breaking news
Revanth Reddy
-
‘‘గణేశ వేడుకలకు ఎక్కడాలేని విధంగా ఈ సౌకర్యం అందిస్తున్నాం’’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి శనివారం వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్ల సమీక్షలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంప్రదాయాన్ని పునర్దుద్ధరించామని తెలిపారు. సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా తానే సమీక్ష నిర్వహిస్తున్నానని అన్నారు.‘‘మండపాలకు అతిథులను ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలు స్థానిక కమిషనరేట్ కు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఊహించని పరిణామాలు జరగినపుడు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ఆ సమాచారం ఉపయోగపడుతుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మండప నిర్వాహకులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ పొందాలి. ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో ముందుగానే సమాచారం అందిస్తే పోలీసులకు ట్రాఫిక్, బందోబస్తు నిర్వహణకు సులభంగా ఉంటుంది. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మలకు ఏర్పాటు చేసినట్లే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. చెరువుల వద్ద చుట్టూ క్రేన్స్ ఏర్పాటుకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోవాలి. పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలి. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకు నిర్వాహకుల నుంచి సహకారం ఉండాలి. సమస్యలు ఏమున్నా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. -
బీఆర్ఎస్ నేతలపై కేసులు.. వారిపై మౌనం ఎందుకు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కేసులు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ కక్షతోనే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. లైంగిక వేధింపుల కేసులను సైతం చట్టాన్ని దుర్వినియోగం చేసేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు.మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా.. ఎన్ని కేసులు పెట్టినా న్యాయస్థానంలో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరు చట్టబద్ధ పాలనకు విరుద్ధంగా ఉందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయడంలో పోలీసులు చూపుతున్న వేగం.. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేస్తూ.. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణలపై మాత్రం మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించకూడదని సూచించారు.The cheap minister of Telangana made his police file a sexual harassment case on BRS MLAs and MLCs in the context of the melee at assembly entry point !!! Shocking abuse of lawWe of course will fight this rubbish cases in court of law But let me ask @TelanganaDGP Garu… pic.twitter.com/dGxvJrSibA— KTR (@KTRBRS) September 12, 2026ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీకి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు. మిస్ వరల్డ్ సందర్భంగా మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలపై విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పోలీసులు కాపాడుతున్నారా? అని నిలదీశారు.ఇదీ చదవండి: తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ.. -
విద్యార్థుల భవిష్యత్తు కోసమే విద్యా విధానంలో సంస్కరణలు... తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
-
రేవంత్ ఏ1.. పొంగులేటి ఏ2!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం బురద రాజకీయాలు, చిల్లర మాటలు మానుకుని కష్టార్జితమైన ప్రజల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్రావు డిమాండ్ చేశారు. దరఖాస్తుల పేరిట ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పకుండా పారదర్శకంగా నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలను వెల్లడించాని కోరారు. 22ఏ అంశాన్ని అడ్డుపెట్టుకుని సాగుతున్న 30 శాతం కమీషన్ల పాలనపై జ్యుడిషియల్ విచారణ జరపాలని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కేవలం సారీ చెప్పడంతో సరిపెట్టకుండా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 22ఏ వెనుక జరుగుతున్న అవినీతి భాగోతంతో సీఎం రేవంత్రెడ్డికి సంబంధం ఉందని ఆరోపించారు. 22ఏ భూముల విషయంలో రేవంత్రెడ్డి ప్రథమ ముద్దాయి అయితే పొంగులేటి ఏ2 అని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో హరీశ్రావు 22ఏ భూములపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచి్చన బాధితులు 22ఏ జాబితాలో తమ భూములను పెట్టడం ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. భూమి చుట్టూ రేవంత్ పరిభ్రమణం ‘ఒక్క పెన్నుపోటుతో రాత్రికి రాత్రే తాతలు, తండ్రుల నుంచి లక్షలాది మంది ప్రజలకు సంక్రమించిన భూములను నిషేధిత జాబితాలో పెట్టి వారి జీవితాలను కన్నీళ్ల పాలు చేశారు. కేసీఆర్ పాలనలో ప్రజలు కేంద్రంగా ప్రభుత్వం నడిస్తే రేవంత్ పాలన మాత్రం భూముల కేంద్రంగా సాగుతోంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు.. భూమి చుట్టూ రేవంత్ పరిభ్రమణం చేస్తున్నాడు. నిజానికి ప్రభుత్వ, పోరంబోకు, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ల్యాండ్ సీలింగ్ భూములను కాపాడేందుకే 22ఏ నిబంధన తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఊళ్లకు ఊళ్లు, కాలనీలు, అపార్ట్మెంట్లు, హెచ్ఎండీఏ, హుడా వేలం వేసిన భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారు. ‘నిన్నటివరకు నీ భూమి.. పొద్దున లేస్తే నిషేధిత భూమి’అన్నట్లుగా మార్చారు. 22ఏ జాబితాలో ఉన్న సీఎం రేవంత్ ఇల్లును రాత్రికి రాత్రే జాబితా నుంచి తొలగించారు. అదే తరహాలో ప్రజల ఆస్తులను ఎందుకు తొలగించడం లేదు?..’అని హరీశ్రావు నిలదీశారు. ప్రతి నిర్ణయం వెనుకా భూ వ్యాపారమే ‘లగచర్ల గిరిజనుల భూములు మొదలుకుని హిల్ట్ పాలసీ, హైడ్రా, మూసీ సుందరీకరణ, 22–ఏ వరకు అన్ని అంశాల వెనుక ఎజెండా భూములు కొల్లగొట్టడమే. సీఎం రేవంత్, ఆయన సోదరులు, మంత్రి పొంగులేటి ఆయన కుమారుడు భూములను లక్ష్యంగా చేసుకుని అక్రమాలు, అవినీతి, బెదిరింపులకు పాల్పడుతున్నారు. హెచ్సీయూకు చెందిన 400 ఎకరాలను కుదువ పెట్టి భారీ రుణం తెచ్చారు. అలాగే మేడ్చల్లో వేల ఎకరాలను తాకట్టు పెట్టి రుణం తెచ్చారు. మూసీ సుందరీకరణ వెనక వేల ఎకరాల భూ వ్యాపారం ఉంది. నాదర్గుల్లో ప్రభుత్వ భూముల వ్యవహారం, పొంగులేటి కుటుంబానికి సంబంధించిన భూముల కబ్జాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 22–ఏలో ఎన్ని ఎకరాలు చేర్చారు..ఎన్ని ఆస్తులు చేర్చారు.. ఎన్ని తొలగించారు.. ఏ కారణంతో తొలగించారో పూర్తి వివరాలను బహిరంగ పరచాలి..’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. నాదర్గుల్, అబ్దుల్లాపూర్మెట్, ఖాజాగూడ, గచి్చ»ౌలి, రాందాస్పల్లి, ఖానామెట్ తదితర చోట్ల 22ఏను అడ్డుపెట్టుకుని భూ కుంభకోణాలు జరుగుతున్నాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రభుత్వంలో గజానికో గజదొంగ: కేటీఆర్ రాష్ట్రంలో భూ దోపిడీ విపరీతంగా జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి భాగోతాలు బయటపడతాయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి మెడపట్టి గెంటేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోటి 16 లక్షల ఎకరాలకు పెంచిందన్నారు. ‘ఈ ప్రభుత్వంలో గజానికో గజదొంగ’తయారయ్యాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం సోదరులు ‘తమ్ముడు.. లెట్స్ డూ కుమ్ముడు’అన్నట్టుగా భూములు కొల్లగొడుతున్నారని ఎద్దేవా చేశారు. మంత్రుల ముఠా ‘అలీబాబా అరడజను దొంగలు’గా తయారైందని ఆరోపించారు. బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.తెలంగాణ భవన్కు పోటెత్తిన బాధితులు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భువనగిరి తదితర జిల్లాల నుంచి 22ఏ జాబితా బాధితులు తెలంగాణ భవన్కు వచ్చారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెల్లడించారు. బ్యాంకు రుణాలు, పిల్లల పెళ్లిళ్లు, చదువులపై 22ఏ అంశం ఎలా ప్రభావం చూపుతుందో వివరించారు. 22ఏ కారణంగా వారసత్వంగా సంక్రమించిన భూమిని తమ వారసులకు ఇవ్వలేకపోతున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరుకు చెందిన మల్లయ్య అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం పరిధిలో గతంలో 22ఏ జాబితాలో ఉన్న భూములను తొలగించేందుకు చేసిన కృషిని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్రెడ్డి వివరించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత.. తన నియోజకవర్గం పరిధిలో కొత్తగా 40 కాలనీలను 22ఏ జాబితాలో చేర్చినట్లు ఆయన తెలిపారు. -
విద్యార్థుల బాగుకే..
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకే విద్యావిధానంలో సంస్కరణలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయడంతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, అంతర్జాతీయ స్థాయి కంపెనీల్లో వారికి ఉపాధి అవకాశాలు అందుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం చేపట్టిన పాలిటెక్నిక్ కోర్సులో సంస్కరణలతో కూడా మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ సంస్కరణలు చూస్తే 2029లో విద్యార్థులంతా తనకు మళ్లీ మద్దతు ఇస్తారని అన్నారు. శుక్రవారం శాసనసభలో విద్యపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. కాగితంపై రాసిస్తా.. ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా టాటా సంస్థతో ప్రత్యేకంగా చర్చించి ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు)గా అప్గ్రేడ్ చేయించాం. రాష్ట్రంలోని 70 ఏటీసీల్లో అత్యాధునిక సాంకేతిక విధానంతో శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి టాటా సంస్థలో ఉపాధి దొరుకుతుంది. కానీ ఈ ఏటీసీ ప్రైవేటీకరణ జరగలేదు. అన్నీ ప్రభుత్వ అధీనంలోనే నడుస్తున్నాయి. అదే విధంగా పాలిటెక్నిక్ కోర్సును యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(వైఐఎస్యూ)తో అనుసంధానం చేస్తున్నాం. దీంతో బోధన, బోధనేతర సిబ్బందికి ఏమాత్రం నష్టం ఉండదు. వారి సర్వీసు నిబంధనలకు ఆటంకం కలగదని కాగితంపై రాసిస్తా. విద్యార్థులపై కొత్తగా ఫీజుల భారం కూడా ఉండదు. ఆ తర్వాత ఇంజనీరింగ్లో చేరే విధానం (లాటరల్ ఎంట్రీ) కూడా కొనసాగుతుంది. విద్యార్థులకు నష్టం చేస్తే నాకు ఒరిగేదేం లేదు.. డిప్లొమా పూర్తి చేసిన వెంటనే ఉపాధి అందేలా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యంగా ఉన్న కంపెనీలు చర్యలు తీసుకుంటాయి. పాలిటెక్నిక్ అప్గ్రెడేషన్లో భాగంగా టాటా సంస్థతో రూ.4 వేల కోట్ల విలువైన అత్యాధునిక మౌలిక వసతులతో బోధన చేపట్టనున్నాం. ఎంతో ప్రయాసపడి ఈ నిధిని తీసుకొస్తున్నాం, ఇప్పుడు వద్దంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం పదేళ్లయినా ఖర్చు చేయలేదు. విద్యార్థులకు నష్టం చేస్తే నాకు ఒరిగేదేం లేదు. కానీ కొందరు రాజకీయ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేటీకరిస్తారని అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. అలాంటి రాజకీయ నాయకుల ఉచ్చులో విద్యార్థులు పడొద్దు. ఒక్క కాలేజీని కూడా ప్రైవేటుకు అప్పగించే ప్రసక్తే లేదు..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బడ్జెట్ మూడేళ్లలో రూ.7,554 కోట్లు పెరిగింది.. ‘రాష్ట్రంలో విద్యకు కేటాయింపులు క్రమంగా పెంతున్నాం. 2023–24 వార్షిక బడ్జెట్లో గత ప్రభుత్వం విద్యాశాఖకు రూ.19,093 కోట్లు కేటాయిస్తే.. మా ప్రభుత్వం 2024–25లో రూ.21,292 కోట్లు, 2025–26లో రూ.23,108 కోట్లు, 2026–27లో రూ.26,647 కోట్లు కేటాయించింది. కేవలం మూడేళ్లలో విద్యా బడ్జెట్ను రూ.7,554 కోట్లు పెంచాం. అధికారంలోకి వచి్చన తొలి ఏడాదిలోనే 55 రోజుల్లో 10,006 మంది టీచర్ల నియామకాలు ఎలాంటి ఆరోపణలకు తావులేకుండా పూర్తి చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో 7,857 మంది టీచర్లను మాత్రమే నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేలకు పైగా పెరిగింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను ప్రవేశపెట్టాం. ఇంగ్లిష్ విద్య కారణంగా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల వైపు వస్తున్నారు. ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులు ప్రీ ప్రైమరీ విద్య పొందుతున్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారంతో పాటు ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తున్నాం..’ అని సీఎం చెప్పారు. వాస్తవ కాలేజీలకే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ‘ఫీజు రీయింబర్స్మెంట్ కింద గత ప్రభుత్వం రూ.5,430 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లింది. అందులో రూ.1,410 కోట్లు మేము చెల్లించాం. ఆ తర్వాత మరో రూ.1,475 కోట్లు చెల్లించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.612 కోట్లు విడుదల చేశాం. మొత్తం 32 నెలల్లో మొత్తం రూ.3,488 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఇచ్చాం. విజిలెన్స్ తనిఖీల్లో కొన్ని కాలేజీల్లో అవకతవకలు గుర్తించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలోని ఓ మంత్రికి చెందిన కాలేజీల్లో బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తే రూ.400 కోట్లు సర్ప్లస్ నిధి ఉంది. దోపిడీ చేస్తే వచ్చిందా? లేక విద్యార్థుల నుంచి దండుకుంటే వచ్చిందా? అనేది అర్థం కాలేదు. గత ప్రభుత్వం చెల్లించని ఫీజులను విడతల వారీగా చెల్లిస్తాం. కానీ కేవలం నిజమైన కాలేజీలకు మాత్రమే ఇస్తాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థి ఖాతాల్లోనే ఫీజు నిధులు జమ చేస్తున్నాం..’ అని రేవంత్ వివరించారు. పదేళ్లు ఫీజులు ఇవ్వకపోయినా బీజేపీ మాట్లాడలేదు.. ‘ప్రజా ప్రభుత్వం కేవలం పేద కుటుంబాలు, ప్రజల అభ్యున్నతి కోసమే పనిచేస్తుంది. గత ప్రభుత్వంలోని పెద్దలు కేవలం వారి కుటుంబం కోసమే పనిచేశారు. ఇప్పుడు వాళ్లు కడుపులో కుళ్లు, పేద పిల్లలపై ద్వేషంతో ఉన్నారు. పేద విద్యార్థుల కోసం చేసే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకునే కుట్ర చేస్తున్నారు. పేద పిల్లలకు మేం అన్యాయం జరగనివ్వం. వారి భవిష్యత్ బాగుండాలనే మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పదేళ్లు అధికారంలో ఉండి దోచుకున్నారు. ఇప్పుడు అధికారం లేకపోవడంతో అహంకారంతో ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు. దుర్మార్గం వైపు, అహంకారం వైపు ఉన్నందునే పది తలల రావణుడు కూడా రాముడి చేతిలో మరణించాడు. పదేళ్లు ఫీజులు ఇవ్వకపోయినా ఒక్కరోజు కూడా బీజేపీ నేతలు మాట్లాడలేదు. ఒక్కరోజు కూడా ధర్నా చేయలేదు. నేను వచ్చాక మాత్రం నాపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అలా? కేసీఆర్లా నేను అణచివేస్తలేననా? లేక కేసీఆరే వారిని ఉసిగొల్పుతున్నారా? గత ప్రభుత్వం కేంద్రం నిధులను వద్దని చెప్పి, ఇక్కడ ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది. మేం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను పూర్తిగా వినియోగించుకుంటాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. ప్రజా విశ్వాసం సవరణ బిల్లు–2026తో పాటు కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వీటితోపాటు రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ, ఎల్నినో ప్రభావం, నివారణ చర్యలపై కూడా స్వల్పకాలిక చర్చలు జరగనున్నాయి.అయితే, ప్రజా విశ్వాసం సవరణ బిల్లు–2026ను మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లులోని ప్రతిపాదనలు, వాటి వల్ల కలిగే మార్పులపై సభ్యులు చర్చించనున్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందేలా తీసుకురానున్న మార్పులపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.మరో కీలక బిల్లుగా కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్లు అసెంబ్లీ ముందుకు రానుంది. ఈ బిల్లును సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పట్టణాభివృద్ధి, పాలనను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం, వివిధ సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలు ఇందులో ప్రధానంగా ఉండనున్నాయి.రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ అంశంపైనా ఈరోజు అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22ఏ కింద భూముల రిజిస్ట్రేషన్లకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై సభ్యులు చర్చించనున్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో 22ఏపై ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఇక ఎల్నినో ప్రభావం, దాని వల్ల రాష్ట్రంలో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు, ముందస్తు నివారణ చర్యలపైనా అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు చోటుచేసుకునే అవకాశాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై సభ్యులు చర్చించనున్నారు. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు పలు కీలక నిర్ణయాలు, చర్చలకు వేదిక కానున్నాయి.ఇవి కూడా చదవండి: బీసీల జనాభా లెక్కలు తేల్చాలి.. కులగణన తప్పనిసరి: మంత్రి శ్రీహరి -
‘అందుకే విద్యాశాఖను నా వద్ద ఉంచుకున్నా’
హైదరాబాద్: విద్యాశాఖ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ అని, ముఖ్యమంత్రి విద్యాశాఖను నిర్వహిస్తున్నారంటే ఆ శాఖు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లేనని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 11వ తేదీ) అసెంబ్లీ వేదికగా సీఎం విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవడంపై వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చారు. ‘విద్యాశాఖ అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖ. ముఖ్యమంత్రి విద్యాశాఖను నిర్వహిస్తున్నారంటే ఆ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టే. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేస్తే మొత్తం ప్రభుత్వ వ్యవస్థ పాల్గొంటుంది. చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ సహా అధికారులు సమీక్షకు హాజరవుతారు. మంత్రిగా విద్యాశాఖ సమీక్ష చేస్తే సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రమే హాజరవుతారు. ముఖ్యమంత్రిగా విద్యాశాఖను సమీక్షిస్తే మొత్తం వ్యవస్థను ఒకే, టేబుల్పైకి తీసుకురాగలుగుతాం. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుంది. విద్యాశాఖకు ఫుల్టైమ్ మంత్రి లేరని పరిమిత సమాచారంతో విమర్శలు చేయడం సరికాదు. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలకు మేలు జరిగే శాఖలను ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించాలి. న్యాయశాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలను నా వద్దే ఉంచుకున్నా. ప్రజాస్వామ్యంలో పీఎం, సీఎం, డీఎం అత్యంత శక్తివంతమైన పదవులు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న అధికార పరిధి అత్యంత కీలకమైనది. మంత్రులందరూ ముఖ్యమంత్రికి సహాయక వ్యవస్థగా పనిచేస్తారు. అధికారులు, ఇతర వ్యవస్థలు కూడా ప్రభుత్వానికి సహాయక వ్యవస్థలే. పేదలకు మేలు చేసే నిర్ణయాలు వేగంగా తీసుకోవడమే లక్ష్యంప్రైవేటు విద్యా వ్యవస్థలో రెండున్నరేళ్లకే పాఠశాలకు పంపిస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్లకు పాఠశాలకు పంపిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు. నర్సరీ, ఎల్.కే.జీ విధానంతో పాటు ఇంగ్లీష్ భాష కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలల్లో మొట్ట మొదటిసారిగా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రారంభించాం. ఈ ఏడాది 64 వేల మంది ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నాం. నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. సెంట్రలైజ్డ్ కిచెన్స్ డిజైన్ చేసి నాణ్యమైన హైజెనిక్ బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నాం. పదేళ్లు వాళ్లు పట్టించుకోకపోతే మేం ఆధికారంలోకి రాగానే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాం. ఒక రేవంతన్నగా మేం ఇన్ని చేసినా ఎప్పుడూ చెప్పుకోలేదు’ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కొండా సురేఖ బర్తరఫ్పై కేటీఆర్ రియాక్షన్ ఇదే -
కొండా సురేఖ బర్తరఫ్పై కేటీఆర్ రియాక్షన్ ఇదే
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి కొండా సురేఖ కేబినెట్ బర్తరఫ్, రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన 22-ఏ (22-A) నిబంధన అంశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో అమలవుతున్న 22-ఏ నిబంధన కేవలం ఒక ఆంక్ష మాత్రమే కాదని, కోటి ఎకరాల భూమిని మాయం చేసే ఒక పెద్ద మహా కుంభకోణమని కేటీఆర్ ఆరోపించారు.22ఏ నిషేధిత భూముల స్కాం పేరుతో నిర్వహించిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ నాయకులు సామాన్యుల ఆస్తులను టార్గెట్ చేసి భూ దందాలకు పాల్పడుతున్నారు. మంత్రి పదవి నుంచి కొండా సురేఖ తొలగించడానికి 22-ఏ భూముల వివాదమే. ఈ భారీ భూ కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాన సూత్రధారి అని, రెవెన్యూ శాఖ మంత్రి పాత్రధారిగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ మంత్రి కేవలం సారీ చెబితే సరిపోదు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి కూడా తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.రాష్ట్రంలో సంక్షేమం పక్కనపెట్టి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూ ఆక్రమణలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని ఎండగడతామని’ స్పష్టం చేశారు. 👉ఇదీ చదవండి : మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ ఔట్ -
రాష్ట్రంలో 30 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తోంది.. కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్, రెవెన్యూ మంత్రి కలసి భూదోపిడికి తెగబడుతున్నారని రాష్ట్రంలో గిరిజనుల, అసైన్డ్ భూములు మాయమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భూముల వివాదంతోనే మంత్రిని బర్తరఫ్ చేశారన్నారు. రాష్ట్రంలో 30 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తుందని. సీఎం సొంత నియోజకవర్గంలో భూముల కోసం గిరిజనులపై దాడి చేశారన్నారు. ఈ రోజు శుక్రవారం బీఆర్ఎస్ భవన్లో 22ఏ బాధితులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ హయాంలో భూముల విలువ భారీగా పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 22ఏ అంశంతో కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో భూదోపిడి విచ్చలవిడిగా జరుగుతుందని మంత్రులు దండుపాళ్యం ముఠాలా తయారయ్యారన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములపై సీఎం రేవంత్ కన్నేశారని మూసీ పేరుతో వేల ఎకరాలు దోచుకున్నారని ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ ఆయన సోదరుడికి ఐదు ఎకరాల భూమిని కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని కాంగ్రెస్పై కేటీఆర్ ధ్వజమెత్తారు.22ఏ వల్ల లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 22ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఓ బాధితుడు 22ఏతో మా స్థలాలకు లోన్లు రాక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ను కలిసినా సమస్య పరిష్కారం కాలేదన్నామని తమ ఆవేదనని వెల్లిబుచ్చుకున్నారు. -
మూసీ ప్రక్షాళనపై కొత్త ట్విస్ట్.. రేవంత్ సర్కార్కు ఎన్జీటీ నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళన, అభివృద్ధి ప్రాజెక్టుకు మరోసారి న్యాయపరమైన సవాల్ ఎదురైంది. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణాది బెంచ్ను ఆశ్రయించారు. ఈ అప్పీల్పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.మూసీ ప్రక్షాళన పేరుతో చేపడుతున్న పనులకు పర్యావరణ నిబంధనలు, అనుమతుల విషయంలో లోపాలున్నాయని అప్పీల్దారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ వారు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి న్యాయస్థానం ముందుకు వచ్చింది.మూసీ పరివాహక ప్రాంతం మొత్తం 55 కిలోమీటర్లు ఉంటే.. కేవలం 20 కిలోమీటర్ల మేర మాత్రమే స్టడీ చేశారు. అలాగే ఈ రీజియన్లోనే మృగవాణి నేషనల్ పార్క్ ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సమీపంలో భారీ నిర్మాణాలు చేపట్టాలన్న నిర్ణయంతో పాటు వాణిజ్య సముదాయాల ఏర్పాటుపైనా రిటైర్డ్ ఇంజినీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నోటీసులుఅప్పీల్ను పరిశీలించిన చెన్నై ఎన్జీటీ బెంచ్.. ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతుల జారీ, ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తన వాదనలను, సంబంధిత వివరాలను ట్రిబ్యునల్ ముందు ఉంచాల్సి ఉంటుంది.ఇదిలా ఉంటే.. మూసీ ప్రాజెక్టుపై గతంలోనూ ఎన్జీటీలో న్యాయపరమైన వివాదం కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్లో మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ను ఎన్జీటీ కొట్టివేసింది. దీంతో ప్రాజెక్టుకు అప్పట్లో ఊరట లభించింది.వచ్చే నెల 16న విచారణతాజాగా రిటైర్డ్ ఇంజినీర్లు దాఖలు చేసిన అప్పీల్పై విచారణను ఎన్జీటీ వచ్చే నెల 16కు వాయిదా వేసింది. దీంతో ఆ రోజు జరిగే విచారణలో పర్యావరణ అనుమతులపై అప్పీల్దారులు లేవనెత్తిన అభ్యంతరాలు, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే వివరణలు కీలకం కానున్నాయి.మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నది ప్రక్షాళనతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి, మురుగునీటి సమస్య పరిష్కారం వంటి చర్యలను ప్రభుత్వం చేపడుతోంది. అయితే ప్రాజెక్టు పర్యావరణ ప్రభావం, అనుమతుల ప్రక్రియపై మొదటి నుంచీ వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఎన్జీటీలో దాఖలైన అప్పీల్తో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: స్కామ్ కోల్కతాలో.. సోదాలు హైదరాబాద్లో! -
మీ కోసం.. ఎనీ టైమ్
సాక్షి, హైదరాబాద్: ‘నా ఆఫీసు రచ్చబండ లాంటిది. నా కార్యాలయ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి. ఉద్యోగ సంఘాల నేతలు నన్ను ఎప్పుడైనా కలవచ్చు. ఉదయమే కాదు... రాత్రిపూట కూడా వచ్చి కలవచ్చు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది’అని సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితర ప్రతినిధి బృందం సీఎంతో సమావేశమైంది. ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలను టీజీఈజేఏసీ ప్రతినిధులు వివరించారు. ఇందుకు సంబంధించి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రధానంగా ఆరు అంశాలను వినతిపత్రంలో ప్రస్తావించారు. రెండవ పీఆర్సీ నివేదిక, 51% ఫిట్మెంట్, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు, రూ.10,000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దు–ఓపీఎస్ అమలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఉద్యోగ సంఘాల గుర్తింపు తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఉద్యోగుల సమస్యలను ఆలకించిన అనంతరం సీఎం పైవిధంగా స్పందించారు. నివేదిక పరిశీలిస్తాం...తుది నిర్ణయం తీసుకుంటాం జేఏసీ ప్రతినిధులతో సీఎం మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక సమర్పించేందుకు ఇప్పటికే కమిషన్కు ప్రభుత్వం లేఖ పంపిందని, నివేదిక అందిన అనంతరం దానిని పరిశీలించి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి పీఆర్సీ, డీఏలపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ.10వేల కోట్లు విడుదల చేసిందని, ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని సీఎం తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున అనేక అంశాలు తన ముందున్నాయని, వాటితో పాటు ఇతర పరిపాలనా కార్యక్రమాల వల్ల సమయం కేటాయించడం కష్టంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆర్థిక శాఖతో సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం స్పష్టం చేశారు. అదేవిధంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి సమావేశమై అన్ని అంశాలపై చర్చించి పరిష్కార మార్గాలను ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో జేఏసీ ప్రతినిధులు దామోదర్ రెడ్డి, చావ రవి, సదానంద గౌడ్, గౌతమ్ కుమార్, కటకం రమేష్, ముజీబ్ హుస్సేన్, బి.శ్యామ్, వెంకట్, రమణారెడ్డి, భిక్షం గౌడ్ తదితరులున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగ జేఏసీ అధ్యక్షులు, డిప్యూటీ కలెక్టర్ల సంఘంవ్యవస్థాపక అధ్యక్షులు వి.లచి్చరెడ్డి, జేఏసీ నేత వడ్నాల రాజశేఖర్ కూడా సీఎంను కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం టీజీఈజేఏసీ ప్రతినిధి బృందం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి ఉద్యోగుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. -
ఎనభై.. కొత్త ట్రెండురా బై..
సాక్షి, హైదరాబాద్: 1980ల నాటి రెట్రో లుక్ ఇప్పుడో క్రేజ్గా మారింది. ఏఐ ఆధారిత ఇమేజ్ జనరేషన్ దీనికి వేదికగా మారింది. అప్పటి సెలబ్రిటీలు అనుసరించిన ఫ్యాషన్స్ను కాపీ కొడుతూ ఏఐ సాయంతో సృష్టిస్తున్న ఇమేజ్లు సోషల్ మీడియా స్టేటస్లు, పోస్టులలో అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అప్పటి దుస్తులు, జుట్టు తీరు, పరిసరాలు వంటి అంశాలను తలపించేలా ఈ చిత్రాలు ఉంటున్నాయి. ఇప్పటి వరకూ ఇలాంటివి సెలబ్రిటీలు, సామాన్యులకు పరిమితం కాగా.. ఈసారి రాజకీయ నేతలు కూడా చాలామంది ఈ లుక్ను ట్రై చేయడం విశేషం. ఇన్స్ట్రాగామ్, ఎక్స్ తదితర వేదికల్లో సాధారణ యువత నుంచి ప్రముఖుల వరకు ఈ ‘80ల ట్రెండ్’ను అనుసరిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్లోకి ఇలా... ముందుగా చాట్జీపీటీలో వ్యక్తులు తమ ఫొటోను అప్లోడ్ చేసి, దానిని 1980ల నాటి లుక్తో ఫొటోలా మార్చాలని సూచిస్తూ సవివరమైన ప్రాంప్ట్ ఇవ్వాలి. వ్యక్తి ముఖ లక్షణాలు, సహజమైన చర్మ ఛాయ, దీని ద్వారా నాటి సంప్రదాయ దుస్తులు, సహజమైన పోజులు, పాత ఫిల్మ్ కెమెరాతో తీసినట్లుగా కనిపించే ఫొటోలను కోరవచ్చు. అలాగే పాతకాలపు ఇళ్లు, సాదాసీదా దుస్తులతో అప్పటి జీవనాన్ని ప్రతిబింబించేలా కూడా చిత్రం రూపొందించుకోవచ్చు. అప్పటి పాత బస్సులు, సైకిళ్లు, దుకాణాలు, సినిమా పోస్టర్లు వంటి అంశాలను కూడా జోడించవచ్చు. రాజకీయ నాయకులు సైతం ‘రెట్రో’లోకి.. ఈ ట్రెండ్ సామాన్యులకే పరిమితం కాలేదు. ప్రధాని నరేంద్రమోదీ, రాహుల్గాందీల 80ల లుక్ను ఆయా పార్టీలు షేర్ చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ఈ ఫొటో ట్రెండ్ను ఫాలో అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అప్డేట్స్ ఖాతాలో రేవంత్రెడ్డి, రాహుల్గాంధీ కలిసున్న ఫొటోలను 1980 ట్రెండ్లోకి మార్చి పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా నాటి ట్రెండ్ ఫొటోను షేర్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంపీ రేణుకా చౌదరి సహా పలువురు ప్రముఖులు ఈ ట్రెండ్కు భిన్నంగా 80ల నాటి తమ ఒరిజినల్ ఫొటోను పంచుకున్నారు.నకిలీలతో జాగ్రత్త.. ఇదిలా ఉండగా తాజా ట్రెండ్ ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. 1980 పేరుతో నకిలీ యాప్స్ను సృష్టించి.. వాటి ద్వారా ఏపీకే ఫైల్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ రంగ నిపుణులు సూచిస్తున్నారు. -
‘సర్’తో.. ఏదో ప్రమాదం!
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదం వెనుక ఉన్న ఆంతర్యాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు గ్రహించాలని చెప్పారు. ఎస్ఐఆర్ను చాలా సీరియస్గా తీసుకోవాలని అన్నారు. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు చెప్పానని, ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను తీవ్రంగా పరిగణించాలని, అర్హులైన వారి ఓటు హక్కును కాపాడాలని సూచించారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే మాజీ ఎమ్మెల్యేలు కొమ్మిది నరసింహారెడ్డి, వంగా సుబ్బారావు, జి.సిద్ధయ్యల మృతికి సీఎల్పీ సంతాపం తెలిపింది. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర ‘ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా చూపెడుతున్నారు. కానీ ఓటర్ల సంఖ్య మాత్రం 88 కోట్లే అంటున్నారు. అంటే దాదాపు 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ 15 కోట్ల ఓట్ల తొలగింపు కారణంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేయగలగాలి. ఆ ప్రమాదం మన దరిదాపులకు రానీయకుండా మీరే జాగ్రత్త పడాలి. మీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుంది. మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. ఎస్ఐఆర్ కోసం నేను రెండు రోజులు కొడంగల్లోనే ఉన్నా. ఎమ్మెల్యేలందరూ అలానే ఫోకస్ పెట్టాలి. తెలంగాణలో జరిగిన జనగణన దేశానికి రోల్మోడల్. రాష్ట్ర నమూనాను దేశ వ్యాప్తంగా జనగణనలో చేపట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అధికారం పోయినా అహంకారం పోలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాలి. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే ఫామ్హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన సభ జరగకుండా కుట్ర చేశారు. అధికారం పోయినా వారికి అహంకారం పోలేదు. పోలీసులు, ప్రజాప్రతినిధులను దూషించి మూడు రోజుల పాటు సభ సజావుగా జరగకుండా చేశారు. అధికారులపై అనుచితంగా వ్యవహరించారు. మహిళా అధికారుల ముందు టీ షర్టులు విప్పి ఇబ్బంది కలిగించారు. సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. దళితులు నిరసన తెలిపేందుకు వెళ్లిన నేలను శుద్ధి చేసి అవమానపర్చారు. అయినా ప్రతిపక్షం కుట్రలను బలంగా తిప్పికొట్టడంతో పాటు ఆ కుట్రను ప్రజలకు తెలియజేయగలిగాం..’అని సీఎం అన్నారు. కుట్రను తిప్పికొట్టారంటూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అభినందించారు. సీఎల్పీ భేటీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, రాజనర్సింహ, ఉత్తమ్, మహేశ్ గౌడ్, శ్రీధర్బాబు, ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో పనితీరు ఆధారంగానే పదోన్నతులు ‘అసెంబ్లీలో జరిగిన ఘటనల గురించి ఫ్లాష్ సర్వే చేయించా. అందులో కాంగ్రెస్కు చాలా పాజిటివ్గా వచ్చింది. మనం ఏం చేస్తున్నామో ప్రజలు గమనిస్తుంటారు. కాంగ్రెస్ సభ్యులు లాబీల్లో తిరగడం కాదు. అసెంబ్లీలో హాజరు తగ్గకుండా చూసుకోవాలి. సభ జరిగినన్ని రోజులు ఖచ్చితంగా హాజరు కావాలి. చర్చల్లో పాల్గొనాలి. నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించాలి. ప్రజలిచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్తులో రాజకీయంగా రాణించలేరు. అసెంబ్లీలో పనితీరు ఆధారంగానే పదోన్నతులు వస్తాయి. సభలో అందరికీ వెసులుబాటుగా ఉండడం కోసం అత్యంత చారిత్రక భవనంలో శాసనమండలి నిర్వహిస్తున్నాం. అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీపాదరావు పేరిట సెంట్రల్ హాల్ ఏర్పాటు చేశాం. 22ఏలో కోటి ఎకరాలు అవాస్తవం 22ఏ అనేది అభూత కల్పన మాత్రమే. ఈ జాబితాలో కోటి ఎకరాలు ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న భూములే ఇప్పుడూ ఉన్నాయి. ప్రైవేటు వివాదాలున్నవి కేవలం 3 లక్షల ఎకరాలు మాత్రమే. ధరణిలో భారీ ఎత్తున అరాచకాలు చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ నేత ఒకరి పేరిట వెయ్యి ఎకరాలు ఎక్కించుకున్నారు. వీటన్నింటిపైనా విచారణ చేయిస్తున్నాం. అన్నీ ఒకొక్కటిగా బయటకు వస్తాయి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఎల్నినో కారణంగా వచ్చే 10 నెలలు కూడా ఇబ్బంది ఉంటుంది. కరువు వచ్చే ప్రమాదం ఉంది. ఎమ్మెల్యేలు సాగునీటిపై కాకుండా తాగునీటిపై ఫోకస్ చేయాలి. కొందరు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి అదే కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదిగేవారా?’అని సీఎం ప్రశ్నించారు. వెయ్యి రోజుల పాలనకు సహకరించిన సీఎల్పీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికీ పథకాల ప్రచారం జరగాలి: భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరం కలిసి పనిచేస్తే కుట్రలను ఎలా ఛేదించగలమో చేసి చూపించామని అన్నారు. బీఆర్ఎస్ నేతల తీరు, వారి భాష, వివక్ష పూరిత కార్యకలాపాల గురించి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసి కట్టడి చేయగలిగామని అన్నారు. అందరం ఒకటే మాట, ఒకటే బాటగా ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకోవడంలో వెనుకబడుతున్నామన్నారు. సరైన విధంగా ప్రచారం చేసుకుంటే ఆ ప్రవాహంలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేసిన పనులను ప్రతి గ్రామంలో ఇంటింటికీ ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణలోనే సామాజిక న్యాయం: పీసీసీ చీఫ్ సామాజిక న్యాయం తెలంగాణలోనే అమలవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ బీసీ కాకపోయినా బీసీలకు రిజర్వేషన్ల కోసం ముందుకొచ్చారని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. కాగా రాష్ట్రంలో పరిస్థితులను పలువురు మంత్రులు సీఎల్పీకి వివరించారు. ఎల్నినో ప్రభావం, నీటి సమస్యపై మంత్రి ఉత్తమ్, జనగణనలో బీసీ కాలమ్ గురించి పొన్నం, 22ఏ భూముల జాబితా గురించి పొంగులేటి, పాలిటెక్నిక్ విద్యార్థుల అంశంపై మంత్రి వివేక్లు వివరించారు. యాష్కీకి సీఎం శుభాకాంక్షలు ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్గా ఎంపికైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్కు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం సీఎల్పీ సమావేశం అనంతరం.. అసెంబ్లీ కమిటీ హాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాష్కీకి శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఫ్యూచర్ లేని సిటీ...
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్ సిటీ ఓ మిథ్య అని, దానికి ఎలాంటి ఫ్యూచర్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూముల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చెల్లవని, ఫ్యూచర్ లేని సీఎం..తన సోదరులతో కలిసి ఆడుతున్న రియల్ ఎస్టేట్ నాటకంలో బలిపశువులు కావొద్దని విజ్ఞప్తి చేశారు. ‘పెట్టుబడులు పెట్టి మోసపోవొద్దు. ఏటా రూ.లక్ష కూడా టర్నోవర్ లేని సీఎం సోదరుడు కొండల్రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీకి రూ.250 కోట్లు విలువ చేసే భూములను రూ.7 కోట్లకే కట్టబెట్టడంపై కోర్టులను ఆశ్రయిస్తాం. ఎనుముల అన్నదమ్ముల దోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోం..’అని అన్నారు. గురువారం మహేశ్వరం మండలం తుక్కుగూడ ఫ్యాబ్సిటీ (ఈసిటీ)లో టెస్సెరాక్ట్ కంపెనీకి కేటాయించిన భూములను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఆ కంపెనీకి భూ కేటాయింపులపై నిరసన వ్యక్తం చేసింది. అనంతరం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్రెడ్డితో కలిసి కేటీఆర్ మాట్లాడారు. ఇందులో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి.. ‘ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాయాజాలం నడుపుతోంది. వాస్తవానికి ఫార్మాసిటీ కోసం నిర్దిష్ట షరతులతో భూసేకరణ జరిగింది. ఆ భూములను ఇప్పుడు ఇతర కార్యకలాపాలకు వినియోగించడం చట్టపరంగా ప్రశ్నార్థకం. ఫ్యూచర్ సిటీ భవిష్యత్తుపై న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలు ఈ న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. రేపు కోర్టులో ఈ భూములపై వివాదాలు తలెత్తితే నష్టపోయేది పారిశ్రామికవేత్తలే. పూర్తి వివరాలు ప్రజల ముందుంచాలి ఈ భూ కేటాయింపుపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలి. సీఎం కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భూములు, రాయితీలు, మినహాయింపులు ఇవ్వడం అధికార దుర్వినియోగం కాదా? ప్రయోజనాల సంఘర్షణ కాదా? కుటుంబ పాలన కాదా? ఒకవైపు సీఎం ఎనుముల రేవంత్రెడ్డి.. మరోవైపు పారిశ్రామికవేత్త ఎనుముల జగదీశ్వర్రెడ్డిల మధ్య రూ.1,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం. దానికి మళ్లీ ప్రభుత్వ రాయితీలు, ప్రభుత్వ భూములు, మినహాయింపులు ఇవ్వాలా? సీఎం సోదరుడి సంస్థ ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్తో చేసుకున్న ఒప్పందంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు? అనామక కంపెనీకి విలువైన భూములు కేటాయించిన వ్యవహారంపై బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు? ఈడీ, ఐటీ, సీబీఐలు మాపై కేసులు పెట్టడానికే ఉన్నాయా? అధికారంలో ఉన్నవారి వ్యవహారాలు వారికి ఎందుకు కనిపించడం లేదు? తెలంగాణ..కాంగ్రెస్కు ఏటీఎంగా మారిందని ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆరోపిస్తున్నారు. తెలంగాణను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నప్పుడు దొంగలను పట్టుకోవాల్సిన హోం మంత్రి ఎక్కడున్నారు?ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు లోబడి ఉంటాయి. ఈ రంగంలోనూ అధికారానికి దగ్గర గా ఉన్న కుటుంబాలకు ప్రయోజనాలు కల్పిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేవంత్రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుటుంబానికి చెందిన సంస్థలు కూడా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలోకి రావడంపై పూర్తి వివరాలు వెల్లడించాలి.సామాన్యులకు కూడా ఇలాగే భూములు ఇస్తారా? భూ కేటాయింపుల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తే సామాన్యులు, యువత, రైతులకు కూడా ఇదే తరహాలో ప్రభుత్వ భూములు, రాయితీలు ఇవ్వాలి. మేము లక్ష రూపాయల మూలధనంతో పెట్టుబడి పెడతామని వస్తే కోట్ల విలువైన స్థలం ఇస్తారా? మాకు కూడా ఇదే రాయితీలు, మినహాయింపులు ఇస్తారా? ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టబోం. అవసరమైతే ప్రజా కోర్టును ఆశ్రయిస్తాం, రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి భూకేటాయింపులు, ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్న వ్యవహారాలను ప్రజలకు వివరిస్తాం..’అని కేటీఆర్ అన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డికి జాజుల శ్రీనివాస్ గౌడ్ వినతి
హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతి జనగణనలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కాలం చేర్చకుండా అన్యాయం చేసిందని, తెలంగాణ రాష్ట్ర తరహా లోనే ఓబీసీ కాలం చేర్చి, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీ కులగణనపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారునేడు రాష్ట్ర అసెంబ్లీలో వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ గుంజ రేణుక, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, సంచార జాతుల సంఘం రాష్ట్ర నేతలు కాటేపల్లి వీరస్వామి, తిప్పిరి శెట్టి శ్రీనివాసులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తో జాజుల శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి వినతి పత్రాన్ని అందజేశారుబీసీ కులాల లెక్కలు సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని, కేంద్ర ప్రభుత్వం తరఫున ఒత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా జాజుల కోరారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీసీలలో ఉన్న 51 కులాలను సంచార జాతులుగా డీఎన్టీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 10 నీ విడుదల చేసిందని, ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారురాష్ట్రంలోని 30 లక్షల మంది సంచార జాతులకు విముక్తి దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా జరిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఇదే సమయంలో ఈ నెలాఖరులో హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగే సంచార జాతుల విముక్తి దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని వారు కోరారు. సీఎంతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ గుంజ రేణుక, సంచార జాతుల సంఘాల నేతలు కాటేపల్లి వీరస్వామి, తిప్పిరి శెట్టి శ్రీనివాస్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఉన్నారు -
రేవంత్ సర్కార్ ‘ఫ్లాష్ సర్వే’.. తేలింది ఇదే..!
సాక్షి, హైదరాబాద్: సీఎల్సీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల ఘటనలపై ఫ్లాష్ సర్వే చేయించానని.. బీఆర్ఎస్ గ్రాఫ్ చాలా పడిపోయిందన్నారు. ప్రజలు.. బీఆర్ఎస్ నేతల తీరునే తప్పుపట్టినట్లు సర్వేలో తేలిందన్న రేవంత్.. ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీకి అండగా నిలబడ్డారు. మొన్నటి ఘటనలో పోలీసులు చాలా ఓర్పుతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.‘‘కోటి ఎకరాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. కానీ 3.06 లక్షల ఎకరాలు మాత్రమే 22ఏలో ఉంది. మిగతాది అంతా ప్రభుత్వ, అటవీ భూములే. నేను ‘సర్’ కోసం రెండు రోజులు కొడంగల్లో ఉన్నాను. అందరూ అదే విధంగా ఫోకస్ చేయాలి. ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సభను నిర్వహిస్తున్నాం’’ అని రేవంత్ చెప్పారు.శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్ కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారు. ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు తెలియజేసిన మిమ్మల్ని అభినందిస్తున్నా. జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టాం. సభ్యులు తప్పనిసరిగా సభలో చర్చల్లో పాల్గొనండి. సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందరికీ వెసులుబాటుగా ఉండాలని అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. రేవంత్ పరిపాలనా వైఫల్యం’
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చేందుకు పవర్ లేదని, ప్రతి పక్షాల పీక నొక్కేందుకు మాత్రం కాంగ్రెస్కు పవర్ ఉందా? అని నిలదీశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు. రాష్ట్ర రైతులకు కనీసం ఇప్పుడు 7 నుంచి 8 గంటల కరెంట్ కూడా రావడం లేదని హరీష్రావు విమర్శించారు. ఈ రోజు(గురువారం, సెప్టెంబర్ 10వ తేదీ) తెలంగాణ భవన్ నుంచి మాట్లాడిన హరీష్రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతో తెలంగాణ రైతాంగ కష్టాలు చూడాల్సి వస్తుందన్నారు. ‘ఒకవైపు నీళ్లు ఇవ్వలేవు.. కరెంట్ ఇవ్వలేవు.. ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా?’ అని ప్రశ్నించారు. అసలు రైతులకు ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారని సూటిగా నిలదీశారు. భద్రాద్రి, కొత్తగూడెం పవర్ ప్లాంట్ ఎందుకు బంద్ చేశావ్ రేవంత్ అని ప్రశ్నించారు. ఇక యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నడపలేకపోతుంది ఈ ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, రేవంత్ పరిపాలనా వైఫల్యమని హరీష్ మండిపడ్డారు. ఇదీ చదవండి: ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు సరిపోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి -
ఇందిరమ్మ ఇళ్లు.. ఐదు లక్షలు సరిపోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షల సాయం సరిపోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో రూ.5 లక్షలతో పూర్తయ్యే ఇల్లు ప్రస్తుతం రూ.12 లక్షల వరకు ఖర్చవుతోందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయం పెంచాలని సూచించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఇళ్ల నిర్మాణం కోసం తమ భార్యల బంగారం కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణంలోనే లేబర్ కాస్ట్ దాదాపు రూ.3 లక్షల వరకు అవుతోంది. అందువల్ల ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల సాయాన్ని పెంచే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇళ్ల సంఖ్య కొంత తగ్గించినా ఫర్వాలేదని, అయితే ఒక్కో ఇంటికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.కాగా, ప్రస్తుతం ప్రభుత్వం సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో సామాజిక వర్గాల వారీగా కేటాయింపులపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో వైఎస్సార్ ప్రభుత్వం మైనార్టీలకు ప్రత్యేకంగా ఇళ్ల కేటాయింపుపై జీవో ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం రెండు లక్షల ఇళ్లు ఇస్తామని చెబుతోందని, ఆ రెండు లక్షల ఇళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత శాతం కేటాయిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ఫ్యూచర్ సిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. -
ఆ రెండూ కుట్రలే!
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను, ఆయన మాతృమూర్తిని కించపరిచి అవమానించటం, అనంతరం ఆయనకు మద్దతుగా నిరసన తెలిపిన దళితులు నడిచిన ప్రాంతాన్ని శుద్ధి చేయటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలను కుట్రలుగానే పరిగణిస్తున్నామని చెప్పారు. ఇందుకు వ్యూహకర్తలు, ప్రత్యక్షంగా అమలు చేసిన వారిపై ఆయా సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, విచారణ జరిపి జైలుకు పంపే ఏర్పాటు చేస్తామని అన్నారు. ముంబయిపై దాడి చేసిన కసబ్ లాంటి ఉగ్రవాదులకు కొన్ని అంశాలను నూరిపోసి ఉన్మాదులుగా మార్చి మన దేశంపైకి పంపిన తరహాలోనే, కేసీఆర్ కూడా తన అనుచరులకు ఇలాగే నూరిపోసి ఉన్మాదులుగా మార్చి ఉసిగొల్పారని ఆరోపించారు. దాంతో పేట్రేగిన నేతలు ఆ రోజు దళిత స్పీకర్ను కించపరచటమే లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆ కార్యక్రమానికి ముందురోజు ఫామ్హౌస్లో జరిగిన భేటీలో చేసిన కుట్ర మొదలు ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న ఘటనలపై సంపూర్ణ విచారణ చేపడతామన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు జాయింట్ కమిషనర్ విజయకుమార్ను విచారణాధికారిగా నియమిస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం శాసనసభలో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. కేసీఆర్ నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన దళితులను అవమానించేలా ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసినట్టుగా చెబుతున్న వ్యవహారంపై బుధవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చను ముగిస్తూ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. కోర్టులు బెయిల్ ఇచ్చినా ప్రజలు బెయిల్ ఇవ్వరు ‘చట్టాలు, సెక్షన్లను అడ్డుపెట్టుకుని కొంతమంది కోర్టుల నుంచి బెయిల్ పొందవచ్చు. కానీ తెలంగాణ సమాజం మాత్రం వారికి బెయిల్ ఇవ్వదు. జరిగిన తప్పును అంగీకరించి క్షమాపణ చెబితే కిరీటం ఊడిపోతుందా? స్థాయి తగ్గుతుందా? సభాపతిని అవమానించిన విషయంలో ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుంది. చట్టపరంగా శిక్షించే వరకు వెనక్కి తగ్గబోదు. సభాపతి పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్కుమార్ మనసుకు గాయం చేసేలా ఉన్మాదంతో వ్యవహరించిన వారిని వదిలే ప్రసక్తే లేదు. వ్యక్తినే కాకుండా తల్లిని కూడా అవమానించే స్థాయికి వెళ్లారు. మహిళలను శక్తిగా కొలిచే సమాజంలో ఇలాంటి చర్యలకు చోటుంటుందా? సభలో అధికారులపై దాడులు చేయడంతోపాటు స్పీకర్ కుర్చీని అవమానించేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. దళితులపై అవమానకర చర్యలు స్పీకర్ను అవమానించిన ఘటనకు నిరసనగా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఫామ్హౌస్ వద్ద డప్పు దరువులతో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపారే తప్ప ఎలాంటి ఉన్మాదానికీ పాల్పడలేదు. దళిత సోదరులు తమ మనసులోని భావాలను వ్యక్తం చేసేందుకు డప్పును ఒక సాధనంగా ఉపయోగిస్తారు. నిరసన తెలిపిన దళిత ప్రతినిధులను పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేసీఆర్పై ఉంది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించి, దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించడం ద్వారా దళితనులను తీవ్రంగా అవమానించారు. దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తే.. మరి దొరతనం, ఆహంకారంతో ఉన్న ఆ నేతల మనసుల్లో పేరుకుపోయిన అంటరానితన భావజాలాన్ని ఎలా శుద్ధి చేస్తారు? యాసిడ్తో కడగాలా? దళితుడు దుక్కి దున్ని పంట పండిస్తేనే అందరి కడుపులు నిండుతున్నాయి. మనకు అన్నం పెడుతున్న వారిని ఇంతగా అవమానిస్తారా? దళితులను అవమానపరుస్తూ వారిని కించపరిచిన ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలి. అప్పుడే వారికి దళితులు ఎదుర్కొంటున్న వివక్ష ఎలాంటిదో తెలిసొస్తుంది. ఖర్గేనూ అవమానించారు.. సమాజంలో అశాంతిని ప్రోత్సహించి రెండు వర్గాల మధ్య వైరాన్ని పెంచాలని ప్రయత్నిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నవారు ధనబలంతో వ్యవస్థలను లొంగదీసుకోవాలని చూస్తున్నారు. మేము మాత్రం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దేశంలోని కోట్లాది ప్రజలకు నమ్మకం, భరోసా కల్పించింది. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో పుట్టి, రజాకార్ల దాడుల్లో తల్లిని కోల్పోయి, కార్మిక నాయకుడిగా ఎదిగి జాతీయ స్థాయికి చేరుకున్న నేత మల్లికార్జున ఖర్గేను అవమానించడం బాధాకరం. ఉత్తరాఖండ్లోని ఓ మైదానంలో ఖర్గే సభలో పాల్గొన్న అనంతరం ఆగస్టు 10న బీజేపీ అనుబంధ సంస్థ అదే మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం హేయమైన చర్య. ఆ ఘటనను ఈ సభ ముక్తకంఠంతో ఖండిస్తోంది. తాజాగా తెలంగాణ వేదికగా బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వ్యవహారానికి తెరలేపింది. వారిని వదిలే ప్రసక్తే లేదు.. విద్యా రంగంలోని అక్రమాలు, ధరణి అక్రమాలు, 22ఏ రాద్ధాంతంపై శాసనసభలో చర్చించాలని ప్రభుత్వం భావించింది. ఈ అంశాలపై చర్చ జరిగితే గత పదేళ్లలో జరిగిన దురాగతాలు, రాష్ట్రంపై పేరుకుపోయిన అప్పుల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుందనే భయంతోనే చర్చను అడ్డుకునేందుకు ఈ కుట్రలు పన్నారు. సభను అడ్డుకోవడమే కాకుండా స్పీకర్ను అవమానించే స్థాయికి వెళ్లడం అత్యంత దురదష్టకరం. కాంగ్రెస్ పార్టీ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయానికి బాటలు వేసింది. కాంగ్రెస్ విధానం సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడమే..’ అని సీఎం స్పష్టం చేశారు. స్పీకర్ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తి లేదని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే విషయంలో ప్రభుత్వం స్పీకర్కు పూర్తిగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
గవర్నర్ ఇవే అడిగారు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇవాళ (బుధవారం) లోక్భవన్లో గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ నేతలు.. అసెంబ్లీ ఘటనలో పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతుందన్నారు.‘‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశాం. వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, యూరియా కొరత, రైతు బీమా, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు గవర్నర్కు ఫిర్యాదు చేశాం. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యపై ఫిర్యాదు చేశామని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ నల్ల టీ షర్ట్స్ వేసుకున్నట్టే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ టీ షర్ట్స్ వేసుకున్నాము. బ్లాక్ టీ షర్ట్ తో అసెంబ్లీకి వెళ్తుంటే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు.’’ అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు పట్టుకున్నారు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారు. దాడి చేసి మా పైనే ఉల్టా కేసులు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావు కోరుకున్నారు. వేముల వీరేశం, కుంభం అనిల్రెడ్డి, నర్సారెడ్డి ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గరకు వచ్చారు. వేల మంది కాంగ్రెస్ గూండాలను ఎర్రవల్లి ఫాం హౌస్పై దాడి చేసేందుకు ఉసిగొల్పారు. మేము అనని మాటలను అన్నట్టు స్పీకర్కు ఆపాదించారు. దళిత స్పీకర్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్పీకర్ను అవమానిస్తున్నారు...శాసన సభ కాదు.. దుశ్శాసన సభలా మార్చారు. చావు డప్పు ఎప్పుడు కొడతారో.. మనందరికీ తెలుసు. ఎర్రవల్లి ఫాం హౌస్ దగ్గర చావు డప్పు కొట్టారు. అసెంబ్లీ బయట జరిగిన ఘటనపై సీఎస్ డీజీపీని పిలిపించి మాట్లాడుతానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు మంచివి కాదని గవర్నర్ మాతో చెప్పారు.’’ అని కేటీఆర్ వివరించారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్ -
కేసీఆర్కు చెడు జరగాలని కాంగ్రెస్ కోరుకోదు: మహేష్ కుమార్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై వస్తున్న రాజకీయ విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్కు చెడు జరగాలని కాంగ్రెస్ ఎప్పుడూ కోరుకోలేదని.. ఇకపై కూడా కోరుకోదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం పాడవ్వాలని ఎవరు కోరుకుంటున్నారని, ఆయన ద్వారా ఎవరు లబ్ధి పొందాలని చూస్తున్నారని ప్రశ్నించారు.బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విషయంలో జరుగుతున్న రాజకీయ విమర్శల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మరణాన్ని కాంగ్రెస్ కోరుకుంటోందన్న ప్రచారాన్ని ఖండించారు. ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించే సంస్కృతి కాంగ్రెస్దని స్పష్టం చేశారు. కేసీఆర్కు చెడు జరగాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదని మరోసారి తేల్చిచెప్పారు.కేసీఆర్ గాయపడిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అధికారులను అప్రమత్తం చేసి కేసీఆర్కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారని, ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా సూచించారని తెలిపారు. అలాంటి తమ పార్టీపై కేసీఆర్ ఆరోగ్యం విషయంలో నిందలు వేయడం సరికాదన్నారు. వారి ఇంటి గొడవలను కాంగ్రెస్కు ఆపాదిస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. అలాగే, ప్రతిపక్ష నాయకుడు నూరేళ్లు బతకాలని కోరుకుంటాం. కేసీఆర్ విషయంలో మా ఎమ్మెల్యే బాధతో మాట్లాడారు. మా పార్టీ షాద్నగర్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి అభిమాని. అందుకే రేవంత్ రెడ్డిని తిడుతుంటే బాధతో కేసీఆర్పై అలా మాట్లాడారు. స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు చాలా దారుణం’ అని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సంస్కృతికి వాజ్పేయి, జైపాల్ రెడ్డి ఉదాహరణలు. వాజ్పేయి ఆరోగ్యం బాగోలేకపోతే అమెరికాకు పంపించి చికిత్స చేయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. జైపాల్ రెడ్డికి బైపాస్ సర్జరీ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష విషయంలో కాంగ్రెస్ కుటుంబం మానవతా దృక్పథాన్ని చూపింది. ఇలాంటి రాజకీయ సంస్కృతి మంచిది కాదు. దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి గౌరవించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది’ అని అన్నారు. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ -
‘ఫాంహౌస్లో కుట్ర చేసి సభను అడ్డుకున్నారు’.. అసెంబ్లీలో సీఎం రేవంత్
మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..అణిచివేతకు,దోపిడీకి,పరాయిపాలను కాంగ్రెస్ పుట్టింది సీఎం రేవంత్ అణిచివేతకు,వివక్షతకు గురైన జాతులకు రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించిందిఅంబేద్కర్ రచిచించిన రాజ్యంగా మనదేశం బలంగా నిలబడగలిగేలా చేసిందిపాకిస్థాన్,బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి ఖర్గే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారుఖర్గే చిన్న తనంలో రజాకార్ల దాడిలో తల్లిని కోల్పోయారుఆర్ఎస్ఎస్ శుద్దీకరణ కార్యక్రమాన్ని సభ ఖండిస్తోందిశుద్ధీకరణ కార్యక్రమంలో పాల్గన్న వారిపై చర్యలు తీసుకోవాలిఫాంహౌస్లో కుట్ర చేసి సభను అడ్డుకున్నారుధరణలో లోపాలు,22ఏపై రాద్ధాంతాలు సభలో చర్చించాలని అనుకున్నాంఅప్పులు,తప్పులు మీద చర్చ జరిగితే సమాధి అవుతారని కేసీఆర్ భయపడ్డారు భావోద్వేగానికి ఉసిగొల్పి దాడులు చేయించారుమీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారికి ఉగ్రవాదులకు పెద్దతేడా ఏంలేదుస్పీకర్ కుర్చీని అవమానించేలా మాట్లాడారుఅనాదిగా ఈ సమాజం మహిళలను పూజిస్తోంది. అలాంటి తెలంగాణ నేల మీద తల్లిని అవమానించేలా మాట్లాడారుమా సభ్యులు,నేతలు ఉన్మాదంగా ఫాంహౌస్ దగ్గరకు వెళ్లలేదుమాదిగ బిడ్డలకు డప్పు జీవితంలో భాగంకేసీఆర్ ఫాంహౌస్ దగ్గర డప్పు కొట్టడం నిరసనలో ఓ భాగంకేసీఆర్ను అసభ్య పద జాలంతో దూషించాలనే ఆలోచన మాకు లేదుమనసులోని భావనను డప్పుతో చెప్పాలని అనుకున్నాందొరా.. నీ దొర అహంకారంతో మమ్మల్ని అవమానించకుచెప్పులు కుట్టిన చేతులు డప్పు కొట్టడమే కాదు రాష్ట్రాన్ని పాలిస్తాయిడప్పు కొట్టి నిరసన చేపట్టడం నేరమా?కేసీఆర్కు బాధ్యత ఉందని ప్రజలను అర్ధం చేసుకోవాలిమధ్యయుగాల్లో చక్రవర్తులు కూడా ఇంత నీచంగా వ్యవహరించలేదుప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్ ఇది: హరీష్మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్..ఇది బీఆర్ఎస్ సస్పెన్షన్ కాదు.. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సస్పెన్షన్ప్రజలు “మా సమస్య గురించి మాట్లాడండి” అంటుంటే..రేవంత్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ని బయటకు పంపండి అంటున్నాడు.నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి.మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..కాంగ్రెస్ పార్టీలో భట్టి ముఖ్యమంత్రి అయితే మొదట సంతోష పడేది బీఆర్ఎస్.చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీకి లేదుమల్లారెడ్డి తిరుమలలో ఉంటే ఎలా సస్పెండ్ చేస్తారు?.స్పీకర్ ఒక పేరు.. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ఒక పేరు చదివారు.చావు డప్పు కొట్టడానికి దళితులు వెళ్తే నర్సారెడ్డి ఎవరు?యాదాద్రిలో అందరి ముందే భట్టి విక్రమార్కను కింద కుర్చోబెట్టారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కుల అహంకారం ఉంది..తెలంగాణలో శాంతిభద్రతలు సీఎం పరిధిలోకి రావా?లా అండ్ ఆర్డర్ సరిచేయాల్సిన బాధ్యత సీఎంపై లేదా?సభలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు.సభ బయట కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదా?స్పీకర్ను కలుస్తాం.. అంటే టైం ఇవ్వడం లేదు.బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫ్లకార్డులు తెస్తే ఎందుకు ఆపడం లేదు..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం కనీసం అసెంబ్లీలో నిలుచోనివ్వడం లేదు.అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి సునీతా లక్ష్మారెడ్డి , ఎమ్మెల్యే కోవా లక్ష్మీ చిట్ చాట్మహిళలపై దాడి జరిగితే కనీసం పట్టింపు లేదుస్పీకర్ బాధపడ్డారు అని తెలుసుకొని కేసీఆర్ విచారం వ్యక్తం చేయాలని మాకు చెప్పారు.మంత్రులు అమ్మ గురించి మాట్లాడుతున్నారు.. మరి మేము కూడా మహిళలమే కదా!మాపై దాడి జరిగితే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సానుభూతి వస్తుంది.. ఫోన్ చేసి చెప్తున్నారు.సభ జరిగినప్పుడు బయట ఏదైనా ఘటన జరిగితే అసెంబ్లీలో ప్రకటన చేస్తారు.కానీ ఇక్కడ అసెంబ్లీ ఆవరణలో జరిగితే కనీసం ప్రకటన లేదు.దెబ్బ తగిలింది మాకు.. మా గురించి మాట్లాడడం లేదు.వాళ్ళు ఏమో అమ్మ గురించి.. వాళ్ళ అక్కల గురించి ఆలోచించారుసభలో మాట్లాడేందుకు మాకు అవకాశం ఇవ్వకుండా నాటకాలు అంటున్నారు.మాకు జరిగిన అవమానంపై అధికార మహిళా సభ్యులు మా వైపు చూడలేదు.మాపై ఇష్టం వచ్చినట్లు మగ పోలీసులు ప్రవర్తించారుసుధీర్ రెడ్డి, నవీన్ రెడ్డి లేకుంటే మేము కింద పడిపోయే వాళ్ళంహరీష్ రావు, కేటీఆర్ చుట్టూ ఆడ పోలీసులను పెట్టారు.మహిళ శాసన సభ్యుల చుట్టూ మగ పోలీసులను పెట్టి రాజకీయం చేశారు.మేము మహిళలమే కదా.. మాకు జరిగిన అవమానంపై సభలో ఎందుకు చర్చ పెట్టరు?దళితుల ఆత్మ గౌరవం తెలంగాణ ఆత్మగౌరవమని భట్టి విక్రమార్క అంటున్నారుమహిళల ఆత్మ గౌరవం తెలంగాణ ఆత్మ గౌరవం కాదా!మాకు జరిగిన అవమానంపై సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి.ఎక్కడ ఏం జరిగిన వెంటనే ప్రభుత్వానికి సమాచారం వస్తుంది.మాపై జరిగిన దాడి గురించి ప్రభుత్వానికి ఎందుకు సమాచారం రాలేదు.సీఎంకు మహిళల గురించి పట్టింపు లేదు .శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం మా మనోభావాలు దెబ్బతినేలా వ్యవహారిస్తున్నారు కాసేపట్లో లోక్భవన్కు బీఆర్ఎస్ నేతలు..ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీభవిష్యత్తు కార్యాచరణపై చర్చకాసేపట్లో లోక్భవన్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగవర్నర్ను కలవనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుఅసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత.బీఆర్ఎస్ల్వీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేల ప్రయత్నం.కేటీఆర్, హరీష్రావును అడ్డుకున్న మార్షల్స్.స్పీకర్ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రయత్నం.అడ్డుకున్న మార్షల్స్పై ఎమ్మెల్యేల ఆగ్రహం. స్పీకర్ను కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.స్పీకర్ చాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆపేసిన మార్షల్స్సస్పెండ్ అయ్యారు కాబట్టి ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లొద్దన్న చీఫ్ మార్షల్ కరుణాకర్.స్పీకర్ను కలవనీయకపోవడంతో మరికాసేపట్లో మీడియా పాయింట్ వద్ద మాట్లాడనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ చిట్ చాట్.బీఆర్ఎస్ రెండు అంశాలపై సభలో ఆందోళన చేసింది.మహిళలపై దాడి చేస్తే నిరసన చేయవద్దా?మాజీ సీఎం, తెలంగాణ సాధించిన నేత చావు కోరుకుంటే ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోరా?సెషన్ మొత్తం ఎలా సస్పెండ్ చేస్తారు?దళితుల పట్ల ప్రేమ ఉన్నట్లు కాంగ్రెస్ ప్రవర్తిస్తుంది.దళితుల పట్ల ప్రేమ ఉంటే భట్టి విక్రమార్కను సీఎం చేయాలి. తెలంగాణ అసెంబ్లీ కాసేపు వాయిదా.. మండలి నుంచి బీఆర్ఎస్ వాకౌట్శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుసభలో మాట్లాడటానికి మాకు అవకాశం ఇవ్వడం లేదు..అందుకే మేము వాకౌట్ చేస్తున్నాం: మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి.ప్రభుత్వం తన తప్పును అర్థం చేసుకొని యావత్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి..సభ ఉన్నత విలువలు పాటించాలి..మా అధినేత కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు కొడతారట.ఎక్కడైనా ఇలా ఉంటుందా?.దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉంది..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.మా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేశారునిన్న సభలోకి వస్తే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదుసభ్యుల సస్పెన్షన్ ఎత్తివేయాలిమా సభ్యులు సభలోకి వచ్చేవరకూ మా నిరసన కొనసాగుతుంది..మా సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలినిన్న పెట్టిన తీర్మానం పై చర్చ జరగాలి.. వీరిపై సస్పెన్షన్..కేటీఆర్, హరీష్రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డిఅనీల్ జాదవ్, కోవాలక్ష్మీ మాణిక్రావు, గంగుల కమలాకర్, సంజయ్ కుమార్, సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డిమల్లారెడ్డి, తలసాని, చింత ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సస్పెండ్..శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలి: శ్రీధర్బాబుఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన స్పీకర్కేటీఆర్, హరీష్రావు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు సస్పెండ్మొత్తం 22 మంది సభ్యులపై సస్పెన్షన్. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనకేసీఆర్ నివాసంపై దాడికి యత్నించారని ఆందోళన జస్టిస్ కావాలంటూ డిమాండ్. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..రాహుల్ గాంధీపైన విమర్శలు చేస్తే నేను ఒప్పుకోము.ఎవరి చావును కాంగ్రెస్ పార్టీ కోరుకోదు.కేసీఆర్ ఆరోగ్యంగా వందేళ్ళు బతకాలని కోరుకుంటాం.ప్రజలకు కేసీఆర్ సేవ చేయాలని కోరుకుంటాం.కరీంనగర్లో కేటీఆర్.. రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చావు అని అన్నారుదళితులు నడిచిన చోట శుద్ధి చేశారు.. ఏ కాలంలో ఉన్నామో తెలియడం లేదు.సభ సజావుగా నడిచేలా ప్రతిపక్షం సహకరించాలిబీఆర్ఎస్ ఆందోళన విరమించాలి.లేదంటే సభ నడపడానికి మేము కార్యాచరణ తీసుకుంటాంశాసనసభలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఆందోళనపోడియం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలువీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలుడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..అసెంబ్లీలో సభాపతితో వాగ్వాదం చేయడం కరెక్ట్ కాదు.సభ్యసమాజం ఆశ్చర్యపోయే విధంగా బీఆర్ఎస్ నాయకుల తీరు ఉంది.బీఆర్ఎస్ చేసిన అవమానాలను భరించడానికి ఇక ఓపిక లేదు.ఇంకా ఎంతకాలం దళితులను అవమానిస్తారు?బీఆర్ఎస్ సవాల్కు భయపడే వాళ్ళు ఎవరూ లేరు.మీ బెదిరింపులకు ఉడత ఊపులకు ఎవ్వరూ భయపడే వాళ్ళు లేరు!ఇలా దాడులు చేసి బతుకుదాం అనుకుంటున్నారు కేటీఆర్ కామెంట్స్..మాపై కేసులు పెట్టడం సహజమేమా ఫొటోలను ఏఐ ఉపయోగించి మార్ఫింగ్ చేసి వాడుతున్నారుసైబర్ క్రైమ్లో మేము కూడా ఫిర్యాదు చేస్తాం.శాసన మండలి..మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి కామెంట్స్..మా సభ్యులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలిసభ్యుల వాదనలను వినిపించేలా అవకాశం ఇవ్వాలికుట్రలో భాగంగానే పోలీసులతో ఆ విధంగా వ్యవహరించేలా చేశారుభట్టి విక్రమార్క కామెంట్స్..బీఆర్ఎస్ దుర్మార్గాలను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.బీఆర్ఎస్ నేతలు స్పీకర్ తల్లిని దూషించారు.ఎర్రవల్లిలో బీఆర్ఎస్ చేపట్టిన శుద్ధి ఘటనపై సభలో చర్చ జరగాలి.రోడ్డుపై దళితులు నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేసిన దుర్మార్గపు పార్టీ బీఆర్ఎస్.బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తన మంచిది కాదు.అంతా చేసి సభకు వచ్చి న్యాయం కావాలంటారా? ఆత్మ గౌరవంతో తెలంగాణ ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు?గత పదేళ్లలో ప్రతిపక్షాలు పొడియంలోకి వచ్చి ఆందోళన చేయలేదు.బీఆర్ఎస్ చేసిన శుద్ధి కార్యక్రమంపై సభలో చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేతల ఆగ్రహంసభలో బీఆర్ఎస్ ఆందోళనపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్శుద్ధి పేరిట బీఆర్ఎస్ చేసిన కార్యక్రమంపై చర్చ జరపాలని మంత్రి డిమాండ్దళితులు ఆందోళన చేస్తే శుద్ధి కార్యక్రమం చేస్తారా?దళితులను ప్రతిక్షణం అవమానిస్తున్నారుబీఆర్ఎస్ ఆందోళనపై స్పీకర్ అసంతృప్తిసీనియర్ ఎమ్మెల్యేగా ఉండి పొడియం ముందు ఆందోళన ఎలా చేస్తారు?ఏ అంశం అయినా రాత పూర్వకుండా ఇస్తే పరిశీలన చేస్తా: స్పీకర్. అసెంబ్లీలో గందరగోళం.. అసెంబ్లీ మీడియా పాయింట్..ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కామెంట్స్.దళితులను అవమానించినందుకు ముందు శాసనసభలో క్షమాపణ చెప్పి సభలోకి అడుగు పెట్టాలిలేదంటే వాళ్ళను సభలోకి అడుగుపెట్టనీయంకేసీఆర్కు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదని చెప్పాలిబీఆర్ఎస్ అనేది అంటరాని పార్టీబీఆర్ఎస్ను తరిమి కొట్టడమే మా లక్ష్యంబీఆర్ఎస్లో ముగ్గురో లేక కోటి మంది కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీనో తేల్చుకుందాంకొట్లాడాలి కానీ బట్టలు విప్పుకుని తిరగాలా?అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా ఉనికి కోసం అలజడులు సృష్టిస్తున్నారుదళితులతో పెట్టుకున్న ఏ పార్టీ కి మనుగడ లేదుప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ కామెంట్స్దళితులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం దారుణంబీఆర్ఎస్ పార్టీ దళితులపై చిన్న చూపు చూస్తుందిదళిత స్పీకర్ను అవమానించారుఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలిలెందటే బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీగా చూడాల్సి వస్తుంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో రగడ..అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్..దళితులకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలికేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.కాసేపట్లో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.ప్రశ్నోత్తరాలతో సభ మొదలుకానుంది.నేడు పంచాయతీరాజ్ సవరణ చట్టానికి సంబంధించిన కీలక బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు.తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో సవరణ బిల్లు-2026పై సభలో చర్చ జరగనుంది.గ్రామీణపాలన, పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అంశాల నేపథ్యంలో ఈ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య చర్చ కొనసాగనుంది. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం..మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం,కేసీఆర్ నివాసం వద్ద పోలీసుల సమక్షంలో ర్యాలీ,కేసీఆర్ చనిపోవాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బెదిరింపులు,రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్బీజేపీ వాయిదా తీర్మానం..అసెంబ్లీలో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్,ఉద్యోగుల పెండింగ్ డీఏల చెల్లింపులపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి -
లోక్భవన్కు బీఆర్ఎస్.. కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల వేడి కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. బీఆర్ఎస్ నేతలు నేడు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవాలని నిర్ణయించింది. గత రెండు రోజులుగా కొనసాగిన పరిణామాలపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటు అధికార కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్కు సిద్దమైంది. ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు లోక్భవన్కు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వెళ్లాల్సి ఉంది. అయితే అనుకున్న టైం కంటే అరగంట ముందుగానే గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. పది మంది ఎమ్మెల్యేల బృందం ఆయన్ని కలవనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా పోలీసుల జులుం.. మహిళా ఎమ్మెల్యేలతో ప్రవర్తించిన తీరు, ఎమ్మెల్సీల అరెస్టులు.. నిన్న ఎర్రవల్లికి వెళ్తుండగా అడ్డగింతలు.. ఇలా ఇటీవల చోటుచేసుకున్న దాడుల ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులపై కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్కు సిద్ధమవుతోంది. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారాన్ని రేవంత్ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. మధుతో పాటు నవీన్కుమార్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయించే దిశగా.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇటు ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరై క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే.. అప్పటిదాకా బీఆర్ఎస్ నేతలకు మైక్ ఇవ్వకూడదని స్పీకర్ను కోరాలని చూస్తోంది. నేడు మండలిలో కీలక చర్చమరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజుకు చేరుకోనున్నాయి. శాసనమండలిలో తాతామధు వ్యవహారంపై చర్చ జరగనుంది. ఈ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన శాసనసభలో ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి.. తాతా మధు, నవీన్కుమార్ రెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకుగానూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలిసి దాడుల ఘటనలపై ఫిర్యాదు చేయనుండగా.. మరోవైపు అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి అవకాశం ఉండటంతో తెలంగాణ రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏం తమాషా చేస్తున్నారా? లోపలేస్తా.. -
కేటీఆర్,హరీష్ రావు విడుదల.. సీఎం రేవంత్పై తీవ్ర ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ గుండాలను కేసీఆర్ ఇంటి మీదకు పంపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బోయిన్పల్లి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా ఎమ్మెల్యేల మీద హేయంగా దాడి చేశారని అందరి కంటే ముందు చావు వచ్చేది కాంగ్రెస్ పార్టీకేనని 600కు పైగా హామీలిచ్చి వెయ్యిరోజులైనా ఇంకా వాటిని నేరవేర్చలేదని..స్కూటీలు ఇస్తానని లూటీలు చేశారని రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు. దశాబ్దాల తెలంగాణ కలను కేసీఆర్ నెరవేర్చారని ప్రపంచ పటంలో హైదరాబాద్ను విశ్వనగరంగా నిలబెట్టారని కొనియాడారు. అనంతరం జవహర్ నగర్ పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హరీష్ రావు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ చేసే దమనకాండను రాష్ట్ర ప్రజలంగా గమనిస్తున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్తో హెడ్ లైన్స్ మారుతాయి కానీ ప్రజల జీవితాలు మారవని చెప్పారు. హరీష్ రావు మాట్లాడుతూ.."తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించారు. యూరియా యాప్లు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఉద్యోగుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. నయాపైసా ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. సబితక్క గొంతు మీద మగ పోలీసు చేయి వేసి నొక్కారు అసెంబ్లీ గౌరవ సభను రేవంత్ కౌరవసభగా మార్చారు." అన్నారు. కాగా ఈ రోజు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి.ఏం జరిగింది?కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు ఇచ్చిన పిలుపుతో యాదాద్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ ఇంటిని ముట్టడించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి నివాసం ముట్టడికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ నుంచి ఎర్రవల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో కేసీఆర్కు మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద భారీ ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. బొల్లారం చౌరస్తా నుండి ఎరవెల్లి వైపు రోడ్డుపై కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్లారు. హకీంపేట్ దాటిన తర్వాత కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్ని బోయన్ పల్లి, హరీష్ రావును జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించారు. కాసేపటి క్రితమే వారిద్దరిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరు మీడియా ఎదుట మాట్లాడారు. ఇదీ చదవండి: పోలీస్స్టేషన్లో కేటీఆర్, హరీష్ -
‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్ను ఓదార్చిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసన సభాపతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దు చేయించే దిశగానూ ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మంగళవారం అసెంబ్లీ సమావేశాల బ్రేక్ టైంలో.. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇద్దరూ స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఆయన చాంబర్లో కలిశారు. నిన్నటి పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని స్పీకర్కు భరోసా ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని.. ఎవరినీ వదిలపెట్టబోమని స్పష్టం చేశారు.సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఈ పరిణామంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సభలో నిన్న కంటతడి పెట్టారు. అయితే స్పీకర్ పట్ల బీఆర్ఎస్ నేతల తీరు అమానుషమని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది చీకటి రోజు అని.. బాధ్యులపై చర్యలు తప్పవంటూ సభలో మాట్లాడారు. ఈ వ్యవహారంలో తదుపరి చర్యలపై ఈ ఉదయం సీఎం రేవంత్రెడ్డి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వ్యవహారశైలిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న అంశంపై న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీలో తీర్మానం చేసి మండలికి పంపాలని.. ఇద్దరి సభ్యత్వాన్ని రద్దు చేయించే అంశాల్ని ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డిలను పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. మరోవైపు.. అసెంబ్లీ వద్ద సోమవారం చోటుచేసుకున్న ఆందోళన సందర్భంగా మహిళా పోలీసులతో బీఆర్ఎస్ నేతలు అనుచితంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మహిళా కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, వారితో అనుచితంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: తిట్టింది నీ తల్లిని కాదు.. హరీశ్రావుపై స్పీకర్ ఆగ్రహం -
అరెస్టులతో ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారు: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్టులపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు తమ పార్టీ ప్రజాప్రతినిధులపై దాడులు చేసి, ఇప్పుడు వారినే అరెస్ట్ చేయడం దురదృష్టకరమని ఆరోపించారు. హైకోర్టు చెప్పినా పట్టించుకోకుండా కేసులు పెట్టి అరెస్టు చేయడం చట్టాన్ని, న్యాయస్థానాలను ధిక్కరించడమేనని మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.ప్రతిపక్షం అంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎందుకింత కక్ష అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేయడమే ప్రభుత్వ కుట్రా అని నిలదీశారు. 1000 రోజుల పాలన వైఫల్యాలు, 22ఏ భూముల వ్యవహారం, భూ కుంభకోణాలు, పాలిటెక్నిక్ విద్యార్థులు, రైతుల సమస్యలు సభలో చర్చకు వస్తాయనే భయంతోనే అరెస్టులు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.“ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే” అంటే.. తప్పు చేసినవాడే ఎదుటివారిని నిందించడం అని హరీష్రావు పేర్కొన్నారు. పోలీసులు తమపై దాడి చేసి, ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్సీలనే అరెస్ట్ చేస్తున్నారని విమర్శిస్తూ.. “దొంగే పోలీసును మందలించినట్టుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. తమ మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి, గొంతు పిసికిన వారిపై చర్యలు తీసుకోకుండా తమపైనే కేసులు, అరెస్టులు చేయడం ఏమిటని హరీష్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు భారీగా పోలీసులను మోహరించడాన్ని కూడా తప్పుబట్టారు. ఖాకీలను ప్రైవేట్ సైన్యంగా వాడుకుంటూ హిట్లర్ పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజాపాలన కాదని, ప్రతిపక్ష గొంతు నొక్కే ఎమర్జెన్సీ రాజ్యమని వ్యాఖ్యానించారు. ‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే అరెస్ట్.. ప్రజల సమస్యలపై మాట్లాడితే నిర్బంధం’ అంటూ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ గొంతుకను అణచలేరని, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.శాసన సభ్యులను, మండలి సభ్యులను సభలోకి రానివ్వకుండా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రూరంగా , కర్కశంగా గౌరవ శాసన సభ్యుల ను, మండలి సభ్యుల మీద దాడి చేసి సభా హక్కులను కబళించిన పోలీసులే నేడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్లు గౌరవ మండలి సభ్యులు తాత మధు, నవీన్ రెడ్డి లను అరెస్ట్ చేయడం…— Harish Rao Thanneeru (@BRSHarish) September 8, 2026 -
గొంతులు నొక్కారు.. చీరలు లాగారు..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన ఘటన అత్యంత హేయమని, సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారని, చీరలు పట్టుకుని లాగారని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి ఆరోపించారు. మహిళల పట్ల ముఖ్యమంత్రికి గౌరవం లేదని విమర్శించారు.పోలీసుల ముసుగులో కొందరు గూండాల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నేతలకు రక్షణ లేకుండా పోయిందని, ఇది అసెంబ్లీనా?.. రౌడీ రాజ్యమా? అని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన గొంతు, జుట్టు పట్టుకుని లాగారని, సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ అడ్డుకోకుంటే తమను కిందపడేసి పోలీసులు తొక్కేవారని అన్నారు.ప్రశ్నిస్తే గొంతు పిసికే పరిస్థితిప్రశ్నిస్తే గొంతు పట్టుకుని పిసికే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని సబిత విమర్శించారు. జరిగిన ఘటనను మహిళా మంత్రి సీతక్క ఖండించాల్సింది పోయి డ్రామాగా పేర్కొనడం సరికాదన్నారు. సీఎం రేవంత్రెడ్డి అహంకారం పెరిగిపోయిందని, ఘటనపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి పదవికి సీఎం రాజీనామా చేయాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని, మహిళా ఎమ్మెల్యేలమని చూడకుండా పోలీసులు గొంతులు నొక్కారని కంట తడిపెట్టారు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం కొనసాగుతోందన్నారు. తమ టీషర్టులపై ముఖ్యమంత్రి మాట్లాడే బూతు భాష లేదని, కేవలం హామీల అమలు కోరుతూ నినాదాలున్నాయని కోవా లక్ష్మి తెలిపారు. పోలీసులు కేటీఆర్ గొంతు పట్టుకుని లాగారని, హరీశ్రావు చొక్కా చించారని, జగదీశ్రెడ్డి స్పృహ తప్పి పడిపోయారని చెప్పారు.ఇవి కూడా చదవండి: దాడికి రేవంత్రెడ్డిదే బాధ్యత -
దాడికి రేవంత్రెడ్డిదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి హోదాలో రేవంత్రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ‘ఆడ బిడ్డల చీరలు లాగి.. గొంతులు పట్టి.. జుట్టు లాగుతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన?..’ అని నిలదీశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగడతామనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను సభలోకి రాకుండా పోలీసులతో దాడులు చేయించారని ఆరోపించారు. తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.కాంగ్రెస్ భయపడుతోంది..తప్పు చేయకుంటే ప్రజా సమస్యలను ఎజెండాలో పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో తమకూ ఉందని అన్నారు. ‘రాహుల్గాంధీ నల్ల టీ షర్టు వేసుకుని, నినాదాలు చేస్తూ పార్లమెంట్కు వెళ్తే అడ్డుకోరు.. మేం అదే చేస్తే పోలీసులు అడ్డుకుంటారా?..’ అని నిలదీశారు. రేవంత్రెడ్డి గతంలో నిరసన తెలిపే హక్కు ఏడో గ్యారంటీ అని చెప్పారని, ఇప్పుడు తమ నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.గతంలో మేం క్షమాపణ చెప్పాం..సీఎం కూడా ఎమ్మెల్యేనే అని, స్పీకర్ పక్షపాత వైఖరి వీడి అందరికీ సమాన నిబంధనలు వర్తింపజేయాలని కేటీఆర్ కోరారు. తమ ఎమ్మెల్సీ తాతా మధుకు అనని మాటలను ఆపాదిస్తూ అసలు దాడి ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో డీకే అరుణకు మనస్తాపం కలిగినప్పుడు కేసీఆర్ ఆదేశాలతో తాము క్షమాపణ చెప్పామని, అదే తమ సంస్కారమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని, మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు, సీఎం క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.దళితులపై రేవంత్ కపట ప్రేమదళితులపై రేవంత్రెడ్డి కపట ప్రేమ చూపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే దళిత, గిరిజన డిక్లరేషన్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దళిత బంధును ఎత్తివేసి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.6 లక్షలు, అసైన్డ్ భూములకు పట్టాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 30 శాతం వాటా వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. తమ ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై హైకోర్టును ఆశ్రయించామని, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.జగదీశ్రెడ్డికి పరామర్శనిమ్స్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని కేటీఆర్ సోమవారం సాయంత్రం పరామర్శించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య జరిగిన తోపులాటలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన క్షేమ సమాచారాన్ని కేటీఆర్ వైద్యులనడిగి తెలుసుకున్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. -
కమ్యూనిస్టులు– కాంగ్రెస్ కలిసి పోరాడాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యంత ప్రమాదకరమైన మోదీని గద్దె దించేందుకు జాతీయస్థాయిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో మోదీ ఓటమికి ఇప్పటి నుంచే పునాది వేయాల్సిన అవసరం ఉందన్నారు. కమ్యూనిస్టులు లేవనెత్తే ప్రజా సమస్యలకు తమ ప్రభుత్వం సహేతుకమైన పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడు అక్రమ పద్ధతులను బీజేపీ అనుసరిస్తుందని, అందులో భాగంగానే ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తుందని ధ్వజమెత్తారు. సీపీఎం సీనియర్ నేత, రైతాంగ ఉద్యమ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఎవరు ఓడాలో, గెలవాలో ఎన్నికల సంఘం నిర్ణయించే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గమైన కొడంగల్లోనే వలస వెళ్లిన పేదల ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారని, సుమారు 81 వేల ఓట్లను అనుమానాస్పద ఓట్ల జాబితాలో చేర్చారని పేర్కొన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బిహార్, పశ్చిమబెంగాల్లో గెలిచిన విధంగానే, ఓట్లను తొలగించిన విధానాన్ని తెలంగాణలో అమలు చేసి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్ సరళిని పరిశీలించి, తమకు అనుకూలంగా ఉండేందుకు ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. 33 శాతం ఓట్లను తొలగిస్తున్నప్పుడు మాట్లాడాల్సిన ప్రధాన ప్రతిపక్షం నుంచి ఒక్కరు మాట్లాడడం లేదన్నారు. రైతాంగానికి ‘వాకింగ్ ఎన్సైక్లోపీడియా’సారంపల్లి మల్లారెడ్డి సారంపల్లి మల్లారెడ్డి రైతాంగ సమస్యలపై అపారమైన అవగాహన ఉన్న నాయకుడని రేవంత్రెడ్డి కొనియాడారు. భూసారం నుంచి విత్తనం, పెట్టుబడి, పంట, కౌలు రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర వరకు వ్యవసాయ రంగంలోని ప్రతి అంశంపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో మల్లారెడ్డి ప్రత్యేకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. మల్లారెడ్డి పేరును చిరస్థాయిగా నిలిపేలా రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతానికి ఆయన పేరు పెట్టే అంశాన్ని మంత్రివర్గంలో చర్చిస్తానని సీఎం తెలిపారు. ప్రమాదంలో’లౌకికవాదం, ప్రజాస్వామ్యం : ప్రకాశ్ కారత్ దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నాయని సీపీఎం సీనియర్ నేత ప్రకాశ్ కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్లు, ఆదివాసీలు లక్ష్యంగా ఎస్ఐఆర్ కింద ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణలో 73 లక్షల ఓట్లు తొలగించారని, మరో 92 లక్షల ఓట్లను సందేహాస్పద ఓట్లుగా మిగిలాయన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలకు తొత్తుగా ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఆరోపించారు. సారంపల్లి మల్లారెడ్డి జీవితాంతం రైతులు, పేదలు, కార్మికుల సమస్యల కోసం పోరాడిన నాయకుడని ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో ప్రజా ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని సభలో నేతలు పేర్కొన్నారు. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ అధ్యక్షత వహించగా, మంత్రి అజహరుద్దీన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ఠాకూర్, సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, తమ్మినేని వీరభద్రం, వీరయ్య, జ్యోతి, మల్లు లక్ష్మి, న్యూడెమోక్రసీ నేతలు పోటు రంగారావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి రచన ‘నాగేటి సాళ్లు’పుస్తకాన్ని ప్రకాశ్ కారత్ ఆవిష్కరించగా, మల్లారెడ్డిపై ప్రజానాట్యమండలి రూపొందించిన పాటల సీడీని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. -
తెలంగాణకు ఇది చీకటి రోజు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికే ఇది చీకటి రోజని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అవమానకర వ్యాఖ్యలు..నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా సభలోని ప్రతి సభ్యుడు ఈ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వాన్ని శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని సీఎం డిమాండ్ చేశారు. శాసనసభ ప్రాంగణంలో తాతా మధు చేసిన వ్యాఖ్యలు సోమవారం తీవ్ర దుమారం రేపాయి. భోజన విరామం తర్వాత శాసనసభ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైంది. తాతా మధు వ్యాఖ్యలపై సుదీర్ఘ చర్చ జరగాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ప్రతిపాదించారు. అప్పటికే బీజేపీ సభ్యులు 22ఏ పై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. ప్లకార్డులతో బైఠాయించారు. బీఏసీలో చర్చ తర్వాత ఈ అంశాన్ని చేపడదామని, స్పీకర్కు జరిగిన అవమానంపై చర్చ అత్యంత ముఖ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మాట్లాడారు. బీఆర్ఎస్ను కాపాడుతున్నారనే అనుమానం కలిగించొద్దు ‘స్పీకర్ పదవి అంత అత్యున్నతమైనది. అన్ని పార్టీల మద్దతుతో ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తిని గౌరవించడం అందరి బాధ్యత. సభలో సీఎం అయినా, శాసనసభ్యుడైనా సభాపతికి ఒకే రకమైన అభిప్రాయం ఉంటుంది. అలాంటి స్పీకర్ మనసు ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యల వల్ల గాయపడింది. దీన్ని గడ్డం ప్రసాద్కుమార్కు జరిగిన అవమానంగానే చూడకూడదు. యావత్ తెలంగాణ సిగ్గుపడే ఘటన ఇది. మనుషులు ప్రయోగించలేని, సభ్య సమాజం సహించలేని భాష వాడి, అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత ఇంతకన్నా చర్చనీయాంశం మరొకటి ఉండదని బీజేపీ గుర్తించాలి. చర్చలో పాల్గొనకుండా బీఆర్ఎస్ దుర్మార్గాలను కాపాడుతున్నారనే అనుమానం ప్రజలకు కలిగేలా వ్యవహరించవద్దు. ఫాంహౌస్ నుంచి సభ్యులను పురిగొల్పారు.. అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు బీఆర్ఎస్ నాయకుడు ఫాంహౌస్లో సమావేశం ఏర్పాటు చేసి తన సభ్యును పురిగొల్పారు. పోలీసులపై దాడి చేసి, సభాపతిని దూషించడమంటే క్షమించరాని నేరం. ఇది అనాలోచిత చర్య కాదు.. తీవ్రమైన నేరం. సభా ప్రాంగణంలో సభాపతితో పాటు కుటుంబ సభ్యులను అవమానించారు. బీఆర్ఎస్ పుట్టినప్పుడు, విజయం సాధించినప్పుడు దళితులనే ఆయుధంగా వాడారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎంను చేస్తానని, దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానని నమ్మించి, దళిత బంధు ఇస్తానని నమ్మించిన పార్టీ బీఆర్ఎస్. అధికారంలోకి వచ్చాక దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారు. నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న దళితులను లారీలతో తొక్కించి చంపారు. ఒక దళితుడిని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిని చేస్తే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. ఆ పార్టీది దళిత వ్యతిరేక ఆలోచన. తల్లిని దూషిస్తే ఏ కొడుక్కయినా రక్తం మరుగుతుంది ఇలాంటి సంఘటన స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచీ ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇలాంటి పోకడలను నియంత్రించకపోతే రాబోయే తరాలు ఈ సభను కూడా క్షమించవు. తల్లిని అవమానించే విధంగా మాట్లాడితే ఏ కొడుక్కయినా రక్తం మరుగుతుంది. ఇలాంటి చర్యను ముక్త కంఠంతో ఖండించాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే కఠినంగా వ్యహరించాల్సిన అవసరం ఉంది. విశృంఖలత్వం, అడ్డగోలుతనం, ఏం మాట్లాడినా చెల్లుతుందనే అహంకారం, ఏం చేసినా చూసుకోవడానికి ఫాం హౌస్లో తమ నాయకుడు ఉన్నాడనుకునే వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. క్షమించి ఊరుకుంటే చట్టసభలకు విలువ ఉండదు. దీనిపై చర్చించి స్వయం నియంత్రణ విధానం తేవాలి..’అని ముఖ్యమంత్రి అన్నారు. -
మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
-
‘ఇది తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానం’
హైదరాబాద్: తాము నిరసన తెలిపే క్రమంలో పోలీసుల బలగం అత్యంత దుర్మార్గంగా వ్యహరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలంతా చూశారని మండిపడ్డారు. ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా వ్యవహరించారన్నారు. పోలీసు చర్యలతో సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారన్నారు.ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 7వ తేదీ) తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ ఇది శాసన సభ కాదు.. దుశ్శాసన సభ. లోక్సభకు రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని వెళ్తున్నారు. మేం టీ షర్ట్లు వేసుకుంటే తప్పేంటి.. ఏ రూల్ ప్రకారం అడ్డుకుంటున్నారు. పార్లమెంటరీ, అన్ పార్లమెంటరీ డిసైడ్ చేయడానికి డీసీపీ ఎవరు?, మహిళా నేతలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రజల తరఫున గొంతు వినిపించడం మా హక్కు. స్పీకర్ వివక్ష చూపడం తగదు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వను అని స్పీకర్ అనడం ఏంటి?, ప్రజలపై చేసే దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలపై సభలో నిలదీస్తాం. ఈ రోజు జరిగిన ఘటనకు బాధ్యుడు సీఎం రేవంత్. సీఎం రేవంత్ బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ మహిళా లోకానికి ఇవాళ అవమానం జరిగింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఈ రోజు జరిగిన ఘటనపై హైకోర్టుకు వెళ్లాం. ఎన్హెచ్ఆర్సీ, మహిళా కమిషన్కు కూడా వెళ్తాం. బీజేపీ-కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుపుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై మమ్మల్ని అడ్డుకుంటున్నారు’ అని విమర్శించారు.ఇదీ చదవండి:నల్లదుస్తులతో వస్తే తప్పేంటి?: సబిత ఫైర్ -
తెలంగాణ అసెంబ్లీ : బీఆర్ఎస్ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)
-
కాబినెట్ లోకి రాజగోపాల్ రెడ్డి? రేవంత్ సభతో పెరిగిన హీట్!
-
సురేఖ ఎపిసోడ్.. కాంగ్రెస్లో రేవంత్ బలపరీక్ష నెగ్గినట్టేనా?
రాజకీయాలలో సరైన వ్యూహం లేకుండా పోతే ఏం జరుగుతుందో చెప్పడానికి కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన తీరు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ మొత్తం ఉదంతంలో ఆమె రాజకీయంగా నష్టపోయారు. అదే టైమ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను కొంతవరకు దెబ్బతీశారు. విపక్షాలకు ఆమె కొన్ని ఆయుధాలు అందించారు. మరోవైపు రేవంత్ రెడ్డి తనకు పార్టీలో పట్టు ఉందని నిరూపించడానికి శ్రమించాల్సి వచ్చింది.కొండా సురేఖతో గత కొన్ని నెలలుగా రేవంత్కు కారణం ఏమైనా విభేదాలు ఏర్పడ్డాయి. అయినా ఆమెను మంత్రిగా కొనసాగించవలసి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి తనను పదవి నుంచి తప్పించారని సురేఖ ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఉందా, లేదా అన్నది పక్కనబెడితే దాదాపు రెండువారాల పాటు సాగిన ఈ డ్రామా వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పరపతి కొంత దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే డైలాగులకు ఈ ఎపిసోడ్ ద్వారా ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ టీడీపీ వాసన వదలుకోలేకపోతున్నారన్న భావన పలువురిలో ఉంది. కాకపోతే పైకి అనడం లేదు.సురేఖ, ఆమె భర్త మురళీ ఉమ్మడి వరంగల్ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తూ వచ్చారు. అందువల్లే ఆయా పార్టీలు వారిని ఆదరించక తప్పలేదు. అంతవరకు ఓకే కాని కొండా దంపతులు దానిని సద్వినియోగం చేసుకోవడంలో సఫలం కాలేకపోతున్నారు. 1999లో తొలిసారి శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచి ఇంతవరకు వారిది ఘర్షణాత్మక రాజకీయమే. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డితో తప్ప, ఆయా పార్టీల నేతలు పలువురితో గొడవలు ఉండేవి. రెండున్నర దశాబ్దాల తర్వాత, లక్కీగా మంత్రి అయిన తర్వాత కూడా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో సఖ్యత లేకపోవడం పెద్ద మైనస్గా కనిపిస్తుంది. పోనీ రాష్ట్ర స్థాయిలో ఎవరితోనైనా అవగాహనతో ఉన్నారా అంటే అదీ కనిపించదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తేడా వచ్చాక, తెలివిగా వేరే ముఖ్యమైన నేతలు, మంత్రుల మద్దతు పొందే యత్నం చేయాలి. కాని వీరు రేవంత్ సోదరులపైన, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితర నేతలు పలువురిపైన ఆరోపణలు గుప్పించారు. దాంతో ఈమెకు అండగా నిలవడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారనిపిస్తుంది. గతంలో కూడా వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్లో ఏర్పడిన పరిణామాలలో తొలుత వైఎస్సార్ కుమారుడు జగన్కు మద్దతుగా ఉన్నా, తదుపరి ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ క్రమంలో అనవసర విమర్శలు చేశారు. రోశయ్య క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఆయనను వ్యతిరేకించారు. నిజానికి అప్పట్లో రఘువీరారెడ్డి వంటి వారు కూడా రోశయ్య క్యాబినెట్ లో చేరడానికే ఇష్టపడలేదు. కాని తదుపరి సర్దుకుపోయారు. కొండా సురేఖ మాత్రం అలా వ్యూహాత్మకంగా చేయలేకపోయారు. తదుపరి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినా, మళ్లీ అక్కడే గొడవే అయింది. కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యే, మంత్రి అవ్వడం విశేషమే. రేవంత్తో మొదట సత్సంబంధాలు ఉన్నా, కారణం ఏమిటో కాని తేడా వచ్చింది. ఈమె భర్త కొండా మురళీకి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్న అసంతృప్తి ఉండవచ్చు. ఇంకేదైనా కావచ్చు. పరకాలలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి తిరిగి టిక్కెట్ ఇస్తామని రేవంత్ ప్రకటించడం వీరికి ఆగ్రహం తెప్పించింది. కొండా కుమార్తె సుస్మిత దానిపై ఒక సభలో తీవ్రమైన భాషలో ప్రసంగం చేయడం, రేవంత్పై ఆరోపణలు గుప్పించడం కలకలం రేపింది. దానికి ముందు ఒఎస్డి కేసులో మంత్రి ఇంటిని సోదా చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు కూడా ఈమె పరుష వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎలాగో రాజీ చేశారు. కాని ఈసారి రేవంత్ సీరియస్గా తీసుకున్నారు.నిజానికి తన కుమార్తె సీఎంపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వెంటనే సురేఖ నిలువరించి ఉండాల్సింది. లేదా ఆ వెంటనే ఖండించి ఉండాల్సింది. ఎందువల్లో సురేఖ ఆ పని చేయలేదు. దాంతో వివాదం ముదిరింది. ఎంత కాదన్నా ముఖ్యమంత్రికి ఉండే పవర్ వేరు. ఆమె తన మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకుంటున్నారని, ఇతరత్రా విమర్శలు చేసినా, ప్రయోజనం ఉండదు. క్రమశిక్షణ కమిటీ నోటీసు ఇచ్చినప్పుడు సారీ చెబితే అయిపోయేదానికి మంత్రి పదవి పోయేవరకు తెచ్చుకున్నారనిపిస్తుంది. ఏఐసీసీకి ఇచ్చిన లేఖ బయటపెట్టినా పెద్దగా ప్రకంపన ఏమీ రాలేదు.బహుశా ఆమె భర్త మురళీ ఆమె రాజకీయ ఎదుగలకు, అలాగే పతనానికి కూడా కారణమా అన్న విశ్లేషణ వస్తుంది. దానికి తగినట్లే మురళీ ఇంత జరిగిన తర్వాత మీడియాకు కనిపించేలా మీసం మెలి తిప్పుతూ కన్పించారు. అంటే జనంలో తనకు అంత పట్టు ఉందని చెప్పదలిచి ఉండవచ్చు. కాని వర్తమాన రాజకీయాలలో ఎన్నికలు వచ్చేవరకు అధికారంలో ఉన్నవారిదే పెత్తనం అవుతుంది. ఇవన్ని వారికి అనుభవమే అయినా, ఏ ధైర్యంతో ఇలా చేశారో తెలియదు. వారి ప్లాన్ బి ఏమిటో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతామని సురేఖ ప్రకటించడం కాస్త తెలివైన చర్యగానే కనిపిస్తుంది. సమయం మించిపోయాక రక్షాబంధన్ రాఖీని రేవంత్కు కట్టినా ప్రయోజనం కలగలేదనుకోవాలి.ఇక రేవంత్ వైపు చూస్తే సురేఖ ఇష్యూ మొదలు కాగానే పదవి నుంచి తప్పించి ఉంటే ఆయన పవర్ పుల్ గా ఉన్నారన్న అభిప్రాయం కలిగేది. సురేఖపై కొంతమంది ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించడంతో పార్టీలో వివాదాలు రచ్చకెక్కినట్లయింది. అధిష్టానం వద్దే పంచాయతీ జరగడం, ఆ పైన మరికొన్ని రోజులు జాప్యం జరగడంతో రేవంత్ కూడా అధిష్టానం చెప్పినట్లు వినాల్సిందేనన్న అభిప్రాయం కలుగుతుంది. అందువల్లే రేవంత్ హైకమాండ్ను బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ ఆరోపించగలిగారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. సురేఖ రాఖీ కట్టిన తర్వాత రాజీ కుదిరిందేమోనని అనుకున్నారు. కాని రేవంత్ అందుకు సిద్దపడలేదన్నమాట.బీసీ వర్గానికి చెందిన మహిళ సురేఖను పదవినుంచి తప్పించడంపై ఎలాంటి ప్రభావం పడుతుందో అన్నదానిపై అభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే తుది నిర్ణయం జరిగి ఉంటుంది. ఈ వివాదం తొలుత రేవంత్ వ్యాఖ్యలతోనే ఆరంభమైన సంగతిని కూడా కాంగ్రెస్ క్యాడర్ గుర్తించి ఉంటారు. గతంలో పవర్ ఫుల్ ముఖ్యమంత్రులన్న పేరున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటివారు సైతం బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు చేసేవారుకాదు. మరో బలమైన నేత చెన్నారెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి పదవి కోల్పోయారు. అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు చెందిన ఒక మంత్రి విమర్శలు చేసిన వెంటనే పదవి నుంచి తప్పించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాటికొండ రాజయ్య, ఈటెల రాజేందర్ లను బర్తరఫ్ చేశారు.కాగా తాను ఎవరికి భయపడనని, స్నేహంగా అడిగితే అన్నీ చేసి పెడతానని రేవంత్ అంటున్నారు. ఇది అచ్చంగా గతంలో కొన్నిసార్లు ఆయన గురువు చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగం మాదిరే కనిపిస్తుంది. అయితే చంద్రబాబు ప్రాంతీయ పార్టీ అధినేత కాబట్టి కొంతవరకు చెల్లవచ్చు. అయినా ఆయన అన్నీ అంచనా వేసుకున్నాకే ధైర్యం చేసేవారు. కొన్నిసార్లు ఏమి జరగనట్లు రాజకీయం సాగించేవారు. కాంగ్రెస్లో అది అంత తేలికకాదు. ఎవరికి ఉండే బలం వారికి ఉంటుంది. ప్రస్తుతానికి కర్ణాటకలో మాదిరి ఒక నేత ఎవరూ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడే దశ తెలంగాణలో రాలేదు. అది ఆయనకు కలిసివచ్చే అంశం. అయితే తన కుటుంబ సభ్యులపైన, సన్నిహితులు కొందరిపైన సురేఖ చేసిన ఆరోపణల వల్ల కాంగ్రెస్కు కొంత నష్టం జరుగుతుంది. వాటిపై అసెంబ్లీలో చర్చ జరగాలని విపక్షం పట్టుపట్టవచ్చు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన సురేఖ తనకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తే అదొక సమస్య అయ్యే అవకాశం ఉంది. కాగా సౌమ్యుడుగా పేరొందిన చిన్నారెడ్డి అనూహ్యంగా వివాదంలో చిక్కుకుని పదవి పోగొట్టుకోవడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. బీసీ నేత పదవినే తీసేశారన్న విమర్శ రాకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. ఓవరాల్గా ఈ పరిణామాలతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలలో పలచన కావచ్చు. సురేఖ రాజకీయం ముళ్లబాటగా మారే అవకాశం ఉంటుంది. కాగా, రేవంత్ తన పరపతి నిలబెట్టుకున్నప్పటికీ, కొంత డామేజీని భరించక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.చదవండి: విజయసాయి మాట ఎందుకు మార్చారు? -
బీఆర్ఎస్ ప్లాన్కు రేవంత్ ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు 22ఏ భూములు, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలను ప్రధాన అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అయితే ప్రతిపక్షం దూకుడును ముందే పసిగట్టిన రేవంత్ ప్రభుత్వం కౌంటర్కు దిగింది.22ఏ భూముల వ్యవహారంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపైనా చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు సమాచారం. బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తరఫున ఈ అంశాలపై చర్చకు ప్రతిపాదనను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పెట్టనున్నారు. సమావేశంలో చర్చించి వీటిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో బీఆర్ఎస్ లేవనెత్తాలనుకున్న అంశాలనే అధికార పక్షం చర్చకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.22ఏపై ఇప్పటికే రగడతెలంగాణలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారం కొంతకాలంగా రాజకీయ దుమారం రేపుతోంది. ప్రైవేటు భూములు సైతం నిషేధిత జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని బాధితులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. 22ఏ జాబితాలో భూములు చేరడంలో అధికారుల తప్పిదాలపై మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పారు. రిజిస్ట్రేషన్ సాధ్యం కాని కేసుల్లో అందుకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, ఇప్పటికే ఫీజు చెల్లించి ఉంటే నిబంధనల ప్రకారం తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించారు.ఫీజు రీయింబర్స్మెంట్పైనా ఫోకస్మరోవైపు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను బీఆర్ఎస్ ప్రధానంగా ప్రస్తావించనుంది. విద్యార్థులు, కళాశాలల సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కూడా ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంపైనా చర్చకు సిద్ధమని చెబుతోంది. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో నిధుల విడుదలపై హామీలు ఇచ్చారు. ఆగస్టులో ప్రభుత్వం రూ.2,400 కోట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.నల్ల టీషర్ట్లతో బీఆర్ఎస్ నిరసనఅసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్లతో నిరసనకు సిద్ధమయ్యారు. 22ఏ, ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు రైతులు, రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలనూ సభలో ప్రస్తావించాలని పార్టీ నిర్ణయించింది.మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ ప్రధానంగా నిలదీయాలనుకుంటున్న 22ఏ, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలపైనే ప్రభుత్వం చర్చకు సిద్ధమవుతుండటం ఆ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది.నేడు అసలు సమరం!సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందు కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను సీఎం ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల తర్వాత వివిధ నివేదికలను సభ ముందుంచనున్నారు.ఇదీ చదవండి: ప్రశ్నోత్తరాలు.. పలు నివేదికలు -
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
Telangana Assembly Updates..తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదారేపు ఉదయం వాయిదా వేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్రేపు శాసన సభలో స్పీకర్పై తాత మధుపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని శ్రీధర్ బాబు డిమాండ్రేపు సభలో తాత మధు వ్యాఖ్యలపై సభ్యుల స్పీచ్ ఉంటుంది రేపు మధ్యాహ్నం తర్వాత బీఏసీ మీటింగ్ అసెంబ్లీ ఘటనపై హైకోర్టు సీరియస్ ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం అసెంబ్లీకి వెళ్తున్నవారిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నఅసెంబ్లీ అనేది స్పీకర్ పరిధి నిబంధనలు ఉల్లంఘిస్తే స్పీకర్ చర్యలు తీసుకోవాలిమహిళా ఎమ్మెల్యేపై దాడి చేసిన వారిని గుర్తించాలి2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి కామెంట్స్దళిత బిడ్డను స్పీకర్గా కాంగ్రెస్ తీసుకవచ్చిందిస్పీకర్ మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఈ వ్యాఖ్యలుఅధికారానికి శాశ్వతంగా దూరం అవుతామని బీఆర్ఎస్లో భయం ఈ ఘటన ఆది కాదు అంతం కాదు నికృష్టమైన పదజాలం వాడిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలిచర్యల తీసుకోవడానికి స్పీకర్కు రాజ్యాంగపరమైన అధికారాలు ఉన్నాయిస్పీకర్ రూల్బుక్ ఫాలో అయ్యి కఠిన చర్యలు తీసుకోవాలి వాకౌట్ చేసిన బీజేపీ అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ వాకౌట్ 22ఏపై చర్చించడం లేదని బీజేపీ వాకౌట్ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారని పిటిషన్ హైకోర్టులో పిటిషన్ వేసిన బీఆర్ఎస్్ ఎమ్మెల్సీపై చర్యలకు ప్రతిపాదనతాతా మధుపై చర్యలకు అసెంబ్లీలో ప్రతిపాదన సభలో ప్రతిపాదన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదనను బలపర్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి శాసనసభలో కన్నీరు పెట్టుకున్న స్పీకర్స్పీకర్ వ్యాఖ్యల పట్ల మంత్రి సీతక్క తీవ్ర భావోద్వేగంసీతక్క కంటతడి పెట్టుకోవడంతో భావోద్వేగానికి గురైన స్పీకర్తీవ్ర భావోద్వేగంతో కంటతడిపెట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ఎమ్మెల్సిలు తాత మధు, నవీన్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి: మంత్రి సీతక్కవారిపై ఎస్సి ఎస్టీ కేసులు పెట్టాలి సభకు రాకుండా చైర్ను కేసీఆర్ అవమానిస్తున్నారుస్పీకర్కు కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలిబీఆర్ఎస్ పార్టీ అంటే దుహంకారం కలిగిన పార్టీ స్పీకర్ను కించపరిచే కుసంస్కారం నాకు లేదు: తాతా మధుమమ్మల్ని పోలీసులు బూటు కాళ్లతో తొక్కారునన్ను రక్షించుకోవడం కోసమే అలా మాట్లాడాకాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందిబీఆర్ఎస్పై దాడిని కప్పిపుచ్చుకునేందుకే నాటకాలాడుతున్నారు తాతా మధును బహిష్కరించండి: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డితాతా మధు వ్యాఖ్యలకు బాధ్యత వహించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలిస్పీకర్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాంఎమ్మెల్సీ తాతా మధును చట్ట సభ నుంచి బహిష్కరించాలిఅసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డిచెప్పలేని భాషతో స్పీకర్ను దూషించారు చట్ట సభ నుంచి తాతా మధును డిస్మిస్ చేయాలితాత మధు చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణలు చెప్పాలిఇది సభకు జరిగిన అవమానంస్పీకర్కు జరిగిన అవమానంపై చర్చలో బీజేపీ సభ్యులు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాబీజేపీ లేవనెత్తిన అంశాలపై బీఏసీలొ చర్చించి నిర్ణయం తీసుకుంటాంకేసీఆర్ ఫాంహౌస్లో కుట్రకు ప్లాన్ వేశారుఈరోజు అసెంబ్లీ ముందు ప్లాన్ అమలు చేశారుసభాపతినే కాదు,సభాపతి కుటుంబ సభ్యులను అవమానించారు మహిళలను అవమానపరచడమే ఇందిరమ్మ రాజ్యమా?: సునీతసునీతా లక్ష్మారెడ్డి కామెంట్స్..ప్రజాస్వామ్యంలో ఇవ్వాళ్ల చీకటి రోజు.రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన ఘటన ఇది.ప్రజల పక్షాన పోరాడటమే మేం చేసిన పాపమా?.కోవ లక్ష్మి పట్టుకోకుంటే గ్రిల్స్పైన పడిపోయేదాన్ని.మహిళలను అవమానపరచడమే ఇందిరమ్మ రాజ్యమా?.కేటీఆర్, హరీష్ రావు లేకుంటే ఇవాళ మమ్మల్ని కిందపడేసి తొక్కేసేవాళ్లు.ఎవరి మెప్పు కోసం పోలీసులు ఇలా ప్రవర్తించారు?. రాష్ట్రంలో దుస్యాసన పర్వం కొనసాగుతుంది.మేము ఏం పాపం చేశాం.రాష్ట్ర మహిళలందరూ దాడి జరిగినట్లుగా ఈ ఘటనను భావిస్తున్నాము.అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి..మహిళా సభ్యులతో ఇలాగేనా ప్రవర్తించేది?: సబిత సీరియస్బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత కామెంట్స్..మా పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు.మేము అసెంబ్లీకి నల్లబట్టలతో వెళ్తే తప్పేంటి?.అసెంబ్లీకి వస్తుంటే అడ్డుకున్నారు.రాహుల్ గాంధీ పార్లమెంట్కు బ్లాక్ డ్రెస్లో వెళ్లి కేంద్రాన్ని నిలదీస్తే తప్పులేదా?.ముఖ్యమంత్రి ఆదేశాలతోనే పోలీసులు ఇలా చేశారా?పోలీసులను అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరించారు.మహిళా సభ్యులని కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తించారు.సునీతా లక్ష్మారెడ్డి చీర లాగేసి కిందపడేసే ప్రయత్నం చేశారు.ఇంత దుర్మార్గంగా వ్యవహరించాల్సిన అవసరం ఏం వచ్చింది? ఎందుకు వచ్చింది?.ఇది మాకు జరిగిన అవమానం కాదు.. మహిళా సమాజానికి జరిగిన అవమానం.అసెంబ్లీ ముందు జరిగిన ఘటన హేయమైనది.అసెంబ్లీకి వస్తుంటే అడ్డుకున్నారు. రేవంత్ సర్కార్, పోలీసులపై హరీష్ రావు సీరియస్తెలంగాణభవన్ వద్ద మరోసారి ఉద్రికత్త.మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారు.కేటీఆర్కు స్వల్ప గాయాలయ్యాయి.రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని పార్లమెంట్కు వెళ్తే తప్పులేదా?మేము టీ షర్టులు వేసుకుని అసెంబ్లీకి వెళ్తే తప్పా?.బీఆర్ఎస్ను బయటకు పంపించి 22ఏపై చర్చించాలనుకుంటున్నారు.ఎన్నికల హామీలు అమలు చేయలేదని ప్రశ్నిస్తే తప్పా?రక్తాలు కారేలా మా ఎమ్మెల్యేలను కొట్టి సభకు రాకుండా అడ్డుకున్నారు.బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించారు.ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు.మా ఆడ బిడ్డల చీరలు లాగుతుంటే మేం చూస్తూ ఊరుకోవాలా?.మా ఆడబిడ్డల గొంతుపట్టి లాగుతుంటే మేం చూస్తూ కూర్చోవాలా?.మీకు నిజాయితీ ఉంటే 22ఏను అజెండాలో పెట్టి చర్చించండి.పోలీసుల తీరు దుర్మార్గంగా ఉంది.జగదీష్ రెడ్డికి హైబీపీ ఉందని చెప్పినా అడ్డుకున్నారు.రేవంత్ ఆదేశాలతోనే పోలీసులు రెచ్చిపోయారు.భవిష్యత్లో పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు.మా టీషర్టులపై అభ్యంతరకర పదాలు ఎక్కడున్నాయి??సభకు రాకుండా కావాలనే మమ్మల్ని అడ్డుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్..బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే నో డౌట్..తాతా మధుపై చర్యలు తీసుకోవాల్సిందే..దలిత స్పీకర్పై ఇంత దారుణంగా మాట్లాడుతారా?మేము స్పీకర్ను ఏమనకున్నా నన్ను, సంపత్ను బీఆర్ఎస్ ప్రభుత్వంలో సస్పెండ్ చేశారు.తాతా మధు లాంటి వారిని ఉపేక్షిస్తే స్పీకర్ పదవిని అగౌరపరిచినట్టే అవుతుంది.తాతా మధు వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై స్పీకర్ ఆగ్రహం..తాతా మధు వ్యవహారంపై స్పీకర్ ఆగ్రహం.స్పీకర్పై తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియోను రిలీజ్ చేసిన సీఎంవో..తాతా మధుపై చర్యలకు సిద్ధం అవుతున్న స్పీకర్మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ నేతల డిమాండ్. ఆసుపత్రికి బీఆర్ఎస్ నేతలు.. అడ్డుకున్న పోలీసులు.. గాయాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్తామన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్జగదీష్ రెడ్డి, సంజయ్, యాదవరెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా అడ్డుకున్న పోలీసులు.తెలంగాణ భవన్ మెయిన్ గేట్ వద్ద అడ్డుకున్న పోలీసులు..జగదీష్ రెడ్డి పల్స్ రేటు పడిపోతుందంటూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆగ్రహంశ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పిన సంజయ్.మాట్లాడలేకపోతున్నా జగదీష్ రెడ్డి.జగదీశ్ రెడ్డికి హైబీపీ.. ఆరోగ్య పరిస్థితి విషమం.స్పృహ తప్పే ప్రమాదం ఉందంటున్న డాక్టర్ సంజయ్పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు శాసనసభలో మీడియాపై ఆంక్షలుతెలంగాణ శాసనసభలో మీడియాపై ఆంక్షలుఅసెంబ్లీ లాబీలోకి మీడియాకు నిషేధంమీడియాకు LOP సైడ్ లాంజ్ ఏర్పాటు చేసిన అధికారులుమంత్రుల ఛాంబర్ల వరకు మీడియా అనుమతి నిషేధం విధించిన ప్రభుత్వంఅసెంబ్లీలో మీడియాకు కనీసం టాయిలెట్స్, మంచి నీళ్లు లేని వైనంఅసెంబ్లీ బయట మీడియా కమిటీ కోసం ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చెసినట్లు తెలిపిన అధికారులుఅసెంబ్లీ లాబీలోకి మీడియా అనుమతి నిషేధించాలని మంత్రులు ఏకగ్రీవంగా స్పీకర్కు తెలిపినట్లు చెప్పిన అధికారులుసీఎం రేవంత్ అత్యవసర సమావేశం..అసెంబ్లీ ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం.మంత్రులు, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం.బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా ఎమ్మెల్సీ తాత మధు వ్యవహరించిన తీరుపై సీఎం ఆరా.పోలీసులు, స్పీకర్పై చేసిన వ్యాఖ్యల వీడియోలను పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం..అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్డ్యూటీ చేయండి, అతి చేయకండిరెండేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది గుర్తు పెట్టుకోండిమేము నల్ల దుస్తులతో అసెంబ్లీలోకి రావొద్దని స్పీకర్ రాతపూర్వకంగా చెప్తే, ఏదైనా రూల్ ఉంటే చూపించండితెలంగాణభవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్పోలీసుల కారణంగా గాయాలు కావడంతో కేటీఆర్కు ప్రాథమిక చికిత్స అసెంబ్లీ వద్ద పోలీసుల తీరుపై కేటీఆర్ ఫైర్డ్యూటీ చేయండి, అతి చేయకండిరెండేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది గుర్తు పెట్టుకోండిమేము నల్ల దుస్తులతో అసెంబ్లీలోకి రావొద్దని స్పీకర్ రాతపూర్వకంగా చెప్తే, ఏదైనా రూల్ ఉంటే చూపించండి- కేటీఆర్Video credits - TV9 https://t.co/LplrkQneJE pic.twitter.com/h28vJuMJ8A— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026Video credits.. TV9 And Telugu Scribeకేటీఆర్, హరీష్ రావులను అసెంబ్లీ వద్ద అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కు తరలించిన పోలీసులు https://t.co/zHd2zxHm06 pic.twitter.com/kCuJ4jsztK— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026స్పీకర్ ఆదేశాలతోనే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నాం: డీసీపీడీసీపీ శిల్పవల్లి కామెంట్స్..స్పీకర్ ఆదేశాలతోనే బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నాంషర్ట్లు లేకుండా అసెంబ్లీకి ఎలా వెళ్తారు?మహిళా నేతల చీరలు లాగామనడం అవాస్తవం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్..కేసీఆర్ కాళేశ్వరం విషయంలో ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.కేసీఆర్ నేనే ఇంజనీర్ను అని కాళేశ్వరం కట్టి కూల్చారు.కేసీఆర్ బీజేపీకి సరేండర్ అయ్యారు.కేసీఆర్ పాదయాత్ర చేస్తా అంటే ప్రజలు నవ్వుతున్నారు.పెండింగ్ ప్రాజెక్టలను పూర్తి చేయొద్దు అని ఎవరు అడ్డుకున్నారు?నీళ్లు లేకపోవడానికి ఒకటి ఎల్నినో.. మరొకటి కేసీఆరే కారణం!!నీళ్ల పంపకాల విషయంలో కేసీఆర్ అన్యాయం చేశారు.కేసీఆర్ మాటలు అన్ని తెలిసినట్లే ఉంటాయి.కేసీఆర్ వాడిన భాష తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ వాడలేదు.తెలంగాణ భాష ఇలా అవ్వడానికి కేసీఆరే కారణం.కేసీఆర్ నిర్ణయం వల్లే ఇవ్వాళ్ళ నీళ్లు లేవు.ఎండాకాలం తాగునీరు అవసరాల దృష్ట్యా నీరును చాలా పొదుపుగా వాడుతున్నాం..ఇరిగేషన్ విషయం కేసీఆర్ ఫాం హౌస్లో ఉంటేనే బెటర్.నీళ్లు ఉండి మేము ఇవ్వడం లేదా?.అసెంబ్లీ మీడియా పాయింట్పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ కామెంట్స్..దిక్కుతోచని పరిస్థితుల్లో బీఆర్ఎస్, బీజేపీ ఆందోళన చేస్తున్నాయి22ఏ భూముల మీద బీఏసీలో చర్చిద్దామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారుసభకు రాకుండా బీఆర్ఎస్, సభకు వచ్చి బీజేపీ నిరసన తెలుపుతున్నాయి10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పనులను కాంగ్రెస్ చేసిందిబీఆర్ఎస్, బీజేపీ తీరును ప్రజలు గమనిస్తున్నారుకాళేశ్వరం మీద సీబీఐ విచారణ వేయాలని బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదు?బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని మరోసారి రుజువైంది.ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య కామెంట్స్..బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసుల మీదే దాడులు చేస్తున్నారు.బీఆర్ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారుసభలో అన్నింటిపై చర్చకు సీఎం సిద్ధంగా ఉన్నారు22ఏపై చర్చకు ప్రభుత్వం సిద్ధమైందిమీ బట్టలు ప్రజలు ఎప్పుడో విప్పారుప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..అసెంబ్లీ లోపలికి కాదు.. ఫార్మ్ హౌస్లో నల్ల చొక్కాలతో నిరసన తెలపాలిసభ సమయం వృథా చేయకండిసభలో బీజేపీ డ్రామా చేస్తోంది.కేటీఆర్ బృందం పోలీసులపై దాడి చేశారుపోలీసుల ఛాతీపై చేతులు వేసి దురుసుగా ప్రవర్తించారుహరీష్ నల్ల చొక్కాతో వద్దు అంటే.. చొక్కా విప్పి రావడం సంప్రదాయమా? రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను అసెంబ్లీ రాకుండా వ్యవహరించిన పోలీసులు, ప్రభుత్వంప్రభుత్వం తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు.పార్టీ నాయకులు ఎక్కడిక్కడ నిరసన వ్యక్తం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపుమరోవైపు.. కేటీఆర్, హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు తెలంగాణభవన్కు చేరుకున్నారు. అసెంబ్లీకి ముట్టడికి బీజేవైఎం ప్రయత్నం.. అసెంబ్లీకి ముట్టడికి వచ్చిన బీజేవైఎం నేతలు..వారిని అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు.ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. కాసేపు అసెంబ్లీ వాయిదా..కూనంనేని కామెంట్స్..సభకు బీజేపీ సభ్యులు సహకరించాలి..22Aపై చర్చకు సిద్ధం అని ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి బీజేపీ సభ్యులు ఓపికతో ఉండాలి.బీజేపీ సభ్యుల ఆందోళన మధ్య శాసనసభకు విరామంకాసేపు అసెంబ్లీ వాయిదా.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్బీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కు అయింది.సభను ఉద్దేశ్యపూర్వకంగా బీజేపీ సభ్యులు అడ్డుకుంటున్నారు..చర్చకు సిద్ధం అన్నాక కూడా ఈ రాద్ధాంతం ఎందుకు?. కొండా సురేఖ దూరం..అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ దూరం.కాంగ్రెస్లోనే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సురేఖ.సెషన్ మొత్తానికి దూరంగా ఉండాలని సురేఖ నిర్ణయం?పోలీసులు, ప్రభుత్వంపై సబిత, సునీత ఆగ్రహం.. అసెంబ్లీ వద్ద మాకు అవమానం జరిగింది.మా పట్ల జరిగిన తీరుకు పోలీసులు క్షమాపణలు చెప్పాలి: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు.లేదంటే స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తన మెడ పట్టుకుని తోసేయడంపై సబిత ఆగ్రహంతన చీరను లాగారని కన్నీరు పెట్టుకున్న సునీతఅసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్న మహిళా ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన పోలీసులు.నిరసన చేయడం ఎమ్మెల్యేల హక్కు: సబితా ఇంద్రా రెడ్డి.టీ షర్ట్స్ పై స్లోగన్స్ రాయొద్దు అని ఎక్కడైనా అసెంబ్లీలో చట్టం ఉందా?మహిళా ఎమ్మెల్యేల మీద దాడి ప్రభుత్వం దుశ్చర్య: సునీత లక్ష్మారెడ్డి నాపై జరిగిన దాడికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిందే.నాపై దాడితోపాటు ఎమ్మెల్యేలపై దాడి చేసినందుకు స్పీకర్కి ఫిర్యాదు చేస్తాం.తప్పు చేసిన అధికారులపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే.ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. మరోవైపు.. తెలంగాణభవన్ చేరుకున్న కేటీఆర్, హరీష్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.సభలో బీజేపీ సభ్యుల నిరసన..22-ఏపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్..మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..సభ సజావుగా జరిగేలా బీజేపీ సభ్యులు చూడాలి.ఈ సెషన్లో 22A పై షార్ట్ డిస్కషన్ చేస్తాం.వాయిదా తీర్మానంపై ప్రొసీజర్ ప్రకారమే ఉంటుంది.ఏ నుంచి జెడ్ వరకు చర్చకు సిద్ధంగా ఉన్నాం.ఏ అంశమైనా ప్రభుత్వానికి అభ్యంతరం లేదు.సామాన్య ప్రజానీకానికి ఏ మాత్రం ఇబ్బంది లేని సలహాలేవి ఇచ్చినా తీసుకుంటాం. కేటీఆర్కు గాయాలు.. కన్నీటి పెట్టిన సునీత.. పోలీసులకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మధ్య తోపులాట. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడ్డుకుంటున్న పోలీసులురోడ్డుపైనే బైఠాయించి పోలీసుల తీరుకు, ప్రభుత్వం తీరుకు నిరసన వ్యక్తం చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లుకేటీఆర్, హారీష్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు.శాసనసభ ముందు కన్నీరు పెట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి..తనపై పోలీసులు దాడి చేశారని, నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యేమరోవైపు సబిత, సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించిన పోలీసులుఅసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దౌర్జన్యం1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనకు వ్యతిరేకంగా గన్పార్క్ నుంచి అసెంబ్లీకి నిరసనగా వెళ్తున్న ఎమ్మెల్యేల పట్ల పోలీసుల… pic.twitter.com/lVlnjG8VEM— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..అసెంబ్లీలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి “దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్” ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.పోలీసులు నెట్టేశారని సునీత లక్ష్మారెడ్డి కంటతడిఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నెట్టేసిన పోలీసులుతోపులాటలో కేటీఆర్ చేతికి గాయంమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్లకార్డులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలునల్ల టీషర్ట్స్తో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు. బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు. పోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదంతోపులాటలో కిందపడిపోయిన హరీష్ రావు, జగదీష్రెడ్డి. పోలీసులతో తోపులాటలో కిందపడ్డ హరీష్ రావుహరీష్ రావు చేతిని తొక్కి అమానుషంగా ప్రవర్తించిన పోలీసులునలుపు రంగు దుస్తులతో అసెంబ్లీకి, శాసన మండలికి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు https://t.co/mCFRw3CbdE pic.twitter.com/JRoujq550Q— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026గన్పార్క్ వద్ద కేటీఆర్ కామెంట్స్..కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది.కాంగ్రెస్ మోసాలను అసెంబ్లీలో నిలదీస్తాం.హామీల అమలుపై పోరాటం చేయాలని మా నాయకుడు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.100 రోజుల్లోనే ఇస్తామన్న రూ.15000 రైతు భరోసా ఏమైంది?.నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం రూ.82000 బాకీ పడింది.జాబ్ క్యాలెండర్ ఏమైంది?.రియల్ ఎస్టేట్ కోసం తెచ్చిన జీవో 97ను రద్దు చేయాలి.కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు రూ.1200 కోట్లు బకాయి పెట్టింది.సింగరేణిలో దోపిడీపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తాం.నెలరోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. బీఆర్ఎస్, బీజేపీకి కౌంటర్.. చర్చకు సిద్ధమైన ప్రభుత్వం22-ఏ, ఫీరియింబర్స్మెంట్పై చర్చకు సిద్ధమైన ప్రభుత్వం.బీఏసీలో రెండు అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం.బీఏసీలో ప్రభుత్వం తరఫున ప్రతిపాదన పెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు.కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. గన్ పార్క్..అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి నిరసనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలుభూ భారతిలో జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలంటూ నినాదాలు..22ఏ భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చేయాలని డిమాండ్..అసెంబ్లీ గేట్ వద్ద తోపులాటప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించిన బీజేపీ ఎమ్మెల్యేలుఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట..సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు..ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాగేసుకున్న పోలీసులుగన్పార్క్ వద్ద ఉద్రిక్తత..గన్పార్క్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేల నిరసన.గన్పార్క్ వద్దకు ఎమ్మెల్యేలు వస్తుంటే అడ్డుకున్నారని పోలీసులతో బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదం.అసెంబ్లీ బయట ప్లకార్డులను అడ్డుకోవడానికి పోలీసులు ఎవరంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యేలు22A సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేపట్టాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్అసెంబ్లీ మీడియా పాయింట్బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కామెంట్స్.. అధికార పక్షంతో సహా మాకు సమాన హక్కులు ఉండాలి.అసెంబ్లీలో ఇంతమంది మార్షల్స్ ఎందుకు?.మమ్మల్ని ప్రశ్నించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.సీఎంకు రూల్స్ తెలియవు.. కానీ శ్రీధర్ బాబుకు అన్నీ తెలుసు.రాష్ట్రంలో క్రైం రేటు పెరిగింది.శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి..ముఖ్యమంత్రి గుండ్లు పీకుతా,పేగులు మెడలో వేసుకుంటా అనడం వల్లే క్రైం రేటు పెరుగుతుంది.కనీసం నెల రోజులు సభ జరపాలి.నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ నేతలు..నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు.హామీల అమలులో కాంగ్రెస్ విఫమైందని నిరసనలుకాంగ్రెస్వి 420 హామీలంటూ ఆగ్రహం అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపుఅసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ఇందిరాపార్క్ ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణమరోవైపు గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీకి రానున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు22A పై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీకనీసం 15 రోజులు సభను నడిపించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీకాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది.ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ మండలి సమావేశాలు వాడీవేడిగాసాగే అవకాశం ఉంది.ప్రశ్నోత్తరాల తర్వాత మూడు ప్రధాన అంశాలకు సంబంధించిన నివేదికలు సీఎం టేబుల్ చేయనున్నారు.తెలంగాణ సమగ్రశిక్ష 2024–25 ఆడిట్ నివేదిక, పీఎం శ్రీ తెలంగాణ 2024–25 ఆడిట్ నివేదిక ప్రవేశపెట్టనున్నారు.మెట్రోకు సంబంధించి ఐదు వార్షిక నివేదికలు సభ ముందుకు రానున్నాయి.22ఏ భూముల వ్యవహారంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.22ఏపై అన్నివిధాలుగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.సర్పంచ్ల కోసం బిల్లు..ఈ నెల 11 వరకే శాసనసభ నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం?ఎన్ని రోజులు నిర్వహించాలనే నిర్ణయంపై బీఏసీలో క్లారిటీ.తెలంగాణ శాసన సభలో కీలక బిల్లు.నిధులు నేరుగా సర్పంచులకే అందేలా అసెంబ్లీలో బిల్లు పెట్టనున్న ప్రభుత్వంబీఆర్ఎస్ వ్యూహం..ఉదయం 9 గంటలకు గన్ పార్ట్ దగ్గర అమరులకు బీఆర్ఎస్ నేతల నివాళులు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఅసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా బీఆర్ఎస్ వ్యూహంఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎర్రవల్లి ఫామ్హౌజ్లో దిశానిర్ధేశం చేసిన కేసీఆర్ప్రజా సమస్యలపై చర్చకు నెలరోజుల సభకు బీఆర్ఎస్ డిమాండ్ఫీజు రీయింబర్స్మెంట్పై బీఆర్ఎస్ ఫోకస్విద్యార్థుల సమస్యలపై సభలో గళమెత్తనున్న గులాబీ పార్టీకాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్లాన్22A భూముల అంశాన్ని సభలో లేవనెత్తనున్న బీఆర్ఎస్కరెంట్ కోతలు, రుణమాఫీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్న బీఆర్ఎస్ఉద్యోగుల పీఆర్సీ, డీఏలపై ప్రభుత్వంపై ఒత్తిడిఈహెచ్ఎస్, పాలిటెక్నిక్ జీవో 97పైనా ప్రశ్నలుసింగరేణి అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయనున్న గులాబీ పార్టీరైతులు, విద్యార్థులు, ఉద్యోగులే బీఆర్ఎస్ ప్రధాన అజెండాసభకు తప్పకుండా హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించిన కేసీఆర్అసెంబ్లీ సమావేశాలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేలా బీఆర్ఎస్ ప్లాన్ -
ప్రశ్నోత్తరాలు.. పలు నివేదికలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శాసనసభలో చేపట్టాల్సిన అధికారిక కార్యక్రమాలతో కూడిన ‘లిస్ట్ ఆఫ్ బిజినెస్’ను శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి జారీ చేశారు. తొలిరోజు ఎజెండాలో భాగంగా ప్రశ్నోత్తరాలతో పాటు పలు కీలక నివేదికలను సభకు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష (టీఎస్ఎస్)కు సంబంధించిన 2024–25 ఆడిట్ నివేదికను సభ ముందుంచుతారు. అలాగే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) తెలంగాణకు సంబంధించిన 2024–25 ఆడిట్ నివేదికను కూడా ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు సంబంధించిన 2013–14, 2014–15, 2015–16, 2016–17, 2017–18 వార్షిక నివేదికలను సభ ముందుంచనున్నారు. బీఏసీలో పలు అంశాలపై చర్చ అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు కొనసాగాలి, ఏయే అంశాలపై చర్చ చేపట్టాలి, ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులు, తీర్మానాలు తదితర అంశాలపై తుది నిర్ణయం.. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తీసుకోనున్నారు. తొలిరోజు సభ ముగిసిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సమావేశాలను తక్కువ వ్యవధిలోనే ముగించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. స్పీకర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఈ నెల 13 నుంచి దక్షిణాఫ్రికాలో జరిగే కామన్వెల్త్ పార్లమెంటేరియన్ల సమావేశాలకు హాజరు కావాల్సి ఉండటంతో 11వ తేదీ మధ్యాహా్ననికే సమావేశాలు ముగించే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. అయితే దీనిపై సోమవారం జరిగే బీఏసీ భేటీలోనే స్పష్టత రానుంది. కాగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, భూవివాదాలు, సాగునీరు, 22ఏ నిషేధిత భూముల అంశం తదితర ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఏసీ సమావేశం కీలకంగా మారింది. మరోవైపు అసెంబ్లీలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను సీఎం రేవంత్రెడ్డితో కలిసి స్పీకర్ ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సోమవారం ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు జరిగే ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. సెంట్రల్ హాల్లోకి కేవలం ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. -
తుక్కుగూడ నర్సు హత్య ఘటనపై సీఎం రేవంత్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ నర్సు హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై మేజిస్టీరియల్ విచారణ చేయాలని ఆదేశించారు. నర్సు హత్య కేసులో ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా సత్వర న్యాయం అందించాలని కోరారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లపై విచారణ జరిపించాలన్నారు. సంబంధిత సంస్థ నిర్వహణలో నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాలని మహిళా ఉద్యోగుల భద్రతా నిబంధనల అమలుపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.అదేవిధంగా నిందితుడిపై పకడ్బందీ దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలను వేగంగా సేకరించాలని ఆదేశించారు. సమగ్ర ఛార్జ్షీట్ దాఖలు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని న్యాయశాఖ, పోలీసు, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ వేగంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏం జరిగింది?తుక్కుగూడలో యువ నర్సు అనుమానాస్పద మృతి చెందింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతిపై లైంగిక దాడి.. ఆమె ప్రతిఘటించడంతో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్థానికంగా మెకానిక్గా పని చేసే సనావుల్లా ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. తాజాగా దీనిపై సీఎం స్పందించారు. -
‘సర్’ ఒక సాకు మాత్రమే.. కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది: రాంచందర్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ చుట్టూ మాటల యుద్ధం ముదురుతోంది. ఓ వైపు ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ విమర్శలు చేస్తుండగా.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీ ఓటమి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.రాంగోపాల్పేట్ డివిజన్కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, ఎస్ఐఆర్, విద్యావ్యవస్థపై ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎస్ఐఆర్ ద్వారా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపిస్తున్నారని రాంచందర్రావు అన్నారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేరళలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ విజయం సాధించిందని ఆయన గుర్తుచేశారు. దీంతో ఎస్ఐఆర్ కారణంగానే బీజేపీ గెలుస్తుందన్న కాంగ్రెస్ వాదనలో అర్థం లేదని వ్యాఖ్యానించారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఆ ఓటమికి ముందుగానే ఎస్ఐఆర్ను కారణంగా చూపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని రాంచందర్రావు పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియను అడ్డుపెట్టుకుని బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించి, మజ్లిస్కు కాంగ్రెస్ ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని విమర్శించారు.విద్యావ్యవస్థపై తీవ్ర అసంతృప్తిరాష్ట్రంలోని విద్యావ్యవస్థ పరిస్థితిపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. టీచర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ముందుగా విద్యావ్యవస్థను చక్కదిద్దడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడం ప్రభుత్వం వల్ల కాకపోతే.. ఆ శాఖను వేరే వారికి అప్పగించాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై బీజేపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వీధుల్లో పోరాటం చేయడంతో పాటు అవసరమైతే న్యాయస్థానాల్లోనూ పోరాడతామని తెలిపారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఇవి కూడా చదవండి: అసెంబ్లీలో ‘వెయ్యి రోజుల’ సమరం! -
‘నా వల్లే ఇదంతా’.. బోరున ఏడ్చేసిన కొండా సుష్మిత!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గం నుంచి తన తల్లి కొండా సురేఖను తప్పించడంపై ఆమె కుమార్తె కొండా సుష్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తల్లికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ భోరున విలపిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఉన్న కోపాన్ని తన తల్లిపై చూపించి బలిచేశారని ఆరోపించారు.మా అమ్మను ఇంతగా అవమానిస్తారని తెలిస్తే నేను ఆ రోజు ఆ విధంగా మాట్లాడేదాన్ని కాదు. నేను మాట్లాడిన దానికి మా అమ్మను బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను అన్న మాటల్లో తప్పులేదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి నాపై ఈ స్థాయిలో పగ పెంచుకుంటారని ఊహించలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.మా అమ్మ చేసిన ఒక్క తప్పునైనా చూపించగలరా? 'పార్టీలో నేనైనా ఉండాలి, లేదా ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారుతారా? అని రేవంత్ రెడ్డి తీరును నిలదీశారు. ఎంపీపీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కొండా సురేఖ దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న తమ కుటుంబాన్ని ఇప్పుడు తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేసిన తరుణంలో కొండా సుష్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని, ఆమె గొంతు నొక్కలేరని పేర్కొన్నారు. సీఎం రేవంత్ను శపిస్తున్నట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా, తన వ్యాఖ్యల వల్లే తల్లి పదవికి ముప్పు వచ్చిందనే భావనతో సుష్మిత భావోద్వేగానికి గురవుతూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. బోరున ఏడ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత నా వల్లే మా అమ్మకు ఇంత అవమానంనేను మాట్లాడిన మాటలకు మా అమ్మను ఇంతలా అవమానిస్తారా? –కొండా సుష్మిత pic.twitter.com/2njDtBF1G0— Mirror TV (@MirrorTvTelugu) September 6, 2026 -
కల్వకుంట్ల కుటుంబం.. కాసుకో..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/నకిరేకల్: ‘మీదంతా గతమే బిడ్డా.. రాసిపెట్టుకో.. మీకు భవిష్యత్తు లేదు. మీ బతుకులు చీకటిమయమే.. రేవంత్రెడ్డి ఉన్నంతకాలం.. కార్యకర్తలు అండగా నిలిచినంత కాలం బీఆర్ఎస్ అనే మాటనే ఎత్తనివ్వం. తెలంగాణ తులసి వనంలో బీఆర్ఎస్ గంజాయి మొక్కను పీకుతాం’అని సీఎం రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చేసారి సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. ఈ నెలాఖరుకు సిరిసిల్లకు వచ్చి ఆ గడ్డపై మూడు రంగుల జెండా ఎగురవేస్తానన్నారు. వచ్చే నెల్లో సిద్దిపేటపై దండయాత్ర చేస్తామన్నారు. బావబామ్మర్దులు ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోవాలని, సిరిసిల్ల, సిద్దిపేటలో తేల్చుకుందామని, కల్వకుంట్ల కుటుంబం కాసుకోవాలన్నారు. రేవంత్రెడ్డి శనివారం నల్లగొండ జిల్లా నకిరేకల్లో ఏరియా ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేయి రోజుల ప్రజా పాలన ప్రగతి సభలో రేవంత్రెడ్డి ప్రసంగించారు. సీట్లు పెరిగితే 117, ఉన్న సీట్లే ఉంటే 90 సీట్లతో మళ్లీ 2029లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే పదేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని, 2024 నుంచి 2034 వరకు రెండు సార్లు ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి రా.. లేదంటే గౌరవంగా రాజీనామా చెయ్.. గజ్వేల్లో తేల్చుకుందాం..’అని పేర్కొన్నారు. తెలంగాణను ఉద్దరిస్తడట... ‘ఏ ప్రభుత్వంలోనైనా 365 రోజులు ఉద్యోగానికి రాకపోతే ఉద్యోగస్తులను తొలగిస్తారు. వెయ్యి రోజులు ప్రతిపక్ష నాయకుడిగా రూ.22,24,40,000 జీత భత్యాలు, తిరగడానికి బండి, ఉండడానికి ఇల్లు, అన్ని వసతులు తీసుకున్న కేసీఆర్ ఒక్క రోజు కూడా బయటకు రాలేదు. డిస్మిస్ చేయాలా వద్దా? ఆలోచించండి. కేసీఆర్ తీసుకున్న జీతం పేద ప్రజలు కట్టిన పన్నులు కాదా? ఎవడబ్బ సొమ్మని పందికొక్కులా మెక్కి ఫామ్హౌస్లో పడుకున్న మొనగాడు వస్తుండట, తెలంగాణను ఉద్దరిస్తడట’అని సీఎం రేవంత్రెడ్డి ప్రతిపక్షనేత, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాకు సంస్కారం లేకపోతే రోడ్డుపై కాలు పెట్టరు తనకు చదువు రాదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తనకు చదువు వస్తదో రాదో కానీ సంస్కారం ఉందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తనకు సంస్కారం లేకపోతే ఒక్కడు కూడా రోడ్డు మీద కాలు పెట్టరని, ఫామ్హౌస్లో పడుకోవాలన్నారు. సంస్కారం ఉంది కాబట్టే సీతక్క, కొండా సురేఖను ఇంట్లోకి పిలిచి రాఖీ కట్టించుకున్నానని, అదే తన సంస్కారమన్నారు. సంస్కారం లేని కేటీఆర్ ఆస్తి కోసం సొంత చెల్లిని మెడ పట్టి బయటకు నెట్టిన దుర్మార్గుడని.. తనకు, కేటీఆర్కు పోలికేంటన్నారు. ప్రజలను మోసం చేసి కొడుకు, అల్లుడు, బిడ్డ, చుట్టాలను బందిపోట్ల ముఠాను మొత్తం తీసుకొచ్చి దోచుకుతిన్నారన్నారు. కేసీఆర్ బిడ్డ జైలు నుంచి దుఃఖంతో ఇంటికిపోతే, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన దుర్మార్గుడని రేవంత్రెడ్డి అన్నారు. సొంత చెల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా..? అని ఎద్దేవా చేశారు. పాలనను ప్రజలు బేరీజు వేయండి ప్రజలు పదేళ్ల ఆనాటి పాలనను, వెయ్యి రోజుల తమ పాలనను బేరీజు వేసుకుని చూడాలని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. నాటి, నేటి సంక్షేమ పథకాలను అంచనా వేయాలన్నారు. తాము వచ్చాక 25,35,000 రైతులకు రూ.2 లక్షల చొప్పున రూ.20,615 కోట్లు రుణమాపీ చేశామన్నారు. దీనిపై సిద్దిపేట గడ్డమీద అయినా, సిరిసిల్ల అడ్డమీద అయినా చర్చకు సిద్ధంగా ఉన్నామని, మీరు సిద్ధమా అని ప్రశ్నించారు. చేతనైతే తండ్రి, కొడుకు, అల్లుడు అసెంబ్లీకి వస్తే లెక్కలు తేల్చుదామన్నారు. మా నిజాయితీ ఏందో, మీ బతుకేందో అసెంబ్లీలోనే తేల్చుకుందామని సవాల్ చేశారు. విద్య, వైద్యరంగాలకు పెద్ద పీట: మహేశ్గౌడ్ ప్రజా పాలన ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేసిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం కుటుంబం కోసం వచ్చిన ప్రభుత్వం. ఇప్పుడున్నది పేద బడుగు, మైనారిటీ వర్గాల ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వం బీసీ వర్గాలను విస్మరించిందని, నేడు ప్రజా ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టి గౌరవించిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ దక్షిణ తెలంగాణను సాగునీటి కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఎస్ఎల్బీసీ సొరంగమే శాశ్వత పరిష్కారమని నీటిపారుదల, పౌరసర ఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు జల సంజీవనిగా మారనున్న ఈ ప్రాజెక్టుకు ఎన్ని అవరోధాలు ఎదురైనా 2028 జూన్ నాటికి సొరంగంతోపాటు పెండింగ్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేస్తామనన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్కార్డులు జారీ కాలేదని, ప్రజలకు దొడ్డు బియ్యమే సరఫరా చేశారని మండిపడడ్డారు. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్: మంత్రి అడ్లూరి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు గొప్ప స్థాయిలో చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసి పనులు కూడా చేపట్టామనన్నారు. మంచి చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలన్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎంపీలు రఘువీర్రెడ్డి, చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, బీర్ల అయిలయ్య, కుంభం అనిల్రెడ్డి, జైవీర్రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. -
మోదీని వణికించిన యువతకు రేవంత్ ఓ లెక్కా?
కరీంనగర్/సిరిసిల్ల: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్నే వణికించిన యువతకు తెలంగాణ సీఎం ఓ లెక్క కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కరీంనగర్లో శనివారం నిర్వహించిన ‘యువ సమరభేరి’ సభలో కేటీఆర్ మాట్లాడారు. ఉడుకు నెత్తు రు ఉరకలెత్తితే పోరాటం పోటెత్తుతుందని, యువతతో పెట్టుకుంటే పెద్దపెద్ద వాళ్లే దిగిపోయారన్నారు. కష్టపడి సాధించుకు న్న తెలంగాణను పదేళ్లపాటు అభివృద్ధి పథంలో నడిపించా మని పేర్కొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, యూత్ కమిషన్, ప్రైవేటు కంపెనీల్లో 75 శాతం రిజర్వేషన్, యువతకు రూ.10లక్షల రుణాలు, రూ.4వేల నిరు ద్యోగభృతి, కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో జాబ్ కేలండర్ లేదని, స్కాం కేలండర్ నడుస్తోందని విమర్శించారు. నోటిఫికేషన్ లేకపోయినా లూటిఫికేషన్ కొనసాగుతోందన్నారు. నిరుద్యోగుల సమస్యలను ప్రశ్నిస్తే బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెయ్యి రోజులైనా హామీలను అమలు చేయలేని రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ రాజీనామా చేయాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అశోక్నగర్లో ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్గాంధీ.. ఓట్లు వేయించుకున్న తర్వాత తెలంగాణకు అడ్రస్ లేకుండా పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దండం పెట్టి ఓట్లు వేసిన ఉద్యోగులే కాంగ్రెస్కు పిండం పెడతారన్నారు. జీవో 97 రద్దు చేసే వరకు పోరాడతాం రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల భూములు, ఆస్తులపై రేవంత్రెడ్డి ప్రభుత్వం కన్నేసిందని కేటీఆర్ ఆరోపించారు. పాలిటెక్నిక్ కళాశాలలను కార్మిక శాఖ పరిధిలోకి తెచ్చేందుకు ఉద్దేశించిన జీవో 97ను రద్దు చేసే వరకు బీఆర్ఎస్ విద్యార్థుల వెంట ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారంలోని పాలిటెక్నిక్ కాలేజీలో 20 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను కలిసిన కేటీఆర్ వారి సమస్యలు తెలుసుకుని మాట్లాడారు. హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్తోపాటు సిరిసిల్ల, కరీంనగర్ తదితర పట్టణ ప్రాంతాల్లో విలువైన భూముల్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలల ఆస్తులపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆరోపించారు. తాను సిరిసిల్ల ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, ఈ జిల్లా బిడ్డగా విద్యార్థులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలేమయ్యాయి? కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచడంపైనే దృష్టి పెట్టిందని కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు టీఎస్–ఐపాస్ తీసుకొచ్చామన్నారు. సుమారు 6.50 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించామని వివరించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థులకు వివిధ దశల్లో ఆర్థిక సాయం, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్న హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. కేటీఆర్ కారుకు ప్రమాదం కరీంనగర్ జిల్లా పర్యటనలో కేటీఆర్ ప్రయాణిస్తున్న కారుకు అలుగునూర్ వద్ద లారీ తగిలింది. ప్రమాదం జరిగిన సమయంలో కేటీఆర్ కారులోనే ఉన్నారు. లారీ ఢీకొనడంతో కారు స్వల్పంగా దెబ్బతింది. అయితే కేటీఆర్కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం అనంతరం కేటీఆర్ తన పర్యటనను కొనసాగించారు. సమరభేరి సభలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
విద్యా వ్యవస్థను పదేళ్లు విధ్వంసం చేశారు
వికారాబాద్: ‘పదేళ్లు ఓ కుటుంబం విద్యా వ్యవస్థను విధ్వంసం చేసింది. రెండేళ్లు డెడికేటెడ్గా పనిచేసి వికాసం వైపు నడిపించి, దేశానికే దిక్సూచిగా తీర్చిదిద్దుకుందాం’అని సీఎం ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. శనివారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో రేవంత్రెడ్డి మాట్లా డారు. ‘నాకు రెండేళ్ల సమయం ఇవ్వండి.. విద్యాశాఖ మంత్రిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఆర్థిక వెసులుబాటును బట్టి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా.. రెండేళ్ల తర్వాత మీరు ఆశించిన ఫలితం రాకపోతే ఎన్నికల పరీక్షలో వంద మార్కులేస్తారో.. సున్నా మార్కులేస్తారో మీ ఇష్టం.మీ ఉద్యోగులు ఒక్కసారి పరీక్ష రాస్తే 35 ఏళ్లు ఉంటుంది.. మా సర్వీస్ ఐదేళ్లే. ప్రతీ ఐదేళ్లకోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది.. మా పనితీరును బట్టి ఆ పరీక్షలో పాస్ చేస్తారో.. ఫెయిల్ చేస్తారో మీ ఇష్టం’అని రేవంత్ అన్నారు. ప్రతిపక్షాల మాయలో పడి ఉపా«ధ్యాయులు రోడ్ల మీదకు రావద్దని, మీ సమస్యలు పరిష్కరించడానికి విద్యా కమిషన్ వేశామని, కేశవరావును సలహాదారుగా నియమించామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన 123 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రేవంత్రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అవార్డులు అందజేశారు. 28 నుంచి 17వ స్థానానికి... ప్రభుత్వ బడుల్లో చదివే వారిలో ఎక్కువ శాతం పేద విద్యార్థులేనని, వీరికి అత్యున్నత విద్యను అందించాల్సిన బాధ్యత ఉపా ధ్యాయులపైనే ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. విద్యాభివృద్ధిలో 2023లో తెలంగాణ 28వ స్థానంలో ఉండగా, ప్రజా ప్రభు త్వం కొలువుదీరాక ప్రస్తుతం 17వ స్థానానికి వచ్చామన్నారు. ఇది ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైందని కొని యాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యా ర్థుల సంఖ్య ఏటా పెరుగుతోందని తెలిపారు. విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలతో పాలిటెక్నిక్లో 95శాతం అడ్మిషన్లు నమోదయ్యాయని తెలిపారు. సాంకేతిక విద్యలో తెలంగాణ వేగంగా దూసుకుపోతోందన్నారు. ఐటీఐలలో ఇంతకుముందు అంబాసిడర్ కారు ఉంచి మెకానిక్ నేర్చుకోమనే వారని, తాను సందర్శనకు వెళ్లినప్పుడు ఇది చూసి ఆశ్చర్యం వేసిందని తెలిపారు. అంబాసిడర్ రిపేర్ నేర్చుకుని ప్రస్తుతం ఉన్న కార్లను ఎలా రిపేర్ చేస్తామని ఓ విద్యార్థి చెప్పగా.. రూ.4 వేల కోట్లతో ప్రతీ నియోజకవర్గంలో ఏటీసీ (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు) ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐలను వీటికి అనుసంధానం చేసి, విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అప్పుల కుప్ప చేశారు.. గత ప్రభుత్వం రూ.8.11 లక్షల కోట్లు అప్పు చేసి పోయిందని సీఎం రేవంత్రెడ్డి దుయ్య బట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా సర్వీస్ను 60 ఏళ్లకు పెంచారని, బెనిఫిట్స్ పెండింగ్లో పెట్టి ఆయన (కేసీఆర్) ఫామ్ హౌస్లో పడుకుంటే ప్రజా ప్రభుత్వం వచ్చి న 90 రోజుల్లోనే రూ.6 వేల కోట్లు చెల్లించిందని తెలిపారు. ఇప్పుడు కూడా ఖజానాలో ఎన్ని సమస్యలున్నా బకాయిల కోసం ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, కలెక్టర్ దీపక్తివారీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓట్లను తొలగించే కుట్ర: సీఎం కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించేందు కు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. కొడంగల్లోని తన నివాసంలో బీఎల్ఏలు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. నోటీసులు ఇచ్చిన వారికి అండగా ఉండి, ఓట్లను రక్షించుకోకపోతే ఆగమైతామన్నారు. గత ఎన్నికల్లో మనం గెలిచింది.. రెండు శాతం ఓట్లతోనేనని, ప్రస్తుతం ఎస్ఐఆర్ అస్త్రం వాడి పది శాతం ఓట్లను బీజేపీ తొలగిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అనుకూల పేదలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలే టార్గెట్గా ఓట్ల తొలగింపు జరుగుతోందన్నారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని తెలిపారు. గతంలో ఈడీ, సీబీఐ పేరుతో భయపెట్టించిన బీజేపీ.. ఇప్పుడు ఎస్ఐఆర్ తెచ్చి తడిగుడ్డతో గొంతు కోస్తోందని మండిపడ్డారు. బిహా ర్, పశ్చిమబెంగాల్లో ఇలాంటి వ్యూహంతోనే ఆపార్టీ గెలిచిందన్నారు. ఓటర్లకు అవసరమైన సర్టిఫికెట్లను వెంటనే ఇవ్వాలని కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. -
రూ. 70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల రంగానికి ఊతమిచ్చేలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ రూ.70 వేల కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం హైపర్వాల్ట్, దాని భాగస్వామ్య సంస్థలు కలిపి దేశంలోనే అతిపెద్ద భారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించింది. ఈ కేంద్రం నిర్మాణాన్ని 18 నుంచి 24 నెలల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పింది. ఈ మేరకు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ సమక్షంలో టీసీఎస్ ఎండీ, సీఈవో కృతివాసన్– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఫ్యూచర్ సిటీలో ఒక గిగావాట్ సామర్థ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు సంస్థ 250 ఎకరాల భూమిని సేకరించింది. ఏఐలో ముందు వరుసలో: సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో ఈస్థాయిలో భారీ పెట్టుబడి రావడంపై సీఎం రేవంత్రెడ్డి స్పందిస్తూ. .‘నా కల నెరవేరింది. ఫ్యూచర్ సిటీలో రూ. 70 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుండటం గర్వకారణం. నేను టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ను దావోస్లో కలిసి తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టాలని కోరాను. అప్పుడు ఆయన నవ్వుతూ సరేనన్నారు. ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఈ డేటా సెంటర్ ద్వారా 7000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే టాటా సంస్థ తరపున రాష్ట్రంలో 85 వేల మంది ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారు. కొత్తగా ఏడువేలతో అది 92 వేలకు చేరుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫ్యూచర్సిటీ వరకు నిర్మిస్తున్న మొత్తం 50 కి.మీ. రహదారికి భారతరత్న రతన్టాటా పేరు పెడుతున్నాం. 2034 నాటికి ఒక ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను నిలపాలన్న స్వప్నం సాకారం కావాలంటే ఫారŠూచ్యన్ 500 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి. 2047 నాటికి మూడు ట్రిలియన్ ఎకానమీని సాధించాలి. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశానికి 5 శాతం జీడీపీని అందిస్తోంది. దానిని పది శాతానికి పెంచాలన్నది నా తాపత్రయం. ప్రపంచ ఏఐ విప్లవంలో హైదరాబాద్ ఇప్పుడు ముందు వరసలో నిలిచింది’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పార్టీల మధ్య విధానాల్లో భిన్నాభిప్రాయాల్లో ఉండవచ్చు కానీ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి విషయంలో మాత్రం అలాంటివేమీ ఉండవని స్పష్టం చేశారు. ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భావన ఉందని, ఇందులో ఇంజనీరింగ్ టెకీలకు తాను ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేనని, కానీ బ్లూకాలర్ జాబ్స్ వాళ్లకు మాత్రం ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని రేవంత్రెడ్డి చెప్పారు. మావి మాటలు కాదు...పెట్టుబడులు :శ్రీధర్బాబు సీఎం రేవంత్రెడ్డి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన ఫ్యూచర్సిటీలో పెట్టుబడుల వెల్లువ ప్రారంభమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చెపప్పారు. తాము కేవలం మాటలు చెప్పడం లేదని. పెట్టుబడుల రాక నిజమని వ్యాఖ్యానించారు. టీసీఎస్ ఆతిథ్య, పర్యాటక, పరిశ్రమలు, సేవారంగం,అటవీ రంగాల్లో పెట్టుబుడులు పెడుతోందన్నారు. తెలంగాణవైపు దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి చూస్తున్నాయన్నారు. తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని టీసీఎస్ ఎండీ, సీఈవో కె.కృతివాసన్, చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు, ప్రతిపాదించిన పెట్టుబడులపై ఇస్తున్న సహకారానికి హైపర్వాల్ట్ ప్రెసిడెంట్ రాజన్న, సీఈఓ దీపేష్ కిరణ్ నందాలు కృతజ్ఞతలు తెలిపారు. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్లలో ఇది ఒకటిగా నిలవనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనగా, ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె. శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి పాల్గొన్నారు. -
ఇక సిరిసిల్ల, సిద్ధిపేటలపై దండయాత్రే: సీఎం రేవంత్
నల్లగొండ: నకిరేకల్ సభలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్ధిపేట స్థానాలు కూడా తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో సిరిసిల్లకు పోదాం.. అక్కడ కదం తొక్కుదాం అని కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై దండయాత్ర చేస్తామన్నారు సీఎం రేవంత్. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరిగితే 110 స్థానాల్లో గెలుస్తామన్నారు. ఒక ఇవే స్థానాలకు ఎన్నికలు జరిగితే 90 స్థానాల్లో గెలుస్తామన్నారు. దీనిలో భాగంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్లకు రేవంత్ సవాల్ విసిరారు. ‘రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?, సిద్ధిపేట.. సిరిసిల్ల అయినా మేం చర్చకు రెడీ. బీఆర్ఎస్ పదేళ్లు.. మా రెండేళ్లు పాలనను బేరీజు వేసుకోండి.గతంలోని బీఆర్ఎస్ పథకాలనూ మేం కొనసాగిస్తాం. కొందరు దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తున్నారు. వచ్చేసారి కూడా తెలంగాణలో ఇందిరమ్మ పాలన వస్తుంది. గోదావరి, కృష్ణా కలిసి పారితే ఎలా ఉంటుందో నకిరేకల్ లో జనాలు అలా వచ్చారు. కొందరు దుర్మార్గులు, సన్నాసులు సీఎం రాజీనామా చేయాలని అంటున్నారు. గంగిరెద్దుల్లా కాంగ్రెస్ పాలనను విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను బేరీజు వేసుకోండిగతంలో బీఆర్ఎస్ ప్రకటించిన అన్ని పథకాలను కొనసాగించాం. గతంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ చేయలేదు. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుని ఏడున్నర వేల కోట్లు మింగారు. చివర్లో రైతు బంధు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ పేరుతో ఎగ్గొట్టారు. రెండు లక్షల రుణమాఫీ చేశాం. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని గతంలో అనలేదా?., సన్న ధాన్యం పండించిన వారికి బోనస్ ఇస్తున్నాం. రైతుల కోసం 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశాం. దమ్ముంటే తండ్రి కొడుకులు, మామా అల్లుళ్లు శాసన సభలో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.ఇదీ చదవండి: కొండా సురేఖ మా పార్టీలోకి కూడా వద్దు -
తెలంగాణకు భారీ డేటా సెంటర్.. రూ.70 వేల కోట్ల పెట్టుబడి!
తెలంగాణలో భారీ పెట్టుబడులకు మరో అడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలిచే ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో.. 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ సమీపంలోని.. కొంగరకలాన్ ఫ్యూచర్ సిటీలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో.. తెలంగాణ ప్రభుత్వం, టీసీఎస్, హైపర్ వాల్ట్ ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణను దేశంలోని ప్రముఖ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.ప్రపంచ స్థాయి ప్రమాణాలతో..తెలంగాణలో ఓపెన్ ఏఐకు అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా ఉండనుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. వన్ గిగావాట్ సామర్థ్యం కలిగిన ఈ డేటా సెంటర్ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించనున్నట్లు తెలిపారు.డేటా సెంటర్లకు.. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలు వంటి రంగాల నుంచి భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద డేటా సెంటర్ తెలంగాణలో ఏర్పాటు కావడం రాష్ట్ర డిజిటల్ ఎకానమీకి మరింత బలం చేకూరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.దావోస్ భేటీతో మొదలై..ఈ ప్రాజెక్టు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కీలకమని ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే.. జనవరిలో దావోస్లో టీసీఎస్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న 'తెలంగాణ రైజింగ్' పాలసీ, అలాగే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై టాటా సన్స్ చైర్మన్ ఆసక్తి చూపారని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యమంత్రి చేసిన చర్చల అనంతరం టాటా గ్రూప్ ఈ భారీ ప్రాజెక్టుకు సిద్ధమైనట్లు వెల్లడించింది. ప్రస్తుతం టాటా గ్రూప్కు చెందిన సంస్థల్లో.. తెలంగాణలోనే సుమారు 83 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఈ కొత్త ప్రాజెక్టుతో రాష్ట్రంలో టాటా గ్రూప్ కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉంది.ఏడువేల ఉద్యోగాలుతెలంగాణలో ప్రారంభం కానున్న..ఈ భారీ డేటా సెంటర్ నిర్మాణాన్ని 18 నుంచి 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ, సాంకేతిక సేవలు, విద్యుత్, భద్రత, మౌలిక వసతులు వంటి అనేక రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.ఫ్యూచర్ సిటీకి ప్రాధాన్యంరూ.70 వేల కోట్ల పెట్టుబడి.. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయి అని ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచ స్థాయి డేటా సెంటర్ ఏర్పాటు కావడం ద్వారా.. ఫ్యూచర్ సిటీ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది.కాగా.. ఇప్పటికే ఫ్యూచర్ సిటీని భవిష్యత్ టెక్నాలజీ, పరిశ్రమలు, ఆధునిక మౌలిక వసతులకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ భారీ పెట్టుబడి మరిన్ని అంతర్జాతీయ, జాతీయ సంస్థలను తెలంగాణ వైపు ఆకర్షించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.మెండుగా బ్లూ కాలర్ ఉద్యోగాలుఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, బ్లూ కాలర్ ఉద్యోగాలను పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కానీ, టాటా గ్రూప్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా బ్లూ కాలర్ ఉద్యోగాలు పెరుగుతాయని అన్నారు. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. భవిష్యత్ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు యువతలో పెంచడం ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.రేడియల్ రోడ్డు.. రతన్ టాటాకు అంకితంఫ్యూచర్ సిటీకి మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడానికి.. త్వరలోనే కొంగరకలాన్ ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్డును నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. ఈ రహదారిని భారతరత్న రతన్ టాటాకు అంకితం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అంతే కాకుండా.. తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా మార్చి, భారీ పరిశ్రమలు, టెక్నాలజీ సంస్థలను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లుతెలంగాణను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడంలో.. భారీ పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. 2037 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తోందని సీఎం తెలిపారు. టాటా, టీసీఎస్, హైపర్ వాల్ట్ వంటి సంస్థల భారీ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.Hyderabad just landed India's Largest AI Data Centre.1 GW capacity. ₹70,000 Cr investment. 7,000+ jobs.HyperVault (@TataCompanies ) + @TCS bet big on Telangana's AI future. #TelanganaRising2047 #AI #Hyderabad @OpenAI @OffDSB @revanth_anumula https://t.co/xW4eJPpk42 pic.twitter.com/LSwf5juCtT— Telangana Rising 2047 (@TGRising2047) September 5, 2026 -
ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు
-
ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?
-
సురేఖ ఎపిసోడ్, కేబినెట్ విస్తరణపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం, కొండా సురేఖ ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సురేఖను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కేబినెట్ విస్తరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారం జరుగుతుందని తెలిపారు.మీడియా చిట్ చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే. ఢిల్లీలో కేబినెట్ విస్తరణపై చర్చ జరగలేదు. కేవలం కొండా సురేఖ, చిన్నా రెడ్డి అంశంపై మాత్రమే చర్చ జరిగింది. కేబినెట్ విస్తరణపై హై కమాండ్ నుండి ఎలాంటి సమాచారం లేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం. నాకు మంత్రి పదవి అనే ప్రచారంపై నాకు మాత్రం సమాచారం లేదు. అవన్నీ ఊహాగానాలే. అలాగే, కొండా సురేఖను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. సురేఖ విషయంలో అందరం మా వంతు ప్రయత్నం చేశాం. సురేఖ విషయంలో ఏఐసీసీ ఒప్పుకోలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ నెరవేర్చారు. కుల సర్వే శాస్త్రీయంగా చేశాం. రాబోయే వంద రోజులు దేశవ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన చేస్తాం. బీసీ హక్కుల కోసం జరిగే గర్జనను విజయవంతం చేయండి’ అని పిలుపునిచ్చారు.మరోవైపు.. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బండి సంజయ్, అరవింద్, ఈటల, లక్ష్మణ్ బీసీల అంశంపై స్పందించాలి. అడిగితే పదవులు పోతాయని బీజేపీ బీసీ నేతలు భయపడుతున్నారా?. తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా తేల్చుకోండి. కుల గణనలో దేశానికి రోల్ మోడల్గా ఉన్నాం. తెలంగాణ చేసిన కులగణనలో అన్ని విషయాలు పొందుపరిచాం. మేం పంపిన ఫైల్పై కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ఓబీసీల జనాభాను ఎందుకు లెక్కించడం లేదు? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: తెలంగాణలోనూ అలాగే గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్ -
‘రాహుల్ ఎక్కడున్నావు.. హైదరాబాద్కు ఎందుకు రావు’
సాక్షి, కరీంనగర్: ఒక్కరిని బర్తరఫ్ చేయడం కాదు.. మీ ప్రభుత్వమే బర్తరఫ్ కానుందంటూ రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ యువ సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలు అడిగితే ఉరికిచ్చి కొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ‘‘రాహుల్ గాంధీ, ఎక్కడున్నావు.. హైదరాబాద్కు ఎందుకు రావు’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.రేవంత్రెడ్డి రెన్యూవల్ సీఎం.. జాబ్ క్యాలెండర్.. చిత్తు కాగితం కంటే హీనమని తేలిపోయింది. వెయ్యి రోజులయ్యాయి. యూత్ డిక్లరేషన్ గురించి అడిగితే బూతులు వినిపిస్తున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రి వాటాలు, కమీషన్ల కోసం తన్నుకుంటున్నారు. వీళ్లకు తిక్క ఉంది.. కానీ లెక్కలేదు. నోటిఫికేషన్లు లేవు.. లూటిఫికేషన్లు మాత్రం జరుగుతున్నాయి. నిరుద్యోగులు నిప్పు కణికలే మండాలి.. మళ్లీ పుడతామా ఏంటి?’’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు.కేసీఆర్ రాజీనామా చేయాలా?. ధోకేబాజ్ రేవంత్ చేయాలా?. కేసీఆర్తో పెట్టుకుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫోర్ ట్వంటీ హామీలిచ్చిన మీరే 420 సార్లు హామీలు చేయాలి. మంత్రులు, ముఖ్యమంత్రి కొట్లాడుకుంటున్నారు. మీకు దండం పెట్టినోళ్లే.. రేపు పిండాలు పెడతారు. రాహుల్ గాంధీ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు.. అవుతల పడ్డాడు. సీల్డ్ కవర్లో పంపిన మీ సీఎం ఏం చేస్తుండో నీకు సోయి ఉందా రాహూల్ ?. నెలకోసారి మూటలు తీసుకుని రాహూల్ గాంధీ నోరు మూసుకుని కూర్చుంటుండు’’ అంటూ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. -
తెలంగాణలోనూ అలా గెలవాలన్నది బీజేపీ ప్లాన్: రేవంత్
సాక్షి, కొడంగల్: కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ‘SIR’ పేరుతో కేంద్రం ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలనే ముఖ్యంగా టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించాలని చూస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో కొడంగల్ నివాసంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొడంగల్ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్కు ఈ గుర్తింపు, గౌరవం వచ్చింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం SIR పేరుతో ఓట్లను తొలగించే కుట్ర చేస్తోంది. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేశారు. మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఎన్నికల్లో అలాగే గెలిచారు. తెలంగాణలోనూ అలాగే గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో దొంగ దెబ్బ తీస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవారు లేరు. ఓట్లు తొలగించి దొంగ దెబ్బ తీయాలనుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను బీజేపీ టార్గెట్ చేసింది. ఇంతకుముందు ఎన్నికల్లో ఓడించేందుకు ఈడీ, సీబీఐ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఓట్ల తొలగింపుతో తడిగుడ్డతో గొంతు కోసే చర్యలకు దిగుతున్నారు. చిన్న తప్పిదాలను సాకుగా చూపి బీజేపీ పేదల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోంది. కాంగ్రెస్ను ఓడించేందుకు ఈ కుట్రకు బీఆర్ఎస్ కూడా బీజేపీకి మద్దతు ఇస్తోంది. ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ప్రజల ఓట్లు కాపాడాల్సిన బాధ్యత ముఖ్య నాయకులపై ఉంది. గ్రామాల వారీగా బీఎల్ఏలను సమన్వయం చేసుకుని పేదల ఓట్లు తొలగించకుండా చూడాలి. ఓట్లు తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత మండల నాయకులదే. నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకోవాలి. ప్రతీ బూత్లో ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత వహించాలి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలి’ అని అన్నారు. ఇదీ చదవండి: ‘ఓరుగల్లు రాజకీయంలో ఆట మొదలైంది’మరోవైపు.. కొడంగల్లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర రాజనర్సింహ, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రభుత్వ సలహదారు కేశవరావు సహా పలువురు నేతలు ఉన్నారు. -
ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది!
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది. ఒకవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై చర్చ.. మరోవైపు వరంగల్ తూర్పులో అంతర్గత సమీకరణాలపై ఆసక్తి.. వెరసి ‘కొండా’ దంపతులకు ‘అక్కడ సెగ.. ఇక్కడ పొగ..’ అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఆమె స్వయంగా తెరదించారు. కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో తక్షణ రాజకీయ సంక్షోభంపై కొంత స్పష్టత వచ్చింది. వరంగల్ తూర్పుపై ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ గుండు సుధారాణిలు పట్టు బిగిస్తుండటం.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తూర్పులో కొండా కుటుంబానికి భిన్నంగా వేగమందుకున్న కాంగ్రెస్ నేతల కదలికలపై చర్చ మొదలైంది.కాంగ్రెస్లోనే.. సురేఖ స్పష్టత.. పార్టీ మారతారనే ప్రచారం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే చర్చ మధ్య సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో వెంటనే పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా వంటి అంశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీలో తన రాజకీయ ప్రాధాన్యాన్ని ఎలా కొనసాగిస్తారు? స్థానికంగా తన వర్గాన్ని ఎలా సమన్వయం చేసుకుంటారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.చదవండి: మంత్రివర్గంలోకి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్?పెరుగుతున్న వ్యతిరేక స్వరంవరంగల్ తూర్పు కాంగ్రెస్లో కొండా సురేఖకు భిన్నమైన రాజకీయ వర్గాలు గతంలోనూ ఉన్నాయి. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ గుండు సుధారాణి వంటి నేతలు వరంగల్ తూర్పు రాజకీయాల్లో తమదైన ప్రాధాన్యం కలిగిన నాయకులు. గత రాజకీయ పరిణామాల్లో కొండా కుటుంబంతో వీరికి భిన్నాభిప్రాయాలు కనిపించిన సందర్భాలున్నాయి. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన గుండు సుధారాణి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల చేస్తే ఊరుకునేది లేదని గట్టిగానే హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోటీ చేయాలని, తాను సైతం ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని బసవరాజు సారయ్య సురేఖకు సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో వీరి రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది? కొండా సురేఖతో పార్టీ అంతర్గతంగా సమన్వయం జరుగుతుందా? లేక కాంగ్రెస్లో వేర్వేరు రాజకీయ శక్తులుగా కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.‘కొండా’ అనుచర వర్గంలో మౌనంతాజా పరిణామాల తర్వాత కొండా సురేఖకు మద్దతుగా ఉండే నాయకులు, కార్యకర్తల నుంచి పెద్దగా బహిరంగ ప్రకటనలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీనిని మొత్తం అనుచరవర్గం మౌనంగా ఉందని చెప్పడం కంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న వాతావరణంగా చూడాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అనుచరుల రాజకీయ వైఖరి కూడా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉండే అవకాశముంది. భవిష్యత్తులో ఏదైనా కీలక రాజకీయ నిర్ణయం వస్తే.. స్థానికంగా ఆమె వెంట ఎవరెవరు నిలుస్తారన్నది అప్పుడే స్పష్టం కానుంది. దీంతోపాటు కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా సురేఖకు ఇప్పుడు ప్రధాన సవాలు పార్టీ బయట కంటే సొంత పార్టీలోనే తన రాజకీయ స్థానాన్ని నిలబెట్టుకోవడమే. కాంగ్రెస్లోనే ఉంటూ రాజకీయ బలాన్ని పునర్నిర్మించుకోవడమా? పార్టీలోని విభేదాలను అధిష్టానం దష్టికి తీసుకెళ్లడమా? వరంగల్ తూర్పులో తన కేడర్ను మరింత బలోపేతం చేసుకోవడమా? వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వారి తదుపరి రాజకీయ చర్యలతోనే స్పష్టం కానుంది. -
మంత్రివర్గంలోకి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్?
గాంధీ భవన్ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుడు ఒకటే ఉత్కంఠ! కొండా సురేఖ బర్తరఫ్తో ఖాళీ అయిన మంత్రి స్థానం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పాలకవర్గాల సమరానికి సిద్ధమవుతున్న వేళ..రాజధాని ప్రాంతం సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అనివార్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఏర్పడింది. ఇప్పటికే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో కలిపి భర్తీ చేయాల్సిన బెర్త్ల సంఖ్య మూడుకు చేరింది.సాక్షి, హైదరాబాద్: నగర పాలక సంస్థల సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పారీ్టకి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కేబినెట్ బెర్తులపై చర్చ తీవ్రమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, పరిసర రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్కు ఆశించిన స్థానాలు దక్కకపోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, రాబోయే గ్రేటర్ పోరులో గులాబీ, కాషాయ దళాల హోరాహోరీని తట్టుకుని జెండా పాతాలంటే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో బలమైన ప్రాతినిధ్యం తప్పనిసరైంది. ఎమ్మెల్సీ అజహరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకున్నప్పటికీ, స్థానిక రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి క్యాడర్ను మెప్పించే బలమైన నేతలకు పీఠం దక్కలేదనే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ..ఇప్పుడు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కేబినెట్ విస్తరణను ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. కేబినెట్æలో రాజధాని బెల్ట్కు చోటు దక్కితేనే పార్టీకి మైలేజ్ వస్తుందనే రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి.జెన్–జీ ప్లస్ బీసీ ఫార్ములాలో... జెన్–జీ ప్లస్ బీసీ ఫార్ములాలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, యువ నేత నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో ఆమె ఖాళీ చేసిన స్థానాన్ని తిరిగి బీసీ వర్గంతోనే భర్తీ చేసేవిధంగా ఒత్తిడి అధిష్టానంపై వచ్చే అవకాశం లేకపోలేదు. జెన్–జీ కోటాలో యువకుడైన నవీన్ యాదవ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే..ఒకవైపు బీసీ కోటా, జెన్జీ రాజకీయ ప్రాధాన్యతపై సముచిత నిర్ణయమవుతుందని కొందరు వాదిస్తున్నారు. కాగా బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే సమయంలో అధిష్టానం ఆయనకు సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా కల్పించడంపై సాంకేతిక, న్యాయపరమైన చిక్కులతో పాటు పాత కాంగ్రెస్ నేతల నుండి వస్తున్న నిరసనలను అధిష్టానం ఎలా సమన్వయం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.శివారులో అసంతృప్తి జ్వాలలు రాష్ట్ర రాజధానికి ఆనుకుని, అత్యధిక జనాభా, నియోజకవర్గాలు కలిగిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేబినెట్లో సరైన ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి స్థానిక నాయకత్వంలో నెలకొని ఉంది.. రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి వంటి సీనియర్ నేతలు ఇప్పటికే కేబినెట్ చోటు దక్కలేదనే ఆసంతృప్తి వ్యక్తం చేస్తూనే..సాక్షాత్తు ఏఐసీసీ పెద్దల వద్ద సైతం మొరపెట్టుకున్నారు. మరొకవైపు శాసనసభ స్పీకర్గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించకపోతే గ్రేటర్ చుట్టుపక్కల అర్బన్–రూరల్ నియోజకవర్గాల్లో పారీ్టకి ఇబ్బందులు తప్పవని జిల్లా నేతలు హెచ్చరిస్తున్నారు.హైకమాండ్ కోర్టులో బంతి ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం పూర్తిగా పార్టీ అధిష్టానం వద్దే తేలాల్సి ఉంది. ఒకవైపు పార్టీలోని సీనియర్ నేతల ఆశలు, మరోవైపు కొత్తగా చేరిన నాయకుల అంచనాలు, వీటితో పాటు సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి కత్తిమీద సాములా మారింది. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ విస్తరణ ఉండవచ్చనే ప్రచారంతో గాంధీ భవన్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పార్టీని బలపరచే దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తారా? లేక జిల్లా సీనియర్లు, బీసీ వర్గాలు నగర కీలక నేతల మధ్య సమతుల్యత పాటిస్తూ నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: మాజీ మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్ -
దేశానికే ఆదర్శం కావాలి
కొడంగల్/బొంరాస్పేట/కోస్గి: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని.. అమ్మలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం తన సొంత నియోజకవర్గమైన కొడంగల్కు రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. వికారాబాద్ జిల్లాలోని మద్దూరు, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించారు. శుక్రవారం సాయంత్రం హెలికాప్టర్లో దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, పోలేపల్లి శివారుకు చేరుకున్న సీఎం రేవంత్రెడ్డి.. రూ. 5 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ (విద్యా ప్రాంగణం) నిర్మాణ పనుల్లో పురోగతిని పరిశీలించారు. ఈ విద్యా ప్రాంగణం దేశానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. పనుల్లో వేగం పెంచాలని.. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతకు పెద్దపీట వేస్తూనే 2027 మార్చిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని గడువు విధించారు. విద్యా ప్రాంగణం చుట్టూ వర‡్ష్షం నీరు నిలవకుండా ఏర్పాట్లు చేయాలని.. ఇందుకోసం టెక్నాలజీ వినియోగించుకోవాలని సూచించారు. అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విద్యా ప్రాంగణంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, ఫిజియోథెరపీ కళాశాల, పారామెడికల్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్, ఏటీసీ, సైనిక్ స్కూల్, వెటర్నరీ కళాశాల, 430 పడకల ఆసుపత్రి, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొడంగల్ ఎత్తిపోతలను త్వరలో పూర్తి చేయాలి మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హకీంపేటలో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. తన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. కొడంగల్ ఎత్తిపోతల భూసేకరణ పూర్తి చేయాలని.. ఫేజ్– 2 పనులకు త్వరలో టెండర్లు పిలవాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంగా చర్చించి డిజైన్లు రూపొందించాలన్నారు. అలాగే మలీ్టపర్పస్ ఇండ్రస్టియల్ పార్క్ భూసేకరణ, శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి కొడంగల్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్డుపైనా దృష్టి పెట్టాలన్నారు. మద్దూరులోనూ అభివృద్ధి పనుల పరిశీలన.. సీఎం రేవంత్రెడ్డి అంతకుముందు మద్దూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులతోపాటు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పదేళ్ల క్రితం ప్రజల అవసరాల కోసం కొనుగోలు చేసిన భూమి.. నేడు పేద పిల్లల భవిష్యత్తుకు పునాదిగా మారిందన్నారు. నాడు ప్రజల కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని గుర్తించి నేడు ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంకను ఆదేశించారు. నాడు ప్రజల కోసం వేసిన అడుగు.. నేడు పేద పిల్లల భవిష్యత్తుకు బాటగా మారడం ఎంతో సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేడు నకిరేకల్కు సీఎం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం నల్లగొండ జిల్లాకు రానున్నారు. నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేయనున్నారు. 100 పడకల ఆసుపత్రి భవన సముదాయాన్ని ప్రారంభించడంతోపాటు త్వరలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా నకిరేకల్లో నిర్వహించే ప్రజావికాస బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. -
తొలగింపుపై తాపత్రయం
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారం అధికార కాంగ్రెస్లో కొత్త కోణం తెరపైకి వస్తోంది. ఈ విషయంలో అధిష్టానానికి నచ్చజెప్పి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభీష్టానికి అనుగుణంగా హైకమాండ్ను ఒప్పించడంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు కీలక నేతల సహకారం ఉందనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. రేవంత్తోపాటు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడిన ఓ నాయకుడు, ప్రభుత్వంతో సమాంతరంగా పార్టీకి అధికారాలు కావాలని పోరాట బాటపట్టిన మరో నాయకుడు ఏకాభిప్రాయంతో ఈ ఎపిసోడ్లో కీలకపాత్ర పోషించారని.. ఇందులో స్వామి కార్యంతోపాటు స్వకార్యం కూడా దాగి ఉందని ఆ వర్గాలు అంటున్నాయి. మరో విషయం ఏమిటంటే సురేఖకు ఖర్గే అపాయింట్మెంట్ ఇప్పించడంలో తెరవెనుక పాత్ర పోషించిన అధిష్టాన దూత ఒకరు.. ఈ వ్యవహారం ఢిల్లీకి మారాక మౌనం దాల్చారని.. ఆయన మౌనముద్రతోనే జరగాల్సిందంతా సజావుగా జరిగిందనే చర్చ కూడా గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతోంది. మొదటి నుంచీ ఆయన చుట్టూనే.. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే సీఎం రేవంత్కు ఢిల్లీ వేదికగా సహకరించిన కీలక నేత ఒకరి చుట్టూనే రాజకీయమంతా తిరిగింది. ఒకదశలో సురేఖ ఎపిసోడ్పై కమిటీ వేస్తారని.. ఈ కమిటీకి ఆయనే నేతృత్వం వహిస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. ఆయన క్యాంపు కార్యాలయంలోనే కీలక నేతల సమావేశాలు, తర్జనభర్జనలు జరిగాయి. ఆ సమయంలోనే ఆయన తన వైఖరిని సురేఖ శిబిరానికి కుండబద్దలు కొట్టి చెప్పారని సమాచారం. ఆ తర్వాత ఢిల్లీ పెద్దలను కలిసినప్పుడు కూడా తన వైఖరిని వెల్లడించారని.. ఓ దఫా ఆయనకు ఆశించిన సమ్మతి లభించకపోయినా ఎపిసోడ్ ఢిల్లీకి బదిలీ అయ్యాక ఏఐసీసీలో ఉండే మరో ముఖ్యుడి సహకారంతో ఆయన అధిష్టానం పెద్దలకు నచ్చజెప్పగలిగారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఆ కీలక నేత మంతనాల నేపథ్యంలో సురేఖ తొలుత బెంగళూరులో, ఆ తర్వాత ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినప్పుడు ఆయన స్వరంలో మార్పు కనిపించిందని అంటున్నాయి. ఇక పార్టీలోని ఓ ముఖ్య నేత సహకారం ఈసారి సీఎం రేవంత్కు లభించిందని తెలుస్తోంది. ఇటీవల పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగిన సందర్భంలో రేవంత్ వ్యతిరేక శిబిరంలో ఉన్న ఆ నాయకుడు సురేఖ వ్యవహారంలో మాత్రం రేవంత్ అనుకూల శిబిరంలో కీలకపాత్ర పోషించారని సమాచారం. ఆయన కూడా సీఎం నిర్ణయానికి అడ్డుచెప్పకుండా తలూపారని తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలు కలిసి పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలను నియంత్రించాలంటే నిర్ణయం తప్పనిసరిని చెప్పి అధిష్టానానికి నచ్చజెప్పారని తెలుస్తోంది. ఆ ఇరువురి సహకారానికి తోడు అధిష్టాన దూత ప్రేక్షకపాత్ర పోషించడం, సీఎం సైతం ఒత్తిడి తేవడం వెరసి అధిష్టానం సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని.. ఈ నేపథ్యంలోనే సురేఖ పక్షం వహించిన మరో ముఖ్య నేత వాదనకు ప్రాధాన్యం ఇవ్వలేదని సమాచారం. అయితే తనకు సహకరించిన ఆ ఇద్దరు నేతల విషయంలో సీఎం రేవంత్ భవిష్యత్ వైఖరి ఎలా ఉంటుంది? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వారికి ప్రాధాన్యం ఉంటుందా? శాఖల మార్పుపై ప్రభావం చూపుతుందా? అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ‘అనుబంధం’కొనసాగుతుందా? అనేది వేచిచూడాల్సిందే! అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక హస్తినకు మరోసారి సీఎం! సురేఖ ఉద్వాసన నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ప్రస్తుతమున్న మంత్రుల శాఖల మార్పు గురించి చర్చించేందుకు వీలైనంత త్వరగా కబురు చేస్తామని ఢిల్లీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డికి చెప్పారని తెలుస్తోంది. అందుకే ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని.. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాక సీఎం రేవంత్తోపాటు పార్టీలోని ఇతర ముఖ్యులు హస్తినకు వెళ్లి కేబినెట్ ప్రక్షాళనపై హైకమాండ్తో చర్చిస్తారని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. -
కొండా అవుట్... మంత్రి పదవి కావలెను
-
‘కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగాలని కోరుకుంటున్నాం’
సాక్షి,న్యూఢిల్లీ: కొండా సురేఖ బర్తరఫ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొండా సురేఖ తన కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను వెంటనే ఖండించి ఉండాల్సింది. అలా ఖండించకపోవడం వల్లే ఈ అంశాన్ని ఏఐసీసీ చాలా సీరియస్గా తీసుకుంది. కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని తాము బలంగా కోరుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎవరినీ బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం గానీ, పరిస్థితి గానీ లేదని మహేష్ గౌడ్ తేల్చిచెప్పారు. -
Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం
-
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
-
సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్
-
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి మార్పులు, చేర్పులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు సమాచారం. దీంతో జరగబోయేది కేబినెట్ విస్తరణా? శాఖల మార్పులా? లేదంటే మొత్తం ప్రక్షాళనా? అనే ఉత్కంఠ మొదలైంది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్లో ఇటు మంత్రులు.. అటు ఆశావహులు కనిపిస్తున్నారు.కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ ఎపిసోడ్పై మూడ్ ఆఫ్ ఎమ్మెల్యేల నివేదికకు సీఎం రేవంత్ ఆదేశించారు. అలాగే ఆమెను తొలగించడంతో కేబినెట్లో ముగ్గురికి అవకాశం లభించనుంది. అయితే సురేఖ స్థానంలో మహిళకే చాన్స్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే కేబినెట్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతోపాటు.. కొందరు మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది.మంత్రుల్లో మరికొందరిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించే అంశంపైనా అధిష్ఠానం, సీఎం మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్ఠాన నేతలతో భేటీల సందర్భంగా ఆయా అంశాలపై ఆయన, సీనియర్ మంత్రులు చర్చించినట్లు సమాచారం. రెండ్రోజుల పాటు సొంతూరిలో పర్యటించనున్న సీఎం రేవంత్.. సీనియర్ మంత్రులతో మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో ప్రస్తుత మంత్రుల్లో ఎవరికి పదవులు ఉంటాయో.. ఎవరికి శాఖలు మారతాయోనన్న టెన్షన్ నెలకొంది. మరోవైపు మంత్రి పదవుల కోసం పలువురు ఆశావహ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి? సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను ఎలా సర్దుబాటు చేయాలి? అనే అంశాలపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణా.. పూర్తిస్థాయి ప్రక్షాళనా.. లేక రెండూ కలిపి చేస్తారా? అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది.ఇదీ చదవండి: ఇప్పుడు కొండా సురేఖ.. అప్పుడేమో ఆయన! -
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్... రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి సైతం ఉద్వాసన
-
తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?
-
రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?
-
సురేఖ బర్తరఫ్.. విపక్షాలకు కొత్త అస్త్రం?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ వేయి రోజుల పాలనపై నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్ష పార్టీలకు కొండా సురేఖ బర్తరఫ్ అంశం కొత్త అస్త్రాన్ని అందించింది. మరో మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభా వేదికగా రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశముంది. ఇన్నాళ్లూ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి వంటి అంశాలపై రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షం ఇకపై కాంగ్రెస్పై విమర్శల దాడికి మరింత పదును పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు లక్ష్యంగా కొండా సురేఖ కూతురు చేసిన విమర్శలపై ప్రభుత్వాన్ని అసెంబ్లీ లోపలా, బయటా నిలదీసే అవకాశముంది. ఇన్నాళ్లూ కేబినెట్లో ఉన్న కొండా సురేఖ నుంచి వచ్చే ప్రతీ విమర్శ కాంగ్రెస్కు కొత్త తలనొప్పి సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ప్రజల ముందుకు ప్రభుత్వ వైఫల్యాలుసురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ అంతర్గత గొడవలను కూడా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఇన్నాళ్లు ప్రభుత్వంలో భాగంగా ఉన్న సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా విచారణ కోసం బీఆర్ఎస్ పట్టు పట్టే అవకాశముంది. సీఎం సోదరుడికి రూ.200 కోట్ల విలువైన భూ కేటాయింపుపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. ఇన్నాళ్లూ మాజీ మంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా విమర్శలు చేస్తూ వచ్చిన రేవంత్పై ఎదురుదాడికి దిగేందుకు సురేఖ, ఆమె కుమార్తె చేసిన విమర్శలను అ్రస్తాలుగా మలుచుకునే అవకాశముంది. మరోవైపు బీజేపీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ అంశాన్ని ఉపయోగించుకుంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సురేఖ అడుగులు ఎటు?కొండా సురేఖ బర్తరఫ్ అంశాన్ని పార్టీ అంతర్గత వ్యవహారంగా పేర్కొంటూ విపక్షాల నుంచి వచ్చే ఆరోపణలు, విమర్శలను ఇప్పటికే కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. అయితే సీఎం, ఆయన సోదరులు లక్ష్యంగా వస్తున్న ఆరోపణలపై సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర తిప్పికొడతారనే అంశంపై కాంగ్రెస్ శిబిరంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత మేర స్వేచ్ఛగా ఉన్నారో అందరికీ తెలుసంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. విపక్షాల నుంచి అసెంబ్లీ వేదికగా ఒత్తిడి వస్తే ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే చర్చ కూడా జరుగుతోంది. సీఎంను తప్పుపడుతూ సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఎంత మేర ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంలోనూ కాంగ్రెస్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే సురేఖ వేసే భవిష్యత్తు రాజకీయ అడుగులపైనా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్లో కొనసాగుతూ అధిష్టానంతో రాజీ ధోరణితో వ్యవహరిస్తారా లేక సీఎం లక్ష్యంగా విమర్శలకు పదును పెడతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్కు దూరమైతే గతంలో బీఆర్ఎస్తోనూ అనుబంధం ఉన్న సురేఖ భవిష్యత్తులో రాజకీయంగా ఏ పార్టీ దిశగా అడుగులు వేస్తారనే అంశంపైనా చర్చ జరుగుతోంది. -
అగ్రనేతల ఆమోదంతోనే...
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసనకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్గాంధీ ఆమోదం తెలిపారు. దీంతో గత మూడు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా కొనసాగిన సురేఖ వ్యవహారానికి పార్టీ అధిష్టానం బర్తరఫ్తో ముగింపునిచ్చింది. రాష్ట్ర ముఖ్య నేతలు ఇచ్చిన సమాచార క్రోడీకరణ..తమ పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు..ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వేదికగా సురేఖ చేసిన వ్యాఖ్యల తీవ్రత దృష్ట్యా ఆమెపై వేటుకే హైకమాండ్ మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, క్రమశిక్షణా సంఘం అభిప్రాయాలను.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. చర్చల అనంతరం సురేఖను బర్తరఫ్ చేసేందుకు రాష్ట్ర నాయకత్వానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలకు తావులేకుండా చిన్నారెడ్డిపైనా వేటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధిష్టానం నుంచి సమాచారం అందిన వెంటనే..తదుపరి పర్యవసానాలు, పార్టీపై పడే ప్రభావంపై పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంతనాలు జరిపిన ముఖ్యమంత్రి..తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మూడ్రోజులుగా తర్జనభర్జనలు.. సురేఖతో పాటు చిన్నారెడ్డికి సంబంధించి ఢిల్లీలో అనేక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన ముఖ్యమంత్రి తన అభిప్రాయం చెప్పారు. రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న సురేఖపై కఠినంగా వ్యవహరించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, విపక్షాలకు అ్రస్తాలను అందించినట్లే అవుతుందని అన్నారు. మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించాలని విన్నవించారు.దీనిపై ఏఐసీసీ చీఫ్ ఖర్గే.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిల అభిప్రాయాలను సేకరించారు. మెజార్టీ నేతలు ఆమెను తొలగించేందుకే మొగ్గు చూపారు. సురేఖ కూడా తన వాదన ఖర్గేకు చెప్పుకున్నారు. ఇంతటితో ఆగకుండా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నుంచే ముఖ్యమంత్రిపై మొదటగా చర్యలు తీసుకోవాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ ఆమె తొలగింపుపై పట్టుబట్టడంతో గురువారం సైతం వరుస సమావేశాలు కొనసాగాయి. సోనియా, రాహుల్కు కేసీ సమాచారం బుధవారం నాటి వరుస భేటీల సారాంశం.. రాష్ట్ర నేతల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను ఖర్గేతో మరోమారు చర్చించిన కేసీ వేణుగోపాల్..ఆయన సూచనల మేరకు అన్ని అంశాలను అగ్రనేతలు రాహుల్గాం«దీ, సోనియాగాం«దీలకు వివరించారు. దీంతో వారు సురేఖపై వేటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు చిన్నారెడ్డిని తప్పించాలని నిర్ణయించారు. ఈ సమాచారం సీఎం, పీసీసీ చీఫ్లకు కేసీ వేణుగోపాల్ చేరవేశారు. కాపాడని ‘రాహుల్ మనుస్మృతి’ ఇటీవల పుణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో రాహుల్గాంధీ మనుస్మృతి, మహిళలపై చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై అధిష్టానం కటువుగా వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. కానీ అలా జరగలేదు. మహిళలు దేశానికి అత్యంత పెద్ద ఆస్తి అని, వారు తమ కోసం తాము నిలబడాలని, పితృస్వామ్య భావజాలాన్ని ప్రశ్నించాలని రాహుల్ ఈ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. మహిళకు తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం, కలలు, లక్ష్యాలు ఉండాలని, స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో బీసీ మంత్రి అయిన సురేఖపై చర్యలు ఉండక పోవచ్చని, ఆమెపై వేటు వేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని హైకమాండ్ భావించవచ్చనే చర్చ జరిగింది. సురేఖ కూడా మీడియా ముందు రాహుల్ వ్యాఖ్యలు ప్రస్తావించారు. కానీ పార్టీ అధిష్టానం.. సురేఖపై వేటుకే మొగ్గు చూపింది.సీఎం నివాసంలో సుదీర్ఘ చర్చలు సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో తలెత్తే పర్యవసానాలు, రాజకీయ ప్రభావం, దీనిని ఎదుర్కొనే వ్యూహంపై ఢిల్లీలోనే ఉన్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో చర్చోపచర్చలు జరిపారు. సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. రాజకీయ విమర్శలకు తావివ్వకుండా బీసీ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుందనే సందేశాన్ని ఇవ్వడంపై సమాలోచనలు జరిపారు. ఈ భేటీలోనే గద్వాల్ విజయలక్ష్మీ, నేరెళ్ల శారద, గుండు సుధారాణిలకు పదవులు ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. కాగా సురేఖ తొలగింపు సమాచారం మీడియాకు అందాక ముఖ్యమంత్రి హైదరాబాద్కు బయలుదేరారు. ఆ తర్వాత మహేశ్గౌడ్, భట్టిలు కూడా హైదరాబాద్ వెళ్లారు. -
రేవంత్ బ్లాక్మెయిల్... అందుకే ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేయడం వల్లనే తనను మంత్రివర్గం నుంచి తప్పించారని కొండా సురేఖ ఆరోపించారు. పార్టీ అధిష్టానానికి తనను తప్పించాలన్న ఆలోచన లేదని.. అయితే తనను తప్పించకపోతే..తాను వెళ్లిపోతానని సీఎం అన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎవరితోనూ సంప్రదించడం లేదని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా కమ్యూనికేషన్ చేయడంలో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలతో, నేతలతో వైఎస్సార్ ఉన్నట్లు రేవంత్రెడ్డి లేడన్నారు. తాము వైఎస్ రాజశేఖరరెడ్డిని అభిమానించనంతగా..రేవంత్రెడ్డిని అభిమానించామని చెప్పారు. రేవంత్రెడ్డిని నిందించిన వారంతా ఇప్పుడు మంచిగానే ఉన్నారని, కానీ తనను మాత్రమే రేవంత్రెడ్డి టార్గెట్ చేసుకున్నారని సురేఖ వ్యాఖ్యానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ వేం నరేందర్రెడ్డి, సీఎం సోదరులు కొండల్రెడ్డి, తిరుపతిరెడ్డి మరికొందరు కుట్రపన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. అప్పట్లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఇప్పుడు రేవంత్రెడ్డి కూడా అలానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె సూచించారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. పార్టీ హైకమాండ్కు ఇటీవల తాను రాసిన లేఖలను సురేఖ విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిణామాలపై పశ్చాత్తాపం లేదు.. ‘తమవైపు ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు ఆయన వైపే చూపిస్తాయన్న అంశాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు. అయితే ఎలాంటి తప్పు చేయకపోయినా మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యమంత్రిని నేను ఏనాడూ విమర్శించలేదు.. పార్టీని దూషించలేదు. నేను ఎలాంటి తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. పదవుల కోసం నేనెప్పుడూ వెంపర్లాడలేదు. కొణిజేటి రోశయ్య, జైపాల్రెడ్డిలు ఇందిరాగాం«దీని నిందించిన వారే. జగ్గారెడ్డి, రాజగోపాల్రెడ్డి వంటి వ్యక్తులు మాట్లాడితే ఎలాంటి చర్యలు లేవు. నా కూతురు చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకుని నన్ను శిక్షించడం సరికాదు. ఉరి శిక్షపడిన ఖైదీని కూడా చివరి కోరిక ఏమిటని అడుగుతారు. కానీ అధిష్టానం నా అభిప్రాయాలను తెలుసుకోకుండా సీఎం బ్లాక్మెయిల్కు లొంగి బర్తరఫ్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా లేరని నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ రోజు నాకు జరిగింది, రేపు మీకూ జరుగుతుంది. ఇప్పటికైనా బయటికి వచ్చి మాట్లాడండి. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో చెప్పండి. మనం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ప్రభుత్వంలో ఏ పనులు జరగడం లేదు. దీంతో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతపై సర్వే చేయించాలని సూచిస్తున్నా. ప్రభుత్వంలో తప్పులు సరిదిద్దుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఆలోగా మనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించాలంటే.. ప్రజల సమస్యలు పరిష్కరించాలి. హామీలను అమలు చేసి చూపించాలి. కాంగ్రెస్లోనే ఉంటా... కాంగ్రెస్లోనే ఉంటా. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా. మంత్రి పదవి మాకు ఆభరణం మాత్రమే. అది లేనంత మాత్రాన మాకు నష్టం లేదు. రెండు మూడు రోజుల తర్వాత కుటుంబ సభ్యులం మాట్లాడుకుంటాం. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతా. ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. బర్తరఫ్ చేశారన్న సమాచారం ఇప్పుడే తెలిసింది. నా కూతురు ఇంగ్లండ్లో ఉంది. ఆమెతో, నా భర్తతోనూ ఇంకా చర్చించలేదు. నా కూతురు గౌరవం కోసమే ఆమె వ్యాఖ్యలపై నేను స్పందించలేదు. సుమంత్పై కేసులు విత్డ్రా చేసుకోవాలి నా ఓఎస్డీ సుమంత్ ఎలాంటి తప్పు చేయకపోయినా ఆయనను వెంటాడుతున్నారు. సుమంత్ ఎవరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారో ఆ వ్యక్తికి వెంటనే బెయిల్ ఇచ్చి.. 15 రోజుల తరువాత అదే వ్యక్తితో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. సుమంత్పై పెట్టిన కేసులను విత్డ్రా చేసుకోవాలని హోం శాఖను కోరుతున్నా. పరకాలలో సీఎం అక్కడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి టికెట్ ఎలా ప్రకటిస్తారు? 70 ఏళ్ల వృద్ధుడు.. వచ్చే ఎన్నికల నాటికి నడుస్తారో..మంచంపై ఉంటారో తెలియదు. నన్ను తొలగించిన నేపథ్యంలో బ్యాలెన్స్ చేయడానికి ముగ్గురు మహిళలకు పదవులు రావడం అభినందనీయం. వారికి నా శుభాకాంక్షలు. చిన్నారెడ్డిని నా కోసం శిక్షించడం సరికాదు..’అని సురేఖ అన్నారు.పీసీసీ పదవి కోసం రూ.50 కోట్లు ఇచ్చారన్న వారిని సన్మానించారు.. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికోసం రూ.50 కోట్లు ఇచ్చారని ఆరోపించిన వారికి సీఎం కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి సన్మానించారు. డీఎస్ కుటుంబంలో ఇద్దరు రెండు వేర్వేరు పార్టీల్లో లేరా? పదేళ్లుగా నా కూతురికి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించలేకపోయాం. అదే మొన్న పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి తన కూతురుకు ఎంపీ పదవి తెప్పించుకున్నారు. నా భర్తకు కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇప్పించుకోలేదని నా కూతురు అన్నది. నా కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. వాటిని ఖండించాల్సిన లేదా సమర్థించాల్సిన అవసరం నాకు లేదు. మేము నిబద్ధతతో రాజకీయాలు సాగిస్తున్నాం. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లలేదు. రాజీనామాలు చేసే ఇతర పార్టీలోకి వెళ్లాం. -
సీఎం సలహా మేరకు.. కొండా సురేఖ బర్తరఫ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంత్రిమండలి నుంచి బర్తరఫ్కు గురయ్యారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి సైతం ఉద్వాసనకు గురయ్యారు. తక్షణమే వీరిద్దరిని ఆయా పదవుల నుంచి తొలగించాలని సీఎం ఎ.రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. కొండా సురేఖకు ఉద్వాసన పలకాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు సీఎం రేవంత్ సిఫారసు చేశారని తెలిపింది. అయితే దీనిపై లోక్భవన్ గురువారం రాత్రి 8 గంటల వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగింది. కానీ సీఎం..మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్తో కలిసి రాత్రి 8 గంటల ప్రాంతంలో లోక్భవన్కు వెళ్లి గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆ వెంటనే లోక్భవన్ నుంచి బులెటిన్ జారీ అయింది. సీఎం రేవంత్ సలహా మేరకు కొండా సురేఖను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు బులెటిన్ వెల్లడించింది. కాగా చిన్నారెడ్డి తొలగింపు నేపథ్యంలో ఆ పదవిని భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వం మరోరెండు కీలక నియామకాలు కూడా చేపట్టింది. రెండు వారాలుగా రాజకీయ దుమారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరు ప్రకాశ్రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 16న పరకాలలో జరిగిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు. దీనిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆగస్టు 19న కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. రేవంత్రెడ్డికి సీఎం కాగానే కళ్లు నెత్తికెక్కాయని, వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే పరకాలలో ఆయన తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తీసుకుని వనపర్తి టికెట్ను ఇచ్చారని జి.చిన్నారెడ్డి సైతం వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పార్టీ క్రమశిక్షణ కమిటీ వీరిద్దరికి ఉద్వాసన పలకాలని సిఫారసు చేస్తూ అధిష్టానానికి నివేదిక సమర్పించింది. ఈ పర్యావసానాల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లడం, ఏఐసీసీ చీఫ్ ఖర్గే సహా కొందరు పెద్దల్ని కలవడంతో సురేఖతో పాటు జి.చిన్నారెడ్డిపై వేటు పడడం ఖాయమనే ఊహాగానాలు చెలరేగాయి. మరోవైపు సురేఖ కూడా మంగళవారం నాడే ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఖర్గే తదితరులతో సమావేశమై అదే రోజు రాష్ట్రానికి తిరిగి వచ్చేశారు. కాగా రేవంత్రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు తిరిగి బయలుదేరడానికి ముందు..సురేఖ, చిన్నారెడ్డి విషయంలో సీఎంఓ కార్యాలయంనుంచి ప్రకటన వెలువడింది. అంతకుముందే వీరిద్దరి ఉద్వాసనకు పార్టీ హైకమాండ్ ఆమోదం తెలిపింది. గజిట్ జారీ చేసిన ప్రభుత్వం సీఎంఓ ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రధాన సలహాదారు కె.రామకృష్ణారావు గురువారం సాయంత్రం లోక్భవన్కు వెళ్లి సీల్డ్ కవర్లో మంత్రిమండలి నుంచి కొండా సురేఖ తొలగింపు ప్రతిపాదనను అందజేశారు. అనంతరం ఢిల్లీ నుంచి సాయంత్రం 5 గంటలకు తిరిగి వచ్చిన సీఎం.. వెంటనే చంచల్గూడ – సంతోష్నగర్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించి, ఆ తర్వాత లోక్భవన్కు చేరుకుని గవర్నర్ శుక్లాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సురేఖ తొలగింపుపై లోక్భవన్ బులెటిన్ జారీ చేసింది. సీఎం వెంట ఎంపీలు వేం నరేందర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రఘువీర్రెడ్డి ఉన్నారు. కాగా సురేఖను మంత్రిమండలి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం గజిట్ వెలువరించింది. సచివాలయంలోని 4వ అంతస్తులో ఉన్న కొండా సురేఖ కార్యాలయాన్ని సీజ్ చేశారు. అంతకు ముందే కీలకమైన ఫైళ్లన్నీ సీఎస్ కార్యాలయంలో అప్పగించాలని ఆమె పీఎస్ను ఆదేశించారు. సురేఖను మంత్రిమండలి నుంచి తొలగించడంతో ఆమె వద్ద ఉన్న పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖలూ సీఎం పర్యవేక్షణ కిందికి వెళ్లాయి. వ్యూహాత్మకంగా మూడు నియామకాలు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి జి.చిన్నారెడ్డిని తొలగించిన ముఖ్యమంత్రి తక్షణమే ఆయన స్థానంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుమార్తె, జీహెచ్ఎంసీ మాజీ మేయర్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మీ (మున్నూరుకాపు)ని నియమించారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆథారిటీ (కుడా) చైర్మన్గా మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి (పద్మశాలి)ని రెండేళ్ల కాలపరిమితితో నియమిస్తూ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారద (గౌడ) నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులు సీఎం ఢిల్లీ నుంచి తిరిగి రాకముందే జారీ అయ్యాయి. కొండా సురేఖ ఇటీవల బీసీ అస్త్రాన్ని ఉపయోగించి సీఎం రేవంత్పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మహిళలు, బీసీ వర్గాలకు న్యాయం చేశారనే సందేశాన్ని ఇవ్వడానికే వ్యూహాత్మకంగా ముగ్గురు బీసీ మహిళలకు పదవులు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. ఉద్వాసనకు గురైన మూడోమంత్రి సురేఖ తెలంగాణ రాష్ట్రంలో ఉద్వాసనకు గురైన మూడో మంత్రిగా కొండా సురేఖ చరిత్రకెక్కారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన డాక్టర్ తాటికొండ రాజయ్యను అనూహ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కేసీఆర్ 2015 జనవరి 25న నిర్ణయం తీసుకున్నారు. వైద్యారోగ్య శాఖలో అవినీతి, స్వైన్ ఫ్లూ నివారణలో వైఫల్యాల నేపథ్యంలో ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈటల రాజేందర్ను వైద్యారోగ్య శాఖ మంత్రిగా నియమించారు. అయితే అసైన్డ్ భూముల ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2021 మే నెలలో ఈటలకు ఉద్వాసన పలికారు. రేవంత్ మంత్రివర్గంలో 1,002 రోజుల పాటు మంత్రిగా కొనసాగిన సురేఖపై తాజాగా వేటు పడింది. -
ఎన్నికల నాటికి మెట్రోలోనే వస్తా!
సాక్షి, హైదరాబాద్/చంచల్గూడ/చార్మినార్: ఓల్డ్ సిటీ (ఒరిజినల్ సిటీ) సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని, ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా మీదుగా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ. మెట్రో మార్గం పనులను ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ మార్గాన్ని పూర్తిచేసి మెట్రోలోనే వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతామని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ క్రాస్రోడ్స్–ఒవైసీ జంక్షన్ వరకు రూ. 620 కోట్లతో సిగ్నల్ ఫ్రీగా జీహెచ్ఎంసీ నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని సీఎం రేవంత్రెడ్డి గురువారం సాయంత్రం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ప్రారంభించారు. అనంతరం చంచల్గూడ జూనియర్ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. హిందూ, ముస్లింలు కలిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం చాంద్రాయణగుట్ట మెట్రో కోసం భూసేకరణ దాదాపు పూర్తయిందని.. మెట్రో పనులను వేగంగా చేపట్టి తదుపరి ఎన్నికల్లోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఈ వంతెనకు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టడం తప్ప రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు పూర్తి చేసిందన్నారు. నాగోలు నుంచి ఎల్బీనగర్, వనస్థలిపురం, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని సీఎం చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి హిందువులు, ముస్లింలు కలిసి ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు. ఉభయులూ కలిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. మూసీ రివర్ఫ్రంట్, నైట్ ఎకానమీ వంటి ప్రాజెక్టుల ద్వారా పేద ముస్లింలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అభివృద్ధికి బీజేపీ, బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని.. మిగతా సమయంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అన్ని పార్టీలు, వర్గాలు కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. ఓల్డ్ సిటీని ఒరిజినల్ సిటీగా మరోమారు పేర్కొన్న సీఎం రేవంత్రెడ్డి.. ఇక్కడి ప్రతి వీధి, సందు తనకు తెలుసన్నారు. గత 70 ఏళ్లలో 18 మంది సీఎంలు పనిచేసినా చంచల్గూడకు రాలేదన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. ఎవరి ధమ్కీలకూ బెదరను.. ప్రేమకే లొంగుతా.. ‘నేను బెదిరిస్తే భయపడను. ఎవరి ధమ్కీలకూ బెదరను. ప్రేమకే లొంగుతా. స్నేహంతోనే నన్ను గెలవగలరు. నేను దోస్తీకి మాత్రమే గులామ్ను. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. గెలుపోటములు సహజం’అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అసదుద్దీన్, ఎంఐఎం దేశానికి వ్యతిరేకమని కొందరు దుషŠప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. ఆపరేషన్న్సిందూర్ సమయంలో దేశం పక్షాన నిలిచిన అసదుద్దీ¯న్Œ ఒవైసీని అభినందించారు. ఈ అంశంలో అసద్.. మోదీ, అమిత్ షాల కంటే తక్కువేమీ కాదన్నారు. మీరాలం చెరువు వద్ద 3 కి.మీ. కేబుల్ బ్రిడ్జి నిర్మాణం, హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు సీఎం పేర్కొన్నారు. మెట్రో రెండో దశలో నాగోల్ నుంచి ఎల్బీ నగర్, వనస్థలిపురం, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ ఎన్ని అభివృద్ధి ప్రతిపాదనలు తెచ్చినా మంజూరు చేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, రాజ్యసభ ఎంపీలు వేం నరేందర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, నల్లగొండ ఎంపీ రఘువీర్రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్కుమార్ యాదవ్, దానం నాగేందర్, జాఫర్ మెరాజ్ హుస్సేన్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీకి కాదు.. రేవంత్కే మా మద్దతు: అసదుద్దీన్ ఒవైసీ ‘ఇక్కడ కూర్చున్న కాంగ్రెస్ నాయకుల అందరి ముందు చెబుతున్నా. మా పార్టీ మద్దతు కాంగ్రెస్కు కాదు.. కేవలం రేవంత్రెడ్డికే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో బీఆర్ఎస్కు మద్దతిచ్చిన మాట వాస్తవం. కానీ ప్రజావ్యతిరేక పనులను ఆపాలని.. లేకపోతే ఇంట్లోనే కూర్చోవాల్సి వస్తుందని చెప్పా.. అలాగే జరిగింది. ప్రస్తుతం రేవంత్ సైతం ప్రజల్లోకి రావట్లేదు. అందుకు ఎవరు అడ్డుపడుతున్నారో తెలియదు’అంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. రాష్ట్రం వెలుపల ఏదైనా మాట్లాడొచ్చని.. కానీ రాష్ట్రంలో మాత్రం తమకు వ్యతిరేకంగా మాట్లాడవద్దన్నారు. కాగా, చంచల్గూడ మైదానంలో ఉన్న పాఠశాలలు, కాలేజీల అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు చేయాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సీఎంకు వినతిపత్రం ఇవ్వగా రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రేవంత్రెడ్డి ప్రకటించారు. -
నన్ను మంత్రి పదవి నుంచి తొలగించడం కాంగ్రెస్కే నష్టం : కొండా సురేఖ
సాక్షి,హైదరాబాద్: తన మీద కుట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయని కొండా సురేఖ ఆరోపించారు. ఉరితీసే ఖైదీని కూడా మీ ఆఖరి కోరిక ఏంటని అడుగుతారు?. కానీ కనీసం అలా నన్ను అడగకుండా మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వర్గం నుంచి తనని బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘సంతకం లేని ఒక ఫేక్ లెటర్ సర్క్యూలేట్ అవుతుంది. నన్ను బర్తరఫ్ చేస్తున్నట్లు , చిన్నారెడ్డిని తొలగించినట్లు అడ్రస్ లేని లెటర్ బయటకొచ్చింది. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావడం సంతోషం. నన్ను తొలగిస్తున్నామని ఒక మాట అడగాల్సి ఉండేది. అడిగి ఉంటే..ఎందుకు అనే ప్రశ్న వేసే అవకాశం నాకు దక్కేది.నా అభిప్రాయం తీసుకోకుండా తొలగించారు. నన్ను తొలగించడం ఏఐసీసీకి ఇష్టం లేదు. సీఎం రేవంత్రెడ్డి పట్టుబట్టి తొలగించారు. మీరు తొలగిస్తారా.. నన్ను వెళ్లమంటారా అని సీఎం బెదిరించారు. మా మాజీ ఓఎస్డీ సుమంత్ కుటుంబాన్ని బెదిరించారు. మా ప్రభుత్వంలో మా మనిషిని ఇబ్బంది పెట్టడం అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు కాదా. ఇకనైనా ప్రభుత్వం సుమంత్ను ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నా. మల్లు రవి గతంలో కాంగ్రెస్ను తిట్టలేదా.. రోశయ్య ఇంధిరా గాంధీని తిట్టలేదా. జైపాల్ రెడ్డి, ఇంధిరా గాంధీని దూషించలేదా. అలాంటి వారిపై చర్యలు తీసుకోలేదు.. కానీ నా కూతురు చేసిన వాఖ్యలకు నన్ను భాధ్యురాలిని చేస్తారా.. నా మంత్రి పదవి పోయినందుకు నాకు ఎటువంటి బాధలేదు.మా కాళ్ళు మొక్కి మమ్మల్ని గెలిపించాలని అడిగిన వారు.. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారా? మాకు ప్రజాబలం ఉంది.. మమ్మల్ని ఏం చేయలేరు. మంత్రి పదవి మాకు ఆభరణం మాత్రమే.. అది లేనంత మాత్రానా మాకు నష్టం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. ఈ రోజు నాకు వచ్చింది.. రేపు మీకు వస్తుంది. బయటకు వచ్చి మాట్లాడండి. ఈ ప్రభుత్వంలో పనులు అవ్వడం లేదు. పిటీషన్లు తీసుకోవడం తప్ప.. మేము చేసిందేమీ లేదు. సర్వేలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నన్ను తొలగించిన నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలని నేను అడగను. యాదాద్రి టెంపుల్ కమిటీ విషయం నిర్ణయం అందరితో చర్చించలేదు. నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా. నా కూతురు గౌరవం కోసమే.. ఆమె వాఖ్యలపై నేను స్పందించలేదు. నేను తప్పు చేయలేదు..నాకు అవమానం ఎందుకు. ప్రజలతో,నేతలతో వెఎస్సార్ మమేకమైనట్లు సీఎం రేవంత్రెడ్డి లేరు’ అని వ్యాఖ్యానించారు. 👉ఇదీ చదవండి: మీసం మెలేసిన కొండా మురళి -
తెలంగాణ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో చిన్నారెడ్డిపైనా కూడా కాంగ్రెస్ హై కమాండ్ వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్గా చిన్నారెడ్డిని తొలగించింది. దీంతో సీఎం రేవంత్రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలకు సీఎం రేవంత్ బలమైన సంకేతం పంపినట్లయింది.రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, జిల్లాల్లో బయటపడుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం వారితో చర్చించిన సంగతి తెలిసిందే.తన పైన కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలను రేవంత్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఖండించకపోవటం, అనంతరం ఆమె స్వయంగా చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహంతో ఉన్న రేవంత్.. సురేఖ చేసిన ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖర్గేకు వివరించారు. కొండా సురేఖ వ్యవహారాన్ని ఉపేక్షిస్తే పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్లడంతో పాటు రాష్ట్ర నాయకత్వంపై లేనిపోని అపోహలకు తావిచ్చినట్లు అవుతుందని సీఎం చెప్పినట్లుగా తెలిసింది. ఇంత జరిగాక కూడా ఆమెపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం తగదని అన్నట్లు సమాచారం. రేవంత్ పట్టుతో కొండా సురేఖ, చిన్నారెడ్డిపైనా కూడా కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది.మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్కు సీఎం రేవంత్రెడ్డి సిఫార్సు చేశారు. ఇదిలా ఉండగా.. కొండా ఫ్యామిలీ ఏం పార్టీలో చేరబోతుంది?. తెలంగాణ రాజకీయాల్లో తరువాత ఏం జరగనుంది?. కొండా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?. కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?. ఆమె కాంగ్రెస్లో కొనసాగే అవకాశముందా?’’ అనే చర్చ నడుస్తోంది. -
వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
-
కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?
-
కొండా సురేఖపై వేటు..
-
సీఎం రేవంత్పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గం నుంచి తనను తొలగించడంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయం చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి నన్ను తొలగించే ఆలోచన లేదు. నన్ను బర్తరఫ్ చేయకపోతే తాను వెళ్లిపోతానని రేవంత్ బెదిరించడంతోనే నన్ను తొలగించారు’అని ఆమె ఆరోపించారు.ఈ సందర్భంగా కేబినెట్ నుంచి తన బర్తరఫ్ చెల్లదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కనీసం తన నుంచి ఎలాంటి వివరణ కోరకుండా, అడిగి తెలుసుకోకుండా మంత్రి పదవి నుంచి ఎలా తొలగిస్తారని కాంగ్రెస్ అధిష్టానాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న బర్తరఫ్ సర్క్యులర్లో సీఎం రేవంత్రెడ్డి గానీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గానీ సంతకాలు చేయలేదని, ఆమోదముద్ర లేని ఆ పత్రానికి ఎలాంటి చెల్లుబాటు ఉండదని తేల్చిచెప్పారు.తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె నిలదీశారు. ఇతర నాయకుల కుటుంబాలను ఉదహరిస్తూ.. ‘పదేళ్లుగా నా కూతురు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తోంది. సుస్మిత టికెట్ అడిగితే తప్పేంటి? కడియం శ్రీహరి తన కూతురిని ఎంపీని చేయలేదా? ఎంపీ అరవింద్ బీజేపీలో ఉంటే, ఆయన సోదరుడు సంజయ్ కాంగ్రెస్లో కొనసాగడం లేదా?’అని ప్రశ్నించారు.కుటుంబ సభ్యుల వ్యాఖ్యలను తనకు ముడిపెడుతూ కేబినెట్ నుంచి తొలగించాలనే నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాల నేపథ్యంలో తన భవిష్యత్తుపై భర్త కొండా మురళితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.👉ఇదీ చదవండి: మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ ఔట్! -
రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్
-
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఔట్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ అయ్యారు. ఈ మేరకు ఆమెను తక్షణమే తొలగిస్తూ సీఎం రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ బర్తరఫ్కు సంబంధించిన అధికారిక సిఫార్సును రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు పంపారు. కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు.దీనితో పాటు పలు కీలక నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వం మార్పులు, నియామకాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ నిర్ణయించారు. చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా సంఘం నూతన ఉపాధ్యక్షురాలిగా నియమించారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నెరేళ్ల శారదను నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. అలాగే, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ బర్తరఫ్కు ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు. కొండా సురేఖ వ్యవహార శైలిపై పార్టీలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పదే పదే పార్టీ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదనే కఠినమైన సంకేతాలు శ్రేణులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఢిల్లీలో పార్టీ పెద్దలతో రెండు రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం రేవంత్ హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. మొత్తం మీద అధిష్టానం కఠిన చర్యలతో చోటుచేసుకున్న ఈ ఆకస్మిక పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.👉ఇదీ చదవండి: సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ తిరుగుబాటు -
ఇది కరెక్ట్ టైం కాదు.. రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్లో నెలకొన్న తాజా పరిణామాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ రాజీనామా చేస్తారా? అధిష్టానం ఆమెను భర్తరఫ్ చేస్తుందా? అనే ఎపిసోడ్పై స్పందించారాయన. ఇందులో తమ నిర్ణయమంటూ ఏదీ ఉండదని.. ఈ అంశాన్ని పూర్తిగా కాంగ్రెస్ జాతీయ కార్యవర్గమే చూసుకుంటుందని చెప్పారాయన.సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో గురువారం బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని మీడియాతో దాటవేత ధోరణిలో మాట్లాడారు. అయితే చివరకు కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై స్పందించిన రాజగోపాల్రెడ్డి.. ఈ అంశాన్ని కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం చూసుకుంటుందని తెలిపారు. దీనిపై తాము వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని, పార్టీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉంటామని చెప్పారు.‘‘కొండా సురేఖ పార్టీ పెద్దలను కలిసి తన వాదన వినిపించారు. ఈ ఇష్యూపై అధిష్టానం వద్ద పూర్తి సమాచారం ఉంది. అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. అందరం కట్టుబడి ఉండాలి. ఎవరికి ఏ పదవి ఇవ్వాలనేది అధిష్టాన నిర్ణయం. కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరగాలన్నది అధిష్టానమే నిర్ణయిస్తుంది. రాహుల్ గాంధీపై నమ్మకం ఉంది.. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్పై పోరాడిన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగాలి. నేను కాంగ్రెస్ కార్యకర్తల గురించే ఆలోచిస్తా’’ఆ నిర్ణయమే ఫైనల్కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ తరఫున తామంతా దానికి కట్టుబడి ఉంటామని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ అంశాలపై అనవసరమైన చర్చలకు తావివ్వకుండా పార్టీ అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూడాలని ఆయన వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కూడా గత కొంతకాలంగా సీఎం రేవంత్రెడ్డి తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తానే పదేళ్లు సీఎంగా కొనసాగుతానంటూ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్రెడ్డి గతంలో ఖండించారు. ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగత నిర్ణయం కాదని, పార్టీ అధిష్ఠానం, రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. నిన్న సైతం ‘‘మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెల్లగొడతారా?’’ అంటూ సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు.ఇదిలా ఉండగా నిన్న ఢిల్లీలోనూ.. కొండా సురేఖ రేవంత్.. రేవంత్ కుటుంబం, అలాగే కొందరు మంత్రులపై అవినీతి ఆరోపణలతో అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ సమయంలో ఆమె.. తన కూతురు వ్యాఖ్యలు పూర్తి వ్యక్తిగతమని, అయితే అధిష్టానం చెప్పకుండా తానే పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ ఎలా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఇప్పుడు రాజకీయాలు చేసే సమయం కాదు’ అంటూ రాజగోపాల్రెడ్డి కాస్త స్వరం తగ్గించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: రాజీనామా చేయమని ఖర్గేనే చెప్పారా? -
కొండా సురేఖ ఎపిసోడ్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ ఓఎస్డీ అరెస్టు ఘటన నుంచే అసలు కథ మొదలైందని ఆయన ఆరోపించారు. అప్పటి నుంచే మంత్రి పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయని వ్యాఖ్యానించారు. తాజాగా డబ్బుల వాటాకు సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతోనే ఈ వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లిందని ఆయన విమర్శలు గుప్పించారు.మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్పై రాజాసింగ్ తాజాగా స్పందిస్తూ..‘కొండా సురేఖను సస్పెండ్ చేయాలని పెద్ద నేతలు ఢిల్లీలో కూర్చున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి జరుగుతోంది. మంత్రులు, పెద్ద నేతలు, చిన్న నేతలు, అధికారులనే తేడా లేకుండా అవినీతి నడుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అవినీతి ఆగడం లేదు. గతంలో కేసీఆర్ అప్పులు చేసి పాలించి ఫాంహౌస్లో కూర్చున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కేవలం పేపర్లో మాత్రమే నిధులు ఇస్తున్నట్టు చెప్తారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం జీరో.దీంతో మంత్రులకు, నేతలకు అర్థమైంది.కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడూ పడిపోతుందో చెప్పలేమనే అనుమానం వారికి వచ్చేసింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. పోతుందో.. అని డిసైడ్ అయ్యారు. ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం షురూ చేశారు. ఏదీ ఎక్కడ దొరికితే అక్కడ దోచేస్తున్నారు. ఇదంతా డబ్బుల వ్యవహారం అయింది. ఇదంతా ఢిల్లీకి చేరింది. ఆ డబ్బుల గొడవే కొండా సురేఖ రాజీనామా వరకు వచ్చింది. ఇప్పుడు కొండా సురేఖ ప్రెస్ మీట్లో ఏం చెబుతారో చూడాలి. బర్తరఫ్ చేస్తామని అధిష్టానం చెప్పిందట.. దీనిపై ఆమె ఏం అంటారో తెలుస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్లో కొండా సురేఖ.. అడుగడుగునా వివాదాలే! -
కాసేపట్లో సురేఖ మీడియా సమావేశం.. ఖర్గే అల్టిమేటం?
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజీనామా చేయకపోతే మంత్రి పదవి నుంచి తప్పించే దిశగా సీఎం రేవంత్రెడ్డి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఉదయం బ్రేక్ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైనే చర్చ జరిగినట్లు సమాచారం. ఏఐసీసీ కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో.. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై నిర్ణయం దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సీఎం రేవంత్రెడ్డి బయలుదేరనున్నారు. సీఎం హైదరాబాద్కు చేరుకున్న తర్వాత కొండా సురేఖ వ్యవహారంపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. మరి కాసేపట్లో కొండా సురేఖ మీడియా ముందుకు రానుండటం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. తన వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇస్తారా? లేక రాజీనామాపై ప్రకటన చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆమె ఏం మాట్లాడతారు? అనే ఉత్కంఠ రేపుతోంది.ఇదీ చదవండి: కాంగ్రెస్లో కొండా సురేఖ.. అడుగడుగునా వివాదాలే!ఈరోజు సాయంత్రంలోగా రాజీనామా ప్రకటన చేయకపోతే.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని గవర్నర్కు సీఎం లేఖ రాసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కొండా సురేఖ మంత్రి పదవిలో కొనసాగుతారా? లేదా కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో తప్పుకుంటారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కీలకంగా మారిన ఈ పరిణామాలపై కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కాంగ్రెస్లో కాంట్రవర్సీల కొండ(డా)
కాంగ్రెస్లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కొండా సురేఖ చుట్టూ వివాదాలు ఆగలేదు.. ప్రత్యర్థులతో ఢీ కొట్టిన సందర్భాల కంటే సొంత పార్టీలోనే ఢీకొన్న సందర్భాలే ఎక్కువ!. పదవులు, ఆధిపత్యం, వర్గపోరు, నేతలతో విభేదాలు.. ఇలా ఒక్కో ఎపిసోడ్ ఒక్కో రాజకీయ ప్రకంపనగా మారింది. ఒక దశలో సినీ హీరోయిన్లను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తే.. మరో దశలో సొంత పార్టీ నేతలే ఆమె వ్యవహార శైలిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్రెడ్డితో విభేదాలు బహిరంగం కావడం.. వ్యవహారం కాంగ్రెస్ అధిష్ఠానం గడప దాటడం.. కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపుగా మారింది. అసలు 2018లో కాంగ్రెస్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కొండా సురేఖ చుట్టూ చోటుచేసుకున్న వివాదాలేంటి? ఎక్కడెక్కడ ఎవరితో ఢీ కొట్టారు? ఈ రాజకీయ రచ్చలో అసలు ట్విస్టులేంటి?..కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం 2018లో కాంగ్రెస్లో మొదలైంది కాదు. ఆమె అసలు కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానం 1996లోనే ప్రారంభమైంది. 2018లో ఆమె కాంగ్రెస్లోకి తిరిగి వచ్చారు.కొండా సురేఖ తొలి కాంగ్రెస్ ప్రస్థానం..1995: గీసుకొండ మండల పరిషత్ రాజకీయాలతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1996: కాంగ్రెస్లో చేరి ఏపీ పీసీసీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టారు.1999: శాయంపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోశాధికారిగా, పలు అసెంబ్లీ కమిటీల్లో సభ్యురాలిగా పనిచేశారు.2000: ఏఐసీసీ కో-ఆప్షన్ సభ్యురాలిగా ఎంపికయ్యారు.2004: శాయంపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు.2009: నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి.. వైఎస్ రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.కాంగ్రెస్లోకి రీ ఎంట్రీ నుంచి వివాదాల పరంపర1. 2018.. కాంగ్రెస్లోకి రీఎంట్రీ2018లో బీఆర్ఎస్లో టికెట్ దక్కకపోవడంతో కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్లోకి తిరిగి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచే వరంగల్ కాంగ్రెస్లో ఆమె ఆధిపత్యం, స్థానిక నేతలతో సంబంధాలపై చర్చలు మొదలయ్యాయి.2.ఎర్రబెల్లి స్వర్ణతో ఆధిపత్య పోరువరంగల్ రాజకీయాల్లో కొండా సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి స్వర్ణ విభేదాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. 2018లోనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయని, ఆ తర్వాత కూడా ఈ ఆధిపత్య పోరు కొనసాగిందని నివేదికలు పేర్కొన్నాయి.3. 2023 నుంచి మళ్లీ తెరపైకి విభేదాలు2023లో వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి మంత్రి అయిన తర్వాత సురేఖ రాజకీయ ప్రాధాన్యం భారీగా పెరిగింది. అయితే అదే సమయంలో నియోజకవర్గంలోకి ఇతర పార్టీల నేతల చేరికలు ఆమెకు అసంతృప్తి కలిగించాయి. తనకు సమాచారం ఇవ్వకుండా ఇతర నేతలను కాంగ్రెస్లోకి ఎలా తీసుకుంటారని ఆమె బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.4. పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యవహారంకాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్లో పార్టీ వర్గాల మధ్య గొడవల నేపథ్యంలో మంత్రి హోదాలో కొండా సురేఖ పరకాల నియోజకవర్గంలోని గీసుకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి హంగామా చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.5. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఫిర్యాదులుసురేఖ, ఆమె భర్త కొండా మురళి వ్యవహార శైలిపై వరంగల్ కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలను పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఏఐసీసీకి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి.6. 2024.. సమంత-నాగచైతన్య విడాకుల వ్యాఖ్యలుఇది కొండా సురేఖ పొలిటికల్ కెరీర్లోనే అత్యంత పెద్ద వివాదాల్లో ఒకటిగా మారింది. మంత్రి హోదాలో ఉండగా.. నటి సమంత, నాగచైతన్య విడిపోవడానికి అప్పటి బీఆర్ఎస్ నేత కేటీఆర్ కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయ విమర్శలు కాస్తా సినీ పరిశ్రమలోకి వెళ్లడంతో పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసు పంపగా, ఆ తర్వాత పరువునష్టం కేసు వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. రాజకీయంగా కేటీఆర్ను టార్గెట్ చేయాలనుకున్న సందర్భంలో చేసిన ఆమె వ్యాఖ్యలు.. చివరకు ఆమెపైనే పెద్ద రాజకీయ, న్యాయపరమైన వివాదంగా మారాయి.7. రకుల్ ప్రీత్ సింగ్ పేరును ప్రస్తావించడంపై వివాదంసమంత వివాదం సమయంలోనే నటి రాకుల్ ప్రీత్ సింగ్ పేరును కూడా సురేఖ ప్రస్తావించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రకుల్ కూడా సురేఖ తన పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని తీవ్రంగా స్పందించారు.8. 2025.. మేడారం పనులు, పొంగులేటితో విభేదాలు2025లో మేడారం పనులు, టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో సురేఖకు విభేదాలు బయటపడ్డాయి. తన శాఖ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటున్నారన్న అభ్యంతరాలు సురేఖ వర్గం నుంచి వచ్చాయి. ఈ వివాదం క్రమంగా కాంగ్రెస్లో అంతర్గత వర్గపోరుగా మారింది.9.కొండా మురళి వర్సెస్ పొంగులేటిసురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా పొంగులేటిపై బహిరంగంగా విమర్శలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇన్చార్జ్ మంత్రిగా పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.10. మాజీ OSD సుమంత్ అరెస్ట్ ఎపిసోడ్2025లో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆమె జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్లిన ఘటన మరో పెద్ద వివాదానికి దారితీసింది. పోలీసులు సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు రావడం, ఆ సమయంలో సురేఖ కుమార్తె సుస్మిత అభ్యంతరం వ్యక్తం చేయడం, అనంతరం సీఎం రేవంత్రెడ్డి, ఆయన సన్నిహితులపై రాజకీయ కుట్ర ఆరోపణలు చేయడం తీవ్ర చర్చకు దారితీశాయి. సురేఖ క్యాబినెట్ సమావేశానికి గైర్హాజరు కావడంతో వ్యవహారం మరింత ముదిరింది.11. బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయ వివాదంఈ ఎపిసోడ్లో సుస్మిత చేసిన వ్యాఖ్యలు మరో రాజకీయ చర్చకు తెరతీశాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన తన తల్లిని కొందరు రెడ్డి నేతలు అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించడం కాంగ్రెస్లో తీవ్ర చర్చకు కారణమైంది.12. 2025-26.. వరంగల్ కాంగ్రెస్లో గ్రూప్ వార్వరంగల్ కాంగ్రెస్లో సురేఖ వర్గం, ఇతర నేతల మధ్య విభేదాలు కొనసాగాయి. ఆమెకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడం వరుసగా జరిగింది.13. 2026.. ఎర్రబెల్లి స్వర్ణతో మళ్లీ ఢీ2026లో మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో ఎర్రబెల్లి స్వర్ణకు ప్రాధాన్యం దక్కడంతో మరోసారి కొండా వర్గం అసంతృప్తి చర్చకు వచ్చింది. 2018 నుంచి కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇంకా ముగియలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.14. 2026.. కొండా కుటుంబం వర్సెస్ కాంగ్రెస్ నాయకత్వం2026లో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్లో కలకలం రేగింది. సీఎం రేవంత్రెడ్డిపై వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖపై కూడా పార్టీ క్రమశిక్షణ చర్యల డిమాండ్ వచ్చింది. విషయం చివరకు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లింది.15. ప్రస్తుతం.. రేవంత్తో నేరుగా ఢీతాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ అనంతరం సురేఖ స్వయంగా సీఎం రేవంత్రెడ్డిపై ప్రశ్నలు సంధించారు. పార్టీలో తన విషయంలో ఒక రకంగా, ఇతర నేతల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను మహిళను, బీసీ నేతను కావడంతోనే టార్గెట్ చేస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఇక సీఎం రేవంత్రెడ్డి సైతం సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. ఆమెను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా ప్రస్తుతం తీవ్రంగా సాగుతోంది. అయితే తుది నిర్ణయం ఇంకా అధికారికంగా వెలువడలేదు.మొత్తంగా చూస్తే.. కొండా సురేఖ రాజకీయ ప్రయాణంలో ప్రత్యర్థి పార్టీలతో పోరాటం ఎంత కనిపిస్తుందో.. సొంత పార్టీలో అంతర్గత పోరాటం కూడా అంతే కనిపిస్తోంది. తాజాగా వ్యవహారం ఏకంగా గాంధీభవన్ దాటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరడంతో.. ఈసారి వివాదానికి ఎలాంటి ముగింపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. -
ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
కొండా సురేఖ ఎపిసోడ్కు నేడు ఎండ్కార్డ్?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొంతకాలంగా కలకలం రేపుతున్న మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. మంత్రి సురేఖపై క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదిక, సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయం, హైకమాండ్ ముందు సురేఖ వివరణ, ఆపై మీడియా ముందు సీఎంపై చేసిన ఆరోపణలు.. అన్నింటినీ పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు తుది నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగే కీలక భేటీ నేపథ్యంలో ఈ వ్యవహారానికి తెరపడొచ్చనే చర్చా జోరందుకుంది. పరకాల రాజకీయాల నేపథ్యంలో మొదలైన వివాదం.. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్(చిట్టక్క) చేసిన వ్యాఖ్యలతో మరింత ముదిరింది. సీఎం రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా భావించారు. కొండా కుటుంబంపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు పార్టీ క్రమశిక్షణా కమిటీ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సురేఖను వివరణ కోరగా.. తన కుమార్తె వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే పీసీసీ మాత్రం ఈ వ్యవహారం అంతా అధిష్టానమే చూసుకుంటుందని చెబుతూ వచ్చింది. ఈలోపు ఈ వివాదంపై విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ.. సురేఖ వ్యవహారంపై ఓ నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదిక ఆగస్టు 25న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్కు చేరింది. అక్కడి నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్కు.. అటు నుంచి ఏఐసీసీకి చేరింది. అప్పటి నుంచి ఈ అంశం కాంగ్రెస్ హైకమాండ్ వద్దే ఉంది. అయితే వెంటనే చర్యలు తీసుకోకుండా.. సురేఖ వివరణ, పార్టీపై దాని ప్రభావం, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను అధిష్టానం పరిశీలిస్తూ వచ్చింది.రేవంత్ స్పష్టమైన వైఖరిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా.. ఈ ఎపిసోడ్ అంతా నడిచింది. తిరిగొచ్చిన వెంటనే ఆయన ఈ పరిణామాలపై భగ్గుమన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్రెడ్డి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యి ఈ అంశంపై చర్చ జరిపారు. ఈ సందర్భంగా సురేఖపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించినట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణ విషయంలో స్పష్టమైన సందేశం వెళ్లాలన్నది రేవంత్ అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగే పాలమూరు రాజకీయాల్లో కాకరేపిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి వ్యవహారంపైనా ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి నుంచి పదవుల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని సీఎం రేవంత్ కోరుతుండగా.. దానికి టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ సైతం మద్దతు ప్రకటించినట్లు సమాచారం. అయితే.. సురేఖకు మద్దతు కూడామరోవైపు సురేఖను వెంటనే కేబినెట్ నుంచి తొలగించొద్దంటూ కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలు హైకమాండ్ను కోరినట్లు తాజా సమాచారం. ఇద్దరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు మంత్రులు సహా పలువురు నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సురేఖ విషయంలో హైకమాండ్ ముందు రాజకీయంగా సున్నితమైన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో.. ఒకవేళ ఆమెను బర్తరఫ్ చేసినా ఆ తర్వాతి పరిస్థితులకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.హైకమాండ్తో సురేఖ భేటీమరోవైపు ఢిల్లీలో నిన్నంతా కాంగ్రెస్ హెడ్క్వార్టర్స్ ఇందిరా భవన్ వేదికగా నాటకీయ పరిణామాలు జరిగాయి. అధిష్టానం పిలుపుతో అక్కడికి వెళ్లిన కొండా సురేఖ.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. తనపై జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సీఎం రేవంత్తో పాటు పలువురు మంత్రులపై వస్తున్న ఆరోపణల గురించి కూడా హైకమాండ్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆమె చెప్పారు. ఆ వెంటనే సీఎం రేవంత్, ఖర్గేతో మరోసారి భేటీ జరిపారు. అయితే రాష్ట్ర వ్యవహారాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఖర్గే.. రాహుల్ గాంధీతో చర్చించాకే ఏ నిర్ణయమైనా వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం.నేడు కీలక భేటీలురాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర అగ్రనేతలు తిరిగి అందుబాటులోకి రావడం, తెలంగాణకు చెందిన కీలక నేతలు ఢిల్లీలో ఉండటంతో గురువారం చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మీనాక్షి నటరాజన్ తదితరులు హైకమాండ్తో చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత రేవంత్, మహేష్ గౌడ్లు హైదరాబాద్కు తిరుగుపయనం అవుతారని సమాచారం. దీంతో ఇవాళ నిర్ణయం వెలువడొచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇటు ఇవాళ కొండా సురేఖ దంపతులు తిరిగి వరంగల్కు చేరుకోనున్నారు. అనుచరులతో వాళ్లు భేటీ అవుతారని సమాచారం అందుతోంది.కేబినెట్ మార్పులపై కూడా చర్చ?ఈ నెలాఖరుకల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలనే ఆలోచనలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు ఉన్నారు. ఇప్పటికే అధిష్టానంతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇవాళ్టి భేటీలో సురేఖపై నిర్ణయంతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సురేఖను తప్పిస్తే ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలి? ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? నామినేటెడ్ పదవుల భర్తీ ఎలా చేపట్టాలి? అనే అంశాలపైనా ఢిల్లీలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వేటా.. ప్రత్యామ్నాయ మార్గమా?సురేఖను కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు బలంగా ఉన్నాయన్న ప్రచారం కొనసాగుతున్నప్పటికీ.. హైకమాండ్ మరో మార్గాన్ని పరిశీలిస్తోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆమెకు కేబినెట్ నుంచి తప్పుకుని మరో కీలక పదవి ఇచ్చే అవకాశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తాజా కథనాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే కొండా వ్యవహారంపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎవరూ బహిరంగంగా స్పందించవద్దని హైకమాండ్ నుంచి సూచనలు వెళ్లినట్లు సమాచారం. తుది నిర్ణయం వచ్చే వరకు ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదన్న ఆదేశాలు.. ఈ అంశాన్ని పార్టీ ఎంత సీరియస్గా తీసుకుంటోందో స్పష్టం చేస్తున్నాయి. సురేఖతో పాటు జి.చిన్నారెడ్డి వ్యవహారం కూడా హైకమాండ్ ముందుంది. ఇద్దరిపై క్రమశిక్షణా కమిటీ సిఫారసులు చేయడంతో.. ఒకేసారి ఇద్దరిపై చర్యలు తీసుకోవాలా? లేక వేర్వేరుగా నిర్ణయం తీసుకోవాలా? అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది. ఒకవైపు రేవంత్రెడ్డి కఠిన చర్యల వైపు మొగ్గు చూపుతున్నారన్న సమాచారం.. మరోవైపు సురేఖకు పార్టీలోని కొందరి మద్దతు.. ఇంకోవైపు హైకమాండ్ రాజకీయ లెక్కలు.. ఈ మూడు అంశాల మధ్య తుది నిర్ణయం ఆసక్తికరంగా మారింది. నేటి ఢిల్లీ పరిణామాలతో కొండా ఎపిసోడ్కు ఎండ్కార్డ్ పడుతుందా? లేదంటే మరో మలుపు తిరుగుతుందా?అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్టాపిక్ అయ్యింది.ఇదీ చదవండి: పిల్లల బడిలో.. పెద్దోళ్ల ఆఫీస్! -
హైదరాబాద్లో అతిపెద్దదైన స్టీల్ బ్రిడ్జి
హైదరాబాద్: నగరంలోనే అతిపెద్దదైన నల్లగొండ ఎక్స్రోడ్ స్టీల్ బ్రిడ్జి (సైదాబాద్) ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ స్టీల్ వంతెనను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. మొదట మలక్పేట అక్బర్బాగ్లోని ఫైర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం బ్రిడ్జి మీదుగా సీఎం కాన్వాయ్ సంతోష్నగర్–యాదిగిరి «థియేటర్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి అదే బ్రిడ్జి మీదుగా వచ్చి నల్లగొండ క్రాస్రోడ్ వద్ద యూటర్న్ తీసుకుని మలక్పేట ఫైర్ స్టేషన్, చంచల్గూడ జైలు రోడ్ మీదుగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఆవరణకు చేరుకుంటుంది. ఇక్కడ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. కాగా రూ.620 కోట్ల వ్యయంతో 3.23 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి నగరంలోనే అతి పెద్దది. ఇంతకు ముందు ఇందిరాపార్క్ నుండి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి 2.3 కి.మీ ఉండగా..సైదాబాద్ స్టీల్బ్రిడ్జి దీనిని అధిగమించనుంది. స్టీల్బ్రిడ్జ్ నిర్మాణం కింది భాగంలో ఇరువైపులా రహదారులను సైతం అధికారులు పూర్తిగా ఆధునీకరించారు. పచ్చదనం పెంపునకు కూడా చర్యలు చేపట్టారు. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం ప్రాజెక్టు అధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి వద్ద ఏర్పాట్లు పర్యవేక్షించారు. సౌత్ రేంజ్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, సౌత్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, అడిషనల్ డీసీపీ ఎంఏ మాజీద్ తదితరులు సీఎం పర్యటించే ప్రాంతాలను తనిఖీ చేశారు. చంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో నిర్వహించనున్న బహిరంగ సభ వద్ద ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మలక్పేట, సైదాబాద్ ఏసీపీలు రాజా వెంకట్రెడ్డి, వెంకట్రెడ్డి, ఇన్స్పెక్టర్లు బ్రహ్మమురారి, వెంకట్రెడ్డి ఉన్నారు.చదవండి: అనుమానంతో భార్యను చంపిన భర్త -
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భాగంగా రక్షణ ఎక్స్పో–2026ను ప్రారంభించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్రెడ్డి బుధవారం ఉదయం రాజ్నాథ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ కార్మిక, గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ఎం.అనిల్కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కర వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలను రాజ్నాథ్కు సీఎం వివరించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వారిద్దరూ చర్చించారు. డిఫెన్స్ ఎక్స్పోలో లైవ్ డెమోలు... ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష రంగాలపై ప్రత్యేక సదస్సుతోపాటు ఎయిర్ షో, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, భూఉపరితల రక్షణ వ్యవస్థలకు సంబంధించిన లైవ్ డెమోలు డిఫెన్స్ ఎక్స్పోలో ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి రాజ్నాథ్కు వివరించారు. ఈ దృష్ట్యా డిఫెన్స్ ఎక్స్పోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని, ఆహూతులకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. ఎయిర్ షో నిర్వహణకు గగనతల అనుమతుల మంజూరు చేయాలని.. యుద్ధ విమానాల భాగస్వామ్యంతోపాటు సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాల ప్రదర్శనలు ఉండేలా ఆదేశాలివ్వాలని విన్నవించారు. స్టాటిక్ ఎయిర్క్రాఫ్ట్ ప్రదర్శనకు కూడా మద్దతు అందించాలన్నారు. త్రివిధ దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థల డెమోలను ఈ ఎక్స్పోలో ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ శాఖ కోరినట్లుగా భూసేకరణ... ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ గురించి రాజ్నాథ్ సింగ్, రేవంత్రెడ్డి మధ్య చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూమిని సేకరించిందని రేవంత్ చెప్పారు. ఈ విమానాశ్రయం కోసం రక్షణ శాఖ మొత్తం 1,500 కోరిందని.. ఆ మేరకు మరో 750 ఎకరాల భూసేకరణ ప్రక్రియ చేపడతామని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్డీఎల్ ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించనున్నట్లు రాజ్నాథ్కు సీఎం వివరించారు. విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలి... ఆదిలాబాద్, మామూనురు (వరంగల్) విమానాశ్రయాల పనులు వేగవంతం చేయాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో బుధవారం ఆయన్ను పార్టీ ఎంపీలు, అధికారులతోపాటు వెళ్లి కలిశారు. మామూనూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణను పూర్తి చేసి కేంద్రానికి అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజర్ టెర్మినల్తోపాటు మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్ (ఎంఆర్వో) వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఆదిలాబాద్లో రన్వే విషయంలో తుది నిర్ణయానికి సంబంధించి రక్షణ, పౌర విమానయాన శాఖల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ మామునూరు ఎయిర్పోర్ట్ టెండర్లను రెండు వారాల్లో ఆహ్వానిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి ఖరారు చేసి పనులకు అదే నెలలో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ కోరారు. హుస్సేన్సాగర్లో సీప్లేన్ ల్యాండింగ్కు సంబంధించిన నివేదికను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన అధికారులు సీఎంకు తెలియజేశారు. -
కాంగ్రెస్ది 420 ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రతి విషయంలోనూ మోసం చేసిన ‘420 ప్రభుత్వం’గా మిగిలిపోయిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గొంతు కోసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తెచ్చారని, ఆరు డీఏలు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ చెల్లింపుల్లో కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్, రైతులకు ఎకరానికి రూ.15 వేల సాయం, ఏటా 2 లక్షల ఉద్యోగాలు, రూ.4,000 నిరుద్యోగ భృతి హామీలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తామన్న హామీని నీరుగార్చారని, కుల గణన పేరుతో ముస్లింలను బీసీల్లో చేర్చి అసలైన బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. -
ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: విలేకరుల సమావేశంలో మాట్లాడక ముందు మంత్రి సురేఖ వారితో ముచ్చటించారు. సీఎం, ఇతర నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యల చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రస్తుతం అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నా. రాజీనామా చేయాలని ఇప్పటివరకు నాకెవరూ చెప్పలేదు. నేను బీసీని కాబట్టి నాకు ఒక న్యాయం, ఇతర సామాజిక వర్గాలకు మరో న్యాయం పాటిస్తారా? కేబినెట్లో ఉన్న ఇతర సామాజిక వర్గాలకు చెందిన పలువురు నేతలపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. మరి వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారు? మంత్రి పొంగులేటి కుమారుడు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్యపై అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు నోటీసులు ఇవ్వరు? సీఎంది క్రమశిక్షణ ఉల్లంఘన కాదా? సీఎం రేవంత్రెడ్డి అనేకసార్లు పదేళ్లు నేనే ముఖ్యమంత్రినని ప్రకటించుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయనే నేరుగా ప్రకటిస్తున్నారు. ఇది క్రమశిక్షణ ఉల్లంంఘన కాదా? నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు. నాపై చర్యలు తీసుకోవాలంటే పార్టీ, ప్రభుత్వంలో ఇంకా చాలామందిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. వీటన్నింటికీ ఎవరు సమాధానం చెబుతారు? నా కుమార్తె మాట్లాడిన దాంట్లో తప్పేముందో చెప్పాలి. ప్రభుత్వ పెద్దల, సీఎంకుటుంబ సభ్యుల అవినీతి అందరికీ తెలియదా? నాపై బర్తరఫ్ వంటి లాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందో నేను ఇప్పుడే చెప్పలేను..’ అని సురేఖ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ను సైతం తొలగించేందుకు కుట్ర జరగుతోందని, మంత్రి పొన్నంను ఆయన శాఖలో స్వేఛ్చగా పని చేయనీయడం లేదని ఆరోపించారు. -
చర్యపై చెరోవైపు!
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. సీఎం రేవంత్రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలు అన్నట్టుగా పరిస్థితి మారింది. సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు మంత్రి పదవి నుంచి తొలగించాలని సీఎం రేవంత్రెడ్డి పట్టుబడుతున్నట్లు తెలుస్తుండగా..మరోవైపు ఆమెపై చర్యలను కొందరు ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నిజానికి రేవంత్ మంత్రివర్గంలోని అసంతృప్తి నాయకులుగా పరిగణింపబడేవారు.. గత రెండున్నరేళ్లలో ఏనాడూ సీఎంకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. తమ అసంతృప్తిని ఇన్నాళ్లూ లోలోపలే ఉంచుకున్నారని, తాజాగా సురేఖ ఎపిసోడ్ వారికి కలిసొచి్చందని అంటున్నారు. ఏఐసీసీలో సురేఖకు అనుకూలంగా ఒకరిద్దరు మంత్రులు తమ వాయిస్ వినిపించినట్లు సమాచారం. సురేఖపై తక్షణ చర్యకు బదులుగా ఆమె వివరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు కొందరు అధిష్టానానికి సూచించినట్లు తెలుస్తోంది. ఒక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఇద్దరు మంత్రులు, ఓ కీలక నేత సైతం ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించే విషయంలో తొందరపడొద్దని కోరినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీ వర్గానికి చెందిన కీలక మహిళా నేతపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని ఏఐసీసీ పెద్దలకు రేవంత్కు వ్యతిరేకంగా ఉన్న నేతలు వివరించినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రితో పాటు ఆయన అనుకూలురు ఎట్టి పరిస్థితుల్లోనూ సురేఖపై చర్య తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నట్లు ఓ సీనియర్ నాయకుడు వెల్లడించారు. ఒకవేళ సురేఖపై చర్యలు తీసుకోకపోతే..ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో సీఎం రేవంత్ పట్టుపై పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందన్నట్టుగా కాంగ్రెస్ హైకమాండ్కు వారు స్పష్టం చేసినట్లు సమాచారం. సురేఖ తాజా వ్యాఖ్యలపై చర్చ ఇలావుండగా..ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసిన అనంతరం సురేఖ చేసిన వ్యాఖ్యలు పార్టీలో మరింత కలకలం రేపాయి. తాజా చర్చకు తెరలేపాయి. టీపీసీసీ క్రమశిక్షణా సంఘానికి ఇదే సమాధానం చెప్పిన మంత్రి..బెంగళూరులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వద్ద, ఢిల్లీలో మీడియా ముందు కూడా అదే వాదన విని్పంచడంతో పాటు మరో అడుగు ముందుకేసి.. సీఎం రేవంత్రెడ్డిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎంపైనే కాకుండా డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రిపై చేసిన వ్యాఖ్యలు సమస్యను మరింత సంక్లిష్టం చేసినట్లు చెబుతున్నారు. రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ తాజా పరిణామాల నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారు కాంగ్రెస్ను ‘కబ్జా’చేయాలనుకుంటే సహించబోమనడం, వైఎస్సార్ వర్ధంతి సభలో కార్యకర్తలు ’సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేయగా, ‘ఆ సమయం వస్తే దాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు..’అని వ్యాఖ్యానించడం పార్టీలో సీఎం కుర్చీ పోరును మరోసారి బట్టబయలు చేసిందని అంటున్నారు. -
కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకొనే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్కు రాజీనామాలు కొత్త కాదని.. ఆయన రాజీనామాతోనే ఢిల్లీ దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు గుర్తుచేశారు. కేసీఆర్ లేకపోతే రేవంత్కు సీఎం పదవి ఉండేది కాదన్నారు. కేసీఆర్ను రాజీనామా చేయాలనే నైతిక అర్హత రేవంత్కు లేదన్నారు. కేసీఆర్ రాజీనామా చేస్తే రేవంత్రెడ్డి లాంటి అర్భకుడికి తట్టుకొనే శక్తి ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి మురికి మాటలు వినేందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావాలా అని ప్రశ్నించారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ కచ్చితంగా తిరిగి ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వస్తారన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, ఇతర నేతలతో కలిసి తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ 23 పేజీల చార్జిషీట్ను విడుదల చేశారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేవంత్రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం.. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో ప్రజలకు నరకం చూపించిందని కేటీఆర్ ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదని.. వెయ్యి రోజుల శని పాలన, ప్రజాపీడన అని విమర్శించారు. ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్ప ఈ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసంగా అభివర్ణించారు. రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్ లేదా పచ్చ కాంగ్రెస్ పాలన కనిపించడం లేదని.. లుచ్చా కాంగ్రెస్ పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. సంపాదన కోసం సీఎం, మంత్రుల కొట్లాట ఎంగిలి విస్తరాకుల వద్ద కుక్కలు కొట్టుకున్నట్టుగా రాష్ట్ర సంపద కోసం సీఎం, మంత్రులు కొట్లాడుకుంటున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐమ్యాక్స్ స్థాయిలో కాంగ్రెస్ పాలన సాగుతోంది. చంద్రబాబుకు చెంచాగిరీ చేస్తూ తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాలను గురుదక్షిణగా అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రాష్ట్రానికి నష్టం చేసేలా ఉంది. ఎస్ఎల్బీసీ కూలిపోయినా, చెక్ డ్యామ్లు దెబ్బతిన్నా కేంద్ర సంస్థలు, బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైంది. రూ. 50 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. యూరియా అడిగిన రైతులపై లాఠీచార్జి చేయడం, నీళ్లు అడిగితే తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. రైతు సంక్షేమానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. ఎంపీల కొడుకులపై యాక్సిడెంట్ల కేసుల నమోదులో వివక్ష ‘హైదరాబాద్లో పట్టపగలే హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, సైబర్ నేరాలు జరుగుతున్నాయి. మంత్రుల కుమారులు దౌర్జన్యాలకు పాల్పడినా, ఇతర పారీ్టల ఎంపీల కుమారులు ప్రమాదాలకు కారణమైనా కేసులు నమోదు చేయడంలో పోలీసులు వివక్ష చూపుతున్నారు. బొల్లారం మిలిటరీ స్థావరంపైనే దాడి జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. స్కిల్స్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్ విద్యను అనుసంధానం చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ అప్పగించిన రాష్ట్రాన్ని కుప్పకూల్చారు: హరీశ్రావు కేసీఆర్ ఎంతో కష్టపడి నిర్మించిన తెలంగాణను రేవంత్రెడ్డి ప్రభుత్వం కుప్పకూల్చుతోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు ఆరోపించారు. ‘కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగిస్తే.. రేవంత్రెడ్డి సర్కారు వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చింది. తాగునీరు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య, వైద్యం, శాంతిభద్రతల వంటి రంగాల్లో గతంలో తెలంగాణ దేశా>నికి ఆదర్శంగా నిలిచింది. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందితే ఇప్పుడు కరెంట్ కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచిన వైద్య రంగం నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మందులు కూడా దొరకని స్థితికి చేరింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని బాండు పేపర్లపై హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. వెయ్యి రోజులు పూర్తయినా వాటిని అమలు చేయలేదు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే చార్జిషీట్ విడుదల చేశాం. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ ప్రకటించిన పోరాటాన్ని ప్రజల పోరాటాన్ని కొనసాగిస్తాం’అని హరీశ్రావు ప్రకటించారు. -
తెగని పంచాయితీ.. తగ్గని సురేఖ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఢిల్లీ వేదికగా మరింత ముదిరింది. వివాదం అధిష్టానం వద్దకు చేరినా బుధవారం ఏమీ తేల్లేదు. సురేఖపై చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా..మరోవైపు సురేఖ కూడా తన వాదన గట్టిగా విన్పించారు. పైగా హైకమాండ్ పెద్దలతో భేటీ తర్వాత కూడా ఏమాత్రం తగ్గనట్టుగా వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రోజంతా నాటకీయ పరిణామాలు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ వేదికగా బుధవారం రోజంతా నేతల వరుస భేటీలు జరిగాయి. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా సీనియర్ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు, దీని పర్యవసానాలు వంటి అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం.. బుధవారం వారితో సమావేశాలు నిర్వహించింది. కొండా సురేఖ విషయమై మంగళవారం రాత్రే ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకున్న ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, బుధవారం తొలుత ఉదయం 11.30 గంటల సమయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. వారిద్దరి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా సుస్మిత, మంత్రి సురేఖల వ్యవహారాన్ని పీసీసీ అధ్యక్షుడు తప్పుపట్టినట్లు తెలిసింది. సుస్మిత వ్యాఖ్యలతో ప్రభుత్వం, పార్టీలో గందరగోళం నెలకొందని, అనేకమంది జిల్లా నేతలు, ఎమ్మెల్యేలు దీన్ని తప్పుపట్టినట్లుగా మహేశ్ వివరించినట్లు సమాచారం. కూతురు మాట్లాడిన విషయాలను సురేఖ తప్పుపట్టకపోగా, ఆ వ్యాఖ్యలతో తనకేం సంబంధం అన్న రీతిలో స్పందించడం సరైంది కాదని అన్నట్టు తెలిసింది. సురేఖపై క్రమశిక్షణా చర్యల విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమ్మతమేనని చెప్పినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు స్పందించడంపై మీనాక్షి అసహనం! అయితే పీసీసీ వైఖరికి భిన్నంగా మీనాక్షి స్పందించినట్లు తెలుస్తోంది. ఓ మంత్రి కుమార్తె మాట్లాడితే దానిపై హుటాహుటిన 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందించడం సరైందేనా? ఇది ఎవరి ఆదేశాల మేరకు జరిగిందన్న రీతిలో మీనాక్షి మాట్లాడినట్టు చెబుతున్నారు. పార్టీలోని ఇతర ఎమ్మెల్యేలు, నేతలు మాట్లాడితే స్పందించని ఎమ్మెల్యేలు.. సుస్మిత వ్యాఖ్యలపై అంతలా స్పందించడాన్ని చాలామంది సీనియర్లు తప్పుపట్టిన విషయాన్ని ఆమె ప్రస్తావించినట్లు సమాచారం. మధ్యలో వచ్చిన రేవంత్.. కేసీ వేణుగోపాల్తో మీనాక్షి, మహేశ్ల భేటీ జరుగుతుండగానే.. కేంద్రమంత్రి రాజ్నాధ్ సింగ్తో భేటీ ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేరుగా ఇందిరాభవన్కు చేరుకుని వారితో జత కలిశారు. వీరి భేటీ కొనసాగుతుండగానే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం కార్యాలయానికి రావడంతో అంతా కలిసి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానూ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ సురేఖ అంశాన్ని తీవ్రంగా తప్పుపట్టడమే కాకుండా రాష్ట్ర నేతల అభిప్రాయాన్నీ వివరించారు. ఆమెను కేబినెట్ నుంచి తొలగించాలన్న అభిప్రాయాన్నే ఖర్గే వద్ద వెలిబుచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో పరిణామాలపై ఖర్గే అసంతృప్తి రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న కుమ్ములాటలు, ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై ఖర్గే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో జరుగుతున్న వరుస పరిణామాలు, కలహాలతో చెడ్డపేరు వస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం, పార్టీలోని నేతలపై అనేక ఫిర్యాదులు అధిష్టానానికి అందుతున్నాయని, వీటిని రాష్ట్ర స్థాయిలోనే కట్టడి చేయకపోవడానికి గల కారణాలపై గట్టిగా నిలదీసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ, ప్రభుత్వం మధ్య కొరవడిన సమన్వయం, నేతల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో వైఫల్యమే దీనికి కారణమని ఆయన పేర్కొనట్లు సమాచారం. అయితే సురేఖ వ్యవహారంలో ఆమెను పిలిచి మాట్లాడతామని, ఆ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. గంట పాటు చర్చల అనంతరం ముఖ్యమంత్రి ఏఐసీసీ కార్యాలయం వెనుక గేటు ద్వారా బయటకి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి మీనాక్షి సైతం అక్కడి నుంచి నిష్క్రమించారు. సురేఖ ఎంట్రీ.. గంట పాటు వెయిటింగ్ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, మీనాక్షితో ఖర్గే, కేసీల భేటీ జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ సైతం ఇందిరాభవన్కు వచ్చారు. నేరుగా ఖర్గే కార్యాలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ గంట సేపు నిరీక్షించారు. సీఎం, మీనాక్షి, కేసీలు వెళ్లిపోయాక ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అవినీతి, వారిపై వచ్చిన భూకబ్జా ఆరోపణలు, వివిధ సందర్భాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, కేబినెట్లోని ఇతర మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయనకు ఒక నివేదిక అందించినట్లు తెలిసింది. అనంతరం సురేఖ మీడియాతో ముచ్చటించారు. ఖర్గేతో కొండా సురేఖ మీనాక్షి, సురేఖ, ఉత్తమ్ మంతనాలు మీడియాతో సురేఖ ముచ్చటిస్తున్న సమయంలోనే రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇందిరాభవన్కు వచ్చారు. ఉత్తమ్ను చూసిన సురేఖ ఆయనతో కలిసి ఇందిరాభవన్కు తిరిగొచ్చి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిణామాలు, ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన నివేదికను ఆమెకు అందజేశారు. తనను మంత్రివర్గంలో కొనసాగించాలని, తన కూతురు మాట్లాడిన దానికి తనను బాధ్యురాలిని చేయరాదని కోరారు. అనంతరం బయటకు వచ్చి విలేకరులతో మాట్లాడారు. సురేఖ ఆరోపణలను ఖర్గేకు వివరించిన రేవంత్ సురేఖ విలేకరులతో మాట్లాడిన తర్వాత.. సీఎం రేవంత్ మరోసారి ఖర్గేను కలిసారు. సురేఖ విలేకరులతో మాట్లాడుతూ చేసిన ఆరోపణలపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఏఐసీసీ కార్యాలయం వేదికగా ఆమె ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలపై ఆరోపణలు చేశారంటూ ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఇంత జరిగాక కూడా ఆమెపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షించడం తగదని అన్నారని తెలిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి కూడా పాల్గొన్నారు. కాగా ఈ అన్ని అంశాలపై రాహుల్గాంధీ ఢిల్లీకి వచ్చిన తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఖర్గేతో భేటీ తర్వాత రేవంత్, భట్టి.. వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. -
సీఎం రేవంత్పై కొండా సురేఖ తిరుగుబాటు
సాక్షి,న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ ఎపిసోడ్ తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. తన కుమార్తె కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడంపై అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై అధిష్టానం ముందు తన ఆవేదనను వెలిబుచ్చేందుకు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్లతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్పై తిరుగుబాటు ప్రకటించేలా కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ మహిళలు స్వతంత్రంగా బ్రతకాలని నిత్యం చెబుతుంటారు. నా కూతురు స్వతంత్రంగా మాట్లాడిన దానికి నన్ను బాధ్యురాలిని చేస్తూ నాకే షోకాజ్ నోటీసులు ఇస్తారా?.ఖర్గేకు పరిస్థితిని వివరిస్తూ లేఖ అందించాను. ఆ లేఖలోని విషయాలు బయటకు వస్తే పార్టీలో తీవ్ర ప్రకంపనలు రావడం ఖాయం.నా కుమార్తె సుష్మితా పటేల్ మాట్లాడింది తప్పా? ఒప్పా? అనేది నేను చెప్పను. నా బిడ్డ స్వతంత్ర ఆలోచనలతో మాట్లాడింది, తనను వారించే అధికారం నాకు లేదు. నా పొలిటికల్ లైఫ్ నాది. నా వైపు ఎలాంటి తప్పు లేదనే విషయాన్ని అధిష్టానానికి స్పష్టంగా వివరించానాపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవని, మంత్రి పదవిలో కొనసాగేలా చూడాలని అధిష్టానాన్ని కోరా. భేటీలో తన బర్తరఫ్ గురించి ఎలాంటి చర్చా రాలేదు. నాపై కుట్ర జరుగుతోందని ఆరోపించిన సురేఖ.. నాకు నోటీసులు ఇచ్చిన పార్టీ, నాపై బహిరంగంగా విమర్శలు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. వారి వెనుక ఉండి నన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడించిన అసలు సూత్రధారులపై కూడా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూసి, అధిష్టానం స్పందన ఆధారంగానే తన తదుపరి కార్యాచరణ ఉంటుందని కొండా సురేఖ తేల్చిచెప్పారు.👉ఇదీ చదవండి: మంత్రి కొండా సురేఖకు ఊహించని షాక్ -
ఆ లేఖలో ఏముంది? రాజకీయ ప్రకంపనలని కొండా సురేఖ ఎందుకన్నారు?
సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తిరుగుబాటు చేస్తుండడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇటీవలే సీఎం రేవంత్రెడ్డికి రాఖీ సైతం కట్టారు కొండా సురేఖ. దీంతో ఆమె ఇష్యూ కాస్త చల్లబడేలా ఉందని కొందరు భావించారు. అయితే, కొండా సురేఖ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. న్యూఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ తాను మల్లికార్జున ఖర్గేను కలిసి, తన వివరణ ఇచ్చానని తెలిపిన విషయం తెలిసిందే. సవివరమైన లేఖను ఖర్గేకు అందజేశానని ఆమె అన్నారు. ఆ లేఖ బయటకు వస్తే రాజకీయ ప్రకంపనలు సంభవిస్తాయని కొండా సురేఖ అనడం గమనార్హం. రాజీనామా చేయాలంటే.. తాను చేయబోనని చెప్పారు. తన కూతురు ఎమ్మెల్యే కావాలనుకుకుంటున్నారని తెలిపారు. కడియం శ్రీహరి తన కూతురును ఎంపీని చేసుకున్నారని చెప్పారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ గాంధీ చెబుతున్నారని అన్నారు. పొంగులేటి, భట్టి విక్రమార్క కమీషన్లపైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని, దానిపైన ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని ఆమె నిలదీశారు.లేఖలో ఏముంది?మల్లికార్జున ఖర్గేను కలిసి, లేఖను ఖర్గేకు అందజేశానని.. అది బయటకు వస్తే రాజకీయ ప్రకంపనలు సంభవిస్తాయని చెబుతూ కొండా సురేఖ మరో బాంబు పేల్చారు. దీంతో ఆ లేఖలో ఏముందన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే ఆమె ఆ లేఖను బయటపెడతారా? అసలు ఆ లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారు? ఎవరిని ఉద్దేశించి రాశారు? అందులో ఎలాంటి కీలక విషయాలు ఉన్నాయి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో లేఖలోని అంశాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే లేఖలోని పూర్తి వివరాలు ఇప్పటివరకు బహిరంగం కాలేదు. ఖర్గేకు లేఖ అందజేసినట్లు ఆమె స్వయంగా చెప్పడంతో, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన కీలక అంశాలు అందులో ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేఖ బయటకు వస్తుందా? అందులోని విషయాలు ఏమిటన్నది తెలియాలంటే మరింత స్పష్టత రావాల్సి ఉంది. లేఖ గురించి చెప్పే సమయంలో ఆమె భట్టి విక్రమార్క, పొంగులేటి కమీషన్లపై ఎందుకు చర్యల్లేవు?’’ అంటూ కూడా ప్రశ్నించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదీ చదవండి: బంగారం ఎందుకు కొనొద్దు? విదేశీ పర్యటనలు ఎందుకు వద్దు? -
ఢిల్లీలో హైటెన్షన్.. ఖర్గేతో కొండా సురేఖ కీలక చర్చలు!
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాల వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఆమె భేటీ కానున్నారు. మరోవైపు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా అధిష్ఠాన పెద్దలతో సమావేశమవుతున్నారు.ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి.. ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సుమారు గంటన్నరపాటు సమావేశమైనట్లు సమాచారం. ఈ భేటీలో కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీ క్రమశిక్షణ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, పెండింగ్లో ఉన్న రెండు మంత్రి పదవులు, కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు, అలాగే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులు కూడా చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలా? లేక శాఖ మార్పుతో సరిపెట్టాలా? అనే అంశంపై అధిష్ఠానం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు సురేఖకు కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఆమెపై తుది నిర్ణయం తీసుకునే ముందు సురేఖతో సంప్రదింపులు జరపాలని కొందరు నేతలు అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిసింది. శాఖను మార్చడం వంటి ప్రత్యామ్నాయాన్ని కూడా కొందరు నేతలు సూచించినట్లు సమాచారం.ఇక మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్తో కేసీ వేణుగోపాల్ సమావేశం కూడా కీలకంగా మారింది. సురేఖ వ్యవహారంపై వారి అభిప్రాయాలను తీసుకున్న అనంతరం ఖర్గే నేతృత్వంలో మరో కీలక భేటీ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా.. కొండా సురేఖపై చర్య విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠగా మారింది.ఇదీ చదవండి: ప్రజలను కాంగ్రెస్ నట్టేటముంచింది: కేటీఆర్ -
సర్కార్ పై గులాబీ సమరం
-
మంత్రి పదవి ఊస్ట్ హుటాహుటిన ఢిల్లీకి కొండా సురేఖ
-
జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్.. ఇచట ఇన్స్పెక్టర్ లేరు!
హైదరాబాద్: వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు ఇన్స్పెక్టర్ను నియమించడంలో తాత్సారం జరుగుతుంది. వారం రోజులు గడుస్తోన్నా ఇన్స్పెక్టర్ నియామకంలో ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏ అధికారి వచ్చినా 10 వారాలు కూడా ఉండకుండా సస్పెన్షన్లకు గురవుతుండడంతో ఈసారి ఎస్హెచ్వో నియామకంలో మరింత పారదర్శకత ఉండేలా చేపట్టాలని యోచిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి నివాసముండే పరిధి ఠాణాలోనే వరుస వివాదాలు చోటుచేసుకుంటుండడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి నివాసంతో పాటు సీఎం క్యాంప్ కార్యాలయ కిందికి వచ్చే ఈ పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్లు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తుండడంతో పాటు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ పోలీసు శాఖకే మచ్చతెచ్చారు. దీంతో ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డిని సస్పెండ్ చేసి, ఆయన స్థానంలో ముత్తుయాదవ్ను నియమించారు. ఆయన కూడా విధి నిర్వహణలో తీవ్ర నిరక్ష్యాన్ని కనబరచడమే కాకుండా మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై చర్యలు తీసుకోవడంలోనూ, ఆయనను అరెస్టు చేయడంలోనూ అశ్రద్ధ వహించారు. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులు పారిపోవడానికి ఆస్కారం కలిగించారనే ఆరోపణలతో గత నెల 25న ముత్తుయాదవ్పై వేటుపడింది. అప్పటి నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ను నియమించడానికి ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జల్లెడపడుతున్న నిఘా వర్గాలు సీఎం రేవంత్రెడ్డి నివాసం ఉండే ఈ ఠాణాకు సమర్ధుడైన ఇన్స్పెక్టర్ను నియమించాలని, ఆ స్థాయి అధికారి కోసం నిఘా వర్గాలు జల్లెడపడుతున్నాయి. అటు ఇంటెలిజెన్స్, ఇటు ఎస్బీ ఈ ఠాణాకు ఇన్స్పెక్టర్ను నియమించడంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఇన్స్పెక్టర్ నియామకంలో పాత్ర ఉండే అధికారులను పక్కనబెట్టి ఈసారి గుర్తించిన ఉన్నతాధికారుల ప్రమేయంతో ఈ పోస్టును భర్తీ చేయాలని యోచిస్తున్నారు. అందుకే నియామకంలో ఆలస్యం జరుగుతుందని పేర్కొంటున్నారు. దగ్గరపడుతున్న వినాయక చవితి వేడుకలు వినాయక చవితి వేడుకలు దగ్గర పడుతుండడంతో జూబ్లీహిల్స్ ఠాణాకు ఇంకా ఇన్స్పెక్టర్ను నియమించకపోవడంతో వినాయక మండపాల కమిటీ ప్రతినిధుల సమావేశాలు, మైత్రి కమిటీ సమావేశాలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద నిఘాతో పాటు అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడం, రౌడీ షిటర్ల బైండోవర్, నిమజ్జనోత్సవాల్లో జాగ్రత్తలు, నిమజ్జనోత్సవ రూట్లు.. ఇలా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి కీలకమైన బాధ్యతలు ఉంటాయి. ఇన్స్పెక్టర్ను నియమించకపోవడంతో నవరాత్రులతో పాటు నిమజ్జనోత్సవాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముందుకుసాగని కేసులు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో నేరాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ముఖ్యంగా దొంగతనాల సంఖ్య పెరుగుతుంది. కేసుల ఛేదనలో పోలీసులు ముందుకువెళ్లలేకపోతున్నారు. దీనికి ఆదేశాలు ఇచ్చి తగిన సూచనలు ఇచ్చే అధికారి లేకపోవడంతో నేరాల మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. పూర్తిస్థాయి జూబ్లీహిల్స్ లేకపోవడంతో ఎఫ్ఐఆర్ల నమోదు చేయడంలోనూ, బాధితులకు న్యాయం చేయడంలోనూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పరిశీలనలో ముగ్గురు జూబ్లీహిల్స్ ఠాణాకు ఈ సారి సమర్థుడైన ఇన్స్పెక్టర్ను నియమించాలని తలపెట్టడంతో బాధ్యత గల అధికారుల కోసం చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎవరినైనా ఒకరిని నియమిచే బాధ్యత ఈసారి సీఎంవో కార్యాలయంపై పడిందని తెలుస్తోంది. ‘సిట్’ బృందాలతో.. ఈ పోలీస్స్టేషన్ పరిధిలోనే ఫోన్ ట్యాపింగ్పై సిట్ ఏర్పాటుచేశారు. ఇందుకోసం ఇక్కడ ఏసీపీ కొంతకాలంగా సిట్ దర్యాప్తు అధికారిగా ఉన్నారు. దీంతో ఇన్చార్జి ఏసీపీగా సామల వెంకట్రెడ్డి వ్యవహరిస్తున్నారు. మరోవైపు జూబ్లీ రిచ్కిడ్ ట్రాప్ కేసులోనూ సిట్ ఏర్పాటుచేశారు. దీనికి కూడా ఒక ఎస్సైతో పాటు సిబ్బంది పనిచేస్తున్నారు. ఇలా సిట్ రూపంలో ఇప్పటికే ఠాణాపై బరువు పెరిగిపోయింది. బాధ్యత గల అధికారులంతా ఈ దర్యాప్తులోనే ఉన్నారు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ కూడా లేకపోవడంతో దీని ప్రభావం కేసులపై పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. చదవండి: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్సాయిపై కేసు -
‘రేవంత్ డబ్బుల మూట’.. హైదరాబాద్లో పోస్టర్ల కలకలం!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరవ్యాప్తంగా వెలిసిన వ్యంగ్య పోస్టర్లు రాజకీయ కలకలం రేపుతున్నాయి. “1000 DAYS OF CONGRESS GOVERNMENT” పేరుతో ఏర్పాటు చేసిన పోస్టర్లలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో, ఈ పోస్టర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.ఈ పోస్టర్లలో సీఎం రేవంత్రెడ్డిని టార్గెట్ చేస్తూ డబ్బుల మూటలు, పేదల ఆర్తనాదాలు వంటి వ్యంగ్య చిత్రాలను ప్రదర్శించారు. సచివాలయం, గాంధీ భవన్, జూబ్లీహిల్స్తో పాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. బుధవారం ఉదయం నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోస్టర్లు కనిపించడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సురేఖను తప్పించాల్సిందే! -
సురేఖను తప్పించాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న నేతలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద కుండబద్ధలు కొట్టినట్లు తెలిసింది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారంతో పార్టీ, ప్రభుత్వం రెండూ సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని.. ఈ విషయంలో ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నదే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల అభిప్రాయంగా ఉందని సీఎం తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ వ్యవహారాన్ని ఉపేక్షిస్తే పార్టీ కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్లడంతోపాటు రాష్ట్ర నాయకత్వంపై లేనిపోని అపోహలకు తావిచ్చినట్లు అవుతుందని ఆయన చెప్పినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సీనియర్ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎంను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దీనిపై వ్యక్తమైన భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వంపై కొందరు ఎమ్మెల్యేలు, నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు, జిల్లాల్లో బయటపడుతున్న విభేదాల నేపథ్యంలో రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం మంగళవారం వారితో చర్చించింది. గతంలో పెద్ద మనసుతో ఉపేక్షించినా.. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం రాత్రి ముందుగా భేటీ అయ్యారు. కాన్వాయ్ లేకుండా కేవలం ఒక్క కారులోనే కేసీ ఇంటికి చేరుకొని గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండ సురేఖ అంశంలో జరిగిన పరిణామాలు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి వివరించినట్లు తెలిసింది. అలాగే పలు జిల్లాల్లో నేతల మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలపై చర్చించారు. ఈ సందర్భంగానే కొండా సురేఖ అంశంలో ఆమె శాఖలో బయటపడ్డ అవినీతి ఆరోపణలు, జిల్లాల నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులు, గతంలోనే ఆమె కుమార్తె నేరుగా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను కేసీకి ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. అప్పుడే సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలనే అభిప్రాయాలు వ్యక్తమైనా పెద్ద మనసుతో ఉపేక్షించామని.. కానీ ప్రస్తుతం ఆమె కుమార్తె నేరుగా తనపై అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు స్థానిక ఎమ్మెల్యేను తూలనాడటాన్ని కేడర్ సహించట్లేదన్న విషయాన్ని బలంగా చెప్పినట్లుగా సమాచారం. అధిస్టానం నిర్ణయాలనే ధిక్కరించేలా ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలపై సుస్మిత వ్యాఖ్యలను సైతం జిల్లా ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపడుతున్న విషయాన్ని వివరించినట్లు తెలిసింది. ఈ పరిణామాల దృష్ట్యా ఆమె కేబినెట్ను తొలగించడమే సమంజసమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక జి.చిన్నారెడ్డి విషయంలోనూ ఉపేక్షించరాదని.. ఈ రెండు విషయాలపై క్రమశిక్షణా సంఘం చేసిన నిర్ణయాన్ని పార్టీ అమలు చేసేలా చూడాలని సీఎం కోరినట్లుగా తెలిసింది. అసెంబ్లీ తర్వాత మంత్రివర్గ విస్తరణ.. అదే సమయంలో సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆమె స్థానంలో చేపట్టాల్సిన భర్తీతోపాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవులను కూడా భర్తీ చేయాలన్న అంశం కేసీ, రేవంత్ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్రెడ్డి, బీసీ సామాజికవర్గం నుంచి ఆది శ్రీనివాస్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ స్పీకర్గా బాలూనాయక్ పేర్లను ముఖ్యమంత్రి ముందుంచినట్లుగా చెబుతున్నారు. మంత్రి పదవులు దక్కని సీనియర్లకు నామినేటెడ్ పదవులను ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణపై అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ నెల మూడో వారంలో ఓ నిర్ణయానికి రావాలని నిశ్చయించినట్లు సమాచారం. ఆ తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్ణయం తీసుకుందామనే అభిప్రాయం వ్యక్తమైందని తెలియవచ్చింది. అలాగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ముందుగానే అభ్యర్థుల ప్రకటనపైనా ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఢిల్లీలోనే మంత్రులు.. హస్తిన రాజకీయాల నేపథ్యంలో కీలక మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. జలవనరులకు సంబంధించిన సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బుధవారం సైతం ఇక్కడే ఉండనున్నారు. అయితే రాజకీయ భేటీలు ఉంటాయన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మంత్రివర్గంలో మార్పుచేర్పులు, నామినేటెడ్ పదవుల భర్తీలు జరిగితే మాత్రం ఆయన్ను పలిపించి మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రులను కలిసేందుకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలోనే ఉండగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా స్వామినాథన్ ఫౌండేషన్కు అందిస్తున్న అవార్డు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబులు బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకోనున్నారు. వారు సైతం అధిష్టానం పెద్దలతో భేటీ అవుతారని అంటున్నారు. ఇక అధిస్టాన పెద్దల పిలుపుమేరకు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ బుధవారం ఉదయం అధిస్టాన పెద్దలతో భేటీ కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి భవన్లో జరిగిన స్పీకర్ల సదస్సు కోసం ఢిల్లీ వచ్చిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అంతకుముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పార్టీకి తాను చేసిన సేవలను వివరిస్తూ కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం కల్పించాలని విన్నవించినట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తనకు ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా పార్టీకి సానుకూలత ఏర్పడుతుందని ఆయన తెలిపినట్లుగా సమాచారం. సురేఖ వేచిచూసినప్పటికీ.. మరోవైపు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖ ఒకే విమానంలో మంగళవారం ఢిల్లీ చేరుకున్నప్పటికీ అధిష్టానం నుంచి ఆమెకు ఇంకా పిలుపు రాలేదు. కేసీ వేణుగోపాల్ను సీఎం కలిసి వెళ్లాక కొండా సురేఖ కూడా కేసీని కలుస్తారనే ప్రచారం జరిగింది. అయితే రాత్రి 10 గంటల సమయం దాటినా ఆమెను కేసీ పిలవలేదు. దీంతో బుధవారం ఉదయం అధిష్టానం పెద్దల నుంచి ఆమెకు పిలుపు వచ్చే అవకాశం ఉందని సమాచారం. నివేదిక ఇచ్చా.. అధిష్టానం నిర్ణయమే ఫైనల్: మల్లు రవి తమ పార్టీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా నివేదికను హైకమాండ్కు అందజేశానని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. ఇక అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. హైకమాండ్ నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అసెంబ్లీని స్తంభింపజేస్తాం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచస్థాయి విద్యావ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నెలల తరబడి చెల్లించకపోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. గత రెండున్నరేళ్లుగా నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అధ్యాపకులు, నాన్టీచింగ్ సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందడం లేదని, అద్దెలు, విద్యుత్ బిల్లులు, యూనివర్సిటీ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులు చెల్లించలేక యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం హరీశ్రావును ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. కొన్ని కళాశాలల్లో 5 నుంచి 10 నెలల వరకు జీతాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గతంలో సుమారు 960గా ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల సంఖ్య ఇప్పుడు దాదాపు 650కు తగ్గిందని, ఇప్పటికే 310 కళాశాలలు తగ్గిపోయాయని హరీశ్ అన్నారు. ప్రస్తుతం మూడు బడ్జెట్లు పూర్తయినా దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్ బకాయిలను తక్షణమే పూర్తిగా విడుదల చేయడంతోపాటు, ప్రతి విద్యా సంవత్సరానికి నిర్ణీత గడువులో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించే శాశ్వత విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే ఈ అంశంపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని హరీశ్రావు హెచ్చరించారు. -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తేనే రేవంత్రెడ్డి తను చెప్పుకుంటున్నట్టు 2034 వరకూ అధికారంలో ఉంటారని, లేని పక్షంలో టీచర్ల ఆగ్రహాన్ని రుచి చూడాల్సి ఉంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి హెచ్చరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదని, ఆందోళన బాట పడతామన్నారు. పీఆర్టీయూ టీఎస్ నేతృత్వంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మంగళవారం మహాధర్నా జరిగింది. అన్ని జిల్లాల నుంచి టీచర్లు పెద్ద ఎత్తున ఈ ధర్నాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ రేవంత్రెడ్డి అధికారం చేపట్టి వేయి రోజులైనా జీతాలు ఇవ్వడం మినహా తమకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్ను రద్దు చేశాయని, తెలంగాణలో మాత్రం ఇది ఎందుకు అమలు కాలేదని ప్రశ్నించారు. శ్రీపాల్ ప్రసంగం కొనసాగినంత సేపు టీచర్లు ఉద్విగ్న భరితంగా కరతాళ ధ్వనులు చేశారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం సాధించే దిశగానే పనిచేస్తున్నామని, తమ సంఘం ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకదని స్పష్టం చేశారు. మహాధర్నాలో సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ బి మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పెరి వెంకట్రెడ్డి, వంగ మహేందర్ రెడ్డి, గుండు లక్ష్మణ్ పాల్గొన్నారు. -
కేసీ వేణుగోపాల్కు కీలక విషయాలు చెప్పిన రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై చర్చించారు. దాదాపు గంటకుపైగా కొనసాగిన ఈ సమావేశంలో.. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై తన అభిప్రాయాలను నేరుగా కేసీ వేణుగోపాలకు వివరించారు రేవంత్ రెడ్డి.కొండా సురేఖపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత క్రమశిక్షణ రాహిత్యం పెరిగే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు అంటున్నారు. కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. బీసీ మహిళపై వేటు వేస్తే పార్టీకి వచ్చే నష్టంపైన కాంగ్రెస్ హై కమాండ్ బెరీజు వేస్తోంది. కొండా సురేఖ వివరణ తీసుకుని నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు కర్గే రాహుల్ గాంధీకి కేసీ వేణుగోపాల్ అందజేయనున్నారు. ఆ తర్వాత కొండా సురేఖపై నిర్ణయాన్ని ఏఐసీసీ ప్రకటించనుంది.కాగా, ఇటీవల రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు సుస్మిత పలు వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్ చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. -
ఢిల్లీకి చేరిన తెలంగాణ రాజకీయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పరిణామాలతో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, అంతర్గత విభేదాలు,త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో హస్తిన వేదికగా కీలక చర్చలు సాగుతున్నాయి.ఈ క్రమంలో మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకే విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు అధిష్టానం పెద్దలతో మంత్రి కొండా సురేఖ భేటీ కానున్నారు.మరోవైపు, కేబినెట్ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఆశావాహుల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి సైతం కాసేపట్లో ఢిల్లీకి పయనం కానున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానని గతంలో హైకమాండ్ ఇచ్చిన హామీని గుర్తుచేసేందుకే ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం.ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వేదికగా ఏఐసీసీ ముఖ్య నేతలతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. వీరితో పాటు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా ఢిల్లీ చేరుకున్నారు.మంత్రి కొండా సురేఖకు సంబంధించిన అంశాలతో పాటు, రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, తుది స్థానాల భర్తీపై ఈ కీలక సమావేశాల్లో అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. -
అసెంబ్లీని ముట్టడిస్తాం
సాక్షి, సిద్దిపేట: ‘22ఏ జాబితాలో చేర్చిన భూము లకు వెంటనే విముక్తి కల్పించాలి..లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు హెచ్చరించారు. ధరణి కంటే దారు ణంగా భూభారతి మారిందన్నారు. 22ఏలో చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు హాజరై మాట్లాడారు. 22ఏ జాబితా విషయంలో పొరపాట్లు జరిగాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వయంగా అంగీకరించారని, వాటిని వెంటనే సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఒక ఫ్యామిలీ.. ఇప్పుడు బ్రదర్స్ బాగుపడు తున్నారన్నారు. సీఎం ఇల్లు ఎలా బయటపడిందో చెప్పాలిజూబ్లీహిల్స్లోని 403 సర్వే నంబర్లో కేవలం రెండు ప్లాట్లు మాత్రమే ప్రభుత్వ భూములని, మిగతా భూములను సైతం 22ఏ జాబితాలో చేర్చా రని రాంచందర్రావు ఆరోపించారు. ఇదే జాబితాలో సీఎం రేవంత్రెడ్డి నివాసం కూడా ఉందని, ఆ ఇల్లు 22ఏ జాబితా నుంచి ఎలా బయటపడిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడుతున్నాయని చెప్పారు. 22ఏలో జరిగిన గందరగోళాన్ని సిట్టింగ్ హైకోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేవంత్రెడ్డి చేసిన దరఖాస్తు చూపించాలి: రఘునందన్రావు22ఏ జాబితాలో ఉన్న తన ఇల్లు తొలగింపు కోసం రేవంత్రెడ్డి చేసిన దరఖాస్తును ప్రజలకు చూపించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. ఎలాంటి దరఖాస్తు లేకుండానే సీఎం ఇల్లు నిషేధిత భూముల్లో నుంచి తొలగించారని ఆరోపించారు. ‘పొట్టోడికి పరిపాలన రాదు.. భూముల లిటికేషన్ పెట్టడం మాత్రం వచ్చు’ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. -
క్షణం విశ్రాంతి తీసుకోలేదు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెయ్యి రోజుల్లో తాను ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నానని ముఖ్యమంతి రేవంత్రెడ్డి చెప్పారు. కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఈ వెయ్యి రోజుల్లో కనీసం ఒక్క గంటైనా పేదల కోసం పని చేశారా? అని ఆయన ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్లోని మూసారాంబాగ్ హైలెవల్ వంతెనను ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి.. అనంతరం నిర్వహించిన సభలో కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ముతో ఫాంహౌస్లో పడుకుంటే సరిపోతుందా అని మండిపడ్డారు. తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్న కేసీఆర్.. కొడుకు, అల్లుడు, కుటుంబ సభ్యులను మంత్రులు, ఎంపీలుగా చేసుకున్నారని విమర్శించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో తన కుటుంబం నుంచి ఒక్కరైనా ఉన్నారా అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో కొందరు కలిసి రూ. లక్ష కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్కు ఈ వెయ్యి రోజుల్లో వేతనంగా రూ. 1.24 కోట్లు, వాహనాలు, సెక్యూరిటీ, ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో రూ. 21 కోట్లు ఖర్చు చేశామని సీఎం వివరించారు. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ఏడాదిపాటు విధులకు హాజరు కాకపోతే డిస్మిస్ చేస్తారని.. మరి ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ను ఏం చేయాలన్నారు. ఎక్కడైనా ప్రభుత్వాలు విఫలమవడం చూస్తాం కానీ.. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడే పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తో మండలాలు, జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 6న ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టాలని.. 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ధైర్యముంటే కేసీఆర్ వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారో వెయ్యి రోజుల్లో తాను ఏం చేశానో చర్చిద్దామన్నారు. కేసీఆర్ కుటుంబానికి పదవులు దక్కలేదనే అక్కసుతోనే తన వెయ్యి రోజుల పాలనను వైఫల్యమంటున్నారని.. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ తాము కొనసాగిస్తున్నామని సీఎం గుర్తుచేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు.. విధ్వంసమైన తెలంగాణను ఒక్కొక్కటిగా కూడదీసుకుంటూ వికాసం వైపు నడిపిస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. వెయ్యి రోజుల పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 27.50 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని.. ప్రభుత్వ బడుల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరన్నారు. గత పదేళ్లలో గ్రూప్–1, 2, 3, 4 పరీక్షలతోపాటు పోలీసు, ఉపాధ్యాయ, వైద్య, నర్సింగ్ తదితర ఏ శాఖలోనూ ప్రభుత్వ నియామకాలు చేపట్టలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల వ్యవధిలోనే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని స్పష్టం చేశారు. తెలంగాణలో అప్పుల్లేని రైతులు ఉన్నారని నీతి ఆయోగ్ చెబుతోందని సీఎం అన్నారు. టిమ్స్ ఆసుపత్రులకు ప్రముఖుల పేర్లు.. రాష్ట్రంలోని టిమ్స్ ఆసుపత్రులకు ప్రముఖ తెలంగాణ నేతల పేర్లు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా సనత్నగర్ టిమ్స్కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు, అల్వాల్ టిమ్స్కు టి. అంజయ్య పేరు, ఎల్బీనగర్ టిమ్స్కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వరంగల్ టిమ్స్కు ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడుతున్నట్లు వెల్లడించారు. పేదల వైద్యం కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తూ, గత 30 నెలల్లో పేదల ఆరోగ్యం కోసం రూ. 5,200 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కేసీఆర్ తన పాలనలో కూలిపోయే దశలో ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని కూడా కొత్తగా నిర్మించాలనే ఆలోచన చేయలేదని, ఏనాడైనా పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన భావించారా అని ప్రశ్నించారు. వారంతా నా కుటుంబ సభ్యులే ‘ఉద్యోగ సంఘాలు నన్ను బెదిరిస్తున్నాయి.. కాదు కాదు, వారంతా నా కుటుంబ సభ్యులే. వారి సమస్యలను నేను పూర్తిగా అర్థం చేసుకుంటా’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. గత 32 నెలల పాలనలో ఏ ఒక్క నెలైనా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వకుండా ఆపేశానేమో ఉద్యోగులంతా ఆలోచించాలని కోరారు. ‘ఒకప్పుడు చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, సిబిల్ స్కోర్ పడిపోతోందని ఉద్యోగ సంఘాల నేతలే చెప్పారు. కానీ 2024 జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీఖునే వేతనాలు ఇస్తున్నాం. ఆనాడు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలకోసారి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతి నెలా 5వ తేదీలోపే వేతనాలు జమ అవుతున్నాయి. అధికారులు ఎక్కడైనా అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా చెప్పాను’అని సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచడంతో, వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారం 2024 నుంచే తనపై పడిందని రేవంత్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం నెలకు వెయ్యి మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండగా, ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.50 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రూ. 8 వేల కోట్ల బకాయిలను వదిలి వెళ్లినా ఉద్యోగుల బాధలను చూసి మిగతా పనులన్నీ పక్కన పెట్టి వంద రోజుల్లోనే రూ.6 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడుదల చేశామని సీఎం గుర్తుచేశారు. గత ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వకపోయినా తాము ఇచ్చామని, ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులు లేకపోతే నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు వాటిని పునరుద్ధరించామని చెప్పారు.ఆర్టీసీ కార్మికులను ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం అన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం కింద గత 32 నెలల్లో ఆర్టీసీకి రూ. 11 వేల కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు వెంకటేశ్, మల్రెడ్డి రంగారెడ్డి, శ్రీగణేష్, నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణణ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తదితరులు పాల్గొన్నారు. -
ముసారాం బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూసారం బాగ్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ రోజు (సోమవారం)అంబర్పేటలో సీఎం రేవంత్ దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలేరు వెంకటేష్, శ్రీ గణేష్, నవీన్ యాదవ్, బలాల తదితరులు పాల్గొన్నారు.మూసీవరదలతో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. లక్ష 50 వేల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా బ్రిడ్జిని నిర్మించారు. దీని ప్రారంభంతో ఇక వర్షాకాలంలో వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి. -
రూ.500 కోట్ల భూమిపై రేవంత్ సర్కార్ నజర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఉన్న విలువైన ప్రభుత్వ భూమి ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు ఆరోపించారు. ఆయిల్ఫెడ్ ఆ«దీనంలో ఉన్న భూమిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రూ.500 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సొంత ప్రభుత్వ సంస్థ ఆయిల్ఫెడ్ రూ.87 కోట్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దానిని కాదని ప్రైవేట్ వ్యక్తికి భూమి అప్పగించడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ అ«దీనంలో ఉన్న ఆస్తులను కమీషన్ల కోసం ప్రైవేటుపరం చేయడం సరికాదన్నారు. అజామాబాద్ ఇండ్రస్టియల్ ఏరియాలోని 3 ఎకరాల 23 గుంటల భూమి విషయంలో 1987లో సుప్రీంకోర్టు ప్రభుత్వ హక్కును స్పష్టం చేసిందని లేఖలో హరీశ్ పేర్కొన్నారు. కోకాపేట, రాయదుర్గం, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూముల విషయంలో ఇదే తరహా వ్యవహారం కొనసాగుతోందని ఆరోపించారు. ఒకవైపు సామాన్యుల ఇళ్లను నిషేధిత 22ఏ జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను కారుచౌకగా ప్రైవేట్కు అప్పగించడం ఏం న్యాయమని ప్రశ్నించారు. ప్రజల సొత్తును ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని హరీశ్రావు హెచ్చరించారు. -
'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?
-
నీటి పన్నుల వసూలు!
సాక్షి, హైదరాబాద్: వాల్టా, పంచాయతీరాజ్ చట్టాలను సవరించి పంచాయతీరాజ్ సంస్థలు/ నీటి వినియోగ సంఘాలకు నిర్వహణ, నీటి పన్ను వసూలు అధికారాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. చెరువుల దీర్ఘకాలిక పరిరక్షణకు ప్రత్యేక చిన్న నీటిపారుదల చట్టం రూపొందించాలని కోరింది. కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యులు ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ముఖ్య సిఫారసులు ఇలా ఉన్నాయి.. చిన్న నీటిపారుదల శాఖ పునరుద్ధరణ.. నీటిపారుదల శాఖను భారీ నీటిపారుదల శాఖలో విలీనం చేయడంతో చెరువులపై పర్యవేక్షణ కొరవడి అనేక అనర్థాలు కలిగాయి. నీటి వినియోగదారుల సంఘాలు నిర్జీవంగా మారాయి. అగ్రి ఇంజనీరింగ్ నైపుణ్యం లోపించి నీటివినియోగ సామర్థ్యం తగ్గింది. ఎత్తిపోతల పథకాలు సమర్థవంతంగా లేవు. పట్టణ ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణలు, కాలుష్యంతో ప్రమాదంలో పడ్డాయి. చిన్న నీటిపారుదల శాఖ వ్యవస్థను పునరుద్ధరించాలి. నిర్వహణ నిధులను నేరుగా నీటి వినియోగ సంఘాలు/పంచాయతీరాజ్ సంస్థలకు ఇవ్వాలి. నీటివినియోగ సంఘాలకు స్పష్టమైన అధికారాలు, నిధులు ఇవ్వాలి. జీఐఎస్, రిమోట్ సెన్సింగ్, మొబైల్ యాప్తో రియల్ టైమ్ మానిటరింగ్, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయాలి. పంపు సెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరిస్తే రూ.3 వేల కోట్ల విద్యుత్ చార్జీలను తగ్గించవచ్చు. చెరువుల పరిరక్షణకు కమిటీలు చెరువుల ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తించి రక్షించాలి. ఆక్రమణలను తొలగించాలి. చిన్న నీటిపారుదల ఆస్తుల డిజిటల్ జాబితా రూపొందించాలి. చెరువుల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి చట్టపర గుర్తింపు కల్పించాలి. ప్రతి చెరువు, దాని ఆయకట్టు ప్రాంతం కోసం ఒక కమిటీ ఏర్పాటు కావాలి. కమిటీలో టెయిల్ ఎండ్, హెడ్ ఎండ్ రైతులు, పరీవాహక ప్రాంత రైతులు, మహిళా ప్రతినిధి, పంచాయతీరాజ్ సంస్థ ప్రతినిధి, మత్స్యకార సంఘం, కౌలు రైతు, ఇతరులు కలిపి మొత్తం 15 మంది ఉండాలి. చెరువుల పునరుద్ధరణ, నిర్వహణ, రైతుల మధ్య నీటిపంపకాల వివాదాలు పరిష్కరణ, ఆర్థిక లావాదేవీల బాధ్యతలు కమిటీలకు అప్పగించాలి. -
'సర్' లోపభూయిష్టం
సర్లో చట్టబద్ధమైన నోటీసు మెకానిజమ్ లేదు. వలస వెళ్లిన కేటగిరీ కింద ఓట్లను తొలగించే ముందు ఓటర్లకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వడం లేదు. వ్యత్యాసాలు కలిగిన, లింక్ కాని ఓటర్లకు మాత్రమే నోటీసులు ఇస్తున్నారు. మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటేయడానికి పోతేనే తమ ఓటు పోయిందనే నిజం ఓటరుకు తెలుస్తుంది. సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)– 2026 ప్రక్రియ లోపభూయిష్టంగా తయారైందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత జూన్ 10 నాటికి రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లుండగా, 73.39 లక్షల (21.7%) మంది ఓటర్లను ఆచూకీ లేని/గైర్హాజరీలో ఉన్న/మరణించిన/డూప్లికేట్ (ఏఎస్డీడీ) ఓటర్లుగా గుర్తించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో 45.19 లక్షల (62%) మంది ఓటర్లను ఏ ప్రాతిపదికన శాశ్వతంగా గైర్హాజరీ(వలస)లో ఉన్న ఓటర్లుగా వర్గీకరించారని ప్రశ్నించారు. 2.65 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేయగా, 60.50లక్షల మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు, 32.36లక్షల మంది అన్మ్యాప్డ్ ఓటర్లున్నట్టు నిర్ధారించినట్టు గుర్తు చేశారు. ఈ రెండు కేటగిరీలు కలిపి మొత్తం 92.86లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లు తమ ఓటు హక్కును నిలబెట్టుకోవడానికి మళ్లీ ఆధారాలు చూపించుకోవాల్సిన పరిస్థితి లేదా ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు శనివారం ఆయన లేఖ రాశారు. సీఎం ఎత్తిచూపిన లోపాలు.. ⇒ తాత్కాలిక, శాశ్వత వలసల మధ్య తేడా చూపలేదు. బీఎల్ఓ వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇంట్లో లేని ఓటర్లనూ శాశ్వతంగా వల స వెళ్లిన వారిగానే పరిగణించారు. ⇒ ఇల్లు మారిన ఓటర్లకు కొత్త చిరునామాలో ఓటు నమోదు చేసుకోవడానికి (ఫారం–6) ఎలాంటి సహాయం అందించడం లేదు, కానీ పాత ప్రదేశంలో వారి ఓటును తొలగిస్తున్నారు. ⇒ చట్టబద్ధమైన నోటీసు మెకానిజమ్ లేదు. వలస వెళ్లిన కేటగిరీ కింద ఓట్లను తొలగించే ముందు ఓటర్లకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వడం లేదు. వ్యత్యాసాలు కలిగిన, లింక్ కాని ఓటర్లకు మాత్రమే నోటీసులు ఇస్తున్నారు. మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటేయడానికి పోతేనే తమ ఓటు పోయిందనే నిజం ఓటరుకు తెలుస్తుంది. ⇒ రాష్ట్రంలోని మూడో వంతు ఓటర్లు హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉండగా, 58.6% ఏఎస్డీడీ ఓటర్లు, 41.9% నోటీసులు అందుకునే ఓటర్లు ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు. కొద్ది వందల మీటర్ల దూరంలో ఇల్లు మారినా పోలింగ్ స్టేషన్ మారుతుందని, వివాహం లేదా ఉద్యోగం కారణంగా ఇల్లు మారడం సాధారణమని, దానిని ఓటు హక్కు రద్దుకు కారణం చేయకూడదు. పూర్తిగా సహకరిస్తాం... అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరూ ఓటు హక్కు కోల్పోకూడదు, అర్హత లేని ఏ ఒక్కరూ జాబితాలో ఉండకూడదు అనేదే సర్ ప్రక్రియ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హెల్ప్డెస్్కల నిర్వహణ, గ్రామసభలు, వార్డు సమావేశాల ఏర్పాటు, ప్రచారం, అవగాహన కార్యక్రమాలు, లాజిస్టికల్ మద్దతుతో సహా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నికల సంఘానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సీఈసీకి రేవంత్ చేసిన ప్రతిపాదనలివీ.. 1. అభ్యంతరాలు, దరఖాస్తుల గడువు పొడిగించాలి. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతోపాటు కొత్త ఓటర్ల నమోదు, వివరాల దిద్దుబాటుకు దరఖాస్తుల గడువు సెపె్టంబర్ 16 వరకు నెల రోజులు మాత్రమే ఇచ్చారు. సగం గడువు ముగిసింది. తుది జాబితా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఓటర్లు తమ పేర్లు చెక్ చేసుకుని ఫారం–6 సమర్పించడానికి మరో 4 వారాల పాటు గడువును పొడిగించాలి. సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఈ సవరణ సులభమే. 2. ఈసీఐ మాన్యువల్ ప్రకారం ఓటర్ల ముసాయిదా జాబితాను గ్రామసభల్లో, నగరాల్లో వార్డు కమిటీ సమావేశాల్లో కనీసం రెండుసార్లు బిగ్గరగా చదివి వినిపించేలా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించాలి. 3. నోటీసులకు జవాబు ఇవ్వడానికి ఇస్తున్న వారం వ్యవధి సరిపోదు. ముఖ్యంగా కూలీలు, వలస కార్మికులు, వృద్ధులకు వేరే ప్రాంతాల నుంచి ధ్రువపత్రాలు తెచ్చుకోవడానికి 3 నుంచి 4 వారాల వ్యవధి ఇవ్వాలి. 4. పట్టణ ప్రాంతాల్లో, బూత్ స్థాయిలో హెల్ప్డెస్్కలను ఏర్పాటు చేసి ఓటర్లకు అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో, అధికారుల నుంచి డాక్యుమెంట్లు సమర్పించడంలో నేరుగా సహాయం అందించాలి. 5. 2026 జూలై 25న జారీ చేసిన జీవో 172 కింద ఇచ్చిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ను ఈసీ తిరస్కరించడంతో పట్టణ ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మండల స్థాయిలో త్వరగా లభించే పత్రాలను అనుమతిస్తూ స్పష్టమైన జాబితాను ప్రకటించాలి. 6. హైదరాబాద్లోని ఒక్కో నియోజకవర్గంలో 78వేలకు పైగా ఓటర్లకు నోటీసులు ఇస్తున్నారు. అధికారుల ముందు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా హాజరుకావడం అసాధ్యం. కాబట్టి అదనపు ఈఆర్వోలను నియమించి, ఈఆర్వో స్థాయి కంటే కిందనే వికేంద్రీకృత పద్ధతిలో సమయం కేటాయించి విచారణ జరపాలి. -
అచ్చ కాంగ్రెస్లో పచ్చ మీడియా చిచ్చు
తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ ఎపిసోడ్ ముగిసినట్లేనా? ఇంకా సశేషంగానే ఉన్నాదా? ప్రస్తుత రాజకీయ పరిశీల కుల మెదడుకు మేత వేస్తున్న ప్రశ్న ఇది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై లోతైన అవగాహన ఉన్నవారు మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. వాళ్లను తొలుస్తున్న ప్రశ్నావళి సురేఖ ఉదంతం కంటే విస్తృతమైనది. రాష్ట్ర కాంగ్రెస్లోగానీ, ఎమ్మెల్యేలు, మంత్రి వర్గ సహచరుల్లోకానీ నిజంగానే రేవంత్రెడ్డికి మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నాదా? ఆయన పాలనపై అధిష్టానం వైఖరి ఏమిటి? ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో కనిపిస్తున్న పెదవి విరుపు ఎక్కడికి దారితీయనున్నది? అసలు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతున్నది? ఇటువంటి ప్రశ్నలు తలెత్త డానికి సహేతుకమైన కారణాలే కనిపిస్తున్నాయి. కారణాలు న్నాయి కనుకనే యెల్లో మీడియా కలవరపాటుకు లోనవు తున్నది. ఆవేదన వెళ్లగక్కుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పార్టీ–ప్రభుత్వ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛనివ్వడం లేదని కాంగ్రెస్ అధిష్టానంపై యెల్లో మీడియా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. రేవంత్ నాయకత్వా నికి కంట్లో నలుసుగా వుండే నేతలను ఏరిపారేసి ఆయన్ను బలోపేతం చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి పోగాలం దాపురిస్తుందని హెచ్చరించడానికి కూడా యెల్లో మీడియా వెనుకాడటం లేదు. తెలుగుదేశం పార్టీకి యెల్లో మీడియా అనుబంధ పరిశ్ర మగా పని చేస్తు్తన్నదని కొత్తగా చెప్పుకోనవసరం లేదు. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ఏర్పాటు చేశారన్నది నిజం. కేంద్రంలో రాజీవ్ సర్కార్ను గద్దెదించడం కోసం నేషనల్ ఫ్రంట్కు ఎన్టీఆర్ రూపశిల్పిగా మారిన సంగతి కూడా నిజం. అటువంటి తెలుగుదేశం పార్టీకి, దాని అనుబంధ యెల్లో మీడియాకు తెలంగాణ కాంగ్రెస్పై ఇంతటి అవ్యాజమైన వాత్సల్యం కుదరడానికి కారణమేమిటి? ఇది కూడా బ్రహ్మరహస్యమేమీ కాదు. తెలుగు ప్రజలంద రికీ తెలిసిన విషయమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణపై పెత్తనం చేయాలనే కోరిక చంద్రబాబుకు చావ లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలుకు ప్రయ త్నిస్తూ ఆడియో సాక్షిగా చంద్రబాబు, వీడియో సాక్షిగా అప్పటి ఆయన సహచరుడు రేవంత్రెడ్డి క్యాష్తో సహా దొరికిపోవడం, ఫలితంగా హైదరాబాద్ను వదిలేసి చంద్రబాబు పారిపోవడం తెలిసిన కథే. తామేదో రహస్యంగా దొంగతనం చేయబోతే అన్యాయంగా పట్టుకుని కేసీఆర్ అల్లరి పెట్టాడనే కోపం అప్ప ట్నుంచే చంద్రబాబుకూ, రేవంత్కూ ఉన్నది. చంద్రబాబుకు జలుబు చేస్తే ముక్కు చీదే అలవాటున్న యెల్లో మీడియా కూడా నాటినుంచే కేసీఆర్ను శత్రువుగా ప్రకటించుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు రాజశేఖరరెడ్డి చేతిలో ఓటమి పాలైన చంద్రబాబు, జగన్ రాజకీయ జీవితాన్ని మొగ్గలోనే తుంచేయడం కోసం పదిహేనేళ్ల కిందనే కాంగ్రెస్ అధిష్టానంతో స్నేహం నెరపడం ప్రారంభించారు. సిద్ధాంత రాద్దాంతాలు, విశ్వసనీయత వగైరాలతో తనకు ఏ రకమైన సంబంధం లేదని కొన్ని డజన్లసార్లు చంద్రబాబు నిరూపించుకున్నారు. అందువల్లనే ఎన్డీయేతో బహిరంగ స్నేహం, కాంగ్రె స్తో రహస్య ప్రేమ ఏకకాలంలో ఆయన నడపగలిగారు. ఆ స్నేహం ఉపకరించి వర్తమాన రాజకీయ పరిస్థితికి బాటలేసింది. ఎన్నికల సమయం నాటికి కూడా అత్యధిక ప్రజామోదం కలిగిన నేతగా కేసీఆర్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్కు ఓటమి తప్పలేదు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం. తవ్వుకోవడం అనవసరం.వ్యవహార దక్షత, ఎన్నికలకు అవసరమయ్యే వనరులను సమీకరించగలిగే సామర్థ్యం రేవంత్రెడ్డికి సహజంగానే ఉన్నా యని చెబుతారు. దానికోసం యెల్లో మీడియా, తెలుగుదేశం పార్టీల సంపూర్ణ మద్దతు ఉండనే ఉన్నది. బీజేపీ వ్యతిరేకత మొత్తం బీఆర్ఎస్ మీదనే కేంద్రీకృతమవడంతో అటువైపునుంచి కూడా రేవంత్ కాంగ్రెస్కు ఇబ్బంది లేకుండా పోయింది. అధికా రంలోకి వచ్చిన తర్వాత మొన్నటి అమెరికా పర్యటనను అడ్డు కోవడం మినహా ఇతరత్రా రేవంత్ సర్కార్ను బీజేపీ ఇబ్బంది పెట్టిన ఘటనలు లేకపోవడం ఆశ్చర్యమే. కాంగ్రెస్ పార్టీలో తనకో సొంత వర్గాన్ని తయారు చేసుకోవడం కోసం తెలుగు దేశం పార్టీ తెలంగాణా అవశేషాలను కాంగ్రెస్లోకి రేవంత్ బదిలీ చేయగలిగారు. ఇప్పుడీ అవశేష తెలుగుదేశం శ్రేణులకే పెత్తనం దక్కాలనే వాంఛ యెల్లో మీడియాలో కనిపిస్తున్నది. దశాబ్దాల చరిత్ర కలిగిన కొందరు కాంగ్రెస్ నాయకులను ఈ కారణాల వల్లనే యెల్లో మీడియా టార్గెట్ చేస్తున్నదనీ, వారిమీద నెగెటివ్ ముద్రలు వేస్తున్నదనే ఆరోపణలు కాంగ్రెస్ శ్రేణులనుంచి వినపడుతున్నాయి. కొండా సురేఖ వివాదం నలుగుతున్న సందర్భంగా ఒకరోజు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడున్న మీడియాతో మాట్లాడవలసి వచ్చింది. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియాపై పేరు పెట్టి మరీ ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో మీక్కావలసిన ఎవరినో బలోపేతం చేయడం కోసం నాలాంటి నిజాయితీపరు లైన నాయకుల మీద నిందలేస్తున్నారని ఆయన దుమ్మెత్తి పోశారు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. వర్తమాన కాలంలోని సగటు రాజకీయ నాయకులకు భిన్నంగా జనసామాన్యంలో మంచి పేరున్న నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గత ఇరవయ్యేళ్లుగా తన తల్లి పేరుమీద ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం వ్యాపారాలు చేస్తారో ఎక్కడ చేస్తారో తెలి యదు కానీ, నియోజకవర్గంలో మాత్రం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు రాజగోపాలరెడ్డి వెనుకాడరని స్థానిక ప్రజలు చెబుతారు. సొంత అసెంబ్లీ నియోజకవర్గం మునుగోడులోనే కాకుండా భువనగిరి లోక్సభ స్థానం పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో కోమటిరెడ్డి సోదరులకు అనుచరగణం, పలుకుబడి ఉన్నాయని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేని పరిస్థితి ఏర్పడినప్పుడు తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి మరీ రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారు. ఆ పార్టీతో భావసారూప్యత పొసగక తిరిగి కాంగ్రెస్లో చేరారు. ఇటువంటి నేపథ్యం ఉన్న తనపై అవాకులు చవాకులు ప్రచారం చేస్తున్నదని మీడియాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తప్పు పట్టగలమా? పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్పై కూడా ఆ మధ్యన ఒక టీవీ ఛానల్ ధారావాహిక దాడికి పాల్పడింది. ముఖ్యమంత్రికి సన్నిహితులైనవారు ఈ ఛానల్ను నడిపిస్తారని చెబుతారు. మహేష్గౌడ్ మూడున్నర దశాబ్దాల కిందనే ఎన్ఎస్యూఐ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ నాయకునిగా, సేవాదళ్ కార్యకర్తగా పని చేస్తూ ఏనాడూ కాంగ్రెస్ జెండాను భుజం మీదినుంచి కిందకు దింపలేదు. వందలాది ఎకరాల సాగుభూములున్న కుటుంబం నుంచి వచ్చిన మహేశ్గౌడ్కు ఏనాడూ అవినీతి మకిలి అంటింది కూడా లేదు. అటువంటి వ్యక్తిని అయోగ్యుడిగా చిత్రించడానికి సదరు టీవీ ఛానల్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే ఇవి. కొండా సురేఖ తాజా వివాదానికి ఆమె కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రిపై చేసిన ఘాటు వ్యాఖ్యలే కారణమనే సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై సుష్మిత ఉపయోగించిన పరుష పదజాలాన్ని ఎవరూ హర్షించరు. ఆమె చేసిన వ్యాఖ్యలకు కారణమెవరు? వరంగల్ జిల్లా పరకాల నియోజక వర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా రేవూరి ప్రకాశ్రెడ్డి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ స్థానంపై ఎప్పటి నుంచో దృష్టి పెట్టిన సుష్మిత ఘాటుగా స్పందించారు. సుష్మిత సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ కల్చర్లో అభ్యర్థులను ముందు గానే ముఖ్యమంత్రి నిర్ణయించే సంప్రదాయం ఉన్నదా? అంతే కాకుండా ఇంకో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా రేవంత్రెడ్డి పలుమార్లు ప్రకటించారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సీఎం స్థానం నిజంగా అంత బలంగా ఉన్నట్లయితే సురేఖ మీద చర్య తీసుకోవడానికి ఇంత తతంగం ఎందుకు? మొదట 20 మంది శాసనసభ్యులతో ప్రెస్ మీట్, సురేఖను తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సిఫార్సు, దాన్ని హైకమాండ్కు పంపించడం, సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ రాకకోసం నిరీక్షణ... ఇదంతా అవస రమా? సీఎం తలుచుకుంటే ఏ మంత్రినైనా తప్పించే అధికారం రాజ్యాంగబద్ధంగానే ఉన్నది. ఆ అవకాశాన్ని వినియోగించు కోలేని అశక్తత ఎందుకొచ్చింది? గత ఎన్నికల సందర్భంగా రేవంత్ను ఫోకస్ చేయడం కోసం నల్లగొండ గద్దర్ నర్సన్న పాడిన ఒక పాట పాపులరయింది. ‘‘మూడు రంగుల జెండా పట్టి... సింగమోలే కదిలినాడు... మన రేవంతన్న’’ అని సాగు తుందా పాట. ఎక్కడ ముఖ్యమంత్రి సభ జరిగినా ఆ రికార్డు పెట్టడం రివాజు. గత కొంత కాలంగా గాంధీ భవన్లో జరిగే కార్యకర్తల సమావేశంలాంటి కార్యక్రమాల్లో ఆ పాట వినిపించ కూడదనే ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. పరకాల సంగతేమోగానీ కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలోకి ఒక కొత్త పదబంధాన్ని తెచ్చారు. ‘అచ్చ కాంగ్రెస్–పచ్చ కాంగ్రెస్’ అనే మాటపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. యెల్లో మీడియా ట్రాప్లో పడి ‘అచ్చ’ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూపోతే కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనుకోవడం భ్రమ. ఒక పక్కన ప్రభుత్వ పాలనపై జనసామాన్యంలో పేరుకొంటున్న తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని సమైక్యంగా నడిపించ డంపై దృష్టి పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో దారుణమైన పరాజ యాన్ని మూట కట్టుకోవలసి వస్తుందని గ్రహిస్తే మంచిది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
రక్షకులుగా ఉండాల్సిన వారే భక్షకులుగా.. హరీష్ రావు
సాక్షి, సంగారెడ్డి: రేవంత్రెడ్డి పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఈరోజు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిషేధిత జాబితాలో భూములు పెట్టిన తర్వాత సీఎం, మంత్రి పొంగులేటి ఏజెంట్లు కమిషన్ కోసం తిరుగుతున్నారన్నారు. రక్షకుడిగా ఉండాల్సిన ప్రభుత్వం.. భక్షకుడిగా మారిందని ఆరోపించారు.కన్న తల్లి పాములా మారి కాటేస్తుందా..? చేసిన తప్పుకు సీఎం రేవంత్ చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలి. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు... భూముల చుట్టూ సీఎం రేవంత్ తిరుగుతున్నారన్నారు.పేదల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్, ఆయన తమ్ముళ్లు కడుపు నింపుకుంటున్నారని కళ్యాణలక్ష్మి చెక్కులు పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత వస్తున్నాయి. 58, 59 జీవోల పేరుతో కొందరు అధికారులు పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
SIRపై ఎన్నికల సంఘానికి రేవంత్ రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: SIR ప్రక్రియపై కేంద్రఎన్నికల సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ( శనివారం) లేఖ రాశారు. ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువులు పొడిగించాలని కోరారు. మరో నాలుగు వారాల పాటు ఈ గడువును పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వాటితో పాటు తుది ఓటర్ల జాబితా గడువునూ పెంచాలని కోరారు. 73.39 లక్షల ఓటర్ల ఎంట్రీలు ASDD జాబితాలోకి వెళ్లాయని దీంతో తాత్కాలికంగా వెళ్లిన వారిని సైతం శాశ్వతంగా తరలివెళ్లినట్లు పరిగణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు నోటీసులకు స్పందించేందుకు ఓటర్లకు సమయం ఇవ్వాలని సూచించారు. ఓటర్ల జాబితాలో అర్హుల ఓట్లు తొలిగిపోకుండా చూడాల్సిన అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్పై అభ్యంతరాలు, క్లెయిమ్ల గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.కాగా రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువును ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియను ఆగస్టు మూడు వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 3న సర్వే పూర్తి కాగానే ఓటరు డ్రాఫ్ట్ జాబితా ఆగస్టు 10న ప్రచురించనున్నట్లు అని తెలిపింది. అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకూ గడువుగా పేర్కొంది. చివరగా అక్టోబర్ 12న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించించనుంది. ఈ నేపథ్యంలో మరోసారి గడువు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. -
రేవంతన్నకు బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ
-
గురు శిష్యుల చీకటి ఒప్పందంతో రాయలసీమ తాకట్టు.. శైలజానాథ్ సంచలన వ్యాఖ్యలు
-
రాజకీయ రక్షాబంధన్!
సాక్షి, హైదరాబాద్: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మియ బంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ఈసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వెళ్లడం, ముఖ్యమంత్రితో పాటు ఆయన మనవడికి బంగారంతో ప్రత్యేకంగా చేయించిన రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకోవడం తాజా రాజకీయ పరిణామాల్లో ఆసక్తికరంగా మారింది. మరో మంత్రి సీతక్కతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన ఆమె ముఖ్యమంత్రికి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.సీఎంతో పాటు ఆయన సతీమణి గీత, కుమార్తె నైమిషాలకు బొట్టు పెట్టి, రేవంత్తో పాటు ఆయన మనవడికి కూడా రాఖీ కట్టారు. అయితే, రాఖీ కట్టేందుకు సీఎం నివాసానికి సురేఖ వెళ్లారన్న వార్తతో పాటు రాఖీ కట్టిన సందర్భంలోనూ, ఆ తర్వాత రేవంత్, సురేఖలిద్దరూ ఆత్మియంగా పలకరించుకోవడం, ఎక్కడా ఇద్దరి ముఖకవళికల్లో ఇబ్బంది కనిపించకపోవడంతో అసలేం జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ బంధం ఇలానే కొనసాగుతుందా? లేక బంధానికి త్వరలోనే గండి పడుతుందా? అన్న చర్చ జరిగింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా? వాస్తవానికి, ప్రతి రాఖీ సందర్భంగా సీఎం రేవంత్కు మంత్రి సురేఖ రాఖీ కడుతున్నారు. అయితే, ఇటీవల సురేఖ కుమార్తె సుస్మిత మాట్లాడిన మాటలు, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు సురేఖ, రేవంత్ల నడుమ రాజకీయ అగాధాన్ని ఏర్పరిచాయి. అసలు ఎదురుపడితే ఇద్దరూ మాట్లాడుకోగలరా? అనే స్థాయిలో రాజకీయ చర్చోపచర్చలు జరిగాయి. కానీ, రాఖీ పౌర్ణమి రోజున ఇద్దరూ హుందాగా వ్యవహరించి పండుగ ప్రత్యేకతను, సందేశాన్ని ప్రజలకు పంపడం గమనార్హం.అయితే, అసలు సీఎం అపాయింట్మెంట్ తీసుకునే సురేఖ వెళ్లారా? కనీసం సమాచారమిచ్చారా? ఒకవేళ నిజంగానే సమాచారం అందిన మేరకు సురేఖతో రాఖీ కట్టించుకునేందుకు సీఎం అమోదించారా? తద్వారా రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం అనే వివాదం విషయంలో రాజీ సంకేతాలను పంపాలనుకున్నారా? లేదంటే పండుగ పండుగే... చర్యలు చర్యలే.. అన్న ధోరణిలో ముందుకెళ్లారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. నన్ను వేరుగా చూడకండి.. రాఖీ కట్టి సీఎం నివాసం నుంచి వెళ్లిపోయిన మంత్రి సురేఖ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్కు రాఖీ కట్టి వచ్చానని, ఆయనకు ఆడపడుచులందరి దీవెనలు ఉంటాయని చెప్పారు. ఆయన సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి, యుక్తి ఆయనకు కలగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ ఆశీర్వాదం కూడా ఆడపడుచులందరిపై ఉండాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ రోజున రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదని, మూడోసారి రేవంత్కు రాఖీ కట్టి వచ్చానని చెప్పారు. ఆడపడుచుల విషయంలో సురేఖను వేరు చేసి మాట్లాడవద్దని, గ్రామీణ ప్రాంత మహిళలతో పాటు తనపై కూడా ఆయన ఆశీస్సులు ఉంటాయని సురేఖ వ్యాఖ్యానించారు. కిటకిటలాడిన సీఎం నివాసం కాగా, రక్షాబంధన్ సందర్భంగా జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ నివాసం కిటకిటలాడింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ అధ్యక్షురాళ్లు మొగిలి సునీత, నేరెళ్ల శారద, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి, రైతు కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి, బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి, మాజీ ఎంపీ గుండు సుధారాణి, పీసీసీ నేతలు బొజ్జా సంధ్యారెడ్డి, ఇందిరా శోభన్, రేగులపాటి రమ్యారావు, పాల్వాయి రజనీకుమారి తదితరులతో పాటు పలు కార్పొరేషన్ల చైర్పర్సన్లు, బ్రహ్మకుమారీలు, మలక్పేటలోని గవర్న్మెంట్ హైసూ్కల్ ఫర్ ది బ్లైండ్ గరల్స్ విద్యార్థినులు రేవంత్కు రాఖీలు కట్టారు.నా ఎదుగుదలలో అండగా రేవంత్: మంత్రి సీతక్క సీఎం రేవంత్కు రాఖీ కట్టిన తర్వాత టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొజ్జా సంధ్యారెడ్డి తదితరులతో కలిసి మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. వామపక్ష భావజాలం నుంచి వచి్చన ఆదివాసీ బిడ్డగా తన ఎదుగుదలలో రేవంత్రెడ్డి అండగా ఉన్నారని, తను ఈ స్థాయికి రావడంలో ఆయన సహకారం చాలా ఉందని చెప్పారు. తనకున్న ఒక్క తోబుట్టువు ఎన్కౌంటర్లో చనిపోయారని, అక్కా అంటూ తన వద్దకు వచి్చన వారందరినీ సోదరులుగా భావిస్తానని చెప్పారు. -
555 టీఎంసీలు సాధించాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్ –1) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు పొందేలా జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట వాదనలు వినిపించాలని సూచించారు. జల వివాదాలకు సంబంధించిన సుప్రీంకోర్టు కేసులతోపాటు జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రం తరఫున వినిపించాల్సిన వాదనలపై శుక్రవారం ఆయన నీటిపారుదలశాఖ మంత్రి ఎన్. ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్తో సమీక్ష నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలిస్తే అందుకు బదులుగా నాగార్జున సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఎదుట అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగింది. ఇందులో ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలతో పాటు ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 555 టీఎంసీలు కలిపి మొత్తం 600 టీఎంసీలను 75 శాతం లభ్యత (నాలుగేళ్లలో కచ్చితంగా మూడేళ్లపాటు ఉండే వరద లభ్యత) ఆధారంగా తెలంగాణకు కేటాయించాలని 2023లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్లో స్టేట్మెంట్ ఆఫ్ కేస్ దాఖలు చేశామని న్యాయ నిపుణులు సీఎంకు వివరించారు. ఈ కేసులో ఏపీ కౌంటర్ వాదనలు ముగిశాయని.. తెలంగాణ తరఫున రిజాయిండర్ వాదనలు ప్రారంభించినట్లు చెప్పారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటాలో 555 టీఎంసీలకు 45 టీఎంసీల పోలవరం మళ్లింపు నీళ్లు కలిపి మొత్తం 600 టీఎంసీలు దక్కేలా వాదనలు ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఆ మేరకు నీటి వినియోగానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామని గుర్తుచేశారు. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలను పూర్తిగా ఏపీలో వాడుకుంటారని.. గోదావరి జలాల మళ్లింపునకు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి ఏపీకి దక్కిన 45 టీఎంసీలపై పూర్తి అధికారం తెలంగాణదేనని సీఎం స్పష్టం చేశారు. సాగర్ ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక 80 టీఎంసీల్లో ఇప్పటికే 35 టీఎంసీల వినియోగానికి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాయని.. మిగిలిన 45 టీఎంసీలు తెలంగాణకు దక్కాల్సిందేనని తెలిపారు. తీర్పు అన్యాయంగా ఉంటే అంగీకరించొద్దు.. జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ 2011లో ఇచ్చిన అవార్డుపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుపై వచ్చే నెలలో వాదనలు వినిపించాల్సి ఉందని న్యాయవాదులు తెలియజేయగా... కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు అమల్లోకి వస్తే తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున సరైన గ్యారంటీలు లభించకుండా ఈ తీర్పునకు అంగీకరించొద్దని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మరో కేసు అప్పర్ భద్ర ప్రాజెక్టుపై ఉందని.. తెలంగాణలో జలవిద్యుత్ ఉత్పాదన కోసం జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో కేసు ఉందని అధికారులు నివేదించారు.ఇక పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన కేసులో సమన్ల జారీ ప్రక్రియ జరుగుతోందని న్యాయవాదులు సీఎంకు నివేదించారు. సుప్రీంకోర్టుతోపాటు కృష్ణాలో తెలంగాణ వాదనలు బలంగా ఉండాలని.. కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన నీటి వాటాను సాధించేలా పోరాటం చేయాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ అడ్వకేట్ జనరల్, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ కుషి్వందర్ వోహ్రా, ప్రముఖ న్యాయవాది సాత్విక్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ కె. ప్రసాద్, ఎస్ఈ ఎస్. విజయకుమార్, ఈఈ వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ ఇంటికి మంత్రి కొండా సురేఖ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. సీఎం రేవంత్కు రాఖీ కట్టేందుకు వచ్చారు. వివాదం తర్వాత తొలిసారి సీఎంతో ఆమె సమావేశమయ్యారు. కొండా సుస్మిత వ్యాఖ్యలు తర్వాత పొలిటికల్ గ్యాప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన క్రమశిక్షణ కమిటీ.. నివేదికను ఏఐసీసీకి పంపించింది.. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్తో కొండా సురేఖ భేటీ కావడం ఉత్కంఠ రేపుతోంది. చెల్లెమ్మ సురేఖను అన్న రేవంత్ క్షమిస్తారా?. కాంగ్రెస్లో కొండా సురేఖ తుపాన్ ముగిసిపోతుందా?. సుస్మిత కామెంట్ల వివాదానికి తెరపడుతుందా? అనే చర్చ జరుగుతోంది.కాగా, తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. క్రమశిక్షణ కమిటీ నివేదికతో వేటుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం ఊపందుకున్న వేళ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే భేటీ రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది. సురేఖపై చర్య ఖరారైందా? లేక అధిష్టానం చివరి నిమిషంలో మరో మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం తెలిసిందే. ఈ నివేదిక ఏఐసీసీకి చేరడంతో బంతి పూర్తిగా అధిష్టానం కోర్టులోకి వెళ్లింది.టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కూడా ఈ వ్యవహారం ఏఐసీసీ పరిధిలో ఉందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని తాజాగా ప్రకటించారు. ఇదే సమయంలో ఖర్గేతో భట్టి బెంగళూరులో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సురేఖ వ్యవహారంపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా భట్టి ఖర్గేకు వివరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అలాగే చిన్నారెడ్డి వ్యవహారంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు బయటకు వచ్చిన తర్వాత సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం దాదాపు ఖాయమన్న వాదన బలపడింది. కేబినెట్ నుంచి తక్షణమే తొలగించాలా? లేక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వరకు ఆగాలా? అన్న అంశంపై అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
రాఖీ కట్టనిస్తారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో రాఖీ పండుగ వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. భట్టి ఇంకా బెంగళూరులోనే ఉండగా!.. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తారా? అన్న అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ప్రతీ ఏడాది రాఖీ పండుగ సందర్భంగా మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సీఎం, డిప్యూటీ సీఎంలకు రాఖీ కడుతుంటారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సురేఖ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో ఉండటంతో ఆయనను కలిసే అవకాశం కూడా ఆసక్తికరంగా మారింది.సుస్మిత వ్యాఖ్యలతో దుమారం..కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపాయి. పరకాల(వరంగల్) ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో పాటు సీఎం రేవంత్రెడ్డిపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పరకాల ఎమ్మెల్యే కాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి.అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పష్టం చేశారు. అయినప్పటికీ సురేఖ వివరణపై పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ క్రమశిక్షణా కమిటీకి, అటు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు.అధిష్టానం వద్దకు వ్యవహారం..ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించింది. క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన అంశంపై పార్టీ పెద్దలతో చర్చలు జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కొండా మురళి కూడా పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్లారు. కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీలో మరికొందరిపై క్రమశిక్షణ చర్యల అంశాలపైనా ఖర్గేతో భట్టి చర్చించినట్లు సమాచారం.మౌనంగా సురేఖ.. అపాయింట్మెంట్పై ఉత్కంఠకొండా సురేఖ వ్యవహారం అధిష్టానమే చూసుకుంటుందని.. ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే సూచించారు. అయితే ఆయన అపాయింట్మెంట్ కోసం సురేఖ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటు కూతురి వ్యవహారంపైనా కొన్నిరోజులుగా కొండా సురేఖ పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా ఆమె కొంత దూరంగా ఉంటూ.. తన నియోజకవర్గంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతూ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతలను కలిసేందుకు సురేఖ తాజాగా అపాయింట్మెంట్ కోరడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా? రాఖీ కట్టేందుకు అవకాశం కల్పిస్తారా? అన్నదానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఎపిసోడ్.. లాస్ట్ మినిట్లో ఆ ట్విస్ట్ తప్పదా? -
వారంలో కేబినెట్ విస్తరణ.. ఆ మంత్రులు ఔట్..!
-
టూరిజం హబ్గా ‘మీరాలం’
సాక్షి, హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యం కలిగిన మీరాలం చెరువుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపునివ్వనుంది. కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా ప్రకృతి, వినోదం, విశ్రాంతిని ఆస్వాదించేలా పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈక్రమంలో మీరాలం చెరువును సీఎం రేవంత్రెడ్డి గురువారం ఆకస్మికంగా పరిశీలించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. చెరువు చుట్టూ జరుగుతున్న పనులు, మీరాలం చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు.నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. చెరువు పునరుజ్జీవం, చెరువు పరిసర ప్రాంతాలు, అందులోని ఐలాండ్ల అభివృద్ధి, చెరువుపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం.. ఈ మూడు ప్రధాన అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అయితే, మీరాలం చెరువులోకి మురుగునీరు చేరకుండా పటిష్ట చర్యలు తీసు కోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. చెరు వు నుంచి మూసీ నదిలోకి వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించాలని సూచించారు. చెరువు పునరుజ్జీవంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వాటర్ స్పోర్ట్స్కు డిజైన్.. మీరాలం చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని, అవసరమైన సాంకేతిక, పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోటింగ్, జల క్రీడలు, అడ్వెంచర్ కార్యకలాపాలకు అవకాశాలను పరిశీలించాలన్నారు.చెరువు చుట్టూరా ఫుడ్కోర్టులు, పచ్చని పార్కులు, విశ్రాంతి ప్రదేశాలు, కుటుంబ వినోద సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వినోద, కార్యకలాపాల కేంద్రాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. పాదచారులకు అనుకూలంగా వాకింగ్, పబ్లిక్ స్పేస్లను తీర్చిదిద్దడంతో పాటు రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరచాలన్నారు. చెరువులో ఉన్న ఐలాండ్లను అభివృద్ధి చేయాలని, ప్రకృతి ఆధారిత విశ్రాంతి కేంద్రాలు, గ్లాంపింగ్, ఇతర పర్యాటక కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని వినియోగించుకునే అవకాశాలను అధికారులను పరిశీలించాలని సీఎం చెప్పారు. వెడ్డింగ్, ఈవెంట్ డెస్టినేషన్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసే అంశంపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన పర్యాటక, వినోద సదుపాయాల అభివృద్ధిలో పీపీపీ విధానంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని వెల్లడించారు. సమీపంలోని నెహ్రూ జూలాజికల్ పార్కుతో మీరాలం ట్యాంక్ అభివృద్ధిని అనుసంధానం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూ సందర్శన, ప్రకృతి, చెరువు అందాలు, కుటుంబ వినోదం అన్నీ ఒకే పర్యాటక అనుభవంగా అందించడమే లక్ష్యంగా ఉండాలని చెప్పారు. ట్యాంక్ పునరుజ్జీవం, పరిసర ప్రాంతాలు, ఐలాండ్ల అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్ ప్రస్తుతం రూపుదిద్దుకుంటుందన్నారు. -
గవర్నర్కు గుండె శస్త్రచికిత్స
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా బుధవారం గుండె నొప్పితో హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి స్టెంట్ వేశారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం ఉదయం ఆసుపత్రిలో గవర్నర్ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి ఉన్నారు. -
‘రాహుల్.. ఢిల్లీకి ఒక నీతి.. తెలంగాణకు మరో నీతా?’
వరంగల్: పాలిటెక్నిక్ విద్యార్థులపై రేవంత్ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థులేమన్నా టెర్రరిస్టులా? అని ప్రశ్నించారాయన. తెలంగాణ విద్యార్థుల సమస్యలు రేవంత్కు పట్టవా?అని నిలదీశారు హరీష్రావు.‘విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యం అంటున్నారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నావ్. తెలంగాణ విద్యార్థులు నీ కంటికి కనిపించడం లేదా...?, జెన్ జీ అంటూ డిల్లీలో ధర్నాలు చేస్తున్న రాహుల్ గాంధీకి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు కనిపించడం లేదా?, జెన్ జీ రోడ్డెక్కి పోరాడుతుంటే ఎందుకు స్పందించడం లేదు. డిల్లీకి ఒకనీతి.. తెలంగాణకు మరో నీతా రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి విద్యారుల కోసం పోరాడాలి. డిల్లీ తరహాలో విద్యార్థులు తిరగడబడక ముందే.... డిల్లీ తరహా ఉద్యమాలు జరగక ముందే... రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని హెచ్చరించారు.ఇదీ చదవండి: వేటేస్తారా?.. వదిలేస్తారా? -
‘సీఎం రేవంత్పై కొండా సుష్మిత వ్యాఖ్యలతో నాకేం సంబంధం’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్లో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కివేసే ప్రయత్నం జరుగుతోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి వివాదాన్ని సర్దుమణిచే ప్రయత్నంలో భాగంగా కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ కాగా, ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారన్న ప్రచారంపై ఆయన స్పందించారు. కొండ సుస్మిత పటేల్ వ్యాఖ్యలకు నాకు సంబంధం లేదు. మునుగోడు అభివృద్ధి నిధుల విషమై చర్చించేందుకు భట్టి విక్రమార్కను కలిశాను. నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని నేను. ఎంపీ, ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆనాడు ఫైట్ చేశా. తెలంగాణ ఏర్పాటులో భాగస్వామ్యం లేని వాళ్ళు ఇవాళ విమర్శలు చేస్తున్నారు.నా పైన విమర్శలు చేసే వాళ్ళు వాళ్ళ స్థాయి ఏంటో గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కి వేసే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యమంలో లేనివాళ్లు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉండవచ్చు. కొండా సుస్మిత పటేల్ అంశాన్ని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది. నాలాంటి ఉద్యమ నేతలను విమర్శ చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం’అని హెచ్చరికలు జారీ చేశారు.👉ఇదీ చదవండి: కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు -
సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్, YS జగన్ దిగ్భ్రాంతి
-
కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, సీఎం రేవంత్ రెడ్డి వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్గా మారగా, అధిష్టానం ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యల్లో భాగంగా కొండా సురేఖ భర్త కొండా మురళి రంగంలోకి దిగి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు కీలక నేతలను ప్రత్యేకంగా కలిశారు. ఈ భేటీ అనంతరం కొండా మురళి మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా కొండా సుష్మిత వ్యాఖ్యలపై స్పందించారు. ‘కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదు. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, సుష్మితను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. మేం క్రమశిక్షణా కమిటీకి చెప్పాల్సిన వివరణ ఇచ్చాం. అధికారిక పనుల్లో భాగంగానే బిల్లుల గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశాం’‘కొండా సుస్మిత నా బిడ్డ. ప్లాన్-ఏలో ఆమె అలా మాట్లాడింది. ప్లాన్-బీలో ఏం చేస్తుంది అంటే నాకేం తెలుస్తుంది? ఆ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. వివాదం నా బిడ్డది. అందులో ప్లాన్-బీలో ఏముందో నాకు తెలియదు’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ క్రమశిక్షణా కమిటీకి తాము చెప్పాల్సిన వివరణ స్పష్టంగా ఇచ్చామని, అధికారిక పనుల్లో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పరకాల నియోజకవర్గ టికెట్ కేటాయింపులపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను ఏఐసీసీ క్రమశిక్షణా రాహిత్యంగా భావించడంతో పాటు, టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వివాదం ముదరకుండా ఉండేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన కొండా మురళితో పాటు, ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,ఇటీవల ప్రభుత్వంపై అసంతృప్తి స్వరం వినిపించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు వివాదాన్ని సర్దుమణిగేలా చేస్తాయా, లేక పార్టీలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా అనేది వేచి చూడాలి. 👉ఇదీ చదవండి: నా కుమార్తె మాటలకు నాకేం సంబంధం -
సీఎంను కలిసిన కోచ్ పుల్లెల గోపీచంద్
-
రేవంత్ టూర్కు ‘నో’ పర్మిషన్.. కేంద్రం మరో కోణం ఇదేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రమేపీ సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారనిపిస్తుంది. వీటిలో అత్యధికం ఆయన స్వయంగా సృష్టించుకున్నవేనేమో అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కు కేంద్ర ప్రభుత్వం నో చెప్పడం, మద్యలోనే యూకే నుంచే వెనక్కి రావల్సిన పరిస్థితి ఏర్పడడం,కాంగ్రెస్లో అసమ్మతి స్వరాలు పెరగడం,మంత్రి కొండా సురేఖ కుమార్తె ఏకంగా ఆయనపైనే తీవ్ర ఆరోపణలు సంధించడం, తదితర అంశాలు చికాకుగా తయారయ్యాయి. రేవంత్ యూకే, అమెరికాలోని ప్రఖ్యాత విద్యా సంస్థలతో సంప్రదింపులు జరిపి, వాటిని తెలంగాణకు తీసుకురావలన్న ఉద్దేశంతో ఈ యాత్ర పెట్టుకున్నారు. అంతవరకు సంకల్పం మంచిదే. కాని ఈ టూర్ లో ఆయన పెట్టుకున్న మరి కొన్ని ప్రోగ్రాంలు ఇబ్బందిలో పడేశాయి.భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏకంగా రేవంత్ టూర్ వెనుక విదేశీ శక్తులు ఉన్నాయంటూ ఆరోపణ చేశారు. ఆ మరుసటి రోజే కేంద్రం రేవంత్ టూర్ను అడ్డుకుంది. సీఎం టూర్ షెడ్యూల్ లో స్పష్టత లేదన్నది ఒక వివరణ అయితే, ముఖ్యమంత్రి హోదా తో సంబందం లేకుండా,రెండు దేశాల సంబందాలపై ప్రభావం పడే అవకాశం ఉండే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నించారన్నది కేంద్రం వాదనగా ఉంది. అందుకే రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదని స్పష్టం చేసింది. దీనికి ముందు రేవంత్ వివరణ తీసుకుని అనుమతికి నో చెప్పి ఉంటే ఎలా ఉండేదో. కేంద్రం ఏకపక్షంగా అనుమతి నిరాకరించడంతో ఇది బీజేపీ, కాంగ్రెస్ ల మద్య వివాదంగా మారింది. కావాలని రేవంత్ టూర్ను కేంద్రం అడ్డుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించి ఆక్షేపణ తెలిపారు. రేవంత్ ఎదుగుదలను చూసి బీజేపీ ఓర్వలేకపోతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు విమర్శించారు. తనకు అనుమతి నిరాకరించడం తెలంగాణను అవమానించడమేనని రేవంత్ ఆరోపించారు. కాని బీజేపీ తెలంగాణ అద్యక్షుడు ఎన్.రమాచంద్రరావు మాత్రం ఆ ఆరోపణలను ఖండించి, ఇందులో రాజకీయం ఏమీ లేదని పేర్కొన్నారు. గతంలో కూడా కొందరు ముఖ్యమంత్రులకు కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనాలని రేవంత్ భావించారన్నది ఒక కారణంగా అనుమతి రాలేదని కొందరు చెబుతున్నారు.కాని దీనికన్నా రేవంత్ అమెరికాలో అత్యున్నత పదవులలో ఉన్నవారిని కలసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా కారణమని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారులను కాంటాక్ట్ చేయడానికి రేవంత్ తరపున ప్రయత్నాలు జరిగినట్లు అనిపిస్తుంది. దానికి ఒక ప్రాతిపదిక ఉంది. అమెరికా కాన్సలేట్ ఉన్న హైదరాబాద్ నానక్ రామ్ గూడకు ట్రంప్ అవెన్యూ అని రేవంత్ ప్రభుత్వం నామకరణం చేసింది. ఆ విషయం ట్రంప్ దృష్టికి వెళ్లింది. దానికి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్పందించారు. అదే టైమ్ లో ట్రంప్ కంపెనీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో భారీ టవర్స్ నిర్మాణం చేయడానికి సన్నద్దం అయింది. దాంతో రేవంత్ ప్రభుత్వానికి ఉత్సాహం వచ్చింది. వీలైతే ట్రంప్ ను కలవాలని ఆలోచించింది. లేదా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ను అయినా కలిసే అవకాశాలపై ట్రై చేశారట.ఈ విషయాలన్ని కేంద్రానికి కూడా తెలిశాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక దేశ అధ్యక్షుడిని అధికారికంగా కలవడం సాధారణంగా జరగదు. ఈ నేపధ్యంలోనే కేంద్రం అనుమతి తిరస్కరించిందన్నది బీజేపీ వర్గాల కధనం.ఫలితంగా రేవంత్ వెనక్కి తిరిగి రాక తప్పలేదు.కాకపోతే యు.కె.లో కొన్ని యూనివర్శిటీలతో సమావేశం అయి సంప్రదింపులు చేశారు. అమెరికాకు తన అదికారులను మాత్రం పంపించారు. లండన్లో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహానికి కూడా హాజరయ్యారట.ఈ విషయాన్ని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.అయితే అమెరికా టూర్ కు సంబందించి రేవంత్ బృందం ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లడం కూడా సరైనది కాకపోవచ్చు.ఇక కాంగ్రెస్ లో కీచులాటలు ప్రజలలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేవిగా మారాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ పైన,ఆయన సోదరుడిపైన తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. దానిపై కాంగ్రెస్ కూడా సీరియస్ గా స్పందించింది.కుమార్తె వ్యాఖ్యలకుగాను సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. తనకు ఆ వ్యాఖ్యలతో సంబందం లేదని ఆమె వివరణ ఇచ్చినా కమిటీ సంతృప్తి చెందలేదు. మరోసారి నోటీసు ఇవ్వగా, సురేఖ ఈసారి కాస్త ఘాటుగానే స్పందించారు. తనకు వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేయించడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇదంతా ఎవరో వెనుక ఉన్న అదృశ్యశక్తులు చేయిస్తున్న పని ఆమె ఆరోపించారు. పైగా కొన్ని బీసీ సంఘాలు సురేఖకు బాసటగా నిలవడానికి సిద్దం అయ్యాయి. పరకాల నియోజకవర్గంలో మళ్లీ రేవూరి ప్రకాష్ రెడ్డే పోటీ చేస్తారని రేవంత్ ప్రకటన చేయడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. సాదారణంగా అభ్యర్దుల ఎంపిక అన్నది హైకమాండ్ అంశంగా చెప్పుకుంటారు. రేవంత్ అనవసర ప్రస్తావన చేయడం ద్వారా ఈ వివాదాన్ని కొనితెచ్చుకున్నట్లయింది. 1989-94 మధ్య కూడా మూడు గ్రూపులు కాంగ్రెస్ లో ఉండేవి. అప్పటి ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా కొందరు, అనుకూలంగా కొందరు ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి మాట్లాడేవారు. వాటిపై ప్రజలలో అసహనం కలిగేది. ఇప్పుడు దాదాపు అదే రీతిలో సురేఖకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మ్యేలు రేవంత్ వైపు మొహరించడం విశేషం. అయితే, 40 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారనుకుటే 17 మందే వచ్చారని బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారం చేస్తున్నాయి. కారణం ఏమైనా రేవంత్ కూడా ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సలహా ఇచ్చారు. కానీ, అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిందని చెప్పాలి. నిర్ణయం హై కమాండ్కు వదలివేయడంతో సురేఖ ఇష్యూ పెండింగులో పడినట్లయింది.ఇది కూడా రేవంత్ కు కాస్త అసహనం మిగిల్చేదే. మరో వైపు సీనియర్ నేత చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ నేతలకు ఫిర్యాదు చేయడం, చిన్నారెడ్డి వర్గం గాంధీ భవన్ లో ధర్నా చేయడం కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇక మరో సీనియర్ నేత ,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఏకంగా అసలు కాంగ్రెస్ వారికి నష్టం జరుగుతోందన్నట్లుగా మాట్లాడడం సంచలనం రేకెత్తించింది. అయితే ఆయన కూడా మద్యలో కొంతకాలం బీజేపీలోకి వెళ్లివచ్చారు. రేవంత్ టీడీపీ నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవి పొందడాన్ని ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉన్న పలువురు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తగినట్లే రేవంత్ కూడా తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారినే ఎక్కువగా నమ్ముతున్నారన్నది వీరి భావన. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఘటనను కొందరు ఉదహరిస్తున్నారు. ఏపీకి చెందిన జనసేన ఎంపీ లింగమనని రమేష్ కుమారుడు సంజోష్ కారు రాష్ డ్రైవ్ వల్ల ఒక యువతి మరణించింది. ఆ కేసులో సంజోష్ని రక్షించడానికి తెలంగాణ పోలీసులు ప్రయత్నించారన్న ఆరోపణ గుప్పుమంది. జాతీయ మీడియాలో సైతం రేవంత్కు ,చంద్రబాబుకు మద్య హాట్ లైన్ నడుస్తుంటుందని, అందువల్లే ఎంపీ కుమారుడిని అరెస్టు చేయలేదని కధనాలు,వ్యాఖ్యలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం బలహీనంగా ఉన్న నేపధ్యంలో రేవంత్ కు ఈ పరిణామాలేవీ ప్రస్తుతానికి ఇబ్బంది పెట్టకపోవచ్చు. కాని 2028 ఎన్నికల నాటికి రాజకీయ అంశాలతో పాటు ప్రభుత్వపరంగా 22 ఎ, తదితర సమస్యలు ఏ రూపు దాల్చుతాయో అన్న ఆందోళన పార్టీలో ఉంటుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కొండా సురేఖ రాజీనామా చేస్తారా?.. ఢిల్లీలో హైఓల్టేజ్ పాలిటిక్స్
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ నేతల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయడంతో.. ఏఐసీసీ పెద్దలు తదుపరి నిర్ణయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ విషయంలో ఎలాంటి చర్య తీసుకోవాలన్న దానిపై అధిష్టానంలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.అయితే, కొండా సురేఖను నేరుగా మంత్రి పదవి నుంచి తప్పిస్తే రాజకీయంగా ఎలాంటి విమర్శలు ఎదురవుతాయన్న అంశాన్ని కూడా ఏఐసీసీ నేతలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఆమె బీసీ మహిళా మంత్రి కావడంతో నేరుగా వేటు వేస్తే పార్టీపై వచ్చే రాజకీయ ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సస్పెన్షన్కు బదులుగా రాజీనామా చేయించడం ద్వారా మధ్యేమార్గాన్ని అనుసరించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, తుది నిర్ణయం తీసుకునే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో అధిష్టానం నేరుగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపిక కోసం 28న లక్కీ డ్రా.. ఇక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీపై ఈ వ్యవహారం చూపుతున్న ప్రభావం, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే ఈ వ్యవహారానికి ముగింపు పలకాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొండా సురేఖపై ఎలాంటి చర్య ఉంటుందన్నది కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. సస్పెన్షన్ చేస్తారా? లేక మంత్రి పదవికి రాజీనామా చేయిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.చిన్నారెడ్డి పరిస్థితేంటి?మరోవైపు సీనియర్ నేత చిన్నారెడ్డి విషయంలోనూ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆయనను అధికార పదవి నుంచి తప్పిస్తారా? లేక కేవలం మందలింపుతో వ్యవహారాన్ని ముగిస్తారా? అనే అంశాలపై కూడా ఏఐసీసీ పెద్దలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇద్దరిపై ఒకే తరహా చర్య తీసుకోవాలా? లేక వారి వ్యవహారాలను వేర్వేరుగా పరిగణించాలా? అన్నదానిపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖ నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే, క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి నివేదిక పంపిన నేపథ్యంలో ఈ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ రియాక్షన్పై పలువురు నేతలు ఎదురుచూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. కాగా, మంత్రి సురేఖ మాత్రం ఈ అంశంపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. -
గాయత్రి–ట్రెసా జాలీ జోడీకి తెలంగాణ సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్కు ఏకైక పతకం అందించిన తెలంగాణ ప్లేయర్ పుల్లెల గాయత్రి,కేరళ క్రీడాకారిణి ట్రెసా జాలీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కలిసిన గాయత్రి–ట్రెసాలను సీఎం శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గాయత్రి తల్లిదండ్రులైన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, భారత బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్ పీవీవీ లక్ష్మి కూడా పాల్గొన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో గాయత్రి–ట్రెసా ద్వయం మహిళల డబుల్స్లో కాంస్య పతకం గెలిచింది. ఇటీవల కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ క్రీడా అవార్డుల్లో గాయత్రి–ట్రెసా జాలీలకు ‘అర్జున’ అవార్డు కూడా దక్కింది. -
‘మూసీ’ భూసేకరణ వేగవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో భూసేకరణ సమస్యలు, ల్యాండ్ పూలింగ్ విధానం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణపై సీఎం సమీక్ష నిర్వహించారు. వీటిపై స్పష్టమైన విధానం రూపొందించాలని, భవిష్యత్లో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్–2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి లభించే రుణాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించాలని సూచించారు. భూసేకరణలో భాగమైన టీడీఆర్ అంశంపై ప్రతి వారం సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులకు వెంటనే టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. కొత్వాల్గూడ బర్డ్స్ పార్కుకు విస్తృత ప్రచారం కల్పించి సందర్శకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం కార్యదర్శి మాణిక్రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, జేఎండీ గౌతమి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు 55 కిలోమీటర్ల కారిడార్ను పునరుద్ధరించే లక్ష్యంతో పనులు చేపడుతున్నట్టు ఎంఆర్డీసీఎల్ అధికారులు తెలిపారు. మూసీ పరిధిలోని ఎంఎఫ్ఎల్/బఫర్ జోన్లలో భూములను స్వచ్ఛందంగా అప్పగించే వారికి టీడీఆర్ అందించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచి్చంది. మూసీ ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించి కొందరు యజమానులు టీడీఆర్కు బదులుగా నగదు, ఇళ్లు లేదా ఓపెన్ ప్లాట్లు కోరుతున్నట్టు సమాచారం. భూముల స్వభావం, హక్కులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ హద్దులను స్పష్టంగా నిర్ధారించడం ద్వారా భవిష్యత్ న్యాయ వివాదాలను నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
అవినీతి తప్ప.. అభివృద్ధి ఏదీ?
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేల విడిచి సాము చేస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన వైఫల్యాలు, ఇచ్చిన హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని చెప్పారు. తాడి చర్ల–2, పీకేఓసీ–2 బ్లాకులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాక్–3 సింగరేణికి దక్కేలా చర్యలు చేపట్టామన్నారు. 120 మిలియన్ టన్నుల నిల్వలున్న ఈ గని ద్వారా సంస్థకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి వల్ల సింగరేణి ఆర్థికంగా దెబ్బతింటోందని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ. 55 వేల కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనలపై బాధ్యతారాహిత్యం... తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదంటూ రేవంత్ చేస్తున్న ఆరోపణలు.. అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికేనని కిషన్రెడ్డి మండిపడ్డారు. ‘ముఖ్య మంత్రి, కేంద్రమంత్రి స్థాయి వ్యక్తులు అన్ని అనుమతులు తీసుకున్నాకే విదేశీ పర్యటనలు ఖరారు చేసుకుంటారు. ఆదరాబాదరాగా లండన్ వెళ్లి, అక్కడి నుంచి అమెరికా వెళ్లాలనుకోవడం సరికాదు. విదేశీ పర్యటనల విషయంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ విదేశాంగ శాఖ నిబంధనలు అమలులో ఉన్నాయి. దేశ ప్రయోజనాలు, పర్యటించే వ్యక్తుల నేపథ్యం ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి. ఇది కేవలం పాలనాపరమైన అంశం తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదు’అని స్పష్టం చేశారు. 2005లో నరేంద్రమోదీ అమెరికా పర్యటనకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించిందని గుర్తుచేశారు. గతంలో తనతో సహా పలువురు కేంద్రమంత్రుల పర్యటనలను కూడా విదేశాంగ శాఖ నిరాకరించిందని చెప్పారు. ప్రధాని మోదీని టెర్రరిస్టుతో పోల్చిన, పాకిస్తాన్ అనుకూల వ్యక్తి, న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలవడానికి రేవంత్ ఎందుకు ప్రయతి్నంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని విస్మరించి.. విదేశీ యూనివర్సీటీలను తీసుకొస్తామని గొప్పలు చెప్పుకునే రేవంత్రెడ్డి, ముందు రాష్ట్రంలోని విద్యావ్యవస్థ పరిస్థితి ఏంటో సమాధానం చెప్పాలని కిషన్రెడ్డి నిలదీశారు. బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు, విద్యార్థులకు ఉచిత స్కూటీలు, విద్యా భరోసా కార్డులు, మండలానికి అంతర్జాతీయ పాఠశాల ఇస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కొత్త యూనివర్సీటీల మాట పక్కనబెట్టి, ముందు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన అట్టర్ ఫ్లాప్ అయిందని, హైదరాబాద్లోనే 20 శాతం ఇళ్లకు కూడా ఎన్యూమరేటర్లు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. -
ఒంటరైన మంత్రి కొండా సురేఖ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమానికి ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. వనమహోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా పండగలా నిర్వహించాలని ఆమె పిలుపునిచ్చినప్పటికీ, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు గైర్హాజరయ్యారు. కేవలం మంత్రి సీతక్క మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.వరంగల్ జిల్లాలో నిర్వహించిన వనమహోత్సవంలో భాగంగా కొండా సురేఖ మొక్కలు నాటారు. ఆమె పిలుపు మేరకు మంత్రి సీతక్క వచ్చి మద్దతు తెలిపారు. అయితే, సీతక్క మినహా మిగతా మంత్రులందరూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం గమనార్హం.కొండా సురేఖకు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వివాదం నడుస్తోందన్న ఊహాగానాల నేపథ్యంలోనే మంత్రులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వనమహోత్సవంలో పాల్గొంటే సీఎంకు దూరంగా ఉన్నట్లు అవుతుందనే ఉద్దేశంతోనే మిగతా మంత్రులు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు తెలుస్తోంది.👉ఇదీ చదవండి: ‘నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ -
కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ మంత్రిపై చర్యలకు సిపారసు చేసింది. ఈ రోజు (మంగళవారం) టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్కు ఆరు పేజీల నివేదికను అందించింది. నివేదికలో.. "కొండా సురేఖ పదే పదే తప్పులు చేస్తున్నారు. గతంలో కూడా కీలక వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కుటుంబసభ్యులను కంట్రోల్ చేయలేకపోతున్నారు. సురేఖపై చర్యలు తీసుకోకపోతే పార్టీకే నష్టం" అని తెలిపింది. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో మల్లురవి భేటీ కానున్నారు. సీఎం రేవంత్ను కలిసి నివేదికలోని అంశాలు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఏ నిర్ణయం తీసుకోనుందా అని ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ అంశంపై ఇదివరకే సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ‘కొండా సురేఖ అంశం క్రమశిక్షణా కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మీడియా ముఖంగా మాట్లాడను. తీసుకునే నిర్ణయాలకు మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమిటీ సైతం మంత్రిపై చర్యలకు సిపారసు చేసింది.అసలు వివాదం ఏంటి?ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ అభ్యంతకరంగా మాట్లాడారు. 'సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సంస్కృతి అబ్బలేదు. టీడీపీ నుంచి వచ్చిన వారిపై ప్రేమ కురిపిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తోంది. అచ్చ కాంగ్రెస్కు స్థానం లేకుండా చేస్తున్నారు. ఎప్పుడూ ఏం మాట్లాడతారో సీఎంకు తెలియదు. సంగారెడ్డికి వెళ్లినపుడు జగ్గారెడ్డి విషయంలో అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం.. పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎలా కోరతారు’ అని ప్రశ్నించారుఎమ్మెల్యే టికెట్లు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే సీఎం కాదన్నారు. తాము కాంగ్రెస్ అధిష్టానాన్ని, సోనియా, రాహల్, ప్రియాంకలను గౌరవిస్తామన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ ఆనందంగా లేరన్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మరియపురం శివారులోని ఎస్ఎస్ గార్డెన్స్లో కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె మాట్లాడారు.కొండా సురేఖ వివరణకాగా ఈ వివాదంపై ఇదివరకే కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో మంత్రి స్పందిస్తూ.. ‘సుష్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒక స్వతంత్ర వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకానీ ఆ వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై నాకు పూర్తి గౌరవం ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీ నాకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కొండా సురేఖ కోరారు. అయినప్పటికీ క్రమశిక్షణ కమిటీ ఆమెపై చర్యలకే సిపారసు చేసింది.ఇదీ చదవండి: ఒంటరైన మంత్రి కొండా సురేఖ -
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్లు లేఖ
సినిమా టికెట్ ధరల స్థిరీకరణ, థియేటర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే జీవో 77 విడుదల చేసింది. అయితే దీనిని పునఃసమీక్షించాలి లేదా రద్దు చేయాలి, సవరించాలని ఎగ్జిబిటర్లు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)తెలంగాణలోని 33 జిల్లాల్లో 400కుపైగా థియేటర్లని సంప్రదించకుండా.. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రమేయం లేకుండా జీవో విడుదల చేశారని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ చెప్పుకొచ్చింది. తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, పలువురు నిర్మాతల కోసం ఎలా జీవో ఇస్తారని ప్రశ్నించారు.తెలంగాణలో 400కుపైగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాల్లో 99 శాతం ఎయిర్ కూల్డ్ థియేటర్లే ఉన్నాయి. కోవిడ్ తర్వాత భారీగా పెట్టుబడి పెట్టి వాటిని ఆధునికీరించాం. తెలంగాణలో 390కిపైగా ఎయిర్ కూల్డ్ థియేటర్లున్నాయి. 350కిపైగా మల్టీఫ్లెక్స్ స్క్రీన్లున్నాయి. తెలంగాణలోని అన్ని థియేటర్లపై 20 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తమ లేఖలో విన్నవించుకున్నారు.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో 'టాక్సిక్' టికెట్ రేట్లు భారీగా పెంపు) -
కొండా సురేఖ విషయంలో అసలేం జరుగుతోంది?
-
ఇది జెన్జీ యుగం
సాక్షి, హైదరాబాద్: ఇది జెన్జీ యుగమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకుని వినియోగించుకోకపోతే కాలం చెల్లినవారవుతారని (అవుట్డేట్) ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘సోషల్ మీడియా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్లు పాతవైపోయాయి. ఇప్పుడు యువత ఇన్స్టాగ్రాంలో హల్చల్ చేస్తోంది. మనం కూడా ఆ బాట పట్టాలి. ఇన్స్టాగ్రాం ఖాతాలు తెరిచి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయాలి’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. రేవంత్ సోమవారం విలేకరుల సమావేశం అనంతరం కాసేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు.ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాను బీఆర్ఎస్ విస్తృతంగా వినియోగిస్తోందని, దీనికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేయాలన్నారు. ‘నాడు ఎకరం రూ.100 కోట్లకు అమ్మితేనే సంకలు గుద్దుకున్నారు. కానీ నేను ఎకరం రూ.260 కోట్లకు అమ్మా. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం ఊపందుకుంటోంది. ఇటీవలి కాలంలో రియల్ కార్యకలాపాలు 18 శాతం పెరిగాయని నివేదికలు చెపుతున్నాయి. ఇవేవీ సోషల్మీడియాలో కనిపించవు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కోసం స్మార్ట్ కార్డులు తెచ్చాం.కానీ సంగారెడ్డిలో పంపిణీ చేసిన ఆ ఒక్క రోజే ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత అందరూ మర్చిపోయారు’ అని చెప్పారు. ఎమ్మెల్యేలందరూ వారి కార్యక్రమాలతోపాటు రాష్ట్ర పార్టీ, ఏఐసీసీ కార్యక్రమాలను కూడా సోషల్ మీడియాలో పెట్టాలని, ఇందుకోసం ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే సిబ్బందికి ఐ అండ్ పీఆర్ శాఖతో ఓరియంటేషన్ క్లాస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా మనందరం కలిసి పనిచేసినట్లే వచ్చే ఎన్నికల్లో కూడా పనిచేస్తే 100కు పైగా సీట్లు గెలుస్తామన్నారు. అలాగే, 22ఏ భూముల గురించి ఎవరూ మాట్లాడొద్దని. ఇది మన హయాంలోనే వచి్చంది కాదని, ఈ సమస్య బీఆర్ఎస్ హయాంలో కూడా ఉందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వివాదాలొద్దు... ఎమ్మెల్యేలందరూ వివాదాల జోలికి వెళ్లకుండా నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను గ్రీన్ చానల్ ద్వారా విడుదల చేస్తామని, వెంటనే ఆ పనుల మీద దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, కార్యక్రమ నిర్వహణకు సంబంధించి విప్లు సభ్యులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, విప్లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, వీర్లపల్లి శంకర్, ప్రేమ్ సాగర్ రావు, నవీన్ యాదవ్, మట్టా రాగమయి, మందుల సామేల్, వెడ్మ బొజ్జు, కోరం కనకయ్య, తోట లక్ష్మీకాంతరావు, రాందాస్ నాయక్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, బత్తుల లక్ష్మారెడ్డి, మనోహర్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కె.ఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, మురళీ నాయక్, యశస్విని రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు పాల్గొన్నారు.ఏ ఒక్కరి కోసమో కాదు: భట్టి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ పదేళ్ల పాటు అధికారం లేకపోతే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నామో అందరికీ తెలుసునని డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యానించారు. అధికారం వచి్చన తర్వాత కష్టపడుతున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ఒకరిద్దరి ప్రయోజనాల కోసం పారీ్టని, ప్రభుత్వాన్ని ఫణంగా పెట్టుకోలేమని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేలా అందరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.క్రమశిక్షణ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేకొండా సుస్మిత వ్యవహారంపై సీఎం స్పందనసాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ తనపై చేసిన ఆరోపణలు, విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా స్పందించడానికి నిరాకరించారు. ఈ వివాదంపై విలేకరుల సమావేశంలో అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ అంశం టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, కమిటీ తీసుకునే నిర్ణయాన్ని పార్టీ, తాము, అందరూ కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్నారు. ఊహాజనిత అంశాలను ప్రస్తావించవద్దని మీడియాను కోరారు. -
అధిష్టానం కోర్టులోకి!
సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోర్టులోకి చేరింది. ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయంపైనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉంటుందని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు తగినట్టుగానే సోమవారం రెండు కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం రేవంత్రెడ్డి అటు విలేకరుల సమావేశంలోనూ ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీలోనూ సురేఖ అంశంపై స్పందించారు. అంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని విలేకరుల సమావేశంలో చెప్పిన ఆయన.. ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఎవరూ దీని గురించి మాట్లాడొద్దని సూచించారు. ‘పాజిటివ్ వద్దు.. నెగెటివ్ వద్దు.. సురేఖ ఎపిసోడ్ గురించి మాట్లాడొద్దు.. ఫుల్స్టాప్ పెట్టండి... విషయం హైకమాండ్ దగ్గరకు వెళ్లింది కదా. వారు నిర్ణయం తీసుకోవాలి.’అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మరోవైపు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసులకు సురేఖ సమాధానంపై ప్రాథమిక నివేదికను పార్టీకి అందజేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్లకు కమిటీ చైర్మన్ మల్లురవి సోమవారం ప్రాథమిక నివేదికను అందజేశారు. సుస్మిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి ప్రతిష్టను వ్యక్తిగతంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని, దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. కాగా, ఈ నివేదిక ఆధారంగా సుస్మిత, సురేఖల అంశంపై పీసీసీ నుంచి కూడా ఏఐసీసీకి ఓ నివేదిక వెళుతుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత రాష్ట్ర పార్టీ పెద్దలకు హస్తిన నుంచి పిలుపు వస్తుందని, అక్కడ జరిగే చర్చలో సీఎం, పీసీసీ చీఫ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది. నాడు అడ్డుకున్నదెవరు? ఈ ఎపిసోడ్లో మరో ఆసక్తికర అంశం వెలుగులోనికి వచ్చింది. గతంలో కూడా సురేఖ కుమార్తె సుస్మిత తననుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే సీఎం రేవంత్ చాలా సీరియస్గా తీసుకున్నారని, ఈ అంశంపై అధిష్టానం దగ్గర చర్చ జరిగినప్పుడు కొండా కుటుంబంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అడ్డుకున్నారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. అప్పుడు చర్యలు తీసుకోకపోవడంతోనే మరోమారు సుస్మిత సీఎం మీద మాట్లాడగలిగారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. ఈసారి తాను కూడా కాపాడలేనని ఇటీవల మహేశ్గౌడ్ నిజామాబాద్లో చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు నిదర్శనమని వారంటుండడం గమనార్హం. కాగా, కొండా సురేఖ ఎపిసోడ్ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిల మధ్య కూడా చర్చకు వచ్చింది. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో తెలంగాణ రైజింగ్–2027 సమీక్షకు ముందు తాజా రాజకీయ వివాదం గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం. సురేఖ విఫలమయ్యారు: క్రమశిక్షణ కమిటీ విశ్వసనీయ సమాచారం ప్రకారం మంత్రి కొండా సురేఖపై చర్యలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సురేఖ కుమార్తె సుస్మిత పదేపదే సీఎంను కించపరిచేలా, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతుంటే ఆమెను నియంత్రించడంలో సురేఖ విఫలమయ్యారని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. తాము సుస్మిత మాట్లాడిన మాటలు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలను క్షుణ్ణంగా పరిశీలించామని, సురేఖ సమాధానాలను కూడా పరిశీలించామని, అన్నింటినీ పరిశీలించిన మీదట క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సురేఖ అర్హురాలని, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఏఐసీసీ నిర్ణయమని టీపీసీసీ ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. -
తెలంగాణకు అవమానం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం.. వ్యక్తిగా రేవంత్రెడ్డికి అనుమతి నిరాకరించడం కాదు.. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానం, తిరస్కరణ. దీనికి కారణం గుజరాత్ ఆధిపత్యం. దేశ ప్రధాని మోదీ ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధాని అన్న విషయ విజ్ఞానంతో వ్యవహరించడం లేదు. ఇది తెలంగాణకు జరిగిన అవమానం. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రేవంత్ సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం హోదాలో అభివృద్ధి కోసం చేసే పర్యటనను అడ్డుకుని తెలంగాణ పట్ల కేంద్రం స్పష్టమైన వివక్ష ప్రదర్శించింది. ఈ అంశాన్ని మా నాయకులు రాహుల్ గాం«దీ, మల్లికార్జున ఖర్గే, ఇతర నాయకులంతా పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇది ఆషామాషిగా తీసుకునే విషయం కాదు’ అని సీఎం మండిపడ్డారు. ‘తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంతో వెళ్తున్నామని గతంలో నేను, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్లేటప్పుడు పెట్టిన విధానంలోనే దరఖాస్తు పెట్టాం. రాజకీయ కోణంలో అనుమతిని తిరస్కరిస్తున్నట్టు విదేశాంగ శాఖ జవాబు ఇచ్చింది. రాజకీయ కారణం ఏమిటని మోదీని ప్రశ్నిస్తున్నా. మీరు (మోదీ) ఎన్నో దేశాల పర్యటనకు వెళ్లారు. మీ సొంత రాష్ట్రం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు 8 రోజుల పాటు అమెరికా, కెనడాలో పర్యటించి వైబ్రెంట్ గుజరాత్ అనే పాలసీని ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేసి, పెట్టుబడులు పెట్టాలని కోరడానికి అనుమతిచ్చారు. అదే తెలంగాణ రైజింగ్–2047 పాలసీలో భాగంగా విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం సీఎంగా అమెరికా పర్యటనకు వెళ్తానంటే నిరాకరిస్తారు. ఇంగ్లండ్, అమెరికా రెండింటికీ ఒకే విధానం, ఒకే అంశాలతో విదేశీ పర్యటన తలపెట్టాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదనకుంటే ఇంగ్లండ్కు అనుమతి ఎందుకు ఇచ్చారు? అమెరికా పర్యటనకు ఎందుకు తిరస్కరించారు?’ అని రేవంత్ కేంద్రంపై మండిపడ్డారు. మోదీకి బానిసలుగా ఉంటారా? ‘అమెరికా పర్యటనకు అనుమతి తిరస్కరిస్తూ కేంద్రం రాజకీయ కారణాలను అపాదించడాన్ని తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. గుజరాత్ను సమర్థించి మోదీ, గుజరాత్ చేతుల్లో కట్టుబానిసలుగా బతకదలుచుకున్నారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటదలుచుకున్నారా? అని బీజేపీ తెలంగాణ ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నా. తెలంగాణకు పెట్టుబడులు వస్తే గుజరాత్కు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే కుట్రతో నా పర్యటనను అడ్డుకున్నారు. దీనిపై నేను స్పందించి విదేశీ వేదికపై నుంచి మాట్లాడి ఉంటే.. చూసినవా, దేశ ద్రోహి, విదేశాల్లో భారత దేశ గౌరవానికి భంగం కలిగించిండు అని విమర్శిస్తారనే ఇక్కడికి వచ్చాక ఖండిస్తున్నం. కేంద్రం తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని సీఎం అన్నారు. లక్ష్యాన్ని ఆపలేరు.. ‘ఇంగ్లండ్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లే వారు ఒక బృందాన్ని హైదరాబాద్కు పంపించి ఇక్కడ తమ క్యాంపస్ ప్రారంభించడానికి పరిస్థితులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్తే ఎంసీఆర్హెచ్ఆర్డీలో స్వల్పకాలిక కోర్సులు, భారత్ ఫ్యూచర్ సిటీలో ఆక్స్ఫర్డ్ క్యాంపస్ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబద్లో తమ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకరించారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో మాట్లాడితే షార్ట్ టర్మ్ కోర్సులను ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రారంభిస్తామన్నారు. అమెరికాలో సైతం బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, ఎంఐటీ క్యాంపస్, నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ వెళ్లాల్సి ఉండే. సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా ఐవీ లీగ్లోని టాప్ –10 వర్సిటీలను తెలంగాణకు తీసుకురావాలన్నది నా లక్ష్యం. మీరు నా పర్యటనను అడ్డుకున్నారు.. కానీ నా లక్ష్యాన్ని ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపించా. ఆక్స్ఫర్డ్తో అధికారులు ఒప్పందం చేసుకోబోతున్నరు. ఇతర వర్సిటీల ముందు మన ప్రతిపాదనలు ముందుపెట్టబోతున్నారు’ అని సీఎం పేర్కొన్నారు. ప్రధానికి తెలియకుండా జరగలేదు... ‘మేం దరఖాస్తులో వివరాలు ఇవ్వలేదని బీజేపీ నేతలు తప్పుదోవ పట్టించారు. ఏ అధికారిక పర్యటనను అయినా భారత రాయబార కార్యాలయ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. విమానాశ్రయంలో మేము దిగే నాటి నుంచి మళ్లీ తిరిగి వెళ్లే వరకు భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఇది చాటుమాటుగా పర్యటన కాదు. గతంలో విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు ఈ విషయాలన్నీ తెలుసు. తెలంగాణ సీఎం పర్యటనకు అనుమతిని సమీక్షించకుండా, ప్రధాని దృష్టిలో లేకుండా తిరస్కరించడం జరుగుతుందా? తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారిని శిక్షిస్తామని ప్రపంచానికి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్, మెట్రో రైలు ఇతర విషయాల్లో తెలంగాణకు సహకరించడం లేదు’ అని రేవంత్ మండిపడ్డారు. అనుమతి నిరాకరణపై విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బీజేపీలో చేరాలని ఎద్దేవాచేశారు. మోదీ అన్ని దేశాలు తిరగొచ్చు.. ‘న్యూయార్క్ మేయర్ మమ్దానీ అసాంఘిక శక్తి కాదు. మేయర్, అమెరికా ఉపాధ్యక్షుడి అపాయింట్మెంట్ అధికారికంగా ఖరారు కాకుంటే ఏ కార్యక్రమం జరగదు. మమ్దానీ ఏమైనా మన గల్లీలో ఉన్న కౌన్సిలరా? పోతాపోతా ఇంట్లోకి వెళ్లికూర్చుని మాట్లాడడానికి? కేటీఆర్ అమెరికా, హరీశ్ లండన్ వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. నాకు అమెరికా నుంచి ఆహ్వానం ఉంది. హార్వర్డ్లో విద్యార్థిగా చదివా. గతంలో మోదీపై తీవ్రమైన ఆరోపణలున్నాయని అమెరికాకు రానీయలేదు. మోదీ ప్రపంచంలోని అన్ని దేశాలు ప్రయాణం చేయొచ్చు.. ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండు’ అని సీఎం పేర్కొన్నారు. కిషన్రెడ్డి జన్మలో సీఎం కాగలడా? ‘కిషన్రెడ్డి ఎప్పుడు సీఎం అయ్యారు? ఆయన జన్మలో సీఎం కాగలరా? దేశంలో పీఎం, సీఎం, డీఎంలకు ఇతరులతో వేరే హోదా కలిగి ఉంటారు. కిషన్రెడ్డి ఏ హోదాలో అనుమతి కోరితే ఆయనకు అనుమతి నిరాకరించారో నాకు తెలియదు. సీఎంగా నేను విద్య, క్రీడలు, పెట్టుబడుల కోసం వెళ్తే మార్గమధ్యంలో తిరిగి రమ్మని చెప్పడంలో మతలబు ఏమిటి? ప్రొఫెసర్లు మాయా టుడోర్, దేవ్జీ యూకేలో ఉన్నారు. అనుమతి ఇచ్చారుగా? ఇందిరా హయాంలో 1975–76 మధ్య ఎమర్జెన్సీ కాలంలో, ఆ తర్వాత 2014లో మోదీ పీఎం అయ్యాక దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని మాయా ఓ జర్నల్కు వ్యాసం రాశారు. 56 ఇంచీల ఛాతీ అని చెప్పుకునే మీరు ఇతర దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉంటే ఈ అభిప్రాయాన్ని ఎందుకు మార్చలేరు? మోదీ ప్రధాని అయ్యాక పాకిస్తాన్కు ఎవరిని అడిగి వెళ్లారు? మీరు పాక్ వెళ్లి వారి ప్రధానిని అలింగనం చేసుకుని బిర్యానీ తినవచ్చు. అధికార పర్యటనకు సీఎం వెళ్లలేడు? అందుకే ఆమె ప్రజాస్వామ్యం క్షీణిస్తుందని రాశారు. నేనూ ఏకీభవిస్తున్నా. ఇది నియంతృత్వ నిర్ణయం’ అని సీఎం రేవంత్ అన్నారు. -
LIVE: సీఎం రేవంత్ సంచలన ప్రెస్ మీట్
-
కొండా సురేఖ విషయంపై సీఎం రేవంత్ స్ట్రాంగ్ రియాక్షన్
-
కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్ స్పందన ఇదే!
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ‘కొండా సురేఖ అంశం క్రమశిక్షణా కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మీడియా ముఖంగా మాట్లాడను.తీసుకునే నిర్ణయాలకు మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఆ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాల్సిందే’ అని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై ఆయన సోమవారం తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా నా విదేశీ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సరైనది కాదు. ఈ వైఖరిని అందరూ తప్పుబడుతున్నారు. ‘వికసిత్ భారత్’ ప్రణాళికలో భాగంగానే మేము ‘తెలంగాణ రైజింగ్ 2047’ను ప్రకటించాం. ముఖ్యంగా విద్యా, క్రీడా రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటనను తలపెట్టాం. లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం, అమెరికా వెళ్లేందుకు మాత్రం నిరాకరించింది.అమెరికా పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించలేదనే కారణంతోనే కేంద్రం అనుమతి నిరాకరించిందంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. కొందరు బీజేపీ నేతలు కావాలనే కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారు. నేను లండన్, అమెరికా పర్యటనల పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే అందించా.కేంద్రం కేవలం రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించింది. నా పర్యటనను అడ్డుకోవడం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని అవమానించడమే. కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలి. ఇది నాకు జరిగిన అవమానం కాదు.. తెలంగాణ జరిగిన అవమానం. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోంది. ఈ వివక్షను సహించేది లేదు. పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం. తెలంగాణ బీజేపీ ఎంపీలకు అభివృద్ధి అవసరం లేదా?. కేంద్రం తీరు సమాఖ్య స్పూర్తికి విరుద్ధం. ఒక రాష్ట్ర సీఎం పర్యటనను అడ్డుకోవడం ఆషామాషీ కాదు. నా పర్యటనను అడ్డుకోవచ్చు. కానీ ఆలోచనను కాదు. సీఎం పర్యటనను అడ్డుకోవడం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే. విదేశాల్లో ఉండి మాట్లాడితే దేశ ద్రోహి అనేవారు. అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా’ అని వ్యాఖ్యానించారు.(👉ఇదీ చదవండి: కొండా సురేఖ అంశం.. ఏం చేస్తే ఏమవునో ) -
రేవంత్ సర్కార్పై రాంచందర్రావు తీవ్ర ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తీవ్రంగా ఆరోపించారు. విద్యార్థులు, కాలేజీల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం ఒత్తిడికి గురిచేస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పినా.. ఆ హామీ కూడా అమలు కాలేదని ఆయన అన్నారు. బకాయిల కోసం విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తుంటే వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.రాహుల్ గాంధీకి సవాల్ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రాంచందర్రావు టార్గెట్ చేశారు. “రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణకు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్పై మాట్లాడాలి” అంటూ సవాల్ విసిరారు. దేశంలో యువతను రెచ్చగొట్టి ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీకి ప్రయోజనాలు అందుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. విద్యార్థులకు మాత్రం ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.కాంగ్రెస్ను గద్దె దించాలిదేశ వ్యతిరేక శక్తులతో సీఎం రేవంత్రెడ్డి చేతులు కలుపుతున్నారని రాంచందర్రావు ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా తమ ప్రయోజనాల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల శక్తి ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: సెల్ఫీ కోసం వచ్చి రాహుల్కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా! -
కొండా సురేఖ ఇష్యూ.. రేవంత్ కీలక భేటీ!
సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటన రద్దు తర్వాత హైదరాబాద్కు తిరిగొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్లో నెలకొన్న పరిణామాలపై దృష్టి సారించారు. సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం, పార్టీలో క్రమశిక్షణ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో సీఎం రేవంత్రెడ్డి తన విదేశీ పర్యటనను కుదించుకుని లండన్ నుంచి తిరిగి వచ్చారు. అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి లభించలేదని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించగా.. కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాలపై తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై తిరిగి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని సీఎం రేవంత్ అన్నారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ ఫ్యామిలీ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్(చిట్టక్క) సీఎం రేవంత్ రెడ్డికి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తట్టుకోలేకపోతున్నారు. కూతురి వ్యాఖ్యలను ఖండించకపోగా.. నాకేం సంబంధం అన్నట్లు సురేఖ మాట్లాడటాన్ని కూడా అంగీకరించడం లేదు. ఇప్పటికే ఈ విషయమై క్రమశిక్షణా కమిటీకి వాళ్లంతా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంతో తమ అభిప్రాయాలను పంచుచుకోనున్నారు. మరోవైపు.. కొండా సురేఖ ఎపిసోడ్తో పాటు వనపర్తిలో చిన్నారెడ్డి-ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆదిలాబాద్ నేతలు కంది శ్రీనివాస్రెడ్డి-అల్లూరి సంజీవరెడ్డి గొడవ, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇటు.. కూతురు కొండా సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖ చిక్కుల్లో పడ్డారు. వివరణ కోరుతూ పీసీసీ ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె నిన్న బెంగళూరు వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిశారు. గంట పాటు వీళ్ల మధ్య భేటీ జరిగింది. మరోవైపు ఈ పరిణామాల మధ్య మంత్రి కొండా సురేఖ ఇవాళ సీఎంను కలుస్తారనే ప్రచారం సాగుతోంది. తన శాఖ సమీక్ష కోసం ఆమె సచివాలయానికి చేరుకునే అవకాశం ఉంది.దీంతో ఈ వరుస భేటీలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సాయంత్రం ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆయన స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.ఇదీ చదవండి: కొండా ఫ్యామిలీ వ్యవహారం.. ఏం చేస్తే ఏమవునో? -
ఖర్గేను కలిసిన సురేఖ.. నేడు రేవంత్ ప్రెస్మీట్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొనసాగుతున్న కొండా కుటుంబ వివాదం నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ నిన్న బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లిన ఆమె రాత్రి 8.45 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.బెంగళూరులో ఖర్గేతో భేటీ సందర్భంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను మంత్రి సురేఖ.. ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన తర్వాత అన్ని విషయాలను ఆయనతో మాట్లాడతానని కొండా సురేఖ పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, ఇటీవల పరకాలలో జరిగిన సభలో సీఎం ఏం మాట్లాడారు? ఆ తర్వాత తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు, తనకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులు, తానిచ్చిన సమాధానం, తనకు వ్యతిరేకంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎల్పీ వేదికగా పెట్టిన ప్రెస్మీట్, తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ వారు మాట్లాడిన మాటలు, ఆ తర్వాత తాను రెండోసారి క్రమశిక్షణ కమిటీకి రాసిన లేఖ, గతంలో వరంగల్ జిల్లాలో జరిగిన గొడవలు, ఆ సందర్భంలో పార్టీ, సీఎం వ్యవహరించిన తీరు గురించి ఖర్గేకు ఆమె వివరించినట్టు తెలిసింది. అయితే సురేఖ చెప్పిన వివరణ విన్న ఖర్గే ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. సుస్మిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేవిధంగా ఉన్నాయి కదా అని ప్రశ్నించిన ఖర్గే.. సీఎం గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడినట్టు సమాచారం. అన్ని విషయాలు పార్టీ పరిశీలిస్తుందని, సీఎం వచ్చాక మాట్లాడుదామని, మీనాక్షి నటరాజన్, మహేశ్గౌడ్లతో క్షుణ్ణంగా చర్చించాక ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: కొండా సురేఖ ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ రియాక్షన్ఇదిలా ఉండగా, లండన్ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. సీఎం రాకతో కొండా కుటుంబ వ్యవహారంపై తదుపరి పరిణామాలపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ సీఎంను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉందని, ఈ వ్యవహారంపై పార్టీ పరంగా కీలక నిర్ణయం వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా పర్యటన రద్దు కావడానికి గల కారణాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కారణంగానే తన పర్యటన రద్దయిందన్న అంశంపై కూడా సీఎం పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. -
నాణ్యమైన యూనిఫారాలు కూడా ఇవ్వలేరా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కనీసం నాణ్యమైన యూనిఫారాలు కూడా అందించలేని దుస్థితిలో ఉందని మాజీమంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. ‘ఊడిన కుట్లు.. కొలతల పాట్లు’అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో వచ్చిన కథనాన్ని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో యూనిఫారాలు అందలేదని, అందిన చోట్ల కూడా కొలతలు సరిగ్గా లేకపోవడంతోపాటు కుట్లు ఊడిపోతున్నాయని ఆరోపించారు. ఉతికితే రంగులు వెలిసిపోతున్నాయన్నారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు ఇవ్వాల్సి ఉండగా.. చాలాచోట్ల ఒక్క జత కూడా పూర్తిగా అందలేదని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా స్థానికంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. కమీషన్ల కోసం బడా కార్పొరేట్ల నుంచి నాసిరకం యూనిఫారాలు తెప్పించారని హరీశ్రావు ఆరోపించారు. రేవంత్రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న ప్రేమ తెలంగాణ చేనేత కార్మికులపై లేదని విమర్శించారు. ‘మఫత్లాల్ ముద్దు.. చేనేత వద్దు’ అన్నదే ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. ఒకవైపు చేనేత కార్మికుల ఉపాధికి గండి పడుతుండగా.. మరోవైపు విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందుతున్నాయన్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు, చేనేత కార్మికులకు ఉపాధి నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. నాసిరకం యూనిఫారాల వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్రెడ్డీ? ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడంలో సిబ్బందికి జీతాలు చెల్లించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ‘ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష రేవంత్రెడ్డీ? ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆవేదన వింటే గుండె కలిచి వేస్తోంది. నెలల తరబడి జీతాల్లేకుండా సిబ్బంది ఎలా బతకాలి? పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించాలి? ప్రతి నెలా 1వ తేదీకే వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ, ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయడం లేదు’అని ఆదివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని గొప్పగా ప్రకటించారని, అది ప్రకటనలకే పరిమితమైందని హరీశ్ ఆరోపించారు. -
లండన్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి ‘మీట్ అండ్ గ్రీట్’
లండన్: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లండన్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులు, ఇండియన్, తెలుగు కమ్యూనిటీ ప్రతినిధులతో ప్రత్యేక ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ లండన్లోని ప్రముఖ తాజ్ హోటల్లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్నారై కన్వీనర్, ఇండియన్ కమ్యూనిటీ నాయకుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూకేలోని తెలుగు కమ్యూనిటీ నాయకులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రవాస తెలంగాణ సమాజంతో ప్రభుత్వ అనుసంధానం, భవిష్యత్ కార్యాచరణ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవాసులతో ముఖాముఖిగా చర్చించారు. రాష్ట్ర ప్రగతికి ప్రవాసుల అనుభవం, నైపుణ్యం, పెట్టుబడులు, ఆలోచనలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.తెలంగాణ రైజింగ్కు ప్రవాసులు భాగస్వాములు కావాలిసీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైజింగ్’కు ప్రవాస భారతీయులు బలమైన మద్దతుదారులుగా, రాయబారులుగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక, ఆవిష్కరణల శక్తి కేంద్రంగా తెలంగాణ ఎదుగుతున్న ప్రయాణంలో ప్రవాసులు చురుకైన భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు.ఎన్నారైలు, పెట్టుబడిదారులు, వివిధ రంగాల నిపుణులతో స్వయంగా మమేకమైన సీఎం.. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే కొత్త ఆలోచనలు, సూచనలు అందించాలని కోరారు. ప్రవాస తెలంగాణ సమాజం మధ్య నెట్వర్క్ను మరింత బలోపేతం చేయడం ద్వారా తెలంగాణలో కొత్త అవకాశాలను సృష్టించేందుకు కలిసి పనిచేయాలని సూచించారు.పెట్టుబడులు, విద్యపై ప్రత్యేక దృష్టికార్యక్రమంలో పెట్టుబడులు, విద్యారంగం, ఎన్నారైలతో తెలంగాణ ప్రభుత్వ అనుసంధానం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. యూకే, యూరప్లో ఉన్న పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా మరింత అనుకూల వాతావరణం కల్పించడం, విద్యారంగంలో అంతర్జాతీయ అనుభవాన్ని రాష్ట్రానికి అనుసంధానం చేయడం, ప్రవాస నిపుణుల సేవలను తెలంగాణ అభివృద్ధికి వినియోగించుకోవడం వంటి అంశాలపై చర్చ జరిగింది.సీఎం రేవంత్ రెడ్డిపై సుధాకర్ గౌడ్ ప్రశంసలుకార్యక్రమ నిర్వాహకుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ఎన్నారై కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి లండన్తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. గతంలో లండన్ పర్యటన సందర్భంగా గల్ఫ్ ఎన్నారైలకు ఇచ్చిన హామీని నెరవేర్చిన విషయాన్ని ప్రస్తావించారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని, ఆయనకు లండన్లోనే కాకుండా యూకేలోని ప్రవాస భారతీయులు, తెలంగాణ సమాజంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని సుధాకర్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆయనకు అండగా నిలిచే అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని అన్నారు.ఎన్నారైలకు తెలంగాణ ప్రభుత్వంతో మరింత బలమైన కనెక్టివిటీయూకేలో ఉన్న పెట్టుబడులు, విద్యా అవకాశాలు, ఎన్నారైల అవసరాలకు తెలంగాణ ప్రభుత్వంతో నేరుగా అనుసంధానం కల్పించేలా ఒక బలమైన వారధి ఉండాలని సుధాకర్ గౌడ్ కోరారు. యూకేలోని తెలంగాణ సమాజం, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో మరింత సమన్వయంతో పనిచేసేలా ప్రత్యేక వ్యవస్థ అవసరమని సూచించారు.ఈ ప్రతిపాదనపై మంత్రి శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సుధాకర్ గౌడ్ తెలిపారు. డిసెంబర్లో నిర్వహించనున్న తదుపరి గ్లోబల్ సమ్మిట్ బిజినెస్ మీట్కు యూకేలోని పెట్టుబడిదారులు, నిపుణులను ఆహ్వానిస్తామని వారు వెల్లడించినట్లు చెప్పారు.మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎన్నారై పాలసీ, ఇన్వెస్ట్మెంట్ పాలసీ గురించి సవివరంగా వివరించారు. అలాగే యూకే, యూరప్కు భారత్తో వేగవంతమైన కనెక్టివిటీ ఉన్నందున, అక్కడి ఎన్నారైలు, పెట్టుబడిదారులు, నిపుణులకు అనుకూలంగా ప్రత్యేక విధివిధానాలను రూపొందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.విద్యారంగంపై ప్రశ్నోత్తరాల సెషన్కార్యక్రమంలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల సెషన్లో తెలంగాణ విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడం వంటి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నారైలు, విద్యావేత్తలతో సుదీర్ఘంగా చర్చించారు.విదేశాల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నిపుణుల అనుభవం, జ్ఞానం, ఆలోచనలను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించుకునేలా ప్రభుత్వం, ప్రవాస తెలంగాణ సమాజం మధ్య మరింత సమన్వయం అవసరమని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.‘లెట్స్ యునైట్.. లెట్స్ ఎంగేజ్.. లెట్స్ బిల్డ్ ఎ బెటర్ తెలంగాణ’“Let’s Unite. Let’s Engage. Let’s Build a Better Telangana” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రవాస తెలుగువారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, విదేశాల్లోని నిపుణుల అనుభవాన్ని తెలంగాణ ప్రగతికి వినియోగించుకోవడం, ప్రభుత్వంతో ప్రవాస సమాజానికి మరింత బలమైన అనుసంధానం కల్పించడం వంటి అంశాలపై సమావేశం ద్వారా స్పష్టమైన దిశ ఏర్పడింది.సుధాకర్ గౌడ్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ ‘లండన్ మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం ప్రవాస తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు పెట్టుబడులు, విద్య, నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవాలను రాష్ట్ర ప్రగతికి అనుసంధానం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా మారింది. -
నేడు రేవంత్ రాక.. కొండా ఫ్యామిలీ ఎపిసోడ్పై బిగ్ సస్పెన్స్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సీరియల్ ఎపిసోడ్లా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్టాపిక్గా మారింది. సొంత పార్టీ నేతలే తనపై విమర్శలు చేస్తున్నా పార్టీ అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖాస్త్రం సంధించడం చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ, కొండా మురళి వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణ కమిటీ మరోసారి ఈ అంశాన్ని చర్చించనుంది. తదుపరి సమావేశంలో కొండా వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.మరోసారి లేఖాస్త్రం..తనపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేస్తున్న తనపై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా అధిష్ఠానం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తనపై వస్తున్న విమర్శల విషయంలో పార్టీ నాయకత్వం స్పందించాలని ఆమె కోరినట్లు సమాచారం.ఇది కూడా చదవండి: కొండా సురేఖపై చర్యలు.. కాంగ్రెస్లో తర్జనభర్జనకొండాపై గరం..మరోవైపు కొండా కుటుంబం తీరుపై కాంగ్రెస్లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేతలు కొండా కుటుంబం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొందరు మరో అడుగు ముందుకేసి పార్టీ నుంచి బయటకు వెళ్లాలని అల్టిమేటం ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం వ్యక్తిగత విమర్శల స్థాయి దాటి పార్టీ అంతర్గత క్రమశిక్షణ అంశంగా మారింది.సీఎం రాగానే కీలక పరిణామాలు?ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో ఉండగా.. నేడు రాత్రి ఆయన హైదరాబాద్కు తిరిగి రానున్నారు. సీఎం రాకతో కొండా వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో.. సీఎం సమక్షంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత.. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూపులు.. ఇంకోవైపు మంత్రి కొండా సురేఖ వరుస లేఖలు.. ఇలా కాంగ్రెస్లో కొండా ఫ్యామిలీ ఎపిసోడ్ ఉత్కంఠ రేపుతోంది. క్షమాపణ చెబుతారా? పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది. సీఎం హైదరాబాద్కు తిరిగొచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపు తిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. -
మన చదువులకు కేం'బ్రిడ్జ్'
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో లండన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం శనివారం ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యావేత్తలతో సమావేశమైంది. తెలంగాణలో విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై విస్తృతంగా చర్చించింది. హైదరాబాద్లో విద్యా కార్యక్రమాలతోపాటు పరిశోధనల నిర్వహణ, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, స్టార్టప్ల అభివృద్ధికి సహకారం వంటి రంగాల్లో తెలంగాణ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కలిసి పనిచేసేందుకు ఒక ప్రత్యేక సహకార వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించాయి. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో భారత ప్రభుత్వం తరఫున సేవలందిస్తున్న మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, అదే సంస్థకు చెందిన కో–చైర్, ‘ఫ్రూగల్ ఏఐ’ సహ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ వెంకట శిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న అవకాశాలపై వారు సానుకూలంగా స్పందించారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలకు హైదరాబాద్లో ఉన్న అవకాశాలను తెలంగాణ రైజింగ్ బృందం.. కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించింది. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో తెలంగాణ భాగస్వామ్యానికి ఈ చర్చలు కొత్త మార్గం చూపనున్నాయి. హైదరాబాద్ను అంతర్జాతీయ విద్య, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తెలంగాణ రైజింగ్ లక్ష్యానికి ఈ సమావేశం మరింత బలం చేకూర్చనుందని సీఎంఓ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. అక్టోబర్లో రాష్ట్రానికి లివర్పూల్ బృందం... లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ రంగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్పూల్ సంస్థ ఆసక్తి చూపింది. లివర్పూల్ సిటీ డెవలప్మెంట్ విభాగానికి చెందిన సుసాన్ ఫిన్నెగాన్, నూలా గల్లాఘర్, లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్కు చెందిన పలువురు ప్రతినిధులు లండన్లో సీఎం రేవంత్రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. లివర్పూల్తో భాగస్వామ్యాన్ని అధికారికంగా ఖరారు చేయడానికి ఆ సంస్థ ప్రతినిధి బృందం అక్టోబర్లో హైదరాబాద్ను సందర్శించనుంది. ఇంపీరియల్ కళాశాల ఆధ్వర్యంలో షార్ట్ కోర్సులు.. హైదరాబాద్ సహా తెలంగాణలో షార్ట్టర్మ్ కోర్సులు, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని లండన్లోని ప్రతిష్టాత్మక ఇంపీరియల్ కళాశాల అధ్యక్షుడి చీఫ్ ఆఫ్ స్టాఫ్, స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అమాండా వోల్తుయిజెన్ తెలిపారు. పరిశోధన రంగంలో భాగస్వామ్యం, విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాలపై కలిసి పనిచేసేందుకు ఆసక్తి ఉందని వెల్లడించారు. లండన్లోని ఇంపీరియల్ కళాశాలను సీఎం సలహాదారు కె.రామకృష్ణారావు సందర్శించి అమాండా వోల్తుయిజెన్, దక్షిణాసియా, ఆస్ట్రాలాసియా ప్రాంతాల సీనియర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మేనేజర్ రొసాన్నా గిల్లెస్పీతో సమావేశమయ్యారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు విచ్చేయాలని ఇంపీరియల్ కళాశాల ప్రతినిధులను ఆహ్వానించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ (స్టెమ్), బిజినెస్ ఎడ్యుకేషన్ రంగాల్లో ఇంపీరియల్ కాలేజీ ప్రపంచంలోనే ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. -
ఏం చేస్తే.. ఏమవునో!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా అటవీ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ కుటుంబమే కేంద్రంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయం చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సృష్టించిన వ్యాఖ్యల కలకలం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో ఉంది. సురేఖను బర్తరఫ్ చేస్తారని, మంత్రి పదవి నుంచి తీసేస్తారని, ఇందుకు అధిష్టానంతో రేవంత్ సంప్రదింపులు జరుపుతున్నారని, లేదంటే ఆమెతో రాజీనామా చేయిస్తారని సీఎం వర్గం ప్రచారం చేస్తున్నా... అసలు ఏం చేయాలనే విషయంలో మాత్రం అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వం తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలుస్తోంది. బీసీ వర్గాలకు చెందిన మహిళా మంత్రి కావడం, ఇదే సమయంలో మరికొందరు ముఖ్య నేతలు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతోంది. రేవంత్ విదేశీ పర్యటనలో ఉండగా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వచ్చే నెల 2 వరకు అందుబాటులో ఉండరన్న ఢిల్లీ వర్గాల సమాచారం నేపథ్యంలో ఈ ఎపిసోడ్ మరికొన్ని రోజులు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం వర్గం అప్రమత్తం సీఎం రేవంత్రెడ్డి సన్నిహితులైన ఎమ్మెల్యేలు, నేతలు కొండా ఎపిసోడ్లో తమ వంతు పావులు కదుపుతున్నారు. రేవంత్ సన్నిహితుడైన ఎంపీ వేం నరేందర్రెడ్డి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కుటుంబ ఎపిసోడ్ను ఎలా ముగించాలన్న దానిపైనే ఎక్కువగా చర్చ జరిగినట్టు తెలిసింది. ఆమెను తప్పించేలా అధిష్టానాన్ని ఒప్పించాలా లేదంటే ఆమెతో రాజీనామా చేయించాలా లేదా మరో మార్గంలో అంతర్గతంగా ఏదైనా సర్దుబాటు చేయాలా అనే కోణంలోనే ఈ చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే, రేవంత్ ఆదివారం అర్ధరాత్రి దాటాక హైదరాబాద్కు రానుండటంతో ఆయన వచ్చిన తర్వాత ఈ ఎపిసోడ్లో ఎలాంటి సంకేతాలిస్తారన్నది కీలకంగా మారనుంది. ఆయన్ను కలిసి మాట్లాడతానని సురేఖ చెప్పిన నేపథ్యంలో ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తారా లేదంటే అధిష్టానం పెద్దలతో మాట్లాడతారా? తనకు బహిరంగంగా మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యేలకు ఆయన ఏం చెప్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేవంత్కు మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. సురేఖతో పాటు రాజగోపాల్రెడ్డి, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుపడుతున్నారు. కానీ, రేవంత్ కేబినెట్ సహచరులెవరూ ఇప్పటివరకు బహిరంగంగా ఈ అంశంపై మాట్లాడకపోవడం రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. అన్నీ పరిశీలించాకే తుది నిర్ణయం: క్రమశిక్షణ కమిటీ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ శనివారం గాం«దీభవన్లో సమావేశమైంది. చైర్మన్ మల్లురవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కమిటీ సభ్యులు శ్యాంమోహన్ తదితరులు పాల్గొని కమిటీ ముందు పెండింగ్లో ఉన్న పలు అంశాలపై చర్చించారు. రేవంత్నుద్దేశించి సుస్మితా పటేల్ మాట్లాడిన వీడియోను పరిశీలించారు. వనపర్తి నియోజకవర్గం విషయంలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మాట్లాడిన వీడియోలను కూడా పరి«శీలించారు. అనంతరం మల్లురవి మీడియాతో మాట్లాడుతూ.. తమ నోటీసుకు సురేఖ ఇచ్చిన సమాధానాన్ని, సుస్మిత మాట్లాడిన వీడియోను కమిటీ పరిశీలించిందని చెప్పారు. ‘ముఖ్యమంత్రిని ఒక మామూలు వ్యక్తి కంటే తక్కువగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఈ వీడియోలో కనపడుతోంది. సురేఖ ఇచ్చిన వివరణ చదివిన తర్వాత మరోమారు సమావేశమై పరిశీలించాం. ఎమ్మెల్యేలు కూడా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు ఇస్తామని చెప్పారు. కాబట్టి తుది నిర్ణయం తీసుకోకుండా, అందరి ఫిర్యాదులు స్వీకరించి వాటిపై కమిటీలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సీఎం గురించి ఎవరు మాట్లాడినా ఖండించాల్సిన బాధ్యత సురేఖపై ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆమె మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుంది’అని వెల్లడించారు. వనపర్తి విషయంలో కూడా ఇద్దరు నేతలు మాట్లాడిన మాటలను కూడా పరిశీలించామన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు, ఎమ్మెల్యే ఫిర్యాదుకు తేడా ఉందని, మరోమారు ఎమ్మెల్యేను పిలిచి వివరణ తీసుకుంటామన్నారు. ఆదిలాబాద్లో జరిగిన పీఏసీ సమావేశం ఘటన గురించి కంది శ్రీనివాస్రెడ్డి వివరణ ఇచ్చారని, డీసీసీ అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎల్బీనగర్ నేత జక్కిడి ప్రభాకర్రెడ్డి సస్పెన్షన్ గురించి తప్పనిసరి పరిస్థితుల్లోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో వచ్చిన ఫిర్యాదులపై షోకాజ్ ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మాకు ఎవరిపై ప్రేమ ఉండదు... తమకు పార్టీ నేతలెవరిపై వ్యక్తిగతంగా ప్రేమ, వ్యతిరేకత ఉండవని మల్లురవి స్పష్టం చేశారు. ‘మేం తీసుకునే ప్రతి చర్య కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు దిశలోనే ఉంటుంది. పార్టీకి నష్టం జరిగితే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ , కేబినెట్ హోదాలో ఉన్న చిన్నారెడ్డిలకు నోటీసులిచ్చాం. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రస్తావన ఎమ్మెల్యేల మాటల్లో వచ్చింది కానీ ఫిర్యాదు మా దగ్గరకు రాలేదు. రాజగోపాల్రెడ్డి మాట్లాడింది నాకు తెలియంది కాదు కానీ పద్ధతి ప్రకారం నాకు ఫిర్యాదు రాలేదు. సుమోటోగా తీసుకోవాలా వద్దా అన్నది పరిశీలిస్తున్నాం. ఎవరైనా సరే క్రమశిక్షణ కమిటీ దృష్టిలో వ్యక్తులు ముఖ్యం కాదు. పార్టీనే ముఖ్యం. ప్రధాని అయినా, ముఖ్యమంత్రి అయినా పార్టీ వల్లనే. పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా ఎవరూ మాట్లాడకూడదు’అని ఆయన స్పష్టం చేశారు. మరో లేఖ రాసిన సురేఖ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ శనివారం మరో లేఖ రాశారు. ‘క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసుకు నేను వివరణ ఇచ్చాను. అయినా కొందరు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా అవమానించేలా మాట్లాడుతున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే నాపై బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, నాపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలి. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది’అని లేఖలో పేర్కొన్నారు. పార్టీ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సురేఖ కోరడం కొసమెరుపు. చిన్నారెడ్డి వివరణ వనపర్తి ఎమ్మెల్యే కారణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న అంశాలను మాత్రమే తాను గోపాల్పేట సమావేశంలో ప్రస్తావించానే తప్ప ఎవరినీ కించపర్చలేదని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి క్రమశిక్షణ కమిటీకి నివేదించారు. కాంగ్రెస్ పార్టీ దేవాలయమని, నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేలు తనకు దేవుళ్ల లాంటి వారని, తాను పార్టీని, పార్టీ నాయకులను ఎక్కడా విమర్శించలేదని పేర్కొన్నారు, ఎమ్మెల్యే ఒంటెత్తుపోకడలతో 40 ఏళ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలు పడుతున్న బాధలనే ప్రస్తావించానని అన్నారు, తనకు ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోవాలని కోరారు.


