విక్రమ్ సహిదేవ్, 'శ్రీ చిదంబరం గారు' ఫేమ్ సంధ్యా వశిష్ట జంటగా నటించిన సినిమా 'అనకాపల్లి'.
ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన తన మిత్రుడు కాండ్రేగుల నాయుడుతో కలిసి ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాతో ఖగేష్ తమ్మినేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
బుధవారం రాత్రి అనకాపల్లిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.
అనకాపల్లిలోని రావు గోపాలరావు కళాక్షేత్రంలో జరిగిన 'అనకాపల్లి' సినిమా వేడుకకు సోనూసూద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రసిద్ధ నూకాలమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అలాగే 'డర్టీ గ్యాంగ్స్టర్స్' పాటను విడుదల చేసి, చిత్ర యూనిట్కు తన పూర్తి మద్దతు ప్రకటించారు.


