భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కొరికశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ముగ్గురు దుర్మరణం చెందారు. వ్యవసాయ బావిలో పూడిక తీసే క్రమంలో ఈ దారుణం జరిగింది. క్రేన్ వ్యవసాయ బావిలో పడటంతో విషాదం నెలకొంది. క్రేన్తో సహా నలుగురు వ్యవసాయ బావిలో పడ్డారు.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పైడి(50), దేవరావు( 48), అభిలాష్(16) అనే ముగ్గురు మృతిచెందగా, మరో వ్యక్తి మోహన్ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


