రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్హౌజ్లో కాల్పుల ఘటన భారీ కలకలం రేపింది. డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు చేసేందుకు అక్కడికి వెళ్లగా, కొంతమంది యువకులు పోలీసులను అడ్డుకుని హంగామా సృష్టించారు. ఈ సందర్భంగా పోలీసులపై కాల్పులు జరిగినట్లు సమాచారం.
మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యేకి చెందిన ఓ ప్రైవేట్ ఫామ్హౌజ్లో యువకులు డ్రగ్స్తో పార్టీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై అప్రమత్తమైన ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని సోదాలు ప్రారంభించారు. అయితే అక్కడ ఉన్న కొందరు యువకులు పోలీసుల చర్యలకు అడ్డుపడి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు.
ఈ క్రమంలో పోలీసులు, అక్కడ ఉన్న యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఫామ్హౌజ్లో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
పాల్గొన్న టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్
సోదాల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2 గ్రాముల కొకైన్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ యాదవ్ పోలీసుల సోదాల సమయంలో అక్కడే ఉన్నారు. ఫామ్హౌజ్ యజమాని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని, ఇతరులను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు.


