సాక్షి,హైదరాబాద్: కూకట్పల్లిలో కోటి రూపాయల హవాలా మనీ చోరీకి గురైంది. హవాలా డబ్బును బైక్పై తీసుకుని వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల కళ్లల్లో కారం కొట్టి కోటి హవాలా మనీ కొట్టేశారు. బహుదూర్ పూరా నుంచి జీడిమెట్లకు తరలిస్తుండగా దోపిడీ జరిగింది. బాధితుల ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుల నుంచి హవాలా డబ్బు ఎక్కడికి వెళ్తుందని దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు.


