సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు పరిధిలోని పెద్దేముల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) రిచర్డ్ సైమన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
సమాచారం ప్రకారం.. గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మోటేషన్ ఫైల్ కోసం ఆర్ఐ రిచర్డ్ సైమన్ వద్ద పని చేయించుకోవడానికి వెళ్లాడు. ఈ సందర్భంగా రూ.15,000 లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ అధికారులు పెద్దేముల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


