పొంగులేటి అన్నారు. అయితే, చర్చకు మొహం చాటేయడం వారికి అలవాటేనని, సభ నుంచి వారు పారిపోయినా ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇప్పుడు 22ఏ జాబితా కారణంగా అక్కడక్కడా ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అని, కానీ ధరణిని అమల్లోకి తెచ్చినప్పుడు మూడు నెలల పాటు అసలు రిజిస్ట్రేషన్లనే నిలిపివేశారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి 387 గ్రామాలకు నక్షాల్లేవని, ఆయా గ్రామాల్లో సర్వే చేసి భూముల సమస్యలు తీరుస్తున్నామని చెప్పారు. ఇందుకోసం మొదటి దశలో భాగంగా 70 రోవర్లు కొనుగోలు చేశామని, 32 జిల్లాల్లోని 70 చొప్పున గ్రామాల్లో తొలిదశలో పైలట్ సర్వే చేస్తున్నామన్నారు. నవంబర్ చివరికల్లా ఈ సర్వే పూర్తవుతుందని అన్నారు. 23వేల ఎకరాలు అక్రమంగా బదిలీ ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని వారు చేసిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తే అనేక భయంకర విషయాలు వెలుగులోనికి వచ్చాయని పొంగులేటి చెప్పారు. పైలట్లో భాగంగా సిద్ధిపేట, సిరిసిల్లలో ఆడిట్ చేస్తే 23వేల ఎకరాల భూమిని 13వేల ఖాతాలకు బదిలీ చేసినట్టు తేలిందన్నారు. ఏ భూమి ఎవరి ఖాతాలోకి వెళ్లింది.. విదేశాల్లో జరిగిన లావాదేవీలేంటి? అక్కడ కట్టుకున్న హోటళ్ల వివరాలను ప్రత్యేక విచారణ బృందం (సెట్)కు పంపామని తెలిపారు. అధికారం పోయిన తర్వాత కూడా అధికారంలోనే ఉన్నామని భ్రమపడుతూ, పాత వ్యవస్థలను ఉపయోగించుకుని పేదల భూములను కొల్లగొట్టాలనే ఆలోచనలను మానుకోవాలని హితవు పలికారు. అసలు 22ఏ భూముల విషయంలో కొన్ని సమస్యలను గుర్తించామని, వాటిపై సభ సూచన మేరకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పొంగులేటి వెల్లడించారు. యూఎల్సీ భూములు, జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ, డీటీసీపీలు అనుమతిలిచ్చిన లేఅవుట్లు, జీవో 59, జీవో 118, అసైన్డ్ భూముల్లో కట్టుకున్న ఇళ్లు, ఇందిరమ్మ హౌసింగ్ కింద కేటాయించిన ఇంటి స్థలాలు, నాలా మార్పిడి కాని భూములు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లేఅవుట్ల విషయంలో సమస్యలున్నాయని, వీటిని సభ నిర్ణయం మేరకు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని పొంగులేటి స్పష్టం చేశారు. ధరణి దందాతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారు... –ఎన్నికల్లో ఖర్చుకు వాడారు –హరీశ్రావు సొంత మామకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టించారు –ఇలా పొందినవారిలో పల్లా రాజేశ్వరరెడ్డి, గంగుల కమలాకర్ ఉన్నారు ధరణి పోర్టల్ను అట్టుపెట్టుకుని బీఆర్ఎస్ పెద్దలు రూ.లక్షల కోట్లు కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అలా వచ్చిన డబ్బును గత ఎన్నికల్లో ఖర్చు కోసం వాడుకున్నారన్నారు. ఎకరాల కొద్దీ భూమిని నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టా భూములుగా మార్చి విక్రయించి భారీగా డబ్బు పోగు చేసుకున్నారన్నారు. అలాంటి లావాదేవీలకు సంబంధించి తమ ప్రభుత్వం గుర్తించిన భూములను తిరిగి నిషేధిత జాబితాలోకి చేరుస్తూ, అవి పేదలకు దక్కేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 22ఏకు సంబంధించి శాసనససభలో జరిగిన స్వల్పకాలిక చర్చను ప్రారంభిస్తూ ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్రావులను ప్రధాన పాత్రధారులుగా పేర్కొంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ను శకుని మామ అని, హరీశ్రావును అగ్గిపెట్టెల అబద్ధాల రావు, అని కేటీఆర్ను డ్రామాల వ్యక్తి అంటూ పదేపదే సంబోధించారు. ఉదాహరణలతో సభ ముందు... ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని అసైన్మెంట్, భూదాన్ భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించి పట్టా భూములుగా మార్చి ప్రైవేట్ పరం చేశారంటూ మచ్చుకు కొన్ని ఉదంతాలుగా సభ దృష్టికి తెచ్చారు. పొంగులేటి మాటల్లోనే... ⇒ ‘సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సర్వే నెం.271లో 327.09 ఎకరాల ప్రభుత్వం భూమిని గతంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల కోసం కేటాయించింది. ఇందులో 6.18 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీశ్రావు తన సొంత మామ (భార్య తండ్రి) హన్మంతరావుకు కట్టబెట్టించారు. ఇందులో కొంత భూమికి సంబంధించి మిషన్ భగీరథ పరిహారం కూడా పొందారు. ⇒ మెదక్ జిల్లా శివంపేట మండలం సిక్లిందాపూర్ గ్రామంలో సర్వే నెం.33 నుంచి 87 వరకు ఉన్న 569.05 ప్రభుత్వ భూమిలో 2023 అక్టోబరు 5న 372.32 ఎకరాలకు సంబంధించి ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) జారీ చేశారు. దాన్ని మొత్తంగా స్వాహా చేశారు. ఆ రూపంలో పోగుచేసుకున్న రూ.కోట్ల మొత్తాన్ని ఎన్నికల ఖర్చుగా వినియోగించారు. ⇒ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామ సర్వే నం.58, 59లో ఉన్న 476.30 ఎకరాలు ప్రభుత్వం భూమిలో.... 112.21 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుంచి తప్పించి ఓ కుటుంబంలోని సభ్యుల పేర్లతో ఓఆర్సీ జారీ చేశారు. ఇక్కడే 195.25 ఎకరాలను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాలు జారీ చేసే సమయంలో కొందరు పసిగట్టి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ బాగోతం వికటించి తిరిగి ఆ భూములు నిషేధిత జాబితాలోకి చేరాయి. ⇒ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగుల పల్లి గ్రామంలో సర్వే నం. 186 నుంచి 189లో ఉన్న 29.27 ఎకరాల భూదాన్ భూమి ఉండగా, దాన్ని పట్టా భూమిగా కన్వర్ట్ చేయించారు. ఇందులో 24.27 ఎకరాలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మరో ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూమి ప్రస్తుత విలువ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మేము తిరిగి నిషేధిత జాబితాలో చేర్చాం. ⇒ ఇదే గ్రామం శంకర్హిల్స్ ఏరియాలోని సర్వే నం. 111–191 లోని 460 ఎకరాల భూమికి పట్టాదారులు గతంలో ఓ ప్రైవేటు సంస్థకు జీపీఏ ఇచ్చారు. దాన్ని ఆ సంస్థ 3,333 ప్లాట్లుగా విడదీసి విక్రయిస్తోంది. మరోవైపు ఆ భూమిని మరో సంస్థకు మరోసారి జీపీఏ చేశారు. ఆ సంస్థ ఎకరాల రూపంలో విక్రయిస్తోంది. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా స్టేటస్కో జారీ అయింది. 2022లో నాటి ప్రభుత్వం ఆ భూమిని నిషేధిత జాబితాలో పెట్టింది. తర్వాత 226.06 ఎకరాలను ఆ తర్వాత నిషేధిత జాబితా నుంచి తప్పించి ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారు. అలా పొందినవారిలో బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ కూడా ఉన్నారు’ -
గ్రీన్ఫీల్డ్ హైవేపై మళ్లీ ప్రమాదాలు!
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణిచారు. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో క్లీనర్ మరణించగా.. అతి వేగంగా వెళ్తూ డివైడర్ను ఢీకొని కారు బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఇటీవల ఈ హైవేపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. సత్తుపల్లిటౌన్: ‘అంతా నిద్రలో ఉన్నాం..అంతలోనే పెద్ద శబ్దం వచ్చింది..లేచి చూసేసరికి చాలామంది చిందరవందరగా పడిపోగా.. నొప్పులు భరించలేక మరికొందరు ఆర్తనాదాలు చేస్తున్నారు’అంటూ ఏపీ–తెలంగాణ సరిహద్దున శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన పలువురు వెల్లడించారు. హైదరాబా ద్ నుంచి విశాఖపటా్ననికి 57 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ కోచ్ బస్సు శుక్రవారం రాత్రి బయలుదేరింది. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై బస్సు వేగంగా వెళ్తుండగా ఏపీలోని చింతలపూడి మండలం ఎండపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో బస్సు నుజ్జునుజ్జయి క్లీనర్ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి సమీపాన తెలంగాణ–ఏపీ సరిహద్దులో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి నేషనల్ హైవే అంబులెన్స్లో తరలించారు. ఇందులో పి.సురేష్, ఆనంద్ పటేల్, కె.సాహితి(విజయనగరం), బస్సు డ్రైవర్ బండి గోపి(పెద్దిపాలెం)తో పాటు చక్రధర సాహో(గోపీనాథ్పూర్), దుర్గేష్ రావత్(ఉత్తరాఖండ్), ట్రావెల్ బస్సు మరో డ్రైవర్ సాయిఉజ్(కేరళ), డేర్లిన్ అబ్రహం(తమిళనాడు) తీవ్రంగా గాయపడి చికి త్స పొందుతున్నారు. కాగా, ఘటనలో క్లీన ర్ మృతి చెందగా మరో ఏడుగురిని చింతల పూడి ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. పెనుబల్లి: బంగారం కొనుగోలు చేసేందుకు బస్సులో వెళ్లారు.. తిరిగి బయలుదేరే సమయానికి చీకటి పడడం, వెంట బంగారం ఉండడంతో జాగ్రత్తగా వెళ్లొచ్చని అద్దెకు కారు మాట్లాడుకున్నారు. కానీ ఆ కారే ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంటుందని ఊహించలేకపోయారు. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై శనివారం రాత్రి ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన సీతామహాలక్ష్మి, ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఉషారాణి అక్కాచెల్లెళ్లు. వీరిద్దరూ కిష్టారానికి చెందిన పుచ్చకాయల శేషు, గోలి రాజేశ్వరితో కలిసి బస్సులో శనివారం ఉదయం ఖమ్మం వెళ్లి బంగారం కొనుగోలు చేశారు. షాపింగ్ పూర్తయ్యే సరికి చీకటి పడడం, తమ వద్ద బంగారం ఉండడంతో ఖమ్మం నుంచి నాగారపు నాగేశ్వరరావు(45) కారు అద్దెకు మాట్లాడుకుని సత్తుపల్లి మండలం కిష్టారానికి గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా వెళ్తున్నారు. ఈక్రమాన పెనుబల్లి మండలం ముత్తగూడెం సమీపాన కారు అతివేగంతో వెళ్తూ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ నాగేశ్వరరావుతో పాటు ఎర్రగుంటపల్లికి చెందిన కొల్లి ఉషారాణి(54) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాజేశ్వరి, సీతామహాలక్ష్మి, శేషుకు తీవ్రగాయాలు కావడంతో పెనుబల్లి ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలిలించారు. వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని సీఐ ముత్తులింగయ్య, ఎస్ఐ షాకీర్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుల కుటుంబంలోని ఒకరు ఇటీవల మృతి చెందగా ఆమెకు సంబంధించిన పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకునేందుకు వెళ్లివస్తున్నట్లు తెలియగా.. కుటుంబంలో శుభకార్యం నిమిత్తం బంగారం కొనుగోలు వెళ్లి వస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. -
పన్నుపై అపోహలొద్దు
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్లో పన్నులపై అపోహలు వద్దని మంత్రి శ్రీధర్బాబు స్పష్టంచేశారు. ప్రతి ఏటా 20 శాతం ఆస్తి పన్నులు పెరుగుతాయనే విషయం వాస్తవం కాదన్నారు. పన్నులు ఎలా అంటే అలా పెంచడానికి వీల్లేదని, ప్రస్తుతం అమల్లో ఉన్న కంప్యూటేషన్ పద్ధతి ప్రకారమే పన్నులు పెరుగుతాయని, గరిష్టంగా 10 శాతానికి మించి పెరగవన్నారు. అది కూడా కేవలం 0.15 శాతం నివాస, 0.75 శాతం వాణిజ్య సముదాయాల మీద మాత్రమే పడుతుందని వివరించారు. శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరపున కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026 (క్యూర్)ను ప్రవేశపెట్టిన శ్రీధర్బాబు చట్టం లక్ష్యాలను వివరించారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలు రాష్ట్ర ఆర్థిక ఉత్పత్తిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని వివరించారు. శనివారం మధ్యాహ్నం తర్వాత శ్రీధర్బాబు బిల్లుపై జరిగిన చర్చలో పలు పార్టీల సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. బిల్లులో పెట్టిన 20 శాతాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆమోదం మేరకు 10 శాతానికి తగ్గిస్తున్నట్టు చెప్పారు. ఔటర్ రింగ్రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ నగరాన్ని పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చైర్మన్గా ప్రత్యేక కార్యనిర్వాహక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, వరదల నివారణ, చెత్త నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో వివిధ సంస్థలు, శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. భవిష్యత్లో నగర అవసరాలకు అనుగుణంగా ఈ వ్యవస్థ పనిచేసేలా క్యూర్ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు వివరించారు. అనంతరం బిల్లు ఆమోదానికి ప్రతిపాదించిన సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కూడా ఈ అంశాన్ని వివరించారు. పన్నుల పెరుగుదలను 20 నుంచి 10 శాతానికి తగ్గిస్తూ బిల్లులో సవరణ చేయాలని సీఎం చేసిన ప్రతిపాదనను సభ ముందు ఆమోదానికి పెట్టారు. ఈ సవరణతోపాటు క్యూర్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఎంఐఎం, బీజేపీ ఏకాభిప్రాయం పాల్వాయి హరీశ్బాబు (బీజేపీ) లేవనెత్తిన అంశాన్ని ప్రస్తావిస్తూ కోర్ రీజియన్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసే అపెక్స్ కౌన్సిల్ కేవలం విధాన నిర్ణయాల కోసమేనని, ఈ సమావేశాలకు అవసరమైతే మేయర్లను ఆహ్వానిస్తామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఈ కౌన్సిల్ ఏర్పాటు ద్వారా మేయర్లు, కార్పొరేటర్ల స్థానిక అధికారాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని వివరించారు. ఇందుకు విభేదించిన హరీశ్బాబు అపెక్స్ కౌన్సిల్కు మేయర్లను రమ్మనకపోతే వారికి ఇంకేం అధికారాలుంటాయని ప్రశ్నించారు. ఎంఐఎం సభ్యుడు జుల్ఫికర్ అలీ జోక్యం చేసుకుంటూ.. అపెక్స్ కౌన్సిల్ సమావేశాలకు మేయర్లను ఆహ్వానించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో పాల్వాయి హరీశ్బాబు బల్లలు చరిచి మరీ అభినందించారు. ఎంఐఎం సభ్యుడు కూడా అదే చెబుతున్నాడంటూ అధికార పక్షానికి చూపెట్టే ప్రయత్నం చేశారు. వెంటనే శ్రీధర్బాబు జోక్యం చేసుకుంటూ... జుల్ఫికర్ అలీని హరీశ్బాబు గైడ్ చేస్తున్నారని, అందుకే ఆయన ఆ కోణంలో మాట్లాడుతున్నారని బదులిచ్చారు. మూడు కార్పొరేషన్లను నియంత్రించేందుకు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం లేదని, ఈ కౌన్సిల్ విశాల దృక్పథంతో పనిచేస్తుందని వివరణ ఇచ్చారు. ప్రజలపై తీవ్ర భారం: అక్బరుద్దీన్ క్యూర్ బిల్లులోని పలు అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. బిల్లు న్యాయస్థానాల్లో నిలవదని, సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. క్యూర్ పరిధిలోని కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల అధికారాలకు కత్తెరేసి కీలక అధికారాలను క్యూర్ అపెక్స్ కౌన్సిల్కు, పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్యకార్యదర్శి నేతృత్వంలోని క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి అప్పజెప్పారని తప్పుబట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు అధికారాలు అప్పజెప్పకపోతే ఎన్నికలు నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్షిక అద్దె విలువకి బదులుగా ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్నులను విధించాలని బిల్లులో పొందుపర్చడం పట్ల అభ్యంతరం తెలిపారు. స్థలం, భవనం మార్కెట్ విలువలను కలిపి ఆస్తి పన్నులు విధిస్తే నగర ప్రజలపై తీవ్ర భారం పడుతుందని తప్పుబట్టారు. ఏటా 20 శాతం ఆస్తి పన్నులు పెంచాలని బిల్లులో ప్రతిపాదించడాన్ని వ్యతిరేకించారు. ఆస్తుల మ్యుటేషన్ చేసుకున్న మాత్రాన వాటిపై హక్కులు రావని బిల్లులో పెట్టారని తప్పుబట్టారు. మరో ఆరు నెలల్లో మూడు కార్పొరేషన్ల ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ బిల్లుతో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లో భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకి సంబంధించిన రూ.1,400 కోట్లు విలువైన కాంట్రాక్టును ఒకే కంపెనీకి ప్రభుత్వం ఇవ్వడాన్ని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. బిల్లుపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, నవీన్యాదవ్ సైతం మాట్లాడారు. కోర్టుల్లో నిలబడదు: పాల్వాయి హరీశ్ ‘క్యూర్’చట్టం న్యాయస్థానం ముందు నిలబడదని, దానిని ఉపసంహరించుకోవాలని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్బాబు డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఈ చట్టం అమలులోకి వస్తే... మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు ఎలాంటి అధికారాలు ఉండవని, సీఎంకు అపరిమిత అధికారాలను కట్టబెడ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లుకు సంబంధించి 4,100 అభ్యంతరాలు వస్తే.. అందులో 3 వేలకు పైగా ఆస్తిపన్ను పెంపుదలపై ఆందోళన వ్యక్తమైందన్నారు. విశ్వనగరం ట్యాగ్ ఉండాలి: కూనంనేని సాంబశివరావు వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు విశ్వనగరం ట్యాగ్ ఉండాలని, అందుకోసం అధికార వికేంద్రీకరణతో మరింత అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని సీపీఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు చెప్పారు. విశ్వనగరం ట్యాగ్ వస్తేనే.. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారన్నారు. విస్తీర్ణంలో మూడో స్థానంలో.. జనాభాలో ఏడో స్థానంలో మన రాజధాని ఉందన్నారు. సదుపాయలు కల్పించాలి : దానం ‘క్యూర్’పరిధిలో ప్రజల నుంచి ఏటా 20 శాతం వరకు ఆస్తిపన్ను వసూలు చేయాలనే నిర్ణయం సరికాదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇప్పటికే కోటీ 30 లక్షల జనాభా నివసిస్తున్న హైదరాబాద్ త్వరలోనే 2 కోట్ల జనాభాకు విస్తరించనుందని, వీరందరికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మండలిలో క్యూర్ బిల్లు జిల్లాల విభజన అంతా అశాస్త్రీయమే: శ్రీధర్బాబు సాక్షి, హైదరాబాద్: పది జిల్లాలున్న తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా ఎలా విభజించారో బీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. జిల్లాల విభజన పూర్తిగా అశాస్త్రీయంగా జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే క్యూర్ బిల్లును రూపొందించినట్లు వివరించారు. శాసనమండలిలో ఆయన క్యూర్ బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ అత్యంత కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టేటప్పుడు అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సభ్యులకు ముందస్తుగా ఇవ్వాలని, బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఇస్తే వాటిని చదివేదెప్పుడని ప్రశ్నించారు. అనంతరం సభ్యులు అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ కోదండరామ్, ఏవీఎన్ రెడ్డి, పింగిలి శ్రీపాల్రెడ్డి తదితరులు మాట్లాడుతూ బిల్లుకు సంబంధించి సూచనలు చేశారు. అనంతరం బిల్లును ఆమోదించినట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. అంతకుముందు శ్రీధర్బాబు తెలంగాణ ప్రజా విశ్వాసం బిల్లును సభలో ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. -
జూబ్లీహిల్స్ క్లబ్ ఫైల్ ముట్టుకోవద్దు!
సాక్షి,హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ క్లబ్లో గత పాలకవర్గ హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఫైల్ ముందుకు కదలొద్దు. అందుకు ఏ స్థాయిలో సిఫారసు చేయించేందుకైనా నేను సిద్ధం. ప్రస్తుత పాలకవర్గాన్ని పనిచేయనీయకుండా అడ్డంకులు సృష్టించే విషయాన్నీ నేనే చూసుకుంటా’అంటూ సీసీఎస్ పోలీసులపై ఓ మాజీ ఐపీఎస్ ఒత్తిడి తెస్తున్న అంశం క్లబ్ సభ్యుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే రిటైరైన ఆ అధికారికి రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక పదవి కూడా అప్పగించడంతో తన పలుకుబడితోపాటు ప్రస్తుత పదవికి ఉన్న అధికారంతో జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో అన్నీ తానై వ్యవహరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత పాలకవర్గం చేపట్టిన వివిధ పనులపై సభ్యుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రస్తుత పాలకవర్గం నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి పని, చెల్లింపులను పరిశీలించి ఒక నివేదికను రూపొందించింది. అందులో వివిధ రకాల పనులకు మొత్తం రూ. 19 కోట్ల వరకు ఖర్చుపెట్టగా అందులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించింది. వాస్తవ వ్యయం కంటే అధిక అంచనాలతో పనులు చేపట్టడం, క్లబ్లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా వచి్చన రాబడి, చేసిన ఖర్చు, సభ్యత్వాల మంజూరు తదితర అంశాల్లో లోపాలను గుర్తించింది. సీసీఎస్లో ఫిర్యాదు చేసినా దర్యాప్తు లేదు.. ఈ ఆర్థిక అవకతవకలపై ప్రస్తుత కార్యదర్శి జగన్నాథరావు జూలై 28న సీసీఎస్కు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశారు. చెనోయ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, సిరి కన్సల్టెంట్స్ (టెక్నికల్ ఎవాల్యుయేషన్ టీమ్) ఆడిట్ సంస్థల నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టి దోషులను చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను కోరారు. కానీ ఇప్పటివరకు కనీసం కేసు కూడా నమోదవలేదు. దీనివెనుక రిటైర్డ్ ఐపీఎస్ చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జిల్లా రిజిస్ట్రార్పై ఇదే ఐపీఎస్ ఒత్తిడి తెచ్చి ప్రస్తుత పాలకవర్గం ఎన్నికే చెల్లదన్న ఉత్తర్వులు ఇప్పించారని.. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తే ఉత్తర్వును కొట్టేసిందని ప్రస్తుత క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో దేశంలోకెల్లా ప్రముఖులైన వివిధ రంగాల వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలు, సివిల్ సర్వీస్ అధికారులు సభ్యులుగా ఉన్నారని.. వారందరి అభ్యర్థన మేరకు జరిగిన విచారణ, ఆపై కేసు నమోదుకు ఫిర్యాదు చేస్తే విచారణ ప్రారంభించకపోవడం ఏమిటని వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని క్లబ్ పాలకవర్గం తీవ్రంగా పరిగణిస్తోంది. -
ఎప్పటిలోగా తొలగిస్తారో చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన 22ఏ నిషేధిత భూముల సమస్యకు ప్రభుత్వం తక్షణ పరిష్కారం చూపాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆయన శనివారం రాత్రి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా బాధితులకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అబద్ధాల ప్రవాహం పారించారని ఆరోపించారు. తాను అడిగిన ఏ ప్రశ్నకూ మంత్రి సమాధానం చెప్పలేదన్నారు.డిసెంబర్ 3, 2025న తొందరలో లిస్ట్ అప్లోడ్ చేయడం వల్ల తప్పు జరిగిందని పొంగులేటి ఒప్పుకున్నారన్నారు. తప్పు ఒప్పుకున్నప్పుడు బాధితులకు క్షమాపణ చెప్పి, సమస్యను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 22ఏ జాబితాలో ఎన్ని ఎకరాలు చేర్చారు, ఎన్ని తొలగించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇల్లు జాబితా నుంచి తొలగించినట్టే ప్రజల భూములను కూడా జాబితా నుంచి తొలగించాలని హరీశ్రావు కోరారు. కాంగ్రెస్ సర్కారే భూమి, ఎన్వోసీ ఇచ్చింది.. తన కుటుంబ సభ్యులపై పొంగులేటి చేసిన ఆరోపణలను హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. తన మామ హన్మంతరావు రిటైర్డ్ బ్యాంకు అధికారి అని, ఆయన కొండపాకలో భూమి కబ్జా చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎక్స్ సర్వీస్మన్ సత్యనారాయణకు 1995లో అప్పటి ప్రభుత్వం ఆ భూమిని కేటాయించిందని, 2010లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్వోసీ ఇచ్చిందని వివరించారు. ఆ ఎన్వోసీ ఆధారంగా తన మామ చెక్ ద్వారా డబ్బు చెల్లించి, అప్పటి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. భూమి కేటాయించి ఎన్వోసీ ఇచ్చిందీ కాంగ్రెస్... రిజిస్ట్రేషన్ చేసింది కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. ఎకరం రూ.15 కోట్లు విలువ చేస్తుందని చెబుతూ, రూ.50 లక్షలకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ పొంగులేటి చేసిన వ్యాఖ్యలు కూడా తప్పేనన్నారు. కొండపాక సిద్దిపేట నియోజకవర్గంలో కాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో ఉందని, ఈ విషయంలోనూ మంత్రి తప్పుగా మాట్లాడారని పేర్కొన్నారు. నాదర్గుల్, ఖాజాగూడ భూములు, ఫీనిక్స్ కంపెనీ ఒప్పందం తదితర అంశాలపై తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరూపిస్తే రాజీనామా చేస్తా: పల్లా జనగామ, వట్టినాగులపల్లి భూముల వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. వట్టినాగులపల్లిలో రూ.3 వేల కోట్ల విలువైన 29 ఎకరాల భూదాన్ భూమిని తాను తీసుకున్నానని పొంగులేటి ఆరోపించారని, ఇందులో వాస్తవం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే తనకు ఎకరం పది గుంటల భూమికి అగ్రిమెంట్ జరిగిందని, రాష్ట్రం ఏర్పడిన తొలి నెలలోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని తెలిపారు. ఇది భూదాన్ భూమి కాదని 2008లోనే కోర్టు స్పష్టం చేసిందన్నారు. తనకు ఉన్నది ఎకరం పది గుంటలేనని, 33 ఎకరాల్లో మైనంపల్లి సోదరులు ప్లాట్లు కొనుగోలు చేశారని, అందులో 8.10 ఎకరాలు మైనంపల్లి చంద్రశేఖర్ పేరున ఉన్నాయని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను హరీశ్రావుతో కలిసి జనగామకు వెళ్లి ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టినందుకే తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. తన భూమిని 22ఏ జాబితాలో చేర్చి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, కోర్టు కూడా తన భూమి విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పిందన్నారు. 29 ఎకరాల భూమి తనదని పొంగులేటి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే పొంగులేటి రాజీనామా చేస్తారా అని పల్లా సవాల్ విసిరారు. -
56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్తో ‘56% బీసీలు.. రాజకీయ రంగంలో వాటా ఎక్కడ?’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీసీ ఇంటెలెక్టువల్స్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, బీజేపీ నాయకుడు తాడూరి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.మూడు మంత్రి పదవులు బీసీలకే ఇవ్వాలిప్రస్తుతం ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను తక్షణమే బీసీలకు కేటాయించాలని సమావేశం ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరింది. వడ్డెర, కుమ్మరి, నాయీబ్రాహ్మణ వంటి ఇప్పటివరకు తగిన ప్రాతినిధ్యం పొందని బీసీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.రెండు దశాబ్దాల్లో తగ్గిన ప్రాతినిధ్యంటి.చిరంజీవులు మాట్లాడుతూ.. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు బీసీలు మంత్రులుగా ఉండగా, 2014లో నలుగురికి, 2018లో ముగ్గురికి, ప్రస్తుతం ఇద్దరికి తగ్గారని గణాంకాలతో వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీసీల మంత్రివర్గ ప్రాతినిధ్యం మరింత పడిపోయే ప్రమాదం ఉందన్నారు. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు పరిపాలనలో మైనారిటీగా మారడం సామాజిక న్యాయానికి విరుద్ధమన్నారు.సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. మెజారిటీగా ఉన్న బీసీలు రాజకీయ అధికారంలో మాత్రం మైనారిటీ స్థాయిలో ఉండటం బాధాకరమన్నారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలని, జనగణనలో ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని కోరారు.‘ఓట్లు మనవి.. సీట్లు వారివా?’బీసీలకు కేవలం ఓటు హక్కు కాకుండా జనాభా ప్రాతిపదికన అధికారంలోనూ వాటా కావాలని బాలగోని బాలరాజుగౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కోసం అన్ని ప్రజాస్వామిక శక్తులు ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.అలాగే, తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీలను విభజించి వారి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కటకం నరసింహారావు బీసీ హక్కుల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం నిర్మించాలని కోరారు. గుజ్జ సత్యం రానున్న కాలం బీసీలదేనన్నారు.తదుపరి వట్టే జనార్దన్ యాదవ్ మాట్లాడుతూ.. యాదవులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవుల్లో కనీసం ఒకటి యాదవులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విఠల్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు రాజకీయంగా అన్యాయం జరిగిందన్నారు.బీసీలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కావాలిజనాభాలో మెజారిటీగా ఉన్నప్పటికీ బీసీలకు అధికారంలో తగిన వాటా దక్కడం లేదని సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఓట్లు మనవి.. సీట్లు వారివా?’ అనే పరిస్థితి మారాలని, బీసీలు ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయ నిర్ణయాధికారంలో భాగస్వాములు కావాలని స్పష్టం చేసింది.జనగణనలో ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించడం, బీసీల రాజకీయ ప్రాతినిధ్యంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, గణాంకాలతో కూడిన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం, బీసీ కులాలు, సంఘాలు, మేధావులు ఐక్యంగా ముందుకు సాగడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.అడ్వొకేట్ రాజు మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీలు సాధించిన విజయం వారి ఐక్యతకు నిదర్శనమన్నారు. పొన్నం దేవరాజు మాట్లాడుతూ బీసీ అడ్వొకేట్లు తమ హక్కులు, రాజకీయ, సామాజిక ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎర్ర సత్యనారాయణ, సూర్యనారాయణ, రిటైర్డ్ డీఆర్వో ఇలి వెంకన్న, దుర్గయ్యగౌడ్, మెట్టు సూర్యప్రకాశ్, బైరి శేఖర్, కర్ణాటి మనోహర్, చిన్నారాములు, ముదిరాజ్, చెన్న శ్రీకాంత్, బొంగు ప్రసాద్, నీరజ గౌడ్, లింగేశ్, చోళ రాజేశ్వర్, యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ వాటా దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని సమావేశం స్పష్టం చేసింది. -
Hyderabad: గణపయ్య భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త
సాక్షి, హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేష్ మండపాలను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం నుండి సెప్టెంబర్ 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి వెల్లడించారు. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లయిన జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా సాగే ఈ రవాణా సౌకర్యాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ ప్రత్యేక బస్సులు జేబీఎస్ నుండి ప్రారంభమై ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్గంజ్, సీబీఎస్/ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐ.ఎస్. సదన్, పిసల్బండ, మిధాని టి.షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్ల మీదుగా బాలాపూర్ గణేష్ మండపానికి చేరుకుంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా జేబీఎస్ వద్ద ఉదయం 6:00 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 21:55 గంటల వరకు ప్రతి 40 నుండి 50 నిమిషాల వ్యవధితో నిరంతరాయంగా బస్సులు నడుస్తాయి.అలాగే బాలాపూర్ గణేష్ మండపం నుండి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 గంటలకు ప్రారంభమై రాత్రి 23:50 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక హైదరాబాద్ గణేష్ ఉత్సవాల వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎండీ నాగిరెడ్డి వివరించారు. -
‘‘ప్రతి అర కి.మీ.కి వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి’’
హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి అర కిలోమీటరుకు వ్యర్థాల సేకరణ కేంద్రాలు నెలకొల్పాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సూచించారు. కొత్తగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్సులు, వాణిజ్య భవనాల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను తప్పనిసరి చేయాలని కోరారు.శనివారం రాష్ట్ర శాసనసభలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు-2026’పై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. పర్యావరణ సుస్థిరత, వాతావరణ మార్పులపై కార్యాచరణ, లింగ సమానత్వం, సార్వత్రిక ప్రాప్యత, సమ్మిళిత పట్టణ రూపకల్పన, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలతో సమగ్ర కార్యాచరణ వ్యవస్థను ప్రతిపాదించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. వీటితోపాటు ఘన వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్మూలనకు స్పష్టమైన ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఒక నగరంలోకి ప్రవేశించే వారికి మొదట కనిపించే పరిసరాలే ఆ నగరంపై తొలి అభిప్రాయాన్ని కలిగిస్తాయని పద్మావతి రెడ్డి అన్నారు.పరిశుభ్రమైన రహదారులు, క్రమబద్ధమైన వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అందుబాటులో ఉండే పౌర సదుపాయాలు నగర అభివృద్ధికి ప్రధాన సూచికలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి ఘన, జీవ వ్యర్థాలు వెలువడుతున్నాయని, నిర్మాణ పనుల ద్వారా శిథిల వ్యర్థాలు, ఆసుపత్రుల నుంచి జీవవైద్య వ్యర్థాలు, హోటళ్లు, వీధి ఆహార కేంద్రాల నుంచి ఆహార వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు. వాటి స్వభావానికి అనుగుణంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో తరలించి, సురక్షితంగా నిర్మూలించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.“మనిషి ఉన్న ప్రతి చోటా ప్రతిరోజూ వ్యర్థం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల వ్యర్థాల నిర్వహణ అప్పుడప్పుడు చేపట్టే కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజూ నిరంతరాయంగా కొనసాగే వ్యవస్థగా ఉండాలి” అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో రహదారుల పక్కన, పాదచారి మార్గాల మూలల్లో, ఖాళీ స్థలాల్లో చెత్తను పారవేస్తున్నారని చెప్పారు. కొద్దిరోజుల్లోనే అది భారీ చెత్త కుప్పగా మారి దుర్వాసన వెదజల్లడంతోపాటు వీధి కుక్కలు చేరడానికి కారణమవుతోందన్నారు. దీనివల్ల ప్రజారోగ్యంతోపాటు నగర పర్యావరణం, సౌందర్యం దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగర రూపకర్తలు, ఆర్కిటెక్టుల సహకారంతో ప్రతి అరకిలోమీటరుకు ఒక వ్యర్థాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కేంద్రాలు సాధారణ చెత్త కుండీల మాదిరిగా కాకుండా నగర సౌందర్యంలో భాగంగా కనిపించేలా ఆకర్షణీయంగా, శాస్త్రీయంగా రూపకల్పన చేయాలన్నారు.ప్రజలు నడిచి వెళ్లగలిగే దూరంలో వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఉంటే ఎక్కడపడితే అక్కడ చెత్త పారవేసే పరిస్థితి తగ్గుతుందని చెప్పారు. పురపాలక సంస్థలకు వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్వహణ కూడా సులభతరం అవుతుందన్నారు. నగరం నివసించడానికి ఆరోగ్యకరంగా, చూడటానికి ఆహ్లాదకరంగా ఉండాలంటే పరిశుభ్రత విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేయాలని కోరారు. -
దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారా? బండి సంజయ్
హైదరాబాద్: ఏబీవీపీ కార్యకర్తల పట్ల పోలీసుల వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వాళ్లపై దాడులు చేసి భయపెట్టాలని చూస్తారా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన ఏబీవీపీ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయని కారణంగానే ఏబీవీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారని, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన చేస్తే కాళ్ళు చేతులు విరగ్గొడతారా? అని నిలదీశారు. ‘కాంగ్రెస్ సర్కార్కు పోయే కాలం దాపురించింది. ప్రశ్నించే వాళ్లపై దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నేతలను విడిచిపెట్టాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. జీవో నంబర్-9ను రద్దు చేయాలి. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ, విద్యార్థి సంఘాలపై అమానుషంగా ప్రవర్తించడం దుర్మార్గం. విద్యార్థులని చూడకుండా ఇష్టరీతిన గొడ్డున బాదినట్లు చావగొడతారా?, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్యాల రాకేష్ తీవ్ర అస్వస్థత కాగా తోటి నాయకులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. విద్యార్థి నాయకుడు అస్వస్థకు గురికాడారానికి కారణం పోలీసులు కాదా?, ఈ ఘటన చూస్తే అర్థం అవుతుంది పోరాడే విద్యార్థులపై ఏ రకంగా దాడి చేస్తున్నారో అనే విషయం. అరెస్ట్ చేసిన ఏబీవీపీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తే.. హైడ్రా కూలగొడుతుందా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే -
దారుణం.. వెంబడించి మరి కారుతో బైకును ఢీ
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో దారుణం జరిగింది. ఫ్రీ లెప్ట్ రూట్లో కారు అద్దాని పొరపాటును బైక్ తాకింది. దీంతో దానిపై ఆగ్రహం చెందిన కారు డ్రైవర్ ఆ దంపతుల బైక్ను వెంబడించారు. కారుతో దారుణంగా ఢీకొట్టారు. దీంతో ఇద్దరు దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
‘‘గణేశ వేడుకలకు ఎక్కడాలేని విధంగా ఈ సౌకర్యం అందిస్తున్నాం’’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి శనివారం వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్ల సమీక్షలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంప్రదాయాన్ని పునర్దుద్ధరించామని తెలిపారు. సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా తానే సమీక్ష నిర్వహిస్తున్నానని అన్నారు.‘‘మండపాలకు అతిథులను ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలు స్థానిక కమిషనరేట్ కు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఊహించని పరిణామాలు జరగినపుడు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలి. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుంది. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువుల వద్ద చుట్టూ క్రేన్స్ ఏర్పాటుకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలి. పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలి. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలి. సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. -
హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తే.. హైడ్రా కూలగొడుతుందా?: కాంగ్రెస్ ఎమ్మెల్యే
హైదరాబాద్: హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం హైడ్రా అవలంభిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఒకవైపు హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తుంటే.. మరొకవైపు హైడ్రా వచ్చి కూలగొడుతుందా? అని నిలదీశారు. ‘‘హెచ్ఎండీఏ పర్మిషన్ ఇస్తుంది.. హైడ్రా వచ్చి కూలగొడుతుంది’’ ఇదే ప్రస్తుతం జరుగుతుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతామన్నారాయన. హైడ్రా-హెచ్ఎండీఏల మధ్య సమన్వయం లేని కారణంగా పర్మిషన్లు ఇవ్వడం- ఆపై కూలగొట్టడమే జరుగుతుందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘ క్యూర్ ఏరియాలో అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరం. ప్రతీ నెల సమన్వయ కమిటీ సమావేశం జరగాలి. ప్రభుత్వ శాఖలే పర్మిషన్ ఇచ్చి.. ప్రభుత్వ శాఖలే కూలగొడితే ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం పోతుంది. హైడ్రా, హెచ్ఎండీఏ మధ్య సమన్వయం అవసరం. ఇలా లేకపోతే హెచ్ఎండీఏ పర్మిషన్లు ఇవ్వటం, మరొకవైపు హైడ్రా వచ్చి కూలగొట్టడమే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ నేతలపై కేసులు.. వారిపై మౌనం ఎందుకు?: కేటీఆర్ -
TG: ‘గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ఇబ్బందులు’
హైదరాబాద్ : తాము తెలంగాణ ప్రజల ఆస్తుల హక్కుల రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడితే, తాము వాటిని సరి చేసి ప్రజా ఆస్తుల హక్కుల పరిరక్షిస్తున్నామన్నారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్ 12వ తేదీ) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ తన స్వప్రయోజనాలకే పనిచేశారని విమర్శించారు. ‘గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ లేకుండా గత ప్రభుత్వం చేసింది. ధరణి పేరుతో వారు ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి 22-A పేరుతో పేదల కడుపు కొట్టారు. ధరణి పోర్టల్ వల్ల బీఆర్ఎస్ నేతలకే లాభం చేకూరింది. ధరణి వల్ల ప్రతి జిల్లాలోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మా ప్రభుత్వం వచ్చే నాటికి ధరణిలో 2.4 లక్షల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ధరణిలో ఉన్న సమస్యలను చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ధరణి వచ్చిన తర్వాత మూడు నెలలు రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ధరణి కాంట్రాక్ట్లను వారి తొత్తులకే కట్టబెట్టారు. అనేక మంది రైతులు ధరణి వల్ల నష్టపోయారు’ అని ఆరోపించారు.ఇక తమ ప్రభుత్వం వచ్చాక తెచ్చిన భూభారతి పోర్టల్ గురించి అనేక మందితో చర్చించిన తర్వాతే ముందుకెళ్లామన్నారు. మూడు నెలల్లోనే భూభారతి చట్టానికి విధివిధినాలను రూపొందించామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టంతోనే భూభారత చట్టం పనిచేస్తుందన్నారు.ఇదీ చదవండి: సీఎంగా తలసాని.. ఉత్తమ్గా పల్లా.. మాక్ అసెంబ్లీలో నవ్వులే నవ్వులు! -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)
-
హైదరాబాద్ గన్ పార్క్ వద్ద హైటెన్షన్ అసెంబ్లీ ముందు నిరసన
-
నాలుగేళ్లుగా ప్రైవేట్ హోటల్స్లో గడిపారు!
హైదరాబాద్: స్నాప్చాట్లో పరిచయం ప్రేమగా మారింది. ఏకాంతంగా నాలుగేళ్లుగా ప్రైవేట్ హోటల్స్లో గడిపారు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తేవడంతో అతను ముఖం చాటేశాడు. ఈ ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సైదులు వివరాల ప్రకారం.. నాగాపూర్కు చెందిన యువతి(22) హైదరాబాద్ శాలిబండకు చెందిన యువకుడితో(24) స్నాప్ చాట్ 2022వ సంవత్సరంలో పరిచయమయ్యారు.పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ప్రేమించిన యువకుడి కోసం నాగాపూర్ నుంచి యువతి అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుండేది. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ రెసిడెన్షియల్లో గదిని అద్దెకు తీసుకొని గడిపేవారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో యువకుడు ముఖం చాటేశాడు. మరొక అమ్మాయిని ప్రేమించానంటూ బాధిత యువతిని మోసం చేశాడు. దీంతో బాధితురాలు గురువారం నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి -
మంచిర్యాల: పోర్న్ వీడియోలు చూస్తున్న ఐదుగురిపై కేసు!
స్మార్ట్ఫోన్ యుగంలో పోర్నోగ్రఫీ సైట్లతో అశ్లీలత చేతుల్లోకి చేరింది. మైనర్ల నుంచి మొదలుకొని నడివయస్సు వరకు చాలామంది పోర్నోగ్రఫీకి బానిసగా మారుతున్నారు. కొందరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తూ జైలు పాలవుతున్నారు. ఈ ఏడాది మంచిర్యాల పోలీస్స్టేషన్ పరిధిలో చైల్డ్పోర్నోగ్రఫీ వీడియోలు చూసి, ఇతరులకు షేర్ చేసినందుకు ఐదుగురిపై కేసు నమోదైంది. వీరిలో ముగ్గురు మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. - మంచిర్యాల జిల్లాఅశ్లీల వెబ్సైట్లపై ప్రత్యేక నిఘా..అశ్లీల వెబ్సైట్లు, టెలిగ్రామ్, సోషల్ మీడియా ఫ్లాట్ఫాంలపై అమెరికాకు చెందిన యూనైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్సీఎంఈసీ), నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్ర్డన్ అనే ప్రత్యేక విభాగం ప్రత్యేక నిఘా పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై జరిగే అశ్లీల దాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫొటోలు ఎవరు చూస్తున్నారు, ఎవరు షేర్ చేస్తున్నారో గుర్తించి ఆయా రాష్ట్రాల పోలీసులకు సమచారం అందిస్తోంది. స్థానిక పోలీస్స్టేషన్లకు పోర్నోగ్రఫీ వీడియోలు చూసిన, షేర్ చేసిన వారి వివరాలు అందించి కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. చట్ట ప్రకారం ప్రైవేటుగా చూడడం నేరం కాకపోయిన, చూసి ఇతరులకు షేర్ చేయడం ఐటీ యాక్ట్ 67 ప్రకారం నేరమవుతుంది. ఒకవేళ ఆ వీడియోల్లో మైనర్లు ఉంటే అది ఐటీ యాక్ట్ 67–బీ, పోక్సో చట్టం ప్రకారం ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.యువత పక్కదారి..విద్యార్థి దశలోనే అరచేతిలో ఉన్న సెల్ఫోన్ వారిని నేరాల్లోకి నెడుతోంది. తాజాగా జిల్లా కేంద్రంలో ఆండాలమ్మ కాలనికి చెందిన ఓ మైనర్ బాలుడు ఫోర్న్ వీడియోలు చూసి మరో మైనర్ బాలికను వేధించినందుకు సదరు బాలిక దగ్గరి బంధువు బాలుడిని మందలించాడు. దీంతో బాలుడు మద్యం మత్తులో మందలించిన వ్యక్తి గొంతు కోసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సెల్ఫోన్లలో లైంగిక, హింసాత్మక ఆంశాలు కౌమర దశలో ఉన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీడియోలు చూస్తే ఎవరికి తెలుస్తుందిలే అన్న భ్రమలో యువత ఉంటున్నారు. కానీ పోర్నోగ్రఫీ వెబ్సైట్లు ఎవరు చూస్తున్నారు.. ఎవరికి షేర్ చేస్తున్నారు.. ఎవరు డౌన్లోడ్ చేస్తున్నారో ఎన్సీఎంఈసీ ఇట్టే పట్టేస్తోంది. తమ పిల్లలు సెల్ఫోన్లో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు ఓ కన్నేయాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.సర్వర్లు బ్లాక్.. పోర్న్ వెబ్సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్ చేయిస్తోంది. నిర్వాహకులు బ్లాక్ అయిన వెబ్సైట్ పేరును పోలిన లేదా దాని చివర 1, 2 లాంటి అంకెలు చేర్చి మరో వెబ్సైట్ను ప్రారంభిస్తున్నారు. ఈ తరహా వెబ్సైట్లను హోస్ట్ చేస్తున్న సర్వర్లు విదేశాల్లో ఉన్నవే కావడంతో వెబ్సైట్ల నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండడం లేదని ఓ పోలీస్ అధికారి చెప్పడం గమనార్హం.వెంటనే తెలిసిపోతుంది..పోర్నోగ్రఫీ వీడియోలు చూడడం నేరమని తెలియక యువత చూస్తున్నారు. కేంద్రం నుంచి అందించిన సమాచారం ఆధారంగా వీడియోలు చూస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఐదు కేసులు నమోదు కాగా అందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు. అశ్లీల వెబ్సైట్లపై పూర్తి స్థాయి నిఘా ఉంది.– ప్రమోద్రావు, సీఐ, మంచిర్యాలఇటీవల నమోదైన కేసులు..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్రోడ్కు చెందిన ఓ యువకడు యూట్యూబ్, పోర్న్ వెబ్సైట్లు చూడడమే కాకుండా తనకు తెలిసిన వారికి షేర్ చేశాడు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రెన్ ప్రత్యేక విభాగం స్థానిక పోలీసులకు యువకుడి వివరాలు పంపించి కేసు నమోదుకు ఆదేశించింది. పోలీసులు యువకుడి ఇంటికి వెళ్లి కేసు నమోదు చేశారు.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భగవంతం వాడకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు తరచూ చూస్తుండేవాడు. చూడడమే కాకుండా ఇతరులకు షేర్ చేశాడు. దీంతో నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయింటెడ్ చిల్డ్రెన్ ప్రత్యేక విభాగం అతడిని గుర్తించి సదరు యువకుని అడ్రస్తో సహా స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించింది.నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మదీన కాలనీకి చెందిన ఓ వ్యక్తి పిల్లల అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతనిపై ఈనెల 5న కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని(కె) గ్రామానికి చెందిన తౌడు శ్రావణ్ పిల్లల అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోర్న్ ఫొటోలు, వీడియోలు బ్రౌజ్ చేసి డౌన్లోడ్, అప్లోడ్ చేసినందుకు అతడిపై ఈనె 5న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి -
బీఆర్ఎస్ నేతలపై కేసులు.. వారిపై మౌనం ఎందుకు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ కక్షతోనే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. లైంగిక వేధింపుల కేసులను సైతం చట్టాన్ని దుర్వినియోగం చేసేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా.. ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరు చట్టబద్ధ పాలనకు విరుద్ధంగా ఉందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయడంలో పోలీసులు చూపుతున్న వేగం.. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేస్తూ.. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణలపై మాత్రం మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించకూడదని సూచించారు.The cheap minister of Telangana made his police file a sexual harassment case on BRS MLAs and MLCs in the context of the melee at assembly entry point !!! Shocking abuse of lawWe of course will fight this rubbish cases in court of law But let me ask @TelanganaDGP Garu… pic.twitter.com/dGxvJrSibA— KTR (@KTRBRS) September 12, 2026ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీకి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. మిస్ వరల్డ్ సందర్భంగా మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలపై విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు కాపాడుతున్నారా? అని నిలదీశారు.ఇదీ చదవండి: తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ.. -
చంపి ముక్కలు చేసి.. అడవిలో పడేసి
హసన్పర్తి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలో అదృశ్యమైన మహిళ కేసు దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చిన మహిళను తన స్వగ్రామానికి రప్పించి నిందితుడు హత్య చేశాడు. ఈ మేరకు హసన్పర్తి పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ వెల్లడించారు. ఆయన కథన ప్రకారం హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన తౌటం స్వప్న (40).. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. గత మే 31న తన కూతురు కనిపించడం లేదని తండ్రి ఆమంచ రాజేందర్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు బృందాలు విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను సేకరించి విచారణ చేపట్టి కేసును ఛేదించారు. కర్ణాటక రాష్ట్ర బళ్లారి జిల్లా గుడుదూరు గ్రామానికి చెందిన కారు డ్రైవర్ వొద్దిరాజుల బసవరాజ్ అనే యువకుడితో స్వప్నకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని స్పప్న బెదిరింపులకు పాల్పడింది. అలా అయితే తన పరువు పోతుందని స్వప్న ఇష్టానుసారం పెళ్లికి బసవరాజ్ అయిష్టంగా అంగీకరించాడు. ఆమెను ఇక్కడి నుంచి బళ్లారికి రప్పించాడు. అనంతరం స్థానిక గావి సిద్ధేశ్వర ఆలయం సమీపంలోకి స్వప్నను తీసుకెళ్లి హత్య చేశాడు. హత్యను దాచిపెట్టేందుకు మరుసటి రోజు మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసి, రక్తపు మరకలు ఉన్న బట్టలను తగులబెట్టాడు. స్వప్న మొబైల్ను చెరువులో పడేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అంబాల–కమలాపూర్ ప్రధాన రోడ్డులో తాజాగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులను చూసి బసవరాజ్ పరారయ్యే క్రమంలో అదుపులోకి తీసుకుని విచారించారు. స్పప్నను తనే హత్యచేశానని అంగీకరించగా బసవరాజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ మహేందర్, ఎస్సైలు సుజిత్, రవి, దేవేందర్, ఏఓ సల్మాన్ పాషా, సిబ్బందిని సీపీ శ్వేత అభినందించారు. ఇదీ చదవండి: కేపీహెచ్బీ: అర్ధరాత్రి లాఠీ ఝళిపించిన ఎస్సై మౌనిక -
సీఎంగా తలసాని.. ఉత్తమ్గా పల్లా.. మాక్ అసెంబ్లీలో నవ్వులే నవ్వులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ వర్షాకాల సెషన్ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెన్షన్కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆ పార్టీ ప్రదాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించింది. బీఆర్ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో స్పీకర్ పాత్రను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావ్ పోషించారు. అలాగే సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర వేశారు. మంత్రి పొంగులేటి పాత్రలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మంత్రి ఉత్తమ్ పాత్రలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అలరించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా కేటీఆర్, హరీష్రావు.. మిగతా ఎమ్మెల్యేలు కనిపించారు.ఈ చర్చలో మాజీ మంత్రి జగదీశ్ ప్రశ్నలు వేయగా.. అవతలి నుంచి సమాధానాలు వచ్చాయి. సీఎం, మంత్రుల్ని ఇమిటేట్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన సందడి నవ్వులు తెప్పించాయి. కాంగ్రెస్ సర్కార్కు సెటైరిక్గా చివరి వరకు నడిచింది మాక్ అసెంబ్లీ. LIVE: తెలంగాణ భవన్ లో ''మాక్ అసెంబ్లీ'' కార్యక్రమంhttps://t.co/2C1qZvGBQB— BRS Party (@BRSparty) September 12, 2026సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుపడుతున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుల్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అయితే కీలక హామీలు నెరవేర్చకపోవడం, ప్రజా సమస్యలు, పలు కీలక అంశాలపై చర్చకు భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం తమను సభలో లేకుండా చేసిందని బీఆర్ఎస్ అంటోంది. ఈ క్రమంలోనే మాక్ అసెంబ్లీ నిర్వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: ఇంతకీ ఆమెకు ఏమైంది?.. ఎక్కడ? -
విజయవాడలో భారీ వర్షం.. మరో గంటలో తెలంగాణలో వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతుండగా.. ఈదురుగాలుల వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ప్రధాన రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు విజయవాడలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు యానాంలో వచ్చే మూడు గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన ఉరుములు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి ఉరుములు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. Back to Back spells of Heavy rains likely along #Vijayawada city and nearby areas like Amaravati, Mangalagiri during next 1 hour. The rains will definitely be of high intensity. ⚠️— Andhra Pradesh Weatherman (@praneethweather) September 12, 2026మరోవైపు... తెలంగాణలో శనివారం తెల్లవారుజాము నుంచే వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. హనుమకొండ, వరంగల్, జనగామ ప్రాంతాల్లో ఇప్పటికే విస్తారంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 9.30 గంటల వరకు యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్ ప్రాంతాలకూ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో విస్తారంగా మోస్తరు నుంచి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్, ఆమనగల్ ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు నల్గొండ జిల్లాలోని ఘట్టుప్పల్, మునుగోడు, చండూరు, నల్గొండ పట్టణం, కంగల్, నాంపల్లి తదితర ప్రాంతాలకు విస్తరించి.. ఆ తర్వాత సూర్యాపేట వైపు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: కాలువలకు నిధులు కట్..Fairly WIDESPREAD MODERATE RAINS across Hanmakonda, Warangal, Jangaon areas now, this will further cover Yadadri - Bhongir, Mahabubabad till 9.30 AM ⚠️🌧️ Enjoy the spell 🌧️ https://t.co/0maF5928UX— Telangana Weatherman (@balaji25_t) September 12, 2026నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ రానున్న రెండు గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లోనూ అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఉల్లికి మళ్లీ రెక్కలు!
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ఉలికిపాటుకు గురిచేస్తోంది. ధరల ఘాటు కన్నీళ్లు పెట్టిస్తోంది. జూలైలో కిలో రూ.20 ఉండగా.. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.60 నుంచి 70 వరకు పలుకుతోంది. కాలనీల్లో రూ.80– 90 వరకు అమ్ముతున్నారు. దీంతో కూరల్లో ఉల్లి వాడాలంటేనే వణుకు పుట్టించే పరిస్థితి నెలకొందని గృహిణులు చెబుతున్నారు. లెక్కేసుకుని మరీ కొంటున్నామని అంటున్నారు. హోటళ్లు, కేటరింగ్ వాళ్లు టిఫిన్లు, భోజనాల్లో ఉల్లి వాడకం తగ్గించడం గమనార్హం. నాసిక్లో వర్షాలతో.. ఉల్లి ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సరఫరా తగ్గిపోవడమే. మలక్పేట మార్కెట్కు గతంలో ప్రతిరోజూ సుమారు 25 వేల బస్తాలు వచ్చేవి. ప్రస్తుతం 15 వేలకు పడిపోయాయి. నగరానికి ఉల్లి ఎక్కువగా మహారాష్ట్రలోని నాసిక్ నుంచే వస్తుంది. అక్కడ భారీ వర్షాలకు పంట మునిగింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షాలు లేక దిగుబడి పడిపోయింది. ఈ ప్రభావం నగరంపై పడింది. మరో నెల రోజుల పాటు ఉల్లి ధరలు మండుతూనే ఉంటాయని నగర వ్యాపారులు చెబుతున్నారు. అక్టోబర్లో కొత్త పంట వస్తేనే ధరలు తగ్గే అవకాశముంది. -
మా మనసులు గాయపడ్డాయి
సాక్షి, న్యూఢిల్లీ: ‘నడిరోడ్డుపై.. పట్టపగలు అందరూ చూస్తుండగా మహిళా ప్రజాప్రతినిధుల చీరలను లాగారు. గొంతు నొక్కి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తెలంగాణలో పోలీసులు మాపై అత్యంత క్రూరత్వంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై పోరాడతామని మమ్మల్ని ప్రజలు చట్టసభలకు పంపారు. కానీ, ఈరోజు మాకు జరిగిన అన్యాయంపై మేం రోడ్డెక్కి న్యాయం కోసం, సమస్య పరిష్కారానికి పోరాడాల్సి వస్తుంది. ఆఖరకు ఢిల్లీ వరకూ వచ్చి మీకు మా బాధను చెప్పుకోవాల్సి వచి్చంది’అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి జాతీయ మహిళా కమిషన్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే.. ప్రజాప్రజానిధులను గాయపరుస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించి మా సమస్యను పరిష్కరించాలని, తెలంగాణలో పోలీసుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు రెండు కమిషన్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి, పోలీసులు వ్యవహరించిన తీరుపై శుక్రవారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిశోర్ రహత్కర్, ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్లకు రాజ్యసభ ఫ్లోర్లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎంపీ దామోదర్, మాజీమంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం నుంచి బీఎస్ ప్రసాద్, సోమా భరత్, లలితారెడ్డి తదితరులతో కలిసి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 100 గంటలు దాటినా ఎఫ్ఐఆర్ లేదు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి సభకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. నల్ల దుస్తులు ధరించడాన్ని కారణంగా చూపారని, అయితే తమ దుస్తులపై ఎలాంటి అభ్యంతరకరమైన రాతలు లేవని స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పురుష పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందన్నారు. చీర, జుట్టు పట్టుకొని లాగారని, ఇతర ఎమ్మెల్యేలను కిందపడేసి తొక్కారన్నారు. ‘మా మనసులు గాయపడ్డాయి. మహిళలుగా మాకు అవమానం జరిగింది. శాసనసభ్యులుగా మా హక్కులకు భంగం కలిగింది’అని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి జరిగి 100 గంటలు దాటినా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, తిరిగి తమపైనే కేసులు పెట్టడం రాజకీయ నాటకమని విమర్శించారు. ‘మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేయించి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడం బాధాకరం. మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా చీరలు లాగారు’అంటూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. మహిళా ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు మగ పోలీసుల్ని విధుల్లో పెట్టడం, మగ ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు మహిళా పోలీసులను పెట్టి ప్రభుత్వం రాజకీయం చేసిందని మండిపడ్డారు. మాకు రాజకీయాలతో సంబంధం లేదు దాడికి గల వీడియోలు, ఫొటోలు, న్యూస్ క్లిప్పింగులన్నీ మహిళా కమిషన్, ఎన్హెచ్ఆర్సీకి మహిళా ప్రతినిధి బృందం అందచేసింది. వాటిని పరిశీలించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోర్ రహత్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు రాజకీయాలతో సంబంధం లేదు. అసెంబ్లీకి వెళుతున్న మహిళా ప్రజాప్రతినిధులను మగ పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? చీర లాగడం, గొంతు నులమడం అన్నీ పరిశీలించాం. ఇది మేం అంత ఈజీగా వదిలిపెట్టే ఇష్యూ కాదని మాకు అర్థమైంది. తక్షణం డీజీపీ నుంచి వివరణ కోరతాం.. ఆ తర్వాత మేం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం’అంటూ ఆమె భరోసా ఇచ్చారు. ‘ఈ తరహా ఘటనలు జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో కమిషన్ ఏం చేస్తుంది? ఏం చేయాలి అనేది స్పష్టంగా ఉంటుంది. కచి్చతంగా చర్యలు అయితే తీసుకుంటాం’అంటూ ఎన్హెచ్ఆర్సీ తాత్కాలిక చైర్పర్సన్ విజయభారతి సయానీ భరోసా ఇచ్చారు. -
రూ.20 కోట్ల చిట్టీలు.. దంపతులు మాయం! అసలు కథేంటి?
హైదరాబాద్: చిట్టీల పేరుతో ప్రజల నుంచి రూ.20 కోట్లు వసూలు చేసిన దంపతులు అదృశ్యమయ్యారు. 15 రోజులుగా ఆ దంపతులు కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం హెచ్ఎంటీ హిల్స్లోని వారి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు.. హెచ్ఎంటీ సాయిచరణ్ కాలనీకి చెందిన సీత, రమణా రెడ్డి దంపతులు చిట్టీల వ్యాపారం మొదలుపెట్టారు.అయితే చిట్టీల వాయిదాలు పూర్తయినప్పటికీ తమకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని అడిగేందుకు వెళితే వాయిదా వేస్తూ తీరా కనిపించకుండా పోయారు. అందరికి చిట్టీల డబ్బు రూపంలో సుమారు 20 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని బాధితులు పేర్కొంటున్నారు. చిట్టీలు పాడుకున్న వారికి సకాలంలో డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారు.పైగా తమకు కోర్టు ద్వారా నోటీసులు పంపించడం పట్ల బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సొమ్మును తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బాధితులు ఆరోపిస్తున్నట్లుగా కాకుండా ..రూ.60 లక్షలు మోసపోయినట్లు ఆరుగురు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. మిగతా వారు కూడా ఫిర్యాదు చేస్తే కేసు దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇవీ చదవండి: ‘క్యూర్’ బిల్లు.. హైదరాబాద్ పాలనలో కీలక మార్పులే! -
కొండా సురేఖ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగుస్తున్న వేళ మాజీ మంత్రి కొండా సురేఖ అంశం మరోమారు చర్చనీయాంశమవుతోంది. గత సమావేశాల వరకు మంత్రిగా ఉన్న ఆమె వర్షాకాల సమావేశాల ప్రారంభం కంటే ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన ఆమె గత ఐదు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. మంత్రిపదవి నుంచి తొలగించిన తర్వాత తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పినప్పటికీ గురువారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశానికి కూడా ఆమె రాలేదు. అసలు ఆమె ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్న విషయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు రావడం లేదు. హైదరాబాద్లోని తన నివాసంలోనే ఆమె ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, శుక్రవారం గాందీభవన్ వర్గాల్లో జరిగిన చర్చతో ఆమె మరోమారు వార్తల్లో వ్యక్తి అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆమెకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. జరిగిన విషయాలను పక్కనపెట్టి పార్టీలో మళ్లీ చురుకుగా వ్యవహరించాలని, అసెంబ్లీకి హాజరు కావాలని సురేఖను మీనాక్షి కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఆమె హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
రేవంత్ ఏ1.. పొంగులేటి ఏ2!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం బురద రాజకీయాలు, చిల్లర మాటలు మానుకుని కష్టార్జితమైన ప్రజల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్రావు డిమాండ్ చేశారు. దరఖాస్తుల పేరిట ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పకుండా పారదర్శకంగా నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను వెల్లడించాని కోరారు. 22ఏ అంశాన్ని అడ్డుపెట్టుకుని సాగుతున్న 30 శాతం కమీషన్ల పాలనపై జ్యుడిషియల్ విచారణ జరపాలని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కేవలం సారీ చెప్పడంతో సరిపెట్టకుండా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 22ఏ వెనుక జరుగుతున్న అవినీతి భాగోతంతో సీఎం రేవంత్రెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. 22ఏ భూముల విషయంలో రేవంత్రెడ్డి ప్రథమ ముద్దాయి అయితే పొంగులేటి ఏ2 అని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో హరీశ్రావు 22ఏ భూములపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచి్చన బాధితులు 22ఏ జాబితాలో తమ భూములను పెట్టడం ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. భూమి చుట్టూ రేవంత్ పరిభ్రమణం ‘ఒక్క పెన్నుపోటుతో రాత్రికి రాత్రే తాతలు, తండ్రుల నుంచి లక్షలాది మంది ప్రజలకు సంక్రమించిన భూములను నిషేధిత జాబితాలో పెట్టి వారి జీవితాలను కన్నీళ్ల పాలు చేశారు. కేసీఆర్ పాలనలో ప్రజలు కేంద్రంగా ప్రభుత్వం నడిస్తే రేవంత్ పాలన మాత్రం భూముల కేంద్రంగా సాగుతోంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు.. భూమి చుట్టూ రేవంత్ పరిభ్రమణం చేస్తున్నాడు. నిజానికి ప్రభుత్వ, పోరంబోకు, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ల్యాండ్ సీలింగ్ భూములను కాపాడేందుకే 22ఏ నిబంధన తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఊళ్లకు ఊళ్లు, కాలనీలు, అపార్ట్మెంట్లు, హెచ్ఎండీఏ, హుడా వేలం వేసిన భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. ‘నిన్నటివరకు నీ భూమి.. పొద్దున లేస్తే నిషేధిత భూమి’అన్నట్లుగా మార్చారు. 22ఏ జాబితాలో ఉన్న సీఎం రేవంత్ ఇల్లును రాత్రికి రాత్రే జాబితా నుంచి తొలగించారు. అదే తరహాలో ప్రజల ఆస్తులను ఎందుకు తొలగించడం లేదు?..’అని హరీశ్రావు నిలదీశారు. ప్రతి నిర్ణయం వెనుకా భూ వ్యాపారమే ‘లగచర్ల గిరిజనుల భూములు మొదలుకుని హిల్ట్ పాలసీ, హైడ్రా, మూసీ సుందరీకరణ, 22–ఏ వరకు అన్ని అంశాల వెనుక ఎజెండా భూములు కొల్లగొట్టడమే. సీఎం రేవంత్, ఆయన సోదరులు, మంత్రి పొంగులేటి ఆయన కుమారుడు భూములను లక్ష్యంగా చేసుకుని అక్రమాలు, అవినీతి, బెదిరింపులకు పాల్పడుతున్నారు. హెచ్సీయూకు చెందిన 400 ఎకరాలను కుదువ పెట్టి భారీ రుణం తెచ్చారు. అలాగే మేడ్చల్లో వేల ఎకరాలను తాకట్టు పెట్టి రుణం తెచ్చారు. మూసీ సుందరీకరణ వెనక వేల ఎకరాల భూ వ్యాపారం ఉంది. నాదర్గుల్లో ప్రభుత్వ భూముల వ్యవహారం, పొంగులేటి కుటుంబానికి సంబంధించిన భూముల కబ్జాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 22–ఏలో ఎన్ని ఎకరాలు చేర్చారు..ఎన్ని ఆస్తులు చేర్చారు.. ఎన్ని తొలగించారు.. ఏ కారణంతో తొలగించారో పూర్తి వివరాలను బహిరంగ పరచాలి..’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. నాదర్గుల్, అబ్దుల్లాపూర్మెట్, ఖాజాగూడ, గచి్చ»ౌలి, రాందాస్పల్లి, ఖానామెట్ తదితర చోట్ల 22ఏను అడ్డుపెట్టుకుని భూ కుంభకోణాలు జరుగుతున్నాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వంలో గజానికో గజదొంగ: కేటీఆర్ రాష్ట్రంలో భూ దోపిడీ విపరీతంగా జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి భాగోతాలు బయటపడతాయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి మెడపట్టి గెంటేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోటి 16 లక్షల ఎకరాలకు పెంచిందన్నారు. ‘ఈ ప్రభుత్వంలో గజానికో గజదొంగ’తయారయ్యాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం సోదరులు ‘తమ్ముడు.. లెట్స్ డూ కుమ్ముడు’అన్నట్టుగా భూములు కొల్లగొడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రుల ముఠా ‘అలీబాబా అరడజను దొంగలు’గా తయారైందని ఆరోపించారు. బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.తెలంగాణ భవన్కు పోటెత్తిన బాధితులు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భువనగిరి తదితర జిల్లాల నుంచి 22ఏ జాబితా బాధితులు తెలంగాణ భవన్కు వచ్చారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడించారు. బ్యాంకు రుణాలు, పిల్లల పెళ్లిళ్లు, చదువులపై 22ఏ అంశం ఎలా ప్రభావం చూపుతుందో వివరించారు. 22ఏ కారణంగా వారసత్వంగా సంక్రమించిన భూమిని తమ వారసులకు ఇవ్వలేకపోతున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరుకు చెందిన మల్లయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం పరిధిలో గతంలో 22ఏ జాబితాలో ఉన్న భూములను తొలగించేందుకు చేసిన కృషిని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్రెడ్డి వివరించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత.. తన నియోజకవర్గం పరిధిలో కొత్తగా 40 కాలనీలను 22ఏ జాబితాలో చేర్చినట్లు ఆయన తెలిపారు. -
‘క్యూర్’ బిల్లు.. హైదరాబాద్ పాలనలో కీలక మార్పులే!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో శుక్రవారం ప్రతిపాదించిన ‘తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు– 2026’ (‘క్యూర్’ బిల్లు) కార్పొరేషన్లకు పాలన బాధ్యతలు అప్పగిస్తూనే.. కీలక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి విస్తృత పర్యవేక్షణ, ఆదేశాలు, అధికార బదలాయింపు, సంస్థల పునర్వ్యవస్థీకరణ, అవసరమైతే నేరుగా బాధ్యత చేపట్టే అధికారాలను కలి్పస్తున్నట్లు ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.సీఎం చైర్మన్గా అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ క్యూర్ పాలనకు ముఖ్యమంత్రి చైర్మన్గా అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తారు. విధాన దిశ, ప్రాధాన్యాలు, ప్రణాళికలు, వివిధ శాఖల సమన్వయంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.అధికారులతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కన్వీనర్గా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. కార్పొరేషన్ల కమిషనర్లు, సీపీలు, కలెక్టర్లు, విద్యుత్, జలమండలి, మెట్రో, ఆర్టీసీ, హైడ్రా అధికారులు సభ్యులుగా ఉంటారు.నిరంతర వైఫల్యం, విధులు నిర్వర్తించలేకపోవడం, అధికార దుర్వినియోగం లేదా ఆర్థిక ముప్పు వంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కార్పొరేషన్లను రద్దు చేయవచ్చు. అయితే.. ముందుగా కారణాలు వెల్లడించి వివరణకు అవకాశం ఇవ్వాలి.మేయర్, డిప్యూటీ మేయర్పై చర్య విధుల్లో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, చట్టపరమైన ఆదేశాల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం వంటి సందర్భాల్లో ప్రభుత్వం మేయర్, డిప్యూటీ మేయర్ను తొలగించవచ్చు. అంతకు ముందు వివరణకు అవకాశం కల్పించాలి.కమిషనర్ నియామకంకమిషనర్ను ప్రభుత్వం నియమిస్తుంది. అయితే.. నిరంతర వైఫల్యం, కార్పొరేషన్ తీర్మానాల అమలులో నిర్లక్ష్యం వంటి కారణాలతో మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది తొలగించాలని ఓటు వేస్తే ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు.రికార్డులు కోరడం, తనిఖీలు చేయించడం, విధులు నిర్వర్తించాలని ఆదేశించడం, సంబంధిత తీర్మానాలను నిలిపివేయడం/రద్దు చేయడం, అవసరమైతే ప్రత్యామ్నాయ వ్యక్తిని నియమించడం, మేయర్ లేదా సభ్యులను సస్పెండ్ చేయడం వంటి అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి.ఆదేశాలు పాటించకపోతే నేరుగా జోక్యం ప్రభుత్వ ఆదేశాలను కార్పొరేషన్ లేదా సంబంధిత సంస్థ అమలు చేయకపోతే, వివరణకు అవకాశం ఇచి్చన అనంతరం ప్రభుత్వం ఆ పనిని తానే చేపట్టే అవకాశం ఉంటుంది.సర్కిళ్లు, జోన్ల పునర్వ్యవస్థీకరణ వార్డులు, సర్కిళ్లు, జోన్ల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, విలీనం లేదా రద్దుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. వివిధ శాఖల పరిధులను కూడా వీటితో సమన్వయం చేయవచ్చు.ప్రత్యేక డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వరదలు, భారీ వర్షాలు, ఇతర విపత్తుల నివారణ, సిద్ధత, స్పందన, పునరుద్ధరణ కోసం ప్రత్యేక క్యూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. నీటి చార్జీకి అదనంగా ప్రభుత్వం నిర్ణయించే రేట్ల ప్రకారం సివరేజీ చార్జీ విధించవచ్చు. అడ్వర్టయిజ్మెంట్స్ రెగ్యులేటరీ కమిటీ ద్వారా హోర్డింగులు, సైన్ బోర్డులు, ఇతర ప్రకటనల అనుమతులు, నియంత్రణ చేపట్టనున్నారు. పనుల బదలాయింపు ఒక కార్పొరేషన్ , అథారిటీ లేదా ఏజెన్సీకి ఉన్న బాధ్యత, అధికారం లేదా విధిని ప్రభుత్వం మరో సంస్థకు బదలాయించవచ్చు. అవసరమైతే సంయుక్తంగా నిర్వహించేలా కూడా చేయవచ్చు.ఇవి కూడా చదవండి: తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే! -
పెట్రోల్తో ఒంటికి నిప్పు.. ఠాణాలోకి పరుగు!
ఖిలా వరంగల్: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని పోలీస్ స్టేషన్లోకి పరుగులు పెట్టాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం వరంగల్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్ లక్ష్మీనగర్కు చెందిన కట్ల హరీశ్, అదే ప్రాంతానికి చెందిన వైష్ణవిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు పుట్టాడు. ఆ తర్వాత వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. తన భర్త హరీశ్ మద్యం సేవించి తరుచూ గొడవ పడేవాడని, తనపై, తన తల్లిపై దాడి చేశాడని, ఆ క్రమంలో తన తల్లి చేయి విరిగిందని గతంలో వైష్ణవి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేసింది. ఈ క్రమంలో హరీశ్కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశారు. అతడిలో మార్పువస్తుందని భావించి వైష్ణవి భర్తతో కలిసి వెళ్లింది. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ అదే తరహాలో ప్రవర్తించడంతో విసుగు చెందిన వైష్ణవి ఇక భర్తతో తాను కలిసి జీవించడం సాధ్యం కాదంటూ కరీమాబాద్లోని పుట్టింటికి వెళ్లడమే కాకుండా విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈనెల 7వ తేదీన వాయిదా ప్రకారం కోర్టుకు వైష్ణవి హాజరై పుట్టింటికి చేరుకుంది. ఈ సమయంలో హరీశ్ ఆమెను వెంబడించి ఇంటికి వెళ్లి విడాకులు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడమే కాకుండా ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇంట్లో తల్లి లేకపోవడంతో ఏమీ అనకుండా వైష్ణవి ఉండిపోయింది. గురువారం మళ్లీ హరీశ్ వచ్చి అదే పద్ధతిలో ప్రవర్తించడమే కాకుండా వైష్ణవి, ఆమె తల్లిని కొట్టాడు. ఈ విషయమై అదేరోజు మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో వైష్ణవి మళ్లీ ఫిర్యాదు చేసింది. భర్తతో తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరింది. దీంతో శుక్రవారం ఉదయమే పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు హరీశ్కు సమాచారం అందించారు. మధ్యాహ్నం మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్కు రాగానే హరీశ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకుని ఒక్కసారిగా స్టేషన్లోకి దూసుకొచ్చాడు. మంటలు ఆర్పే ప్రయత్నంలో రైటర్ ప్రవీణ్, కానిస్టేబుల్ ముగ్ధుమ్ చేతులు కాలిపోయాయి. ముప్పై శాతానికిపైగా కాలిన హరీశ్తోపాటు గాయపడిన పోలీసు సిబ్బందిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, తన భార్య మంచిదేనని, అత్త వేధింపులతోనే వైష్ణవి తన నుంచి దూరమవుతుందని, కుమారుడిని కూడా దూరం చేశారని... ఈ నిర్ణయం తీసుకున్నానని ఎంజీఎంలో జడ్జి ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ స్వామి తెలిపారు. -
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వండి
సాక్షి, నెట్వర్క్: వ్యవసాయ కనెక్షన్లకు 24గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో 12 గంటలు సరఫరా చేస్తున్నట్టు చెబుతున్నా, అవాంతరాలతో అది అమలుకావడం లేదు. దీంతో వరి పంటకు నీరందక ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ⇒ వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల విద్యుత్ ఇచ్చి పంటలను కాపాడాలని, లో ఓల్టేజీ సమస్య పరిష్కరించాలని సీపీఎం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం జిల్లా కూసుమంచిలోని విద్యుత్ శాఖ ఏడీఏ కార్యాలయం ఎదుట నిరసన రైతులు తెలిపారు. ⇒ సిద్దిపేట జిల్లాలో అనధికారిక కరెంట్ కోతలు విధిస్తున్నారంటూ రైతులు రోడ్డెక్కారు. పలు చోట్ల రోడ్లపై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ఏడు గంటలు మాత్రమే త్రీఫేజ్ కరెంటు ఇస్తున్నారని, అందులోనూ కోతలు విధిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడ్డారు. ⇒ అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలోని ఇల్లందు–మహబూబూబాద్ రహదారిపై ఏఐకేఎంఎస్, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ⇒ ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం సబ్స్టేషన్ పరిధిలోని రైతులు ఏడీఈ ఉమారావుకు వినతిపత్రం అందజేశారు. రోజువారీగా ఇచ్చే విద్యుత్తోపాటు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు అదనంగా త్రీఫేజ్ విద్యుత్ ఇవ్వాలని కోరారు. ⇒ విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగారు. పాల్వంచ మండలం ఇసాయిపేట, దోమకొండ మండలంలోని సీతారాంపల్లి, భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించారు. రామారెడ్డి మండలం రెడ్డిపేటలో రాస్తారోకో చేశారు.సాగుకు అంతరాయం లేకుండా సరఫరా: సీఎండీ కే.వరుణ్రెడ్డిరాష్ట్రంలో వేసవి కాలాన్ని మించి విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరడం ఆందోళన కలిగిస్తున్నా వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నామని ఎనీ్పడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి చెప్పారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఎల్నినో కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రస్తుతం విద్యుత్ వినియోగం క్రిటికల్గా మారిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా వినియోగం పెరుగుతూ వస్తోందని తెలిపారు. సాగుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేపడుతున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
మహాగణపతి దర్శనానికి వెళ్తున్నారా? ఈ రూట్లు గుర్తుంచుకోండి!
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ పెరగడంతో ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయెల్ డేవిస్ తెలిపారు. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి మింట్ కాంపౌండ్ వైపునకు వెళ్లే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు మళ్లిస్తారు.సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి రాజ్దూత్ చౌరస్తా మీదుగా ఖైరతాబాద్ మహాగణపతి వైపునకు వెళ్లే వాహనాలను ఎక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు. ఎక్బాల్ మినార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా ఐమ్యాక్స్ వైపు ట్రాఫిక్కు అనుమతి లేదు. ఈ వాహనాలను సచివాలయ జంక్షన్ లేదా ఖైరతాబాద్ ప్లై ఓవర్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ పోస్టాఫీస్ లైన్ మీదుగా రైల్వే గేటు వైపు వెళ్లే వాహనాలను లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.ఈ సంవత్సరం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఖైరతాబాద్, షాదాన్ కాలేజీ, అయోధ్య, నిరంకారి, పాత సైఫాబాద్ పోలీస్స్టేషన్, మింట్ కాంపౌండ్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం జంక్షన్, నెక్లెస్ రోటరీ, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడవచ్చని, అందువల్ల ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.వాహనాల పార్కింగ్ వాహనాల పార్కింగ్ కోసం నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ గార్డెన్ వైపు నుంచి వచ్చే భక్తులు రేస్ కోర్స్ రోడ్డు, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ మైదానం, ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలు పార్కు చేసుకోవాలని, ఖైరతాబాద్ జంక్షన్ వైపు నుంచి వచ్చే భక్తులు విశ్వేశ్వరయ్య భవన్ ప్రాంతంలో వాహనాలు పార్కు చేసుకోవాలని తెలిపారు.ఇవీ చదవండి: తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే! -
మహానగరానికి కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: రాజధాని మహానగర భవిష్యత్తు రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈమేరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026 (టీక్యూర్ బిల్లు)ను ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో సభ్యులకు పంపిణీ చేసింది. ఈ బిల్లుపై శనివారం సమగ్ర చర్చ జరగనుంది. 1956లో అప్పటి నగర అవసరాలకు అనుగుణంగా రూపొందిన మున్సిపల్ చట్టాల స్థానంలో ఆధునిక నగర అవసరాలకు తగ్గట్టుగా సమగ్ర పాలనా వ్యవస్థను తీసుకురావడం బిల్లు ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం విస్తరించిన హైదరాబాద్ భౌగోళిక, జనాభా, ఆర్థిక అవసరాలకు పాత చట్టాలు సరిపోవడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. పాత జీహెచ్ఎంసీ పరిధితో పాటు చుట్టుపక్కల విలీన ప్రాంతాలను సమన్వయంతో అభివృద్ధి చేయడం, ప్రభుత్వ శాఖలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం, పౌర సేవలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఉంది. మూడు కార్పొరేషన్లు.. ఒకే సమన్వయం క్యూర్లోని ప్రాంతాల్ని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలుగా మూడు కార్పొరేషన్లుగా నిర్వహించే ప్రతిపాదనకు చట్టబద్ధ రూపం లభించనుంది. వీటి సమన్వయం కోసం ‘క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయనున్నారు. మహానగర స్థాయి వ్యూహాత్మక ప్రాధాన్యాలను ఈ కౌన్సిల్ నిర్దేశించనుంది.సామాన్యుల నెత్తిన బాంబుసామాన్య ప్రజలపై నేరుగా ప్రభావం చూపే అంశాల్లో ఆస్తిపన్ను మార్పు ప్రధానమైనది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంవత్సర అద్దె విలువ (ఏఆర్వీ) విధానానికి బదులుగా ఆస్తి మూలధన/రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ (సీవీఎస్) తేనున్నారు. దీనిద్వారా పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను రెట్టింపు, అంతకంటే ఎక్కువ కానుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నును ‘బేస్ ప్రాపర్టీ ట్యాక్స్’, కొత్త విధానంలో లెక్కించే పన్నును ‘బెంచ్మార్క్ ప్రాపర్టీ ట్యాక్స్’గా పరిగణించే విధానం ఉంది. కొత్త లెక్క ప్రకారం పన్ను ఎక్కువగా వస్తే ఒక్కసారిగా మొత్తం భారాన్ని మోపకుండా, క్రితం ఏడాది పన్నుపై ఏటా గరిష్టంగా 20 శాతం చొప్పున పెంచుతూ బెంచ్మార్క్ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.ఉదాహరణకు ప్రస్తుతం రూ.10వేలు పన్ను ఉండి, కొత్త విధానంలో రూ.20వేలు వస్తే.. మొదటి ఏడాది రూ.12,000, రెండో ఏడాది రూ.14,400, మూడో ఏడాది రూ.17,280 చొప్పున పెరుగుతూ చివరకు రూ.20వేలు స్థాయికి చేరుతుంది. కొత్త విధానంలో పన్ను తక్కువగా వచ్చినా వెంటనే ఆ తగ్గింపు ప్రయోజనం అందదు. బేస్ ట్యాక్స్నే కొనసాగిస్తూ భవిష్యత్లో క్యాపిటల్ వాల్యూ ఆధారంగా లెక్కించిన పన్ను దానికంటే ఎక్కువైనప్పడు కొత్త విధానాన్ని వర్తింపచేయనున్నారు. ప్రతి ఆస్తికి యూనిక్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూపీఐఎన్) కేటాయించడం ద్వారా ఆస్తుల గుర్తింపు, పన్నుల నిర్వహణ, కొనుగోలు–అమ్మకాల్లో పారదర్శకత పెరగనుంది.ఒక్క చాన్స్సెక్షన్ 160 కింద 2015, అక్టోబర్ 28 నాటికి పూర్తయిన, కొన్ని నిబంధనలకు విరుద్ధమైన లేదా అనుమతి లేని నిర్మాణాలకు జరిమానాతో ఒకసారి క్రమబద్ధికరణకు అవకాశం కల్పించే నిబంధన ఉంది. ఆ తేదీ నాటికే నిర్మాణం పూర్తయిందని అఫిడవిట్ ఇవ్వాలి. తప్పుడు అఫిడ విట్ సమర్పిస్తే క్రిమినల్ చర్యలకు అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటు భవిష్యత్తులో చేపట్టే అక్రమ నిర్మాణాలకు వర్తించదు. అక్రమ నిర్మాణాలను నిలిపివేయడం, వివరణ కోరడం, నిర్మాణ సామగ్రిని స్వా«దీనం చేసుకోవడం, కూల్చివేతకు ఆదేశించడం వంటి అధికారాలు కమిషనర్కు ఉంటాయి. సాధారణంగా భవనా న్ని సీజ్ చేయడానికి 24 గంటల ముందస్తు నోటీసు అవసరం కాగా, ప్రజా భద్రతకు అత్యవ సర ముప్పు ఉన్న పరిస్థితుల్లో ముందస్తు నో టీసు లేకుండానే సీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆక్యుపెన్సీ సరి్టఫికెట్ లేని భవనాలకు నీరు, విద్యుత్, మురుగునీటి కనెక్షన్లు ఇవ్వకుండా ని బంధనలు కఠినతరం చేయనున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కనెక్షన్లు ఇచ్చిన అధికారులపైనా చర్యలకు అవకాశం ఉంటుంది. నిబంధనలకు విరుద్ధమైన ఆస్తుల అమ్మకం, బహుమతి, లీజ్, తనఖా, మారి్పడి వంటి బదలాయింపులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అవసరమైతే వాటిని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చవచ్చు.సింగిల్ విండో.. నైట్ ఎకానమీ వ్యాపారాలకు వివిధ శాఖల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సింగిల్ విండో ఆన్లైన్ లైసెన్సింగ్ వ్యవస్థను తేనున్నారు. ఎంపిక చేసిన నైట్ ఎకానమీ జోన్లలో రాత్రివేళల్లో వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలకు చట్టబద్ధమైన అవకాశం కల్పించడం ద్వారా నగర ఆర్థిక వ్యవస్థను 24 గంటల కార్యకలాపాల దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధిదీపాలు తదితర మౌలిక సదుపాయాల నిర్వహణకు ఏఐ, డిజిటల్ మ్యాపింగ్, సాంకేతిక పర్యవేక్షణను విస్తరించనున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, ఆహార విక్రయ కేంద్రాల తనిఖీలు, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. భవనాలు, లేఅవుట్ల అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు నిర్ణీత వ్యవధిలో దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకపోతే అది పైస్థాయి అధికారుల వద్దకు వెళ్లే విధానం ఉంటుంది. అక్కడ కూడా నిర్ణయం రాకపోతే డీమ్డ్ అప్రూవల్కు అవకాశం కల్పించే నిబంధనలు ఉన్నాయి. అయితే ఇది నిబంధనలను పక్కన పెట్టే ‘ఆటోమేటిక్ అనుమతి’కాదు. ‘హైడ్రా’కు మరిన్ని అధికారాలు వరదలు, చెరువులు, నాలాలు, ఆక్రమణల నియంత్రణలో హైడ్రాకు కీలక అధికారాలను కల్పించే నిబంధనలు ఉన్నాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలా ప్రాంతాలను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలపై కఠిన చర్యలకు వీలు కలి్పస్తున్నారు. మున్సిపల్ వివాదాల త్వరిత పరిష్కారానికి ప్రత్యేక అప్పిలేట్ వ్యవస్థ, ప్రత్యేక మేజి్రస్టేట్ కోర్టుల ఏర్పాటుకు కూడా బిల్లు మార్గం చూపుతోంది. -
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టం
సాక్షి, హైదరాబాద్: భూమి ఆకాశం ఏకమైనా వ్యవసాయ మోటార్లు, పంప్సెట్లకు మీటర్లు ఏర్పాటు చేయబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వ్యవసాయ పంప్సెట్ల విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని తేల్చిచెప్పారు. రాష్ట్ర రైతాంగానికి, వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఈ మేరకు 100 శాతం హామీ ఇస్తున్నానని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు ఉచిత విద్యుత్ అందించే విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లెవనెత్తిన అంశంపై భట్టి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే ఉదయ్ ఒప్పందం ‘వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన ఆర్డీఎస్ఎస్ పథకంలో లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో ఉదయ్ పథకం కింద త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం, డిస్కమ్లు, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కలిసి ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 2017 జూన్ 30 నాటికి 100 శాతం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ (డీటీ) మీటరింగ్ పూర్తి చేయాలని, 2018 డిసెంబర్ 31 నాటికి వ్యవసాయ వినియోగదారులను మినహాయించి నెలకు 500 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వినియోగదారులకు మీటర్లు ఏర్పాటు చేయాలని, 2019 డిసెంబర్ 31 నాటికి నెలకు 200 యూనిట్లకు పైగా వినియోగించే వినియోగదారులకు ఏర్పాటు చేయాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందం విషయంలో మేం ఒక్క అడుగు కూడా ముందుకు వేయం. విద్యుత్ వ్యవస్థ ఆధునీకరణ కోసమే ఆర్డీఎస్ఎస్ తాజా పంపిణీ రంగ పథకం (ఆర్డీఎస్ఎస్)లో వ్యవసాయ పంప్సెట్లకు తప్పనిసరిగా మీటర్లు ఏర్పాటు చేయాలనే నిబంధన ఎక్కడా లేదు. విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, నెట్వర్క్ విస్తరణ, ట్రాన్స్ఫార్మర్ల అప్గ్రేడేషన్, ఎస్సీఏడీఏ, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు, సెక్షనలైజర్లు, ఆటో రీ–క్లోజర్లు వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థలను ఏర్పాటు చేయడమే ఆర్డీఎస్ఎస్ లక్ష్యం..’అని భట్టి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 9న రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ ‘తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సెపె్టంబర్ 9న 19,543 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇంత భారీ డిమాండ్ను కూడా ప్రస్తుత వ్యవస్థతోనే తట్టుకుని నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. గతంలో 9 వేల నుంచి 10 వేల మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం 19 వేల నుంచి 20 వేల మెగావాట్లకు పెరిగింది. ప్రస్తుతం 15 వేల మెగావాట్ల సామర్థ్యానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్మిషన్ వ్యవస్థ, సబ్స్టేషన్లు, విద్యుత్ లైన్లపై 19 వేల నుంచి 20 వేల మెగావాట్ల వరకు డిమాండ్ను తట్టుకునే పరిస్థితి ఏర్పడింది.కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ అంచనాల ప్రకారం 2029–30 నాటికి తెలంగాణ గరిష్ట విద్యుత్ డిమాండ్ 24,624 మెగావాట్లకు, 2034–35 నాటికి 34,137 మెగావాట్లకు చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడానికి వర్షాభావ పరిస్థితులే ప్రధాన కారణం. అయితే ఎంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చయినా విద్యుత్ను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజలకు, రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సోలరైజేషన్ ద్వారా రైతులకు మెరుగైన విద్యుత్ వ్యవసాయ పంప్సెట్లను సోలరైజేషన్ చేయడం ద్వారా విద్యుత్ వ్యయాన్ని తగ్గించడంతో పాటు రైతులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సోలరైజేషన్ కార్యక్రమాన్ని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అయ్యే ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని ఎంత తగ్గించగలిగితే వినియోగదారులకు అంత తక్కువ ధరకే విద్యుత్ అందించవచ్చు. అందువల్ల తక్కువ ధరకు లభించే సోలార్ విద్యుత్ను వినియోగించుకోవడంతో పాటు గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది..’అని భట్టి తెలిపారు. -
కులగణన చేపట్టాల్సిందే
సాక్షి, హైదరాబాద్: జనగణనలో కులగణన కూడా చేర్చాలని.. దేశవ్యాప్తంగా ఓబీసీల జనాభా గణాంకాలు కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. శాసనసభలో శుక్రవారం జరిగిన లఘు చర్చలో దీనిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బలహీనవర్గాల సామాజిక న్యాయం, విద్యావకాశాలు, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కచ్చితమైన గణాంకాలు ఉండాలని మంత్రి పొన్నం అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలూ దీనికి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీల వాస్తవ పరిస్థితిని గుర్తించే ప్రయత్నం జరిగిందన్నారు. ఆ సర్వే ఆధారంగా బీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందని పొన్నం చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్వహించిన జనగణనలో ఓబీసీలకు స్పష్టమైన ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా ఓపెన్ కాలమ్ విధానం పెట్టడం వల్ల కచ్చితమైన ఓబీసీ గణాంకాలు సేకరించడం కష్టమైందన్నారు. కేంద్ర జనగణనలో ఓబీసీలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ప్రత్యేక గుర్తింపు కల్పించాలని, ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నైజాన్ని ప్రజలు గమనించాలి: మంత్రి సీతక్క కులగణనపై చర్చ సందర్భంగా బీజేపీ సభ్యుల వాకౌట్ను మంత్రి సీతక్క తీవ్రంగా ఆక్షేపించారు. ప్రధాని మోదీ పేరుకే బీసీ అని, కులగణనకు మాత్రం ఆయన వ్యతిరేకమని విమర్శించారు. బీజేపీ నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలన్న మంత్రి పొన్నం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్ పక్ష సభ్యులు నవీన్యాదవ్, బీర్ల ఐలయ్య, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు, తదితరులు బలపరిచారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయని కారణంగా బీసీ కులగణనపై జరిగిన చర్చ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు బీజేపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. బీసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానూ సహకరించట్లేదని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ విమర్శించారు. -
విద్యా వ్యవస్థను సర్కారు భ్రష్టు పట్టిస్తోంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యావ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. దేశంలోనే విద్యారంగానికి అత్యల్పంగా 8.2 శాతం బడ్జెట్ కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీలో విద్యారంగంలో చొరవలు అంశంపై జరిగిన లఘు చర్చలో ఏలేటి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ. 15 వేల కోట్ల పాత ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసేలా తెచ్చిన వివాదాస్పద జీవో 97ను తక్షణమే రద్దు చేయాలన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 886 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి 42 మంది విద్యార్థులు మరణించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ యూడీఐఎస్ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని 1,859 స్కూళ్లలో కనీసం తాగునీటి సదుపాయం లేదని, 1,752 పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవని, 30 వేలకు పైగా పాఠశాలల్లో 21 వేలకు పైగా బడులు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ‘నీట్’రాష్ట్రాలకే వదిలేసేలా తీర్మానం చేయాలి: కూనంనేని విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి సరికాదని.. విద్యా రంగ హక్కులను కూడా కేంద్రం లాక్కుంటోందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలపై ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షా విధానాన్ని రాష్ట్రాలకే వదిలేసేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. గ్రామాల్లో ఆంగ్ల మాధ్యమ చదువును తప్పనిసరి చేయాలన్నారు. ఇంటర్ బోర్డును ఎత్తేయకుండా గ్రామీణ స్కూళ్లలోనే సీబీఎస్ఈ సిలబస్ తేవాలని కోరారు.ఎంఐఎం మిత్రులూ.. కొంచెమైనా పొగడరూ..: సీఎం సరదా వ్యాఖ్యలు ‘ఎంఐఎం ఎమ్మెల్యేలను మంచి మిత్రులుగా పరిగణిస్తాం. అయితే వారు ఎప్పుడూ వినతిపత్రాలు ఇవ్వడంలో ముందుంటారు తప్ప నేను చేసిన మంచి పనులకు, అడిగిన వెంటనే అభివృద్ధి పనులు చేసినందుకు కొంచెమైనా పొగిడితే బావుంటుంది’అని సీఎం రేవంత్రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. నాలుగు ఏటీసీ సెంటర్లు, బ్రిడ్జీల ఫౌండేషన్, రోడ్లు, పాఠశాలల ప్రారంభోత్సవం వంటివి చేపట్టినా ఎంఐఎం సభ్యులు ఒక్కసారీ పొగడలేదన్నారు. తనను పొగిడేందుకు అసదుద్దీన్, అక్బరుద్దీన్ అనుమతి ఇచ్చారో లేదో తెలియదని.. ఎమ్మెల్యేలకు పొగిడే అవకాశం ఇవ్వాలని ఈసారి కలిసినపుడు వారికి చెబుతానని చమత్కరించారు. చర్చలో కాంగ్రెస్ సభ్యులు యెన్నెం శ్రీనివాస్రెడ్డి, ఆదినారాయణ, ఎంఐఎం ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ పాల్గొన్నారు. -
విద్యార్థుల బాగుకే..
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకే విద్యావిధానంలో సంస్కరణలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయడంతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో వారికి ఉపాధి అవకాశాలు అందుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం చేపట్టిన పాలిటెక్నిక్ కోర్సులో సంస్కరణలతో కూడా మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ సంస్కరణలు చూస్తే 2029లో విద్యార్థులంతా తనకు మళ్లీ మద్దతు ఇస్తారని అన్నారు. శుక్రవారం శాసనసభలో విద్యపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. కాగితంపై రాసిస్తా.. ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా టాటా సంస్థతో ప్రత్యేకంగా చర్చించి ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు)గా అప్గ్రేడ్ చేయించాం. రాష్ట్రంలోని 70 ఏటీసీల్లో అత్యాధునిక సాంకేతిక విధానంతో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి టాటా సంస్థలో ఉపాధి దొరుకుతుంది. కానీ ఈ ఏటీసీ ప్రైవేటీకరణ జరగలేదు. అన్నీ ప్రభుత్వ అధీనంలోనే నడుస్తున్నాయి. అదే విధంగా పాలిటెక్నిక్ కోర్సును యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(వైఐఎస్యూ)తో అనుసంధానం చేస్తున్నాం. దీంతో బోధన, బోధనేతర సిబ్బందికి ఏమాత్రం నష్టం ఉండదు. వారి సర్వీసు నిబంధనలకు ఆటంకం కలగదని కాగితంపై రాసిస్తా. విద్యార్థులపై కొత్తగా ఫీజుల భారం కూడా ఉండదు. ఆ తర్వాత ఇంజనీరింగ్లో చేరే విధానం (లాటరల్ ఎంట్రీ) కూడా కొనసాగుతుంది. విద్యార్థులకు నష్టం చేస్తే నాకు ఒరిగేదేం లేదు.. డిప్లొమా పూర్తి చేసిన వెంటనే ఉపాధి అందేలా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యంగా ఉన్న కంపెనీలు చర్యలు తీసుకుంటాయి. పాలిటెక్నిక్ అప్గ్రెడేషన్లో భాగంగా టాటా సంస్థతో రూ.4 వేల కోట్ల విలువైన అత్యాధునిక మౌలిక వసతులతో బోధన చేపట్టనున్నాం. ఎంతో ప్రయాసపడి ఈ నిధిని తీసుకొస్తున్నాం, ఇప్పుడు వద్దంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం పదేళ్లయినా ఖర్చు చేయలేదు. విద్యార్థులకు నష్టం చేస్తే నాకు ఒరిగేదేం లేదు. కానీ కొందరు రాజకీయ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారని అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. అలాంటి రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడొద్దు. ఒక్క కాలేజీని కూడా ప్రైవేటుకు అప్పగించే ప్రసక్తే లేదు..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బడ్జెట్ మూడేళ్లలో రూ.7,554 కోట్లు పెరిగింది.. ‘రాష్ట్రంలో విద్యకు కేటాయింపులు క్రమంగా పెంతున్నాం. 2023–24 వార్షిక బడ్జెట్లో గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయిస్తే.. మా ప్రభుత్వం 2024–25లో రూ.21,292 కోట్లు, 2025–26లో రూ.23,108 కోట్లు, 2026–27లో రూ.26,647 కోట్లు కేటాయించింది. కేవలం మూడేళ్లలో విద్యా బడ్జెట్ను రూ.7,554 కోట్లు పెంచాం. అధికారంలోకి వచి్చన తొలి ఏడాదిలోనే 55 రోజుల్లో 10,006 మంది టీచర్ల నియామకాలు ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా పూర్తి చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో 7,857 మంది టీచర్లను మాత్రమే నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేలకు పైగా పెరిగింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను ప్రవేశపెట్టాం. ఇంగ్లిష్ విద్య కారణంగా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు వస్తున్నారు. ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులు ప్రీ ప్రైమరీ విద్య పొందుతున్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారంతో పాటు ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తున్నాం..’ అని సీఎం చెప్పారు. వాస్తవ కాలేజీలకే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ‘ఫీజు రీయింబర్స్మెంట్ కింద గత ప్రభుత్వం రూ.5,430 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లింది. అందులో రూ.1,410 కోట్లు మేము చెల్లించాం. ఆ తర్వాత మరో రూ.1,475 కోట్లు చెల్లించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.612 కోట్లు విడుదల చేశాం. మొత్తం 32 నెలల్లో మొత్తం రూ.3,488 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇచ్చాం. విజిలెన్స్ తనిఖీల్లో కొన్ని కాలేజీల్లో అవకతవకలు గుర్తించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలోని ఓ మంత్రికి చెందిన కాలేజీల్లో బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే రూ.400 కోట్లు సర్ప్లస్ నిధి ఉంది. దోపిడీ చేస్తే వచ్చిందా? లేక విద్యార్థుల నుంచి దండుకుంటే వచ్చిందా? అనేది అర్థం కాలేదు. గత ప్రభుత్వం చెల్లించని ఫీజులను విడతల వారీగా చెల్లిస్తాం. కానీ కేవలం నిజమైన కాలేజీలకు మాత్రమే ఇస్తాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థి ఖాతాల్లోనే ఫీజు నిధులు జమ చేస్తున్నాం..’ అని రేవంత్ వివరించారు. పదేళ్లు ఫీజులు ఇవ్వకపోయినా బీజేపీ మాట్లాడలేదు.. ‘ప్రజా ప్రభుత్వం కేవలం పేద కుటుంబాలు, ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తుంది. గత ప్రభుత్వంలోని పెద్దలు కేవలం వారి కుటుంబం కోసమే పనిచేశారు. ఇప్పుడు వాళ్లు కడుపులో కుళ్లు, పేద పిల్లలపై ద్వేషంతో ఉన్నారు. పేద విద్యార్థుల కోసం చేసే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. పేద పిల్లలకు మేం అన్యాయం జరగనివ్వం. వారి భవిష్యత్ బాగుండాలనే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పదేళ్లు అధికారంలో ఉండి దోచుకున్నారు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో అహంకారంతో ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు. దుర్మార్గం వైపు, అహంకారం వైపు ఉన్నందునే పది తలల రావణుడు కూడా రాముడి చేతిలో మరణించాడు. పదేళ్లు ఫీజులు ఇవ్వకపోయినా ఒక్కరోజు కూడా బీజేపీ నేతలు మాట్లాడలేదు. ఒక్కరోజు కూడా ధర్నా చేయలేదు. నేను వచ్చాక మాత్రం నాపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అలా? కేసీఆర్లా నేను అణచివేస్తలేననా? లేక కేసీఆరే వారిని ఉసిగొల్పుతున్నారా? గత ప్రభుత్వం కేంద్రం నిధులను వద్దని చెప్పి, ఇక్కడ ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది. మేం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను పూర్తిగా వినియోగించుకుంటాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
బీసీల జనాభా లెక్కలు తేల్చాలి.. కులగణన తప్పనిసరి: మంత్రి శ్రీహరి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీల జనాభా ఎంత ఉందో కచ్చితంగా తేల్చడంతోపాటు.. వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన గణాంకాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో బీసీల కులగణనను తప్పనిసరిగా చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో కులగణనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు ఎవరో ఇచ్చిన దానం కాదని, సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా సాగిన పోరాటం ఫలితంగా లభించిన హక్కు అని స్పష్టం చేశారు.బీసీలకు న్యాయం చేయాలంటే ముందుగా వారి జనాభా ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. వారి జనాభాతోపాటు విద్య, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై కచ్చితమైన సమాచారం ఉంటేనే ప్రభుత్వాలు సరైన విధానాలను రూపొందించగలవని తెలిపారు. డేటా లేకుండా బీసీలకు ఎంత వాటా కల్పించాలో ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.మండల్ కమిషన్ నుంచి రిజర్వేషన్ల వరకు..బీసీల హక్కుల కోసం దేశంలో జరిగిన పరిణామాలను మంత్రి ప్రస్తావించారు. 1953లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం కాకా కాలేల్కర్ కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. అనంతరం 1979లో బి.పి. మండల్ కమిషన్ ఏర్పడి దేశవ్యాప్తంగా బీసీల సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మండల్ కమిషన్ సిఫారసు చేసిందని, 1990లో ఆ సిఫారసుల అమలుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని గుర్తుచేశారు.1992లో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక మార్గదర్శకాలు ఇచ్చిందని మంత్రి తెలిపారు. 1993లో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) ఏర్పడిందని, 2018లో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా దానికి రాజ్యాంగ హోదా లభించిందన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలు అన్ని వర్గాలకు సమానంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించేందుకు జస్టిస్ రోహిణి కమిషన్ను కూడా కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు.తెలంగాణ కుల సర్వే చారిత్రక నిర్ణయంతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే సామాజిక న్యాయానికి పునాది వేసిందని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ వర్గానికి ఎంత జనాభా ఉంది? వారి సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? రాజకీయంగా వారి వాటా ఎంత? వంటి అంశాలపై స్పష్టత రావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని చెప్పారు.ఇది కేవలం జనాభా లెక్కలు సేకరించే కార్యక్రమం కాదని.. సామాజిక న్యాయానికి బలమైన పునాది అని మంత్రి పేర్కొన్నారు. బీసీల హక్కులను సాధించేందుకు అవసరమైన గణాంక ఆధారాలను ఈ సర్వే అందిస్తుందని తెలిపారు.‘జిత్నీ ఆబాదీ.. ఉత్నా హక్’రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న సామాజిక సమానత్వం దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన ‘జిత్నీ ఆబాదీ.. ఉత్నా హక్’ నినాదం సామాజిక న్యాయానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. జనాభాలో ఏ వర్గానికి ఎంత వాటా ఉంటే.. అవకాశాలు, అధికారంలోనూ అంతే వాటా ఉండాలనే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్నప్పటికీ బీసీల జనాభా లెక్కలు తేల్చేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తోందని మంత్రి ప్రశ్నించారు. బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియకుండా వారికి ఎంత వాటా ఇవ్వాలో ఎలా నిర్ణయిస్తారని అన్నారు. బీసీలకు సామాజిక న్యాయం అందించాలంటే వారి జనాభా, సామాజిక, విద్యా, ఆర్థిక పరిస్థితులపై ఖచ్చితమైన గణాంకాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు?బీసీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని మంత్రి ప్రశ్నించారు. బీసీల సమస్యలు, వారి అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షించే వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. బీసీల జనాభా లెక్కలు తేల్చడంతోపాటు వారి హక్కులకు అనుగుణంగా సామాజిక న్యాయం అందించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనలో బీసీల కులగణనను స్పష్టంగా చేర్చాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. బీసీలను లెక్కించడం ద్వారా వారి జనాభాకు అనుగుణంగా హక్కులు, అవకాశాలు కల్పించేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. ‘కులగణన చేపట్టండి.. సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయండి’ అని కేంద్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.ఇవీ చదవండి: సీఎం ప్రజావాణికి 101 దరఖాస్తులు.. అత్యధికంగా రెవెన్యూ సమస్యలే! -
సీఎం ప్రజావాణికి 101 దరఖాస్తులు.. అత్యధికంగా రెవెన్యూ సమస్యలే!
సాక్షి, తెలంగాణ: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు సీఎం ప్రజావాణిని ఆశ్రయించారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన 254వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 101 దరఖాస్తులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ఇన్చార్జ్, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు.రెవెన్యూ శాఖకే 24 దరఖాస్తులు..అందిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 24 వచ్చాయి. మున్సిపల్ శాఖకు 16, బీసీ సంక్షేమ శాఖకు 13 దరఖాస్తులు అందగా.. ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన గద్వాల్ విజయలక్ష్మి వాటిని సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని అధికారులతో ఫోన్లో మాట్లాడారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ప్రజావాణి కార్యక్రమం ఉపయోగపడుతోంది.పది మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు..అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పది మందికి సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద ఆర్థిక సాయం అందింది. ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో గద్వాల్ విజయలక్ష్మి లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సాయం కొంత ఊరటనిచ్చింది.ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసీపీ ఉమేందర్, ఎన్ఆర్ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.ఇవి కూడా చదవండి: ‘అందుకే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా’ -
‘అందుకే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా’
హైదరాబాద్: విద్యాశాఖ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ అని, ముఖ్యమంత్రి విద్యాశాఖను నిర్వహిస్తున్నారంటే ఆ శాఖు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లేనని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 11వ తేదీ) అసెంబ్లీ వేదికగా సీఎం విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవడంపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చారు. ‘విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ. ముఖ్యమంత్రి విద్యాశాఖను నిర్వహిస్తున్నారంటే ఆ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టే. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ పాల్గొంటుంది. చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ సహా అధికారులు సమీక్షకు హాజరవుతారు. మంత్రిగా విద్యాశాఖ సమీక్ష చేస్తే సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రమే హాజరవుతారు. ముఖ్యమంత్రిగా విద్యాశాఖను సమీక్షిస్తే మొత్తం వ్యవస్థను ఒకే, టేబుల్పైకి తీసుకురాగలుగుతాం. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుంది. విద్యాశాఖకు ఫుల్టైమ్ మంత్రి లేరని పరిమిత సమాచారంతో విమర్శలు చేయడం సరికాదు. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలకు మేలు జరిగే శాఖలను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించాలి. న్యాయశాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలను నా వద్దే ఉంచుకున్నా. ప్రజాస్వామ్యంలో పీఎం, సీఎం, డీఎం అత్యంత శక్తివంతమైన పదవులు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న అధికార పరిధి అత్యంత కీలకమైనది. మంత్రులందరూ ముఖ్యమంత్రికి సహాయక వ్యవస్థగా పనిచేస్తారు. అధికారులు, ఇతర వ్యవస్థలు కూడా ప్రభుత్వానికి సహాయక వ్యవస్థలే. పేదలకు మేలు చేసే నిర్ణయాలు వేగంగా తీసుకోవడమే లక్ష్యంప్రైవేటు విద్యా వ్యవస్థలో రెండున్నరేళ్లకే పాఠశాలకు పంపిస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్లకు పాఠశాలకు పంపిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు. నర్సరీ, ఎల్.కే.జీ విధానంతో పాటు ఇంగ్లీష్ భాష కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలల్లో మొట్ట మొదటిసారిగా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రారంభించాం. ఈ ఏడాది 64 వేల మంది ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నాం. నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్స్ డిజైన్ చేసి నాణ్యమైన హైజెనిక్ బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నాం. పదేళ్లు వాళ్లు పట్టించుకోకపోతే మేం ఆధికారంలోకి రాగానే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాం. ఒక రేవంతన్నగా మేం ఇన్ని చేసినా ఎప్పుడూ చెప్పుకోలేదు’ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కొండా సురేఖ బర్తరఫ్పై కేటీఆర్ రియాక్షన్ ఇదే -
నా భర్త జీవితం సర్వనాశనమైంది : సుమంత్ భార్య
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ నార్ల సుమంత్ భార్య మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక క్షోభను వెల్లడించారు. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.తప్పుడు కేసుల కారణంగా తమ కుటుంబం పూర్తిగా అస్తవ్యస్తమైందని, తన భర్త సుమంత్ జీవితం సర్వనాశనమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సుమంత్ ఐఐఎంలో చదువుకున్నాడని, మంచి కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా చేరాడని తెలిపారు.సుమంత్ను ఉద్దేశపూర్వకంగా టార్చర్ చేయడం, విపరీతమైన ఒత్తిడికి గురిచేయడం వల్ల తట్టుకోలేకపోయిన తన మామయ్య (సుమంత్ తండ్రి నార సుబ్రహ్మణ్యం) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. గురువారం రాత్రి ఆయన 40 నిద్రమాత్రలు మింగగా.. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారని, ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాజకీయ కక్షల కారణంగా తమ కుటుంబాన్ని బలి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉండగా.. హైదరాబాద్లోని మేడిపల్లి ప్రాంతానికి చెందిన హరికృష్ణపై దాడి చేశారనే ఆరోపణలతో సుమంత్తో పాటు మరికొంత మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో ఏ-1గా ఉన్న సుమంత్ హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ లభించింది.👉ఇదీ చదవండి : కొండా సురేఖ బర్తరఫ్కు ఇదే అసలు కారణం : కేటీఆర్ -
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహబూబ్నగర్లోలో రిటైర్డ్ ఆర్మీ అధికారి ఇంట్లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో రిటైర్డ్ అధికారి నివాసం ఉంటున్నారు. బుల్లెట్స్ ఇచ్చే అమ్నేషన్ సెక్షన్ ఇంచార్జి సహకారంతో చోరీ చేశారు. ఈ కేసుల కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ మీడియాకు తెలిపారు.‘‘గత నెల ఆగస్టు 30న తెల్లవారుజామున మద్రాస్ రెజిమెంట్ ఆయుధ గారంలో జరిగిన చోరీ కేసును చేధించాం. మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధగారంలో కొన్ని ఆయుధాలు ఆ రోజు దొంగిలించబడ్డాయి. 30వ తేదీ ఉదయం ఆర్మీ ఉద్యోగి వినోద్ కుమార్ తాళాలు పగలగొట్టి ఉన్న విషయం గుర్తించి ఆర్మీ అధికారులను అప్రమత్తం చేశాడు. ఆ తర్వాత బ్రిగేడియర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఏడు పిస్టళ్లతో పాటు నాలుగు ఏకే 203, ఒక ఇన్సాస్ నైట్ విజన్ బైనాక్యులర్ చోరీకి గురయ్యాయి. రెండో బిల్డింగ్ నుంచి మందగుండు ఉన్న బాక్సులు మిస్ అయ్యాయి...ఉమ్మడిగా మల్కాజిగిరి పోలీసులు, మిలిటరీ ఇంటెలిజెన్స్, సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేశారు. మొదటి దశలో ఇన్సైడర్ వ్యక్తులు తప్ప బయట వ్యక్తులు చోరీ చేసే అవకాశం లేదు అని నిర్ధారణకు వచ్చాము. సులువుగా కేసు క్లోజ్ అవుతుందనుకున్నాం.. కానీ కాలేదు. అనుమానితులను ప్రశ్నిస్తే ఎలాంటి లీడ్ దొరకలేదు. అనుమానితులను ప్రశ్నిస్తే ఎలాంటి లీడ్ దొరకలేదు. ఆయుధ గారానికి ఎవరెవరికి అనుమతి ఉంది. వారిని లిస్ట్ ఔట్ చేశాము. ముందుగా పది మందినీ గుర్తించాము. ఆయుధగారం వద్దకు ఆరుగురు సభ్యుల మూవ్మెంట్ కంటిన్యుగా ఉంటుంది. వారిని షార్ట్ లిస్ట్ చేసి విచారించారు...ఏడుగురు ఎలక్ట్రిషియన్, ప్లంబర్.. పనిష్మెంట్ పై వెళ్లిన 36 మందిని కూడా గుర్తించాం. లీవ్లో వెళ్లిన 54 మందిని గుర్తించి విచారించాము. సర్వీస్లో ఇండిసిప్లిన్ కారణంగా విధులకు దూరంగా ఉన్న ఏడుగురును కూడా విచారించాము. కోపంతో ఎవరైనా ఇలా చేశారా అనే కోణంలో అని దర్యాప్తు చేశాము. వారం రోజులు భిన్న కోణాల్లో క్రాస్ వెరిఫికేషన్ చేశాము. డ్రగ్ మాఫియా కనెక్షన్ యాగిల్లో దర్యాప్తు చేశాము.. స్పై నెట్వర్క్ కోణంలో కూడా విచారణ చేశాము. బృందాలుగా ఏర్పడి సీసీటీవీ డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్. మొబైల్ సిగ్నల్స్ ఈ కేసు దర్యాప్తు చేశారు. ముందుగా ఇద్దర్ని మెయిన్ సస్పెక్ట్గా భావించాం.. ఆయుధగారంలో ఇంఛార్జ్ వినోద్ కుమార్ శ్రీరామ్ ప్రసాద్ అనుమానితులుగా భావించి విచారించాం...ఇద్దర్ని విచారించిన కూడా ఎటువంటి క్లూ దొరకలేదు.. ఇదే క్రమంలో ఏడుగురు పెన్షన్ అవుట్ పర్సన్స్లో ఇద్దర్ని విచారించాం. ప్రకాశం జిల్లాను చెందిన ఓ హవల్దార్తో పాటు, మల్లేష్ అనే మరో హవల్దార్ విచారించారు. జూన్ ముప్పై తేదీన మల్లేష్ను హెల్త్, ఇన్ డిసిప్లిమరీ కారణంగా తీసేసారు. మల్లేష్ కంటోన్మెంట్ పక్కనే ఉన్న బాలాజీ నగర్లో ఉంటాడు అతనిపై అనుమానం రావడంతో అన్ని కోణంలో చెక్ చేశాము. ఏడో తేదీ మల్లేష్ను నాగర్ కర్నూల్లో ప్రశ్నించాము. ఆ సమయంలో సరిగా స్పందించలేదు. దీంతో అనుమానం పెరిగింది. అతని మొబైల్ను తీసుకుని అతన్ని నాగర్ కర్నూలు పోలీసులకు వాచ్లో పెట్టమని అడిగాము. మొబైల్లో చెక్ చేయగా వాట్సాప్ కాల్ లాగ్, చాట్లు అన్ని క్లియర్ చేసే ఉంది. విచారణలో అతను సమాధానం ఇచ్చే తీరు కూడా సస్పెక్ట్ అనిపించింది. అందుకే అతన్ని 8, 9 తేదీలలో విచారణకు రమ్మని చెప్పాము. అతని విచారణకు రాకుండా తప్పించుకున్నాడు.. ఆ తర్వాత భార్యకు కేసు తీవ్రత వివరించాం...ఆమె అతన్ని పదవ తేదీన విచారణకు తీసుకువస్తానని చెప్పింది. విచారణకు వచ్చే క్రమంలో భార్య అతన్ని గట్టిగా నిలదీసింది. దీంతో మల్లేష్ భార్య ముందు నిజం ఒప్పుకున్నాడు. దీంతో వారు మాకు సమాచారం ఇచ్చారు. అనంతరం మల్లేష్ నుండి వెపన్స్ రికవరీ చేశారు. 30వ తేదీ రాత్రి ఆయుధగారం వద్ద అతని కదలికలు ఉన్నాయి. 28, 29న ఆయుధాల చోరీ కోసం అతను రెక్కీ చేసాడు. సీసీటీవీ రాత్రి పూట పని చేయదని అతనికి తెలుసు. 30 నుండి రాత్రి బాలాజీ నగర్ నుండి కార్గిల్ గేట్ గుండా లోపలికి వచ్చాడు. ఆయుధ గారంలో తాళం పగల గొట్టి ఆయుధాలను ఒక్కొకటి తీసుకు చీకటి ఉన్న ప్రాంతంలో పెట్టాడు. మందగుండు ఉన్న గది దగ్గకు వెళ్ళి గంట సేపు శ్రమించి తాళం పగల గొట్టాడు. తాళం పగల గొట్టి మందగుండి సామాగ్రి తీసుకుని వెళ్ళాడు. ..దాదాపు గంట పాటు లోపలే ఉండి మందుగుండు సామగ్రిని ఆయుధాలను స్కూటీ లో పెట్టుకుని రెండు కిలోమీటర్ దూరంలో టెంపుల్ దగ్గర పెట్టాడు. మళ్ళీ వెనక్కి వచ్చి మ్యాగజీన్ కవర్ కోసం మళ్ళీ తిరిగి వెళ్ళాడు. అక్కడే ఉన్న ఆర్మీ జవాన్ అతని ప్రశ్నించగా తాను మద్రాస్ రెజిమెంట్ అని చెప్పాడు. ఆ తర్వాత మ్యాగజీన్లను బ్యాగ్లో పెట్టుకుని బాలాజీ నగర్లో ఉన్న ఇంటికి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు వెళ్ళాడు. తిరిగి ఇంటి నుండి గుడి వద్దకు కారులో వచ్చి అక్కడ నుండి ఆయుధాలు తీసుకుని అక్కడ అచ్చంపేట వైపు వెళ్ళాడు...ఓఆర్ఆర్, సాగర్ హైవే, బొంగులూరు గేట్ వైపు వెళ్ళాడు. సీసీటీవీలు ఉంటాయి శ్రీశైలం హైవేను అవాయిడ్ చేశాడు. దిండి దగ్గర వెహికల్లో ఎక్కించుకుని పేమెంట్ తీసుకుని ఎవిడెన్స్ క్రియేట్ చేసాడు. ఉదయం పది గంటలకు అచ్చంపేట చేరుకున్నాడు. అక్కడే సొంత ఇంటి ముందు గడ్డివాము లాంటి ప్రాంతంలో మట్టి తీసి కప్పేశాడు. మళ్లీ ఐదు ఆరు రోజుల తర్వాత వాటిని తీసి పదరా గ్రామానికి షిఫ్ట్ చేశాడు. ఎనిమిదవ తేదీన మళ్ళీ ఆయుధాలను ఇంటికి తీసుకు వెళ్ళాడు. దీని తర్వాత పదవ తేదీ భార్య హైదరాబాద్ తీసుకుని వస్తున్న క్రమంలో నిజం ఒప్పుకుంటాడు. దీంతో కేసు కొలిక్కి వచ్చింది.. పది రోజుల పాటు కేసు ఆందోళన కలిగించింది’’ అని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. -
కొండా సురేఖ బర్తరఫ్పై కేటీఆర్ రియాక్షన్ ఇదే
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ కేబినెట్ బర్తరఫ్, రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన 22-ఏ (22-A) నిబంధన అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో అమలవుతున్న 22-ఏ నిబంధన కేవలం ఒక ఆంక్ష మాత్రమే కాదని, కోటి ఎకరాల భూమిని మాయం చేసే ఒక పెద్ద మహా కుంభకోణమని కేటీఆర్ ఆరోపించారు.22ఏ నిషేధిత భూముల స్కాం పేరుతో నిర్వహించిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ నాయకులు సామాన్యుల ఆస్తులను టార్గెట్ చేసి భూ దందాలకు పాల్పడుతున్నారు. మంత్రి పదవి నుంచి కొండా సురేఖ తొలగించడానికి 22-ఏ భూముల వివాదమే. ఈ భారీ భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాన సూత్రధారి అని, రెవెన్యూ శాఖ మంత్రి పాత్రధారిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ మంత్రి కేవలం సారీ చెబితే సరిపోదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.రాష్ట్రంలో సంక్షేమం పక్కనపెట్టి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూ ఆక్రమణలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ఎండగడతామని’ స్పష్టం చేశారు. 👉ఇదీ చదవండి : మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ ఔట్ -
కడియం, మంత్రులపై అక్బరుద్దీన్ సెటైర్లు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, ప్యానెల్ స్పీకర్ కడియం శ్రీహరి మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. అక్బరుద్దీన్ వరుసగా 20కి పైగా ప్రశ్నలు అడగడంపై కడియం శ్రీహరి అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, అక్బరుద్దీన్.. మంత్రులపై సెటైర్లు వేశారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా..‘క్వశ్చన్ అవర్లో ఇన్ని ప్రశ్నలు అడగడం ఏంటి? 20కి పైగా ప్రశ్నలు అడిగితే ఏ మంత్రి ఏ సమాచారాన్ని చెప్పాలి?’ అంటూ కడియం శ్రీహరి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్బరుద్దీన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అనంతరం, అక్బరుద్ధీన్..‘మంత్రులు చాలా గొప్ప గొప్ప చదువులు చదివారు.. వాళ్లు అన్నింటికీ సమాధానం చెబుతారు’ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. ‘నేను కేవలం 12వ తరగతి పాస్ అయ్యాను.. నేను అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేరా?’ అంటూ సెటైర్ వేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో సభలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన సభా నిబంధనలు, అధికార-విపక్షాలకు వర్తించే రూల్స్పై ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. హైదరాబాద్లో కంపెనీలకు కేటాయించిన భూముల వినియోగంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీల పేరుతో భూములు తీసుకుని వాటిని రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న సంస్థలపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని కోరారు. కంపెనీలకు భూములు కేటాయించే సమయంలో స్పష్టమైన ఆంక్షలు, నిబంధనలు ఉండాలని సూచించారు.టెక్ మహీంద్రా వంటి సాఫ్ట్వేర్ రంగ దిగ్గజాలు హైదరాబాద్కు వస్తున్నప్పటికీ.. ఇక్కడ వ్యాపార అవకాశాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసక్తి చూపుతున్న కంపెనీలను రాష్ట్రానికి రప్పించి ప్రోత్సహించాలని, తద్వారా పెట్టుబడులు పెరగడంతో పాటు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని చెప్పారు. కంపెనీలకు ఇచ్చిన భూములు కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు కాకుండా.. పరిశ్రమలు, ఐటీ కార్యకలాపాలు, ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడేలా చూడాలని దానం నాగేందర్ సూచించారు. ఈ అంశంపై ఐటీ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాలని అసెంబ్లీలో కోరారు.ఇదీ చదవండి: కొండా సురేఖ మాజీ ఓఎస్డీ తండ్రి ఆత్మహత్యాయత్నం -
మా జుట్టు, చీర పట్టుకొని లాగారు.. ఛైర్పర్సన్తో సబితా
సాక్షి, ఢిల్లీ: అసెంబ్లీలో ప్రజల కోసం కొట్లాడితే తమపై దాడి చేశారని 500 మంది పోలీసులతో అణిచివేత చేశారని జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్కు ఎదుట ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కర్ను ఈ రోజు శుక్రవారం ఆమె కలిశారు. అసెంబ్లీ ఆవరణలో మగ పోలీసులు సైతం తమపై భౌతిక దాడులకు తెగపడ్డారని జుట్టు, చీర పట్టి లాగారని ఛైర్ పర్సన్ ఎదుట సబితా ఆవేదన వ్యక్తం చేశారు.ఆమె మట్లాడుతూ.. పోలీసులు దుశ్శాసన పర్వాన్ని తలపించారు. ద్రౌపదికి జరిగిన అవమానమే మాకు జరిగింది. కౌరవ సభలో జరిగిన తరహాలోని తెలంగాణ అసెంబ్లీ వద్ద జరిగింది .ఒక కుట్ర ప్రకారమే మా పై దాడులు జరిగాయి. అసెంబ్లీకి వెళ్తుంటే యుద్ధ వాతావరణం సృష్టించారు. మేము లేవనెత్తుతున్న సమస్యల పైన మాది అరణ్య రోదన గా మారింది. ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్ మాపై జరిగిన దాడులపై కనీసం స్పందించలేదని ఛైర్పర్సన్ ఎదుట వాపోయారు.మమ్మల్ని ఆపమని అధికారం వారికి ఎవరిచ్చారని ప్రభుత్వం శిఖండి రాజకీయాలు చేస్తోందని మహిళా పోలీసులను ముందుపెట్టి శిఖండి రాజకీయాలు చేశారని మహిళలుగా మాకు అవమానం చేసి, గాయపరిచి తిరిగి మా పైన కేసులు పెట్టారు. మాకు న్యాయం చేయాలని మహిళా కమిషనర్కు ఫిర్యాదు చేశామని మా ఎమ్మెల్యేల పైన లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దారుణమన్నారు.స్పీకర్ని తాము అవమానపరచలేదని స్పీకర్ ని దూషించిన దూషించకపోయిన విచారం వ్యక్తం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కొట్టడం ఏం సంస్కారమని కేసిఆర్ చావు కోరుతున్న ఎమ్మెల్యేల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మా ఆవేదన చెప్పుకునే అవకాశం లేకుండా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని మా పై జరిగిన దాడికి కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పి విచారణ చేయించాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. -
రాష్ట్రంలో 30 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తోంది.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి కలసి భూదోపిడికి తెగబడుతున్నారని రాష్ట్రంలో గిరిజనుల, అసైన్డ్ భూములు మాయమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భూముల వివాదంతోనే మంత్రిని బర్తరఫ్ చేశారన్నారు. రాష్ట్రంలో 30 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తుందని. సీఎం సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులపై దాడి చేశారన్నారు. ఈ రోజు శుక్రవారం బీఆర్ఎస్ భవన్లో 22ఏ బాధితులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ హయాంలో భూముల విలువ భారీగా పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 22ఏ అంశంతో కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో భూదోపిడి విచ్చలవిడిగా జరుగుతుందని మంత్రులు దండుపాళ్యం ముఠాలా తయారయ్యారన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములపై సీఎం రేవంత్ కన్నేశారని మూసీ పేరుతో వేల ఎకరాలు దోచుకున్నారని ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ ఆయన సోదరుడికి ఐదు ఎకరాల భూమిని కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని కాంగ్రెస్పై కేటీఆర్ ధ్వజమెత్తారు.22ఏ వల్ల లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 22ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఓ బాధితుడు 22ఏతో మా స్థలాలకు లోన్లు రాక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదన్నామని తమ ఆవేదనని వెల్లిబుచ్చుకున్నారు. -
మూసీ ప్రక్షాళనపై కొత్త ట్విస్ట్.. రేవంత్ సర్కార్కు ఎన్జీటీ నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు మరోసారి న్యాయపరమైన సవాల్ ఎదురైంది. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణాది బెంచ్ను ఆశ్రయించారు. ఈ అప్పీల్పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.మూసీ ప్రక్షాళన పేరుతో చేపడుతున్న పనులకు పర్యావరణ నిబంధనలు, అనుమతుల విషయంలో లోపాలున్నాయని అప్పీల్దారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ వారు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి న్యాయస్థానం ముందుకు వచ్చింది.మూసీ పరివాహక ప్రాంతం మొత్తం 55 కిలోమీటర్లు ఉంటే.. కేవలం 20 కిలోమీటర్ల మేర మాత్రమే స్టడీ చేశారు. అలాగే ఈ రీజియన్లోనే మృగవాణి నేషనల్ పార్క్ ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సమీపంలో భారీ నిర్మాణాలు చేపట్టాలన్న నిర్ణయంతో పాటు వాణిజ్య సముదాయాల ఏర్పాటుపైనా రిటైర్డ్ ఇంజినీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నోటీసులుఅప్పీల్ను పరిశీలించిన చెన్నై ఎన్జీటీ బెంచ్.. ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతుల జారీ, ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తన వాదనలను, సంబంధిత వివరాలను ట్రిబ్యునల్ ముందు ఉంచాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే.. మూసీ ప్రాజెక్టుపై గతంలోనూ ఎన్జీటీలో న్యాయపరమైన వివాదం కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్లో మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ను ఎన్జీటీ కొట్టివేసింది. దీంతో ప్రాజెక్టుకు అప్పట్లో ఊరట లభించింది.వచ్చే నెల 16న విచారణతాజాగా రిటైర్డ్ ఇంజినీర్లు దాఖలు చేసిన అప్పీల్పై విచారణను ఎన్జీటీ వచ్చే నెల 16కు వాయిదా వేసింది. దీంతో ఆ రోజు జరిగే విచారణలో పర్యావరణ అనుమతులపై అప్పీల్దారులు లేవనెత్తిన అభ్యంతరాలు, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే వివరణలు కీలకం కానున్నాయి.మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నది ప్రక్షాళనతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి, మురుగునీటి సమస్య పరిష్కారం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. అయితే ప్రాజెక్టు పర్యావరణ ప్రభావం, అనుమతుల ప్రక్రియపై మొదటి నుంచీ వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఎన్జీటీలో దాఖలైన అప్పీల్తో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: స్కామ్ కోల్కతాలో.. సోదాలు హైదరాబాద్లో! -
కోల్కతా బొగ్గు కుంభకోణం.. హైదరాబాద్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: కోల్కతా బొగ్గు కుంభకోణానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు చేపడుతుంది. ఈ రోజు శుక్రవారం ఉదయం కోల్కతానుంచి హైదరాబాద్లో ఈడీ ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. హైదరాబాద్లోని AMR కంపెనీలో తనిఖీలు చేపడుతుంది. అదే విధంగా టాలీవుడ్లో ప్రముఖ ప్రొడ్యూసర్గా ఉన్న మహేశ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపడుతుంది. కోల్కతా, హైదరాబాద్, జార్ఖండ్లలోని ప్రముఖ రాజకీయ నేతలకు ఆయన బినామీగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. -
కొండా సురేఖ మాజీ ఓఎస్డీ తండ్రి ఆత్మహత్యాయత్నం
సాక్షి, వరంగల్: వరంగల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. 40కి పైగా స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకున్న ఆయన.. తెల్లవారుజామున అపస్మారక స్థితిలో ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.సుబ్రహ్మణ్యేశ్వరరావు గత కొద్ది రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నట్లు తెలుస్తోంది. సుమంత్ వ్యవహారశైలితో మనస్తాపానికి గురైన నేపథ్యంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ వర్గాల నుంచి సమాచారం. అయితే ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఏమిటన్నది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. సుబ్రహ్మణ్యేశ్వరరావు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేశారు. ఉద్యోగ విరమణకు మరో ఆరు నెలల సమయం ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం కుటుంబంతో కలిసి ఉంటున్న ఆయన.. కొంతకాలంగా మానసిక ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సుమంత్కు సంబంధించిన వివాదాలు ఇటీవల తీవ్ర చర్చకు దారితీశాయి. సుమంత్పై ఇప్పటికే దాడి, బెదిరింపులు, డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో కేసులు నమోదైనట్లు తాజా వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆత్మహత్యాయత్నం ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: ఉద్యోగుల కోసం ఎనీ టైమ్.. రేవంత్ ఆఫర్ -
కేపీహెచ్బీ: అర్ధరాత్రి లాఠీ ఝళిపించిన ఎస్సై మౌనిక
కేపీహెచ్బీ అంటేనే రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న చర్చ కొంతకాలంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ దీనిపై జరిగే చర్చ చాలామందికి తెలిసే ఉంటుంది. తాజాగా ఇలాంటి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రివేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్చల్ చేస్తున్న పలువురిని కేపీహెచ్బీ సెక్టార్ ఎస్ఐ మౌనిక లాఠీతో తరిమికొట్టారు.కేపీహెచ్బీ ఫోర్త్ ఫేజ్ సరీ్వస్ రోడ్డు సమీపంలో కొన్ని రోజులుగా ట్రాన్స్జెండర్లు రాత్రి వేళల్లో ఆగడాలకు పాల్పడుతున్నారు. ఇటీవల వీరిని ఇన్స్పెక్టర్ విజయ్కుమార్ ఠాణాకు పిలిపించి హెచ్చరించారు. అయినా మార్పు రాలేదు. చెట్ల పొదల వద్ద రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్లేవారిని ఆకర్షిస్తూ హల్చల్ సృష్టిస్తున్నారు. విషయం తెలుసుకున్న సెక్టార్ ఎస్ఐ మౌనిక బుధవారం రాత్రి కారులో వచ్చి లాఠీ తీసుకుని చెట్ల పొదల్లోకి రావడంతో ట్రాన్స్జెండర్లు పరుగులు పెట్టారు. ఎస్ఐ ధైర్యంగా వెళ్లి ట్రాన్స్జెండర్లను తరిమి కొట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పక్కన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు ఆమె సూచించారు. పలువురు ట్రాన్స్జెండర్లపై కేసులు నమోదు చేశారు.ఇప్పటికే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో పోలీసులు ఈసారి కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. రోడ్ల పక్కన, నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ మౌనిక స్థానికులకు సూచించారు.At this point, KPHB is starting to look less like a residential area and more like Hyderabad’s unofficial red-light district.⁰How the hell did this happen? 🤦♀️ pic.twitter.com/ISCRPcCXl1— Shika Reddy (@Shika_Reddy) September 10, 2026 -
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆయుధాల అపహరణ కేసులో మిస్టరీ వీడింది. ఆయుధాలను మాజీ ఆర్మీ అధికారే చోరి చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో మద్రాస్ రెజిమెంట్లో పనిచేసినట్లు తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై ఆయుధాల చోరీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆయుధాల చోరీకి మరో ముగ్గురు అధికారులు సహకరించినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ చోరీ మూడు నెలలుగా పక్కా ప్లాన్తో ఆయుధాల మాయం చేసినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. శిక్షణా కేంద్రంలోని ఆయుధాలకు ప్రత్యేక కోడింగ్ నంబర్లు లేకపోవడాన్ని గుర్తించిన నిందితుడు ఆ లోపాన్ని ఆసరాగా చేసుకుని.. అవకాశం దొరికినప్పుడల్లా ఒక్కొక్క ఆయుధం బయటకు తరలించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా సిబ్బంది కళ్లుగప్పి తుపాకులతో పాటు బుల్లెట్లను కూడా దశలవారీగా తరలించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చోరీకి అనువుగా రాత్రివేళల్లో ఆయుధాగారం వద్ద సీసీటీవీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా ఆఫ్ చేసినట్లు వెల్లడిరాత్రి వేళల్లో డ్యూటీలో ఉన్న అగ్నివీర్లను వేరే పనులకు పంపించి ఆయుధాల తరలింపుచివరగా ఆగస్టు 30 న భారీ వర్షాన్ని ఆసరాగా చేసుకుని తాళాలు పగులగొట్టి బయట దొంగల పని అన్నట్లుగా డ్రామా ఆడి ఆయుధాల చోరీ చేసినట్లు అధికారులు తెలిపారు. రికవరీ చేసిన వాటిలో 4 AK-203 అసాల్ట్ రైఫిల్స్, 1 INSAS రైఫిల్ 7 పిస్టల్స్.. 6 మిలిటరీ, 1 సివిలియన్ పిస్టల్ స్వాధీనం21 మ్యాగజైన్లు, నైట్ విజన్ బైనాక్యులర్ కూడా రికవరీ1,900కు పైగా లైవ్ బుల్లెట్లు పోలీసుల స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, మిలిటరీ పోలీస్, NIA, బొల్లారం పోలీసులు సంయుక్త దర్యాప్తుతో జరిగినట్లు పేర్కొన్నారు. -
నేడు 5వ రోజు కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నేడు ఐదో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధి, మున్సిపాలిటీలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.ముఖ్యమంత్రి అసెంబ్లీలో కోర్ అర్బన్ రీజియన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పట్టణ ప్రాంతాల పరిధి, అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన అంశాలకు ఈ బిల్లు ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లును కూడా సీఎం సభ ముందుకు తీసుకురానున్నారు.మరోవైపు ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత, నిబంధనలకు సంబంధించిన మార్పులపై ఈ బిల్లు ద్వారా చర్చ జరిగే అవకాశం ఉంది.ఇక జనగణనలో బీసీ, ఓబీసీల అంశంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. జనగణనలో వెనుకబడిన తరగతులకు సంబంధించిన వివరాల నమోదు, వారి జనాభా లెక్కింపునకు సంబంధించిన అంశాలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.అలాగే విద్యారంగ కార్యక్రమాలపై మరో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించిన పథకాలు, కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై సభ్యులు చర్చించనున్నారు. దీంతో ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.ఇవి కూడా చదవండి: ట్రాన్స్కోకు ఆయిల్ పరేషాన్ -
ట్రాన్స్కోకు ఆయిల్ పరేషాన్
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తెలంగాణ ట్రాన్స్కోపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లలో వాడే మినరల్ ఆయిల్ ఆధారిత ఇన్సులేటింగ్ ఆయిల్ కోసం ట్రాన్స్కో అష్టకష్టాలూ పడాల్సి వస్తోంది. దీని కొరత కారణంగా తరచూ సబ్ స్టేషన్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. కీలకమైన 400 కేవీల్లో కొన్ని నిమిషాల పాటు సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల పరిశ్రమలు, గృహ విద్యుత్ ఉన్నట్టుండి ఆగిపోతున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కొన్ని నెలలుగా కొనసాగుతున్నా, సమస్య తీవ్రత మాత్రం కొన్ని వారాలుగా ఉందని అధికారులు చెబుతున్నారు. యుద్ధం మొదలైనా ఉన్న నిల్వలు, ముందు చూపుతో తెప్పించుకున్న ఆయిల్ వల్ల సమస్య లేకుండా చూశామని ఓ డైరెక్టర్ స్థాయి అధికారి తెలిపారు. కానీ ఇప్పుడు మార్కెట్లోనూ దొరకడం కష్టంగా ఉందంటున్నారు. ఎక్కడన్నా లభించినా క్రూడ్ ధర పెరగడం వల్ల ట్రాన్స్కోకు కావాల్సిన ఆయిల్ రేట్లూ పెరుగుతున్నాయని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, పెరిగిన ఖర్చుపై ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు, వాణిజ్యం, గృహ విద్యుత్కు ట్రాన్స్కోకు సంబంధించిన 400 కేవీ, 220 కేవీ లైన్లే కీలకం. ఇవి జాతీయ గ్రిడ్కు అనుసంధానమై ఉంటాయి. ఇదే సామర్థ్యంతో ఉండే సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి. వినియోగదారుడికి చేరుకునే 11 కేవీ లైన్లకు విద్యుత్ను నియంత్రించి పంపడం వీటి బాధ్యత. రాష్ట్రంలో 400 కేవీ సబ్ స్టేషన్లు 29, 220 కేవీ సబ్ స్టేషన్లు 105, 132 కేవీ సబ్ స్టేషన్లు 254 వరకూ ఉన్నాయి. వీటి పరిధిలో ఉండే ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని బట్టి ఆయిల్ వినియోగం ఉంటుంది. 105ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ సమర్థ్యానికి 35 వేలు, 315 ఎంవీఏ సామర్థ్యం ట్రాన్స్ఫార్మర్లకు 80 వేల లీటర్ల వరకూ ఆయిల్ వాడకం ఉంటుంది. క్రూడ్ ఆయిల్ మార్కెట్లో ఆరు నెలల క్రితం 6,500 వరకూ ఉంది. ప్రస్తుతం ఇది రూ. 8 వేల వరకూ వెళ్ళింది. ఫలితంగా ట్రాన్స్కోపై రోజుకు కొన్ని లక్షల రూపాయల అదనపు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్కో పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ను పెద్ద విద్యుత్ హీటర్గా భావిస్తారు. కాయిల్స్, వేడి ఉత్తత్తి నియంత్రణ, రేడియేటర్ల వేడిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. అధిక వోల్టేజీ కాయిల్స్, ఆయిల్ ఇన్సులేషన్కు ఆయిల్ కీలకం. ఆయిల్ తక్కువైనప్పుడు ట్రాన్స్ఫార్మర్లో నీరు, తేమ, దుమ్ము, ఆక్సీకరణ ఉత్పత్తుల పెరుగుదల ఉంటుంది. దీనివల్ల ఇన్సులేటింగ్ సామర్థ్యం తగ్గుతుంది. ఇన్సులేషన్ బలహీనపడితే వేడి పెరిగి, ట్రాన్స్ఫార్మర్ వైఫల్యం చెందుతుంది. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పట్నుంచీ ఆరు నెలల కాలంలో 80 సార్లు 400 కేవీ సబ్ స్టేషన్లలో సమస్యలు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీని ప్రభావం వల్ల ఈ ఆరు నెలల్లో నెలకు కనీసం వందకుపైగా విద్యుత్ అంతరాయాలు పెరిగాయి. ఆయిల్ కొనుగోలుపై ట్రాన్స్ అధికారులు చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఆయిల్ నిల్వలు పెంచాలని అధికారులు సూచిస్తున్నారు. -
మీ కోసం.. ఎనీ టైమ్
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆఫీసు రచ్చబండ లాంటిది. నా కార్యాలయ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. ఉద్యోగ సంఘాల నేతలు నన్ను ఎప్పుడైనా కలవచ్చు. ఉదయమే కాదు... రాత్రిపూట కూడా వచ్చి కలవచ్చు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది’అని సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితర ప్రతినిధి బృందం సీఎంతో సమావేశమైంది. ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలను టీజీఈజేఏసీ ప్రతినిధులు వివరించారు. ఇందుకు సంబంధించి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా ఆరు అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు. రెండవ పీఆర్సీ నివేదిక, 51% ఫిట్మెంట్, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు, రూ.10,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు–ఓపీఎస్ అమలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఉద్యోగ సంఘాల గుర్తింపు తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఉద్యోగుల సమస్యలను ఆలకించిన అనంతరం సీఎం పైవిధంగా స్పందించారు. నివేదిక పరిశీలిస్తాం...తుది నిర్ణయం తీసుకుంటాం జేఏసీ ప్రతినిధులతో సీఎం మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక సమర్పించేందుకు ఇప్పటికే కమిషన్కు ప్రభుత్వం లేఖ పంపిందని, నివేదిక అందిన అనంతరం దానిని పరిశీలించి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి పీఆర్సీ, డీఏలపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ.10వేల కోట్లు విడుదల చేసిందని, ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని సీఎం తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అనేక అంశాలు తన ముందున్నాయని, వాటితో పాటు ఇతర పరిపాలనా కార్యక్రమాల వల్ల సమయం కేటాయించడం కష్టంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆర్థిక శాఖతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి సమావేశమై అన్ని అంశాలపై చర్చించి పరిష్కార మార్గాలను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో జేఏసీ ప్రతినిధులు దామోదర్ రెడ్డి, చావ రవి, సదానంద గౌడ్, గౌతమ్ కుమార్, కటకం రమేష్, ముజీబ్ హుస్సేన్, బి.శ్యామ్, వెంకట్, రమణారెడ్డి, భిక్షం గౌడ్ తదితరులున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు, డిప్యూటీ కలెక్టర్ల సంఘంవ్యవస్థాపక అధ్యక్షులు వి.లచి్చరెడ్డి, జేఏసీ నేత వడ్నాల రాజశేఖర్ కూడా సీఎంను కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం టీజీఈజేఏసీ ప్రతినిధి బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి ఉద్యోగుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. -
ప్యాకెట్ ఫుడ్పై రెడ్ సిగ్నల్..!
సాక్షి, హైదరాబాద్: ప్యాకెట్లలో లభించే ఆహార పదార్థాల నాణ్యత, వాటిపై వేసే ముందస్తు హెచ్చరిక ముద్రల విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల అధికార సంస్థకు (ఎఫ్ఎస్ఎస్ఏఐ) జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) అత్యంత కీలక సిఫార్సులను చేసింది. మరోవైపు ప్రజలు కొనుగోలు చేసే ప్యాకెట్ ఆహారాలలో చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఏ మేరకు ఉన్నాయో ప్యాకెట్ ముందు భాగంలోనే స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని న్యాయస్థానం గతంలోనే ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థ ఆరు కోణాలు కలిగిన ఒక ఎరుపు రంగు గుర్తును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఒకవేళ సదరు ఆహారంలో అనారోగ్యకర పదార్థాలు ఎక్కువగా ఉంటే.. ఆ ఎరుపు రంగు గుర్తు లోపల ‘అధిక కొవ్వు’, ‘అధిక చక్కెర’, ‘అధిక ఉప్పు’అని స్పష్టంగా రాయాలని ఎన్ఐఎన్ ప్రతిపాదించింది. ముందస్తు హెచ్చరిక ముద్రల విషయంలో ఉన్నత న్యాయస్థానం విధించిన సమయం ముగియనున్న నేపథ్యంలో ఎన్ఐఎన్ ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.మొత్తం క్యాలరీలను లెక్కించాల్సిందే.. కేవలం అదనంగా చేర్చే చక్కెర, కొవ్వులను మాత్రమే కాకుండా ఆ ఆహారంలో ఉండే మొత్తం క్యాలరీలు, మొత్తం చక్కెర, మొత్తం కొవ్వు ఆధారంగానే ఈ హెచ్చరిక గుర్తును నిర్ణయించాలని ఎన్ఐఎన్ స్పష్టం చేసింది. ఉదాహరణకు మార్కెట్లో దొరికే కొన్ని వేపుడు చిప్స్ ప్యాకెట్లలో అదనంగా చేర్చే చక్కెర చాలా తక్కువగా ఉండవచ్చు. అలాగే అదనంగా చేర్చే కొవ్వు కూడా నిర్దేశిత పరిమితి కంటే లోపే ఉండవచ్చు. కానీ అందులో ఉండే నూనె శాతం వల్ల మొత్తం క్యాలరీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం అదనపు కొవ్వులనే ప్రామాణికంగా తీసుకుంటే ఇలాంటి హానికర ఆహారాలు ఎరుపు రంగు హెచ్చరిక పరిధిలోకి రాకుండా తప్పించుకుంటాయని ఎన్ఐఎన్ హెచ్చరించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ ప్రతిపాదనలను పరిశీలించి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనుంది. ఎన్ఐఎన్ చేసిన మరికొన్ని సూచనలు.. » చక్కెర స్థానంలో వాడే కృత్రిమ తీపి రసాయనాలు (ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్) ఆరోగ్యానికి మంచిది కాదు. వాటి పరిమాణాన్ని కూడా ప్యాకెట్పై స్పష్టంగా రాయాలి. » శాస్త్రీయ పరిభాషతో సంబంధం లేకుండా చదువుకోని సాధారణ ప్రజలు కూడా ప్యాకెట్ చూడగానే అది ఆరోగ్యానికి మంచిదా కాదా అని గ్రహించేలా ఆ ఎరుపు రంగు గుర్తు డిజైన్ ఉండాలి. » పాలు, గుడ్లు, పండ్లు వంటి సహజ సిద్ధ ఆహార పదార్థాలలో ఉండే కొవ్వు లేదా చక్కెరలను ఈ నిబంధనల నుంచి మినహాయించాలి. కేవలం మనుషులు తయారు చేసే ప్యాకెట్ ఆహారాలకే (ప్రాసెస్డ్ ఫుడ్స్) ఇది వర్తింపజేయాలి. హెచ్చరికలపై సుప్రీం ఆదేశాలుదేశంలో విపరీతంగా లభించే ప్యాకెట్ ఆహార సంస్కృతి వల్ల ఊబకాయం, మధుమేహం, ఇతర జీవనశైలి వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. వినియోగదారులు తాము కొనే ఆహారం ఎంతవరకు సురక్షితమైనదో ప్యాకెట్ చూడగానే సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ ముందస్తు హెచ్చరిక గుర్తులు దోహదపడతాయని ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్యాకెట్ ఆహార పదార్థాలపై వినియోగదారులను హెచ్చరించే ముద్రలు వేయడంపై గతంలో సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్యాకెట్ల ముందు భాగంలోనే స్పష్టమైన గుర్తులు లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యకర ఆహారాన్ని కొని తింటున్నారని, దీనివల్ల దేశంలో ఊబకాయం, గుండె జబ్బులు పెరుగుతున్నాయని పిటిషన్దారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ ముందస్తు హెచ్చరిక ముద్రల విధానాన్ని త్వరగా ఖరారు చేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని ఆదేశించింది. -
ఎనభై.. కొత్త ట్రెండురా బై..
సాక్షి, హైదరాబాద్: 1980ల నాటి రెట్రో లుక్ ఇప్పుడో క్రేజ్గా మారింది. ఏఐ ఆధారిత ఇమేజ్ జనరేషన్ దీనికి వేదికగా మారింది. అప్పటి సెలబ్రిటీలు అనుసరించిన ఫ్యాషన్స్ను కాపీ కొడుతూ ఏఐ సాయంతో సృష్టిస్తున్న ఇమేజ్లు సోషల్ మీడియా స్టేటస్లు, పోస్టులలో అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అప్పటి దుస్తులు, జుట్టు తీరు, పరిసరాలు వంటి అంశాలను తలపించేలా ఈ చిత్రాలు ఉంటున్నాయి. ఇప్పటి వరకూ ఇలాంటివి సెలబ్రిటీలు, సామాన్యులకు పరిమితం కాగా.. ఈసారి రాజకీయ నేతలు కూడా చాలామంది ఈ లుక్ను ట్రై చేయడం విశేషం. ఇన్స్ట్రాగామ్, ఎక్స్ తదితర వేదికల్లో సాధారణ యువత నుంచి ప్రముఖుల వరకు ఈ ‘80ల ట్రెండ్’ను అనుసరిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్లోకి ఇలా... ముందుగా చాట్జీపీటీలో వ్యక్తులు తమ ఫొటోను అప్లోడ్ చేసి, దానిని 1980ల నాటి లుక్తో ఫొటోలా మార్చాలని సూచిస్తూ సవివరమైన ప్రాంప్ట్ ఇవ్వాలి. వ్యక్తి ముఖ లక్షణాలు, సహజమైన చర్మ ఛాయ, దీని ద్వారా నాటి సంప్రదాయ దుస్తులు, సహజమైన పోజులు, పాత ఫిల్మ్ కెమెరాతో తీసినట్లుగా కనిపించే ఫొటోలను కోరవచ్చు. అలాగే పాతకాలపు ఇళ్లు, సాదాసీదా దుస్తులతో అప్పటి జీవనాన్ని ప్రతిబింబించేలా కూడా చిత్రం రూపొందించుకోవచ్చు. అప్పటి పాత బస్సులు, సైకిళ్లు, దుకాణాలు, సినిమా పోస్టర్లు వంటి అంశాలను కూడా జోడించవచ్చు. రాజకీయ నాయకులు సైతం ‘రెట్రో’లోకి.. ఈ ట్రెండ్ సామాన్యులకే పరిమితం కాలేదు. ప్రధాని నరేంద్రమోదీ, రాహుల్గాందీల 80ల లుక్ను ఆయా పార్టీలు షేర్ చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ఈ ఫొటో ట్రెండ్ను ఫాలో అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అప్డేట్స్ ఖాతాలో రేవంత్రెడ్డి, రాహుల్గాంధీ కలిసున్న ఫొటోలను 1980 ట్రెండ్లోకి మార్చి పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా నాటి ట్రెండ్ ఫొటోను షేర్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంపీ రేణుకా చౌదరి సహా పలువురు ప్రముఖులు ఈ ట్రెండ్కు భిన్నంగా 80ల నాటి తమ ఒరిజినల్ ఫొటోను పంచుకున్నారు.నకిలీలతో జాగ్రత్త.. ఇదిలా ఉండగా తాజా ట్రెండ్ ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. 1980 పేరుతో నకిలీ యాప్స్ను సృష్టించి.. వాటి ద్వారా ఏపీకే ఫైల్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
చిన్నారిపై ప్రైవేటు పాఠశాల హెచ్ఎం అత్యాచార యత్నం
ధర్మపురి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు గాడితప్పి ఓ బాలిక (4)పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చల్లా శ్రీనివాస్ సదరు చిన్నారిని బుధవారం స్టాఫ్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపగా.. గురువారం తల్లిదండ్రులు, మరికొంతమంది కాలనీవాసులు పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పాఠశాలలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ రాంనర్సింహరెడ్డి పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
‘సర్’తో.. ఏదో ప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న ఆంతర్యాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు గ్రహించాలని చెప్పారు. ఎస్ఐఆర్ను చాలా సీరియస్గా తీసుకోవాలని అన్నారు. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు చెప్పానని, ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలని, అర్హులైన వారి ఓటు హక్కును కాపాడాలని సూచించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిది నరసింహారెడ్డి, వంగా సుబ్బారావు, జి.సిద్ధయ్యల మృతికి సీఎల్పీ సంతాపం తెలిపింది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర ‘ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా చూపెడుతున్నారు. కానీ ఓటర్ల సంఖ్య మాత్రం 88 కోట్లే అంటున్నారు. అంటే దాదాపు 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ 15 కోట్ల ఓట్ల తొలగింపు కారణంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేయగలగాలి. ఆ ప్రమాదం మన దరిదాపులకు రానీయకుండా మీరే జాగ్రత్త పడాలి. మీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుంది. మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. ఎస్ఐఆర్ కోసం నేను రెండు రోజులు కొడంగల్లోనే ఉన్నా. ఎమ్మెల్యేలందరూ అలానే ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో జరిగిన జనగణన దేశానికి రోల్మోడల్. రాష్ట్ర నమూనాను దేశ వ్యాప్తంగా జనగణనలో చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అధికారం పోయినా అహంకారం పోలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాలి. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే ఫామ్హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన సభ జరగకుండా కుట్ర చేశారు. అధికారం పోయినా వారికి అహంకారం పోలేదు. పోలీసులు, ప్రజాప్రతినిధులను దూషించి మూడు రోజుల పాటు సభ సజావుగా జరగకుండా చేశారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించారు. మహిళా అధికారుల ముందు టీ షర్టులు విప్పి ఇబ్బంది కలిగించారు. సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. దళితులు నిరసన తెలిపేందుకు వెళ్లిన నేలను శుద్ధి చేసి అవమానపర్చారు. అయినా ప్రతిపక్షం కుట్రలను బలంగా తిప్పికొట్టడంతో పాటు ఆ కుట్రను ప్రజలకు తెలియజేయగలిగాం..’అని సీఎం అన్నారు. కుట్రను తిప్పికొట్టారంటూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అభినందించారు. సీఎల్పీ భేటీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, రాజనర్సింహ, ఉత్తమ్, మహేశ్ గౌడ్, శ్రీధర్బాబు, ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో పనితీరు ఆధారంగానే పదోన్నతులు ‘అసెంబ్లీలో జరిగిన ఘటనల గురించి ఫ్లాష్ సర్వే చేయించా. అందులో కాంగ్రెస్కు చాలా పాజిటివ్గా వచ్చింది. మనం ఏం చేస్తున్నామో ప్రజలు గమనిస్తుంటారు. కాంగ్రెస్ సభ్యులు లాబీల్లో తిరగడం కాదు. అసెంబ్లీలో హాజరు తగ్గకుండా చూసుకోవాలి. సభ జరిగినన్ని రోజులు ఖచ్చితంగా హాజరు కావాలి. చర్చల్లో పాల్గొనాలి. నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించాలి. ప్రజలిచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా రాణించలేరు. అసెంబ్లీలో పనితీరు ఆధారంగానే పదోన్నతులు వస్తాయి. సభలో అందరికీ వెసులుబాటుగా ఉండడం కోసం అత్యంత చారిత్రక భవనంలో శాసనమండలి నిర్వహిస్తున్నాం. అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీపాదరావు పేరిట సెంట్రల్ హాల్ ఏర్పాటు చేశాం. 22ఏలో కోటి ఎకరాలు అవాస్తవం 22ఏ అనేది అభూత కల్పన మాత్రమే. ఈ జాబితాలో కోటి ఎకరాలు ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న భూములే ఇప్పుడూ ఉన్నాయి. ప్రైవేటు వివాదాలున్నవి కేవలం 3 లక్షల ఎకరాలు మాత్రమే. ధరణిలో భారీ ఎత్తున అరాచకాలు చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ నేత ఒకరి పేరిట వెయ్యి ఎకరాలు ఎక్కించుకున్నారు. వీటన్నింటిపైనా విచారణ చేయిస్తున్నాం. అన్నీ ఒకొక్కటిగా బయటకు వస్తాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఎల్నినో కారణంగా వచ్చే 10 నెలలు కూడా ఇబ్బంది ఉంటుంది. కరువు వచ్చే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేలు సాగునీటిపై కాకుండా తాగునీటిపై ఫోకస్ చేయాలి. కొందరు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి అదే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగేవారా?’అని సీఎం ప్రశ్నించారు. వెయ్యి రోజుల పాలనకు సహకరించిన సీఎల్పీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికీ పథకాల ప్రచారం జరగాలి: భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరం కలిసి పనిచేస్తే కుట్రలను ఎలా ఛేదించగలమో చేసి చూపించామని అన్నారు. బీఆర్ఎస్ నేతల తీరు, వారి భాష, వివక్ష పూరిత కార్యకలాపాల గురించి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసి కట్టడి చేయగలిగామని అన్నారు. అందరం ఒకటే మాట, ఒకటే బాటగా ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడంలో వెనుకబడుతున్నామన్నారు. సరైన విధంగా ప్రచారం చేసుకుంటే ఆ ప్రవాహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేసిన పనులను ప్రతి గ్రామంలో ఇంటింటికీ ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణలోనే సామాజిక న్యాయం: పీసీసీ చీఫ్ సామాజిక న్యాయం తెలంగాణలోనే అమలవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ బీసీ కాకపోయినా బీసీలకు రిజర్వేషన్ల కోసం ముందుకొచ్చారని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. కాగా రాష్ట్రంలో పరిస్థితులను పలువురు మంత్రులు సీఎల్పీకి వివరించారు. ఎల్నినో ప్రభావం, నీటి సమస్యపై మంత్రి ఉత్తమ్, జనగణనలో బీసీ కాలమ్ గురించి పొన్నం, 22ఏ భూముల జాబితా గురించి పొంగులేటి, పాలిటెక్నిక్ విద్యార్థుల అంశంపై మంత్రి వివేక్లు వివరించారు. యాష్కీకి సీఎం శుభాకాంక్షలు ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్గా ఎంపికైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్కు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం సీఎల్పీ సమావేశం అనంతరం.. అసెంబ్లీ కమిటీ హాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాష్కీకి శుభాకాంక్షలు తెలియజేశారు. -
అవమానం భరించలేక కేదారి దంపతుల ఆత్మహత్య
నయీంనగర్: అద్దె డబ్బులు ఇవ్వడం లేదని హోటల్ భవన యజమాని తిట్టి తాళం వేయడంతో అవమానం భరించలేక లింగాల కేదారి దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. లింగాల కేదారి కొడుకు పృథ్వీ ఫిర్యాదు మేరకు బిల్డింగ్ యజమాని కుమారుడు రాముపై కేసు నమోదు చేసినట్టు సుబేదారి పోలీసులు గురువారం తెలిపారు. హనుమకొండ నక్కలగుట్టలోని అదాలత్ జంక్షన్ వద్ద అద్దె భవనంలో లింగాల కేదారి దంపతులు కొన్నేళ్లుగా తమ పేరుమీద హోటల్ నడుపుతున్నారు. అనివార్య కారణాలతో అద్దె చెల్లించడం లేదు. దీంతో భవన యజమాని కుమారుడు బుధవారం హోటల్ వద్దకు వచ్చి కిరాయి ఎందుకు ఇవ్వడం లేదని దూషించి తాళం వేశాడు. దీనిని అవమానంగా భావించిన లింగాల కేదారి దంపతులు సాయంత్రం హోటల్లోకి వెళ్లి తాళం తీసి లోనికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. లింగాల కేదారి అక్కడికక్కడే చనిపోగా, భార్య పుష్పలతకు తీవ్రగాయాలు కాగా, ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.కాగా, ఎంతోమందికి ఉచితంగా అన్నం పెట్టిన లింగాల కేదారి మరణవార్త విని అంతిమయాత్రకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నగరంలో చదువుకునేందుకు వచ్చిన సమయంలో అతి తక్కువ ధరకు భోజనం పెట్టేవాడని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని కన్నీరు పెట్టుకున్నారు. లింగాల కేదారి దంపతులకు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ నివాళులరి్పంచారు.దంపతుల అనుమానాస్పద మృతిపురుగుల మందు తాగి భార్య...రైలుకు ఎదురెళ్లి భర్త మృతి తండ్రి కళ్లముందే కొడుకు బలవన్మరణం ఇరువురి మధ్య గొడవలే కారణంసికింద్రాబాద్/అడ్డగుట్ట: పెళ్లై పదహారు నెలలు... రాఖీ పండుగకు సొంత ఊరికి వెళ్లి పది రోజుల కిందటే తిరిగి నగరానికి వచ్చారు. అంతలోనే ఏమైందో తెలియదు. దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య ఇంట్లో పురుగుల మందు తాగి మృతి చెందగా... భర్త రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు తార్నాక విజయపురి కాలనీలో విషాదాన్ని నింపాయి. సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయీశ్వర్గౌడ్, లాలాగూడ ఇన్స్పెక్టర్ రవి కిరణ్లు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా అఫ్జల్పూర్ గ్రామానికి చెందిన శరణప్ప (28) ఉపాధి కోసం కొద్ది కాలం క్రితం నగరానికి వచ్చి తార్నాక విజయపురి కాలనీలోని ఓ ఇంట్లో భార్య లక్ష్మి, తల్లిదండ్రులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. శరణప్ప నాచారంలోని ఒక హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గురువారం ఉదయం శరణప్ప తండ్రి ధర్మన్న మంగ ఇద్దరూ కలిసి లాలాపేట విజయ డెయిరీ సమీపంలో టీ తాగేందుకు వెళ్లారు. అనంతరం, అక్కడి నుంచి శరణప్ప పనికి వెళ్తున్నానని తన తండ్రికి చెప్పి పట్టాల మార్గం గుండా నాచారం వైపు వెళ్తుండగా ఖర్చుల నిమిత్తం తనకు యాభై రూపాయలు కావాలని తండ్రి శరణప్ప అతడి వెనుకనే వెళ్లాడు. ఈ క్రమంలో మౌలాలి రైల్వే స్టేషన్ అప్లైన్ ప్రాంతంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి శరణప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. కళ్ల ముందే కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో శోకసంద్రంలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి వద్ద గల ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు గుర్తించారు. ఇంట్లో భార్య ఆత్మహత్యకేసు నమోదు చేసుకున్న జీఆర్పీ పోలీసులు విచారణ సాగించగా మరో ఆత్మహత్య ఘటన వెలుగుచూసింది. శరణప్పకు 16 నెలల క్రితం సొంత జిల్లాకు చెందిన లక్ష్మి (24)తో వివాహం జరిగింది.అప్పటి నుంచి వీరిద్దరిమధ్య ఆర్థిక సమస్యలు, కుటుంబపరమైన గొడవలు ఉన్నట్లు పోలీసులకు బంధువుల ద్వారా సమాచారం అందింది. ఇటీవల రాఖీ పండుగ కోసం దంపతులిద్దరూ కర్ణాటక వెళ్లి పది రోజుల క్రితమే నగరానికి వచ్చారు. ఆ తర్వాత కూడా నిత్యం గొడవలు జరుగుతుండేవని తెలిసింది. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి లక్ష్మి పురుగుల మందు తాగి నిద్రపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం శరణప్ప నిద్రలేచేసరికి విగతజీవిగా పడిఉన్న భార్య లక్ష్మి మృతదేహాన్ని గుర్తించి ఉంటాడని, భార్య మరణంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసులు నమోదు చేసుకున్న జీఆర్పీ, లాలాగూడ పోలీసులు ఇరువురి మృతదేహాలను గాం«దీమార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యూచర్ లేని సిటీ...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్ సిటీ ఓ మిథ్య అని, దానికి ఎలాంటి ఫ్యూచర్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూముల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చెల్లవని, ఫ్యూచర్ లేని సీఎం..తన సోదరులతో కలిసి ఆడుతున్న రియల్ ఎస్టేట్ నాటకంలో బలిపశువులు కావొద్దని విజ్ఞప్తి చేశారు. ‘పెట్టుబడులు పెట్టి మోసపోవొద్దు. ఏటా రూ.లక్ష కూడా టర్నోవర్ లేని సీఎం సోదరుడు కొండల్రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీకి రూ.250 కోట్లు విలువ చేసే భూములను రూ.7 కోట్లకే కట్టబెట్టడంపై కోర్టులను ఆశ్రయిస్తాం. ఎనుముల అన్నదమ్ముల దోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోం..’అని అన్నారు. గురువారం మహేశ్వరం మండలం తుక్కుగూడ ఫ్యాబ్సిటీ (ఈసిటీ)లో టెస్సెరాక్ట్ కంపెనీకి కేటాయించిన భూములను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఆ కంపెనీకి భూ కేటాయింపులపై నిరసన వ్యక్తం చేసింది. అనంతరం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్రెడ్డితో కలిసి కేటీఆర్ మాట్లాడారు. ఇందులో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి.. ‘ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాయాజాలం నడుపుతోంది. వాస్తవానికి ఫార్మాసిటీ కోసం నిర్దిష్ట షరతులతో భూసేకరణ జరిగింది. ఆ భూములను ఇప్పుడు ఇతర కార్యకలాపాలకు వినియోగించడం చట్టపరంగా ప్రశ్నార్థకం. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తుపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలు ఈ న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. రేపు కోర్టులో ఈ భూములపై వివాదాలు తలెత్తితే నష్టపోయేది పారిశ్రామికవేత్తలే. పూర్తి వివరాలు ప్రజల ముందుంచాలి ఈ భూ కేటాయింపుపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలి. సీఎం కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు ఇవ్వడం అధికార దుర్వినియోగం కాదా? ప్రయోజనాల సంఘర్షణ కాదా? కుటుంబ పాలన కాదా? ఒకవైపు సీఎం ఎనుముల రేవంత్రెడ్డి.. మరోవైపు పారిశ్రామికవేత్త ఎనుముల జగదీశ్వర్రెడ్డిల మధ్య రూ.1,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం. దానికి మళ్లీ ప్రభుత్వ రాయితీలు, ప్రభుత్వ భూములు, మినహాయింపులు ఇవ్వాలా? సీఎం సోదరుడి సంస్థ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్తో చేసుకున్న ఒప్పందంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు? అనామక కంపెనీకి విలువైన భూములు కేటాయించిన వ్యవహారంపై బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు? ఈడీ, ఐటీ, సీబీఐలు మాపై కేసులు పెట్టడానికే ఉన్నాయా? అధికారంలో ఉన్నవారి వ్యవహారాలు వారికి ఎందుకు కనిపించడం లేదు? తెలంగాణ..కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆరోపిస్తున్నారు. తెలంగాణను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నప్పుడు దొంగలను పట్టుకోవాల్సిన హోం మంత్రి ఎక్కడున్నారు?ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు లోబడి ఉంటాయి. ఈ రంగంలోనూ అధికారానికి దగ్గర గా ఉన్న కుటుంబాలకు ప్రయోజనాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలు కూడా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలోకి రావడంపై పూర్తి వివరాలు వెల్లడించాలి.సామాన్యులకు కూడా ఇలాగే భూములు ఇస్తారా? భూ కేటాయింపుల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తే సామాన్యులు, యువత, రైతులకు కూడా ఇదే తరహాలో ప్రభుత్వ భూములు, రాయితీలు ఇవ్వాలి. మేము లక్ష రూపాయల మూలధనంతో పెట్టుబడి పెడతామని వస్తే కోట్ల విలువైన స్థలం ఇస్తారా? మాకు కూడా ఇదే రాయితీలు, మినహాయింపులు ఇస్తారా? ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టబోం. అవసరమైతే ప్రజా కోర్టును ఆశ్రయిస్తాం, రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి భూకేటాయింపులు, ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న వ్యవహారాలను ప్రజలకు వివరిస్తాం..’అని కేటీఆర్ అన్నారు. -
వైఎస్ పేదల కోసం గుర్తించిన స్థలాలు నెల రోజుల్లో ఇస్తాం: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుపేదలకు ఇవ్వడానికి గుర్తించిన ప్రభుత్వ స్థలాలను లేఅవుట్ చేసిన వాటిని నెల రోజుల్లో పేదలకు ఇచ్చే ప్రయత్నం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శాసనసభలో గురువారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాన్ని పలువురు సభ్యులు లేవనెత్తారు. సభ్యుల సందేహాలకు మంత్రి సమాధానమిస్తూ, 2024లో రాష్ట్ర ప్రభుత్వం సర్వే పూర్తి చేసి, ఆవాస్ యోజన అర్హత కలిగిన 11,56,929 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. ఇది ఇప్పటికే పెండింగ్లో ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 8 లక్షల ఇళ్లకు రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. భవిష్యత్లో అర్హులకు మూడు, నాలుగో విడతలో కూడా ఇళ్లు ఇవ్వాలని ఆలోచిస్తోందని తెలిపారు. సమస్యలున్నాయి: రాజగోపాల్రెడ్డి చిన్న చిన్న కారణాల వల్ల అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. బతుకు దెరువు కోసం వాహనాలు కొనుక్కొన్నారని, అవి ఎప్పుడో పోయాయని, వారిని అనర్హులను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇళ్లు ఇస్తున్నామనేది కాదని, ఎంతమంది అర్హులకు ఇస్తున్నామన్నదే ముఖ్యం కావాలన్నారు. చర్చలో మనోహర్రెడ్డి, అక్బరుద్దీన్, మేడేపల్లి సత్యం, వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అగ్రి పాలిటెక్నిక్ కాలేజీలను మెరుగుపరుస్తాం: మంత్రి తుమ్మల రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలను ఆధునీకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 11 ప్రైవేటు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించిందని, ఇందులో ఆరు ప్రైవేటు కాలేజీల అనుబంధాన్ని రద్దు చేశామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. ప్రమాణాలు లేని కాలేజీల అనుమతి రద్దు చేశామని, కొన్ని కాలేజీల్లో ప్రమాణాల పరిశీలనకు ఓ కమిటీని వేశామన్నారు. ఈ చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే మదనమోహన్ మాట్లాడుతూ, సరైన ప్రమాణాలు లేకుండా వ్యవసాయ కాలేజీలకు అనుమతి ఇవ్వొద్దని చెప్పారు.అవసరమైన ఫ్యాకల్టీ ఉండాలని కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. కొత్త వంగడాలు, సరికొత్త వ్యవసాయ విధానాలపై ఆధునిక లేబొరేటరీలతో పరిశోధనలు జరగాలని మధుసూదన్రెడ్డి కోరారు. చర్చలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు కూడా పాల్గొన్నారు. హజ్హౌస్పై స్పష్టత ఇవ్వాలి: అక్బర్ హజ్హౌస్లో సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. ఇతరులను మనం అనుసరించాల్సిన అవసరం లేదని, బెంగళూరులోని హజ్హౌస్ను ఉద్దేశించి అన్నారు. పహాడీషరీఫ్ వద్ద కొత్త హజ్హౌస్ నిర్మాణంపై అక్బర్ పలు ప్రశ్నలు వేశారు. -
మో'డల్'గా స్కూళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని విద్యాశాఖాధికారులు ప్రతీ ఏటా నివేదికలు పంపుతూనే ఉన్నారు.మౌలిక వసతుల కల్పనపై సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మోడల్ స్కూళ్ళల్లో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 194 మోడల్ పాఠశాలల్లో మొత్తం 1,59,080 సీట్లున్నాయి. కేవలం 1,07,782 మంది విద్యార్థులే చేరారు. దీంతో ఏకంగా 51,298 సీట్లు ఖాళీగా మిగిలాయి. గత విద్యా సంవత్సరంలోనూ సుమారు 50,718 సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మోడల్ స్కూళ్ళ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సమస్య ఎక్కడ? మోడల్ స్కూళ్ల టీచర్ల సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. 3,880 బోధనా పోస్టులు మంజూరైతే, ఇప్పటికీ 1,080 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 97 ప్రిన్సిపాల్ పోస్టులే భర్తీ చేయలేదు. ఫలితంగా ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. అతిథి అధ్యాపకులను తీసుకుని కాలం వెళ్ల దీస్తున్నా, అర్హత ఉన్న వారు, అనుభవం ఉన్నవారే కన్పించడం లేదని స్థానికులు అంటున్నారు. చాలా చోట్ల ప్రస్తుతం పనిచేస్తున్న వారే అదనపు తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. దీనివల్ల విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ కొరవడుతోంది. ప్రయోగశాలల నిర్వహణ, ఇతర విద్యా కార్యక్రమాలకు తగినంత సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొంది. గంటల ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించడం తాత్కాలిక పరిష్కారమే తప్ప.. శాశ్వత పరిష్కారం కాదని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వసతి గృహాల కొరత చాలాచోట్ల మోడల్ స్కూళ్లు గ్రామీణ ప్రాంతాలకు దూరంగానే ఉంటున్నాయి. దీంతో సరైన రవాణా సదుపాయం లేని విద్యార్థులు ఈ స్కూళ్లకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మోడల్ స్కూళ్లకు పూర్తి స్థాయి వసతి సదుపాయం ఉంటేనే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని విద్యాశాఖ అనేక సార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపింది. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో హాస్టల్ సదుపాయాలు తగినంతగా లేకపోవడం సమస్యగా మారిందని తెలిపింది. అబ్బాయిలకు వసతి సౌకర్యాలు పరిమితంగా ఉండడంతో దూర ప్రాంతాల విద్యార్థులు చేరేందుకు ఇష్టపడడం లేదని వివరించారు. ఇదే క్రమంలో గురుకులాల పోటీ కూడా మోడల్ స్కూళ్ల ప్రవేశాలను దెబ్బతీస్తోంది. రాష్ట్రంలో నివాస విద్యను అందించే గురుకుల పాఠశాలల సంఖ్య పెరగడం కూడా మోడల్ పాఠశాలల ప్రవేశాలపై ప్రభావం చూపుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గురుకులాల్లో విద్యతో పాటు వసతి, భోజనం తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో తల్లిదండ్రులు వాటివైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొంటున్నారు. మార్పులకు సన్నద్ధం మరోవైపు మోడల్ స్కూళ్లను విద్యార్థులకు చేరువ చేయాలనే ప్రయత్నం ఇటీవల కొంతమేర మొదలైందని, కొన్ని మార్పులు చేసేందుకు సన్నద్ధమవుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. మోడల్ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా మార్చడం లేదా ఉన్నతీకరించడం, సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టడం, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు వంటి ప్రతిపాదనలు ముందుకొచ్చాయని తెలిపారు. హాస్టల్ సదుపాయాలు కల్పించడం, బోధకులను అవసరమైన మేర నియమించడం వల్లే వీటి పరిస్థితి మెరుగు పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. -
జల విద్యుత్ ప్రాజెక్టులపై సోలార్ విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సౌర విద్యుత్, జలాశయాలపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శాసనసభలో గురువారం ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, కసిరెడ్డి నారాయణరెడ్డి, రామ్మోహన్రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నాయని వివరించారు. త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, కుమురంభీం, పాలేరు, వైరా, మల్లన్నసాగర్, ఎల్ఎండీ, మిడ్మానేరు, పోచారం వంటి జలాశయాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సాధారణ సోలార్ ప్రాజెక్టులతో పోలిస్తే ఫ్లోటింగ్ సోలార్ ఏర్పాటుకు వ్యయం ఎక్కువ అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద మెగావాట్కు రూ.కోటి వరకు సహాయం అందించే పథకాన్ని ప్రకటించినా, అందులో కొన్ని ఇబ్బందులున్నాయన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందని భట్టి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు 15 వేల మెగావాట్లు గరిష్ట డిమాండ్ ఉంటే, ఈ నెల 9వ తేదీన అది 19 వేల మెగావాట్లకు చేరిందన్నారు. సోలార్ గ్రిడ్ ఏర్పాటు అమ్రాబాద్లో సోలార్ పైలెట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భట్టి వెల్లడించారు. 80 గ్రామాలను పూర్తిగా సోలరైజ్ చేసి, అక్కడ మైక్రో గ్రిడ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద గతంలో పంపిణీ చేసిన సుమారు 6.70 లక్షల ఎకరాలను కూడా సౌర విద్యుత్ ప్రోత్సాహానికి వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’పేరుతో పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. -
నినాదాల హోరు.. పాటల జోరు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు...నిరసన పాటలతో గురువారం శాసన మండలిలో గందరగోళం నెలకొంది. నిషేధిత భూముల (22ఏ) అంశంపై చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చిన విపక్ష సభ్యులు దానిపై చర్చకు పట్టుబట్టారు. చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఈ వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోడియం వైపు దూసుకొచ్చి నినాదాలు, నిరసన పాటలతో హోరెత్తించారు. తీర్మానం తిరస్కరిస్తున్నట్టు చైర్మన్ ప్రకటించడంతో నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. గురువారం మండలి ప్రారంభమైన వెంటనే చైర్మన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అయితే 22ఏ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానం చర్చకు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పక్షనేత సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్.రమణ, దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, వాణీదేవి, నవీన్రావు తదితరులు వెల్వైపు దూసుకొచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ చర్చకు పట్టుబట్టారు. ప్లకార్డులు తీసేయాలని చైర్మన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గలేదు. నినాదాల హోరు ‘కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడదాం..ముఖ్యమంత్రి భూ దోపిడీ నశించాలి..సీఎం కుటుంబ సభ్యులకు కేటాయించిన భూములను రద్దు చేయాలి..22ఏ నిషేధిత భూముల అంశంపై వెంటనే చర్చ చేపట్టాలి..’అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదా లు చేశారు. వారు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ సమయంలో శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్బాబు జోక్యం చేసుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే సభ మర్యాద పాటిస్తూ నిబంధనలు పాటించాలని సూచించారు. మరోవైపు ప్రశ్నోత్తరాలు కొనసాగించడంతో బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్దే నిలబడి తమ నిరసన కొనసాగించారు. దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న కాంగ్రెస్ పార్టీ విధానాలు, సీఎం రేవంత్కు వ్యతిరేకంగా నిరసన పాట లు పాడారు. దీనికి మిగిలిన ఎమ్మెల్సీలు చ ప్పట్లతో కోరస్ ఇచ్చారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. చైర్మన్ వారించినా బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. అయినా ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. నినాదాల కాగితం ప్రదర్శించిన శంభీపూర్ రాజు ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. తీన్మార్ మల్లన్న పక్క సీటులోకూర్చుని అకస్మాత్తుగా తన జేబులోంచి ‘బామ్మర్దికి అమృత్ టెండర్లు, తమ్ముడికి రావిరాల భూములు.. రైజింగ్ ఎనుముల ఫ్యామిలీ’అని నినాదాలు రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శించారు. దీనిపై చైర్మన్ గుత్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటే ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానంపై చర్చించే అవకాశం ఇస్తానని ప్రకటించారు. కాసేపటి తర్వాత ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో..22ఏ అంశంపై బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్టు చైర్మన్ ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. -
చౌటుప్పల్లో విషాదం.. డీసీఎం ఢీకొని ఒకరి మృతి
తెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఇద్దరిని డీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో బైక్పై ఉన్నవారిలో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, రోడ్డు ప్రమాదం జరిగిన చోటు కొద్దిసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
‘19న కోదాడలో మెగా జాబ్మేళా.. సద్వినియోగం చేసుకోవాలి’
సాక్షి, సూర్యాపేట జిల్లా: ఈ నెల 19న కోదాడలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోదాడ సీసీ రెడ్డి కన్వెన్షన్ హాల్లో జాబ్మేళా నిర్వహించనున్నారు. కోదాడ మెగా జాబ్మేళా ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతీ రెడ్డి, సూర్యాపేట కలెక్టర్, ఎస్పీ, సింగరేణి, పరిశ్రమల శాఖ అధికారుల హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు నిరంతర కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన యువత జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్క ఉద్యోగం యువత జీవితాన్నే కాదు. కుటుంబ భవిష్యత్తునూ మారుస్తుంది. అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు యువత ముందుకు రావాలి. యువత ప్రతిభకు, నైపుణ్యానికి తగిన అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.ప్రతి నిరుద్యోగ యువతకు జాబ్మేళా సమాచారం చేరేలా ప్రచారం చేపట్టాలి. హుజూర్నగర్ మెగా జాబ్మేళా స్ఫూర్తితో కోదాడలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. హుజూర్నగర్ జాబ్మేళాకు దాదాపు 40 వేల మంది నమోదు చేసుకున్నారు. 20,463 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కోదాడ జాబ్మేళా యువత కలలకు కొలువు దారి కావాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి జాబ్మేళాకు పంపాలి’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డికి జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి
హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతి జనగణనలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కాలం చేర్చకుండా అన్యాయం చేసిందని, తెలంగాణ రాష్ట్ర తరహా లోనే ఓబీసీ కాలం చేర్చి, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణనపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారునేడు రాష్ట్ర అసెంబ్లీలో వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ గుంజ రేణుక, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, సంచార జాతుల సంఘం రాష్ట్ర నేతలు కాటేపల్లి వీరస్వామి, తిప్పిరి శెట్టి శ్రీనివాసులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో జాజుల శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి వినతి పత్రాన్ని అందజేశారుబీసీ కులాల లెక్కలు సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని, కేంద్ర ప్రభుత్వం తరఫున ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా జాజుల కోరారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో ఉన్న 51 కులాలను సంచార జాతులుగా డీఎన్టీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 10 నీ విడుదల చేసిందని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారురాష్ట్రంలోని 30 లక్షల మంది సంచార జాతులకు విముక్తి దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా జరిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఇదే సమయంలో ఈ నెలాఖరులో హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగే సంచార జాతుల విముక్తి దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని వారు కోరారు. సీఎంతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ గుంజ రేణుక, సంచార జాతుల సంఘాల నేతలు కాటేపల్లి వీరస్వామి, తిప్పిరి శెట్టి శ్రీనివాస్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఉన్నారు -
రేవంత్ సర్కార్ ‘ఫ్లాష్ సర్వే’.. తేలింది ఇదే..!
సాక్షి, హైదరాబాద్: సీఎల్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల ఘటనలపై ఫ్లాష్ సర్వే చేయించానని.. బీఆర్ఎస్ గ్రాఫ్ చాలా పడిపోయిందన్నారు. ప్రజలు.. బీఆర్ఎస్ నేతల తీరునే తప్పుపట్టినట్లు సర్వేలో తేలిందన్న రేవంత్.. ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీకి అండగా నిలబడ్డారు. మొన్నటి ఘటనలో పోలీసులు చాలా ఓర్పుతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.‘‘కోటి ఎకరాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కానీ 3.06 లక్షల ఎకరాలు మాత్రమే 22ఏలో ఉంది. మిగతాది అంతా ప్రభుత్వ, అటవీ భూములే. నేను ‘సర్’ కోసం రెండు రోజులు కొడంగల్లో ఉన్నాను. అందరూ అదే విధంగా ఫోకస్ చేయాలి. ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సభను నిర్వహిస్తున్నాం’’ అని రేవంత్ చెప్పారు.శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా. జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టాం. సభ్యులు తప్పనిసరిగా సభలో చర్చల్లో పాల్గొనండి. సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందరికీ వెసులుబాటుగా ఉండాలని అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ పరిపాలనా వైఫల్యం’
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చేందుకు పవర్ లేదని, ప్రతి పక్షాల పీక నొక్కేందుకు మాత్రం కాంగ్రెస్కు పవర్ ఉందా? అని నిలదీశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు. రాష్ట్ర రైతులకు కనీసం ఇప్పుడు 7 నుంచి 8 గంటల కరెంట్ కూడా రావడం లేదని హరీష్రావు విమర్శించారు. ఈ రోజు(గురువారం, సెప్టెంబర్ 10వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మాట్లాడిన హరీష్రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో తెలంగాణ రైతాంగ కష్టాలు చూడాల్సి వస్తుందన్నారు. ‘ఒకవైపు నీళ్లు ఇవ్వలేవు.. కరెంట్ ఇవ్వలేవు.. ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా?’ అని ప్రశ్నించారు. అసలు రైతులకు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారని సూటిగా నిలదీశారు. భద్రాద్రి, కొత్తగూడెం పవర్ ప్లాంట్ ఎందుకు బంద్ చేశావ్ రేవంత్ అని ప్రశ్నించారు. ఇక యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నడపలేకపోతుంది ఈ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ పరిపాలనా వైఫల్యమని హరీష్ మండిపడ్డారు. ఇదీ చదవండి: ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు సరిపోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి -
Video: హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: బాటసింగారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ఆటోను తప్పించబోయి.. పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. దిల్సుఖ్నగర్ డిపో బస్సు.. చౌటుప్పల్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. బంక్లోని డీజిల్ పంపు వరుకు దూసుకెళ్లడంతో పరికరాలు కూడా విరిగిపడ్డాయి. బంక్ సిబ్బంది, అక్కడ ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు.కామారెడ్డి జిల్లాలో..కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేటును ఆటో ఢీకొట్టింది. దేవగిరి ఎక్స్ప్రెస్ కోసం గేటు వేస్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. రైల్వే గేట్ ధ్వంసం కావడంతో ప్రయాణికులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.సూర్యాపేట జిల్లాలో..సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన భోజనం కోసం ఆపిన రెండు లారీలను మరో లారీ బలంగా ఢీకొట్టింది. డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి విజయనగరం వెళ్తుండగా ఘటన జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారి-65 పై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. -
పునరుజ్జీవనం పేరిట విధ్వంసం వద్దు, మూసీ నదిని కాపాడుకుందాం!
సాక్షి, హైదరాబాద్: మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయవద్దు అంటూ మూసీ జన ఆందోళన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్లోని ధర్నా చౌక్లో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీవనదిగా విరాజిల్లిన మూసీ నదిని కలుషితం చేయకుండా కాపాడాలని, నదిని కాపాడుకుందాం - ప్రజా హక్కులను రక్షించుకుందాం అంటూ వాణిజ్య కాంక్రీట్ నిర్మాణాల నుంచి రక్షించుకోవాలని, నిర్వాసితుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ వేత్తలు, సామాజిక ఉద్యమ కారులు ఈ పోరాటాన్ని చేపట్టారు.పర్యావరణవేత్తలు డా బాబూరావు, డా. దొంతి నరసింహా రెడ్డి గార్లు ఈ ప్రాజెక్ట్ వల్ల ఏర్పడబోయే పర్యావరణ అంశాలను వివరించారు. మూసి కాలుష్యానికి కారణం బస్తీలు కాదు పరిశ్రమలని తెగేసి చెప్పారు. మూసి పై కొత్త నిర్మాణాలను తక్షణమే నిలిపి వేయాలన్నారు. మూసీ పునరుజ్జీవనం పేరిట వేలాది కుటుంబాలను బలవంతంగా నిర్వాసితులను చేసే ప్రమాదకరమైన ప్రణాళికలని మండిపడ్డారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదనీ, కానీ సహజ సిద్ధమైన నదీ వ్యవస్థను, పర్యావరణ పునరుద్ధరణను కాపాడుతూ సరైన నది పరీవాహక ప్రాంత ప్రణాళితో, సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేయాలని ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తలు డిమాండ్ చేశారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట కాంక్రీట్ జంగల్ చేయవద్దని ఈ సందర్బంగా పలువురు వక్తలు కోరారు.మూసీ నది కలుషితం కాకుండా చేయడంతోపాటు, ప్రాజెక్ట్ డిపిఆర్లో బాధితులను సంప్రదించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులు, సామాజిక కార్యకర్తలు వేలాదిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ధూల్పేట్లో గణేశ్ విగ్రహాల జోరు
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి అంటే.. హైదరాబాదీలకు గుర్తుకు వచ్చేది భారీ గణపతి విగ్రహాల తయారీకి అడ్డా ధూల్పేట్.. సుందర్ కళాకార్ వంటి నిష్ణాత విగ్రహ తయారీ నిపుణులకు ధూల్పేట్ కేరాఫ్ అడ్రస్గా ఉంది. ఇక్కడ తయారయ్యే విగ్రహాలు ఇతర రాష్ట్రాలకే కాకుండా.. ఆస్ట్రేలియా వంటి దేశాలకు కూడా వెళ్తాయి. వినాయక చవితి నేపథ్యంలో.. సాక్షి ఫ్యామిలీ ధూల్పేట్లోని గణేశ్ విగ్రహ కళాకారులు, కొనుగోలుదారులను పలకరించింది. ఆ వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
ఖమ్మంలో దారుణం.. భార్యపై అనుమానంతో..
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. భార్య రేణుకను భర్త విద్యాసాగర్ గొంతు నులిపి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారులో వెళ్తున్న సమయంలో దారిలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జరగ్గా.. రఘునాథపాలెం సమీపంలో కారులోనే భార్యను భర్త హత్య చేశాడు.భార్యను హతమార్చిన అనంతరం ఇల్లెందులోని బంధువులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానంటూ విద్యాసాగర్ చెప్పినట్లు సమాచారం. ప్రగతి స్కూల్ సమీపంలో కారును పక్కకు ఆపిన విద్యాసాగర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నిందితుడు విద్యాసాగర్కు ఇది రెండో వివాహం కాగా, మృతురాలు రేణుకతో కేవలం నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. సంచలనం సృష్టించిన ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు సరిపోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల సాయం సరిపోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో రూ.5 లక్షలతో పూర్తయ్యే ఇల్లు ప్రస్తుతం రూ.12 లక్షల వరకు ఖర్చవుతోందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయం పెంచాలని సూచించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇళ్ల నిర్మాణం కోసం తమ భార్యల బంగారం కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణంలోనే లేబర్ కాస్ట్ దాదాపు రూ.3 లక్షల వరకు అవుతోంది. అందువల్ల ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల సాయాన్ని పెంచే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇళ్ల సంఖ్య కొంత తగ్గించినా ఫర్వాలేదని, అయితే ఒక్కో ఇంటికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.కాగా, ప్రస్తుతం ప్రభుత్వం సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో సామాజిక వర్గాల వారీగా కేటాయింపులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వం మైనార్టీలకు ప్రత్యేకంగా ఇళ్ల కేటాయింపుపై జీవో ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండు లక్షల ఇళ్లు ఇస్తామని చెబుతోందని, ఆ రెండు లక్షల ఇళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత శాతం కేటాయిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఫ్యూచర్ సిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. -
మద్యం మత్తులో వ్యక్తి వీరంగం
కరీంనగర్: మెట్పల్లి పట్టణంలోని బస్డిపో చౌరస్తాలో బుధవారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పట్టణంలోని సాయిరాంనగర్కు చెందిన సదరు వ్యక్తి మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చాడు. అతడిని తీసుకెళ్లడానికి వెనుక భార్య రాగా.. చౌరస్తాలో ఆమెను కొట్టాడు. అదే సమయంలో ఆటు వైపు వచ్చిన అర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ను దూషించాడు. దీంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. తర్వాత కుటుంబ సభ్యులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి బస్ డిపో వద్ద మందుబాబు వీరంగంRTC రాజదాని బస్సును అడ్డుకుని.. డ్రైవర్ పై దాడికి యత్నంఅడ్డుకోబోయిన భార్యపై కూడా దాడి చేసిన మందుబాబువారించే ప్రయత్నం చేసిన వారిపై సైతం దాడికి యత్నం pic.twitter.com/LwMq9FOfSE— PulseNewsBreaking (@pulsenewsbreak) September 9, 2026చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్ -
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్
జగిత్యాలక్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని కుటుంబసభ్యులు, బంధువులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. అంతర్గాం గ్రామానికి చెందిన బందెల ప్రశాంత్ 15రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం సీతారాంపలి్లకి చెందిన కావ్యను ప్రేమవివాహం చేసుకున్నాడు. యువతి కుటుంబసభ్యులు అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. యువతి మేజర్ కావడంతో ప్రశాంత్తోనే పంపించారు. అప్పటినుంచి ప్రశాంత్, కావ్య అంతర్గాంలో కాపురం పెట్టారు. ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు, బంధువులు బుధవారం ఉదయం రెండు కార్లలో అంతర్గాం వచ్చి ప్రశాంత్ తల్లి భారతమ్మపై దాడిచేసి కావ్యను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. జరిగిన ఘటనను భారతమ్మ జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
‘ఇథనాల్ పెట్రోల్పై ఎలాంటి ఫిర్యాదులు లేవు’
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) వినియోగం వల్ల వాహనాలకు ముప్పు వాటిల్లుతోందంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఇప్పటివరకు తమ శాఖకు ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి వివరణాత్మక సమాధానమిచ్చారు.వాహన యజమానుల నుంచి గానీ, ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణుల నుంచి గానీ ఇథనాల్ పెట్రోల్ వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు రాలేదని మంత్రి తెలిపారు. అందువల్ల నియంత్రణ లేదా దిద్దుబాటు చర్యలు చేపట్టే ప్రసక్తి లేదన్నారు. అయితే, సాధారణ పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ శక్తి సాంద్రత కొంత తక్కువగా ఉంటుందని, ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) వల్ల వాహనాల పికప్, మైలేజీలో 3 నుంచి 5 శాతం స్వల్ప తగ్గుదల ఉండే అవకాశం ఉందన్నారు. వాహనాలను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తే పెద్ద సమస్యలు ఉండవని స్పష్టం చేశారు.ఈ పథకం కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం అమలవుతోందన్నారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు దీన్ని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చిందన్నారు. వాహనాల రక్షణ, సర్టిఫికేషన్ నిబంధనలన్నీ కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త వాహనాలు ఈ20 ఇంధనానికి అనుగుణంగా రూపుదిద్దుకున్నాయని, పాత వాహనదారులు చిన్నపాటి మార్పులు లేదా కొన్ని విడిభాగాలను మార్చుకోవాల్సి రావచ్చునని పేర్కొన్నారు.మూడు ప్రధాన ప్రయోజనాలుఇథనాల్ మిశ్రమం ద్వారా మూడు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. చెరకు రసం, బెల్లం పాకం, వరి, మొక్కజొన్నల ద్వారా ఇథనాల్ ఉత్పత్తి పెరిగి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర, అదనపు ఆదాయం లభిస్తుంది. పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఇంధన దిగుమతులు తగ్గి విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.ఇథనాల్ పరిశ్రమల వల్ల కాలుష్యం పెరుగుతుందనే భయాలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏర్పాటు చేస్తున్న ఆధునిక ప్లాంట్లలో కాలుష్య నియంత్రణ చర్యలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరీంనగర్లోని 2-3 ప్లాంట్లతో సహా మొత్తం ఏడు ఇథనాల్ కర్మాగారాలు ఉన్నాయని వెల్లడించారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఆయిల్ కంపెనీలు, పారిశ్రామికవేత్తల మధ్య ఒప్పందాలకు వ్యవసాయ, అబ్కారీ శాఖలు సహకరిస్తున్నాయని తెలిపారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్పై వీసా మోసం ఆరోపణలు -
ఫ్యూచర్ సిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కొండల్ రెడ్డి భూముల పరిశీలన
బీఆర్ఎస్ నేతల ఫ్యూచర్ సిటీ పరిశీలన అప్డేట్స్..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్..రూ.200 కోట్ల విలువైన భూమిని 7 కోట్లకే టెస్సరాక్ట్ కంపెనీకి కేటాయించారు.టెస్సరాక్ట్ కంపెనీ రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిది.ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేనేలేదు.ఫ్యూచర్ సిటీ భూములను రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొల్లగొడుతున్నారురేవంత్ భూ దోపిడిని ప్రజా కోర్టులో నిలదీస్తాం.టెస్సరాక్ట్ కంపెనీకి కేటాయించిన భూమిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశాము.శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేస్తే సభకు హాజరు అవుతాము.22-A అంశం లేవనెత్తుతామనే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.సంధ్యా రావు అనే ఫేక్ అకౌంట్ సృష్టించిందే కాంగ్రెస్ సోషల్ మీడియా.విచారణ చెయ్యాల్సి వస్తే ఫేక్ అకౌంట్పై విచారణ చేయాలి. శాసనమండలిలో ఆందోళన.. మరోవైపు.. భూముల విషయంలో శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్బీఆర్ఎస్ సభ్యులు చేసే ప్రస్తావన సరైన మార్గంలో వస్తే అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.భూముల అంశం విషయంలో వారు పేర్కొంటున్న పేరు ఆ వివాదంలో లేదు.మీరు ప్రశ్న రూపంలో వస్తే దానిపై సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాంసభలో దేశపతి పాటలు పాడటం సరికాదు.ప్రభుత్వాన్ని అడగలేక పాటలు పడుతున్నారు.సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెబుతుంది. ఫ్యూచర్ సిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుటెస్సరాక్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూముల పరిశీలన.సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీకి అక్రమంగా కట్టబెట్టిన భూమిని పరిశీలించేందుకు ఫోర్త్ సిటీకి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలుకొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టిన… https://t.co/XGhk5t8NpM pic.twitter.com/Wy5CY5uCwJ— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026 👉తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. అసెంబ్లీ పరిణామాలపై చర్చించేందుకు కేటీఆర్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. భేటీ అనంతరం ఎమ్మెల్యేలు నేరుగా తుక్కుగూడకు బయలుదేరుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డికి సంబంధం ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న టెస్సరాక్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూముల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు.👉తుక్కుగూడ–రవిర్యాల పరిధిలో ప్రభుత్వ భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే అప్పనంగా కట్టబెట్టారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఏడాదికి లక్ష రూపాయల ఆదాయం కూడా లేని కంపెనీకి ఇంత విలువైన భూములను ఎలా కేటాయిస్తారని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. కంపెనీ ఆర్థిక స్థితి, భూముల కేటాయింపు ప్రక్రియ, ప్రభుత్వ నిర్ణయాలపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించేందుకే ఎమ్మెల్యేలు తుక్కుగూడకు వెళ్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, భూముల కేటాయింపులో జరిగిన అంశాలను ప్రజల ముందుంచాలని పార్టీ భావిస్తోంది.సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కంపెనీకి ఫోర్త్ సిటీలో అక్రమంగా కట్టబెట్టిన భూమిని పరిశీలించేందుకు బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలుకొండల్ రెడ్డి కంపెనీ టెసెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకు కట్టబెట్టిన… https://t.co/ECQFJc4FGo pic.twitter.com/jPGxvjZD4M— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026👉ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్, మహిళా ఎమ్మెల్యేల వ్యవహారం, ఫేక్–ఏఐ కంటెంట్ తదితర అంశాలపై కూడా కేటీఆర్ నివాసంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించడం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చే అంశాలపైనా బీఆర్ఎస్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది.👉మరోవైపు టెస్సరాక్ట్ భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను మంత్రి డి.శ్రీధర్బాబు ఖండించారు. సంస్థకు సీఎం సోదరుడితో సంబంధం లేదని, భూముల కేటాయింపు నిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ నివాసంలో భేటీ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తుక్కుగూడ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రూ.200 కోట్ల భూమి రూ.7 కోట్లకే ఎలా?.. టెస్సరాక్ట్ భూములపై బీఆర్ఎస్ పోరాటం ఏ మలుపు తిరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ నివాసంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్చేరుకున్న హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలుఅసెంబ్లీ నుంచి సస్పెన్షన్ తర్వాత తదుపరి కార్యాచరణపై ఎమ్మెల్యేలతో చర్చించనున్న కేటీఆర్, హరీష్ రావురేపు తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ నేతలు https://t.co/YqHKoALy6n pic.twitter.com/BNUax7Cmal— Telugu Scribe (@TeluguScribe) September 10, 2026 -
బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపనుంది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు ఎదురైన పరిణామాలను జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయించబోతోంది.సభ కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ ఈ అసెంబ్లీ సమావేశాల సెషన్ నుంచి 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గురువారం ఉదయం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో వాళ్లంతా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే మహిళా ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపాలని నిర్ణయించారు. అసెంబ్లీ వద్ద పోలీసులు దాడి చేశారని.. తమతో అనుచితంగా ప్రవర్తించారని ఎన్హెచ్ఆర్సీతో పాటు జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయయనున్నారు. అలాగే హోం శాఖపైనా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. తెలంగాణ హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ వద్దే ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ పరిణామాలకు సంబంధించిన ఫొటో, వీడియో ఫుటేజీలను ఇప్పటికే ఆ పార్టీ బహిరంగంగా ప్రదర్శించింది. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫొటోలు నకిలీవంటూ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ సాయంత్రానికే సబిత, సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో మహిళా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్మార్ట్ రేషన్ కార్డ్లో అన్నీ తప్పులే! -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం ఉదయం 5.30 గంటలకు ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.అలాగే, అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రానున్న 48 గంటల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. దీంతో సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు.🚨 ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం: APSDMA హెచ్చరిక 🚨ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది :రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 🌧️ ఉత్తరాంధ్ర జిల్లాలలో 2రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.#lowpressure pic.twitter.com/5UKhlBU2l6— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 10, 2026మరోవైపు.. తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గురువారం (సెప్టెంబర్ 10) రాష్ట్రవ్యాప్తంగా వేడి, ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతూనే.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలుచోట్ల అక్కడక్కడా వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన ఉరుములు కనిపించే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.సెప్టెంబర్ 11, 12 తేదీల్లో రాష్ట్రానికి భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల హెచ్చరికను వాతావరణ శాఖ జారీ చేసింది. సెప్టెంబర్ 13న కూడా ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల హెచ్చరిక కొనసాగనుంది. ఇక, హైదరాబాద్లోనూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంది. SEPTEMBER 10, 2026 FORECAST ⚠️⛈️ HOT and HUMID conditions to continue even today across Telangana Scattered MODERATE RAINS and THUNDERSTORMS expected in North, East TG like Bhadradri - Kothagudem, Mahabubabad, Mulugu, Bhupalapally, Khammam, Adilabad, Asifabad, Mancherial,…— Telangana Weatherman (@balaji25_t) September 10, 2026 -
కన్నబిడ్డనే అమ్మాలనుకుంది..
హైదరాబాద్: నవజాత శిశువును విక్రయించడానికి యత్నించిన మహిళపై కేసు నమోదు చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎన్టీఆర్ నగర్కు చెందిన ముఖ్తార్ బేగ్ (62) చిన్న కుమార్తెకు సంతానం లేకపోవడంతో చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలనుకున్నారు. ఈ నెల 7న ఓ అపరిచిత మహిళ 8 రోజుల వయసున్న శిశువుతో వచ్చింది. రూ.లక్షకు పాపను అమ్ముతానంది. ఆమె ప్రవర్తనపై అనుమానంతో ముఖ్తార్ బేగ్ తిరస్కరించారు. 8న రాత్రి సదరు మహిళ మళ్లీ వచ్చి తన పెద్ద కుమార్తె పెళ్లికి డబ్బులు కావాలంటూ రూ.30 వేలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చింది. ఆమె ప్రవర్తనతో అనుమానించిన ముఖ్తార్ బేగ్.. వెంటనే ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించి, శిశువుతో సహా మహిళను పోలీసులకు అప్పగించారు. విచారణలో సదరు మహిళ బిహార్ రాష్ట్రం కిషన్గంజ్ జిల్లా దిఘల్బ్యాంక్ మండలం పలాస గ్రామానికి చెందిన లాల్మోన్ ఖాటూన్ (34), భర్త ఎండీ సుల్తాన్గా తేలింది. ప్రస్తుతం ఈమె పహాడీషరీఫ్లో కూలిపనులు చేస్తూ నివసిస్తోందని, విచారణలో ఆ మహిళే నవజాత శిశువుకు తల్లి అని నిర్ధారించారు. తల్లీబిడ్డలను రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణ పర్యవేక్షణలో ఉంచినట్లు ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం! -
బొల్లారం ఆయుధాల కేసులో బిగ్ ట్విస్ట్.. ముగ్గురు ఆర్మీ అధికారుల అరెస్ట్!
సాక్షి, సికింద్రాబాద్: బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. తదుపరి విచారణ కోసం వారిని ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయుధాల మాయం వెనుక అసలు కుట్ర ఏంటి? ఎవరి కోసం ఈ చోరీకి పాల్పడ్డారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.కాగా, నలుగురు అగ్నివీర్ గార్డులు అందించిన కీలక సమాచారంతోనే దాదాపు పది రోజుల తర్వాత ఆయుధాల చోరీ వ్యవహారం గుట్టు రట్టయినట్లు సమాచారం. శిక్షణ కోసం ఉపయోగించే ఆయుధాలకు సాధారణంగా కోడింగ్ నంబర్లు ఉండవని గుర్తించిన నిందితులు.. పక్కా ప్రణాళికతో సుమారు మూడు నెలల పాటు విడతల వారీగా ఆయుధాలను మాయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. వర్షం పడిన ఓ రాత్రి ఆయుధాగారం తాళాలు పగలగొట్టి.. బయటి వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అంతకుముందు ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సీసీ కెమెరాలను నిలిపివేయడం, విధుల్లో ఉన్న గార్డులను ఇతర పనులకు పంపించడం వంటి చర్యల ద్వారా ఆయుధాలను బయటకు తరలించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.ఈ వ్యవహారంలో 12 అత్యాధునిక ఆయుధాలతో పాటు సుమారు 2 వేల రౌండ్ల బుల్లెట్లు మాయమైనట్లు సమాచారం. ఈ మందుగుండు సామగ్రి మొత్తం సుమారు క్వింటా బరువు ఉంటుందని తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో ఆయుధాలు, బుల్లెట్లు ఎలా బయటకు వెళ్లాయి? వాటిని ఎక్కడికి తరలించారు? అన్నదానిపై అధికారులు దృష్టి సారించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా డిఫెన్స్ ఇంటెలిజెన్స్, మిలిటరీ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. అరెస్టయిన అధికారుల కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయుధాలు ఎవరికి చేరాయి? ఈ వ్యవహారంలో ఉగ్రవాద లేదా ఇతర నేర శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మూడు నెలలుగా సాగినట్లు అనుమానిస్తున్న ఈ ఆయుధాల మాయం వెనుక పూర్తి నెట్వర్క్ను బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముగ్గురు సీనియర్ అధికారుల అరెస్ట్తో కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.ఇదీ చదవండి: తెలంగాణలో స్మార్ట్కార్డు.. తప్పుల తడక -
11 ఏళ్ల సహజీవనం.. మరో యువతిని పెళ్లాడిన కానిస్టేబుల్!
సాక్షి, హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో ఏకంగా పదకొండేళ్లు సహజీవనం చేసి మోసం చేసిన కానిస్టేబుల్ అరుణ్ కుమార్పై ఉప్పల్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తనకు ఇష్టం లేకుండా రెండుసార్లు గర్భస్రావం చేయించాడని, పెళ్లికి ముహూర్తాలు పెట్టి కూడా మరో యువతిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గత నెల ఆఖరి వారంలో ఈ కేసు నమోదు కాగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ ప్రశాంత్నగర్కు చెందిన యువతితో అరుణ్కుమార్కు 2013లో పరిచయమైంది. 2014లో అరుణ్కుమార్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నమ్మిన తాను అతడితో సన్నిహితంగా మెలిగానని తెలిపారు. ఈ ఏడాది నవంబరు 1న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అరుణ్కుమార్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో ఆగస్టు 24న ఉదయం సుమారు 7.30 గంటలకు అతడి ఇంటికి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడ వాచ్మెన్తో పాటు కుటుంబ సభ్యులను ఆరా తీయగా..అరుణ్కుమార్కు అప్పటికే పెళ్లయిపోయిందనే విషయం తెలిసిందని పేర్కొన్నారు. అతడు ఈ ఏడాది జూలై 1న మరో యువతిని వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని యువతి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం! -
పుట్టింటికి పంపడం లేదని నవ వధువు ఆత్మహత్య
హైదరాబాద్: తనను పుట్టింటికి పంపడానికి భర్త నిరాకరిస్తున్నాడని మనస్తాపానికి గురైన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన ముద్దం నాగలక్ష్మీ (18) వివాహం ఏడు నెలల క్రితం అదే జిల్లా తూడికుర్తి మండలానికి చెందిన మాదగాని శేఖర్ (32)తో జరిగింది. ఓ హోటల్లో పనిచేస్తున్న శేఖర్ భార్యతో కలిసి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–4లోని సుఖ్దేవ్నగర్లో ఉంటున్నాడు. కొంతకాలంగా నాగలక్ష్మీ పుట్టింటికి వెళ్తానని భర్తను అడుగుతోంది. కొద్ది రోజుల తర్వాత వెళ్లాలని శేఖర్ సర్దిచెప్పి డ్యూటీకి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల రాఖీల పండుగ, బోనాల పండుగ సందర్భంగా అల్లుడు శేఖర్ తన కూతురిని పుట్టింటికి పంపలేదని, దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బంజారాహిల్స్ ఎస్ఐ సంధ్యారాణి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ నర్సు అదృశ్యం! -
స్మార్ట్ కార్డు.. తప్పులతడక
కరీంనగర్ 44వ డివిజన్ పరిధిలోని శ్రీనగర్కాలనీకి చెందిన భూంపల్లి విజయ, జొన్నల సంధ్య, గన్ను రాజమణిలకు స్మార్ట్ రేషన్ కార్డులు జారీ అయ్యాయి. వీరి చౌకధరల దుకాణ నంబరు 2084150 కాగా, కార్డులపై మాత్రం 58వ డివిజన్లో చిరునామాగా, రేషన్షాప్ నంబరు 2084168గా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. 2084168 నంబరు గల రేషన్షాప్ 58వ డివిజన్లో కాకుండా, 13వ డివిజన్లో ఉన్నట్టు పేర్కొనడం గమనార్హం. 44వ డివిజన్లో దాదాపు 150 మందికి జారీ అయిన స్మార్ట్ కార్డులు ఇలానే ఉన్నాయి. ఒక్క కరీంనగర్లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు పంపిణీ చేసిన పట్టణాలు, గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.పోలంపల్లి ఆంజనేయులు క్యూఆర్ కోడ్.. హోలోగ్రామ్.. అత్యాధునిక భద్రతా ఫీచర్లు అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్కార్డులు లబ్ధిదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. కార్డుపై ఉన్న పేరు తప్ప మరే వివరమూ సరిపోలడం లేదు. అసలు ఆ కార్డు ఎవరిదో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఒక జిల్లాలో ఊరి పేరు మారితే.. మరో జిల్లాలో గ్రామ పంచాయతీ పేరు తారుమారైంది. ఇంకొకచోట హ్యాబిటేషన్ పేరు స్థానంలో మరో గ్రామం పేరు వచ్చి చేరింది. ఇంటిపేరు తారుమారైంది. మరోచోట పిన్కోడ్ మారింది.. మరికొన్ని చోట్ల రేషన్ దుకాణం నంబరే తప్పుగా ముద్రితమైంది. ఇంటి నంబర్, ఫోన్నంబర్ లేకపోవడంతో లబ్ధిదారుల ఇళ్లను వెతికి కార్డులు అందించడమే అధికారులకు సవాలుగా మారింది. ఈ స్మార్ట్ కార్డులను ముంబై కేంద్రంగా ఉన్న ఏజెన్సీల ద్వారా బల్క్ ప్రింటింగ్ చేయించగా, సాఫ్ట్వేర్ ఫార్మాటింగ్లో లోపాలు తలెత్తినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోటి కార్డుల డేటా ధ్రువీకరణపై అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్లకుపైగా ఆహార భద్రతా కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ చేపట్టారు. వీటి ద్వారా సుమారు 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇంత భారీస్థాయిలో కార్డుల ముద్రణ చేపట్టే ముందు కుటుంబ వివరాలు, గ్రామ పంచాయతీ, మండలం, వార్డు, పిన్కోడ్, రేషన్ దుకాణం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించారా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. 15 వేల కార్డులకు ఒకే ఊరు! పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో వెలుగుచూసిన ఘటన స్మార్ట్ కార్డుల డేటా లోపాల తీవ్రతను చాటుతోంది. మండలంలోని 22 గ్రామాలకు చెందిన కార్డులపై ‘ఓదెల’అనే గ్రామం పేరే ముద్రితమైంది. హరిపురం గ్రామానికి చెందిన 423 కార్డుల పంపిణీ సందర్భంగా ఈ విషయం బయటపడింది. పోస్టల్ పిన్కోడ్లోనూ తప్పులు గుర్తించారు. మండలంలో పంపిణీ చేయాల్సిన సుమారు 15 వేల కార్డుల్లో ఇదే సమస్య ఉన్నట్టు తేలడంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు. – హరిపురం, రూపునారాయణపేట, శానగొండ, జీలకుంట గ్రామాలకు వచ్చిన కార్డుల్లో గ్రామం పేరు, పిన్కోడ్ తదితర వివరాలు తప్పుగా ముద్రించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో ప్రస్తుతం స్మార్డ్ కార్డులు పంపిణీ చేస్తుండగా, కార్డులపై పిన్కోడ్ 505186కు బదులు 505185గా ఉంది. కరీంనగర్లో 24వేల కార్డులు వెనక్కి– కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మంకమ్మతోటకు చెందిన మాడిశెట్టి లక్ష్మణ్కు మంజూరైన కార్డులో కరీంనగర్ బదులు మహబూబ్గర్ జిల్లా, అక్కడి 1425022 రేషన్ షాపు కేటాయించారు. – పలు డివిజన్లలో లబ్ధిదారుల డివిజన్ స్థానంలో మరో డివిజన్ పేరు, కేటాయించిన రేషన్ దుకాణానికి బదులు మరో దుకాణం నంబర్ ముద్రితమైంది. చాలా చోట్ల అడ్రస్లు దొరక్క, ఆ లబ్దిదారు ఎవరో తెలియక కార్డులు డివిజన్ల వారీగా పేరుకుపోతున్నాయి. గతంలో అద్దె ఇంట్లో ఉండి ఇప్పుడు మారిన వారికి సంబంధించిన కార్డులన్నీ పక్కన పడేస్తున్నారు. కార్డులో ఫోన్నంబరు లేకపోవడంతో వారిని గుర్తించడం ఇబ్బందిగా ఉంది. దీంతో పంపిణీ కాకుండా 24వేల కార్డులు మిగిలిపోయాయి. ఇందులో దాదాపు 20 వేల కార్డులను రెవెన్యూ అధికారులకు తిరిగి అప్పగించాలని నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాలో 3వేల కార్డుల్లో తప్పుల గుర్తింపు కామారెడ్డి మునిసిపాలిటీ పరిధిలోని రామేశ్వర్పల్లి గ్రామానికి బదులు రామ్రెడ్డి పల్లి గ్రామంగా 400 కార్డులు ప్రింట్ అయ్యాయి. ఇస్రోజివాడి గ్రామంలో 501 కుటుంబాలకుగాను 499 కార్డులు మంజూరు కాగా, ఉగ్రవాయి గ్రామంగా ప్రింట్ అయింది. చిన్న మల్లారెడ్డి గ్రామం పేరుకు బదులు చిన్న చేగురుగా 400 కార్డుల్లో ముద్రించారు. రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామానికి బదులు మద్దికుంటగా 605 కార్డుల్లో ముద్రణ జరిగింది. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో సుమారు 3,000 స్మార్ట్ రేషన్ కార్డుల్లో గ్రామాల పేర్లు తారుమారైనట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయా జిల్లాలో ఇలా... ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుండ్రాతిమడుగులో 680 స్మార్ట్ రేషన్ కార్డులు ఉండగా.. ఏకంగా 358 కార్డుల్లో లబ్ధిదారులు నివసించే సిద్ధిక్నగర్కు బదులు గుబ్బగుర్తి పేరు ముద్రించారు. సిద్దిక్నగర్కు సంబంధించిన పిన్కోడ్ 507165కు బదులు 507305గా నమోదైంది. – బోనకల్ మండలంలోని లక్ష్మీపురం, తూటికుంట్ల ప్రాంతాల్లో కొందరు లబ్ధిదారుల ఇంటిపేర్లు సైతం తప్పుగా ముద్రితమయ్యాయి. మూడు మండలాల్లో ఇలాంటి తప్పులు గుర్తించామని, మరిన్ని వివరాలు సేకరించి సరిచేసిన కార్డులు తిరిగి ఇస్తామని ఖమ్మం జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్కుమార్ తెలిపారు. – కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో అధికారిక కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 10 మంది లబ్ధిదారులకు కార్డులు ఇవ్వగా.. ఐదుగురి కార్డుల్లో గ్రామం పేరు తప్పుగా ముద్రితమైంది. నమూనాగా ఎంపిక చేసిన కార్డుల్లోనే సగం తప్పులు రావడం గమనార్హం. – మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతంలో 13వ రేషన్ దుకాణం పరిధిలోని 480 కార్డుల్లో ‘వరిగుంతం’కు బదులు ‘కుల్చారం’పేరు ముద్రించారు. దీంతో అధికారులు పంపిణీ నిలిపివేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలోని 4వ వార్డు కార్డుల్లో మున్సిపాలిటీ పేరుకు బదులు ‘వట్టూర్’గ్రామం పేరు రావడంతో అక్కడా పంపిణీ ఆపేశారు. కార్డులు వెనక్కి పంపించాం హరిపురం గ్రామ కార్డుల్లో కొన్ని తప్పులు ఉండడంతో, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం కార్డులను వాపస్ ఇచ్చాం. ఊర్లో 253 కార్డులు ఉన్నాయి. అంటిల్లోనూ ఉన్న తప్పులను సరిచేసి, సరైన వివరాలతో తిరిగి కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాం. – విజయ నాగరాజుయాదవ్, సర్పంచ్, హరిపురం -
అంతా ‘రాజకీయమే’!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాలు సమావేశాలు వరుసగా మూడోరోజు కూడా రాజకీయం కోణంలో కార్యకలాపాలకే పరిమితమయ్యాయి. ఇటు అసెంబ్లీ, అటు కౌన్సిల్లో సోమవారం బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ గేటు బయట చేసిన ఆందోళన కేంద్రంగానే దుమారం కొనసాగింది. అసెంబ్లీలో పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టగా, కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సెషన్ మాత్రమే జరిగింది. అసెంబ్లీ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లకు చెందిన సభ్యుల ఆరోపణలు, ప్రత్యారోపణలు, నినాదాలు, సస్పెన్షన్లు జరగ్గా, అసెంబ్లీ బయట అధికార, విపక్ష సభ్యులు రాష్ట్ర గవర్నర్ను కలిసి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నారు. సభ ప్రారంభం కాగానే.. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగా నే మళ్లీ గొడవ మొదలైంది. తమ ఆందోళన సందర్భంగా మహిళా సభ్యులపై పోలీసుల దురుసు ప్రవర్తన గురించి బీఆర్ఎస్ సభ్యు లు సభలో లేవనెత్తారు. శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో సహా పలువురు మంత్రులు జోక్యం చేసుకుని బీఆర్ఎస్ సభ్యుల వ్యవహరశైలిని తప్పుపట్టారు. గందరగోళం మధ్య సభకు హాజరైన బీఆర్ఎస్ సభ్యులందరినీ సెషన్ మొతానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రకటించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోక్భవన్కు వెళ్లి గవర్నర్ శివపత్రాప్ శుక్లాను కలిశారు. తమ హక్కులను పరిరక్షించాలంటూ ఫిర్యాదు చేశారు. మంత్రులతో సీఎం భేటీ అసెంబ్లీలోని తన చాంబర్లో సీఎం రేవంత్రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబుతో పాటు ఇతర మంత్రులతో బుధవారం నాటి పరిణామాలపై చర్చించారు. బీఆర్ఎస్ నేతల సస్పెన్షన్, సభ నిర్వహణపై మంత్రులతో సమాలోచనలు జరిపారు. సభ జరిగినన్ని రోజులు ప్రధానంగా ఏయే అంశాలపై చర్చించాలన్న దానిపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విరామం తర్వాత కూడా అసెంబ్లీ రాజకీయ అంశాలపైనే కొనసాగింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద దళిత సంఘాలు చావు డప్పు కార్యక్రమం నిర్వహించగా, ఆ ప్రదేశాన్ని బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పుపట్టింది. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి కూడా అటు కేసీఆర్, ఇటు బీఆర్ఎస్లను టార్గెట్ చేశారు. మండలిలో ప్రకంపనలు మండలిలోనూ రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. మండలి ప్రారంభం కాగానే సస్పెన్షన్కు గురైన తమ పార్టీ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలను సభకు అనుమతించి వారి వివరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ అనుమతించకపోవడంతో వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభలో ప్రశ్నోత్తరాలను ముగించిన తర్వాత ప్రత్యేక ప్రస్తావనలను ప్రవేశపెట్టిన అనంతరం గురువారం నాటికి వాయిదా వేశారు. కాగా తాతామధు, నవీన్రెడ్డిలపై ఎలాంటి చర్య లు తీసుకోవాలనే అంశాన్ని మండలి చైర్మన్ గుత్తా, మహేశ్గౌడ్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీకి పంపించారు. దళితులు, మహిళల గౌరవం కాపాడాలి బుధవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి దళితులు, మహిళల గౌర వం, భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉన్న గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, అజహరుద్దీన్, వివేక్, లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే లు కవ్వంపల్లి సత్యనారాయణ, వెడ్మ»ొజ్జులు గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డిలు అసెంబ్లీ స్పీకర్ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశా రని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తన చొక్కాను విప్పారని, తదితర సోమవారం జరిగిన ఘటనల గురించి గవర్నర్కు వారు వివరించారు. దళితులు నడిచిన రహదారులను పసుపు నీళ్లు, పాలతో శుద్ధి చేయడం ద్వారా నిషేధిత, చట్టవిరుద్ధమైన, అమానవీయమైన, అనై తికమైన అంటరానితన ఆచరణను బీఆర్ఎస్ ప్రదర్శించిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ఘటనలకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిపైనే కాకుండా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంలో ఉన్న అసలు కుట్రదారులపై అ త్యంత కఠినమైన శిక్షలు విధించేలా చర్య లు తీసుకోవాలని గవర్నర్ను కోరారు. -
చలో హైదరాబాద్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(టీజీఈజేఏసీ)తలపెట్టిన చలో హైదరాబాద్ వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లిఖితపూర్వక హామీతో ఈనెల 10వ తేదీన నిర్వహించే చలో హైదరాబాద్, అనంతరం మహాధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో టీజీఈజేఏసీ అత్యవసర సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన చలో హైదరాబాద్కు సర్వం సిద్ధం చేశామని, మహాధర్నా స్టేజీ, ఇతర ఏర్పాట్లకు సంబంధించి అడ్వాన్స్లు కూడా చెల్లించామన్నారు. కానీ సీఎస్ లిఖిత పూర్వక హామీని విశ్వసించి జేఏసీ తలపెట్టిన కార్యక్రమాన్ని ఈనెల 18వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అడిగిన 18వ తేదీ గడువు అనంతరం ఈనెల 19న జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు గత నెల 27 నుంచి తలపెట్టిన నిరసన కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా సూచనలు చేశారన్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సీఎస్ సంజయ్జాజు సచివాలయంలో జేఏసీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారన్నారు. అనంతరంనాలుగు అంశాలపై వివరణ ఇచ్చినట్లు తెలిపారు. పీఆర్సీ నివేదిక ఇవ్వమని రెండవ పీఆర్సీ కమిషన్ చైర్మన్కు సీఎస్ లేఖ రాశారని, అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు సంబంధించి వివిధ అంశాలపై అధ్యయనానికి పే రివిజన్ కమిషన్ నిపుణులు, అధికారులు, వివిధ సంఘాల సభ్యులతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ఉద్యోగుల ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో మూడు డీఏలు ఇవ్వాలని సీఎస్ను కోరామని, ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి కూడా కొన్ని డిమాండ్లు పెట్టామన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈనెల 18వ తేదీ వరకు గడువు ఇవ్వాలని సీఎస్ కోరారన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హమీని పూర్తిగా విశ్వసించి ఛలో హైదరాబాద్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఉద్యోగులకు 64 రకాల సమస్యలున్నప్పటికీ... ప్రధానంగా నాలుగింటిపైనే ఒత్తిడి చేస్తున్నామని, ఆర్థిక భారం లేని అంశాలను త్వరలో జరిగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. గతనెల 27వ తేదీన క్షేత్రస్థాయిలో ధర్నాలు, ఈనెల 1న నిరసనలతో ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈనెల 10వ తేదీన మహా ధర్నా కోసం నాలుగు చోట్ల దరఖాస్తు చేశామని, ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని, సరూర్నగర్ స్టేడియంలో నిర్వహణకు కోర్టు కూడా అనుమతించిందన్నారు. ఈ సమావేశంలో టీఎన్జీఓ, టీజీఓ ప్రధాన కార్యదర్శులు ముజీబ్ హుస్సేని, బి.శ్యామ్, జేఏసీ ప్రతినిధులు జి.సదానంద్గౌడ్, చావ రవి తదితరులు పాల్గొన్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులతో ఈనెల6న నాంపల్లిలో చేపట్టిన సంకల్పసభతో ప్రభుత్వం దిగొచ్చిందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ఉద్యోగుల సమస్యలపై జేఏసీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సీఎస్ మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, బకాయిల పరిష్కారానికి ప్రతినెలా కనీసం రూ.2వేల కోట్లు విడుదల చేయాలని సంఘాల నేతలు కోరగా..ఈ అంశలపై ఈ నెల18న స్పష్టత ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీఏడీ ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
మా హక్కులు పరిరక్షించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై దాడులు, కేసులు, వారి అరెస్టులు సస్పెన్షన్లపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం బుధవారం లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఈ మేరకు 13 పేజీల వినతిపత్రాన్ని సమర్పించింది. ‘రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులు జరిగాయి. పోలీసులు అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులపై పోలీసులు, మార్షల్స్ దాడి చేశారు. కేసీఆర్ ఇంటిపై దాడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేతృత్వం వహించారు. పోలీసులు వారికి ఎస్కార్ట్ ఇవ్వడంతో పాటు రోప్ పార్టీలు ఏర్పాటు చేసి వేలాది మందిని అక్కడికి అనుమతించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21, 167, 355 తదితర నిబంధనల మేరకు మా హక్కులు కాపాడండి. మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి భద్రత కల్పించాలి..’అని ఆ వినతిపత్రంలో బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. గవర్నర్తో భేటీ అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు లోక్భవన్ బయట మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని వివరించాం.. తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గవర్నర్ను కలిసినట్లు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ప్రజలకు ఇ చ్చిన హామీల అమల్లో వైఫల్యంతో పాటు పాలనా వైఫల్యాన్ని గవర్నర్కు వివరించినట్లు తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, యువత, పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అసెంబ్లీ వద్ద తమపై జరిగిన దాడులు, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు, ఆధారాలను అందజేశామని చెప్పారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగిన ఘటనను కూడా వివరించామన్నారు. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ నివాసంపై దాడి యత్నం, తమపై దాడి చేసిన పోలీసులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని తీరును వివరించినట్లు కేటీఆర్ తెలిపారు.హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. అసెంబ్లీ, శాసనమండలిలోకి రానివ్వకుండా తమను ప్రభుత్వం అడ్డుకుందని, హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్కు వివరించినట్లు కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేసిన విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. శాసనమండలి సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని వివరించామని, ప్రభుత్వం విడుదల చేసిన ఏఐ ఫొటోలు, వీడియోలపైనా ఫిర్యాదు చేశామని చెప్పారు. తప్పుడు చిత్రాలు, ఫిర్యాదులు ఉపయోగించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో న్యాయం జరగకుంటే జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయిస్తామని చెప్పారు. కాగా శాసనసభ వ్యవహారాలతో పాటు బయట జరిగిన అన్ని ఘటనలపై విచారణ జరిపిస్తామని, సీఎస్, డీజీపీని పిలిపించి వివరాలు తెలుసుకుంటానని గవర్నర్ తమకు హామీ ఇ చ్చినట్లు తెలిపారు. -
అసెంబ్లీ ముగిసేంత వరకు బీఆర్ఎస్ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం లోక్భవన్లో గవర్నర్ను కలిశారు. అనంతరం తెలంగాణ భవన్కు చేరుకున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్రావు మధ్యాహ్న భోజన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకు అనుసరించాల్సిన రాజకీయ, పోరాట వ్యూహంపై శాసనసభా పక్షం సభ్యులతో వారు చర్చించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలపై సమాధానం చెప్పేలా అసెంబ్లీ వేదికగా కొనసాగించిన పోరాటాన్ని ఇక సభ వెలుపల కూడా విస్తరించాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. గురువారం ఉదయం కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా అల్పాహార భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రానున్న మూడు రోజుల పాటు చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను చర్చించాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. అసెంబ్లీలో చర్చకు నోచుకోని 22ఏ అంశంతోపాటు పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను మాక్ అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని భావిస్తోంది. ఆయా అంశాలను కేవలం తెలంగాణ భవన్కే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలోనూ ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం ఇచి్చన హామీలు, వాటి అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలను రూపొందించనున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం గురువారం ఢిల్లీ వెళ్లనుంది.సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి తదితరులతో కూడిన బృందం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్తోపాటు మానవ హక్కుల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయనుంది. అసెంబ్లీ పరిసరాల్లో తమకు జరిగిన అవమానం, పోలీసుల వ్యవహారశైలి, తమపై జరిగిన దాడికి సంబంధించిన అంశాలను ఆయా కమిషన్ల దృష్టికి తీసుకెళ్లనున్నారు. గవర్నర్ను కలిసిన సందర్భంగా కూడా ఈ అంశాలను ఆధారాలతో వివరించిన నేపథ్యంలో, ఢిల్లీ పర్యటనలోనూ వాటిపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
ప్రత్యేకంగా విద్యుదుత్పత్తికి నీళ్లు వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ప్రత్యేకంగా విద్యుదుత్పత్తి అవసరాల కోసమే నీటిని విడుదల చేయరాదని కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) స్పష్టంచేసింది. ఈ నెల 4న జలసౌధలో జరిగిన కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలతో రూపొందించిన మినిట్స్ ప్రతిని తాజాగా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించింది. కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు హాజరై తమ రాష్ట్రాల నీటి అవసరాలను తెలియజేశారు.సెప్టెంబర్ 2026 నుంచి ఆగస్టు 2027 మధ్యకాలంలో ఉండనున్న తాగునీటి అవసరాలకు ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి జలాశయాల నుంచి జరపాల్సిన నీటి కేటాయింపులపై ఈ సమావేశంలో వివిధ రకాలుగా చర్చలు జరిపినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఈఎన్సీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని మినట్స్లో కృష్ణా బోర్డు పేర్కొంది. ఈ నేపథ్యంలో నీటి పంపిణీపై తుది నిర్ణయాన్ని త్వరలో జరగనున్న 21వ కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఉన్నది 147 టీఎంసీలు.. కావాలన్నది 297 టీఎంసీలుఏపీ ఈఎన్సీ (ఇరిగేషన్) మాట్లాడుతూ సెప్టెంబర్ 2026 నుంచి ఆగస్టు 2027 వరకు తమ రాష్ట్రానికి 104 టీఎంసీల నీళ్లు అవసరమని తెలియజేశారు. సెప్టెంబర్ 3 నాటికి ఉన్న నీటి నిల్వలను ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో పంపిణీ చేస్తే ఏపీకి 97.41 టీఎంసీల వాటా వస్తుందని, దానిని విడుదల చేయాలని కోరారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఈఎన్సీ (జనరల్) మాత్రం ఏపీ, తెలంగాణ మధ్య 50:50 నిష్పత్తిలోనే నీటి పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. తాగునీటి అవసరాలకు 46 టీఎంసీలతో కలిపి మొత్తం 200 టీఎంసీల నీరు తమ రాష్ట్రానికిఅవసరమని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా ఏపీ తక్షణమే నీటి తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జలాశయాల్లో కనీస నిల్వ మట్టానికి ఎగువన 147.5 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉండగా, రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం 297 టీఎంసీలకు పైనే నీళ్లను కోరడం గమనార్హం. మినిట్స్ను తిరస్కరిస్తున్నాం.. తెలంగాణత్రిసభ్య కమిటీ సమావేశంలో జరిగిన వాస్తవ చర్చలు, నిర్ణయాలేవీ.. కృష్ణా బోర్డు తమకు పంపిన మినట్స్ ప్రతిలో ప్రతిబింబించడం లేదని తెలంగాణ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మినట్స్ను అంగీకరించడం లేదని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) ఓపీ రమేశ్బాబు కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. -
మేనేజ్మెంట్ కోటా తుది మెరిట్ జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా (బీ, సీ/ఎన్ఆర్ఐ కేటగిరీ) కింద ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్యూహెచ్ఎస్) బుధవారం విడుదల చేసింది. నీట్లో అర్హత సాధించి, మేనేజ్మెంట్ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలతో రిజిస్ట్రార్ పేరిట ఈ జాబితాను ప్రకటించింది. మెరిట్ జాబితాలో ప్రణవ్ అభిజిత్ సాల్గర్కర్ (రోల్ నంబరు 13115202570) 590 మార్కులు సాధించి, ఆల్ ఇండియా ర్యాంకు 13,689తో తొలి స్థానంలో నిలిచారు. జాబితా క్రమసంఖ్య 7,113 వరకు అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. చివరి క్రమసంఖ్యలో మయూరేష్ ఫిర్కేవార్ 177 మార్కులతో, 11,94,890 ఆల్ ఇండియా ర్యాంకుతో ఉన్నారు. గత విద్యా సంవత్సరాల్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొంది, కళాశాలల్లో చేరని కొంతమంది అభ్యర్థుల విషయంలో వర్సిటీ ప్రత్యేక నిబంధనలు అమలు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వు జీఓఎంఎస్ నంబర్ 125 ప్రకారం ఆయా అభ్యర్థుల అర్హతలను పరిమితం చేసినట్టు మెరిట్ జాబితాలోని రిమార్క్స్లో పేర్కొంది. కొందరికి కేవలం బీడీఎస్, మరికొందరికి కేవలం ఎంబీబీఎస్ ప్రవేశానికి మాత్రమే అర్హత ఉన్నట్టు స్పష్టం చేసింది. మెరిట్ జాబితాలో అభ్యర్థుల నీట్ ర్యాంకు, మార్కులు, స్థానిక, స్థానికేతర, మైనారిటీ, ఎన్ఆర్ఐ తదితర వివరాలను పొందుపరిచారు. అభ్యర్థులు తమ వివరాలను వర్సిటీ అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.వెబ్ ఆప్షన్లు షురూ: ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా (బీ, సీ/ఎన్ఆర్ఐ కేటగిరీలు) మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభిస్తూ వర్సిటీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు సెప్టెంబర్ 9 సాయంత్రం 5.30 గంటల నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 11 సాయంత్రం 4 గంటల వరకు అవకాశముంది. ప్రైవేట్ వైద్య, దంత కళాశాలలతోపాటు ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, అనురాగ్ యూనివర్సిటీ పరిధిలోని నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీట్లను ఈ విడతలో భర్తీ చేయనున్నారు. కాగా మొదటి విడత కౌన్సెలింగ్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేయని అభ్యర్థులు తదుపరి విడతల కౌన్సెలింగ్కు అనర్హులవుతారని వర్సిటీ స్పష్టం చేసింది. సీట్లను బ్లాక్ చేసి తర్వాతి విడతలకు వెళ్లకుండా ఈ నిబంధన విధించింది. వెబ్ ఆప్షన్ల ఆధారంగా సీటు కేటాయించిన తర్వాత సంబంధిత కళాశాలలో చేరని విద్యార్థులు కూడా తదుపరి విడతల కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం కోల్పోతారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేనేజ్మెంట్ కోటా బీ కేటగిరీ సీట్లలో 85 శాతం తెలంగాణ స్థానిక అభ్యర్థులకు, మిగిలిన 15 శాతం అన్రిజర్వ్డ్ (ఆల్ ఇండియా) అభ్యర్థులకు కేటాయిస్తారు. అభ్యర్థులు కళాశాలలు, కోర్సుల వారీగా తమకు నచ్చిన క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం కోర్సును మధ్యలోనే నిలిపివేసే అభ్యర్థులు అసలు ధ్రువపత్రాలను తిరిగి పొందేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.20 లక్షల డిస్కంటిన్యూయేషన్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని కేఎన్ఆర్యూహెచ్ఎస్ పేర్కొంది.యూనివర్సిటీ ఫీజులు ఇలా..: సీటు కేటాయించిన అభ్యర్థులు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఆన్లైన్ ద్వారా వర్సిటీ ఫీజు చెల్లించాలి. ఎంబీబీఎస్ బీ కేటగిరీకి రూ.లక్ష, సీ/ఎన్ఆర్ఐ కేటగిరీకి రూ.2 లక్షలు నిర్ణయించారు. బీడీఎస్లో బీ కేటగిరీకి రూ.40 వేలు, సీ/ఎన్ఆర్ఐ కేటగిరీకి రూ.80 వేలు చెల్లించాలి. దీనికి అదనంగా కళాశా లల్లో ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నీలిమా మెడికల్ కాలేజీలో బీ కేటగిరీ ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.16.50 లక్షలు, సీ/ఎన్ఆర్ఐ కేటగిరీకి రూ.24.75 లక్షలుగా ఉంది.వెబ్ ఆప్షన్లకు tspvtmedadm. tsche.in వెబ్సైట్లో, సాంకేతిక సమస్యలకు 9392685856, 7842136688, 9059672216, నిబంధనలపై సందేహాలకు 7901098840, 9490585796 , చెల్లింపుల సమస్యలకు 9618240276 నంబర్లను సంప్రదించాలని వర్సిటీ సూచించింది. -
'కోహెడ'కు రూ.637.70 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానికి సమీపంలో కోహెడలో నిర్మించనున్న ప్రపంచస్థాయి సమగ్ర పండ్ల మార్కెట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడటమే లక్ష్యంగా దీన్ని నిర్మిస్తోంది. మార్కెట్ తొలి దశ పనులకు రూ.637.70 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ గ్రామంలో 178.16 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమగ్ర పండ్ల మార్కెట్ను అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో భాగంగా ఆరు వేలం హాళ్లు, వాటికి అనుబంధంగా మీజనైన్ ఏసీ అంతస్తులు నిర్మించనున్నారు. వీటితోపాటు షెడ్–4, కర్బూజ తదితర పండ్ల విక్రయాల కోసం ప్రత్యేక మార్కెట్, రైతుల కోసం కిసాన్ రిటైల్ మార్కెట్, వాహనాలు నేరుగా లోపలికి వెళ్లి సరుకులు తరలించే సదుపాయం, ప్రాంగణం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మార్కెట్ నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ) ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాంకేతిక అనుమతులు, టెండర్ల ప్రక్రియ, నిర్మాణ పనుల పర్యవేక్షణ తదితర బాధ్యతలను ఆ శాఖ నిర్వహించనుంది. రైతులకు ఆధునిక సదుపాయాలు ఈ మార్కెట్ అందుబాటులోకి వస్తే పండ్ల ఉత్పత్తిదారులకు ఆధునిక మార్కెటింగ్ మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. శాస్త్రీయ పద్ధతుల్లో పండ్ల విక్రయాలు, నిల్వ, రవాణా, మార్కెటింగ్కు మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు. తద్వారా రైతులకు మార్కెట్ అవకాశాలు పెరగడంతో పాటు మధ్యవర్తులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, మార్కెటింగ్ వ్యవస్థ ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కోహెడ సమగ్ర పండ్ల మార్కెట్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ రంగంలో మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. -
ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే కేసులో ఇరికించారా?
సాక్షి, న్యూఢిల్లీ: ఒక కేసులో అరెస్టు చేసి, అందులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాని మరో కేసులో ముద్దాయిగా చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. తెలంగాణ పోలీసుల దర్యాప్తు తీరును తప్పుబడుతూ దీనిని పూర్తిగా ’రివర్స్ ఇంజనీరింగ్’ కేసుగా అభివర్ణించింది. ఈ కేసులో 11 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన పులి ఓబులేసుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పులి ఓబులేసు దాఖలు చేసిన ఎస్ఎల్పీ (క్రిమినల్)పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పోలీసుల దర్యాప్తు తీరుపై ధర్మా సనం ప్రశ్నల వర్షం కురిపించింది. ‘మీరు అతడిని ఒక కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు నేరం అంగీకరించాడని చెప్పి ఈ కేసులో ఇరికించారు. ఆ తర్వాతే ఫిర్యాదుదారుడిని సృష్టించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదొక రివర్స్ ఇంజనీరింగ్ కేసు‘ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి పిటిషనర్ను బెయిల్పై విడుదల చేయాలని పేర్కొంది.అసలేం జరిగిందంటే...: 2014 నవంబర్ 19న హైదరాబాద్లో కేబీఆర్ పార్కు వద్ద ఆడి కారులో కూర్చున్న ఓ వ్యక్తి వద్దకు పులి ఓబులేసు తుపాకీతో వెళ్లి బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుడు ప్రతిఘటించడంతో కారు అద్దంపై కాల్పులు జరిపాడు. బాధితుడి సోదరుడు అడ్డు కోగా, అతడిని కొరికి తుపాకీ వదిలేసి పరారయ్యాడు. విచారణ జరిపిన కింది కోర్టు.. కిడ్నాప్, హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద నేరాలు రుజు వైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు, కఠిన కారాగార శిక్షలు విధించింది. అయితే, బాధితుడిని కారు నుంచి మరో ప్రాంతానికి తరలించనందున కిడ్నాప్ సెక్షన్ వర్తించదంటూ జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేసింది. అయితే, హత్యా యత్నం, ఆయుధ చట్టం కింద కింది కోర్టు విధించిన శిక్షలను మాత్రం సమర్థించింది. -
ఆ రెండూ కుట్రలే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను, ఆయన మాతృమూర్తిని కించపరిచి అవమానించటం, అనంతరం ఆయనకు మద్దతుగా నిరసన తెలిపిన దళితులు నడిచిన ప్రాంతాన్ని శుద్ధి చేయటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలను కుట్రలుగానే పరిగణిస్తున్నామని చెప్పారు. ఇందుకు వ్యూహకర్తలు, ప్రత్యక్షంగా అమలు చేసిన వారిపై ఆయా సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, విచారణ జరిపి జైలుకు పంపే ఏర్పాటు చేస్తామని అన్నారు. ముంబయిపై దాడి చేసిన కసబ్ లాంటి ఉగ్రవాదులకు కొన్ని అంశాలను నూరిపోసి ఉన్మాదులుగా మార్చి మన దేశంపైకి పంపిన తరహాలోనే, కేసీఆర్ కూడా తన అనుచరులకు ఇలాగే నూరిపోసి ఉన్మాదులుగా మార్చి ఉసిగొల్పారని ఆరోపించారు. దాంతో పేట్రేగిన నేతలు ఆ రోజు దళిత స్పీకర్ను కించపరచటమే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆ కార్యక్రమానికి ముందురోజు ఫామ్హౌస్లో జరిగిన భేటీలో చేసిన కుట్ర మొదలు ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న ఘటనలపై సంపూర్ణ విచారణ చేపడతామన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు జాయింట్ కమిషనర్ విజయకుమార్ను విచారణాధికారిగా నియమిస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం శాసనసభలో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. కేసీఆర్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన దళితులను అవమానించేలా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసినట్టుగా చెబుతున్న వ్యవహారంపై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చను ముగిస్తూ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. కోర్టులు బెయిల్ ఇచ్చినా ప్రజలు బెయిల్ ఇవ్వరు ‘చట్టాలు, సెక్షన్లను అడ్డుపెట్టుకుని కొంతమంది కోర్టుల నుంచి బెయిల్ పొందవచ్చు. కానీ తెలంగాణ సమాజం మాత్రం వారికి బెయిల్ ఇవ్వదు. జరిగిన తప్పును అంగీకరించి క్షమాపణ చెబితే కిరీటం ఊడిపోతుందా? స్థాయి తగ్గుతుందా? సభాపతిని అవమానించిన విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుంది. చట్టపరంగా శిక్షించే వరకు వెనక్కి తగ్గబోదు. సభాపతి పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్కుమార్ మనసుకు గాయం చేసేలా ఉన్మాదంతో వ్యవహరించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. వ్యక్తినే కాకుండా తల్లిని కూడా అవమానించే స్థాయికి వెళ్లారు. మహిళలను శక్తిగా కొలిచే సమాజంలో ఇలాంటి చర్యలకు చోటుంటుందా? సభలో అధికారులపై దాడులు చేయడంతోపాటు స్పీకర్ కుర్చీని అవమానించేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. దళితులపై అవమానకర చర్యలు స్పీకర్ను అవమానించిన ఘటనకు నిరసనగా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఫామ్హౌస్ వద్ద డప్పు దరువులతో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారే తప్ప ఎలాంటి ఉన్మాదానికీ పాల్పడలేదు. దళిత సోదరులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేసేందుకు డప్పును ఒక సాధనంగా ఉపయోగిస్తారు. నిరసన తెలిపిన దళిత ప్రతినిధులను పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉంది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించి, దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించడం ద్వారా దళితనులను తీవ్రంగా అవమానించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తే.. మరి దొరతనం, ఆహంకారంతో ఉన్న ఆ నేతల మనసుల్లో పేరుకుపోయిన అంటరానితన భావజాలాన్ని ఎలా శుద్ధి చేస్తారు? యాసిడ్తో కడగాలా? దళితుడు దుక్కి దున్ని పంట పండిస్తేనే అందరి కడుపులు నిండుతున్నాయి. మనకు అన్నం పెడుతున్న వారిని ఇంతగా అవమానిస్తారా? దళితులను అవమానపరుస్తూ వారిని కించపరిచిన ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలి. అప్పుడే వారికి దళితులు ఎదుర్కొంటున్న వివక్ష ఎలాంటిదో తెలిసొస్తుంది. ఖర్గేనూ అవమానించారు.. సమాజంలో అశాంతిని ప్రోత్సహించి రెండు వర్గాల మధ్య వైరాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు ధనబలంతో వ్యవస్థలను లొంగదీసుకోవాలని చూస్తున్నారు. మేము మాత్రం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దేశంలోని కోట్లాది ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించింది. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో పుట్టి, రజాకార్ల దాడుల్లో తల్లిని కోల్పోయి, కార్మిక నాయకుడిగా ఎదిగి జాతీయ స్థాయికి చేరుకున్న నేత మల్లికార్జున ఖర్గేను అవమానించడం బాధాకరం. ఉత్తరాఖండ్లోని ఓ మైదానంలో ఖర్గే సభలో పాల్గొన్న అనంతరం ఆగస్టు 10న బీజేపీ అనుబంధ సంస్థ అదే మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం హేయమైన చర్య. ఆ ఘటనను ఈ సభ ముక్తకంఠంతో ఖండిస్తోంది. తాజాగా తెలంగాణ వేదికగా బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వ్యవహారానికి తెరలేపింది. వారిని వదిలే ప్రసక్తే లేదు.. విద్యా రంగంలోని అక్రమాలు, ధరణి అక్రమాలు, 22ఏ రాద్ధాంతంపై శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం భావించింది. ఈ అంశాలపై చర్చ జరిగితే గత పదేళ్లలో జరిగిన దురాగతాలు, రాష్ట్రంపై పేరుకుపోయిన అప్పుల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుందనే భయంతోనే చర్చను అడ్డుకునేందుకు ఈ కుట్రలు పన్నారు. సభను అడ్డుకోవడమే కాకుండా స్పీకర్ను అవమానించే స్థాయికి వెళ్లడం అత్యంత దురదష్టకరం. కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయానికి బాటలు వేసింది. కాంగ్రెస్ విధానం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడమే..’ అని సీఎం స్పష్టం చేశారు. స్పీకర్ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తి లేదని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే విషయంలో ప్రభుత్వం స్పీకర్కు పూర్తిగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
హనుమకొండ కేదారి హోటల్లో భారీ అగ్ని ప్రమాదం..
తెలంగాణ: వరంగల్ హన్మకొండ జిల్లాలోని అదాలత్ జంక్షన్లో లింగాల కేదారి హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోటల్ యజమాని కేదారి దంపతులు గాయపడినట్లు సమాచారం. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో ఉన్న వారు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురయ్యారు.ఈ అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.అయితే, మంటల కారణంగా గాయపడిన కేదారి దంపతులను చికిత్స కోసం హనుమకొండలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.హోటల్లో మంటలు ఎలా చెలరేగాయి? ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.ఇవీ చదవండి: తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్న్యూస్.. -
కుళ్లిన మాంసం.. పాడైన కేకులు.. ఏం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: నగరంలో అంతటా రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లలో టీజీ సేఫ్ బృందం తనిఖీలు చేపట్టింది. కూకట్పల్లిలో భూలక్ష్మీ మెస్లో కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఉప్పల్ పిస్తా హౌస్లో..కాగా, ఉప్పల్ బ్రాంచ్ పిస్తా హౌస్ కేక్ తిన్న ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. కుళ్లిపోయిన కేక్ అమ్మారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేక్ తిన్న కాసేపటికే వాంతులు అయ్యాయన్న బాధితులు.. కేక్ నుంచి దుర్వాసన వచ్చిందని చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టి అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల అత్తాపూర్లోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో హెచ్– ఫాస్ట్, ఫుడ్సేప్టీ అధికారుల తనిఖీల్లో ఫ్రిజ్లో కుళ్లిన మాంసాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. గడువు ముగిసిన ఐస్క్రీమ్లు, కుళ్లిపోయిన పండ్లను గుర్తించారు. ఏప్రిల్ నెలలో మంగళ్హాట్లో కుళ్లిపోయిన మేకలు, గొర్రెల మాంసం విక్రయ గోడౌన్పై పోలీసులు దాడులు నిర్వహించగా.. సుమారు వెయ్యి కిలోల మాంసం విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు.నగరంలోని పలు హోటళ్లకు, రెస్టారెంట్లకు, ఫంక్షన్ హాళ్లలో జరిగే శుభ కార్యాలకు మాంసాన్ని సరఫరా చేస్తున్నాడు. మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల నుంచి అఫ్రోజ్ నాణ్యత లేని మాంసాన్ని విడిభాగాలను తక్కువ ధరకు దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.ఇదీ చదవండి: మాస్క్ పెట్టుకున్నా.. మచ్చ పట్టించింది! -
ఆర్మీ ఆయుధాల చోరీ కేసు.. కీలక విషయాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ఆయుధాలు ఒకేసారి చోరీ కాలేదని అధికారులు విచారణలో గుర్తించారు. 3 నెలలుగా ఆయుధాలు ఒక్కొక్కటిగా మాయమైనట్లు తెలిపారు. 4 ఏకే 47 రైఫిల్స్, 2 రైఫిల్స్, 9పిస్టోల్స్ చోరీ జరిగినట్లు గుర్తించారు. 2 వేలకు పైగా బుల్లెట్లు చోరి అయినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఆయుధాల చోరీ కేసులో ముగ్గురు అధికారులను ఆర్మీ ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. -
గవర్నర్ ఇవే అడిగారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇవాళ (బుధవారం) లోక్భవన్లో గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీ ఘటనలో పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతుందన్నారు.‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, యూరియా కొరత, రైతు బీమా, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు గవర్నర్కు ఫిర్యాదు చేశాం. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యపై ఫిర్యాదు చేశామని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్స్ వేసుకున్నట్టే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ టీ షర్ట్స్ వేసుకున్నాము. బ్లాక్ టీ షర్ట్ తో అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. దాడి చేసి మా పైనే ఉల్టా కేసులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కోరుకున్నారు. వేముల వీరేశం, కుంభం అనిల్రెడ్డి, నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారు. వేల మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫాం హౌస్పై దాడి చేసేందుకు ఉసిగొల్పారు. మేము అనని మాటలను అన్నట్టు స్పీకర్కు ఆపాదించారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్ను అవమానిస్తున్నారు...శాసన సభ కాదు.. దుశ్శాసన సభలా మార్చారు. చావు డప్పు ఎప్పుడు కొడతారో.. మనందరికీ తెలుసు. ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గర చావు డప్పు కొట్టారు. అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై సీఎస్ డీజీపీని పిలిపించి మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మంచివి కాదని గవర్నర్ మాతో చెప్పారు.’’ అని కేటీఆర్ వివరించారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్ -
కేసీఆర్కు చెడు జరగాలని కాంగ్రెస్ కోరుకోదు: మహేష్ కుమార్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై వస్తున్న రాజకీయ విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్కు చెడు జరగాలని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని.. ఇకపై కూడా కోరుకోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం పాడవ్వాలని ఎవరు కోరుకుంటున్నారని, ఆయన ద్వారా ఎవరు లబ్ధి పొందాలని చూస్తున్నారని ప్రశ్నించారు.బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విషయంలో జరుగుతున్న రాజకీయ విమర్శల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ కోరుకుంటోందన్న ప్రచారాన్ని ఖండించారు. ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించే సంస్కృతి కాంగ్రెస్దని స్పష్టం చేశారు. కేసీఆర్కు చెడు జరగాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదని మరోసారి తేల్చిచెప్పారు.కేసీఆర్ గాయపడిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అధికారులను అప్రమత్తం చేసి కేసీఆర్కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారని, ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా సూచించారని తెలిపారు. అలాంటి తమ పార్టీపై కేసీఆర్ ఆరోగ్యం విషయంలో నిందలు వేయడం సరికాదన్నారు. వారి ఇంటి గొడవలను కాంగ్రెస్కు ఆపాదిస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. అలాగే, ప్రతిపక్ష నాయకుడు నూరేళ్లు బతకాలని కోరుకుంటాం. కేసీఆర్ విషయంలో మా ఎమ్మెల్యే బాధతో మాట్లాడారు. మా పార్టీ షాద్నగర్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి అభిమాని. అందుకే రేవంత్ రెడ్డిని తిడుతుంటే బాధతో కేసీఆర్పై అలా మాట్లాడారు. స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు చాలా దారుణం’ అని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సంస్కృతికి వాజ్పేయి, జైపాల్ రెడ్డి ఉదాహరణలు. వాజ్పేయి ఆరోగ్యం బాగోలేకపోతే అమెరికాకు పంపించి చికిత్స చేయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. జైపాల్ రెడ్డికి బైపాస్ సర్జరీ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష విషయంలో కాంగ్రెస్ కుటుంబం మానవతా దృక్పథాన్ని చూపింది. ఇలాంటి రాజకీయ సంస్కృతి మంచిది కాదు. దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది’ అని అన్నారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్


