సాక్షి,నల్లగొండ: చింతపల్లి మండలం చెన్నారం గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్నఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని తొలుత దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏడుగురిని హైదరాబాద్కు తరలించారు.
మరణించిన వారిలో ఇద్దరు బీహార్కు చెందినవారిగా, మరో ఇద్దరు బొత్య తండాకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాద సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. స్థానికులు రోడ్లపై లారీలు నిర్లక్ష్యంగా నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


