సాక్షి,హైదరాబాద్: మరోసారి మంత్రిపదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘అధికారం శాశ్వతం కాదు. మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. నేను కూడా చాలా ఓపికతో ఉన్నాను. వివిధ కారణాలతో అధిష్టానం మంత్రి పదవి ఇవ్వలేకపోయింది. సమయం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది’ అని ఆయన అన్నారు."


