breaking news
Revanth Reddy
-
కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్..అధికార పక్షంవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు..అసెంబ్లీలో అధికార పక్షం వైపు కూర్చున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలుఇటీవల పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని కాలే యాదయ్యను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికాంగ్రెస్ వైపే కూర్చుంటానన్న కాలే యాదయ్యఅసెంబ్లీలో ఆసక్తికర పరిణామంఅసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామంBJLP చాంబర్ లోకి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్అదే సమయంలో బయటికి వెళ్తూ గమనించిన కేటీఆర్సస్పెండ్ అయిన వ్యక్తి BJLPలోకి ఎలా అంటూ సెటైర్ వేసిన కేటీఆర్BJLP నుంచి బయటికి రా అంటూ రాజాసింగ్ను సరదాగా అన్న కేటీఆర్మీరు కూడా BJLP చాంబర్లోకి రండి అంటూ ఆహ్వానించిన పాయల్ శంకర్నేను వస్తే మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయిన కేటీఆర్ తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదాతెలంగాణ శాసనసభ నుంచి ఎంఐఎం వాకౌట్.వందేమాతరం గీతం అసెంబ్లీలో ప్రదర్శించినందుకు వాకౌట్ముగిసిన గవర్నర్ ప్రసంగం.. తెలంగాణ శాసనసభలో ముగిసిన గవర్నర్ స్పీచ్.గంట పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో సాగిన ప్రసంగం.కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది: గవర్నర్విజన్-2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్ రూపొందించాం.రాష్ట్ర తలసరి ఆదాయం 4.18 లక్షలకు చేరింది.క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు.రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ అనుసరిస్తున్నాం.2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా.జీహెచ్ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా విభజించాం.హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం.హైడ్రా ద్వారా 1,045 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం.హైడ్రా ద్వారా 60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడాం.కొండగల్ ప్రాంతం పారిశ్రామికవాడగా మారబోతోంది.23వ బయోఆసియా సదస్సు ద్వారా 1,700 కోట్ల పెట్టబడులు ఆకర్షించాం.1.61 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతో రాష్ట్రంలో ఏడో స్థానంలో ఉంది.సేవారంగం 13.5 శాతం వృద్ధితో దోహదపడుతోంది.జీసీసీలలో 20 శాతం ఆతిథ్యం ఇస్తూ హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్గా మారింది.ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్య స్థానంగా కొనసాగుతోంది.ఐటీ ఎగుమతులు 3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయి.ఐటీ రంగం 9.39 లక్షల ఉద్యోగాలు కల్పిస్తోంది.వ్యవసాయరంగ అభివృద్ధికి రేర్ నమూనా రూపొందించాం. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నిరసన.జూట్ అంటూ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.ప్రసంగంలో పథకాల అమలు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ జూట్ అంటూ నిరసన.గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉభయ సభలను ఉద్దేశించి మొదలైన గవర్నర్ ప్రసంగంతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంతెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు హాజరు.అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలునల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్న అసెంబ్లీ, మండలి.కాసేపట్లో అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా విగ్రహావిష్కరణ.మధ్యాహ్నం రెండు గంటలకు బీఏసీ సమావేశం.పని దినాలు, అజెండాపై బీఏసీలో చర్చ. అసెంబ్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. గన్పార్క్కు బీఆర్ఎస్ నేతలు..కేటీఆర్ ఆధ్వర్యంలో గన్ పార్క్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలురైతులకు వెన్నుపోటు.. రాహుల్కు వెయ్యి కోట్లు అంటూ నినాదులురాహుల్ బందు కాదు.. రైతుబందు కావాలి అంటూ నినాదులుఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించాలని ప్లకార్డులతో నిరసనకాంగ్రెస్ హఠావో.. తెలంగాణ బచావో అంటూ నినాదాలు. అసెంబ్లీలో మంత్రుల చాంబర్లు మార్పు..తెలంగాణ శాసనసభలో మారిన పలువురు మంత్రుల చాంబర్లు.లాబీలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కు మంత్రుల చాంబర్లను షిఫ్ట్ చేసిన అధికారులు.మంత్రులు తుమ్మల, దామోదర రాజనర్సింహ చాంబర్లను ఫస్ట్ ఫ్లోర్కు తరలింపు.ఫస్ట్ ఫ్లోర్లో మంత్రి సీతక్క చాంబర్ మార్పు.సీతక్క చాంబర్ను మంత్రి తుమ్మలకు కేటాయింపు.సీతక్కకు సీపీఐ ఛాంబర్ పక్కన బ్యాక్ సైడ్ కేటాయింపు.చాంబర్ల మార్పు స్పీకర్ నిర్ణయం అంటున్న అసెంబ్లీ అధికారులు. కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..తెలంగాణ శాసనసభ నిబంధనలపై బులిటెన్ విడుదలఉదయం 11:45 గంటలకు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ప్రారంభంఎమ్మెల్యేలు గేట్ నెం.2, గేట్ నెం.4 ద్వారా ప్రవేశంవాహనాలపై అసెంబ్లీ కార్ పాస్ తప్పనిసరిగేట్ నెం.1, 2, 4 వద్ద వాహనాల సెక్యూరిటీ చెకింగ్స్వయంగా నడిపే వాహనాలకు మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలో అనుమతిడ్రైవర్తో వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ఎమ్మెల్యేలు ఆయుధాలు తీసుకురావడం పూర్తిగా నిషేధంఅసెంబ్లీ లోపల మొబైల్తో ఫొటోలు, వీడియోలు నిషేధంస్పీకర్ అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం నిషేధంఅసెంబ్లీ ప్రాంగణంలో నినాదాలు, నిరసనలు పూర్తిగా నిషేధంసమావేశం జరుగుతున్న సమయంలో మీడియా పాయింట్ వినియోగం నిషేధంటీ/లంచ్ బ్రేక్ సమయంలో మాత్రమే మీడియా పాయింట్ వినియోగంఅసెంబ్లీ లాబీల్లో అధికారిక ఫోటోగ్రాఫర్లకు మాత్రమే అనుమతిమాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు లోపల లాబీల్లో ప్రవేశం లేదుమండలి చైర్మన్ కీలక ఆదేశాలుతెలంగాణ శాసన మండలి సమావేశాల నేపథ్యంలో చైర్మన్ కీలక ఆదేశాలుఉదయం 11:45కి తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ 26వ సెషన్ ప్రారంభంకౌన్సిల్ ప్రాంగణంలో పబ్లిక్ మీటింగ్స్ నిర్వహణ నిషేధంఆయుధాలు, బ్యానర్లు, ప్లకార్డులు తీసుకురావడం నిషేధంనినాదాలు, ప్రసంగాలు చేయడం నిషేధంప్రదర్శనలు, ర్యాలీలు, ధర్నాలు పూర్తిగా నిషేధంఇతర సభ్యులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయరాదుచైర్మన్ అనుమతి లేకుండా మొబైల్, ల్యాప్ టాప్లలో వీడియోలు లేదా ఫొటోలు చూపరాదుకౌన్సిల్ ప్రాంగణంలో సభ్యులు సందర్శకులను తీసుకురావద్దని ఆదేశంకౌన్సిల్ లోపలికి సభ్యుల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అనుమతి లేదుసభ్యులు తమ సెక్యూరిటీ సిబ్బందిని బయటే ఉంచాలని సూచనకార్ పాస్ తప్పనిసరిగా వాహనం ముందు ప్రదర్శించాలిసభ్యుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్ ఏర్పాటుసభ్యుల పీఏలు తమ పార్టీ కార్యాలయాల వరకు మాత్రమే అనుమతి -
ఐకమత్యమే అభివృద్ధికి ఇంధనం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై గంగా–జమునా తెహజీబ్ వర్ధిల్లుతోందని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండటమే రాష్ట్ర అభివృద్ధికి అసలైన ఇంధనమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. దేశంలో మతపరమైన విభజనలకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ మత సామరస్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడ అశాంతి నెలకొన్నా, మన రాష్ట్రంలో మాత్రం మత సామరస్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన రంజాన్ ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మైనారిటీలకు పెద్దపీట మైనారిటీల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజకీయంగా, పరిపాలనలో పెద్దపీట వేస్తున్నామని సీఎం చెప్పారు. ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడిన మహమ్మద్ అజహరుద్దీన్ను మైనారిటీ శాఖ మంత్రిగా నియమించుకున్నామని, అదనంగా 8 మంది మైనారిటీ నేతలకు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా అవకాశం కల్పించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత షబ్బీర్ అలీ సేవలను గుర్తిస్తూ ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించుకున్నామని తెలిపారు. ఆ 4 శాతం రిజర్వేషన్ల వల్లే వేలాది మంది ముస్లిం యువకులు డాక్టర్లు, ఇంజనీర్లుగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ఖ్యాతిని చాటిన క్రికెటర్ సిరాజ్, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్లను డీఎస్పీలుగా నియమించడమే కాకుండా, వారికి భారీగా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచామని పేర్కొన్నారు. సేవా భావానికి ప్రతీక రంజాన్ రంజాన్ కేవలం పండుగ మాత్రమే కాదు.. అది క్రమశిక్షణ, ఆత్మశుద్ధి మానవతా విలువలను గుర్తు చేసే పవిత్ర మాసం అని రేవంత్రెడ్డి అన్నారు. ఒక నెల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేస్తూ, తోటి వారికి సహాయం చేయడమే ఈ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకంలో మైనారిటీలకు సింహభాగం దక్కేలా చూస్తున్నామని, తెలంగాణ అభివద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని, మీ దువా (ప్రార్థనలు) రాష్ట్రానికి రక్షణ కవచంలా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అజహరుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, వేలాది మంది మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్ పాలనపై తిరగబడే కాలం వచ్చింది’
హైదరాబాద్: ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్కు అతిగతి లేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారుస్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమం మాటల్లోనే తప్ప పనుల్లో కనిపించడం లేదనీ, రాబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు.అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతా అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హరీశ్ రావు గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నక్క మల్లేష్ గౌడ్, కాసా ధనుంజయ్ గౌడ్, నక్క పవన్ గౌడ్, నక్క చరణ్ గౌడ్, నక్క వికాస్ గౌడ్, కాసా వినయ్ గౌడ్, పట్లోళ్ల తిరుపతి రెడ్డి, నక్క వీర స్వామి గౌడ్, నక్క సాయి గౌడ్, బచ్చుగూడెం ఎల్లయ్య యాదవ్, కాసా రాజు గౌడ్, అత్తెల్లి శ్రీకాంత్ రెడ్డి, పెద్దోళ్ల రాజు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. -
‘మూసీ’.. కాంగ్రెస్ భూ ఆక్రమణ పథకం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16వేల కోట్లతో ఒక్క ఇల్లూ కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కి.మీ. మేర విజయవంతంగా అభివృద్ధి చేశామన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శనివారం హిమాయత్ సాగర్ వేదికగా ‘మూసీ పునరుజ్జీవం– పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్‘కార్యక్రమాన్ని కేటీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ప్లానింగ్ రిపోర్టు లేకుండా సోషల్ ఇంపాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు లేకుండా, ప్రజలతో చర్చలు నిర్వహించకుండా వేలాదిమంది ఇళ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘అభివృద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు. అవినీతికి, కాంగ్రెస్ భూదాహానికి, రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకం. రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకుంటాం. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటాం. బాధితుల వెంట బీఆర్ఎస్ ఉంటుంది’అని కేటీఆర్ చెప్పారు. రెండేళ్లపాటు మూసీ బాధితులు సమష్టిగా ప్రభుత్వంపై పోరాడితే, తమ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యాన్ని పారదోలి అందరి ఇళ్లు, భూములను కాపాడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవన్నారు.. ఇచ్చిన హామీలకు, అభివృద్ధికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతానంటున్నాడని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘రూ.లక్షన్నర కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారు... అందాల పోటీలకు, ఫుట్బాల్ ఆటలకు వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ తీరు తయారైంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పీపీటీ ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పీపీటీ ఇచ్చాడు’అని విమర్శించారు. రూ.లక్షన్నర కోట్లు ఎందుకు? నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసీ సర్వనాశనమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి రేవంత్రెడ్డి ముక్కు నేలకి రాసి, ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోవాలని హితవు పలికారు. వందల కిలోమీటర్ల నమామి గంగే పథకానికి కేవలం రూ.42 వేల కోట్లు వ్యయమైతే, 55 కి.మీ. మూసీకి రూ.లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోబోమన్నారు. మూసీ పేరుతో రూ.వేల కోట్ల సొమ్మును దోచుకుంటామంటే మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ ఆయన పేరుతో మూసీలో దోపిడీ చేయొద్దని విజ్ఞప్తి చేసినా రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఎవరూ అడ్డుకోవద్దని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టే కుట్ర చేస్తున్నాడని చెప్పారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6 కి.మీ. మూసీని విజయవంతంగా అభివృద్ధి చేసిందని, అయినా కాంగ్రెస్ మాదిరి ప్రచారం చేసుకోలేకపోయామన్నారు.మా అంచనా వ్యయం 16 వేల కోట్లు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని కేటీఆర్ తెలిపారు. దాని కోసం కేవలం రూ.1100 కోట్లతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఇదే కార్యక్రమానికి రూ. 10 వేల కోట్లకు అంచనాలు పెంచిన రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా అవినీతి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మూసీని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తమకు వచ్చిన అంచనా వ్యయం రూ. 16 వేల కోట్లు మాత్రమే కాగా, రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారన్నారు. బఫర్ జోన్తో భయపెట్టి.. ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్లో ఉంది కదా., దాని గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ల సోదరుడి ఇల్లు హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉంది. మంత్రుల ఫామ్హౌస్లు, ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నా.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’అని పేర్కొన్నారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్మెంట్లు, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జో¯న్లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్మెంట్లను మాత్రం ముట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.3,300 ఎకరాలపై కన్నేసి.. రేవంత్ 3,300 ఎకరాల భూమిపై కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ మొత్తం భూముల విలువ రూ.1,50,000 కోట్లని, ఇందుకోసమే రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారన్నారు. డిజైన్ చేసే కంపెనీకే రూ.160 కోట్లు ఇచ్చారంటే, ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రేవంత్రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంత ఉందో కూడా అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్వామి గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ.. నా నెక్స్ట్ స్టెప్ అక్కడికే
-
నగరంలో నయా ప్రపంచం
నిజాం నగరంలో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతం కానుంది. కుతుబ్ షాహీ కాలంలో అభివృద్ధి చెందిన భాగ్యనగరంలో మూసీ నది నీటిని తాగునీటితోపాటు వ్యవసాయం, వర్తకానికి వినియోగించేవారు. 300 ఏళ్లకుపైగా చరిత్రగల మూసీ భాగ్యనగరికి వెన్నెముకగా నిలిచింది. కానీ కాలక్రమేణా పట్టణీకరణ, ఆక్రమణలు, మురుగు, వ్యర్థాల పారబోత, నిర్లక్ష్యం తదితర కారణాలతో జీవం కోల్పోయిన మూసీ నదికి పునరుజ్జీవం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత తరుణంలో మూసీ పునరుద్దరణ ఒక ఎంపిక కాదు ఆవశ్యకతగా మారింది. ప్రభుత్వం మూసీని ఆర్థిక, సాంస్కృతిక, విద్య, పర్యాటక, వినోద రంగంగా అభివృద్ధి చేయనుంది. మాస్టర్ ప్లాన్, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను సిద్ధం చేసింది. మూసీ ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై ఈ మేరకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) ఎండీ నర్సింహారెడ్డి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. – సాక్షి, హైదరాబాద్ఐదు జోన్ల అద్భుతం.. తొలిదశలో ఉస్మాన్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 21 కి.మీ. మేర మూసీని అభివృద్ధి చేయనున్నారు. దశలవారీగా గండిపేట నుంచి గౌరెల్లి వరకు మొత్తం 55 కి.మీ. మేర మూసీ అభివృద్ధి జరుగుతుంది. ఎకోలాజికల్, హెరిటేజ్, ఫ్యూచర్ జోన్ వర్గాలవారీగా వాటిని అభివృద్ధి చేస్తారు. నది ప్రక్షాళనలో భాగంగా మూసీలో పేరుకుపోయిన పూడికతీత, చెత్త తొలగించి హైడ్రాలజీ అధ్యయనంతో నదీ గర్భానికి రూపకల్పన చేసి పరిధులను నిర్ణయిస్తారు. వరదల నివారణ, నదీ తీర వాలు స్థిరీకరణ చేస్తారు. అలాగే నదీ తీరం ఇరువైపులా రహదారుల నిర్మాణం, ప్రధాన మురుగునీటి పైప్లు, ఇరువైపులా వర్షపు నీటి కాలువలు, నాలాల నిర్మాణంతోపాటు రిజర్వాయర్లు, బ్యారేజీల వంటి నీటి నిల్వ నిర్మాణాలతో నదీ తీరాన్ని అభివృద్ధి చేస్తారు. తొలిదశ అభివృద్ధి పనులకు రూ. 6,500 కోట్ల నుంచి రూ. 7,000 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు.ఈస్ట్–వెస్ట్ కారిడార్..మూసీ నది నగరంలో పశ్చిమం నుంచి తూర్పునకు ప్రవహిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ ప్రాంతంలోని గండిపేట నుంచి గౌరెల్లికి ప్రయాణించాలంటే.. ఔటర్ నార్త్ మీదుగా 91 కి.మీ., లేదా ఔటర్ సౌత్ మీదుగా అయితే 69 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. అలా కాకుండా వెస్ట్ టు ఈస్ట్ మార్గంలో హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే ప్రయాణ దూరం 43 కి.మీ.కి తగ్గిపోనుంది. దీంతో ప్రధాన నగరంలో ట్రాఫిక్ తగ్గడంతోపాటు ప్రయాణ సమయం 50 శాతం తగ్గుతుంది. ఈ కారిడార్ బుద్వేల్ వద్ద మొదలవుతుంది. నెల రోజుల్లో డీపీఆర్ తయారు కానుంది. మూసీని సాంస్కృతిక వారధిగా అభివృద్ధి చేస్తారు. మంచిరేవుల వద్ద హిందూ దేవాలయం, పురానాపూల్ వద్ద మసీదు, గౌలిగూడ వద్ద గురుద్వారా, నాగోల్ వద్ద చర్చిని నిర్మించనున్నారు. 200 ఎకరాల్లో గాంధీ సరోవర్.. మూసీ, ఈసా నదుల సంగమమైన బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ను అభివృద్ధి చేస్తారు. ఇది మొత్తం 200 ఎకరాల్లో ఉంటుంది. అందులో 123 అడుగుల ఎత్తయిన ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’గాంధీ విగ్రహంతోపాటు చేనేత శిక్షణాæ కేంద్రం, విద్య, జ్ఞాన కేంద్రం, మెడిటేషన్, వెల్నెస్ విలేజ్, నేషనల్ మ్యూజియం, కల్చరల్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ల వంటివి ఉంటాయి.మూసీ చుట్టూ ఎస్టీపీలు.. ప్రస్తుతం బాపూఘాట్, పురానాపూల్, అఫ్జల్గంజ్, గోల్నాకా వంటి మూసీ పరీవాహక ప్రాంతాల చుట్టూ 25 మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)ఉన్నాయి. ఇవి 772 ఎంఎల్డీ నీటిని శుద్ధి చేస్తున్నాయి. మరో 27 ఎస్టీపీలు ప్రారంభానికి సిద్ధమవుతుండగా.. ఇవి 1,106 ఎంఎల్డీల నీటిని శుద్ధి చేస్తాయి. ఇక అమృత్ స్కీమ్ కింద మరో 39 ఎస్టీపీలను నిర్మించనున్నారు. వాటితో 972 ఎంఎల్డీ మురుగునీరు శుద్ధి అవుతుంది. ఈ ప్రతిపాదిత ఎస్టీపీలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు నిర్మితమవుతాయి. ఉస్మాన్సాగర్ మార్గంలో నార్సింగి, తారామతి, హైదర్షాకోట వద్ద, అలాగే హిమాయత్సాగర్ మార్గంలో అత్తాపూర్ వద్ద భూగర్భ ఎస్టీపీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే అత్తాపూర్, అంబర్పేట, నాగోల్లలో మూసీ బఫర్ జోన్లోని ప్రధాన ఎస్టీపీ స్థానాలలో మూడు బ్యాలెన్సింగ్ గ్రే వాటర్ రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే శుద్ధి చేసిన నీటిని నిర్మాణ రంగం, డేటా సెంటర్ల వంటి పరిశ్రమ అవసరాలకు తక్కువ ధరకు అంటే సుమారు కిలోలీటర్ నీటిని రూ. 70–80 చొప్పున సరఫరా చేస్తారు. అలాగే నగరంలోని పార్క్లు, ల్యాండ్ స్కేపింగ్ ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తారు. మరోవైపు మూసీపై 14 వంతెనలను నిర్మిస్తారు. అందులో 9 కొత్తవి కాగా.. 5 అప్గ్రేడెడ్ బ్రిడ్జీలు. నీటి నిల్వ కోసం మూడు బరాజ్లు కడతారు.బఫర్లో ఏముంటాయంటే.. నదికి ఇరువైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఇందులో విహార ప్రదేశాలు, నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్లు, పార్క్లు, సీటింగ్ ప్రాంతాలు, వీక్షణ డెక్లు, యాంఫీ థియేటర్లు, ప్లాజాల వంటివి ఉంటాయి. అలాగే వాహనాల పార్కింగ్ స్థలాలు, అనుసంధాన రోడ్లతోపాటు ఇంటర్సెప్టర్ మురుగు కాలువలు, వరదనీటి కాలువలు, భూగర్భ డ్రైనేజీలను అభివృద్ధి చేస్తారు. ఇందులో నివాసాల వంటి ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టకూడదు. ఇక మూసీలో 24/7 మంచినీరు ప్రవహించేలా 2.5 టీఎంసీల నీటిని మూసీ పునరుజ్జీవం కోసం కేటాయించారు. ఔటర్ రింగ్రోడ్ వెంబడి అనుసంధానం కానున్న గోదావరి నదీ అనుసంధాన ప్రాజెక్టు నుంచి ఈ నీటిని సేకరిస్తారు. విదేశాల్లోని నదీ తీర ప్రాంతాలిలా..ప్రపంచ దేశాల్లోని నదీ తీర ప్రాంతాలన్నీ పునరుజ్జీవంతో కొత్త ఆర్థిక రూపును సంతరించుకున్నాయి. గుజరాత్లోని సబర్మతి సహా దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని చెయోంగ్యెచియోన్, లండన్లోని థేమ్స్, ఫ్రాన్స్లోని సీన్, టోక్యోలోని సుమిదా, సింగపూర్ రివర్ఫ్రంట్ తదితర నదీ తీర నగరాలన్నీ ఇలా అభివృద్ధి చెందినవే. దీంతో ఆయా దేశాల్లోని అభివృద్ధి ప్రణాళికలను అధికారులు ఏడాదిన్నరపాటు అధ్యయనం చేసి మూసీ పునరుజ్జీవానికి సంకల్పించారు. వివిధ దేశాల్లో నదీ తీరాల అభివృద్ధి ఇలా.. ⇒ సియోల్లోని చెయోంగ్యెచియోన్ నదీ తీరం మీదుగా సాగే 5.8 కి.మీ. ప్రవాహ మార్గాన్ని అభివృద్ధి చేయగా రోజుకు 50 వేల మంది సందర్శకులు వస్తున్నారు. నదీ తీర అభివృద్ధితో 9 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. గత పదేళ్లలో 190 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. ⇒ లండన్లోని థేమ్స్ నది 39 కి.మీ. పునరుద్ధరించగా.. రోజుకు 27 వేలకుపైగా సందర్శకులు వస్తున్నారు. 2.98 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. సుమారు లక్షకుపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. ⇒ టోక్యోలో 23.5 కి.మీ. మేర సుమిధ నదీ తీర అభివృద్ధితో 67.14 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. రోజుకు 1.5 లక్షల మంది సందర్శకులతో ఏటా సుమారు 300 మిలియన్లకుపైగా పర్యాటకుల కేంద్రంగా మారింది. ⇒ 3.2 కి.మీ. మేర విస్తరించిన సింగపూర్ రివర్ఫ్రంట్ అభివృద్ధితో ఏటా 23.9 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుంది. రోజుకు 40 వేలకుపైగా సందర్శకులతో ఏటా 16.9 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. ⇒ ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 29 కి.మీ. మేర ప్రవహించే సీన్ నదీ అభివృద్ధితో పారిస్ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం ద్వారా 30 శాతం ఆదాయం సమకూరుతోంది. ఏటా 40 మిలియన్ల మంది సందర్శిస్తున్నారు. అలాగే 7.4 మిలియన్ల మందికి ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మారింది. ⇒ గుజరాత్లోని అహ్మదాబాద్లో తొలిదశ కింద సబర్మతి నదిని 11.5 కి.మీ. మేర సుందరీకరించారు. ఫలితంగా నిత్యం 7 వేల మందికిపైగా సందర్శకులు వస్తున్నారు. అలాగే 85 వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మారింది. రెండో దశ కింద మరో 13 కి.మీ. మేర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. -
పేదలకు శత్రువులం కాదు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ పథకం అమలులో ఏవైనా లోపాలుంటే సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, మరింత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తామని, అసలు పథకమే వద్దంటే మాత్రం వినే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం పేదలకు శత్రువు కాదని, వారిని నిరాశ్రయులను చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంలో నిరాశ్రయులకు ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలం ఉంటే.. అక్కడే ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరి ఆస్తులూ గుంజుకునేందుకు కాదని అన్నారు. పేదలతో శత్రుత్వం పెంచుకుంటే మళ్లీ ఎవరైనా అధికారంలోకి వస్తారా? అని ప్రశ్నించారు. ఇది భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి అని, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. దాదాపు 115 సంవత్సరాల కిందట అప్పటి నిజాం నవాబు ఎంతో దూరదృష్టితో చేసిన మంచి పనుల్లో కనీసం మనం పది శాతం కూడా చేయకుండా ఈ నగరాన్ని అలాగే వదిలేద్దామా? అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ‘మూసీ ఇన్వైట్’పేరుతో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తర్వాత ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పర్యావరణవేత్తలు, మేధావులు, పలు సంస్థల కన్సల్టెంట్లను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అంటూ అసత్యాలు ‘ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపడుతున్నప్పుడు మేధావులు దానిని సమర్థించేలా మాట్లాడాలి. కొన్ని రాజకీయ పార్టీలు కడుపులో కుళ్లు, మాటల్లో విషం, చూపుల్లో పగతో వ్యవహరిస్తున్నాయి. రాజకీయ స్వార్థం కోసం ఘనమైన చరిత్రను కాలగర్భంలో కలిపేలా వ్యవహరిస్తున్నాయి. అక్రమ సంపాదనతో ప్రతీనెలా రూ.5 కోట్లు వ్యయం చేస్తూ సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. మూసీ బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అంటున్నారు. ప్రజలను ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహానికి రూ.75 కోట్లు మాత్రమే.. రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం అంటూ సొంత తెలివి ప్రదర్శిస్తున్నారు. నిజానికి గాంధీ విగ్రహానికి అయ్యే వ్యయం రూ.75 కోట్లు మాత్రమే. ఈ ప్రాజెక్టు మొత్తం 55 కిలోమీటర్లు కాగా.. తొలిదశలో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల అభివృద్ధికి అయ్యే వ్యయం కేవలం రూ.7 వేల కోట్లు మాత్రమే. మహాత్ముడి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనపై లేదా? మన చరిత్రను తిరిగి రాసుకునే అవకాశాన్ని మనం వదులుకుందామా? దేవతలు యజ్ఞాలు చేసినపుడు రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారు. సుబాహు, మారీచుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞం ఆగిందా? లోకకళ్యాణం కోసం చేసే పనులకు సహకరించక పోయినా పరవాలేదు. కానీ అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయొద్దు..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. నది చుట్టూనే నాగరికత అభివృద్ధి: ‘మానవ నాగరికత నది చుట్టూనే అభివృద్ధి చెందింది. 1908 మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తిన తర్వాత.. నగరాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పటి నిజాం ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లను నిర్మించారు. ప్రస్తుతం వందేళ్లు దాటినా ఆ రిజర్వాయర్లు నగర ప్రజలతో పాటు, వలసలు వచ్చిన లక్షలాది మంది దాహార్తి తీరుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని నిజాం ఎకనామిక్ జోన్గా తీర్చిదిద్దారు. పాలకులు మారినా నగర అభివృద్ధి ఆగలేదుం. అలాంటి నగరాన్ని కాపాడుకోవడం మనకర్తవ్యం. 1994 నుంచి ఇప్పటివరకు పరిపాలనలో విధా న నిర్ణయాల్లో వెనుకబడటం ఎప్పుడూ లేదు. పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్లు ఎందుకు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారు? వారసత్వ సంపద కలిగిన ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా? మూసీ పునరుజ్జీవం జరిగితే కాంగ్రెస్కు, రేవంత్రెడ్డికి మంచి పేరు వస్తుందని, ఇక వాళ్లకు అధికారం కలగా మిగిలిపోతుందనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దార్శనికతతో అభివృద్ధి ప్రణాళికలు రచించి అభివృద్ధి చేసిన వారే చరిత్రలో గుర్తుంటారు..’అని అన్నారు. సంగమంలో మహాత్ముడి అస్తికలు..: ‘మూసా, ఈసా నదుల సంగమం వద్ద ఆనాడు మహాత్మాగాంధీ అస్థికలు కలిపారు. అంతటి చరిత్ర బాపూఘాట్కు ఉంది. కానీ బాపూఘాట్ను ఎవరైనా సందర్శిస్తున్నారా? ఎందుకది మరుగున పడిపోయింది? ప్రస్తుతం ఈ నదులు పూర్తిగా కాలుష్యంతో విషతుల్యంగా మారాయి. ఈ నీరుతో నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. విషతుల్యమైన నీరు కారణంగా మహిళలు గర్భవతులు కూడా కావడం లేదు. ఇది కేవలం మూసీ పునరుజ్జీవనం మాత్రమే కాదు. మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోవడం. అందులో భాగంగానే నల్ల చెరువు, బతుకమ్మ కుంట బమృక్ ఉద్దౌలా వంటి చెరువులను పునరుద్ధరించాం. అడ్డుకుంటున్న వాళ్లు అక్కడ ఉండగలరా? ఇవాళ మూసీ పునరుజ్జీవనాన్ని అడ్డుకుంటున్నవారు మూసీ పరీవాహకంలో నివసించగలరా? వాళ్లు ఉంటానంటే అన్ని సౌకర్యాలతో కంటైనర్ హౌస్ ఇస్తా. మూడు నెలలు అక్కడ ఉండగలరా? ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పేదలకు సరైన మౌలిక వసతులు కల్పించొద్దా? బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయొద్దా? పర్యాటక అభివృద్ధి జరగొద్దా? నైట్ ఎకానమీ అభివృద్ధి చెందొద్దా? అభివృద్ధిని అడ్డుకుని ఇంకా వెనక్కి రాతి యుగాల వైపు వెళ్ళిపోదామా? ఓఆర్ఆర్ నిర్మాణం జరిగినపుడు కూడా కొందరు భూములు కోల్పోయారు. ఇప్పుడు మూసీ పునరుజ్జీవనంతో రాష్ట్రం గ్రోత్ ఇంజన్గా మారుతుంది. మూసీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇద్దామో చెప్పండి. దానిని అమలు చేద్దాం. మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం..’అని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్, బన్నీ (ఫోటోలు)
-
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు
-
రేవంత్ రెడ్డి కాదు.. గోబెల్స్ రెడ్డి : హరీష్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్రెడ్డికాదు.. గోబెల్స్ రెడ్డి’ అని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.మూసి సుందరీకరణకు మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డీపీఆర్ లేకుండానే 10 వేల 17 ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. హైడ్రా పేరుతో ఇప్పటికే లక్షకు పైగా ఇళ్లు కూల్చారు. లక్ష జీవితాలను మూసీలో ముంచేస్తారా? మూసీని శుద్ధి చేస్తావా?. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా?.రియల్ ఎస్టేట్ దందా కోసమే మూసీ మీద పడ్డారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ కోసం 3,279 ఎకరాల భూ సేకరణ అవసరమా..!.మూసీ బ్యూటీఫికేషన్ పేరుతో లూటీఫికేషన్ చేస్తున్నారు’అని ఆరోపించారు. -
హాలీవుడ్తో పోటీ పడదాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా హాలీవుడ్తో పోటీ పడాలని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు మన సినిమా లు బాలీవుడ్తో పోల్చుకునే వారిమని, కానీ ఇప్పుడు టాలీవుడ్ సినిమాల స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్నారు. ఇప్పు డు మన సినిమాలు కేవలం హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్నాయని, అంతటి ప్రమాణాలతో తెలుగు సినిమా అభివృద్ధి చెందిందన్నారు. కోకాపేట్లో నిర్మించిన అల్లు అర్జున్ థియేటర్ ఆఫ్ అల్లు సినిమాస్ను గురువారం సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు.‘తెలుగు సినీ పరిశ్రమ దేశంలో ముందువరుసలో ఉంది. అత్యంత ఉత్తమ చిత్రాలను మన పరిశ్రమ నిర్మిస్తోంది. బాహుబలి, కలి్క, అరుంధతి లాంటి సినిమాలు టాలీవుడ్కు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో ఆ సినిమాలు నిర్మించారు. కలెక్షన్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీగా నిలిచాయి. సినిమా రంగం సాంకేతికంగా అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ప్రేక్షకులను కట్టిపడేసే సినిమాలు వస్తున్నా యి. ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ధియేటర్ నిర్మించారు. నేను సినిమా అభిమానిని. అందులోనూ కృష్ణ అభిమానిని. కాలేజీ రోజుల్లో మా ప్రాంతంలో సినిమా థియేటర్లు లేవు. వనపర్తి, కర్నూలుకు వెళ్లి సినిమా చూసేవాడిని. లారీఎక్కి సినిమాలు చూశాను. నటుడు కృష్ణ ఏడాదికి 15 సినిమాలు చేసేవారు. ఇప్పు డు ఐదారేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. సినిమా సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది.సినిమాల్లో కథ, కథనం ఆధారంగా మన జీవితంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎన్టీ ఆర్ అక్కినేని, రామానాయుడు లాంటి వాళ్లు తెలుగు సినీ పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చారు. కానీ నటుడు కృష్ణ మాత్రం సాహసాలు చేసారు. సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభు త్వం అండగా ఉంటుంది. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీ మాదిరిగా సినీ ఇండస్ట్రీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. మన సినిమాలు హాలీవుడ్ స్థాయికి వెళ్ళాలి. భాష అడ్డంకి కాదు. కేవలం టాలెంట్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది.’అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్రెడ్డి, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు, సినీ నిర్మాత అల్లు అరవింద్, నటుడు అల్లు అర్జున్, అల్లు వెంకట్, అల్లు శిరీష్ పాల్గొన్నారు. -
Allu Cinemas: ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా..డాడీ అరవింద్: అల్లు అర్జున్
హైదరాబాద్లోని కోకాపేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ప్రసంగం అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు తన తండ్రి అల్లు అరవింద్ దూరదృష్టిని ప్రశంసించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆత్మీయంగా రేవంతన్న అని సంబోధిస్తూ తమ కలను నిజం చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఇచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.తన ప్రసంగంలో తండ్రి గురించి మాట్లాడుతూ బన్నీ భావోద్వేగానికి లోనయ్యారు. “నాన్న కేవలం ఒక నిర్మాత మాత్రమే కాదు.. ఆయన నాకు దేవుడు” అంటూ గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం వ్యాపార ప్రయోజనాల కోసం కాదని, తెలుగు సినిమా పరిశ్రమ తమకు ఇచ్చిన గౌరవానికి ప్రతిఫలంగా తిరిగి ఏదైనా గొప్పగా ఇవ్వాలనే అభిరుచితో చేసిన ప్రయత్నమని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ లాభాల కంటే సినిమాపై ఉన్న ప్రేమే అల్లు సినిమాస్ రూపంలో సాకారమైందని పేర్కొన్నారు.అల్లు అరవింద్ను టెక్నాలజీ పయనీర్గా బన్నీ అభివర్ణించారు. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసిన సాంకేతిక మార్పులను గుర్తుచేశారు. పరిశ్రమలో స్టీరియో సౌండ్ మాత్రమే ఉన్న రోజుల్లోనే ‘మాస్టర్’ సినిమాతో 5.1 సరౌండ్ సౌండ్ను పరిచయం చేసిన ఘనత అరవింద్ గారిదేనని చెప్పారు. టెక్నాలజీని ఎంటర్టైన్మెంట్ రంగంలో ముందుగానే తీసుకురావడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. సినిమాలు ఫిలిం రీల్స్ ద్వారా ప్రదర్శించబడుతున్న సమయంలోనే ప్రపంచం డిజిటల్ వైపు వెళ్తోందని గుర్తించి.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను డిజిటల్ వ్యవస్థలోకి మార్చడంలో అరవింద్ కీలక పాత్ర పోషించారని బన్నీ తెలిపారు. అందుకే ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమలో “ఫాదర్ ఆఫ్ డిజిటల్ ఎరా” అని పిలవొచ్చని వ్యాఖ్యానించారు.అదే విధంగా ప్రాంతీయ ఓటీటీ రంగంలో కూడా ముందడుగు వేసి ఆహా (Aha) అనే తెలుగు ఓటీటీ ప్లాట్ఫారమ్ను ప్రారంభించడం ఆయన ముందుచూపుకు నిదర్శనమని అన్నారు. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్లలో ఒకటిగా చెప్పబడుతున్న డాల్బీ విజన్ థియేటర్ను హైదరాబాద్కు అందించడం ద్వారా మరో మైలురాయి సృష్టించారని చెప్పారు. తన తండ్రి నెలకొల్పిన ఈ ఘనమైన వారసత్వాన్ని మరింత గర్వంగా ముందుకు తీసుకెళ్తానని బన్నీ తెలిపారు. హైదరాబాద్ను ప్రపంచ ఎంటర్టైన్మెంట్ మ్యాప్లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు. -
నెట్ఫ్లిక్స్తో హైదరాబాద్కు హాలీవుడ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు హాలీవుడ్ను రప్పించాలనే తన కల నెట్ఫ్లిక్స్ ద్వారా నిజం కాబోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీల పెట్టుబడులను హైదరాబాద్కు రప్పించేందుకు కృషి చేస్తున్నామని ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారానికి చిరునామాగా ఉన్న తెలంగాణకు వచ్చే పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్కు చెందిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో గురువారం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుండగా, బాహుబలి, కల్కి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఇక్కడ నుంచే వచ్చాయి. ప్రపంచ సంస్థలకు వేదికగా నిలుస్తున్న హైదరాబాద్ అన్ని రకాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుంది. నెట్ఫ్లిక్స్ విస్తరణకు అవసరమైన అన్ని సదుపాయాలు, సహకారాన్ని మా ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చూపే అద్భుత అవకాశం వినోదరంగంలో పేరొందిన నెట్ఫ్లిక్స్, ఐలైన్ ద్వారా లభిస్తుంది. క్రీడా రంగంలో మౌలిక వసతుల కల్పన, క్రీడా విశ్వ విద్యాలయాల ఏర్పాటు వంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. త్వరలో క్రీడల ప్రసార రంగంలోనూ అడుగుపెడుతున్న నెట్ఫ్లిక్స్ నుంచి సహకారాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో నెటిఫ్లిక్స్ ఆఫీసు నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీసును ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలి’అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఐలైన్ స్టూడియో కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్బాబు, దిల్రాజు, రానా, సంజయ్జాజు, జెఫ్షాపిరో తదితరులు తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం: మంత్రి దుద్దిళ్ల యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్ను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ‘హైదరాబాద్కు నెట్ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్లో తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవుతుంది. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్లైన్లో నగరం నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుంది. ప్రపంచస్థాయి నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణల వాతావరణంతోపాటు స్థానిక యువత కు భవిష్యత్తు నైపుణ్యాలు ఐలైన్ స్టూడియో ద్వారా అందుబాటులోకి వస్తాయి. పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో నెట్ఫ్లిక్స్ భాగస్వామిగా మారాలి’అని శ్రీధర్బాబు చెప్పారు. ఆవిష్కరణలకు కేంద్రం: సంజయ్‘వేగంగా విస్తరిస్తున్న మీడియా, వినోద రంగ మౌలిక సదుపాయాలతో.. ప్రతిభకూ, ఆవిష్కరణలకూ శక్తిమంతమైన కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. సాంకేతిక ఆవిష్కరణలను కథన కళారీతులతో మేళవిస్తూ దక్షిణాసియాలో ముఖ్యమైన కేంద్రంగా ఐలైన్ స్టూడియోస్ సేవలందిస్తుంది. అలాగే దృశ్య శ్రవణ, వినోద రంగాల్లో సరికొత్త అవకాశాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 15వేల పాఠశాలలు, కాలేజీల్లో 500 కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ల ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించింది. తద్వారా సృజనాత్మక రంగంలో దాదాపు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయి’అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు చెప్పారు. భారత సృజనాత్మక సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) త్వరలోనే హైదరాబాద్లో ప్రాంతీయ ప్రాంగణాన్ని కూడా ప్రారంభించనున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా హైదరాబాద్లో ఐలైన్ స్టూడియోస్ 32వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతోంది. ఇందులో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, జనరేటివ్ వర్చువల్ ఎఫెక్ట్స్ కోసం ఆధునిక సాంకేతికత ఉంటుంది, ఈ స్టూడియో లాస్ ఏంజెలిస్, వాంకోవర్, సియోల్, లండన్లో స్థాపించిన నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రానా దగ్గుబాటి, ఐలైన్ స్టూడియోస్ సీఈఓ జెఫ్ షాపిరో, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. -
1.15 కోట్ల కుటుంబాలకు బీమా
సాక్షి, హైదరాబాద్/మణికొండ: రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా కల్పించి, ఆరోగ్య భద్రత అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని మెడికవర్ 25వ ఆసుపత్రిని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. సంపూర్ణమైన విద్య అందిస్తే 90 శాతం సమస్యలు పరిష్కారమవుతాయి. సంక్షేమ పథకాల అవసరం ఉండదు. 2006లో రాజీవ్ ఆరోగ్య శ్రీ వచ్చింది. 20 ఏళ్లలో కోట్లాది మందికి వైద్య సేవలందించాం. ఈ డేటాను ఎనాలసిస్ చేస్తాం. ఏ ప్రాంతంలో ఎలాంటి రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయనేది స్పష్టమవుతుంది. దీనికి తగ్గట్లు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 4 కోట్ల మంది ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోవడానికి డేటాబేస్ డిజిటల్ కార్డును సిద్ధం చేస్తాం. పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించాం. మెడికల్, ఫార్మా, డ్రగ్స్ హబ్గా హైదరాబాద్ మారింది’అని చెప్పారు. విద్యార్థులకు రవాణా సదుపాయం ‘రా్రష్తంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 21 లక్షల మంది విద్యార్థులున్నారు. కేవలం పాఠశాలకు వెళ్లి చదువుకునే విధానం తల్లిదండ్రులకు సంతృప్తినివ్వడం లేదు. 3వ తరగతి చదువుతున్న విద్యార్థి 2వ తరగతి పాఠ్యపుస్తకాన్ని కేవలం 6.5 శాతం మంది మాత్రమే చదవగలుగుతున్నట్లు మా సర్వేలో తేలింది. విద్యతోపాటు స్కిల్ అవసరం. స్కిల్ లేకుంటే ప్రపంచంతో పోటీపడలేం. నర్సరీ నుంచి 12 వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే కొత్త కాన్సెప్ట్ తెస్తున్నాం. ఎడ్యుకేషనల్ రిఫారŠమ్స్ తీసుకురావడమే కాకుండా ఇప్పటివరకు ఉన్న ఇంటర్మీడియెట్ విధానాన్ని వచ్చే ఏడాది నుంచి రద్దు చేస్తాం. నర్సరీ నుంచి 12 వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కిందకు తెస్తాం. వివిధ పాఠశాలలను ఒక దగ్గరకు తెస్తాం. ప్రైవేటు స్కూల్స్ సక్సెస్ స్టోరీ.. రవాణానే. ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఉచితంగా, లేదా 50 శాతం రాయితీతో ప్రభుత్వమే విద్యార్థులను పాఠశాలకు తరలిస్తుంది. మేము ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)గా మార్చాం. సీఎస్సార్ కింద పదేళ్ల పాటు టాటాసన్స్ సంస్థ వీటిని నిర్వహిస్తుంది. రూ.2,400 కోట్ల బడ్జెట్లో 2,100 కోట్లు టాటాసన్స్ భరిస్తుంది. భవిష్యత్తులో పాలిటెక్నిక్ కళాశాలలనూ ఈ కోవలోకి తెస్తాం. ప్లేట్లో ఆహారం వడ్డిస్తే అది ఎన్ని కేలరీలు ఉంటుందో తెలిపే యాప్ ఉంది. దాన్ని వాడుకుంటాం’అని రేవంత్రెడ్డి చెప్పారు.బ్లూ కలర్ జాబ్స్కు సిద్ధం కండి‘వైట్ కాలర్ జాబ్లో వచ్చే గ్యాప్ను భర్తీ చేయడానికి బ్లూ కలర్ జాబ్కు ప్రిపేర్ కావాలి. దీన్ని ఏఐ రీప్లేస్ చేయలేదు. మొదటి దశలో ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తీసుకున్నాం. రెండో దశలో సేవారంగం తీసుకున్నాం. ఇప్పుడు తయారీ రంగంపై దృష్టిసారిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి హెల్త్ టూరిజంలో తెలంగాణకు 8–10 లక్షల మంది, ఇతర దేశాల నుంచి 2.10 లక్షల మంది వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని నెలల్లో రూ.1,800 కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేశాం. 10 వేల బెడ్ ఆసుపత్రులుగా ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్, వరంగల్ టిమ్స్, నిమ్స్ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయబోతున్నాం. ముఖ్యమంత్రిగా అడుగుతున్నా ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు సంవత్సరంలో ఒక నెల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయండి. మిగతా 11 నెలలు మీరు పనిచేస్తున్న సంస్థలు, కుటుంబం కోసం పనిచేయండి. దీనికి ఒక ప్లాట్ఫాం క్రియేట్ చేస్తున్నాం. వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. త్వరలోనే కొత్త పాలసీతో మీ ముందుకొస్తాం’అని రేవంత్రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నవీన్యాదవ్, రఘువీర్రెడ్డి, సీపీ సజ్జనార్, మెడికవర్ ఆసుపత్రి చైర్మన్ అనిల్కృష్ణ తదితరులు ఉన్నారు. -
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ కార్యకలాపాలు (ఫోటోలు)
-
'అల్లు సినిమాస్' ప్రారంభోత్సవం.. వీడియో
‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అందులో అల్లు ఫ్యామిలీతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు, క్రిష్, డి సురేష్ బాబు, బన్నీ వాస్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ థియేటర్కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్ పాత్ర ఐకానిక్గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న ధురంధర్-2, ఉస్తాద్ భగత్సింగ్ సినిమాలు ప్రదర్శించనున్నారు. -
నెట్ఫ్లిక్స్తో నా కల నిజం కాబోతుంది: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సౌత్ సినిమా పరిశ్రమకు కేంద్రబింధువుగా హైదరాబాద్లో కార్యకలాపాలు ఆ సంస్థ కొనసాగించనుంది. 30వేల చ.అ.విస్తీర్ణంలో ఏర్పాటు అయిన ఈ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియా ద్వారా పంచుకున్నారు.సినిమాలపై తనకు కూడా ఆసక్తి ఎక్కువగానే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా అన్నారు. 'నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయి. బాహుబలి,కల్కి,ఆర్ఆర్ఆర్ ,అరుంధతి వంటి అత్యనున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయి. చెన్నైలో ఉన్న సినిమాను ఎన్టీఆర్ ,అక్కినేని నాగేశ్వర రావు హైదరాబాద్కు తీసుకు వచ్చారు. ఇప్పుడు కాలంతో పాటు సినిమా పరిశ్రమలో అనేక మార్పులు వచ్చాయి. నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే . మా దృష్టి హాలివుడ్పైనే అని నేను గతంలోనే చెప్పాను. నెట్ఫ్లిక్స్తో నా కల నిజం కాబోతుంది. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు మా పూర్తి సహకారం ఉంటుంది ..ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నాం ..నెట్ఫ్లిక్స్ వ్యాపార విస్తరణకు పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని గుర్తుచేశారు. తెలంగాణలో పెట్టుబడికి పూర్తి రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారానికి అనుకూలత ప్రదేశమని సీఎం అన్నారు. -
జిల్లా కేంద్రాల చుట్టూ రింగురోడ్లు : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన జిల్లా కేంద్రాలన్నింటికీ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్లు భవనాల శాఖను ఆదేశించారు. జిల్లా కేంద్రాలైన ప్రధాన పట్టణాల్లోకి భారీ వాహనాలు వెళ్లకుండా చూడటంతో పాటు సరుకు రవాణా వాహనాలు వేగంగా ముందుకు సాగేందుకు రింగురోడ్లు దోహదం చేస్తాయని అన్నారు. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాల చుట్టూ ఉన్న రోడ్లను అనుసంధానించి రింగురోడ్లుగా మార్చాలని, ఆయా పట్టణాల నుంచి రింగురోడ్లకు అనుసంధానంగా రేడియల్ రోడ్లను నిర్మించాలని సీఎం ఆదేశించారు. సమీపంలోని జాతీయ రహదారులకు రింగురోడ్లను అనుసంధానించే అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. హైదరాబాద్–విజయవాడ ఎక్స్ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్ చేరేందుకు కొత్తగా రోడ్డు నిర్మించే అంశంపై కూడా అధ్యయనం చేసి నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఆర్ఓబీలు, ఆర్యూబీలను వేగంగా పూర్తి చేసి, అవసరమైన కొత్త వాటి కోసం ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. ఈవీల వినియోగం పెంచాలి.. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక నుంచి ప్రభుత్వ వినియోగం కోసం కొనే వాహనాలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే అయి ఉండాలని స్పష్టం చేశారు. ‘క్యూర్’ పరిధిలో అద్దెకు తీసుకునే ప్రభుత్వ వాహనాలు కూడా అవే ఉండాలని చెప్పారు. రవాణా శాఖలో ఇక అన్ని సేవలు ఆన్లైన్ ద్వారానే సాగాలని ఆదేశించారు. కార్యాలయాలన్నీ సొంత భవనాల్లోనే ఉండాలని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. శంషాబాద్ సమీపంలో ఆధునిక బస్ టెర్మినల్ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు లఘు చిత్రాలు ప్రదర్శించాలని సీఎం సూచించారు. శంషాబాద్ సమీపంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రారంభమయ్యే ప్రాంతంలో ఆధునిక బస్ టెర్మినల్ నిర్మించాలని, ఇందుకు స్థలం కేటాయిస్తామని, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్ది, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సుసంపన్న తెలంగాణ నిర్మిద్దాం
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రివర్గ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు. మనమందరం కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ లక్ష్యాలను గౌరవిస్తూ ముందుకు సాగుదాం. రాష్ట్ర గవర్నర్గా సమగ్రత, సమైక్యత, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటా. నా విధులను న్యాయబద్ధంగా, నిజాయితీగా, భారత రాజ్యాంగానికి లోబడి అంకితభావంతో నిర్వహిస్తా. మనమందరం సుసంపన్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడానికి కలిసి పని చేద్దాం..’అని రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు లోక్భవన్లో ఆయన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తన సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడం అదృష్టం ‘తెలంగాణ ప్రజలకు సేవ చేయడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అంటే సాంస్కృతిక సంపద, గొప్ప సంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనం. ఈ ప్రాంతం ఆశలు, ఆవిష్కరణలు, సహన శక్తికి చిహ్నంగా నిలుస్తుంది. ప్రజల అకుంఠిత దీక్ష, రాష్ట్రంలోని సమృద్ధ వనరులు, వ్యూహాత్మక దృష్టి.. సమగ్ర అభివృద్ధికి, స్థిరమైన ప్రగతికి బలమైన ప్రాతిపదికను అందిస్తాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పని చేసిన నా అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. తెలంగాణ జై తెలంగాణ..’అని గవర్నర్ శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలను అప్పగించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, డీజీపీ శివధర్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం, ఆయన మంత్రివర్గ బృందంతో గవర్నర్ గ్రూపు ఫొటో దిగారు. తెలుగులో ప్రమాణం గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆయనకు తెలుగు భాషతో ఇప్పటివరకు ఎలాంటి పరిచయం లేకపోయినా తెలుగులో ప్రమాణస్వీకారం చేయడానికి బాగా ప్రాక్టీస్ చేసినట్టు లోక్భవన్ వర్గాలు తెలిపాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం తెలుగులోనే ‘అనే నేను..’అనే పదాలతో ప్రమాణాన్ని ప్రారంభించగా, శివపత్రాప్ శుక్లా అనే నేను.. అంటూ గవర్నర్ పూర్తిగా తెలుగులో ప్రమాణం చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చార్మినార్: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన కుటుంబ సభ్యులతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ కుమార్తె, అల్లుడు, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్లతో కలిపి దాదాపు 19 మంది వరకు ఆయన వెంట ఉన్నారు. ఆలయ ట్రస్టీ శశికళ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణకుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం వారిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
నేడు కొత్త గవర్నర్ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బుధవారం ఉదయం 11.30 గంటలకు లోక్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులు, అధికార, విపక్ష పార్టీల నేతలు, అధికారులు పాల్గొంటారు. గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. -
పోలీసింగ్ మారాలి : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాలక్రమేణా నేర స్వభావం మారుతోందని, సైబర్ నేరాలు, డ్రగ్స్ సరఫరా వంటి భవిష్యత్ సవాళ్లకు తగ్గట్టుగా పోలీసింగ్లోనూ మార్పులు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం చూసేది పోలీసుల వైపేనని, ఏళ్లుగా ప్రజల్లో పోలీసులు పెంచుకున్న విశ్వాసం అలాంటిదన్నారు. అయితే, పోలీస్ శాఖలో ఉద్యోగులు ఆటో మోడ్కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరమని సీఎం హెచ్చరించారు. మారుతున్న సాంకేతికత, నేరాలకు తగ్గట్టుగా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్గ్రేడ్ కావాలని చెప్పారు. వచ్చే 25 ఏళ్లకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. సోమవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్– 2026 కార్యక్రమంలో రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులనుద్దేశించి రేవంత్రెడ్డి ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే... శాంతిభద్రతలు బలంగా ఉండాలి.. అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు బలంగా ఉండాలి. శాంతిభద్రతలు బాగున్న రాష్ట్రాల్లోనే పరిశ్రమలు వస్తాయి.. తద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. తెలంగాణలోనూ శాంతిభద్రతలు బాగున్నాయి కాబట్టే ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. దేశం వందేళ్ల స్వాతంత్య్రదిన వేడుకల నాటికి తెలంగాణ సాంకేతికంగా, అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలి. అందుకు కొత్త విధానాలు తెస్తున్నాం. దేశంలో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారింది. ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమతమవుతున్నాయి. అలాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని కేవలం 24 గంటల్లో 2 సెం.మీ.వర్షపాతానికి తట్టుకునేలా అన్ని వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ, కోవిడ్ తర్వాత రెండు మూడు గంటల్లో 40 సెం.మీ.వర్షం వచ్చింది. భవిష్యత్తు అవసరాలకు తగ్గుట్టుగా అన్ని వ్యవస్థలు మార్చుకోవాలి. సమస్యను అర్థం చేసుకోవాలి.. పోలీసు విధుల్లో నిరంతరం సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉటుంది. ఎన్నో సమస్యలు పరిష్కరించాలి. అయితే సమస్య పరిష్కారంలో వేగంగా పరిగెత్తితే అది మరింత గందరగోళానికి దారి తీస్తుంది. సమస్యలను అర్థం చేసుకుంటే 50 శాతం పరిష్కారం దొరుకుతుంది. సమస్యను అర్థం చేసుకునేందుకు కింది స్థాయి సిబ్బందికి తగిన సమయం ఇవ్వండి. అధికారుల విద్యార్హత, నైపుణ్యం ఆధారంగా వాళ్లకు డ్యూటీలు ఇస్తే మరింత రాణించే అవకాశం ఉంటుంది. జనాభా ప్రాతిపదికన క్షేత్రస్థాయి అవసరాలకు తగ్గట్టుగా పోలీసులపై పనిభారం, ఒత్తిడి తగ్గించేలా సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలి. ప్రత్యేక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న గ్రేహౌండ్స్, ఎస్ఐబీ వంటి సంస్థలు తమ లక్ష్యాన్ని దాదాపుగా చేరుకున్నాయి. కూబింగ్ పోయింది కాబట్టి గ్రేహౌండ్స్లో ఉన్న సిబ్బందిని మరోచోట వాడుకోవాలి. విచారణలో సేకరిస్తున్న సమాచారాన్ని ఐసీసీసీలో ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేయండి. పోలీసులను ఏ, బీ, సీగా వర్గీకరించుకున్నా.. పోలీసు అధికారుల పనితీరుకు సంబంధించిన పూర్తి సమాచారం నా దగ్గర ఉంది. దాని ఆధారంగా వాళ్లను నేను ఏ, బీ, సీ కేటగిరీల్లో వర్గీకరించుకుని పెట్టుకున్నా. దానికి అనుగుణంగానే నేను వారికి పోస్టింగ్స్ ఇస్తున్నా. ఈ విషయంలో నేను కరెక్ట్ లేదా తప్పు కావొచ్చు. ఈ రెండేళ్లలో ఎలాంటి ఫైరవీలు లేకుండా 90 శాతం మందికి ఇలానే పోస్టింగ్లు ఇచ్చాం. టీవీల్లో వచ్చే వరకు కూడా ఎవరికి ఎక్కడ పోస్టింగ్ వచ్చిందో తెలియలేదు. పోలీసింగ్లో మార్పులు, నూతన చట్టాలు తేవాల్సిన ఆవశ్యకత, ఇతర అంశాలపై చర్చించేందుకు ఏటా డిసెంబర్లో పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ నిర్వహించాలి. బడ్జెట్ ప్రవేశపెట్టకముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటే అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించుకోవచ్చు. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్మెంట్, ఇతర సమస్యల పరిష్కారానికి మీరు కొన్ని ప్రతిపాదనలు అందించారు. వీటిపై విశ్లేíÙంచాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారుల కమిటీ నియమిస్తాం. అందరికీ పోస్టింగ్లు వచ్చాయి: డీజీపీ శివధర్రెడ్డి 2001–02లో అప్పటి డీజీపీ హెచ్జే దొర ఆఫీసర్స్ రిట్రీట్ ను ప్రారంభించారని, 24 ఏళ్ల తర్వాత ఆ సంప్రదాయాన్ని మళ్లీ ప్రారంభించినట్టు డీజీపీ బి.శివధర్రెడ్డి తెలిపారు. గతంలో రెండు మూడేళ్లపాటు కూడా ఐపీఎస్ అధికారులు పోస్టింగ్లు లేకుండా చీఫ్ ఆఫీస్లో ఉండేవారని, అయితే గత రెండేళ్లలో ఏ ఒక్క అధికారి ఖాళీగా ఉండకుండా అందరికీ పోస్టింగ్లు ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు అని చెప్పారు. భవనాలు, రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ మాట్లాడుతూ, పోలీసులు, రవాణాశాఖ అధికారులు కలిసి పనిచేస్తే ట్రాఫిక్ పరమైన సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. కార్యక్రమంలో భాగంగా టీజీ పోలీస్ అకాడమీ మ్యానువల్ను రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. చైల్డ్ ప్రొటెక్షన్ స్ట్రెంథెనింగ్ యూనిట్ ఏర్పాటుపై టీజీపీఏ, యూనిసెఫ్ల మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మాటకు మాట.. రేవంత్ రెడ్డి, కేటీఆర్
-
‘ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్దా..?, ఓవైసీదా?’
హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన నడవడంలో లేదని, రజాకార్ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్దా.. లేక ఓవైసీదా? అని ట్వీట్ చేశారు.❌Praja Palana✅ Razakar PalanaFor every decision, Revanth Reddy needs the permission of Owaisi.Such is the state of affairs in Congress-ruled Telangana. pic.twitter.com/pYMQHwFFxT— N Ramchander Rao (@N_RamchanderRao) March 9, 2026 ఓవైసీ పిలుపుతో వేల కోట్లు సమీకరిస్తామని అంటున్నారుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డాఉ. ‘ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రోజుకొక లాగా మారుతున్నాయి. ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు భూమి లేదని చెబుతున్నారు. కానీ జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భూమి ఇస్తామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఓవైసీ ఒక పిలుపు ఇస్తే మూసీ ప్రాజెక్ట్కు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతున్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. కానీ అమ్మాయిలకు ఉచిత EV స్కూటీలు ఇస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు’ అని విమర్శించారు. -
‘కొత్త’ మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభగా కొనసాగిన నిజాం కాలం నాటి ఈ భవనాన్ని ప్రభుత్వం రూ.30 కోట్ల ఖర్చుతో పునరుద్ధరించింది. ప్రస్తుతం జూబ్లీహాల్లో కొనసాగుతున్న శాసనమండలిని ఈ పునరుద్ధరించిన భవనంలోకి తీసుకురానున్నారు.ఆదివారం ఉదయం కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంటరాగా, పునరుద్ధరించిన మండలి భవనాన్ని రేవంత్ ప్రారంభించి లోపలికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్లోని సీట్లలో ఆసీనులైన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్ తదితరులు కొద్దిసేపు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ అనేది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైడ్రా పునరుజ్జీవం కల్పించిన శివరాంపల్లిలోని చారిత్రక బమ్రుఖనుద్దౌలా చెరువును ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఓల్డ్ సిటీ ప్రజలకు అద్భుత సంస్కృతిని అందించడానికి ఈ చెరువును అభివృద్ధి చేశాం. ఇది చెరువు అభివృద్ధి మాత్రమే కాదు.. ఈ ప్రాంత ప్రజలకు కాలుష్యరహిత వాతావరణం అందించడం. నిజాం సర్కారు గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాద్ను లేక్స్ అండ్ రాక్స్ సిటీగా మార్చింది. ప్రపంచంలోనే అద్భుతమైన ఈ నగరాన్ని పాడు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. లండన్, దక్షిణ కొరియా, సింగపూర్ ఇలా అనేక నగరాల్లో నాగరికత, అభివృద్ధి నీటి సమీపంలోనే జరిగింది. నగరంలోనూ నిజాం సర్కార్ అనేకం నిర్మించింది. వరదల్లో అనేక మంది చనిపోతే వాటి నియంత్రణతో పాటు సాగునీరు, తాగునీరు అందించడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ నిర్మాణం చేపట్టింది. ఇవన్నీ రానురాను పాడవుతున్నాయి. నిజాం పురానాపూల్, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, కౌన్సిల్ భవనం, ఫలక్నుమా ప్యాలెస్ సహా ఎన్నో భవనాలు నిర్మించి ఇచ్చారు. వాటిని రక్షించడం, నిర్వహించడం సాధ్యం కావవట్లేదు. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాం. రానున్న మూడు నెలల్లో పురాతన భవనాల పునరుద్ధరణ చేపడతాం. పాతబస్తీలో మెట్రో రైల్ను వీలైనంత త్వరలో నిర్మిస్తాం’ అని చెప్పారు.పాతబస్తీలో అభివృద్ధి జరగాలి: ఒవైసీ‘పాతబస్తీ హైదరాబాద్కు గుండెకాయ వంటిది. పాతబస్తీలో తగిన స్థాయిలో అభివృద్ధి జరగాలి. అంతా కలిసి దీనిపై ఉన్న అపార్థాలను దూరం చేద్దాం, మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లోపు మెట్రో పనులు చేస్తామని సీఎం చెప్పారు. ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. మీరాలం ట్యాంక్పై మంజూరైన బ్రిడ్జ్ పనులకు సీఎం ఈ నెల 14న శంకుస్థాపన చేస్తారు’ అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హెచ్ఎండీఏ కేటాయించిన రూ.20 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం నుంచి మాకు మద్దతు‘పాతబస్తీ నుంచి అసదుద్దీన్ దేశ ప్రతినిధిగా గొంతు వినిపిస్తున్నారు. ఒవైసీ, ఎంఐఎం నుంచి మాకు మంచి మద్దతు వస్తోంది. ప్రపంచంతో పోటీపడే నగరంగా చేయాలనే ఆక్రమణలు తొలగించి చెరువులు, పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. బమ్రుఖనుద్దౌలా చెరువు వద్ద లేక్ పోలీసింగ్ ఏర్పాటు చేయాలి. ఆడబిడ్డలు ధైర్యంగా ఇక్కడకు వచ్చేలా, వాకింగ్ చేసేలా చర్యలు తీసుకోండి. ప్రతి మహిళ స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా చేరాలి. మీరు ఉత్పత్తి చేసే వస్తువులను ఇక్కడ స్టాల్స్ పెట్టి విక్రయించుకునే అవకాశం ఇస్తాం. ఈ ప్రాంతంలో లేక్ ఎకానమీ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లను ఆదేశిస్తున్నా. వాకింగ్ చేసిన వాళ్లు ఇక్కడే వారికి కావాల్సినవి కొనుక్కునే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయండి. పాతబస్తీలో రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నైట్ ఎకానమీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పాతబస్తీలో యువతలో నిరుద్యోగం ఉంది. వీరు నైట్ ఎకానమీ ద్వారా జీవనోపాధి పొందుతారు. గండిపేట నుంచి గౌరారం వరకు మూసీ వెంట లేక్ ఎకానమీ అభివృద్ధి చేస్తాం. మూసీలో పేదల ఇళ్లు ఉంటే వారిని వీధుల్లో వదిలేయం. వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం. దీని అభివృద్ధితో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉపాధి కలుగుతుంది. మీరు అందరూ వచ్చి కూర్చుని పనులు చేయించండి. ఒవైసీ ఎంఐఎం పార్టీ వర్కర్లను ఈ కోణంలో ఆదేశించాలి. మీరు ఆదేశిస్తే అన్నీ జరుగుతాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మీదే. గతంలో రంజాన్ వస్తే బిర్యానీ, కుబానీ ఇచ్చి వెళ్లే వాళ్లు. నేను వాటితోపాటు అభివృద్ధి కూడా చేస్తా’ అని అన్నారు. -
నిజాం రాణులు జలకాలాడిన తటాకం!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం పాతబస్తీలో ప్రారంభించిన బమ్రుఖనుద్దౌలా చెరువు కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1770లో హైదరాబాద్ మూడో నిజాం సికందర్ జా ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్ ఉద్ దౌలా దీన్ని నిర్మించారు. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం తొలినాళ్లలో ఈ చెరువు 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువులోకి చేరేది. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్ను రాజులు.. బమ్రుఖనుద్దౌలా చెరువును రాణులు స్నానాల కోసం ఉపయోగించేవారు. ఈ చెరువులో వనమూలికల మొక్కలు, కొమ్మలు వేసి దిగువున నిర్మించిన బావిలోకి వచి్చన ఊటని తాగునీరుగా వినియోగించేవారు. ఔషధగుణాలున్న ఆ నీటినే నిజాం వాడారు. ఈ చెరువు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. అవి చెరువులో పడటంతో ఇక్కడి నీటిని సెంట్ల తయారీకి వినియోగించేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే బమ్రుఖనుద్దౌలా చెరువు నీరు అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేదని చెబుతున్నారు. కబ్జాల చెర విడిపించిన హైడ్రా..: హైదరాబాద్ నగరం కాలక్రమేణా విస్తరించడం, ఇతర ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో బమ్రుఖనుద్దౌలా చెరువు చివరకు 18 ఎకరాల్లో మిగిలింది. కానీ అక్రమార్కులు క్రమంగా చెరువును కబ్జా చేయడంతో 4.12 ఎకరాలకు కుంచించుకుపోయొంది. దీంతో 2024 ఆగస్టులో రంగంలోకి దిగిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆయా ఆక్రమణలను తొలగించి దశలవారీగా చెరువును తిరిగి 18 ఎకరాలకు విస్తరించింది. దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే తాజా ఆకర్షణలతో తీర్చిదిద్దింది. అలాగే జల కాలుష్యానికి తావు లేకుండా మురుగునీటి కట్టడి, చెరువులోకి ఇన్లెట్, ఔట్లెట్స్ను పక్కాగా ఏర్పాటు చేసింది. నిజాం కాలంలో రాతితో నిర్మించిన బండ్ను చెక్కు చెదరకుండా కాపాడుతూ మరింత పటిష్టం చేసింది. చెరువు పూడికలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరిచింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్లు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఆక్రమణలకు వీల్లేని రీతిలో చెరువు కట్ట చుట్టూ, చెరువు లోపలి వైపు కూడా ఫెన్సింగ్ వేసింది. -
అతివలకే అందలం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహిళ మాటకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ప్రభుత్వ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ శాఖల్లో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమైన శాఖలకు మహిళలనే ఉన్నతాధికారులుగా నియమించామని అన్నారు. పలు జిల్లాలకు కలెక్టర్లుగా, అవకాశమున్న చోట ఎస్పీలుగా నియమించామని తెలిపారు. ఆదివారం ప్రజా భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళ కేంద్రంగా పథకాలు..: ‘ఉక్కు మహిళ సోనియాగాంధీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మహిళ కేంద్రంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు సైతం యజమానులుగా నిలబెట్టాం. ఎస్హెచ్జీలు ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయం కోసం అమెజాన్తో అవగాహన కుదుర్చుకున్నాం. లోకల్ టాలెంట్ను గ్లోబల్ టాలెంట్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి... ‘దేశంలో ఇంకా మహిళలు, పురుషులు, కులాలు అంటూ ఎన్నో రకాలుగా వివక్ష కనిపిస్తూనే ఉంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనూ వివక్ష ఉన్నప్పటికీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉంది. మన దేశంలోనూ కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి.. అవకాశాలు కల్పించాలి. నా ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు నా శ్రేయోభిలాషులుగా ఉన్నారు’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్ఫ్రంట్కు అడ్డుపడుతున్నారు.. 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. కానీ కొందరు ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అహ్మదాబాద్లో సబర్మతి రివర్ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రంట్ నిర్మించిన వారు హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ను మాత్రం వద్దంటున్నారు. ఈసా నది ఒడ్డున 2004లో 9 మీటర్ల బఫర్ జోన్లో అపార్ట్మెంట్ కట్టారు. నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేస్తూ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. 50 మీటర్ల లోపల కట్టడాలపై నిషేదం ఉంది. 50 శాతం బఫర్ జోన్ ఉంది. అందుకే ఆ అపార్ట్మెంట్ నివాసితులను పిలిచి మాట్లాడాం. వాళ్లకు ఏడెకరాల భూమి ఇచ్చి అందులో అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బు డిపాజిట్ చేస్తామని చెప్పాం. కానీ రాజకీయ జోక్యం పెరిగింది. ప్రతి పార్టీ అక్కడికి వెళ్లి సానుభూతి చూపిస్తోంది. సానుభూతితో సమస్య పరిష్కారం కాదు. 50 మీటర్ల బఫర్జోన్లో ఉన్న అన్ని కట్టడాలకు విలువ సున్నాయే. ప్రత్యామ్నాయం చూపించాలని మేం ప్రయత్నిస్తుంటే రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వారికి జరిగే నష్టంపై చర్చిస్తే బాగుంటుంది. నగరాన్ని కాపాడుకోవడానికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కావడానికి అందరి సహకారం కావాలి. గాంధీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి? ఈ నెల 13న మూసీ రివర్ ఫ్రంట్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం’అని సీఎం వివరించారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై శుభవార్త ‘జర్నలిస్టుల మధ్య ఎలాంటి తేడా లేదు. డెస్కు జర్నలిస్టులు, బ్యూరో జర్నలిస్టులు అని వేరుగా చూడం. అందరూ సమానమే. ప్రైవేటు కార్యాలయాల్లో మహిళల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇటీవలే ఈ అంశంపై చర్చ చేశాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలపై ఫిర్యాదులకు ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. నిజమైన జర్నలిస్టులెవరో, జర్నలిస్టు ముసుగులో వ్యాపారాలు చేస్తున్నవారెవరో తేడా తెలియాలి. అందుకోసం ప్రత్యేకంగా చట్టంపై అసెంబ్లీలో చర్చిస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం సుదీర్ఘకాలంగా ఉంది. చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటాం. అతిత్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంచి వార్త చెబుతా. ప్యూచర్ సీటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేస్తాం’అని సీఎం వివరించారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి: మంత్రి పొంగులేటి మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రక్రియలో భాగంగా వడ్డీలేకుండా రూ. 23 వేల కోట్లు అందించినట్లు వివరించారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా మహిళలకు, మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అక్రెడిటేషన్ కార్డుల మంజూరులోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. -
కౌన్సిల్ హాల్ ప్రారంభించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే పునరుద్ధరించిన అసెంబ్లీ ప్రాంగణంలోని శాసన మండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు( ఆదివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్తగా పునరుద్ధరించిన భవనాన్ని పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాలు నూతన భవనంలోనే జరపనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్లతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. కాగా తెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దారు. ఈ భవనంలో అధునాతన, సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్చైర్మన్, చీఫ్ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్లు సిద్ధం చేశారు. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్ టెక్నాలజీతో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. -
మహిళల భద్రత అందరి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని.. సమాజంలోని అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సొంత కుటుంబ సభ్యులకు ఎక్కడైనా వేధింపులు ఎదురైతే ఎలా స్పందిస్తామో ఇతర ఆడపిల్లల విషయంలోనూ యువత అలాగే స్పందించాలని.. మహిళా రక్షణ అంబాసిడర్లు కావాలని సూచించారు. మహిళలకు అండగా ఉన్న వారికే సమాజంలో మర్యాద ఉంటుందని, అదే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీఎం రేవంత్ చెప్పారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘స్టాండ్ విత్ హర్’కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ హీరో సాయిదుర్గతేజ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, డీజీపీ బి.శివధర్రెడ్డి, సీఐడీ చీఫ్ చారుసిన్హా సహా మహిళా పోలీస్ అధికారులు, ఐఏఎస్ అధికారులతో కలిసి ‘స్టాండ్ విత్ హర్’బ్రోచర్ను సీఎం ఆవిష్కరించారు. డిజిటల్ క్రైం పెరిగింది.. ‘రాష్ట్రంలోని మహిళలకు సంపూర్ణమైన రక్షణ కలి్పంచామని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి రక్షణే అని భావిస్తున్నా. గతంలో కొన్ని ప్రాంతాల్లోనో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురయ్యేవి. కానీ ఈ రోజుల్లో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్లైన్ క్రైమ్ పెరిగిపోయింది. మహిళలను వేధించేందుకు కొందరు డీప్ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. వాటిని నియంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైం విభాగాన్ని కూడా పటిష్టం చేశాం. మనల్ని మనం సవరించుకొని మహిళలపట్ల మన బాధ్యతల్ని మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. మహిళల శక్తిసామర్థ్యాలపట్ల మా ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉంది. అందుకే రాష్ట్ర పోలీస్ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళలనే అధికారిణులుగా నియమించాం.ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం లేదా దేశం పురోగతి సాధిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. సాయిదుర్గ తేజ్ మాట్లాడుతూ సొంత తల్లిని ఎలా గౌరవిస్తామో..అదేవిధంగా ప్రతి మహిళను గౌరవించాలని సూచించారు. బైక్పై వెళ్లే సమయంలో హెల్మెట్ పెట్టుకోవడం మరవొద్దని సూచించారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతతోపాటు భద్రత కూడా సామాజిక బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలన్నారు. మహిళా భద్రతపై పురుషుల్లో మరింత అవగాహన పెంచేలా స్టాండ్ విత్ హర్ ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్లు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా పేర్కొన్నారు. -
గణపతీ.. లొంగిపోండి
సాక్షి, హైదరాబాద్: ‘గణపతి.. ఆయుధాలు అప్పగించి లొంగిపోండి. తెలంగాణ ప్రభుత్వం మీ ప్రాణానికి రక్షణ కల్పిస్తుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఏడుగురు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం సూచించారు. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని.. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించిన గాం«దీజీ మార్గంలోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం స్పష్టం చేశారు. సాయుధ బలగాలైనా, మావోయిస్టులైనా దేశ పౌరులేనని.. ఎవరి ప్రాణానికీ నష్టం జరగొద్దన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. తెలంగాణ గడ్డపై హింసకు తావులేదని చెప్పారు. మావోయిస్టు పారీ్టలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న మొత్తం 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లొంగిపోయారు. 124 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ బి.శివధర్రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్కుమార్, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ అనిల్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. దేశ చరిత్రలోనే భారీ లొంగుబాటు.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకు కృషి చేసిన తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతితోపాటు ఇతర అధికారులను అభినందించారు. ఆయుధాలు విడిచి లొంగిపోయే మావోయిస్టుల రక్షణ, ఆరోగ్య భద్రత, ఇతర పునరావాసం విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులంతా బయటికి వచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. అయితే మావోయిస్టు అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నారన్నది సమాచారం తమ వద్ద లేదన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా లేక కుటుంబ సభ్యలతో శాంతియుత జీవితం గడుపుతారా అనేది వారి ఇష్టమని సీఎం పేర్కొన్నారు. మంత్రి సీతక్క సహా ఎందరో మాజీ మావోయిస్టులు రాజకీయాల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఎవరైనా కాంగ్రెస్ పారీ్టలో చేరాలనుకుంటే గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ అందుబాటులో ఉంటారని చెప్పారు. చర్చలే పరిష్కారం.. ‘మహాత్మాగాంధీ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టారు. ప్రపంచానికి శాంతిమార్గాన్ని చూపారు. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం. తెలంగాణ గడ్డపై హింస కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం సైతం శాంతియుత మార్గాన్నే అనుసరిస్తోంది. మావోయిస్టుల్లో ఇంకా అజ్ఞాతంలో ఉన్న వారికి సీఎంగా పిలుపునిస్తున్నా. అందరూ జనజీవన స్రవంతిలోకి రండి. తెలంగాణ ప్రభుత్వం మీతో చర్చించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ఉంది’అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. లొంగిపోయేవారు ఆత్మగౌరవంతో బతికేలా సహకరిస్తాం.. ‘ఇటీవల లొంగిపోయిన దేవ్జీ, చంద్రన్న, సుజాతక్క, రాజిరెడ్డి సహా అందరూ నన్ను కలిసి ఎన్నో అంశాలపై మాట్లాడారు. అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇస్తే జైళ్లలో ఉన్న మావోయిస్టులతోపాటు అజా్ఙతంలో ఉన్న మావోయిస్టులతో చర్చించి సీపీఎం మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామని ప్రతిపాదించారు. అయితే రాష్ట్ర స్థాయిలోని అంశాలను పరిష్కరిస్తామని.. నక్సలిజం జాతీయ సమస్య కాబట్టి కేంద్రంతో మాట్లాడతామని వారికి చెప్పాను. రివార్డుల మొత్తం పెంపు, ఇల్లు, వ్యవసాయ భూమి కేటాయింపు, వైద్య సాయం కోసం లొంగిపోయిన మావోయిస్టులు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సానుకూలంగా ఉన్నాం. లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడంతోపాటు నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తాం. రివార్డుల మొత్తాన్ని పెంచే విషయంలో ఉదారంగా వ్యవహరిస్తాం. పునరావాసం మెరుగ్గా అందించే అంశంపై సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో అధ్యయం చేసి వాటిని పెంచే ప్రయత్నం చేస్తాం. చట్ట పరిధిలో ఎత్తివేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుల పరిష్కారానికి అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటాం. లొంగిపోయే వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వారి సొంత గ్రామాల్లో స్థలాలు ఇస్తాం. భూములు అందుబాటులో లేనందున వ్యవసాయ భూమి కేటాయింపులో మాత్రం ఇప్పుడే మాట ఇవ్వలేను. లొంగిపోయిన మావోయిస్టులు సమాజంలో ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానం కొనసాగించేలా ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుంది’అని సీఎం రేవంత్ చెప్పారు. అమిత్ షా పూర్తి స్వేచ్ఛనిచ్చారు.. ‘లొంగిపోయిన మావోయిస్టుల ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక వెసులుబాటు కల్పన, నివాస స్థలం, ఇళ్ల కేటాయింపు అంశాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మాజీ మావోయిస్టు నాయకుల ప్రతిపాదనలను ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఈ మేరకు ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్చలు జరపడం వల్ల దేశంలోనే తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఆయుధాలతో, పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. 2024 తర్వాత నుంచి 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 250కిపైగా ఆయుధాలు స్వాధీనం చేశారు. బుల్లెట్ ద్వారా కాదు బ్యాలెట్ ద్వారా సమస్యలు పరిష్కరించాలని నమ్మి ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు’అని రేవంత్ అన్నారు. -
పాత అసెంబ్లీ.. మళ్లీ కొత్తగా!
(సాక్షి, హైదరాబాద్) : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ‘పాత అసెంబ్లీ’గా పేరుగాంచిన గ్రాండ్ టౌన్ హాల్ భవనానికి 1905లో అప్పటి నిజాం మహబూబ్ అలీ ఖాన్ శంకుస్థాపన చేశారు. 1913లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనం నాటి నుంచి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వేదికగా నిలుస్తూ నగర చారిత్రక వైభవాన్ని గుర్తు చేస్తోంది. భారతీయ సంప్రదాయ, పాశ్చాత్య నిర్మాణ శైలి (ఇండో సెరాసోనిక్ వాస్తు శైలి లేదా ఇండో గోతిక్ నిర్మాణ శైలి) సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది. భవనం బాహ్య భాగంలో భారతీయ నిర్మాణ శైలికి ప్రత్యేకమైన గొప్ప కెనోపీలు, వంపు గవాక్షాలు, అలంకార స్తంభాలు, సున్నితమైన బ్రాకెట్లు కనిపిస్తాయి. అంతర్గత భాగంలో మాత్రం పాశ్చాత్య శైలిలో కోరింథియన్ స్తంభాలు, పూల అలంకరణలు, విక్టోరియన్ మింటన్ టైల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 1956 నుంచి ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు వేదికగా నిలిచిన ఈ భవనం 2017 వరకు వినియోగంలోనే ఉంది. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏపీ అసెంబ్లీకి కేటాయించారు. రెండేళ్ల పాటు ఈ భవనంలోనే కొనసాగిన ఏపీ అసెంబ్లీని ఆ తర్వాత అమరావతికి తరలించారు. భవనంలోని విద్యుత్, ఇతర ఫర్నిచర్ తదితరాలను ఏపీకి తరలించే క్రమంలో సీలింగ్, ఫ్లోరింగ్ వంటివి దెబ్బతిన్నాయి. శిథిలావస్థకు చేరిన చారిత్రక భవనం శతాబ్దానికిపైగా వినియోగంలో ఉన్న ఈ భవనం 2017 నాటికి పైకప్పు సరైన సంరక్షణ లేకపోవడం వల్ల బలహీనంగా మారి శిథిలావస్థకు చేరింది. చారిత్రక భవనాన్ని పునరుద్ధరించి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినా నిర్మాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావించింది. ఈ దశలో కుతుబ్షాహీ టూంబ్స్తోపాటు సుమారు వంద వరకు చారిత్రక భవనాలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించిన ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్, రోడ్డు భవనాల శాఖతో కలిసి పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సంకల్పించింది. భవనం అసలు నిర్మాణాన్ని కాపాడుతూ సంప్రదాయ నిర్మాణ పదార్థాలు, పాత పద్ధతులను మేళవించి నిపుణులైన కళాకారులతో రూ.30 కోట్లతో ఈ పనులు చేపట్టారు. సుమారు 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవన పునరుద్ధరణలో వందలాది కళాకారులు పాలుపంచుకున్నారు. అత్యవసర ప్రాధాన్యతతో చేపట్టిన ఈ పనులు ఏడాదిన్నర కాలంలో పూర్తి అయ్యాయి. సంరక్షణలో అనేక సవాళ్లుభవనంలో దెబ్బతిన్న లేదా కనుమరుగైన నిర్మాణ అంశాలను గుర్తించేందుకు విస్తృత పరిశోధన, సాంకేతిక పరిశీలనలు చేపట్టారు. వాటి ఆధారంగా భవనం నిర్మాణ బలాన్ని కాపాడుతూ పునరుద్ధరణ పనులు నిర్వహించారు. అయితే భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరాల వల్ల కొన్ని అసలు నిర్మాణ లక్షణాలను పూర్తిగా పునరుద్ధరించడం సాధ్యపడలేదు. ప్రత్యేకంగా ప్రధాన సభా మందిరంలోని కిటికీలను తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు, అలంకార ప్రవేశ ద్వారం కొంతవరకు కప్పేశాయి. భవనానికి ముందు, వెనుక భాగాల్లో నిర్మించిన ఆర్సీసీ నిర్మాణాలు అసలు ఆర్కేడ్లను అడ్డుకోవడంతో సరైన గాలి, వెలుతురు లేకుండా పోయింది. మరోవైపు పాత భవనం చుట్టూ వివిధ సందర్భాల్లో చేపట్టిన ఇతర నిర్మాణాల మూలంగా భవనంలోని అసలు వర్షపు నీటిపారుదల వ్యవస్థ కూడా మూసుకుపోయింది. దీంతో తీవ్రమైన నీటి లీకేజీతో పైకప్పు బలహీనపడింది. ఈ సమస్యలను పరిష్కరించడం పునరుద్ధరణలో సవాల్గా నిలిచింది. లైమ్ మోరా్టర్ నిపుణులు, మట్టి కళాకారులు, రాగి పనివాళ్లు, సంప్రదాయ టైల్స్ తయారీదారులు, కార్పెంటర్లు సహా అనేక రంగాల కళాకారులు పునరుద్ధరణ పనుల్లో పాల్గొన్నారు. మొత్తం 50వేలకు పైగా పనిదినాలు ఈ ప్రాజెక్టుకు వినియోగించారు. ప్రధాన సభా మందిరంలోనూ.. భవనంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం ప్రధాన సభా మందిరంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్మాణాలను తొలగించడంతో ఇటుకలతో కూడిన జాక్ ఆర్చ్ నిర్మాణం బయటపడింది. హాల్లోని గోడలపై పూసిన ఎనామెల్ పెయింట్ పొరలను కూడా తొలగించడంతో ఒరిజినల్ శైలి బయట పడింది. 10వేల చదరపు అడుగులకుపైగా గోడలపై ఉన్న పూతలను తొలగించి అసలు స్టక్కో అలంకరణలను వెలికితీశారు. కోరింథియన్ స్తంభాలు, అలంకార బ్రాకెట్లు, గవాక్షాలపై ఉన్న శిల్పాలను శుభ్రపరచి పునరుద్ధరించారు. హాల్ రెండు వైపులా తరువాతి కాలంలో నిర్మించిన బాల్కనీలు అసలు గవాక్షాల అందాన్ని తగ్గిస్తున్నాయని గుర్తించి సవరించారు. కారిడార్లలోనూ గాలి, వెలుతురు వచ్చేలా చేశారు. కారిడార్లు, మొదటి అంతస్తులో పాతకాలం నాటి విక్టోరియల్ టైల్స్తో మరమ్మతులు చేశారు. బాహ్య భాగంలో అలంకార శిల్పాలు భవనం బాహ్య నిర్మాణంలో బ్రాకెట్లు, చత్రాలు, ఫినియల్స్ వంటి అలంకార శిల్పాలు విస్తారంగా ఉన్నాయి. పునరుద్ధరణకు ముందు ఇవి తీవ్రంగా దెబ్బతిన్నాయి. చజ్జాలు విరిగిపోవడం, బ్రాకెట్లు పగలడం వంటి సమస్యలు కనిపించాయి. తర్వాత 100 మీటర్లకు పైగా చజ్జాలను సంప్రదాయ పద్ధతిలో పునర్మించారు. 1.5 నుంచి 3 అడుగుల ఎత్తు కలిగిన 250కిపైగా అలంకార పూలకుండలను సంప్రదాయ పద్ధతిలో తయారు చేశారు. రాతి నిర్మాణాన్ని శుభ్రపరిచి అసలు నేలస్థాయిని గుర్తించి చుట్టుపక్కల మట్టిని తగ్గించారు. నీటి చొరబాటును నివారించేందుకు 50 మి.మీ మందంతో గ్రానైట్ రక్షణ పొర ఏర్పాటు చేశారు. మొత్తంగా శాసన మండలి భవనం పునరుద్ధరణతో చారిత్రక నిర్మాణ కళను పునరుజ్జీవింపజేసి తెలంగాణ చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిపే ప్రయత్నాలు చేశారు. ఆధునిక వసతులతో ఏర్పాట్లుతెలంగాణ చారిత్రక వారసత్వానికి చిహ్నంగా ఉన్న శాసనమండలి భవనాన్ని అధునాతన వసతులతో తీర్చిదిద్దాం. కేవలం ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసుకున్న ఈ భవ నంలో అధునాతన, సౌండ్ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండలిలో 40 మంది సభ్యులు ఉండగా, 50 మంది కూర్చునేలా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యమంత్రి, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, వైస్చైర్మన్, చీఫ్ విప్, కార్యదర్శి, మంత్రులు, సభ్యుల కోసం ప్రత్యేక లాంజ్లు సిద్ధం చేశారు. భవిష్య త్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధునాతన డిజిటల్ టెక్నాలజీతో సీటింగ్ ఏర్పాట్లు ఉన్నా యి. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 8న ఈ భవనాన్ని ప్రారంభిస్తున్నారు. – గుత్తా సుఖేందర్రెడ్డి, శాసన మండలి చైర్మన్ -
సీఎస్గా జయేశ్? లేదా వికాస్?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో కీలకమైన ప్రధాన కార్యదర్శి (సీఎస్) పదవి ఎవరిని వరించనుందన్న అంశం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది, ఈనెల 31న సీఎస్గా కె.రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో కీలక స్థానాల్లోని 8 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల్లో నుంచి ఒకరిని సీఎం రేవంత్రెడ్డి ఎంపిక చేసుకోనున్నారు. ప్రధానంగా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్; రోడ్లు–భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ మధ్య పోటీ ఉన్నట్లు సచివాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది.వీరిద్దరిలో ఒకరిని రేవంత్రెడ్డి సీఎస్గా ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వారిలో శశాంక్గోయల్ (ఢిల్లీలో తెలంగాణ భవనస్పెషల్ సీఎస్), సంజయ్ జాజు (కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి), సవ్యసాచిఘోష్ (రాష్ట్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ కార్యక్రమాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), నవీన్ మిత్తల్ (ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), దాన కిషోర్ ( కార్మిక శాఖ, గవర్నర్ స్పెషల్ సీఎస్) ఉన్నారు. వీరితోపాటు ఫార్ములా ఈ–కార్ రేసులో ముద్దాయిగా ఉన్న అర్వింద్కుమార్ కూడా ఉన్నారు. అయితే, ఇటీవలే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అన్నీతానై... జయేశ్ రంజన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కీలక అధికారిగా మారారు. ఏడెనిమిది సంవత్సరాలుగా ఆయన పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచి్చన తరువాత ఆయన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో సఖ్యంగా లేకపోవడం.. అన్నీ తానై వ్యవహరించడంతోపాటు కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే తాను జవాబుదారీ అన్నవిధంగా ఉండటంతో మంత్రి ఒత్తిడి మేరకు ఆయనను అక్కడ నుంచి తప్పించారు. ఆ తరువాత ‘టాస్్క’పేరిట సీఎం నేతృత్వంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ వ్యవహారాలను అప్పగించారు. అక్కడ నుంచి తప్పించి ఆయనకు ఈ మధ్యనే పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అయితే ఆయన సీరియస్గా ఉండరన్న ప్రచారం విస్తృతంగా ఉంది. ఒక శాఖకు అధికారిగా వ్యవహరించడం వేరు.. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని వెళ్లడం వేరని ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జయేశ్రంజన్ ఏ మేరకు సఫలీకృతం అవుతారన్నది ప్రశ్నార్థకమని అంటున్నారు. మిగిలిన వారు ఎలా..? ఇక వికాస్రాజ్ అయితే.. కాస్త ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. ఇప్పటివరకు ఆయన వివాదరహితుడిగా ఉన్నారు. అదే సమయంలో చొరవ తీసుకుని అధికార యంత్రాంగాన్ని ముందుకు నడిపించిన దాఖలాలు పెద్దగా లేవని సచివాలయ వర్గాల కథనం. తెలంగాణ భవన్లో స్పెషల్ సీఎస్గా ఉన్న శశాంక్గోయల్ను పిలిచి సీఎస్ పదవిచ్చే అవకాశం లేదంటున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్జాజు రాష్ట్రానికి రావడానికి ఇష్టపడటం లేదని సమాచారం. ఇక అర్వింద్కుమార్ సస్పెండైన నేపథ్యంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చే అవకాశం లేదంటున్నారు. సవ్యసాచి ఘోష్ విషయానికొస్తే.. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కాస్త గుర్తింపు కలిగిన శాఖల ఫోకల్ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఈ మధ్యనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి పొందిన నవీన్మిత్తల్, దాన కిషోర్లకు సీఎస్ పదవి దక్కే అవకాశం లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో రానున్న రెండేళ్లు ప్రభుత్వానికి కీలకం కావడం వల్ల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జోడెద్దులుగా ముందుకుతీసుకెళ్లకలిగే అధికారికే రేవంత్రెడ్డి పట్టం కడతారని సమాచారం. -
Hyd: ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే: సీఎం రేవంత్
హైదరాబాద్: నగరాన్ని క్లీన్సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ రోజు శనివారం(మార్చి 7వ తేదీ) మున్సిపల్ కమిషనర్లతో జరిగిన సమీక్షలో సీఎం రేవంత్.. ఈ మేరకు పలు సూచనలు చేశారు. ‘నగరంలో ప్రతీరోజు ఇంటింటికి చెత్త సేకరణ జరగాల్సిందే. కార్పొరేషన్స్ కోర్, అర్బన్ రీజియన్ పరిధిలో ప్రతీరోజు చెత్త సేకరణ జరిగేలా చర్యలు చేపట్టాలి. చెత్త సేకరణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా ఇప్పటి నుంచే ప్రోత్సహించాలి. ఒక్కో వాహనానికి ఒక్కో ఏరియా చొప్పున కేటాయించి నిరంతరం పర్యవేక్షించాలి. నగరం పరిధి విస్తరించిన నేపథ్యంలో ఇప్పటికే కొత్తగా గుర్తించిన డంప్ యార్డులను వీలైనంత త్వరగా సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావాలి. కార్పోరేషన్ల వారీగా దగ్గరలోని డంపింగ్ యార్డులకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకోవాలి. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. క్యూర్ పరిధిలోని ట్రై మున్సిపల్ కార్పోరేషన్లలో నిర్మాణ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణ వ్యర్థాల తరలింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అపరిశుభ్రత లేకుండా చూసుకోవడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులకు సరైన వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలి’ అని పేర్కొన్నారు. -
లొంగిపోయేందుకు బయల్దేరిన మావోయిస్టులు
-
రేవంత్.. రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం లేదా?: హరీష్ రావు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఎండిపోయిన పంటలను శనివారం పరిశీలించారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘మూడు పంటలకు రైతుభరోసా ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి.. మూడు పంటలకూ డబ్బులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు పోతారు?. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా?.కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు పండుతున్నాయి. హైదరాబాద్కు తాగు నీరు కాళేశ్వరం నీల్లే వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి.. ముందు చిల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. కాళేశ్వరం కూలిపోయింది అంటూ ఎన్నికల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తారా?. ప్రాజెక్ట్ను ఎండబెట్టాలని చూస్తున్నారా?. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్ చేయించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం పది వేల ఎకరాలకు నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు. -
సోషల్ మీడియా వల్లే నేరాలు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : గతంలో మహిళలపై వేదింపులు పట్టణాలకే పరిమితమయ్యేవని కానీ ప్రస్తుత రోజుల్లో వాటి పరిధి పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన "స్టాండ్ విత్ హర్" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోషల్ మీడియా కారణంగానే మహిళలపై వేదింపులు పెరిగాయని సీఎం అన్నారు. నారీమణుల భద్రత కోసం కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదని వాటిని అమలు చేసి తీరాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని పథకాలు మహిళల పేరు మీదే అమలు చేస్తున్నామన్నారు. మహిళ సంఘాల ద్వారా ఆర్టీసీలో 1000 బస్సులు నడుపుతున్నామని రాష్ట్రం అభివృద్ధిలో దూసుకపోతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం పురుషులు ముందుకు రావాలనే సందేశంతో తెలంగాణ పోలీస్ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. "స్టాండ్ విత్ హర్" ప్రోగ్రామ్కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, డీజీపీ శివధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ సమక్షంలో లొంగిపోనున్న మావోయిస్టులు.. గణపతిపై క్లారిటీ?
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టుల ఉద్యమం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. 100 మంది పీఎల్జీఏ మావోయిస్టులు లొంగిపోతున్నట్టు సమాచారం. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. సీఎం సమక్షంలో ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఈ సందర్బంగా బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. లొంగిపోతున్న వారిలో పీఎల్జీఏ బెటాలియన్ కంపెనీ కమాండర్ కొరసా లక్కు, ఉకి కల్లు, చలసాని నవత, అరుణ, సుధాకర్ ఉన్నట్టు తెలుస్తోంది. -
నెరవేరిన సీఎం హామీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం మీదుగా పాదయాత్రగా వెళుతున్న అప్పటి పీసీసీ అధ్యక్షుడు, నేటి సీఎం రేవంత్రెడ్డిని భిక్కనూరు లక్ష్మి అనే మహిళ కలిసి కూలిపోయిన తన ఇంటిని చూడమని వేడుకుంది. దీంతో రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ కూలిపోయిన ఆమె ఇంటిని చూసి తాము అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చి వెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’అన్న శీర్షికతో ‘సాక్షి’మెయిన్ ఎడిషన్లో 2023 డిసెంబర్ 31న కూలిపోయిన ఇంటిలో భిక్కనూరు లక్ష్మితో మాట్లాడుతున్న ఫొటోతో ప్రచురించిన కథనానికి సీఎంవో అధికారులు స్పందించారు. అదేరోజు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భిక్కనూరు లక్ష్మికి వెంటనే అప్పటికే పక్క గ్రామంలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు లక్ష్మి దగ్గరకు వెళ్లి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని చెప్పారు. అయితే కూలిన ఇంటి స్థలంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని ఆమె చెప్పడంతో ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపించారు. తొలి విడతలోనే లక్ష్మితో పాటు ఆమె తోటి కోడలు రాజమణికి కూడా ఇల్లు మంజూరైంది. ఎట్టకేలకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న లక్ష్మి కుటుంబ సభ్యులు శనివారం గృహ ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పాదయాత్రలో ఇచి్చన మాట ప్రకారం సీఎం రేవంత్రెడ్డి లక్ష్మికి ఇల్లు మంజూరు చేశారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారి గృహ ప్రవేశానికి తాను హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పేద మహిళలకు న్యాయం చేసిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్ /శంషాబాద్: ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా హైదరాబాద్ అవతరించనుందని, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, ట్రంప్, ఎలాన్ మస్క్ వంటి వారి సంస్థలు హైదరాబాద్కు రాబోతున్నాయని, ప్రపంచంతోనే పోటీపడే నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్మించిన కొత్వాల్గూడ ఎకోపార్కును ఆయన శుక్రవారం ప్రారంభించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ భారత్ ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శంషాబాద్ హైస్పీడ్ రైల్ టెరి్మనల్, బుద్వేల్ ట్రంపెట్, ఎకో పార్కు వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా ఆవిష్కరించనున్నాయన్నారు. హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశంలోనే లేదన్నారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారని, కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకొచ్చారని చెప్పారు. మూసీ వరదల నుంచి కాపాడుకునేందుకు నాటి నిజాం నవాబు హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లను నిర్మించాడన్నారు. ఉస్మానియా ఆస్పత్రి, గోల్కొండ, అసెంబ్లీ వంటి చారిత్రక కట్టడాలు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పారు. ఎంతో అందమైన హైదరాబాద్ నగరం ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని, అలాంటి నగరాన్ని తిరిగి అందంగా, మరింత సుందరంగా చేస్తామంటే ప్రతిపక్షంలో ఉన్నవారు ఒప్పుకోవడం లేదన్నారు. మూసీ మురికిలో బతకాలని ఎవరూ కోరుకోరని, గంగా, యమున నదుల తరహాలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులు, గ్రీన్ఫీల్డ్ రోడ్లు, రేడియల్ రోడ్ల వల్ల భూములు కోల్పోయే వారికి తగిన పరిహారం అందజేస్తామని, వారికి ఎలాంటి నష్టాలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఉత్తమ ప్యాకేజీని అందజేసే బాధ్యత తానే తీసుకుంటానని సీఎం చెప్పారు. నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కేటీఆర్ అడ్డుపడుతున్నాడని, చాలాకాలం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మూసీని నైట్ ఎకానమీ ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. పాలపిట్ట రంగులో ఉన్న ఇందిరమ్మ చీరలు ధరించిన మహిళలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.బుద్వేల్ ట్రంపెట్ ఇంటర్ఛేంజ్ ప్రత్యేకతలు అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.488 కోట్లు ఖర్చు చేసి ట్రంపెట్ను నిర్మించనున్నారు. ఇది ఓఆర్ఆర్ను రేడియల్ రోడ్–2తో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం లూపులు, ర్యాంపులు 15.36 కిలోమీటర్లు ఉంటాయి. 1.5 కిలోమీటర్ల సరీ్వస్ రోడ్ అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రంపెట్లో 59 పియర్లు, 60 స్పాన్లు ఉంటాయి. ఇది భూమి నుంచి 26 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కొత్వాల్గూడ ఎకో–హిల్ పార్కు హిమాయత్సాగర్ సమీపంలో 85 ఎకరాల్లో ఎకో–హిల్పార్కును అభివృద్ధి చేశారు. ఇందులో దాదాపు 10 లక్షల మొక్కలు నాటారు. ఈ పార్కు హైదరాబాద్ నగరానికి గ్రీన్ లంగ్స్పేస్గా మారనుంది. దేశ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు చేశారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పక్షుల ఏవియరీ ఇక్కడ ఏర్పాటు చేశారు. 4.8 ఎకరాల విస్తీర్ణంలో 6,500 పక్షులకు ఆవాసంగా ఈ ఏవియరీ ఉంటుంది. పార్కులో 1.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ బోర్డ్ వాక్, 400 సీట్ల ఓపెన్ ఎయిర్ థియేటర్, సీతాకోక చిలుకల గార్డెన్, సెన్సరీ పార్కు, పిల్లల కోసం నేచురల్ ప్లే ఏరియా తదితర సదుపాయాలు ఉంటాయి. ఈ పార్కును సందర్శించడం వల్ల సింగపూర్లో పర్యటిస్తున్న అనుభూతి కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. పార్కు ప్రారంభించిన అనంతరం ఆయన అందులో కలియతిరిగారు. -
నేను అందరివాడిని
సాక్షి, హైదరాబాద్: బలహీనుల పక్షాన నిలబడే మొదటి వ్యక్తిగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్ఘాటించారు. సామాజికంగా, ఆర్థికంగా బలహీనులుగా ఉన్న వారికి అండగా నిలిచి వారి లక్ష్య సాధన కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో భాగంగా మందకృష్ణ, సతీశ్ మాదిగ తదితరులు కలిసినప్పుడు అండగా నిలిచానన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీలో తొలి ప్రకటన చేసింది తమ ప్రభుత్వమేనని గుర్తుచేశారు.రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ శుక్రవారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో కృతజ్ఞత సభ నిర్వహించింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్గీకరణపై వడివడిగా కదిలాం.. ‘ఎస్సీ వర్గీకరణ అంశం దశాబ్దాలపాటు నలిగింది. ఎలాగైనా వర్గీకరణ సాధించాలన్న తపనతో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు, తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్లుగా ఈ సమస్యను ప్రత్యక్షంగా చూస్తూ వచ్చిన నేను మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చా. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు నాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్తోపాటు నన్ను సభ నుంచి బయటకు గెంటేశారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన ప్రజాప్రభుత్వం.. వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయడంతోపాటు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది.అలాగే వన్ మ్యాన్ కమిషన్ను నియమించి ఆ కమిషన్ నివేదిక ఆధారంగా వర్గీకరణ అమలు చేసింది. ఇలా అన్నీ వేగంగా, విజయవంతంగా పూర్తి చేశాం. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించకపోవచ్చు. కానీ వీలైనంత వరకు పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. పదోన్నతులు, ఉన్నత విద్య, లిడ్క్యాప్ భూముల పరిరక్షణ లాంటి సమస్యల పరిష్కారం పెద్ద విషయం కాదు.ప్రభుత్వం మీ సమస్యలను ముందుండి పరిష్కరిస్తున్నప్పుడు వెనుక నుంచి జరిగే దాడులను మీరే ఆపాలి. మీరే నాకు అండగా నిలవాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకొని ముందుకెళ్లాలి’అని సీఎం రేవంత్రెడ్డి కోరారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లు అన్నీ ప్రభుత్వ ఉద్యోగులేనని.. ప్రభుత్వం తలపెట్టిన 99 రోజుల ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. మిత్రధర్మం... పేదల పక్షం... ‘మహాభారతంలో అర్జునుడు, కృష్ణుడు అందరికీ ఇష్టమే. కానీ నాకు కర్ణుడు, బార్బరికుడంటే అభిమానం. కర్ణుడు మిత్రధర్మాన్ని చివరి వరకు పాటించాడు. ఘటోత్కచుడి కుమారుడు బార్బరికుడు మాత్రం బలహీనుల పక్షాన నిలబడి పోరాడాడు. నేను కూడా బలహీనుల ఆశయ సాధన, సమస్యల పరిష్కారంలో ముందుంటా. వర్గీకరణ విషయంలో న్యాయం ఉంది. మీరు బలహీనులు కాబట్టే రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా మాదిగల పక్షాన నిలబడ్డా. నా ప్రయత్నంలో మంత్రివర్గ సహచరులు, అధికారులు సమయస్ఫూర్తి చూపి అండగా నిలబడ్డారు’అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. నా శక్తి ఉన్నంత వరకు సాయం చేస్తా.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం పంచేందుకు భూములు లేవు. అలాగే ఆర్థిక వెసులుబాటు పరిమితంగా ఉంది. ఈ నేపథ్యంలో దారిద్య్రరేఖలో ఉన్న మాదిగ జాతి ముందుకు నడవాలంటే విద్య అవసరం. అందుకే నాణ్యమైన విద్యను ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచాం. విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తెస్తుంది. గత ప్రభుత్వం పేదలకు బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చామని చెప్పింది. చెప్పులు కుట్టుకొమ్మంది.బర్రెలు, గొర్రెలు, చేపలతో కాదు.. మీ జాతి బిడ్డలంతా కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలి. ఉన్నత స్థానాల్లోకి ఎదగాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. నా శక్తి ఉన్నంత వరకు మీకు సాయం చేస్తా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జగ్జీవన్రామ్ కుమార్తె మీరాకుమార్ ఎలా పనిచేశారో అదే స్ఫూర్తితో నేనూ పనిచేస్తా. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు నన్ను రేవంత్ మాదిగ అన్నారు. ఇంకొన్ని పేర్లతోనూ పిలిచారు. నన్ను ఎలా పిలిచినా ఇబ్బంది లేదు.. నేను అందరి వాడిని’అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.ఎనిమిది నెలల్లోనే పూర్తి: మంత్రి దామోదర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను 8 నెలల్లోనే పూర్తి చేసి చరిత్ర సృష్టించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తదుపరి నిమిషమే సీఎంకు అసెంబ్లీలో సమాచారం ఇచ్చానని, వెంటనే సీఎం స్పందించి అసెంబ్లీలో ప్రకటన చేశారని.. కేవలం గంట వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. వర్గీకరణతో ఉద్యోగాలు, విద్యలో మాదిగలకు అవకాశాలు పెరుగుతాయని.. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు సబ్ప్లాన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు.గ్రూప్–1 ఉద్యోగాలు వచ్చాయి: అడ్లూరి ఎస్సీ వర్గీకరణ అమలుతో అత్యంత పేద కుటుంబాలకు గ్రూప్–1 లాంటి ఉద్యోగాలు వచ్చాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. వర్గీకరణ వల్లే 778 మందికి వైద్య విద్యలో ప్రవేశాలు, ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయన్నారు. దశాబ్దాల క్రితం కొట్లాడిన దానికి ఇప్పుడు ఫలితాలు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. -
అందుకే మాదిగల వైపు నిలబడ్డా: సీఎం రేవంత్
హైదరాబాద్: చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోందని, ఈ అంశాన్ని 20 ఏళ్ల నుంచి గమనిస్తున్నాని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిర్వహిస్తున్న ధన్యవాద సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ మేం మాటలతో గెలవలేదు.. కమిట్మెంట్తో గెలిచాం. వర్గీకరణ అంశంలో మాదిగవైపు న్యాయం ఉంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపే నిలబడ్డాను. తెలంగాణ పునర్నిర్మాణంలో మాదిగల భాగస్వాములు కావాలి. ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న బలమైన ఆకాంక్షతో 2023 ఎన్నికల్లో కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023 లో మా దగ్గర అధికార యంత్రాంగం, అక్రమ సంపాదన లేదు..చాలా కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ అంశం నలుగుతోంది. పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలా అయితే సాధించుకోవాలన్న తపనతో కొందరు ప్రాణ త్యాగాలు చేశారు. ఎన్నో చిక్కుముడులు, కమిషన్లు,తర్జనభర్జనలు జరిగాయి. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా నేను చూస్తూ వస్తున్నాను. మీరు కోట్లాడిన ప్రతి సందర్భంలో నా చేతనైనా సాయం చేస్తూ వచ్చాను. క్రిష్ణ మాదిగ, సతీష్ మాదిగ నా దగ్గరకు వచ్చినప్పుడు చేతనైన సాయం చేసి అండగా నిలిచాను. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్ తో పాటు నన్ను బయటకు గెంటివేశారు. నాకు మహాభారతంలో కర్ణుడు, బార్బరీకుడు అనే పాత్రలు ఇష్టం. కర్ణుడికి అవమానం జరిగినప్పుడు పోరాటం చేశారు.. మిత్రధర్మాన్ని నేరవేర్చాడు. నేను కూడా మిత్రధర్మాన్ని నిర్వర్తించాను.. మాదిగలకు నేను అండగా నిలబడ్డాను. నా శక్తి ఉన్నంతవరకూ మీకు సాయం చేస్తాను’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
మరోసారి ప్రజల్లోకి ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి మరోసారి ప్రజల్లోకి వెళ్తోంది. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’పేరిట 99 రోజుల కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల్లోకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్రెడ్డి 10 థీమ్స్తో 99 రోజుల కార్యాచరణను ప్రకటించిన సంగతి విదితమే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇది మూడోసారి. గత రెండు విడతల్లో వచ్చి న ఆర్జీలతో రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చి ంది. ఇప్పుడు ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’పేరుతో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ ప్రకటించింది. పౌర సేవలు, ప్రజల అవసరాలతో మమేకమై ఉండే అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ హించనుంది. ఈమేరకు ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన విడు దల చేసింది. ఐదు స్థాయిల్లో : గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదు స్థాయిల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో పారిశుధ్యంతోపాటు పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఇందులో భాగస్వాములను చేసింది. మండలాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ శాఖల అధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లు, ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనుంది. అన్ని స్థాయిల్లోనూ గ్రామ సర్పంచి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేసేలా మార్గదర్శకాలను రూపొందించింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో వస్తున్న సంస్కరణలు, వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లను తీర్చిదిద్దే ప్రణాళికను సర్కారు ప్రజలకు వివరించనుంది. అలాగే, సోలార్ విద్యుత్తు వినియోగం పెంచటం, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలను ప్రజలకు, రైతులకు తెలియజేయనుంది. యువతకు నైపుణ్యాల శిక్షణతోపాటు ఉపాధి కల్పించే కార్యక్రమాలను ఈ యాక్షన్ ప్లాన్లో పేర్కొంది, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించి.. లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందిరా మహిళా శక్తి సాధిస్తున్న విజయాలను, కొత్తగా వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించనుంది.కార్యాచరణ ఇలా...1వ వారం – గ్రామీణాభివృద్ధి (మార్చి 30 నుంచి ఏప్రిల్ 4) 2వ వారం – ఆరోగ్య రంగం (ఏప్రిల్ 6 నుంచి 11) 3వ వారం – అరైవ్–అలైవ్ (ఏప్రిల్13 నుంచి 18) 4వ వారం – సంక్షేమం (ఏప్రిల్ 20 నుంచి 25) 5వ వారం – పిల్లల భద్రత, డ్రగ్స్ అడ్డుకట్ట (ఏప్రిల్ 27 నుంచి మే2) 6వ వారం – రైతు సంక్షేమం (మే 4 నుంచి 9) 7వ వారం – విద్య (మే 11 నుంచి 16) 8వ వారం – యువత, క్రీడలు (మే 18 నుంచి 23) 9వ వారం – మహిళా సంక్షేమం (మే 25 నుంచి 30) 10వ వారం – పర్యావరణం (జూన్ 1 నుంచి 6) -
‘మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’
సాక్షి,హైదరాబాద్: మూసీ నది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్’అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. గురువారం కేటీఆర్ నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ బుల్డోజర్లకు అడ్డంగా నిలబడుతాం. పేదల ఇళ్ళు కాపాడుతాం. మూసీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తోన్న లూటీని అడ్డుకుంటాం. పేము కట్టిన ఇళ్ళకు పెయింటర్ బాబు రంగులు మార్చుతున్నాడు. రేవంత్ హాయంలో ఒక్క ఇల్లు కట్టినట్లు చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. రేవంత్ .. చేతకాకుంటే మాకు అప్పజెప్పు ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేసి చూపిస్తాం.మూసీ సుందరీకరణకు పునాది వేసిందే కేసీఆర్. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పేదలు కన్నీరు కార్చిన ప్రభుత్వాలు మనుగడలేదు. 16వేల కోట్లతో పోయేదాన్ని లక్షా 50వేల కోట్లకు రేవంత్ పెంచారు. రెండేళ్ళు అయినా మూసీ సుందరీకరణపై డీపీఆర్ లేదు.కూల్చకుండా కూడా అభివృద్ధి చేయొచ్చని కేసీఆర్ నిరూపించారు. కోస్గిలో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. రేవంత్ రెడ్డి సోదరుడు ఇల్లు దుర్గం చెరువులో ఉంది. పొంగులేటి, వివేక్, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు బఫర్లో ఉన్నాయి. ఒక్క ఇల్లు కూల్చకుండా ఆరు కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేశాం. 30కోట్లతో ఉప్పల్ లో శిల్పారామాన్ని కూడా నిర్మించా’మని స్పష్టం చేశారు. -
పట్టు పట్టి.. సన్నిహితుడికి ‘పట్టం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ స్థానం ఇప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. వాస్తవానికి, ఈ దఫా రాష్ట్రం నుంచి ఇద్దరికి రాజ్యసభకు వెళ్లే అవకాశం లభించింది. ఈ రెండు స్థానాల్లో ఒకటి అధిష్టానం కోటాకు వెళుతుందని, మరొకటి తెలంగాణ నాయకత్వానికి వస్తుందనే చర్చ మొదటి నుంచి జరిగింది.అయితే తెలంగాణకు వచ్చే ఒక స్థానం విషయంలో సామాజిక వర్గాల వారీగా సమీకరణలు తెరపైకి వచ్చాయి. అధిష్టానం కోటాలో అగ్రవర్ణాలకు చెందిన సింఘ్వీ కేటాయించాల్సి ఉన్నందున మరో స్థానాన్ని బీసీ లేదా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలన్న ప్రతిపాదన బలంగా వినిపించింది. అయితే, ఇదే సామాజిక వర్గ కోణాన్ని సీఎం రేవంత్రెడ్డి అధిష్టానం ముందు పెట్టి తన మాట నెగ్గించుకోగలిగారని పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ పార్టీ అనేక అడుగులు వేస్తోందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఇప్పటికే పలుసార్లు ప్రాధాన్యం ఇచ్చామని, ఈసారి తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నేతకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఆయన అధిష్టానం ముందు తన ఆలోచనను వెలిబుచ్చారని చెబుతున్నాయి.. ఈ కోణంలోనే తనకు చేదోడువాదోడుగా ఉండే అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని ఆయన మొదటి నుంచి చర్చల్లో ఉంచగలిగారని, ఆయనకు ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాన్ని సీఎం అధిష్టానానికి స్పష్టంగా వివరించగలిగారని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. పోయిన సారే అనుకున్నా... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరకకపోవడంతో తన సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డిని ఎలాగైనా రాజ్యసభకు పంపాలని సీఎం రేవంత్ అనుకున్నారు. అందులో భాగంగా పార్టీ అధికారంలోకి వచ్చి న తర్వాత తొలిసారి జరిగిన రాజ్యసభ ఎన్నిక సమయంలోనే వేం నరేందర్రెడ్డి పేరును ప్రతిపాదించారు. అయితే అగ్రవర్ణాలకు చెందిన రేణుకాచౌదరికి ఒక స్థానం ఇవ్వాల్సి రావడంతో బీసీ వర్గానికి చెందిన అనిల్కుమార్యాదవ్కు అవకాశం లభించింది. మధ్యలో వచ్చిన మరో స్థానాన్ని అధిష్టాన కోటాలో సుప్రీంకోర్టు న్యాయవాది సింఘ్వీకి కేటాయించారు. తమిళనాడు తికమక త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే కేటాయించే స్థానాలు, అక్కడ పోటీ చేసే అభ్యర్థుల విషయం తేలడంలో జాప్యం జరిగింది. పరిస్థితిని బట్టి సింఘ్వీ తమిళనాడుకు వెళ్లే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది. దీంతో అధిష్టానం కోటాకు ఒక స్థానం వెళుతుందా లేదంటే రెండు స్థానాలు తెలంగాణ నాయకులకే వస్తాయా అనే మీమాంస మంగళవారం వరకు కొనసాగింది. ఒకవేళ తెలంగాణకు రెండు స్థానాలు కేటాయించాల్సి వస్తే ఒకటి ఓసీకి మరొకటి బీసీకి ఇస్తారనే చర్చ జరిగింది. అయితే తమిళనాడు నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి ఒకటే స్థానాన్ని ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించడంతో సింఘ్వీ తెలంగాణకు ఖరారయ్యారు. మిగిలిన ఒక స్థానాన్ని నరేందర్రెడ్డికి కేటాయించారు. నేడు నామినేషన్లు రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని రాజ్యసభ ఎన్నికల కార్యాలయంలో తమ నామినేషన్లను వారు సమర్పిస్తారు. ఈ నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తదితరులు హాజరుకానున్నారు. ఇతర నామినేషన్లు దాఖలు కాని పక్షంలో ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఈ ఇద్దరి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది. -
అదనంగా ఐపీఎస్లను కేటాయించండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని..తర్వాత 2021లో జరగాల్సిన రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని తెలిపారు. ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని వివరించారు. బుధవారం రాత్రి ఢిల్లీలో అమిత్షాతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికీ అనేక ఆధునిక సవాళ్లు దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని చెప్పారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని, ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్ అధికారులు ఉండగా.. ఆ సంఖ్యను 105కు పెంచాలని రేవంత్ కోరారు. 591 మంది మావోయిస్టులు లొంగిపోయారు.. ఇటీవలి కాలంలో మావోయిస్టుల లొంగుబాట్లపై అమిత్షాతో సీఎం చర్చించారు. అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం తదితర అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్లో గణనీయమైన మార్పులు వచ్చాయని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలోనే 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని షా దృష్టికి తీసుకెళ్లారు. పలువురు అగ్రనేతలు సైతం సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని చెబుతూ.. వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం తదితర విషయాలను వివరించారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి సహకరించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. ఈ సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, డీజీపీ బి.శివధర్రెడ్డి, అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) విజయ్కుమార్, ఎస్ఐబీ చీఫ్, ఐజీ బి.సుమతి పాల్గొన్నారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం.. బుధవారం ఢిల్లీకి వచ్చిన సీఎం రాత్రి ఇక్కడే బస చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్కు వెళ్లి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
దేవాదుల 100 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 38 నుంచి 100 టీఎంసీలకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఈ మేరకు వచ్చిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి సానుకూలంగా స్పందించారు. దేవాదుల సామర్థ్యం పెంచేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఓ కార్యదర్శి మాణిక్రాజ్, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్కు ఈ బాధ్యతలు అప్పగించారు. తొలుత 50 టీఎంసీలు: గోదావరి ఎత్తిపోతలు పథకం పేరుతో 1995–2000 మధ్య దేవాదుల ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. గోదావరి నుంచి జూన్–నవంబర్ మధ్యకాలంలో 150 రోజుల పాటు 50 టీఎంసీలు తరలించి 2 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించాలని అప్పట్లో యోచించారు. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణంపై అధ్యయనం జరపడానికి 2001లో జీవో జారీ చేశారు. అయితే తొలి దశ కింద 5.18 టీఎంసీలు తరలించి 1.23 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2003లో, రెండో దశ కింద 7.25 టీఎంసీలను తరలించి 1.93 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2005లో, మూడో దశ కింద 25.75 టీఎంసీలను తరలించి 2.39 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి 2007లో పరిపాలనపరమైన అనుమతులు జారీ అయ్యాయి. మొత్తం మూడు దశల్లో 38.16 టీఎంసీలను తరలించి 5,56,722 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టు ప్రారంభించిన వైఎస్ ప్రభుత్వం 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జలయజ్ఞం కింద ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. 2005లోనే ప్రాజెక్టుకి పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. మూడు దశలు కలిపి మొత్తం రూ.6,016 కోట్ల వ్యయం అంచనాలతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళిక సంఘం పెట్టుబడి అనుమతులు (ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్) ఇచ్చింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)లోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టీఏసీ) 2007లో అనుమతులు జారీ చేసింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2015లో దేవాదుల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 నుంచి 60 టీఎంసీలకు పొడిగించింది. కానీ సీడబ్ల్యూసీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో 38.16 టీఎంసీలకే పరిమితమయ్యింది. మూడు దశల కింద హనుమకొండ, వరంగల్, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, ములుగు జిల్లాల్లో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. వచ్చే కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం! ‘సత్వర సాగునీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ)’కింద ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2005–06లో రూ.6,016 కోట్లుగా ఉండగా.. 2016–17 నాటికి రూ.13,445 కోట్లకు చేరింది. తాజాగా రూ.18,400 కోట్లకు చేరింది. దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదించాల్సి ఉంది. అంచనాల పెంపుతో పాటు, తాజాగా ప్రాజెక్టు సామర్థ్యం పెంచాలనే నిర్ణయం తీసుకోవడంతో ఈ రెండు ప్రతిపాదనలపై తదుపరి కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణ! ప్రాజెక్టు సామర్థ్యం 100 టీఎంసీలకు పెంచితే ఏడాదిలో 300 రోజుల పాటు నీళ్లను తరలించి దేవాదుల ఆయకట్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ–2 ఆయకట్టు స్థిరీకరణకు వీలుంటుందని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు రూ.14,359 కోట్ల వ్యయంతో పనులు జరిగాయి. అయితే భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. మరో రూ.4 వేల కోట్లు అవసరం మొత్తం 34,089 ఎకరాలకు గాను 31,953 ఎకరాలు సేకరించారు. మరో 2,136 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు కింద దాదాపు 5.57 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటిదాకా 3.38 లక్షల ఎకరాలకే సాగునీరు అందిస్తున్నారు. మిగతా 2,136 ఎకరాలు సేకరిస్తే మిగిలిన 2.23 లక్షల ఎకరాలకు కూడా నీరందుతుంది. ప్రభుత్వం రూ.600 కోట్లను విడుదల చేస్తే భూసేకరణ పూర్తికానుంది. పెరిగిన అంచనాల ప్రకారం భూసేకరణతో సహా మిగులు పనుల పూర్తికి మరో రూ.4 వేల కోట్లు అవసరం కానున్నాయి. మొత్తం మీద వచ్చే 18 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి 2.23 లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. -
ముఖ గుర్తింపు మస్ట్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రభుత్వ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు వీలుగా ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) సాంకేతికతను వినియోగంలోకి తీసుకుని రావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆదేశించారు. అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలని, అదే సమయంలో అనర్హులు లబ్ధి పొందకూడదని తేల్చి చెప్పారు. ఆసరా పెన్షన్ల పథకం అమలులో ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను అమల్లోకి తెచ్చి 3 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించామని వెల్లడించారు. సాంకేతికతను సరిగ్గా వినియోగించుకోక పోవడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో అనుచిత లబ్ధి పొందారని చెప్పారు. కలెక్టర్లు ప్రతి నెలా కనీసం 10 రోజులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. ఇసుక అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిస్తే వెంటనే ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక పేరుతో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించతలపెట్టిన 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసులు పెట్టి బియ్యం రికవరీ చేయండి ‘ప్రభుత్వం సేకరించిన రూ.3,900 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల దగ్గరే ఉంది. వాటిని రికవరీ చేసేందుకు అవసరమైతే కేసులు పెట్టాలి. కొన్ని జిల్లాల్లో ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం ఉంది. ఎక్కడ ఇసుక మాఫియా ఉన్నా, అక్రమ మైనింగ్ జరిగినట్లు తెలిసినా వెంటనే ఆ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని సస్పెండ్ చేస్తాం. అవకతవకలకు తావు లేకుండా రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పనితీరు ఆధారంగా అవార్డులు రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులతో పాటు ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలి. తెలంగాణ రైజింగ్ విజన్ అమలులో జిల్లా కలెక్టర్లు నూటికి నూరు శాతం భాగస్వాములు కావాలి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని నిశితంగా గమనిస్తుంది. మీరు మంచి పని చేస్తే మిమ్మల్ని అభినందిస్తుంది. వార్షిక పనితీరు నివేదిక ఆధారంగా అవార్డులు, రివార్డులుంటాయి. జూన్లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం.. ’ అని సీఎం చెప్పారు. ఈ మూడు నెలలే కొలమానం ‘99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అత్యంత బాధ్యతతో, ఫలితాలపై దృష్టి సారించి అమలు చేయాలి. ఈ మూడు నెలలు ప్రతి కలెక్టర్ పనితీరుకు కొలమానం. మీ సర్వీస్ కెరీర్కు ఇవే పునాదిగా నిలుస్తాయి. అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉంది. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లని కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాం. సమర్ధవంతంగా పని చేస్తేనే కొనసాగింపు కలెక్టర్ల పనితీరుపై ఎప్పటికప్పుడు సీఎస్ నివేదిక ఇవ్వాలి. (నెలలో 5 రోజుల కంటే తక్కువగా పర్యటించిన కొందరు కలెక్టర్ల పనితీరుపై ఈ సందర్భంగా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు) క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమన్వయంతో, వారి భాగస్వామ్యంతో 99 రోజుల ప్రణాళిక అమలు చేయాలి. కొత్తగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు మార్చి 12న జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ‘జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. ముందుగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలన్నీ వేడుకలా జరగాలి. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహించి వివిధ సంక్షేమ పథకాల అమలు ద్వారా ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు.. వాటి ద్వారా లబ్ధి పొందుతున్న వివరాలను ప్రజలకు తెలియజేయాలి. గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు మహాలక్ష్మి, గృహజ్యోతి రూ.500 సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలన్నీ గ్రామాల వారీగా సిద్ధం చేయాలి. ఆ వివరాలను కలెక్టర్లు నివేదించాలి. ప్రతి గ్రామంలో పునరుత్పాదక విద్యుత్తుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అన్ని పాఠశాలలు, విద్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి..’ రేవంత్ సూచించారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి.. యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించాలి. జాబ్ మేళాలు నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకూడదు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదు. డీఈవోలతో పాటు అక్కడి కలెక్టర్లపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో ప్రతిరోజు ఒక్కో అధికారి మధ్యాహ్న భోజనం పర్యవేక్షించాలి. పిల్లలతో పాటు భోజనం చేసే బాధ్యతలు వారికి అప్పగించాలి. జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. జూన్ 12నే పుస్తకాలు, యూనిఫామ్లు ‘వచ్చే విద్యా సంవత్సరంలో 100 నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన మండలాల్లో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ప్రారంభిస్తాం. ఆయా స్కూళ్లలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు స్కూలు బస్సు సౌకర్యం, పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తాం. ఏ నియోజకవర్గంలో ఏ స్కూల్ను ఎంపిక చేయాలనే దానితో పాటు అక్కడున్న మౌలిక వసతులపై కలెక్టర్లు నివేదిక ఇవ్వాలి. వచ్చే విద్యా సంవత్సరం తొలిరోజు జూన్ 12నే రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందించాలి..’ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం సహించం.. ‘ప్రభుత్వ ఆసుపత్రులను తరచుగా సందర్శించాలి. సమస్యలు రాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోంది. అంత ఖర్చుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అద్భుతమైన సేవలను అందించే వీలుంటుంది. 35 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆస్పత్రులతో అనుసంధానం చేస్తాం. సర్జరీలు చేసే డాక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాం. ఆస్పత్రుల్లో పరిపాలన, వైద్య సేవలను విభజిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. 25 వేల బోగస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు.. ‘బోగస్ ఉద్యోగులను సృష్టించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో దాదాపు 1.70 లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులుంటే, అందులో దాదాపు 25 వేల మంది కనీసం ఆధార్ కార్డు లేకుండా ఇంతకాలం జీతాలు తీసుకున్నట్లు గుర్తించాం. పదేళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేసి వీరి పేరిట జీతాలు పొందిన ఏజెన్సీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తాం. వాటిపై ఆర్థిక శాఖ కేసులు నమోదు చేయాలి..’ అని సీఎం ఆదేశించారు. కలెక్టర్లకు సీఎం జారీ చేసిన ఇతర ఆదేశాలు ⇒ పాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి. ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి. ⇒ రహదారులపై గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలను ప్రజల నుంచి వాట్సాప్ నంబర్ ద్వారా సేకరించి మరమ్మతులు చేపట్టాలి. ⇒ ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల వెంట చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్ చేసేందుకు వచ్చే వాహనాలపై జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి. ఓఆర్ఆర్ ఏజెన్సీ బాధ్యత తీసుకోవాలి. ⇒ నగరాలు, పట్టణాల్లోని వర్కింగ్ ఉమెన్స్, బాయ్స్, గరల్స్ హాస్టళ్ల వివరాలు నమోదు చేయాలి. వాటిపై పర్యవేక్షణ ఉండాలి. యాజమాన్యాలు జవాబుదారీతనంతో ఉండాలి. ⇒ పాఠశాలలు, కళాశాలల్లో గంజాయి, డ్రగ్స్, ఈ–సిగరెట్ల వినియోగం జరిగితే అందుకు ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాలి. ప్రతి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో సైకాలజిస్ట్ ఉండేలా చూడాలి. ⇒ భూసార పరీక్షలు, పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రయోజనాలను రైతులకు వివరించాలి. ్చ -
పలు జిల్లా కలెక్టర్లపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్లో ఉండటం లేదంటూ సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) జరిగిన కలెక్టర్ల సదస్సులో పలువురు జిల్లా కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హెడ్ క్వార్టర్స్ లేకుండా హైదరాబాద్కు వస్తున్నారని, ఇది సరైన చర్య కాదన్నారు సీఎం రేవంత్. సీఎస్ అనుమతి లేకుండా రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు హైదరాబాద్కు రావడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 99 రోజుల పాటు జిల్లా విడిచి వెళ్లొద్దని వారికి ఆదేశించారు సీఎం రేవంత్. వారందరినీ భాగస్వామ్యులను చేయాలి.. 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లను భాగస్వాములను చేయాలన్నారు సీఎం రేవంత్. వార్డు సభ్యులు, సర్పంచులు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు అందరికీ జిల్లా కేంద్రాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, వారి విధులు, బాధ్యతలకు సంబంధించి అవగాహన కల్పించడంతో పాటు ప్రింటెడ్ మెటీరియల్ వారికి అందించాలని సూచించారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలివ్యవసాయ పంప్ సెట్లకు బదులు సోలార్ పంప్ సెట్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి.. సోలార్ మోటార్లతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలి.ఇళ్లపైన సోలార్ ప్లాంట్లు అమర్చుకోవడం.. సోలార్ విద్యుత్ వాడుకోవటం తో పాటు గ్రిడ్ కు కనెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయంపై అన్ని గ్రామాల్లో విద్యుత్ శాఖ అవగాహన కల్పించాలి...గ్రామ, వార్డు సభల్లో నూతనంగా ఇచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలి.వాటితో గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయి కలిగిన లబ్ధిని ప్రజలకు వెల్లడించాలి..రవాణా శాఖ డాటా ఆన్లైన్ పూర్తి చేయాలిపాఠశాలలు బస్సులు, ఇతర వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి.ఆర్టీసీ బస్సు డ్రైవర్లతో పాటు లారీలు, ఇతర సరకు రవాణా వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలి.ఎక్కువ సంఖ్యలో డ్రైవర్లు కలుసుకునే చోట్లనే ఈ శిబిరాలు ఏర్పాటు చేసి వారికి పరీక్షలు నిర్వహించాలి..రహదారులపై భారీ స్థాయిలో గుంతలు, ప్రమాదం జరిగే స్థలాల వివరాలు తెలుసుకునేందుకు వాట్సాప్ నెంబర్ ను రవాణా శాఖ ఇవ్వాలి.ఆ నంబర్కు వచ్చే సమాచారం ఆధారంగా అక్కడ మరమ్మతులు చేపట్టడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి.ఓఆర్ఆర్, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల వెంట భారీగా చెత్త, ఇతర నిర్మాణ వ్యర్ధాలు డంప్ చేస్తున్నారు.వ్యర్ధాలను తీసుకువచ్చే వాహనాలను పట్టుకొని జరిమానాలు విధించాలి. కేసులు పెట్టాలి.ఓ ఆర్ ఆర్ ఏజెన్సీని బాధ్యులను చేయాలి . -
నేడు కలెక్టర్ల సదస్సు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయంలోని ఏడో అంతస్తులో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 వరకు సుదీర్ఘంగా ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు స్వాగతోపన్యాసంతో సదస్సు ప్రారంభం కానుంది. అనంతరం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జనగణన–2027 తొలి విడత కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 మధ్య చేపట్టే రాష్ట్రంలో గృహాల గణన నిర్వహణపై రాష్ట్ర జనగణన అధికారి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన 34 ప్రశ్నలతో గృహాల గణన నిర్వహణకు 89వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.భోజన విరామం అనంతరం 1.45 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నారు. 2 నుంచి 2.30 గంటల వరకు ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’కార్యక్రమం నిర్వహణపై ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. 2.30 నుంచి 4 గంటల మధ్య 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్య, విద్య, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కలెక్టర్లకు సూచనలు జారీ చేయనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుదల కోసం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, అటవీ అనుమతుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్లకు నిర్దేశించనున్నారు. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, రవాణా, అటవీ, రెవెన్యూ, ఐటీ, పరిశ్రమలు, టీజీఐఐసీ విభాగాల ఉన్నతాధికారులు కలెక్టర్లకు అవగాహన కలి్పంచనున్నారు. చివరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు రేవంత్ కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడనున్నారు. జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల కార్యదర్శుల పనితీరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి దిద్దుబాటుకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించనున్నట్టు తెలిసింది. -
సీఎం ఇంట్లో కొత్త పెళ్లికూతురు రష్మిక.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ, రష్మిక.. గతవారం ఉదయ్పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ఆలయాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేశారు. ఇకపోతే ఈ బుధవారం(మార్చి 04) హైదరాబాద్లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు రాబోతున్నారు.(ఇదీ చదవండి: 'పెద్ది' మొదలుపెట్టేశాడు.. బుచ్చిబాబుని ఆడుకున్న చరణ్)పెళ్లి జరగడానికే ముందే విజయ్ దేవరకొండ వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. అయితే అది పెళ్లి ఆహ్వానం కోసమే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు రష్మిక.. స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబాన్ని రిసెప్షన్కి వ్యక్తిగతంగా ఆహ్వానించింది. ఈ క్రమంలోనే రష్మికని సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దంపతులు.. తెలుగు సంప్రదాయంలో భాగంగా చీరపెట్టి గౌరవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రిసెప్షన్ సందర్భంగా అభిమానులని ఉద్దేశిస్తూ.. 'విరోష్' జోడి ఓ నోట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో మార్చి 04 సాయంత్రం వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, పరిమిత సంఖ్యలో అతిథులు ఇందులో పాల్గొనున్నారు. పోలీసులు ఆంక్షల నేపథ్యంలో ఆహ్వానం లేకుండా ఇతరులు, అభిమానులు ఈ కార్యక్రమానికి రావొద్దు. వచ్చి ఇబ్బంది పడొద్దు అని ఇందులో విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్తో సినిమా.. 15 రోజులు తినడం మానేశా) -
రాష్ట్ర ప్రజల్ని రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పడేసాడు..
-
మూసీ మురిసేలా మహాత్ముడు
సాక్షి, హైదరాబాద్/లంగర్హౌస్: మూసీ నదికి పర్యాటక సొబగులు అద్దుకోనున్నాయి. నది సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మూసీ, ఈసా, గోదావరి నదులతో త్రివేణి సంగమంగా అభివృద్ధి చేయనున్న బాపూఘాట్లోనే 150 అడుగుల ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసిందే.ఉగాది నుంచి గాంధీ సరోవర్ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు.దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహనీయుడు విగ్రహం ఇదే కానుంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఎత్తయిన గాంధీ కాంస్య విగ్రహం పట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. దీని ఎత్తు 72 అడుగులు (22 మీటర్లు).మూసీ చుట్టూ 25 వేల ఎకరాల భూమి..: తొలి దశలో ఉస్మాన్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు, హిమాయత్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు రెండు వైపులా మొత్తం 21 కిలో మీటర్ల మేర మూసీని సుందరీకరించనున్న సంగతి తెలిసిందే. రెండేళ్లలో సుమారు 5,600 కోట్ల వ్యయంతో నదికి పునరుజ్జీవం కల్పించనున్నారు. రోడ్లు, వంతెనలు, స్కైవాక్లతో పాటు నదీ తీరాలను అభివృద్ధి చేసేందుకు వెచ్చించనున్నారు. ఇందులో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీపీ) రూ.4,100 కోట్లు రుణం రూపంలో అందించనుండగా..మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం బాండ్లు, పీపీపీ విధానం, ఇతరత్రా రూపంలో సమీకరించనుంది. ఆ తర్వాత దశల వారీగా హెచ్ఎండీఏ పరిధిలో మూసీ ప్రవహించే 55 కి.మీ. వరకూ నదికి పునరుజ్జీవం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మూసీకి ఇరువైపులా సుమారు 25 వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 120 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని నివాస, వాణిజ్య సముదాయాలు, ఇతరత్రా స్థిరాస్తి కార్యకలాపాలకు వినియోగించాలని భావిస్తున్నారు.సరోవర్లో ఏముంటాయంటే..సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 238 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్లో 52 ఎకరాలు కేంద్ర రక్షణ శాఖకు చెందినవి ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 38.9 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు అంగీకరించగా.. మిగిలిన భూమి కోసం సర్కారు తీవ్రంగా శ్రమిస్తోంది. నది పరీవాహక ప్రాంతాన్ని హ్యాపెనింగ్ ప్లేస్గా, నైట్ ఎకానమీగా అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. గాంధీ సరోవర్లో గాంధీతత్వశాస్త్రాన్ని బోధించే మ్యూజియం, గాంధీ జీవిత చరిత్రను వివరించే ఆడిటోరియాలు, ఫొటో ఎగ్జిబిషన్లు, ధ్యాన మందిరం వంటివి ఉంటాయి. వ్యాపార, ఆర్థిక కార్యకలాపాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. నది పరీవాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, షాపింగ్ మాల్స్, యాంపీ థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానాలు, ఇతరత్రా యుటిలిటీలను అభివృద్ధి చేస్తారు. -
మార్చి 6 నుంచి 99 రోజుల ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రభుత్వ పథకాలు.. అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 99 రోజుల కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల షెడ్యూల్ను రూపొందించి, వాటిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగో తయారు చేయాలని సీఎస్ను ఆదేశించారు. ఫైళ్లలో ఉన్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఫలితాలుగా మారాలని, ప్రజలకు పథకాల ప్రయోజనం ప్రత్యక్షంగా చేరేలా యంత్రాంగం మొత్తం ఒకే లక్ష్యంతో పనిచేయాలని చెప్పారు. ఈ 99 రోజుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్తోపాటు రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇందుకు ప్రతి శాఖ, ప్రతి జిల్లా, ప్రతి అధికారి మిషన్ మోడ్లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో శనివారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు. అధికారుల పనితీరు లోపాలను సహించబోమని హెచ్చరించారు. ఐఏఎస్ అధికారులే ప్రభుత్వానికి వెన్నెముక అని.. ప్రతి పథకం, ప్రతి పాలసీ విజయం, వైఫల్యం వారిపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. మార్చి 4న నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో అందరి పని తీరుపై మాట్లాడతానని వెల్లడించారు. ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా.. పరిపాలనలో అధునాతన సాంకేతికను సమర్థంగా వినియోగించాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ప్రజలు ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారానే అన్ని పథకాలు, సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని నిర్దేశించారు. కరెంట్ మీటర్, ఇళ్ల నిర్మాణానికి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా పనులు జరగాలని చెప్పారు. వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానం అమల్లోకి వచ్చిందని, ఇలా ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలన్నారు. ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయస విధానం ఉండాలని సూచించారు. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ అధ్వర్యంలో కమిటీ వేయాలని ఆదేశించారు. మూడు వారాల్లో నివేదికను అందజేయాలని కోరారు. ప్రతీ విభాగంలో డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని, డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్లను వచ్చే 20 ఏళ్లకు సరిపడేలా అప్డేట్ చేసుకోవాలని సూచించారు. కేంద్రం సమ్మిట్పై విమర్శలొచ్చాయి.. కేంద్రం నిర్వహించిన ఏఐ సమ్మిట్పై కొన్ని విమర్శలు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్లుగా విభజించామని గుర్తు చేశారు. కోర్ అర్బన్ రీజియన్లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ప్రతి ఐఏఎస్ అధికారి తమ శాఖలో బెస్ట్ ప్రోగ్రామ్ను డిజైన్ చేసుకోవాలని, తమంతట తాముగా గర్వపడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉద్యోగుల డేటా సిద్ధంగా ఉండాలి.. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం అన్ని శాఖల కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదని ఆదేశించారు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలని, బడ్జెట్ ప్రతిపాదనల్లో వీటిని చేర్చాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను రాబట్టుకునేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని, నిధుల సద్వినియోగం చేపట్టడం వల్ల ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా రాష్ట్రం సాధించుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉండాలని, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలు మార్పును స్వాగతిస్తున్నారు.. పారదర్శకత, జవాబుదారీతనం, మార్పును తీసుకొస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం రెండేళ్ల మూడు నెలలు పూర్తి చేసుకుందని, ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాలను నిజాయితీగా అంచనా వేసుకుని, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించాలని అధికారులను హెచ్చరించారు. వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన రెండేళ్లు తొమ్మిది నెలలకు సరైన ప్రణాళికతో కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం సూచించారు. -
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం
సెక్రటేరియట్ : మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. 44 మంది మృతుల కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందించిన సీఎం.. ప్రమాదం లో గాయపడిన ఒకరి కి 3 లక్షల పరిహారం.. నవంబర్ 17, 2025 న సౌదీ అరేబియా లోని మదీనా సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన 44 మంది హైదరాబాద్ వాసులు..కార్యక్రమంలో పాల్గొన్న మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ ,ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ,సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,సీఎంఓ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు,నాంపల్లి ఎమ్మెల్యే మహమ్మద్ మాజిద్ హుస్సేన్,హజ్ కమిటీ చైర్మన్ ఖుష్రో పాషా,తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGMREIS) వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషి,రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒబేదుల్లా కొత్వాల్.సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..ప్రమాదం గురించి తెలియగానే సహాయ చర్యల పైన కేంద్రం తో మాట్లాడాను..మంత్రి అజారుద్దీన్ ను మదీనా పంపించాను..బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం..దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించదు..కానీ భాదితుల కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించాం..నాంపల్లి అగ్ని ప్రమాదం లో చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకున్నాం..ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కల్గించడం ముఖ్యం..అందుకే కుటుంబాలను సెక్రటేరియట్ కి పిలిచి పరిహారం అందించాం…ఇది మీ ప్రభుత్వం..ఆందోళన వద్దుమీ కష్టం,ఆనందం లో మీతో ఉంటుంది..ఈ నెల ముస్లిం సోదరులకు చాలా పవిత్రమైనది..అంతా కలిసి మెలిసి ముందుకు వెళ్దాం..కొడంగల్ లో 2009 నుంచి ప్రతి సంవత్సరం ప్రతి మండలం నుంచి ఒకరి చొప్పున నేను హజ్ కు పంపిస్తున్న.. -
శారదాపీఠం భూములపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలోని శారదాఫీఠం భూముల అంశానికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. భూములను శారదా పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు. అదే సమయంలో జలమండలికి భూ కేటాయింపులు రద్దు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారుల సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా శారదాపీఠం భూముల అంశంపై సీఎం ఆరా తీశారు. ఈ క్రమంలోనే నిర్మాణాల తాజా స్థితిని తెలియజేయనందుకు అధికారులపై రేవంత్ ఫైర్ అయినట్లు సమాచారం. కాగా, 2019లో తెలంగాణలో విశాఖ శ్రీశారదా పీఠానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో సుమారు రెండున్నర ఎకరాల భూమిని కేటాయించింది. విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూపాయికే కట్టబెట్టడంపై ఆ సమయంలో చర్చలు నడిచాయి. ఈ భూమి కేటాయింపు పీఠం యొక్క ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం జరిగిందని, ఇది ఆ పీఠం విజ్ఞప్తి మేరకే జరిగినట్లు తెలుస్తోంది.బీఆర్ఎస్ ధ్వజంశారదా పీఠం భూములు అంశానికి సంబంధించి రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. తెలంగాణలో ఇళ్లు కూల్చడం అయిపోయిందని, ఇక దేవాలయాలు కూల్చడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారంటూ హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం ఇష్లం లేదా అంటూ ప్రశ్నించారు. -
నీకు దమ్ముంటే.. రేవంత్ కు ఓపెన్ ఛాలెంజ్
-
కలెక్టర్.. ఆ 30 ఎకరాల లెక్క చెప్పగలడా?: ఈటల ఫైర్
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు పంచడం చేత కాదు.. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా? అని ప్రశ్నించారు.బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ శనివారం ఖమ్మంలోని భూదాన్ భూములను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రాంతంలో ప్రజల కన్నీళ్లతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఈ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ ఇదే పద్ధతి కొనసాగించారు. జిల్లాలో సీపీఐ మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీవే కదా?. కీలక మంత్రి పదవులు ఇక్కడే కదా. తమకు న్యాయం జరుగుతుందని జనం సంబురపడ్డారు. కానీ, ఇలా తన ఇళ్లనే కూల్చివేస్తారని అనుకోలేదు.భూదాన్ భూమి అంటే దానం చేసిన భూమి అని తెలియదా?. వినోబా భావే అనే వ్యక్తి వేల ఎకరాలు దానం చేశారు. 147,148, 149 సర్వే నెంబర్లలో 62 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఆనాడు ఈ భూములను ఎవరు దేకలేదు. ఇపుడు ధర పెరగడంతో వాళ్ల కన్ను ఇటు పడింది. రేవంత్ రెడ్డిది కూల్చివేతల ప్రభుత్వం. భూములు పంచడం చేత కాదు. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు. 2019లో చల్లా కోదండరాం అనే జడ్జి ఈ పేదలకు కరెంట్, నీళ్లు ఇవ్వండి అంటే ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోగా ఉన్నది లాక్కున్నారు. ఏ కోర్టు ఆర్డర్ మీకు ఇల్లు కూల్చమని ఇచ్చింది?. వీళ్లే బలవంతంగా లాక్కున్నారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా?. పెద్దల జోలికి పోయే దమ్ము మీకు ఉందా?. 62 ఎకరాల్లో 32 ఎకరాలు సరే.. మిగతా 30 ఎకరాలు ఏమయ్యాయి?. కలెక్టర్ ఆ 30 ఎకరాల లెక్కచెప్పగలడా?.పేదల కళ్లలో మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. జిల్లాలో ఉన్న భూదాన్ భూముల వివరాలు మొత్తం బయటకు తీయాలి. తప్పు జరిగిందని సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పేదలే నీకు ఓట్లు వేసింది. పేరుకు మాత్రమే పేదల పార్టీ, చేతల పార్టీ కాదు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి సత్వర న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
శారదా పీఠాన్ని కూల్చడానికి రేవంత్ సర్కార్ కుట్ర: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇళ్లు కూల్చడం అయిపోయింది.. దేవాలయాలు కూల్చడానికి కాంగ్రెస్ నేతలు బయలుదేరారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం రేవంత్కు ఇష్టం లేదా అంటూ ఘాటు విమర్శలు చేశారు. దేవాలయ భూమి జోలికి రావొద్దు అని హితవు పలికారు. మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఆలయ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయింపు జరిగింది. ఇప్పుడు దేవాలయ స్తలాన్ని లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ పోలీసులను ప్రయోగించింది. పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురిచేయడం సరికాదు. శారద పీఠం ఆధ్వర్యంలో 16 దేవాలయాలు ఉన్నాయి. వేదం, గోశాల, నిత్య అన్నదాన కార్యక్రమాలు జరిగితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. దేవాలయాలు కూల్చడమే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమా?. రాష్ట్రం సుభిక్షంగా ఉండటం రేవంత్కు ఇష్టం లేదా?.గుళ్లు, ఇల్లు కూల్చడమే పనిగా పెట్టుకున్నారు. సర్వే నెంబర్ 239, 240లలో పది ఎకరాలు భాగ్యలక్ష్మి మైన్స్ మినరల్స్ కంపెనీలు ఉన్నాయి. పక్కన 17 ఎకరాల స్థలం కబ్జా చేశారు. రేవంత్ అల్లుడికి ఇవ్వడానికి భూములు ఉన్నాయి. రాత్రి 11 గంటలకు పోలీసులు, ఎమ్మార్వో వచ్చారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చాలని చూస్తున్నారు. మేము రాగానే పోలీసులు, అధికారులు పారిపోయారు. చట్టపరంగా పద్ధతులు పాటించరా?. దేవాలయాల భూమి కూల్చడానికి శ్రీధర్ బాబు ఎలా ఒప్పుకున్నారు?. స్థలం లేక కాదు.. కక్షతో చేస్తున్నారు. గుడిని, మఠాన్ని కూడా వదలరా?. బ్రహ్మణులు పూజలు చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దేవాలయాల్లో పూజలు ఆపే మూర్ఖత్వమా?. ఇదేం సంస్కృతి?. క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని కూల్చేస్తారా?. దేవాలయ భూమి కాపాడడానికి మేం పోరాటం చేస్తాం. దేవాలయ భూమి జోలికి రావొద్దు అని హితవు పలికారు. -
తెలంగాణలో సంచలనం.. ఐఏఎస్ అర్వింద్కుమార్ సస్పెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.వివరాల మేరకు.. తెలంగాణలో ఇటీవలే ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. అనంతరం, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా ఈ-రేసు కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కోవడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అర్వింద్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంతకం చేసినట్లు సమాచారం.ఇక, ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతించారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు. బీఎల్ఎన్ రెడ్డి ఇప్పటికే పదవీ విరమణ చేశారు. -
ఇక కోర్ అర్బన్ చట్టం
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బన్) మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టాన్ని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమ తులు, రుసుములు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని సీఎం తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. కోర్ అర్బన్ ఏరి యాలో పారిశుధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలి యక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారని, ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలికోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం తెలిపారు. రోడ్డు నిర్మించిన తర్వాత దాని జీవిత కాలం ఎంతనేది నిర్ణయించి, ఆ లోపు దానిని తొలగించినా అక్కడ మళ్లీ రోడ్డు వేసినా అందుకు బాధ్యులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రతి వీధి దీపం వెలుగుతుందో లేదో డ్యాష్ బోర్డులో కనిపించాలని సీఎం అన్నారు. అలాగే ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని సీఎం సూచించారు. నగరంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించాలని ఆదేశించారు.ఫైర్ సేఫ్టీకి పెద్ద పీట వేయాలని, నగరంలోని సర్కిల్స్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని సూచించారు ఆర్ అండ్ బీ, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటినీ ఎంఏయూడీ(మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్)పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. నగరంలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను అధికారులు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన సీఎం పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. భవనాల పనులు వేగవంతం చేయాలిభారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని , అక్కడ అవసరమైన అనుమతులు వెంటనే తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాల పనులు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలి వేయకుండా వాటి రక్షణతోపాటు సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఎంఏయూడీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఇ.వి.నరసింహారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనర్లు కర్ణన్, జి.సృజన, వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సచివాలయానికి మాజీ మావోయిస్టు అగ్రనేతలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాజీ మావోయిస్టు అగ్రనేతలు భేటీ అయ్యారు. దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, పోతుల కల్పన అలియాస్ సుజాతక్క, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, నూనె నరసింహారెడ్డి సీఎంతో సమావేశమయ్యారు. సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీ ఇంటెలీజెన్స్ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీ సుమతి పాల్గొన్నారు.మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి (అప్రకటిత) తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ కుమ్మదాదా, కేంద్ర కమిటీ సభ్యుడు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నలు సాయుధ పోరాటాన్ని వదిలి డీజీపీ ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే.గత రెండేళ్లలో ఇప్పటివరకు నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు సహా మొత్తం 544 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 5,865 మంది లొంగిపోయారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 11 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. తెలంగాణ నుంచి మిగిలిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఈస్ట్ డివిజనల్ బ్యూరో సభ్యుడు, మావోయిస్టు టెక్నికల్ విభాగం ఇన్చార్జి పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఒడిశా స్టేట్ కమిటీ సభ్యుడు ముప్పిడి సంబయ్య అలియాస్ సుదర్శన్, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ, కమ్యూనికేషన్ విభాగం ఇన్చార్జి వార్త శేఖర్ అలియాస్ మంగ్తు, గణపతి భార్య.. మాడ్ డివిజన్ ఇన్చార్జి జోడే రత్నాభాయ్ అలియాస్ సుజాత, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఎడ్యుకేషన్ కమిటీ ఇన్చార్జి లక్కా సుశీల అలియాస్ రేల, దేవ్జీతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ అనిల్కుమార్ అలియాస్ భగత్సింగ్, మాడ్ డిజినల్ కమిటీ డీసీఎం రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ, చర్లలో ఏసీఎం మడివి అడిమె అలియాస్ సంగీత, దేవ్జీ టీంలో పనిచేసే కాశపోగు భవానీ అలియాస్ సుగుణ, ఇల్లెందు నర్సంపేట ఏరియా కమాండర్ కుంజం ఇడామల్ ఉన్నారు. -
అవినీతి, అరాచక పాలనతో కాంగ్రెస్ సర్కార్
-
కాంగ్రెస్ అంటేనే కూల్చివేతలు.. బీజేపీ ఉద్యమమే: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్ నేతలకు రైతుభరోసా గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటే... ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘రైతులకు రైతు భరోసా ఇస్తానన్న మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయారు. ముఖ్యమంత్రి నోటి నుండి వచ్చే మాటలు శాసనంలా ఉండాలి. బీఆర్ఎస్ ఏ విధంగా విమర్శలు, గూడు పుటానీలు చేసారో.. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే చేస్తున్నారు. రైతు భరోసా మొదటి విడత డబ్బులు ఎగ్గొట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తుకు వస్తుందా?. రైతు భరోసా ఇవ్వకపోతే రైతులే వాతలు పెడుతారు. కేబినెట్ మీటింగ్లో రైతు భరోసా గురించి ఎందుకు చర్చించలేదు. మూడు విడతలు కలిపి 27000 కోట్లు ఇవ్వాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రైతు భరోసా ఇవ్వాలని ఉత్తరం రాశాను. రైతు భరోసా ఇవ్వకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు’ అని హెచ్చరించారు.అలాగే, ఖమ్మంలో కూల్చివేతల ఘటనపై స్పందిస్తూ..‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతలు. కూల్చడానికి గల కారణాలు ఏంటి?. మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కలిసి అ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చుస్తున్నారు. హైడ్రా.. కూల్చివేతలతో ఆగమాగం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఇండ్లు కట్టడానికి పోటీ పడుతుంటే.. ఈ ప్రభుత్వం కూల్చివేయడానికి పోటీ పడుతుంది. ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా లేరు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు.ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటే.. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈరోజు 80% ముస్లిం మహిళలు బీజేపీకి ఓటేసే పరిస్థితి వచ్చింది. నిన్నటి దాక దోస్తీగా ఉన్నా కాంగ్రెస్, ఎంఐఎంలకు ఎక్కడ చెడిందో తెలియదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కవిత వ్యవహారంపై ప్రశ్నించగా.. తెలుసుకుని మాట్లాడతాను అని వ్యాఖ్యలు చేశారు. -
సనత్నగర్ టిమ్స్కు ముహూర్తం ఖరారు.. ఉగాది రోజు నుంచే సేవలు
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వెయ్యి పడకల సామర్థ్యమున్న సనత్నగర్ టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైంది. వచ్చే నెల 19న దీనిని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఓపీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, ఇన్ వార్డులు, టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధమవుతున్నాయి. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ట్యాబ్ టెక్నిషియన్లు, ఇతర సిబ్బందిని 3 నెలల డిప్యుటేషన్పై నియమించారు. గాంధీ, ఉస్మానియా, వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రి, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి 40 మంది సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉగాది రోజు నుంచి వైద్య సేవలు షురూ కానున్నాయి.గాంధీ, ఉస్మానియాలకు ఉపశమనం సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నగరంలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. వెయ్యి పడకల సామర్థ్యం, అత్యాధునిక శస్త్రచికిత్సలు, అవయవ మారి్పడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉగాది నుంచి టిమ్స్లో మొదలవుతున్నాయి. నిత్యం నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజుకు 2,500 నుంచి 3 వేల ఓపీ ఉంటోంది. రోగుల తాకిడితో సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా వైద్య సేవల్లో నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుందని అభిప్రాయం ఉంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బంది, మౌలిక సదుపాయాలు కల్పిస్తే మెరుగైన వైద్య సేవలకు అవకాశం ఉంటుంది. గుండె చికిత్సలు సులువు సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి గుండె శస్త్రచికిత్సలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవనుంది. రోగులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవలందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ కోసం క్యాత్ ల్యాబ్, అవయవ మార్పిడికి ప్రత్యేకంగా రూపొందించిన 16 ఆపరేషన్ థియేటర్లు, సీటీస్కాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్రే, ఇతర అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రారంభం నాటికి 100 శాతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. -
తప్పు ఒప్పుకోకుండాఉపన్యాసాలా?
సాక్షి, అమరావతి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తానే ఆపించానని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.. అది వాస్తవమా? కాదా?.. రేవంత్ వ్యాఖ్యలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా?.. అది చూస్తూ మేం ఊరుకోవాలా? ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం సభలో మేం ప్రశ్నిస్తే సమాధానం చెప్పరా? మీరు ఏం చెప్పినా మేం తలూపాలా..?’’ అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందో లేదో సూటిగా జవాబు చెప్పాలి అని నిలదీశారు. అధికారపక్షం జవాబు చెప్పకుండా దాటవేయటాన్ని బట్టి రేవంత్రెడ్డి చెప్పిందే నిజమేనని ఒప్పుకున్నట్లైందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మేం అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక దాటవేత ధోరణి ఎందుకు అని ప్రశ్నించారు. ‘సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి.. లేదంటే సమాధానం చెప్పలేం.. తర్వాత చెబుతామని ఒప్పుకోండి. ఇది రాజకీయ అంశం కాదు.. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయం’ అని తేల్చి చెప్పారు. చంద్రబాబుతో తనకున్న సన్నిహిత సంబంధాలతో రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేయించానని రేవంత్రెడ్డి పేర్కొనటంపై అధికారపక్షం సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఈ ప్రాజెక్టు రాయలసీమకు ఎంత అవసరమో గుర్తించి ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని గొడవలు వచ్చినా పనులు చేపట్టామని గుర్తు చేశారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ‘పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్’పై గురువారం శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఇషాక్బాషా, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ 2014లో పూర్తయిందని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాల మేరకు నిలిపివేశారని, ఆ పథకంలో 22.82 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. స్వప్రయోజనాల కోసం బాబు లాలూచీ..!రాయలసీమకు ఎంతో అవసరమైన ఆ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇషాక్బాషా డిమాండ్ చేశారు. రాయలసీమ నీటి కష్టాలను తీర్చేందుకు వైఎస్ జగన్ ఆ ప్రాజెక్ట్ను ప్రారంభించారని గుర్తు చేశారు. రేవంత్రెడ్డి సూచనల మేరకు ఆ ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతోందని, రాయలసీమ వాసిగా దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ఇషాక్ బాషా ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమకు హక్కుగా రావాల్సిన నీటిని ఆపడం న్యాయమా? దాన్ని పూర్తి చేస్తారా? లేక రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారా? అని ఇషాక్ బాషా ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరంలేదని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నుంచి గత 20 ఏళ్లుగా నీటిని పూర్తిగా వాడుకోలేకపోయామన్నారు. రేవంత్రెడ్డి ప్రకటనను సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఖండించకపోవడం దారుణమన్నారు. ఎత్తిపోతల ప్రాజెక్టును కచ్చితంగా చేపట్టి రాయలసీమ ఎడారి కాకుండా కాపాడాలని కోరారు. రాజకీయ ధృక్పధంతోనే ఆ ప్రాజెక్టును ఆపేశారని ప్రజలు నమ్ముతున్నారని, దానిపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.సమాధానం చెప్పకుండా అధికారపక్షం సుదీర్ఘ ప్రసంగాలువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్న సమయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, పయ్యావుల కేశవ్ ఎదురుదాడికి దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో 10.31 గంటలకు చైర్మన్ కొయ్యే మోషేన్రాజు సభను వాయిదా వేశారు. అనంతరం 10.43 గంటలకు సభ పునఃప్రారంభమైన వెంటనే ప్రభుత్వం రెండో ప్రశ్నకు జవాబు చెప్పాలని సూచించడంపై ప్రతిపక్ష నేత బొత్స అభ్యంతరం తెలిపారు. మొదటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా రెండో ప్రశ్నకు ఎలా అనుమతిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు వెల్లో నిల్చుని నిరసన తెలిపారు. తమ సభ్యులు అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా మంత్రులు సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నారని బొత్స అభ్యంతరం తెలిపారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు వెల్లోకి చేరుకుని నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో మళ్లీ 10.48గంటలకు సభను రెండోసారి వాయిదా వేసిన చైర్మన్ మళ్లీ 11.03 గంటలకు తిరిగి ప్రారంభించారు. లైన్మెన్ల నియామకంపై టీడీపీ సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి బదులిచ్చిన అనంతరం గాలేరు–నగరి సుజల స్రవంతి, రాయలసీమ ప్రాజెక్టులపై ఎంవీ రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు బదులిచ్చారు. మంత్రి తాము అడిగిన దానికి కాకుండా ఏదో చెబుతున్నారంటూ వైఎస్సార్సీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పోడియం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ నినాదాలు చేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు వెల్లో నిల్చుని బిగ్గరగా కేకలు వేశారు. ఇలాంటి వ్యూహాలతో వస్తే సభను నడపలేమని చైర్మన్ మోషేన్రాజు అసహనం వ్యక్తం చేశారు. సభలో ఆందోళన నెలకొనడంతో కేవలం మూడు ప్రశ్నలకే సమాధానం రాగా మిగిలిన వాటిని డీమ్్డగా ప్రకటించిన చైర్మన్ మండలిని వాయిదా వేశారు.రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తాను చెబితేనే చంద్రబాబు ఆపారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శాసనసభ సాక్షిగా వెల్లడించారు. అది నిజమా.. కాదా? ఈ పథకాన్ని ఎప్పటిలోగా ప్రారంభించి, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలి. రేవంత్రెడ్డి బాధ్యత కలిగిన సీఎం పదవిలో ఉంటూ ఏపీ ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు జవాబు చెప్పాలి. అలా కాకుండా రాజకీయ ఉపన్యాసాలు ఏమిటి? మీకు రాయలసీమకు నీరు రావడం ఇష్టం లేదు.. అందుకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవం కాదని చెప్పడం లేదు.. – శాసన మండలిలో ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత బొత్స ధ్వజం -
పబ్లిక్ స్కూళ్లతో విద్యావ్యవస్థ బలోపేతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే అన్ని సౌకర్యాలతో ప్రతి నియోజకవర్గంలోనూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యా కమి షన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 1,500 మంది విద్యార్థుల సామర్థ్యంతో పాఠశాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. విద్యార్థులకు బస్సు సౌకర్యం ఉండేలా చూడాలని కోరింది. ఇందుకు అవసరమైన బడ్జెట్ ను ప్రభుత్వం సమకూర్చాలని పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన తెలంగాణ విద్యా విధానం డాక్యుమెంట్ను గురువారం సీఎంరేవంత్రెడ్డికి అందజేసింది. నివేదికలోని అంశాలను కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మీడియాకు వివరించారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు ప్రారంభించాలి‘పూర్వ ప్రాథమిక విద్యను అభివృద్ధి చేసేందుకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే ప్రారంభించాలి. ఒకటవ తరగతి నుంచే తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ భాషలతో కూడిన విధానాన్ని అమలు చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచే బోధనా మాధ్యమం ఇంగ్లిష్లో ఉండటం ప్రయోజనకరం. ప్రస్తుతం ఉన్న 6–14 ఏళ్ల పరిమితిని 3 నుండి 18 సంవత్సరాలుగా మార్చి నిర్బంధ విద్యను అందించాలి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సును రద్దు చేయాలి. బి.ఎడ్ను ప్రైమరీ (నర్సరీ–5వ తరగతి), సెకండరీ (6–12వ తరగతి) గా విభజించాలి.కోచింగ్ వ్యాపారాన్ని నిషేధించాలిమధ్యాహ్న భోజనానికి ఇచ్చే ధరను పెంచాలి. మెనూలో గుడ్డు, అరటి పండు ఉండేలా చూడాలి. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్ నిర్వహించాలి. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీ సెట్ను రద్దు చేసి, ఇంటర్ మార్కుల ఆధారంగానే కోర్సుల్లో ప్రవేశం కల్పించాలి. ప్రైవేట్ జూనియర్ కళాశాలల పేరుతో నిర్వహించే పోటీ పరీక్షల కోచింగ్ వ్యాపారాన్ని నిషేధించాలి. ఫీజుల నియంత్రణకు కమిషన్విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సుమా రు 72 శాతం రెగ్యులర్ అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల ప్రమాణాలను అంచనా వేయడా నికి ‘తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారి టీ’ని ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించడానికి చట్టబద్ధమై న కమిషన్ ఏర్పాటు చేయాలి. విద్యకు రాష్ట్ర బడ్జెట్లో 18 శాతం కేటాయించాలి..’ అని సిఫారసు చేసినట్లు తెలిపారు. తెలంగాణ విద్యా విధానం అమలు కోసం ఏడేళ్ల రోడ్ మ్యాప్ను కమిషన్ సిద్ధం చేసింది. దీని ద్వారా సుమారు 2 వేల పాఠశాలలను అభివృద్ధి చేయవచ్చని పేర్కొంది. మీడియా సమావేశంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, కె.జ్యోత్స్న శివారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ అందించిన నివేదికలో చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాల్సిన అంశాలపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు, ఆ బాధ్యతను ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు గారి నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు.… pic.twitter.com/5O36f706om— Telangana CMO (@TelanganaCMO) February 26, 2026 -
హైదరాబాద్కు ‘హార్వర్డ్’
సాక్షి, హైదరాబాద్: పపంచ ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూని వర్సిటీ హైదరాబాద్కు రానుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) ప్రాంగణంలో ప్రత్యేకంగా స్టడీ సెంటర్ను తెరవనుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎంసీఆర్హెచ్ఆర్డీతో హార్వర్డ్ యూనివర్సిటీ త్వరలో అవగాహన కుదుర్చుకోనుందని వివరించారు. గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన గ్రూప్–1, గ్రూప్–2 అధికా రుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.రకరకాల కోర్సులు..సర్టిఫికెట్లు‘అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో ఇటీవల విద్యార్థిగా చేరి ఒక కోర్సు పూర్తి చేశా. రోజుకు 12 గంటల పాటు తరగతులకు హాజరయ్యా. ఆ గొప్ప విశ్వవిద్యాల యాన్ని హైదరాబాద్కు తీసుకురావాలని సంకల్పించా. వర్సిటీ యాజమాన్యంతో చర్చించా. ఎంసీఆర్హెచ్ఆర్డీతో అవగాహన తర్వాత ఇక్కడే ఒక స్టడీ సెంటర్ను తెరిచేందుకు చర్యలు తీసుకుంటాం. వివిధ రకాల ఎగ్జిక్యూటివ్ కోర్సులు ఇక్కడ నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఎంపిక చేసుకున్న కోర్సుల్లో చేరవచ్చు. ఇక్కడే తరగతులకు హాజరు కావొచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలు సాధించిన మీరు కూడా ఈ కోర్సులు చేయవచ్చు..’ అని సీఎం తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆధిపత్యం సహించలేరు..‘మీరు ఎంతో కష్టపడి, లక్షలాది మందితో పోటీ పడి ఉద్యోగాలు సాధించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులకు అభినందనలు. మీరు మొన్నటివరకు విద్యార్థులు..నిన్నటివరకు నిరుద్యోగులు..ఈ రోజు అధికా రులుగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రజాపాలనలో మీరంతా ప్రజలకు నేరుగా సేవలు అందించబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని సహించలేరు. రాంజీ గోండ్, కుమ్రుంభీం రాజ్యాల కోసం పోరాటం చేయలేదు. అధిపత్యం చెలాయిస్తున్న వారిపై తిరు గుబాటు చేశారు. కాకతీయ సామ్రాజ్యంపై సమ్మక్క, సారల మ్మ తిరుగుబాటు చేశారు. అందుకే వారు వన దేవతలుగా గౌరవించబడుతున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సమాన అవకాశాల కోసం వారు అమరవీరులయ్యారు. బాధ్యత మరవొద్దు.. పతనం కావొద్దుఅధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న మీరంతా ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల స్ఫూర్తిని ప్రతిక్షణం గుర్తు పెట్టుకోవాలి. 2011 తర్వాత 14 ఏళ్ల పాటు గ్రూప్–1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్–1 నిర్వహించి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చింది. తొలుత టీజీపీఎస్ను పూర్తిగా ప్రక్షాళన చేసింది. డీజీపీగా పనిచేసిన వ్యక్తిని చైర్మన్గా నియమించాం. రిజిస్ట్రార్, ప్రొఫెసర్లను సభ్యులుగా నియమించాం. ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్మేందుకు అవకాశం లేకుండా చేశాం. కొందరు గిట్టనివాళ్లు కోర్టులకెక్కి ఉద్యోగాలను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ అన్ని కోర్టుల్లో అభ్యర్థుల తరఫున బలంగా వాదించి కోర్టులను ఒప్పించి ఉద్యోగాల భర్తీని పూర్తి చేశాం. అధికారులుగా మారిన తర్వాత బాధ్యత మరిచిపోయి మనిషిగా పతనం కావొద్దు..’ అని రేవంత్ చెప్పారు. తల్లిదండ్రులకు అండగా ఉండండి..‘సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే బాధ్యత మీపైనే ఉంది. మీరంతా ఆఫీసుకు వెళ్ళేముందు ఎస్ఆర్ శంకరన్ను తలుచుకోవాలి. పేదవారికి సాయం చేసే విషయంలో మీ తల్లిదండ్రులను గుర్తు పెట్టుకోవాలి. తల్లిదండ్రులను గౌరవిస్తూ వారికి అండగా నిలవండి. తల్లిదండ్రులను పట్టించుకోని వాళ్ల జీతంలో 10–15 శాతం కోత పెట్టేలా త్వరలో చట్టం చేస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. అంతకుముందు కొత్త అధికారుల శిక్షణకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను రేవంత్ తిలకించారు. -
100 పబ్లిక్ స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఈ ఏడాది నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళను (టీపీఎస్లు) ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు తరహాలో నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధనా సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగిన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలోనే వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విద్యా కమిషన్ చేసిన సిఫారసులపై స్పందించారు. టీపీఎస్ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. సాంకేతికతతో ‘క్యూర్’ స్కూళ్లు ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ తరహాలో నిర్మించాలి. వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి. ఏడాదిలో క్యూర్ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూతన పాఠశాలల నిర్మాణం పూర్తి కావాలి. నగరంలోని భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లలో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో ఉండాలి.క్యూర్లో అప్గ్రేడ్ చేయనున్న 17 పాఠశాలలు, అదనపు గదులు, ఇతర వ సతులు కల్పించనున్న 164 పాఠశాలలకు సంబంధించిన పనుల్లో ఎటువంటి రాజీ పడకూడదు. ప్రభుత్వఆధ్వర్యంలో 99 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల్లో వారంరోజులు విద్యా సంబంధిత అంశాలకు కేటాయించాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు.. పాఠశాలలు, కళాశాలలను సందర్శించి అవసరమైన వసతు ల కల్పన, ఇతర అంశాలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 2026–2027 నుంచి బ్రేక్ ఫాస్ట్, పాలు ‘ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచి దాని బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలి. ఏఐపై బోధకులకు శిక్షణ ఇవ్వాలి. సాంకేతిక విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ముందుకు వెళ్ళాల్సి ఉంది. పాలిటెక్నిక్ కళాశాలలు, ఏటీసీల్లో ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలి. 2026–2027 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అమలు చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఉదయం పూట అల్పాహారం ఇవ్వాలి. (ఈ పథకం అమలుకు సంబంధించి హరేకృష్ణ మిషన్ ప్రతినిధులకు సీఎం పలు సూచనలు చేశారు). బ్రేక్ఫాస్ట్తో పాటు ప్రతి విద్యారి్థకి పాలు అందజేయాలి. పాలను విజయ డెయిరీ నుంచి సేకరించాలి. విద్యార్థులకు ఎన్ని కేలరీలు అందజేస్తున్నామో తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు కిట్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి ఒక కిట్ అందజేయాలి. అందులో స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, రంగుల పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలి. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్లో పొందుపర్చేలా చూడాలి. అన్ని విశ్వ విద్యాలయాలకు నిధులు కేటాయిస్తాం..’ అని సీఎం తెలిపారు. అవసరమైన నిధులపై నివేదిక ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డిని సీఎం ఆదేశించారు. ఫీజులపై కలెక్టర్లు నివేదిక ఇవ్వాలి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజుల విధానం, తెలంగాణలో తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈవోల నేతృత్వంలో పాఠశాలలను పరిశీలించి ఫీజుల నిర్ణయంపై నివేదిక సమరి్పంచాలని సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జి లేదా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసి, ఫీజుల నియంత్రణను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, సామాజికవేత్తల అభిప్రాయ సేకరణకు ముసాయిదాను ప్రజలకు అందుబాటులో (పబ్లిక్ డొమైన్లో) ఉంచాలని సూచించారు. కేకే కమిటీ కమిషన్ నివేదిక పరిశీలించాలి తెలంగాణ విద్యా విధానంపై రాష్ట్ర విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. నివేదికలోని చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలను ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు నేతృత్వంలోని కమిటీ పరిశీలించాలని సూచించారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, ఇంటర్మిడియెట్ బోర్డు డైరెక్టర్ కృష్ణ ఆదిత్య, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రే, పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికొలస్ తదితరులు పాల్గొన్నారు. -
నర్సరీ నుంచే ఇంగ్లిష్ మీడియం ఉండాలి: తెలంగాణ విద్యా కమిషన్
హైదరాబాద్: తెలంగాణ విద్యా కమిషన్ కీలక సిఫారుసులు చేసింది. సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో భాగంగా విద్యా కమిషన్ పలు సిఫారుసులు చేసింది.తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సులు:1. ఉపాధ్యాయుల పదోన్నతులు: ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదు, పని తీరు ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలి.2. బోధనా మాధ్యమం: ఇంగ్లీష్ ఉండాలి, నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు.3. త్రిభాషా విధానం: ఒకటో తరగతి నుంచే తెలుగు/ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ బోధించాలి.4. విద్యార్థి కేంద్రంగా విద్యా విధానం: విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాలి.5. EAPCET రద్దు: ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలి.6. D.EI.ED రద్దు: బీఎడ్ను పునర్వ్యవస్థీకరించాలి.7. పాఠశాలల్లో వంట వండే మహిళలకు చెల్లింపులు: వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలి.8. IIT-JEE/NEET కోచింగ్ సెంటర్లు: నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాలి.9. ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి వేరుగా పోటీ పరీక్షల కోచింగ్: వేరు చేయాలి.10. విశ్వ విద్యాలయాల కార్యనిర్వాహక మండలి పునర్నిర్మాణం: వైస్ ఛాన్సలర్ ఛైర్మన్గా ఉండాలి -
ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరు: సీఎం రేవంత్
హైదరాబాద్: గ్రూప్ 1,గ్రూప్ 2 నూతన ఆఫీసర్ల శిక్షణకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను సీఎం రేవంత్రెడ్డి తిలకించారు. ఎంసీహెచ్ఆర్డీలో గ్రూప్-1, గ్రూప్- 2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన సీఎం రేవంత్ ప్రసంగించారు. ‘మీరు మొన్న విద్యార్థులు, నిన్న నిరుద్యోగులు,ఈ రోజు అధికారులు. ప్రజా పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మీరు సేవలు అందించబోతున్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని ఒప్పుకోరు. రాంజీ గోండు,కొమరం భీం రాజ్యాల కోసం పోరాటం చేయలేదు. అధిపత్యం చెలాయిస్తున్న వారిపైన తిరుగుబాటు చేశారు. కాకతీయ సామ్రాజ్యం పైన సమ్మక్క సారలమ్మ తిరుగుబాటు చేశారు. అందుకే వారు వనదేవతలుగా గౌర్వించబడుతున్నారు. అధికారులుగా బాధ్యతలు సేకరిస్తున్న మీరు ప్రజల ఆకాంక్షలు,అమరవీరుల స్ఫూర్తి గుర్తు పెట్టుకోవాలి. మొదటి ఎన్నికల్లో దేశంలోనే అత్యదిక మెజార్టీతో గెలిచిన రావి నారాయణ రెడ్డి తెలంగాణ బిడ్డ. 6 లక్షల మంది పోటీపడితే 582 మంది గ్రూప్ 1,775 మంది గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించారు. 15 ఏళ్ల పాటు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ప్రజా ప్రభుత్వం గ్రూప్ 1 నిర్వహించి ఆకాంక్షలను నెరవేర్చింది. టీజీపీఎస్ని ప్రక్షాళన చేశాం. గ్రూప్ పరీక్షల పైన అవగాహన ఉన్న వాళ్ళని చైర్మన్ గా,సభ్యులుగా నియమించాం. ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్మేందుకు అవకాశం లేకుండా చేశాం. గ్రూప్ 1 నికి ఎంపికైన ఆనందం 24 గంటలు లేకుండా గిట్టని వాళ్ళు కోర్ట్ కు వెళ్లారు. అభ్యర్థులు ఒక్క తప్పు చేయలేదు. మెరిట్ మీద ఎంపిక అయ్యారని ప్రభుత్వం భావించి సుప్రీంకోర్టు వరుకు వెళ్లి కొట్లాడింది. అధికారులు అయ్యాక బాధ్యత మరిచిపోయి మనిషిగా పతనం కావద్దు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే బాధ్యత మీదే..ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరు. నేను మెకానికల్గా మిమ్మల్ని కలవలేదు. ఎమోషనల్,అటాచ్మెంట్తో కలిసి పని చేశాను. పేదవారికి సాయం చేసేముందు తల్లితండ్రులను గుర్తు పెట్టుకోవాలి. తల్లి తండ్రులను పట్టించుకోని వాళ్ల జీతంలో 10 నుండి 15 శాతం కోత పెట్టేలా అసెంబ్లీలో చట్టం చేయబోతున్నాం’ అని స్సష్టం చేశారు. -
బొత్స Vs టీడీపీ మంత్రులు...ఒకే ఒక్కడు మంత్రులను గడగడలాడించాడు
-
భూదాన్ బాధితులకు అండగా కేటీఆర్
-
తెలంగాణ సీఎంతో చంద్రబాబు లాలూచీ పడ్డారు: బొత్స
-
మ్యాన్యుఫాక్చరింగ్ పవర్గా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని మ్యాన్యుఫాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అన్నారు. అడోబ్ సీఈఓ, తెలంగాణ రైజింగ్–2047 విజన్ బోర్డు సభ్యులు శంతను నారాయణ్ బుధవారం సీఎం రేవంత్ను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్థిక వ్యవస్థపై ఏఐ టెక్నాలజీ విప్లవ ప్రభావం, రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకునే అంశాలపై శంతను నారాయణ్తో సీఎం చర్చించారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని సీఎం కోరారు. గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలను సీఎంకు శంతను నారాయణ్ వివరించారు. గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రిస్కిల్లింగ్కు సంబంధించిన అంశాలను తెలిపారు. సీఎం రేవంత్ చండీయాగం !రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసంలో గత మూడు రోజులుగా యాగం జరిగినట్టు తెలుస్తోంది. కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో నిర్వహించిన చండీయాగం బుధవారం ముగిసినట్టు సమాచారం. అయితే, ఈ యాగం నిర్వహణ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచే రేవంత్రెడ్డి యాగాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. -
రైతు భరోసా లేనట్టేనా?
మోర్తాడ్(బాల్కొండ): అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా అందిస్తోంది. అయితే, ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు మధ్య దశకు చేరుకున్నా పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడకపోవడంపై రైతులు నిరాశ చెందుతున్నారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో భరోసాపై నిర్ణయం తీసుకుంటారని రైతులు భావించారు. అయితే పెట్టుబడిసాయం విడుదలపై ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఈసారి రైతు భరోసా లేనట్లేనా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది.షెడ్యూల్ దాటినా..గడిచిన వానాకాలం సీజన్లో జిల్లాలోని 2,98,472 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.326.03 కోట్లు జమ చేశారు. యాసంగి సీజన్ కోసం షెడ్యూల్ ప్రకారం గతేడాది డిసెంబర్లోనే రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6వేల చొప్పున సాయం సొమ్ము జమ చేయాల్సి ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిధుల విడుదల ఆలస్యమైందని రైతులు భావించారు. ఎన్నికల తంతు ముగియడంతో పెట్టుబడి సాయం వస్తుందని నిరీక్షించినా నిరాశే మిగిలిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతు భరోసాకు నిధులు విడుదల చేస్తే ఊరట లభిస్తుందని అంటున్నారు. -
మార్చి 13లోగా డిమాండ్లు నెరవేర్చకుంటే సమ్మె
కవాడిగూడ: దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను మార్చి 13లోగా సీఎం రేవంత్రెడ్డి పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడించి సమ్మెకు దిగుతామని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. చలో సచివాలయం ముట్టడి కార్యక్రమంలో భాగంగా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరా పార్కు ధర్నాచౌక్లో ఆర్టీసీ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్మాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల కంటే ఆర్టీసీ కార్మికులకు తక్కువ వేతనం ఉందని.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక భారంలేని బెనిఫిట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న ప్రక్రియను సీఎం రెండేళ్లయినా మొదలుపెట్టలేదన్నారు. మార్చి 13లోగా డిమాండ్లను పరిష్కరించకుంటే మార్చి 18 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. జేఏసీ వైస్ చైర్మన్ థామస్రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక 2017 వేతన సవరణ అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అందుకు సంబంధించిన ఎరియర్స్ను మాత్రం ఇంకా చెల్లించలేదన్నారు. ఆర్టీసీకి రా వాల్సిన రూ. 2,150 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎండి మౌలానా, యాద య్య, సురేశ్, యాదగిరి, కరుణాకర్గౌడ్, యాదయ్య, రా ఘవులు, బాల్రెడ్డి, బాబు, ఆర్టీసీ కారి్మకులు పాల్గొన్నారు. -
రేవంత్ మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు
ఆదిలాబాద్ టౌన్: సీఎం రేవంత్రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లక తప్పదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్పై ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం ములాఖత్ అయ్యారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలను మానుకోవాలని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు కలుగులో దాక్కున్నా రేవంత్ను వదిలిపెట్టమని హెచ్చరించారు. చట్టాలను, ప్రజా తీర్పులను గౌరవించాలని, మున్సిపల్ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి పెండింగ్లో ఉన్నచోట పారదర్శకంగా నిర్వహణ చేపట్టాలన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు గెలిచారని, ఏడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ అధికార దాహంతో ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి వివేక్లు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. బాల్క సుమన్ జైలుకు వెళ్లడం కొత్తేమీ కాదని, తెలంగాణ కోసం పదుల సార్లు జైలుకు వెళ్లినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. డీజీపీ శివధర్రెడ్డి సినిమా డైలాగ్లు చెప్పారని, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు పోలీసులను తిట్టినప్పటికీ వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఏం తప్పు చేశారని కేసు పెట్టారన్నారని ప్రశ్నించారు. రాహుల్ కుటుంబానికి ఇచ్చే వెయ్యి కోట్లు ఎవరి సొత్తు అని, ఈ విషయంలో ఈడీ ఏం చేస్తోందని పేర్కొన్నారు. రైతులకు రైతుబంధు ఇచ్చే తెలివి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పూర్తిగా గాలికి వదిలేసి దోపిడే లక్ష్యంగా పనిచేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. రెండేళ్ల కాలంలో ఢిల్లీకి చేరవేసేందుకు ముఖ్యమంత్రి వద్ద వెయ్యి కోట్లు సిద్ధంగా ఉన్నాయంటే ఆయన రాష్ట్ర ప్రజల సొత్తు ఇంకా ఎన్ని వేలకోట్లు మింగే ఆలోచనలో ఉన్నారని పేర్కొన్నారు. ములాఖత్ అయిన వారిలో మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగుల కమలా కర్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, గొంగిడి సునీత, కోనేరు కోనప్ప, జీవన్రెడ్డి, జాన్సన్ నాయక్ ఉన్నారు. కాగా కేటీఆర్ వచి్చన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. -
మైక్ కట్ చేయొద్దు.. కెమెరా తిప్పొద్దు
సాక్షి, వరంగల్: ‘గోదావరి జలాలపై అసెంబ్లీలో మాట్లాడదామని సీఎం అంటున్నారు. ఈ సవాల్ను మేం స్వీకరిస్తున్నాం. మైక్ కట్ చేయకుండా, కెమెరా తిప్పకుండా చర్చకు పెట్టు. ఎన్ని రోజులైనా, ఏ ప్రాజెక్టు మీదనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా తేల్చుకుందాం’అని శాసనసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. ఇటీవల ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో దేవాదుల ఎత్తిపోతల పంప్హౌస్ పరిశీలన అనంతరం సీఎం రేవంత్రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలపై హరీశ్రావు స్పందించారు. వరంగల్లో 24 అంతస్తులతో నిర్మితమవుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ...దేవాదుల పనులు చేయడం చేతగాక మంత్రులకో డెడ్ లైన్, ముఖ్యమంత్రికో డెడ్లైన్ పెడుతూ దేవాదుల ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ ఆగమాగం చేస్తోందన్నారు. రోజుకో డేట్ మారుతోందే తప్ప ప్రాజెక్టులో అంగుళం పని కూడా ముందుకు సాగడం లేదన్నారు. రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? అని మండిపడ్డారు. మొన్న ఉత్తమ్ రివ్యూలో మాట్లాడుతుంటే, ఆయన్ను ఆపి కడియం శ్రీహరికి దేవాదులపై మంచి నాలెడ్జ్ ఉంది, తర్వాతి సమీక్షలో ఆయన్ను పిలవండి అని సీఎం అనడం ఇరిగేషన్ మంత్రిని అవమానించడమేనన్నారు. కక్షలు కట్టడం కాదు...ముందు ఆస్పత్రి కట్టు రేవంత్రెడ్డి కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను కావాలనే నత్తనడకన సాగిస్తున్నారని హరీశ్రావు అన్నారు. 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సిందని, వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి చేసి ప్రారంభించకపోతే బీఆర్ఎస్ పక్షాన వరంగల్ గడ్డపైనే నిరాహారదీక్షకు దిగుతామని ప్రకటించారు. జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడిటేషన్లు ఇవ్వాలన్నారు. -
6 గ్యారంటీలు, 420 హామీల అమలు తేదీ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఏ రోజు నుంచి అధికార కాంగ్రెస్ అమలు చేస్తుందో..వాటికి ఎంత ఖర్చవుతుందో చెప్పి అమలు తేదీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో అధికారానికి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా అమలు చేయనందుకు సిగ్గన్పించడం లేదా సీఎం గారూ? డూప్లికేట్ గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు పంపాలనే శ్రద్ధే తప్ప మీకు ప్రజా సమస్యలు పట్టవా’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.‘రాష్ట్ర మంత్రివర్గంలో డూప్లికేట్ గాంధీ కుటుంబానికి పంపాల్సిన రూ.వెయ్యి కోట్ల నిధుల సేకరణపైనే చర్చ జరుపుతున్నారా’అని ఎద్దేవా చేశారు. డూప్లికేట్ గాంధీ కుటుంబానికి మూటలు పంపి పదవులు కాపాడుకోవాలనే తాపత్రయమే తప్ప 6 గ్యారంటీల అమలుపై ఎన్నడైనా చర్చించారా అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు. ఆరు గ్యారంటీల అమలుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆధ్వర్యంలో ఉద్యమించి హామీలను పూర్తిచేసేలా ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని హెచ్చరించారు.మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలు సాధ్యాసాధ్యాలపై కేబినెట్లో ఎందుకు చర్చించడం లేదని నిలదీశారు. ‘మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని చెప్పి రెండున్నరేళ్లు అయ్యింది. ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెన్ఫిట్స్ చెల్లించకపోవడంతో 61 మంది చనిపోయినా మీలో చలనం లేదా? ఉద్యోగ, ఉపాధ్యాయులకు 5 డీఏలు, పెండింగ్ బకాయిలు అందక ఇబ్బంది పడుతున్నా మీకు పట్టదా? ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలివ్వకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వేలాది యాజమాన్యాలు అల్లాడుతున్న సంగతి మర్చిపోయారా’అని ప్రశ్నించారు. -
సీఎం ప్రతి అడుగులో భూముల కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసే ప్రతి పనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుందని, ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలు ఉంటాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమ ర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుందామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, ఎల్టీపీఎస్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యా పారం చేయాలని కూడా ఆలోచన చేశారన్నారు.ఫార్మా సిటీ కోసం కేసీఆర్ 14 వేల ఎకరాలు సేకరిస్తే.. దాన్ని ఫోర్త్ సిటీ అని పేరుమార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా రన్నా రు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట ఇళ్లు కూల్చి, భూ ములు లాక్కొని.. వాటిని అంబానీకో, అదానీకో కట్టబెట్టా లని చూస్తున్నారని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రా జెక్టుతో ఇళ్లు కోల్పోతున్న మధుపార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు ఆదివారం పరామర్శించారు. ఈ ప్రభుత్వానికి ఓ విధానం లేదు..ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కేసీఆర్ ఈ అపార్ట్మెంట్కు మూడుసార్లు వచ్చారని, పార్టీ పాలసీ విజన్ డాక్యుమెంట్ను ఇక్కడి వార్ రూముల్లో కూర్చునే తయారు చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదని, పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. మూసీ శుద్ధికి తాము వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరిట పేదల ఇళ్లు కూల్చడాన్ని మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నామన్నారు. బాపు ఘాట్ వద్ద అహింసా మూర్తి గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలని, ఆ విగ్రహం, నిర్మాణం పేరిట ప్రజల ఇళ్లు కూల్చుతూ, హింసా మార్గంలో భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గం అని అన్నారు.ఇళ్లు ఖాళీ చేస్తారా, లేక జేసీబీ పంపి కూల్చమంటారా అని అధికారులు బెదిరిస్తున్నారని, రేవంత్రెడ్డికి ఈ అపార్ట్మెంట్ అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ మాత్రమే కావచ్చు.. కానీ ఒక మధ్యతరగతి వాడికి రెక్కలు ముక్కలు చేసుకుని, బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు తెచ్చుకుని కట్టుకున్న జీవితకాలపు సొంతింటి కల అని హరీశ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మూసీ ప్రాజెక్టుకు అసలు డీపీఆర్ లేదని, ఎఫ్టీఎల్ ఫిక్స్ కాలేదని, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదని, కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా జరగలేదని, అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని నిలదీశారు. -
తెలంగాణను ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారు
సాక్షి, హైదరాబాద్: సీఎం ఎనుముల రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కు ఏటీఎంలా మారిందని తాము అనేకమార్లు హెచ్చరించిన విషయాన్ని సీఎం రేవంత్రెడ్డే స్వయంగా నిస్సిగ్గుగా ఒప్పుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్టానానికి ధారపోస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన 420 హామీల అమలు విషయానికి వస్తే ప్రభుత్వం వద్ద రూపాయి నిధులు లేవని సాకులు చెబుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.అభివృద్ధికి నిధులు లేవంటున్న సర్కారు, కేవలం రెండేళ్ల కాలంలోనే రూ.3 లక్షల కోట్ల భారీ అప్పులు తెచ్చిందని, కానీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును ప్రజా ప్రయోజనాలకు వాడకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను, లగచర్లలో గిరిజనుల భూములను, చివరకు హెచ్సీయూ విశ్వవిద్యాలయ భూములను కూడా వదలడం లేదని కేటీఆర్ విమర్శించారు.హిల్ట్ పాలసీ పేరిట పరిశ్రమల భూములను ‘ఎనుముల బ్రదర్స్’ పద్ధతి ప్రకారం లూటీ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణను దోచుకోవడం, సొంతానికి దాచుకోవడం.. తన పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి సంచులు మోయడమే రేవంత్ రెడ్డి ఏకైక ఎజెండా అని ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
Telangana: నేడు రాష్ట్రమంత్రివర్గ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతోపాటు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలా రాబట్టుకోవాలనే అంశంపై చర్చించి అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు.హైదరాబాద్ మెట్రో రైలును నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’ నుంచి టేకోవర్ చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26 ముగిసే మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మెట్రో రైలు పేరుతో ఉన్న సుమారు రూ. 10 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయడంతోపాటు ఎల్ అండ్ టీకి రూ. 2 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో టేకోవర్, రెండో దశ విస్తరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం సమావేశమై ప్రభుత్వానికి సమర్పించాల్సిన నివేదికకు తుదిరూపు ఇచ్చింది.మంత్రివర్గ భేటీలో ఈ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మెట్రో రైలు టేకోవర్ విజయవంతంగా పూర్తయితే మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడంలో అడ్డంకులు తొలగిపోనున్నాయి.సత్వరమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు..ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తదుపరిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు, సహకార ఎన్నికలను సైతం వెంటనే పూర్తి చేయాలని భావిస్తోంది. డీసీసీబీ పాలక మండళ్ల ఎన్నికలను నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఎన్నికలన్నీంటినీ సత్వరమే నిర్వహించే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.అన్నదాతలకు రైతు భరోసా ఆర్థిక సహాయం చెల్లింపుపైనా కేబినెట్లో చర్చించి ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల అంశంపై మంత్రివర్గంలో చర్చించి ప్రకటన చేస్తారని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. పలు ఆర్డినెన్స్లను సైతం మంత్రివర్గం ఆమోదించనున్నట్టు తెలిసింది. -
కాళేశ్వరాన్ని వదిలేయం వాడుకలోకి తెస్తాం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం మహా అద్భుతం అన్నారని.. తాము వచ్చినప్పటి నుంచి ఒక్క చుక్క ఎత్తిపోయలేదని చెప్పారు. అయినా దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయకుండా ఉపయోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. ఒక్క కాళేశ్వరం పైనే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం మిగతా ప్రాజెక్టులను గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్న మాట వాస్తవమే అయినా, వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును అలాగే వదిలేయలేమని చెప్పారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా నిపుణుల కమిటీ సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వాడుకలోకి తెస్తామని ప్రకటించారు. ఆదివారం ఉమ్మడి వరంగల్లో పర్యటించిన రేవంత్రెడ్డి.. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్కతో కలిసి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలో దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఇంటెక్వెల్ వద్ద మోటార్లను సందర్శించిన ఆయన.. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ వద్ద ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రేవంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 వేల పుస్తకాలు చదివామని చెబుతున్న జ్ఞానవంతులు ఆనాడు 960 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. రెండు మూడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్నారు. భూసేకరణే అసలు సమస్య... ప్రాజెక్టులు పూర్తి చేయడానికి భూసేకరణే అసలు సమస్యగా మారిందని, ఫలితంగా ప్రాజెక్టుల అంచనాలు కూడా పెరిగాయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లు పాలించిన వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేంది కాదన్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని, దేవాదుల ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కోసం జూన్ 2లోపు రూ.600 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. దేవాదుల ప్రాజెక్టు 2001లో రూ.6,000 కోట్ల అంచనాతో ప్రారంభమై ప్రస్తుతం రూ.18,500 కోట్లకు పెరిగిందని, ఆ మేరకు బడ్జెట్లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మార్చిలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలియజేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో దేవాదులపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒక నెలలోపు దేవాదుల పంపులను మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబుకు సహకరించలే.. తెలంగాణ నీటి హక్కులను కాపాడుతూ అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రేవంత్రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, గత ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహకరిస్తున్నామనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని చెప్పారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో పూర్తిస్థాయిలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలు కాకుండా సూచనలు ఇస్తే స్వాగతిస్తామని పేర్కొన్నారు. ‘అధికారం, పదవులు వారసత్వంగా రావు.. ప్రజలే నిర్ణయిస్తారు.. పదవులు ఎవరి సొత్తు కాదు.. ప్రజల ఆశీస్సులతోనే పదవులు వస్తాయి’అని రేవంత్రెడ్డి అన్నారు. 2034 వరకు మరో పదేళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. వెన్నం సోదరులకు సీఎం పరామర్శ మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లాలోని రెడ్యాల గ్రామానికి చెందిన వెన్నం రాఘవేందర్రెడ్డి మృతిచెందగా.. సీఎం రేవంత్రెడ్డి ఆదివారం వెన్నం సోదరులను పరామర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రెడ్యాల గ్రామానికి చేరుకున్న రేవంత్రెడ్డి.. రాఘవేందర్రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులు రాష్ట్ర సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్రెడ్డి, బిగ్ టీవీ చైర్మన్ వెన్నం విజయకాంత్రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్నకు అరుదైన ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించమని ముఖ్యమంత్రికి లేఖ పంపింది. ఈ కార్యక్రమం మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్లో జరగనుంది.భారత్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవడం విశేషం. “AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే ప్యానెల్లో పాల్గొని ప్రసంగించమని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సెషన్లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది.ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగించాలని నిర్వాహకులు ప్రత్యేకంగా కోరారు.ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఏఐ పాలన, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు హార్వర్డ్ అధికారులు వివరించారు. -
రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: సీఎం రేవంత్
ములుగు: గోదావరి జలాల అంశం రాజకీయ రంగు పులుముకుందన్నారు సీఎం రేవంత్రెడ్డి. రాష్ట్రం ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు బాగా ఉన్నాయని, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఎంతో మేలు జరిగేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు సీఎం రేవంత్. రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ప్రస్తుతం నిధుల కొరత ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అనుకుంటే అది భ్రమేనని తేలిపోయింద్నారు. ఇక కృష్ణా జలాల తరలింపుపై సభలో క్లారిటీ ఇచ్చామన్నారు. గోదావరి జలాల వివాదంపై అసెంబ్లీఓ చర్చిద్దామన్నారు. చౌకబారు రాజకీయాలతో తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు(ఆదివారం, ఫిబ్రవరి 22వ తేదీ) దేవాదుల ప్రాజెక్టును పరిశీలించారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా ఇంజనీరింగ్ అధికారులతో నీటి లభ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ అధికారులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేంద్రరెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
‘రేవంత్రెడ్డికి బీజేపీ భయం పట్టుకుంది’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు. కామారెడ్డిలో బీజేపీకి చైర్మన్ పదవి రాకుండా చేశారని రాంచందర్రావు ధ్వజమెత్తారు. ప్రజాహక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. బొల్లారం పీఎస్ నుంచి రాంచందర్ రావును విడుదల చేశారు. కామారెడ్డికి వెళ్లకూడదన్న షరతులతో ఆయన్ను విడుదల చేశారు పోలీసులు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంచితే, నేడు చలో కామారెడ్డికి తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో రాంచందర్ సహా, ముఖ్య నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించి వారిని కామారెడ్డి వెళ్లకుండా అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులు చేశారు. ఈ క్రమంలోనే రాంచందర్ రావును బొల్లారం పీఎస్కు తరలించారు. -
రైతు భరోసా ఏదీ?
మహబూబ్నగర్ (వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని బలోపేతం చేయడం, రైతులకు సాగు ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించారు. సాధారణంగా వానాకాలం, యాసంగి సీజన్లకు అనుగుణంగా సాయం విడుదల చేయాలి. కానీ అమలులో ఉన్న సమస్యలు, ఆలస్యాలు, స్పష్టతలేమి కారణంగా ఈ పథకం రైతులకు నిజంగా భరోసా ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.గత యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా సాయం పూర్తిగా విడుదల కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేఏడాది వానాకాలం సీజన్లో రైతు భరోసాను నాలుగు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పెద్ద భూస్వాములు మాత్రమే కాదు, 5–6 ఎకరాల చిన్న, మధ్య తరహా రైతులు కూడా నష్టపోయారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి వెంటనే రైతు భరోసా డబ్బులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం రైతుల్లో అసంతృప్తి పెంచుతోంది.● రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. రెండు సీజన్లకు విడివిడిగా సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరానికి మొత్తం రూ.12 వేలు మాత్రమే ఇస్తున్నారు. రెండు సీజన్లకు కాకుండా, ఒక్క సీజన్కు రూ.6 వేల చొప్పున మాత్రమే జమ అవుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మేనిఫెస్టోలో చెప్పిన హామీ అమలు కాలేదనే అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది.● పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న రైతు భరోసా పథకం మరోసారి చర్చనీయాంశమైంది. 2025 వానాకాలం సీజన్లో జిల్లాలో 2,54,059 మంది రైతులకు రూ. 255.48 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో బ్యాంకు ఖాతాలు అనుసంధానం ఉన్న మొత్తం 2,14,929 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.240 కోట్లు జమ అయ్యాయి. అయితే అదేవిధంగా యాసంగి సీజన్కు కూడా సాయం అందుతుందని భావించిన రైతులకు నిరాశ ఎదురైంది.● ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభమై పంటలు విత్తే సమయం దాటుతున్నా రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కాలేదు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరిగిన ఈ సమయంలో ప్రభుత్వం ఉంచి రావాల్సిన సాయం ఆలస్యమవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.● ఇప్పటికే పాత రుణాలు ఉన్న రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయడంలో వెనుకంజ వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధులు ఆలస్యం రావడం మరింత ఆర్థిక ఒత్తిడిని తెచ్చిపెడుతోంది. కొంతమంది రైతులు అధిక వడ్డీతో ప్రైవేట్ అప్పులు తీసుకుని సాగు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ప్రజల ఆస్తులపై రేవంత్ కన్నుపడింది: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. ఆదివారం ఆయన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్న బాపు ఘాట్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులపై రేవంత్ కన్నుపడిందని మండిపడ్డారు. మూసీ పేరిట కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందంటూ దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణను బీఆర్ఎస్ వ్యతిరేకించడం లేదని హరీష్రావు అన్నారు.‘‘కేసీఆర్కు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ అపార్ట్మెంట్ వార్ రూమ్ నుండే బీఆర్ఎస్ విజనరీ డాక్యుమెంట్ను తయారు చేశారు. ఈ అపార్ట్మెంట్కు కేసీఆర్ మూడుసార్లు వచ్చారు. మంచి నీరు లేవని.. అపార్ట్మెంట్ వాసులు కేసీఆర్ను కలిస్తే.. కేసీఆర్ వెంటనే మంచి నీటి సదుపాయాన్ని ప్రత్యేక పైప్లైన్ ద్వారా నీరు అందించారు. అపార్ట్మెంట్ వాసులను కేసీఆర్ నిలబెడితే రేవంత్ రెడ్డి కూల్చేస్తున్నాడు. మూసీ పేరుతో పేదల ఇండ్లు కూల్చొదు.. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దు...రేవంత్ ఏది చేసిన రియల్ వ్యాపారం కోసమే.. మూసీ పేరుతో భూములు లాక్కొని బడా వ్యాపారులకు ఈ భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు కట్టలేదు కానీ పేదల ఇండ్లు కూల్చేస్తున్నారు. డబ్బులు లేవంటూనే ప్రపంచ సుందరి పోటీలు పెట్టారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి మూసి సుందరీకరణ చేస్తున్నారు. వీరి బతుకులను కూల్చకండి.. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోండి’’ అంటూ హరీష్రావు డిమాండ్ చేశారు. -
ఉన్నది మెరిట్ కోటానే
వికారాబాద్: కాంగ్రెస్లో ఏ కోటా ఉండదు.. కేవలం మెరిట్ కోటా మాత్రమే ఉంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బాగా పనిచేసే వారికి పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కుతుందని చెప్పారు. వికారాబాద్లోని అనంతగిరి హరిత రిసార్ట్స్లో ఏర్పాటు చేసిన ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షులుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. దేశం ఆత్మనే కాంగ్రెస్.. కాంగ్రెస్ పార్టీని దేశాన్ని ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పారు. దేశ స్వాతంత్య్రానికి 140 ఏళ్ల ముందే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్.. కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్య్రం.. ఇచ్చిన రాజ్యాంగాన్ని వినియోగించుకొని ఉద్భవించిన పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నాయని ఎద్దేవా చేశారు. త్యాగాల పార్టీ కాంగ్రెస్ భారత దేశ ఆత్మగౌరవం గ్రామాల్లో ఉందని నమ్మే పార్టీ కాంగ్రెస్ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఇటీవల కొన్ని పార్టీలు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, లేదంటే సమూలంగా మార్చేయాలనే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. మహాత్మాగాందీ, నెహ్రూ వంటి నాయకులు దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లారన్నారు. గాంధీ బ్రిటిష్ వారిపై తిరగబడితే వారు ఆయనపై కనీసం లాఠీ కూడా ఎత్తలేదని, కానీ మన దేశానికి చెందిన ఓ పార్టీ నాయకుల తుపాకీ గుండ్లకు బలి కావాల్సి వచ్చిందని తెలిపారు. గాం«దీ, ఇందిరాగాందీ, రాజీవ్గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారన్నారు. త్యాగాల చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్గాంధీ 4వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు.. ‘డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైనవారు జిల్లాకు అధిపతులమని భావించొద్దు.. వ్యతిరేకించిన వారిని అణచివేసే ప్రయత్నాలు చేయొద్దు’అని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ప్రతీ నాయకుడి ఇంటికి వెళ్లి కలిసి మద్దతు అడిగానని గుర్తు చేసుకున్నారు. అందరూ కలిసి పనిచేయడంతోనే రెండున్నర శాతం ఉన్న కాంగ్రెస్ ఓట్లను 40 శాతానికి తెచ్చుకోవడంతోపాటు అధికారంలోకి రాగలిగామని స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేయించామన్నారు. డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామని చెప్పారు. డీసీసీ అధ్యక్ష పదవులను దుర్వినియోగం చేయొద్దని, పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీయొద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు శాతం తేడాతో అధికారంలోకి వచ్చిన మనం పార్లమెంట్ ఎన్నికల్లో 4 శాతం ఓట్లు పెంచుకున్నామని, మున్సిపల్ ఎన్నికల్లో 12 శాతానికి చేరుకున్నామని, ప్రజల మనసు గెలవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. గొంతు నొక్కే కుట్ర బీజేపీ కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటులో రాహుల్గాం«దీని మాట్లాడనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, బడుగులు, బలహీన వర్గాల గొంతు నొక్కే కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో క్వాలిటీ లీడర్íÙప్ను తయారు చేయటమే సంఘటన్ సృజన్ అభియాన్ లక్ష్యమని చెప్పారు. దేశంలో సంస్థాగత మార్పునకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, శిక్షణ నిర్వహణ కమిటీ చైర్మన్ టి.రామ్మోహన్రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య తదితరులు పాల్గొన్నారు. -
ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు
సినిమా ప్రమోషన్లలో హడావుడి చేసే హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. అప్పట్లో రకరకాలుగా రచ్చ చేసి హాట్ టాపిక్ అయ్యేవాడు. గత రెండు మూడు సినిమాలు దారుణంగా దెబ్బకొట్టేసరికి సైలైంట్ అయిపోయాడు. గతవారం రిలీజైన 'ఫంకీ' కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇంతలోనే మరో కొత్త మూవీతో థియేటర్లలోకి వచ్చేందుకు విశ్వక్ రెడీ అయిపోయాడు. 'కల్ట్' పేరుతో తీసిన ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజైంది. ఈ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ చాలా హడావుడి చేసేశాడు. బోలెడన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు.'నేను ట్విటర్, రెడిట్లో జనాలు ఏం కోరుకుంటున్నారు. ఏం మిస్ అవుతున్నారనేది చదివా. అవన్నీ కలిపి ఓ మిక్సర్లో కొట్టి 'కల్ట్' తీశాను. 'ఫలక్నుమా దాస్' తీసిన దానికి 10 రెట్లు కసిగా తీశాను' అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. అలానే టీజర్ చూసి.. చాలామంది దీన్ని 'స్క్విడ్ గేమ్', నాని 'హిట్ 3'తో పోల్చారు. ఈ కామెంట్స్పై స్పందించిన విశ్వక్.. ఈ స్టోరీని నాలుగేళ్లుగా రాస్తున్నాను. హాలీవుడ్ మూవీ 'ప్రాజెక్ట్ ఎక్స్'ని స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను గతంలో దర్శకత్వం వహించిన వాటిలా స్క్రాచ్ నుంచి రాశాను అని అన్నాడు.(ఇదీ చదవండి: 'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్)అలానే ఈ సినిమాకు కుటుంబాలు, పిల్లలు దూరంగా ఉండాలని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మూవీ చూస్తే, సూపర్ రా నువ్వు అని నన్ను మెచ్చుకుంటారు. ఇక 'ఫంకీ' ఫలితం గురించి ప్రశ్న రాగా.. ఎవడు ఏమనుకున్నా 'ఫంకీ' నాకు హిట్టే, నేనో గొప్ప మూవీ చేశాననని విశ్వక్ పేర్కొన్నాడు. 'ఆవేశం' చిత్రంలోలా మూవీ మొదలైన 45 నిమిషాల తర్వాత తన ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక 'కల్ట్' టైటిల్ నిర్మాత ఎస్కేఎన్ది కదా? అని ఓ రిపోర్టర్, విశ్వక్ని అడగ్గా.. నాకు తెలియదు సార్. నేను అప్పటికే రిజిస్టర్ చేసుకున్నా. ఇది ఎప్పటికి నాదే అని బదులిచ్చాడు.'కల్ట్' చిత్రంలో చాలామంది పలువురు కొత్త నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ కాగా విశ్వక్ సేన్.. దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశాడు. 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతమందించాడు. బహుశా ఈ సినిమా వేసవిలో థియేటర్లలోకి రావొచ్చేమో?(ఇదీ చదవండి: గోల్డ్ రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన విశ్వక్.. రవి బస్రూర్ ఎమోషనల్) -
AI సమ్మిట్లో నిరసనలు.. యూత్ కాంగ్రెస్పై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో యూత్ కాంగ్రెస్ సభ్యుల నిరసనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు అంటూ మండిపడ్డారు. ఎక్కడ.. ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవాలని హితవు పలికారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలు తగవు. యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ అల్ప రాజకీయ నాటకాల కోసం 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026'ను వేదికగా ఎంచుకోవడం అత్యంత విచారకరం. ఇలాంటి అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, ప్రపంచ దేశాల ముందు మన దేశ ప్రతిష్ట దెబ్బతింటుంది.ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే, కానీ ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి ఒక సమయం, సందర్భం ఉంటాయి. AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వంటి అంతర్జాతీయ సదస్సు ఖచ్చితంగా దానికి వేదిక కాదు. వారి సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే AI సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ నిరసన చేపట్టడం విచిత్రంగా ఉంది’ అంటూ.. నిరసనలకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. It is absolutely deplorable that members of the Youth Congress chose the AI Impact Summit 2026 as a venue for petty political theatricsUsing such a global platform for protests will project our great nation India in a poor light internationallyWhile difference of opinion is… pic.twitter.com/sM3MmIb8UJ— KTR (@KTRBRS) February 21, 2026 -
వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
వికారాబాద్: జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం అనంతగిరి గుట్టపై గల హరిత రిసార్ట్స్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులందరూ హాజరుకానున్నట్లు తెలిసింది. మంత్రులు రోడ్డు మార్గంలో.. సీఎం హెలీకాప్టర్లో చేరుకోనున్నారు. పది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన 41 మంది, తెలంగా ణకు చెందిన 36 డీసీసీ అ«ధ్యక్షులు శిక్షణ తీసుకోనున్నారు.సీఎం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరా బాద్ నుంచి హెలీకాప్టర్లో బయలు దేరి 1.45గంటలకు వికారాబాద్లోని ఎస్ఏపీ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రో డ్డు మార్గంలో అనంతగిరికి చేరుకుంటారు. మధ్యా హ్నం 3గంటలకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హెలీకాప్టర్లో తిరిగి హైదరాబాద్కు వెళ్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ చైర్మ న్, పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి, కలెక్టర్ ప్రతీక్జైన్, పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. -
ఏఐ మంత్రిత్వ శాఖ!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. కృత్రిమ మేధ వినియోగం, నియంత్రణ, చట్టపరమైన మార్గదర్శకాలు, జాతీయ భద్రత వంటి అంశాలను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు.మానవ చరిత్రలో అగ్ని, చక్రం, వ్యవసాయం, విద్యుత్, ఇంటర్నెట్ వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎలా మార్చాయో గుర్తుచేశారు. ఏఐ కూడా అలాంటి విప్లవాత్మక సాంకేతికతేనని, ఇది కేవలం ఇంకొక టెక్నాలజీ కాదని, మానవ పరిణామ క్రమంలో అత్యంత శక్తివంతమైన మలుపని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మునుపటి యంత్రాల మాదిరిగా కాకుండా ఏఐ స్వయంగా నేర్చుకోగలదని, విశ్లేషించగలదని, నిర్ణయాలు తీసుకోగలదని అన్నారు. రోబోటిక్స్తో కలిసినప్పుడు యంత్రాలు మానవ మేధస్సుతో పాటు శారీరక సామర్థ్యాన్ని కూడా పొందుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో వార్ రూమ్ నిర్వహిస్తాం.. ప్రపంచ ఏఐ పోటీ ఇప్పటికే ప్రారంభమైందని, కొన్ని దేశాలు, కంపెనీలు ముందంజలో ఉన్నాయని సీఎం చెప్పారు. గత పారిశ్రామిక విప్లవాల సమయంలో జరిగిన అవకాశ నష్టాలను గుర్తు చేస్తూ, ఈసారి భారత్ అలాంటి తప్పిదం చేయకూడదని హెచ్చరించారు. సేవలు, సాఫ్ట్వేర్ రంగాల్లో విజయం సాధించిన భారత్, ప్రపంచ స్థాయి కోర్ టెక్నాలజీ ఉత్పత్తుల్లో కూడా నాయకత్వం వహించాలని సూచించారు.దేశానికి తక్షణ జాతీయ ఏఐ రోడ్మ్యాప్ అవసరమని నొక్కిచెప్పారు. ఏఐ అభివృద్ధి ప్రతి దశలో భారత్ స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ పరిణామాలను నిశితంగా పర్యవేక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో జాతీయ ‘ఏఐ వార్ రూమ్’ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కేంద్రం అనుమతిస్తే హైదరాబాద్లో అలాంటి వార్ రూమ్ నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ఏఐ యూనివర్సిటీ స్థాపించాలి ప్రపంచ స్థాయి పరిశోధనలకు ఊతమిచ్చే ఏఐ యూనివర్సిటీని దేశంలో స్థాపించాలని సీఎం కోరారు. ఏఐ విస్తరణ నేపథ్యంలో ఉపాధిపై ఉద్భవిస్తున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ, కొన్ని రంగాల్లో ఉద్యోగ నష్టాలు సంభవించవచ్చని, అయితే సరైన రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ చర్యల ద్వారా ఏఐ సృష్టించే కొత్త అవకాశాలు మరింత విస్తృతంగా ఉంటాయని రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. యువతను ఏఐ ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్ల కోసం జాతీయ ఏఐ నిధి స్టార్టప్లకు మద్దతు కల్పించేందుకు జాతీయ ఏఐ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఏఐ ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే ‘ఏఐ స్టార్టప్ విలేజ్’ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. ఏఐ రంగంలో విధానాలు, చట్టాలు, నైతిక ప్రమాణాలకు మార్గనిర్దేశం చేసే అత్యున్నత సంస్థగా ఇండియా ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని కోరారు. ఏఐ అభివృద్ధి, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన, ప్రజా సేవల మెరుగుదల, జాతీయ భద్రతకు తోడ్పడేలా ఉండాలని సూచించారు. బాధ్యతాయుతమైన, సమ్మిళిత, భవిష్యత్ దృష్టితో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించేందుకు ప్రపంచ నిపుణులు, సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. -
సీఎం కప్ ఫైనల్స్ ఘనంగా ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: చీఫ్ మినిస్టర్ కప్ 2025 (తెలంగాణ) రెండో ఎడిషన్ రాష్ట్ర స్థాయి ఫైనల్స్ పోటీలు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిన్న (ఫిబ్రవరి 19) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డా. ఏ. సోనిబాలా దేవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ.. ఈ పోటీలను తెలంగాణ క్రీడా చరిత్రలో సరికొత్త మైలురాయిగా అభివర్ణించారు.రికార్డు స్థాయిలో దరఖాస్తులు - ఈ టోర్నీలో రాష్ట్రవ్యాప్తంగా 5,15,936 మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. - మండల, జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించిన 21,500 మంది అథ్లెట్లు రాష్ట్ర ఫైనల్స్కు అర్హత సాధించారు. - ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు జరిగే ఈ పోటీల్లో 44 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. చీఫ్ మినిస్టర్ కప్ ప్రధాన ఉద్దేశం.. - గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం. - రాష్ట్ర క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం. - జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించడం. - క్రీడాకారుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడం.- భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలకు ప్రతిభను సిద్ధం చేయడం. -
రేవంత్ కు లొంగిన బాబు..
-
‘భూపాలపల్లి’ కేసులో రేవంత్కు ఊరట
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి, భూపాలపల్లి పోలీస్స్టేషన్లలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (నాడు ఎంపీ)పై 2023లో దాఖలైన కేసులో ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి హైకోర్టు ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు రేవంత్కు ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా వేసింది. 2023, ఫిబ్రవరి 22న భూపాలపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఎంపీగా ఉన్న రేవంత్రెడ్డి తనపై భూకబ్జాదారుడినని, పెట్రోల్, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డానని, సింగరేణిలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డానని తీవ్ర ఆరోపణలు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మొగుళ్లపల్లి, భూపాలపల్లి పీఎస్ల్లో కేసు నమోదైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ రేవంత్ మూడు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుజన కళాసికం ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. -
ఆ పార్టీలతో జాగ్రత్త
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ..ఏమాత్రం ఏమరుపాటు తగదని, ప్రధాన పక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్లు సైతం బలంగా ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ స్పష్టం చేసింది. సామాజిక న్యాయం అంశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నప్పటికీ..జాతీయవాదం, ప్రాంతీయ వాదం నినాదాలతో ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. రెండు పార్టీల ను ఎప్పటికప్పుడు ఐకమత్యంతో సమర్థంగా ఎదుర్కోవాల ని సూచించింది. గురువారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సహా మంత్రులందరితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. ఖర్గే నివాసంలో సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో భాగంగా.. ముఖ్యమంత్రి, మంత్రులందరితో కలిపి ఒకసారి, విడివిడిగా మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీల బలాబలాలు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకా లు, వాటి అమలుకు చేసిన ఖర్చు తదితరాలపై నేతలకు సీఎం రేవంత్ వివరణ ఇచ్చారు. అనంతరం పలు అంశాలపై రాష్ట్ర నేతలకు ఏఐసీసీ పెద్దలు దిశా నిర్దేశం చేశారు. బలం మరింత పెంచుకునేందుకు ఆ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.. ‘ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 29 శాతం ఓట్లు సాధిస్తే, బీజేపీ 16 శాతం ఓట్లు రాబట్టుకుంది. సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు 30 శాతం సీట్లు వచ్చాయి. బలం మరింత పెంచుకునేందుకు రెండు పార్టీలు గట్టిగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటేనే ఆ పార్టీలను నిలువరించగలం. దీనికి తోడు కొన్ని సామాజిక వర్గాల్లో ఈ రెండు పార్టీలు పట్టు సాధిస్తున్నాయి. దీనిని అభివృద్ధి మంత్రంతో అడ్డుకోవాలి. యువత, మహిళలను మరింతగా పార్టీకి చేరువ చేయాలి..’ అని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లు తెలిసింది. ఎంఐఎంపై విస్తృతంగా చర్చిద్దాం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నిలువరించడంతో పాటు ఎంఐఎంను కట్టడి చేసే అంశం రాహుల్గాంధీ ప్రస్తావించినట్లు తెలిసింది. ఎంఐఎం ఎంతగా విస్తరిస్తే అంతగా బీజేపీ ఎదుగుతుందని, ఇప్పటికే అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఎంఐఎంను కాంగ్రెస్ భాగస్వామిగా ప్రజలు భావిస్తే గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల ఓట్లలో చీలిక వచ్చే అవకాశాలపై అనుమానాలు లేవనెత్తినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరోమారు విస్తృతంగా చర్చిద్దామని ఖర్గే అన్నట్టు చెబుతున్నారు. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామన్న సీఎం ముఖ్యమంత్రి మాట్లాడుతూ..‘ఇటీవలి ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించాం. పార్టీ చెబుతున్నట్టుగానే బీసీలకు మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్మన్ పోస్టుల్లో ప్రాధాన్యతనిచ్చాం. ఇకపైనా ఇదే విధానాన్ని కొనసాగిస్తాం..’ అని చెప్పినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర నేతల చిత్తశుద్ధిని ప్రశంసిచిన హైకమాండ్ పెద్దలు.. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుకున్న బీజేపీ తీరును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం అవసరమని మీనాక్షి నటరాజన్ సూచించగా, దీనిపై పీసీసీ అధ్యక్షుడు దృష్టి సారించాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. కాగా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. తమతమ శాఖల పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. «రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేశామని ఉత్తమ్ చెప్పారు.మార్చి 15 నాటికి పదవుల పంపకాలుఎన్నో నెలలుగా పెండింగ్లో ఉన్న పార్టీ, నామినేటెడ్ పదవుల భర్తీకి ఈ భేటీలో హైకమాండ్ పెద్దలు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. సామాజిక సమతుల్యతను పాటిస్తూ, అన్ని వర్గాలకు, పార్టీ కోసం పనిచేసిన నిజమైన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని సూచించారు. మార్చి 15 నాటికి రాష్ట్ర స్థాయి పదవుల కేటాయింపు పూర్తిచేసి, ఆ తర్వాత మరో పది రోజుల్లో జిల్లా స్థాయి పదవులను భర్తీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయాలని సూచించినట్లు తెలిసింది. వీటితో పాటు చీఫ్ విప్, రెండు విప్ పదవుల భర్తీపైనా చర్చ జరిగిందని సమాచారం. రెడ్డి లేదా వెలమ సామాజికవర్గ నేతకు చీఫ్ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు పార్టీ కార్యవర్గ కూర్పుపైనా చర్చించారు. వర్కింగ్ ప్రెసిడెంట్లలో బీసీలు మినహా మిగతా అన్ని సామాజిక వర్గ నేతలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.పిలిస్తే మేడారం వచ్చే వాళ్లం కదా..సమ్మక్క, సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి సీతక్కను అగ్రనేతలు అభినందించారు. మేడారం జాతర చరిత్ర, ప్రాశస్త్యం గురించి మంత్రి వివరించగా..ఖర్గే, రాహుల్లు మరింత సమాచారం అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క, సారలమ్మల చరిత్రను దేశవ్యాప్తంగా పరిచయం చేసేలా జాతీయ స్థాయి సినిమా రూపొందించాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. మేడారం జాతరకు ఆహ్వానిస్తే తప్పకుండా హాజరయ్యేవారమని రాహుల్, ఖర్గే అనగా..సమయాభావంతో వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినట్లు సీతక్క వివరణ ఇచ్చారు. ఈసారి తప్పకుండా అధికారిక ఆహా్వనం అందజేస్తామని చెప్పారు. ఆహ్వానం అందితే తప్పక వస్తామని రాహుల్, ఖర్గే అన్నారు. కాగా అందరితో కలిసి చర్చించిన పార్టీ అగ్రనేతలు, అనంతరం మంత్రుల కోరిక మేరకు విడివిడిగా ఒక్కో నేతతో 5–10 నిమిషాల పాటు మాట్లాడారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మీనాక్షి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సురేఖ పలు అంశాలపై వారితో చర్చించినట్లు తెలిసింది. -
మంత్రుల అవినీతి ఆడియోలు.. బాంబు పేల్చిన బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపేందుకు అధికారంలో ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో మంత్రుల అవినీతికి సంబంధించిన చిట్టా, ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని త్వరలోనే బయటపెడతామని బాంబు పేల్చారు.కరీంనగర్ పదో డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ కొమురయ్య బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీకి తొలి మేయర్ను అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్కి అభినందనలు తెలిపారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ..‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సహకారంతో కరీంనగర్ గెలిచాం. రాష్ట్ర, జిల్లా నాయకత్వం సమిష్టిగా అగ్రెసివ్గా కొట్లాడం. బీఆర్ఎస్.. కాంగ్రెస్, ఎంఐఎంతో కుమ్మకైంది. బీజేపీని అడ్డుకునేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కుమ్మక్కయ్యాయి. కానీ అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు వారి అధిష్టానం మాట ధిక్కరించి అవసరం వస్తే మాకు సపోర్ట్ ఇస్తామన్నారు. కరీంనగర్ స్పూర్తితో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం. ప్రజల కళ్లలో ఆనందం కంటే ఒవైసీ కళ్లలో ఆనందం చూడాలని రేవంత్ అనుకుంటారు. మజ్లిస్ కోసమే భాగ్యనగరాన్ని సీఎం రేవంత్రెడ్డి మూడు ముక్కలు చేశారు. మూడు ముక్కలు ఎందుకు ఎవరి కోసం చేశారో రేవంత్ చెప్పడం లేదు. భాగ్యనగరం గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తాం. ముంబై, ఢిల్లీ లాంటి పెద్ద నగరాలను కూడా విభజించలేదు. ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఎక్కడ ఉన్నాయి?. వచ్చిన పెట్టుబడులు అన్ని ఏఐసీసీకి పంపి దేశంలో పార్టీని బతికేస్తున్నారు. TPCC కాదు T4C అంటే తెలంగాణ కమీషన్ కలెక్షన్ కరప్షన్ కాంగ్రెస్. ఢిల్లీకి మూటలు మోయడానికే కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మంత్రుల అవినీతి చిట్టా మా దగ్గర ఉంది. ఇంకా వివరాలు సేకరిస్తున్నాం. ఐఏఎస్ అధికారులు కూడా వీటికి మధ్యవర్తులుగా సహకరిస్తున్నారు. మేము ఒక్కో మంత్రి ఇంటి వద్ద అవినీతిపై ఆందోళన చేస్తాం అని హెచ్చరించారు. -
తొలి అడుగు తడబాటు
సాక్షి, హైదరాబాద్: ‘మొదటిసారి ఎన్నికల్లో గెలవడం ఈజీ నే. కొత్తవారైనందున ఓటర్లలో సహజంగా ఉండే అభిప్రాయంతో పాటు ఇందుకు అనేక కారణాలుంటాయి. కానీ రెండోసారి, మూడోసారి గెలవడం అంత సులువు కాదు. ప్రజల మన్ననలు ప్రతిసారీ పొందాలంటే చాలా కష్టపడాలి. అసలు రాజకీయమంటే ఏంటో రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెలుస్తుంది.’.. కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్రెడ్డి పదేపదే చెప్పే మాట ఇది. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండాలని, ఓటు బ్యాంకు కాపాడుకోవాలని, పట్టు కోల్పోవద్దని.. అలా జరగాలంటే అన్ని వర్గాలకూ అందుబాటులో ఉండాలని ఆయన చెబుతుంటారు. కానీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల నుంచి తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలామంది ఈ విధంగా తొలి అడుగు వేయడంలో పూర్తిగా తడబడ్డారు. పట్టణ ఓటరు నాడి అర్థం కాకనో, ప్రజలతో సంబంధాలు కొనసాగించలేకనో కానీ పార్టీ గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో పార్టీని విజయపథంలో నడిపించ లేకపోయారు. చివరకు చైర్మన్లు, మేయర్లను ఎలాగోలా గెలిపించుకున్నా.. తొలిసారి ఎమ్మెల్యేలున్న చాలా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటం గమనార్హం. కానీ ఎవరికి ఓటేయాలనే విషయంలో ఓటర్లకు పూర్తిస్థాయిలో స్పష్టత కొరవడటమే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీని చూసి ఓటేయాలా? ఎమ్మెల్యే వైపు ఉండాలా? పాలన సరిగా లేదని ప్రతిపక్షం వైపు చూడాలా? అనే విషయాల్లో అస్పష్టత వల్లే ఆయా మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిందని వారు అభిప్రాయపడుతున్నారు.అంచనాల్లో వైఫల్యం! ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ఇదే ఫలితం కనిపించింది. పార్టీ ఏదైనా మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు తమ మున్సిపాలిటీల్లో పట్టు కనబర్చలేకపోయారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతల తీరును తొలిసారి ఎమ్మెల్యేలు అంచనా వేయలేకపోయారని, అనుభవరాహిత్యంతో పాటు ప్రజలతో సంబంధాలు కొనసాగించడంలో వైఫల్యం కారణంగానే ఇలాంటి ఫలితాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణ ప్రాంతాల ఓటర్లను ఆకట్టుకోవడంలోనూ వెనుకబడ్డారని, సీనియర్లయిన మాజీలతో తలపడాల్సి వచ్చిన చోట్ల జూనియర్ ఎమ్మెల్యేల పాట్లు అన్నీ ఇన్నీ కావని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.తొలిసారి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో హంగ్ ఫలితాలిలా.. » మహబూబాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్కు బీఆర్ఎస్ కంటే రెండు వార్డులే ఎక్కువ వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఇదే నియోజకవర్గంలోని కేసముద్రంలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు సమాన స్థాయిలో వార్డులు వచ్చాయి. » పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గం పరిధిలోని తొర్రూరులో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ వార్డులు వచ్చాయి. » ఖానాపూర్ నియోజకవర్గ కేంద్ర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్, బీజేపీల కంటే తక్కువ స్థానాల్లో ఆ పార్టీ కౌన్సిలర్లు గెలుపొందారు. » ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నప్పటికీ ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. » ముథోల్ నియోజకవర్గంలోనూ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా భైంసా మున్సిపాలిటీలో ఆ పార్టీ గెలిచింది కేవలం ఆరు వార్డు స్థానాలనే. » సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా దాని పరిధిలోని కాగజ్నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల కంటే తక్కువ స్థానాల్లో కమలం పార్టీ గెలిచింది. » జనగామలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండగా కాంగ్రెస్ పార్టీ కంటే ఒక స్థానం ఎక్కువగా 13 వార్డుల్లో గెలిచినా మ్యాజిక్ ఫిగర్ మాత్రం రాలేదు. » వర్ధన్నపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కూడా తన మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాలు గెల్చుకోలేకపోయారు. » నారాయణపేట నియోజకవర్గ కేంద్ర మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరి్ణకారెడ్డి పట్టు ప్రదర్శించలేకపోయారు. అక్కడ బీజేపీ కంటే కాంగ్రెస్కు రెండు వార్డులు తక్కువ వచ్చాయి. » కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమనగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కటే వార్డు రావడం గమనార్హం. » మెదక్ నుంచి మైనంపల్లి రోహిత్రావు ఎమ్మెల్యేగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఆధిక్యత లభించలేదు. » దేవరకద్ర ఎమ్మెల్యే జీఎమ్మార్ కూడా తడబడిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేల్లో ఉన్నారు. ఆయన నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్కు ఎక్కువ స్థానాలు వచి్చనా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. » కోరుట్ల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అక్కడ బీజేపీ కంటే నాలుగు స్థానాలు తక్కువ వచ్చాయి. అక్కడ కాంగ్రెస్కు కూడా బీఆర్ఎస్తో సమానంగా వార్డులు వచ్చాయి. » వేములవాడలో ఆది శ్రీనివాస్కు మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు కౌన్సిలర్ స్థానాలు తక్కువ పడ్డాయి. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్కు రావడం గమనార్హం. » హుజూరాబాద్లో పాడి కౌశిక్రెడ్డి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, జమ్మికుంటలో మ్యాజిక్ ఫిగర్ రాలేదు. » కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా అక్కడ ఆ పార్టీ తక్కువ వార్డుల్లో గెలిచింది. » ఆలంపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నా అక్కడ కాంగ్రెస్ పార్టీతో సమానంగా మాత్రమే వార్డులు దక్కించుకోగలిగారు. » చెన్నూరులో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్న వివేక్ కూడా తన నియోజకవర్గ కేంద్రంలో మెజార్టీ సాధించలేకపోయారు. కమలం పార్టీలో కంగారు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో కొత్త కంగారు మొదలైంది. పట్టణ ప్రాంత ఓటర్లు తమకు అనుకూలంగా ఉంటారనే అంచనాలతో కోటి ఆశలతో వెళ్లిన ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో భంగపాటు ఎదురైంది. అసలే ఓటింగ్ శాతం తగ్గి కేవలం ఒక మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్కు మాత్రమే పరిమితమైన బీజేపీలో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేల పనితీరు కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఫస్ట్ టైమర్లే. రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్రెడ్డిలు గతంలోనూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. మిగిలిన ఆరుగురు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో బీజేపీకి చేదు ఫలితాలే వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ఓడించి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జెయింట్ కిల్లర్గా అవతరించిన వెంకటరమణారెడ్డి (కామారెడ్డి)తో సహా హరీశ్బాబు (సిర్పూర్), పాయల్ శంకర్ (ఆదిలాబాద్), రామారావు పవార్ (ముథోల్), పైడి రాకేశ్రెడ్డి (ఆర్మూరు), ధన్పాల్ సూర్యనారాయణ (నిజామాబాద్ అర్బన్)లు తమ నియోజకవర్గాల్లోని పట్టణ ప్రజల ఆదరణ పొందలేకపోయారు. ఇక బీజేఎల్పీ నాయకుడిగా ఉన్న ఏలేటి మహేశ్వర్రెడ్డి (నిర్మల్) కూడా తన పట్టు నిరూపించుకోలేక చతికిలపడాల్సి వచ్చింది. ఈ ఎమ్మెల్యేలు మాత్రం ‘గెలిచారు’ మొదటిసారి గెలిచినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు పట్టణ ఓటర్ల ప్రజాదరణ పొందగలిగారు. ఈ జాబితాలో మేడిపల్లి సత్యం (చొప్పదండి), వీర్ల శంకరయ్య (షాద్నగర్), మట్టా రాగమయి (సత్తుపల్లి), జైవీర్రెడ్డి (నాగార్జునసాగర్), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి), బి.లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ) తదితరులున్నారు. ఇక మొదటిసారి గెలిచి మంత్రులుగా పనిచేస్తున్న పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి)లు కూడా తమ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థల్లో మంచి విజయాలు సాధించారు. అడ్లూరి లక్ష్మణ్కుమార్ నియోజకవర్గ కేంద్రంలో అయితే అన్ని వార్డులనూ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. సీనియర్లు కొందరు సైతం.. సీనియర్లు కొందరు ఈ మున్సిపల్ ఎన్నికలను అలవోకగా ఎదుర్కొన్నారని ఫలితాలను బట్టి తెలుస్తోంది. తమ అనుభవంతో నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో వారు పార్టీని గెలిపించగలిగారు. సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర, శ్రీధర్బాబు, గడ్డం ప్రసాద్కుమార్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ప్రధాన ప్రతిపక్షంలోని కేసీఆర్, కేటీఆర్లు ఈ జాబితాలో ఉన్నారు. -
బాల్క సుమన్ అరెస్ట్.. కాంగ్రెస్, పోలీసులకు కేటీఆర్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్లో తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బాల్క సుమన్ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. అలాగే, కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. వారు తమ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్పై కేటీఆర్ స్పందిస్తూ..‘క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉంది. అయినా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి దౌర్జన్యంగా దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ కుట్రలో భాగంగానే సుమన్పై అక్రమ కేసులు పెట్టారు. ఈరోజు దుర్మార్గంగా అరెస్ట్ చేయించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా క్యాతన్పల్లి ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి నిరసన తెలిపినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు.బాల్క సుమాన్ది పూర్తిగా అక్రమ అరెస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఇది. క్యాతన్పల్లి మున్సిపాలిటీని అడ్డదారుల్లో కైవసం చేసుకోవాలన్న దుర్మార్గపు ఆలోచనతోనే కాంగ్రెస్ ఈ కుట్రకు తెరలేపింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటికీ వడ్డీతో సహా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకుంటే మంచిది. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వారు తమ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బాల్క సుమన్ను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
లైఫ్ సైన్సెస్లో సహకారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలనుకునే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అన్ని రకాల సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే ఎన్నో లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ జీసీసీ (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్)లను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ఒక ప్రత్యేక జోన్ ఏర్పాటునకు రేవంత్రెడ్డి ప్రతిపాదించారు.మంగళవారం హైటెక్స్లో 23వ బయో ఆసియా సదస్సు–2026 ప్రారంభమైన సందర్భంగా... లైఫ్ సైన్సెస్లో గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్లతో రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు తెలంగాణలో తాము పెట్టదలచుకున్న పెట్టుబడులను ప్రకటిస్తూ ఒప్పందాలు చేసుకున్నాయి.ఇవీ ఒప్పందాలు ⇒ ఫ్రాన్స్లో తన ప్రపంచ ప్రధాన కార్యాలయంతో సనోఫీ నుంచి విడిపోయిన గ్లోబల్ కన్సూ్యమర్ హెల్త్కేర్ కంపెనీ అయిన ఒపెల్లా హెల్త్కేర్, తన జీసీసీ కార్యకలాపాలను 42,000 చ.అ సౌకర్యంతో విస్తరిస్తోంది. వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను కల్పించనుంది. ⇒ జీఏపీఎఫ్ఏ ఇండోనేషియా విభాగమైన... వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక బీఎస్ఎల్3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, ఆక్వాకల్చర్ కోసం వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెడుతుంది. ⇒ ఏఐ, డేటా సైన్స్ కంపెనీగా పేరొందిన ట్రెడెన్స్ ఐఎన్సీ.. ఏఐ ఆధారిత హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్పై కీలక సేవలు అందించిన సంస్థ, తన కార్యకలాపాలను హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, దీనిలో ప్రపంచ స్థాయి కార్యకలాపాలను నిర్వహించనుంది. దీంతో ఏఐ ఆధారిత హెల్త్ కేర్ రంగంలో మరింత ఆధునికత రానుంది. ⇒భారత లైఫ్ సైన్సెస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో భారీ స్థాయిలో ఫార్మాట్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్ను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్ట్ 12 ఎకరాల స్థలంలో 1 మిలియన్ చదరపు అడుగుల అడ్వాన్డ్స్ ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. -
మాది యోధుల జాతి.. నీది ద్రోహుల జాతి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణ పోరాట యోధుల జాతి, మరొకటి తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్స్ జాతి, వారిది ద్రోహుల జాతి..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతి గౌరవాన్ని ప్రశ్నించే వారికి చరిత్రే సమాధానం ఇస్తుందని అన్నారు. ‘జాతి అంటే ఏమిటో లాఠీ దెబ్బలు తిన్నవారికి, జైళ్లు చూసినవారికి, ఉద్యమాల్లో రక్తం చిందించిన వారికే తెలుస్తుంది. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికే తెలంగాణ అస్తిత్వం అర్థమవుతుంది..’అని చెప్పారు. మంగళవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో భారీ ఎత్తున నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో 72 కిలోల భారీ కేక్ను కేటీఆర్ కట్ చేశారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన విమర్శలపై ఆయన పేరెత్తకుండా ఘాటుగా స్పందించారు. ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది? ‘కొంతమంది ఆనవాళ్లు చెరిపేస్తామని మాట్లాడుతున్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్లు మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ ఒక శిఖరం. తెలంగాణనే కేసీఆర్ ఆనవాలు. ఈ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాలు. దాన్ని ఎట్లా చెరిపేస్తావు? తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వాళ్లకి మాత్రమే జాతి అంటే ఏంటో, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్ర వాదుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలవదు, నీతి తెలవదు. ఆ రోజు తుపాకులు తీసుకుని ఉద్యమకారుల మీద దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది? రక్తంలో పౌరుషం ఉంటే, డీఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తది..’అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణ జాతి మొత్తానికి హీరో ‘కేసీఆర్.. ఏ జాతికి నువ్వు జాతి పిత? ఏ జాతి నీది అని మాట్లాడుతున్నాడు? రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీమ్, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మ, పరాయి పాలనపై పోరాడి తెలంగాణ అస్తిత్వాన్ని నిలిపిన సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, భాగ్యరెడ్డి వర్మ, తుర్రేబాజ్ ఖాన్, కాళోజీ, దాశరథి వంటి మహనీయుల జాతి మాది. 1952లో ‘గైర్ ముల్కీ గో బ్యాక్‘ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటంలో అసువులు బాసిన 369 మంది యువ కిశోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. మేము మీలా ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం కాదు. మాది సామంతుల జాతి కాదు..స్వతంత్రుల జాతి. గిరి గీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది. కేసీఆర్ తాను జాతి పితనని ఎన్నడూ చెప్పుకోలేదు. ప్రజలే ఆయన్నలా పిలుచుకున్నారు. నా తండ్రి తెలంగాణకు హీరో, తెలంగాణ జాతి మొత్తానికి హీరో..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే బర్త్డే గిఫ్ట్ ‘తెలంగాణ కోసం కేసీఆర్ జెండా ఎత్తిన కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం, వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, జాతీయ పార్టీ బీజేపీ వంటి మూడు బలమైన రాజకీయ శక్తులు ఉన్నాయి. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం మాత్రమే. ఆ సంకల్పమే కేసీఆర్ను మొండి ధైర్యంతో ముందుకు నడిపించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కేసీఆర్ లాంటి మహా నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడమే ఆయనకు మనం ఇచ్చే చిరుకానుక..’అని కేటీఆర్ అన్నారు. కేక్ను కట్ చేసి మాజీ మంత్రి హరీశ్రావుకు తినిపించారు. మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, దాసోజు శ్రవణ్కుమార్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఢిల్లీకి రండి.. కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఏఐసీసీ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఏఐసీసీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి కీలకమైన పిలుపు వచ్చింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించేందుకు ఈనెల 19న ఢిల్లీకి రావాలంటూ కబురు అందింది. గురువారం ఉదయం 10 గంటలకు ఏఐసీసీ కార్యాలయమైన ఇందిరాభవన్లో సమావేశానికి రావాలని సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, కేబినెట్ మంత్రులకు ఆహ్వానం అందినట్టు గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ భేటీకి హాజరవుతారని తెలిపాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో సమావేశమవుతున్న క్రమంలోనే తెలంగాణ నాయకత్వాన్ని కూడా పిలిచారని వివరించాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీలో కార్యదర్శులుగా ఉన్న రాష్ట్ర నాయకులు కూడా ఢిల్లీ సమావేశానికి హాజరు కానున్నట్టు సమాచారం. పార్టీ, ప్రభుత్వ పనితీరుపై సమీక్ష?: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2029 పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని అధిష్టించాలనే కోణంలోనే అన్ని రాష్ట్రాల పార్టీ నేతలతో ఏఐసీసీ సమావేశమవుతోంది. సంస్థాగతంగా పార్టీని ఉత్తేజితం చేయడంతో పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించాల్సిన బీజేపీ వ్యతిరేక ఆందోళనలపై దిశానిర్దేశం చేయనుంది. అయితే తెలంగాణలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏఐసీసీలోని ముగ్గురు కీలక నేతలు నిర్వహించే ఈ సమావేశంలో.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు పార్టీతో సమన్వయం, పదవుల పందేరం, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఆరు గ్యారంటీలు, ఇతర పార్టీల పరిస్థితి, డీసీసీ అధ్యక్షుల పనితీరు, పార్టీ కార్యవర్గానికి చేస్తున్న పని విభజన తదితర అంశాలపై కూడా సమీక్ష జరగనుంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల పనితీరును గురించిన సమాచారం కూడా ఏఐసీసీ వద్ద ఉందని, ఎన్నికల్లో గెలుపోటములే కాకుండా ఆయా శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాల గురించిన చర్చ కూడా ఈ సమావేశంలో జరుగుతుందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణపై స్పష్టత? ఈ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయాలా లేదా? మార్పులు చేర్పులుంటాయా? అనే అంశంపై స్పష్టత వస్తుందని సమాచారం. మరోవైపు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇతర పోస్టుల కేటాయింపు విషయంలోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఈ మేరకు అంశాల వారీగా మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి ఇప్పటికే పలు నివేదికలు అందజేసినట్టు చెబుతున్నారు. కాగా ఏఐసీసీకి అందజేసేందుకు గాను..గత రెండేళ్ల కాలంలో ప్రభుత్వ పనితీరు గురించి సీఎం రేవంత్రెడ్డి, తాను పీసీసీ అధ్యక్షుడిని అయిన తర్వాత పార్టీని బలోపేతం చేస్తున్న తీరు, పీసీసీ కమిటీలు, ఏఐసీసీ ఇచ్చే ఆందోళనల విజయవంతం తదితర అంశాలపై పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్లు నివేదికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. నేడు ముంబైకి సీఎం సీఎం రేవంత్రెడ్డి ముంబైకి వెళ్లారు. బుధవారం అక్కడ జరిగే ముంబై క్లైమేట్ వీక్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తర్వాత ముంబైలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సతీమణి గీత.. మాతృమూర్తిని పరామర్శించనున్నారు. సాయంత్రం ఢిల్లీ వెళతారు. గురువారం ఏఐ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొంటారు. ఏఐసీసీ నిర్వహించే సమావేశానికి హాజరవుతారు. గురువారం రాత్రికి లేదా శుక్రవారం ఉదయానికి సీఎం హైదరాబాద్కు తిరిగి వస్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రికి అభినందనలు మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డికి పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. మంగళవారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిలు ముఖ్యమంత్రిని కలిసారు. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో విజయం నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, వీర్ల శంకరయ్య, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లు కూడా సీఎంను కలిసి అభినందనలు తెలిపారు. రేవంత్ కూడా పార్టీ నేతలను అభినందించారు. -
జీవ విజ్ఞాన రాజధానిగా హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వం, కంపెనీలు, నిపుణులు, ప్రజలు..అందరం కలిసి పనిచేస్తే ప్రస్తుతం ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదుగుతుంది. తెలంగాణ అంటే వ్యాపారం. తెలంగాణ ఎదుగుతోంది. ఈ ఎదుగుదలలో మీరు భాగస్వాములు కావాలి..’ అంటూ కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ‘23 ఏళ్ల క్రితం బయో ఆసియా సదస్సు ప్రారంభమైనప్పుడు, హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్వేర్ నగరం అన్న గుర్తింపు ఉండేది. అదే హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచింది. దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు అనే బలాల ఆధారంగా హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు, పరిశోధన, డిజైన్లో విశిష్టతకు ప్రపంచ కేంద్రంగా ఎదిగింది. బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, తయారీ నుంచి ఆవిష్కరణ వరకు.. భారత్ నుంచి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోంది. ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నాం. భవిష్యత్ మార్పులతో కూడిన ప్రపంచానికి తెలంగాణ సిద్ధంగా ఉంది..’ అని సీఎం చెప్పారు. మంగళవారం హైటెక్స్లో ‘బయో ఆసియా–2026’ సదస్సు ప్రారం¿ోత్సవంలో ఆయన మాట్లాడారు. దృఢమైన దృష్టి, ముందుచూపు ఫలితం ‘హైదరాబాద్ ఇప్పటికే జీసీసీలకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారింది. దీన్ని మనమంతా కలిసి సమగ్ర జీవ విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. మీ జీసీసీలను స్థాపించండి. ఆవిష్కరణ కేంద్రాలు నిర్మించండి. మాలిక్యూల్స్, ఔషధాలను తయారు చేయండి. క్లినికల్ అనలిటిక్స్ను నడపండి. ఏఐ ప్లాట్ఫామ్స్ అభివృద్ధి చేయండి. డిజిటల్ తయారీని ముందుకు తీసుకెళ్లండి. మా ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు, నైపుణ్య యువత మీ విజయంలో భాగస్వాములు అవుతారు. గత రెండేళ్లలోనే జీవ విజ్ఞాన రంగంలో రూ.73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇటీవల దావోస్లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించాం. జీనోమ్ వ్యాలీని విస్తరించాం. ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు ‘వన్–బయో’ను ప్రారంభించాం. గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేశాం. అనేక జీసీసీలను ఆహా్వనించాం. ఇది సాధారణ అభివృద్ధి కాదు. దృఢమైన దృష్టి, ముందుచూపు ఫలితం ఇది..’ అని సీఎం పేర్కొన్నారు. బయో వరల్డ్ దిశగా.. ‘బయో ఆసియా తన పేరును దాటి, బయో వరల్డ్గా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ మనతో ఉన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న ఈ సదస్సు.. దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్న నమ్మకం ఉంది. ఇటీవల తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను ప్రకటించాం. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మా లక్ష్యం. ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే.. పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం. మీరు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ అది అందిస్తుంది. హైదరాబాద్ మీ సమాధానం..’ అని రేవంత్రెడ్డి అన్నారు. ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్గా హైదరాబాద్: శ్రీధర్బాబు ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్ను ‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే ‘తెలంగాణ నెక్సŠట్ – జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026– 2030)‘ రూపొందించామని తెలిపారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎంఆర్ఎన్ఏ, జీన్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో ‘రెడీ టూ వర్క్ ఫోర్స్‘గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామని చెప్పారు. -
‘ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు ఉండాలి’
హైదరాబాద్: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , సీఎంఓ సెక్రటరీ మాణిక్ రాజ్,హెచ్ ఎం డి ఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరుల హాజరయ్యారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు పైన అధ్యయనం చేయాలి. ట్రాఫిక్ బాగా ఉన్న చోట పీపీపీ విధానంలో స్కై వాక్ బ్రిడ్జి లను ఏర్పాటు పైన అధ్యయనం చేయాలి. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. అడ్వటైజింగ్ బోర్డుల ఏర్పాటు పైన జాగ్రత తీసుకోవాలి.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం అడ్వటైజింగ్ బోర్డులు కేటాయించాలి. అడ్వటైజింగ్ బోర్డుల నుంచి సంవత్సరానికి ఒక సారి ఫీజు వసూలు చేయాలి. అనధికార అడ్వటైజింగ్ బోర్డు పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. నగరంలో వీధిదీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీధిదీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలి. జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. -
‘బయో ఏషియా’కు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: బయో ఏషియా–2026 సద స్సుకు రాజధాని ముస్తాబైంది. ఈ నెల 17, 18 తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ) హాల్–4లో రెండ్రోజులపాటు సదస్సు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. 17న సీఎం రేవంత్రెడ్డి, ఐటీ, మంత్రి శ్రీధర్బాబు బయో ఏషియా సదస్సు 23వ ఎడిషన్ను ప్రారంభిస్తారు. ‘టెక్బయో అన్లీ‹Ù్డ ఏఐ, ఆటోమేషన్– బయాలజీ రివల్యూషన్’’అనే థీమ్ తో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బయో టెక్నాలజీ, ఔషధాలు, హెల్త్ రంగాలకు చెందిన నిపుణులు, 50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలను ఈ సదస్సు వేదికగా పంచుకోనున్నారు.తాజా సదస్సులో సింథటిక్ బయాలజీ, జనోమిక్స్, బయో మాన్యుఫ్యాక్చరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఔషధ ఆవిష్కరణ, డిజిటల్ హెల్త్ రంగాలపై లోతైన చర్చ జరుగుతుంది. చికిత్సా విధానాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్న నేపథ్యంలో భవిష్యత్లో ఆరోగ్య రంగం ‘ప్రీడిక్టివ్, ప్రిసైస్, ఇన్క్లూజివ్’దిశగా ఎలా మారుతుందో ఈ సదస్సు స్పష్టం చేయనుంది. భారత్ టెక్ బయో శక్తిగా ఎలా ఎదిగింది ? ప్రపంచ ఆరోగ్య సమస్యలకు వినూత్న పరిష్కారాలను ఎలా అందిస్తోంది అన్న అంశాలపై ప్రత్యేకంగా ఈ సదస్సులో చర్చిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్ర విజ్ఞానం, పెట్టుబడులు, విధానాల సమన్వయం ద్వారా ఆరోగ్య రంగంలో వేగవంతమైన పురోగతిని సాధించడమే లక్ష్యంగా బయో ఏషియా–2026 వేదిక కానుంది. షెడ్యూల్ ఇలా... ⇒ ఈనెల 17వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల మధ్య బయో ఏషియా–2026 సదస్సును సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారు. తొలిరోజు సదస్సులో భాగంగా ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్కుమార్ ప్రసంగిస్తారు. యూఎస్ఏకు చెందిన ప్రఖ్యాత కేన్సర్ జీన్ థెరపీ విభాగ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్.లెవిన్, ఆ తర్వాత అమ్జెన్ సంస్థ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డా.హోవర్డ్ వై.చాంగ్ కీలక ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత ప్యానల్ డిస్కషన్స్ జరుగుతాయి. ⇒18న రెండో రోజు సదస్సులో భాగంగా ప్యానల్ డిస్కషన్స్ కొనసాగుతాయి. తెలంగాణ రైజింగ్–2047: బిల్డింగ్ ఏ వరల్డ్ క్లాస్ లైఫ్–సైన్సెస్ ఇకో సిస్టం, ముగింపుల కార్యక్రమానికి మంత్రి శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు. -
మేం పాలకులం కాదు.. సేవకులం
బంజారాహిల్స్: రాష్ట్ర ప్రజలకు తాము పాలకులం కాదని.. సేవకులం మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. సేవ చేయడానికే ప్రజలకు తమకు అవకాశం ఇచ్చారని.. అందుకు తగ్గట్లుగా తానెప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదన్నారు. కానీ ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అంటూ ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ముఖ్యమంత్రిని, మున్సిపల్ మంత్రిని సైతం తానే అయినందున మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపోటములకు తానే బాధ్యత తీసుకుంటానని చెబుతూ ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఫలితం తన పనితీరుకు గీటురాయి అని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని బంజారా భవన్లో సంత్ శ్రీసేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మానవజాతి శాంతి మార్గంలో నడవాలని సంత్ సేవాలాల్ అందరిలో స్ఫూర్తినింపారు. దేశంలోని 15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా నిలబడ్డారు. సేవాలాల్ జయంతిని అధికారికంగా జరపడం మా బాధ్యత. సమాజంలో వెనుకబడిన వారిని పాలనలో భాగస్వాములు చేయాలన్నదే నా ఆలోచన. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 15 శాతం ఉంటే 30 శాతం పదవులు ఇచ్చాం. నలుగురు మంత్రులు, స్పీకర్ పదవి ఎస్సీ వర్గానికే ఇచ్చామన్నారు. వచ్చే కాలమంతా పేదల కోసమే పనిచేస్తా’ అని సీఎం రేవంత్ తెలిపారు. దళితుడిని స్పీకర్ చేశాం..ఏ దళితుడినైతే ముఖ్యమంత్రి చేస్తానని గత పాలకులు మోసం చేశారో.. ఆ దళితుడిని అధ్యక్షా అని మైక్ అడిగే పరిస్థితి తీసుకొచ్చామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. దళితుడు రాష్ట్రాన్ని నడపలేరు.. నేనైతేనే నడుపుతానన్న వాళ్లు అధ్యక్షా అని పిలిచి మైక్ అడిగేలా దళితుడిని పైన కూర్చొబెట్టానని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య గొప్పతనమని.. అంబేడ్కర్ అందరికీ ఇచ్చిన ఆయుధమన్నారు. 20 ఏళ్లలో అన్ని హోదాలు చూశానని, ఏనాడూ ప్రజలకు దూరం కాలేదన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రతి సందర్భంలోనూ లంబాడా సోదరులు అండగా నిలబడ్డారని.. తనకు సీఎం హోదా రావడానికి లంబాడాల అండదండలు ఉన్నాయని రేవంత్రెడ్డి అన్నారు. పేదవాడి గౌరవం రేషన్కార్డు..రాష్ట్రంలో 3.15 కోట్ల మంది పేదలకు రేషన్కార్డుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని.. తాను స్వయంగా ఒక గిరిజనుడి ఇంటికి వెళ్లి సన్న బియ్యంతో భోజనం చేశానని సీఎం రేవంత్ గుర్తుచేసుకున్నారు. అలాగే పేదల ఇళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. 50 లక్షల మంది పేదల ఇళ్లలకు ఈ పథకం వర్తింపజేస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి చదవాలి..గిరిజన విద్యార్థుల్లో స్ఫూర్తినింపేందుకే ఆ వర్గానికి చెందిన అధికారులకు మంచి పోస్టులు ఇచ్చామని సీఎం రేవంత్ చెప్పారు. విద్యార్థులు నిర్దిష్ట ప్రణాళికతో కష్టపడి చదువు కోవాలని సూచించారు. 100 నియోజకవర్గాల్లో రూ. 20 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నామ న్నారు. చదువు లేకపోవడం వల్లే గిరిజనులు పేదరికంలో మిగిలిపోతున్నారని.. చదువే అన్ని హోదాలు తెచ్చి పెడు తుందన్నారు. గిరిజన బిడ్డలు చదువుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు కావాలో తనకు చెప్పాలని సూచించారు.అన్ని తండాలకూ బీటీ రోడ్లు..రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ సభావేదిక నుంచే ప్రకటించారు. ప్రతి తండాలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని.. అన్ని తండాల్లోనూ గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాలని చెప్పారు. అన్ని తండాల్లో మంచినీటి కోసం ట్యాంకులు, సోలార్ పంప్సెట్లు ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేయాలన్నారు. నల్లమలలో సంత్ సేవాలాల్ మహారాజ్ కోసం 20 ఎకరాల భూమి కేటాయించామని, వచ్చే జయంతిని అక్కడే జరుపుకుందామని సీఎం రేవంత్ చెప్పారు. -
మంత్రులు, పీసీసీ చీఫ్తో సీఎం జూమ్ మీటింగ్
హైదరాబాద్: మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నికపై సీఎం రేవంత్రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు(సోమవారం, ఫిబ్రవరి 16వ తేదీ) మున్సిపల్, కార్పొరేషన్లకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే వీటిపై కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ.. రేపు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం కూడా దృష్టి సారించింది. ఏమాత్రం ఏమరపాటుకు లోనుకాకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా హంగ్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూమ్ మీటింగ్లో చర్చించారు. దీనిలో భాగంగా నేతలకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలలో 64 మున్సిపాలిటీలలో స్పష్టమైన మెజారిటీ సాధించింది. -
పెళ్లి పిలుపులు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ?
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ కూడా దీన్ని ధ్రువీకరించడం లేదు. బహుశా పెళ్లి అయిపోయిన తర్వాత ఫొటోలు రిలీజ్ చేసి వెల్లడిస్తారేమో! సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలైపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడమే దీనికి కారణం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)విజయ్ దేవరకొండ ఇప్పుడు కలిశాడంటే వేరే కారణాలేం లేవు. కచ్చితంగా పెళ్లికి ఆహ్వానించే విషయమై కలిసుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటో బయటకు వచ్చింది గానీ మిగతా వివరాలు అయితే రాలేదు. అసలు విషయానికొస్తే ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పుర్ వేదికగా విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చాలారోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20నే ఇరు కుటుంబాలు రాజస్థాన్ వెళ్లనున్నారు.ఈనెల 22వ తేదీ నుంచి పెళ్లి కార్యక్రమాలు అంటే హల్దీ, మెహందీ, సంగీత్ లాంటివి ఉండనున్నాయి. చివరగా 26వ తేదీన పెళ్లి. తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చేయనున్నారని తెలుస్తోంది. అయితే మార్చి తొలివారంలో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం రిసెప్షన్ ఉండనుంది. దీని వివరాలు తెలియాల్సిఉంది. ఏదేమైనా వివాహ తేదీ దగ్గరపడినప్పటికీ విజయ్-రష్మిక.. పెళ్లి విషయాన్ని రహస్యం ఉంచుతూనే ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా) -
కరీంనగర్ లో చక్రం తిప్పిన సీఎం రేవంత్.. సప్ప పడ్డ బీజేపీ..
-
నేనే రాజు.. నేనే మంత్రి.. శృతిమించిన స్వాతిశయం
-
టార్గెట్ 90
సాక్షి హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 16న జరిగే మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికల్లో కనీసం 90కి తగ్గకుండా పురపాలి కల్లో కాంగ్రెస్ కొలువు తీరాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులకు లక్ష్యం నిర్దేశించారు. ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే భవిష్యత్తు కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి, హంగ్ మున్సిపాలిటీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గ సభ్యులతో శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో ప్రత్యే కంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ కూడా పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిపై చర్చించిన మంత్రులు.. ప్రజాతీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితమే ఈ విజయమని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన పార్లమెంట్ ఇన్చార్జి మంత్రులను సీఎం రేవంత్రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. అలాగే పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు నడిపిన మహేశ్కుమార్గౌడ్, రేవంత్రెడ్డిని మంత్రులు అభినందించారు. ఫలితాలు మనకు బూస్టప్ మంత్రులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ అందరం కలసికట్టుగా పనిచేయడం వల్లే సత్ఫలితాలు సాధించామన్నారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు పార్టీకి బూస్టప్ ఇచ్చాయని చెప్పారు. మొత్తం 70కిపైగా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన విజయం సాధించిందని.. హంగ్ ఏర్పాటైన చోట్ల కూడా స్వతంత్రులు, కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీల్లో పార్టీ జెండా ఎగరేసేలా మంత్రులు పనిచేయాలని సూచించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను పార్లమెంటు ఇన్చార్జి మంత్రులకే అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఫలితాలపై పార్టీ అగ్ర నాయకత్వం కూడా సంతృప్తి వ్యక్తం చేసిందన్న సీఎం.. త్వరలోనే పరిషత్ ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలనే సంకేతాలు ఇచ్చారు. బీఆర్ఎస్ను నమ్మలేదు.. బీజేపీ బలపడలేదు ప్రజలు బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితిలో లేరని.. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందన్న వాదనలో నిజం లేదని ఈ ఫలితాలు చెబుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజాప్రభుత్వం రెండేళ్లలోనే చేసి చూపిందని.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజాపాలనపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాయన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తిని చాటాలని మంత్రులకు సూచించారు.సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ ముఖ్య నేతలు వేం నరేందర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, చిన్నారెడ్డి హాజరవగా ఆన్లైన్ ద్వారా మంత్రులు ఉత్తమ్, దామోదర, తుమ్మల, మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. మంత్రులకు పని విభజన పార్టీపరంగా సమస్యలున్న మున్సిపాలిటీల్లో అందరితో మాట్లాడే బాధ్యతను మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు.జగిత్యాల పంచాయతీని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కు అప్పగించిన సీఎం.. కొత్తగూడెం బాధ్యతను పొంగులేటికి, కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతను శ్రీధర్బాబు, పొన్నం, నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యత మహేశ్గౌడ్, ఉత్తమ్కు అప్పగించారు. -
రాజులు వారే... తరాజులు వారే!
తెలంగాణకు సంబంధించినంతవరకు ‘నేనే రాజును, నేనే మంత్రిన’ని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించుకున్నారు. మునిసిపాలి టీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటించ డానికి సరిగ్గా ఒకరోజు ముందు ఢిల్లీలో ఆయనీ ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలే రాజులనేది ఒక ప్రాథమిక అవగాహన. భారత రాజ్యాంగాన్ని ప్రకటించుకున్నది కూడా ప్రజల పేరుతోనే కదా! ఈ కోణం నుంచి చూసినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనలో స్వాతిశయం మోతాదు మించినట్టే కనిపిస్తుంది. మరుసటి రోజు ప్రకటించబోయే ఎన్నికల ఫలితాల్లో భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నామనే జోష్ ఇందుకు కారణం కావచ్చు.ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే భారీ విజయం దక్కినట్టు ఎలా భావిస్తారు? అదంతే! మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ తలచుకుంటే స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగానే ఉంటున్నాయి. అర్థబలం, అంగబలం అధికార పార్టీకి దండిగా ఉండడం ఒక కారణం. అధికార యంత్రాంగం పూర్తిగా చెప్పుచేతల్లోఉంటుంది. అంకితభావంతో ఒక పార్టీకి జెండా మోసే కార్య కర్తల ప్రభావం ఇప్పుడు అన్ని పార్టీల్లో తగ్గుముఖం పట్టింది. వారి స్థానాన్ని నాలుగురాళ్లు వెనకేసుకున్నవారు, పైరవీకార్లు ఆక్రమిస్తున్నారు. అంకితభావంతో ఉండే కార్యకర్తల మాదిరిగా తెగించి పోరాడే తత్వం ఈ నయా శ్రేణులకు తక్కువ. లెఫ్ట్, బీజేపీల్లో ఈ జాడ్యం కొంత తక్కువ కావచ్చు కానీ, మిగిలిన పార్టీలేవీ మినహాయింపు కాదు. దానికితోడు ఇంకో రెండు మూడేళ్లు అధికారంలో ఉండే పార్టీనే గెలిపిస్తే కొద్దోగొప్పో అభివృద్ధి జరుగుతుందనే ఆశాభావం కూడా ఓటర్లలో ఉండే అవకాశం ఉన్నది.ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఓట్ల లెక్కింపునకు ముందే భారీ విజయాన్ని ముఖ్యమంత్రి ఊహించడం, 90 శాతం మునిసిపాలిటీలు గెలవబోతున్నామని ప్రకటనలు చేయడం అసహజమేమీ కాకపోవచ్చు. ఇంతకుముందు 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి పాలక పార్టీ 93 శాతం మునిసిపాలిటీలను గెలుచుకున్న ఉదాహరణ కూడా ఉన్నది. కాకపోతే ఆ స్థాయి ఫలితాల్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించిందా అనేదే ప్రశ్న. 116 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత 66 చోట్ల లభించింది. అంటే 57 శాతం. 36 మునిసిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ 36 త్రిశంకు కౌన్సిళ్లలో 13 చోట్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించింది. ఇవి కూడా పార్టీ ఖాతాలో పడితే సంఖ్య 79కి, శాతం 68కి చేరుతుంది.ఇంకో ఆరు మునిసిపాలిటీల్లో రెండు పార్టీలకు చెరి సమానంగా సీట్లు వచ్చాయి. ఐదుచోట్ల కాంగ్రెస్ – బీఆర్ఎస్కు మధ్య, ఒకచోట బీఆర్ఎస్ – బీజేపీకి నడుమ ఈ టై ఏర్పడింది. 12 హంగ్ మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ పెద్దపార్టీగా గెలిచింది. నాలుగు మునిసిపాలిటీల్లో బీజేపీ, ఒకచోట ఎమ్ఐఎమ్లు పెద్దన్నలుగా ఉన్నాయి. ఈ మొత్తం 23 చోట్ల అధికార దన్నుతో సగానికి సగం కాంగ్రెస్ లాక్కోగలిగినా గరిష్ఠంగా దాని బలం 90 మునిసిపాలిటీలకు చేరుతుంది.స్ట్రయిక్ రేట్ 80 శాతాన్ని దాటే అవకాశం లేదు. అయినా, ఇదేమీ చిన్న విజయం కాదు. ఐదింట నాలుగొంతుల మునిసిపాలిటీలను కాంగ్రెస్ స్వాధీనం చేసుకుంటుంది. కాకపోతే ఐదేళ్ల కింద అప్పటి అధికార బీఆర్ఎస్ ఇంతకంటే పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మూడేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ గుణపాఠాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని ‘నేనే రాజు, నేనే మంత్రి’ ప్రకటన స్పష్టం చేసినట్లయింది. 2020లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు మునిసిపాలిటీలే దక్కాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ 13 మునిసి పాలిటీలను స్పష్టమైన మెజారిటీతో గెలుచుకున్నది. ఇంకో పన్నెండు హంగ్ పట్టణాల్లో పెద్ద పార్టీగా గెలిచింది. ఐదుచోట్ల కాంగ్రెస్తో, ఒకచోట బీజేపీతో సమాన వార్డులు గెలవడంతో అక్కడ టై ఏర్పడింది. మొత్తంగా 31 మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ తన బలాన్ని ప్రదర్శించింది. ఆ పార్టీ తన ‘దర్బార్ సంస్కృతి’ నుంచి బయటపడి ఉన్నట్లయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని క్షేత్రస్థాయి రిపోర్టులు సూచిస్తు న్నాయి. పార్టీకి కేంద్రంలో మాదిరిగానే నియోజకవర్గాల స్థాయిలో కూడా దర్బార్ సంస్కృతి అలవాటైంది. అక్కడ పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్ఛార్జిలే పార్టీకి కేరాఫ్ అడ్రస్!పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యేలకు సమాంతరంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బీఆర్ఎస్ చేపట్టలేక పోయింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో తెగించి పోరాడే కార్యకర్తలు కరువయ్యారు. ఈ పరిణామం నగర కార్పొ రేషన్లలో, పెద్ద పట్టణాల్లో స్పష్టంగా కనిపించింది. పార్టీ అధినేత మీద జనసామాన్యంలో ఉండే అభిమానం ఇక్కడ పోలైన ఓట్లలో ప్రతిఫలించలేదు. ఎన్నికలు జరిగిన ఏడు నగర కార్పొ రేషన్లలో పెద్దవైన నిజామాబాద్, కరీంనగర్లలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని అదిదక్కించుకోవచ్చు. నిజామాబాద్లో బీజేపీ గణనీయంగా 28 డివిజన్లు దక్కించుకున్నప్పటికీ, కాంగ్రెస్ – ఎమ్ఐఎమ్ కలిసి ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టే అవకాశాలున్నాయి. ఈ రెండు పట్టణాల్లోనూ బీజేపీకి గట్టి పునాదే ఉన్నది. రెండు పార్లమెంట్ స్థానాలు కూడా ఆ పార్టీవే. బీజేపీ విస్తృత ప్రచార వ్యూహాలతో వోటర్లలో పోలరైజేషన్ సృష్టించి లాభపడింది. ఈ ట్రెండ్కు ఎదురీదేంత సంస్థాగత బలం, నాయకత్వం లేక బీఆర్ఎస్ ఆ మేరకు నష్టపోయింది.కొత్తగూడెం ఫలితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. కాంగ్రెస్తో పొత్తులో కొత్తగూడెం శాసనసభ్యునిగా ఎన్నికైన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తన నాయకత్వ ప్రతిభను ఈ ఎన్నికల్లో చాటుకున్నారు. కాంగ్రెస్తో సమానంగా 22 సీట్లను సీపీఐ గెలిచింది. ఆ పార్టీ మేయర్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికార చాతుర్యం ప్రదర్శించి అడ్డుపుల్లలు వేయకపోతే సీపీఐకి మేయర్ పీఠం ఖాయం. అదే జరిగితే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అదొక శుభసూచకం. ఎందుకంటే, అన్యాయాన్ని ఎదిరించే శక్తులకూ, ప్రశ్నించే గొంతులకూ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కమ్యూనిస్టు పార్టీలు ఆదర్శమే కనుక! మిగిలిన నాలుగు కార్పొరేషన్లు నల్లగొండ, మహబూబ్నగర్, రామగుండం,మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్పై విజయం సాధించింది.మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఎవరికెన్ని, ఎంత శాతం అనేదానికన్నా వార్డులు, డివిజన్ల సంఖ్య కీలకం. ఎందుకంటే, జనం ప్రత్యక్షంగా ఓటేసి గెలిపించేది వార్డు/ డివిజన్ సభ్యులనే! మునిసిపల్ వార్డుల్లో కాంగ్రెస్కు 1,347, బీఆర్ఎస్కు 716, బీజేపీకి 261, ఇతరులకు 257 లభించాయి. కార్పొరేషన్ల డివిజన్లలో కాంగ్రెస్ 191, బీఆర్ఎస్ 63, బీజేపీ 76, ఇతరులు (సీపీఐ సహా) 83 చోట్ల గెలిచారు. ఇక ఓట్ల శాతానికి వస్తే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపిన లెక్క అందుబాటులో ఉన్నది. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సుమారు 40 శాతం ఓట్లు, బీఆర్ఎస్కు 29 శాతం, బీజేపీకి 16 శాతం, ఇండిపెండెంట్లకు 8 శాతం, ఎంఐఎంకు 3 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం లభించినట్టు సమాచారం.స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలు ఏకపక్షంగా గెలవడం రివాజుగా మారిన ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రభావం కాంగ్రెస్ చెబుతున్నంత బలహీనంగా ఏమీ లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీ సంస్థాగతమైన బలహీనతలను అధిగమించగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎంపీపీ, జడ్పీపీ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలనే సాధించే అవకాశాలను కొట్టి పారేయలేము. కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ మంచి విజయాన్ని సాధించినప్పటికీ రెండు కమ్యూ నిస్టు పార్టీలకూ కలిపి రాష్ట్రవ్యాప్తంగా రెండు శాతం ఓట్లుకూడా రాకపోవడం ఒక విషాదం. ఒకప్పుడు మిలిటెంట్ పోరాటాలకు పెట్టింది పేరైన సీపీఎం పార్టీ కేవలం అరశాతం ఓట్లకు మాత్రమే పరిమితం కావడం దాని స్వయంకృతాపరాధమే! ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మాత్రంకాంగ్రెస్ పార్టీ వృద్ధ సింహం తాటిపర్తి జీవన్రెడ్డి గురించే! జగిత్యాలలో ఫిరాయింపు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసి ఆయన అనుచరులకే ఎక్కువ భాగం టిక్కెట్లను కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ, జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఆయన దృఢంగా నిలబడిన తీరు రాష్ట్రవ్యాప్తంగా అందరిదృష్టిని ఆకర్షించింది. డబ్బూ, అధికారం తోడు లేకున్నా జీవన్ రెడ్డి చేసిన ఒంటరి పోరాటానికి జగిత్యాల జనం జైకొట్టారు. టికెట్ దొరికిన కార్యకర్తలతో పాటు ఇండిపెండెంట్లుగా నిల బెట్టిన వారితో సహా మొత్తం 18 మందిని గెలిపించుకొని రేస్లో నంబర్ వన్గా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ జీవన్రెడ్డి అనుచ రునికి ఛైర్మన్ పదవిని ఇస్తుందా? లేక అధికారం అండతో మేనేజ్ చేసి ఎమ్మెల్యే మనిషినే ఛైర్మన్ చేస్తుందా అనేది వేరే సంగతి. కానీ జగిత్యాల విన్నర్ మాత్రం జీవన్రెడ్డే!‘నేనే రాజు, నేనే మంత్రి’ అని ముఖ్యమంత్రి ప్రకటించు కోవడం దర్బార్ సంస్కృతి ప్రవేశిస్తుందనడానికి ఒక సూచికే! ఈ ప్రకటనతో ఎంతమంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏకీభవిస్తు న్నారో, ఎంతమంది విభేదిస్తున్నారో తెలియదు. భిన్నాభిప్రా యాలు ఇప్పటికైతే పెదవులు దాటడం లేదు. నాలుగు దశాబ్దాలకాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డున్న జీవన్రెడ్డి తరఫున ఒక్క గొంతు కూడా వినిపించకపోవడం నిజంగా విచిత్రమే. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సరికొత్త సామరస్యమో, తుపాను ముందరి ప్రశాంతతో కొంతకాలం ఆగితే తప్ప తెలియదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా ప్రజలే రాజులన్న సత్యాన్ని గ్రహించక పోతే 2023లో బీఆర్ఎస్కు ఎదురైన అనుభవమే ఎవరికైనా తప్పదు. రాజులూ ప్రజలే! వాళ్లు ఓటేసి కుర్చీలో కూర్చోబెట్టిన ప్రభుత్వ పనితీరును తూకం వేసే తరాజులూ వారే!!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు: సీఎం రేవంత్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి.. మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులందరినీ సీఎం అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు సీఎం రేవంత్. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం రెండేళ్లల్లో చేసి చూపించాం. రెండేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజా పాలనపై నమ్మకాన్ని కలిగించాయనడానికి ఈ ఫలితాలు నిదర్శనం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఎన్నికల ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా దిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం స్పష్టం చేశారు. -
అసంతృప్తులకు రేవంత్ వార్నింగ్!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రకటన చేశారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని ప్రకటించి తెలంగాణ కాంగ్రెస్లో తనకు ఎదురు లేదన్న సంకేతం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా రేవంత్ ధీమాకు తగ్గట్టుగానే ఉన్నా.. బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలే కైవసం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.రెండు కార్పొరేషన్ స్థానాలు సాధించగలిగిన బీజేపీ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా ముందంజ వేయలేదు. మిగిలిన పార్టీల మాటెలా ఉన్నా.. కాంగ్రెస్లో మాత్రం తనకు ఎవరూ సాటిరారన్న సంకేతం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయగలిగారు. సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నప్పటికీ చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు. ఢిల్లీ వెళ్లి తనపై ఫిర్యాదులు చెప్పే కొంతమంది నేతలకు కూడా రేవంత్ మీ పప్పులు ఉడకవు అని చెప్పకనే చెప్పారనుకోవచ్చు.రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు సంగతి, ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, పార్టీపై పట్టు ఉందన్న భావన ఉంటే, తనకు తిరుగు ఉండదని అనుకుంటున్నారు. దీనికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన నాయకత్వాన్ని కొంతమేర బలోపేతం చేస్తాయి. అయితే 36 చోట్ల హంగ్ రావడం, బీఆర్ఎస్ 13 మున్సిపాల్టీలు గెలుచుకోవడం కాంగ్రెస్కు ప్రమాదకర సంకేతమన్న విశ్లేషణలు ఉన్నాయి. కాకపోతే ఆ విషయాన్ని కాంగ్రెస్లోని ఇతర వర్గాలు ఇప్పటికిప్పుడు రచ్చ చేయకపోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి సీనియారిటీ సంపాదించిన నేతలు కొందరైతే, ఇతర పార్టీలు ముఖ్యంగా టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి పార్టీపై ఆధిపత్యాన్ని సంపాదించుకున్న నేతలు మరికొందరు కనిపిస్తారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ రెండో టర్మ్లో అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా పని చేశారు. అలాగే పాదయాత్ర కూడా చేశారు. ఈలోగా టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ పక్షాన ఎంపీ అయిన రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంలో పలుకుబడి పెంచుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. దానికి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ద్వారా పరోక్ష సహకారం పొందారని చెబుతారు. ఇతరత్రా సామాజిక అంశాలు కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ గెలవగానే సీఎం రేసులో ముందంజలో నిలబడ్డారు. ఫలితంగా మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు పార్టీలో సీనియర్లయినా రేవంత్ రాజకీయ వ్యూహం ముందు నిలబడలేకపోయారు. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినా, మూలాలు టీడీపీలోనే ఉన్నాయి. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చినా అంతకుముందు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో ఉండేవారు. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వంలో మంత్రులపై తన పట్టు పెంచుకోవడానికి పలు వ్యూహాలు అమలు చేశారని చెబుతారు.ఉదాహరణకు కొంతకాలం క్రితం వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మల్లు భట్టి కొంత స్వతంత్రంగా బిల్లులు మంజూరు చేయడానికి చొరవ తీసుకునేవారట. కానీ, ఇటీవలి కాలంలో సీఎంకు తెలియకుండా బిల్లులకు నిధులు విడుదల చేసే పరిస్థితి లేదట. ఢిల్లీ వెళ్లి కొందరు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అధిష్టానంతో తమ గోడు మొరబెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అధిష్టానం పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. పార్టీ నిర్వహణకు అవసరమైన నిధుల కోసం తాము పవర్లో ఉన్న మూడు రాష్ట్రాలపైనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది. ఆ విషయంలో రేవంత్ బాగానే ఉపకరిస్తుండవచ్చన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఆ ధైర్యంతోనే రేవంత్ నేనే రాజు, నేనే మంత్రి అన్న డైలాగును వాడి కాంగ్రెస్ లోని ఇతర ముఖ్య నేతలకు స్పష్టమైన సందేశం ఇచ్చారనుకోవచ్చు. అయితే, ఇది అహంకార పూరితమైందా? అన్న చర్చ వస్తుంది. కొందరు అలా చూడవచ్చు. మరికొందరు రేవంత్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా కుంపట్లు పెట్టే సీన్ లేకుండా చేసుకోవడానికి కూడా ఈ డైలాగు ఉపయోగపడవచ్చు. బీజేపీ వారే గట్టిగా నిర్ధారించలేకపోతున్నప్పటికీ, జమిలి ఎన్నికల గురించి రేవంత్ మాట్లాడడం, ఈ టర్మ్లో ఆరు నెలల అదనపు పదవీకాలం, తదుపరి మరో టర్మ్లోనూ తానే సీఎం అని అంటున్నారు. ఇది కేడర్లో ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. తాను ఎవరితోనూ పోల్చుకోనని, తనకు తానే పోటీ అని కూడా ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఇలానే మాట్లాడుతుండేవారు. రాజకీయాలలో ఎవరు పొగిడినా, పొగడకపోయినా, తన గురించి తాను బాగా చెప్పుకోవాలి. అదంతా మీడియాలో ప్రముఖంగా ప్రచారం జరగాలి. ఈ స్ట్రాటజీలో చంద్రబాబు మొనగాడు. ఇప్పుడు రేవంత్ కూడా ఆ బాటలో ఉన్నారనపిస్తుంది.మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక రేవంత్కు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా నువ్వే రాజు, నువ్వే మంత్రి అని కీర్తించడం కూడా గమనార్హమే. ఇది రేవంత్కు ఎంత ప్రయోజనమో తెలియదు కాని, ఆ మీడియాకు బాగానే గిట్టుబాటు అవుతుందన్న భావన కలుగుతుంది. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరడం వెనుక కూడా ఒక ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న టీడీపీ అభిమానులు, ఒక సామాజికవర్గ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన ఈ మాటలు చెబుతుండవచ్చు. ఈ రకంగా పలు వ్యూహాలు అమలు చేస్తున్న రేవంత్ మున్సిపల్ ఎన్నికలలో విజయం అంతటిని తన ఖాతాలోనే వేసుకుంటారు. రాష్ట్రం అంతటా తిరిగి ప్రచారం చేసింది ఆయన ఒక్కరే కనుక ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఈ వెసులుబాటు తక్కువగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీ తరహాలో రేవంత్ నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడుగా మరీ అంత బలమైన నేత లేకుండా చూసుకోవడం కూడా ప్లస్ పాయింటే అని చెప్పాలి.ఇక మున్సిపల్ ఎన్నికలలో విజయాలే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ను మరోసారి గెలిపిస్తాయన్న భావన రేవంత్ తదితర కాంగ్రెస్ నేతలలో ఉండవచ్చు. కానీ, ఈ స్థానిక ఎన్నికలే కొలమానంగా తీసుకోలేం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడుతుంది. బీఆర్ఎస్, బీజేపీలను నైతికంగా దెబ్బతీయడానికి ఉపయోగపడతాయి. కేసీఆర్ రెండో టర్మ్లో బీఆర్ఎస్ అన్ని జెడ్పీలను, 90 శాతం మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. కానీ, ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది. బీజేపీ సడన్గా ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. కానీ, స్థానిక ఎన్నికలలో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేకపోయింది. బీఆర్ఎస్కు కాస్త మెరుగైన ఫలితాలే వచ్చినా అవి కొంత ధైర్యాన్ని ఇవ్వవచ్చు కానీ, పూర్తి విశ్వాసాన్ని ఇవ్వలేకపోవచ్చు.ఒకప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ప్రజాభిప్రాయానికి ఒక ప్రాతిపదికగా ఉండేవి. ఉదాహరణకు 2001లో ఉమ్మడి ఏపీలో జరిగిన జెడ్పీ ఎన్నికలలో 11 చోట్ల టీడీపీ, 10 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మున్సిపాల్టీలలో కూడా హోరాహోరీగా ఎన్నికలు సాగేవి. కానీ, విభజన తర్వాత స్థానిక ఎన్నికలలో 70 నుంచి 90 శాతం వరకు అధికారంలో ఉన్న పార్టీలే గెలుచుకుంటున్నాయి. ఈ ఎన్నికలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిపోతామని అనుకుంటే అది ఒక్కోసారి భ్రమ అవుతుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒక రీతిలో ఉండవు. ఈ మున్సిపల్ ఎన్నికలతోనూ, పార్టీ హైకమాండ్ లోను, అలాగే పార్టీ ఇతర సీనియర్ నేతలపైన పట్టు సాధించినంత వరకు రేవంత్కు సంతోషమే. అసెంబ్లీ ఎన్నికలలో విజయానికి ఇవి సరిపోతాయని అనుకోజాలం. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తిస్తే ఆయనకే మంచిది. రాజకీయాలలో ఎప్పుడు ఎవరు రాజు అవుతారో, ఎప్పుడు ఎవరు మంత్రి అవుతారో, ఎప్పుడు అడ్రస్ లేకుండా పోతారో చెప్పజాలం. ఆ విషయాన్ని రాజకీయ నేతలు విస్మరించరాదని చెప్పక తప్పదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వారికే ఈ విజయం అంకితం.. సీఎం రేవంత్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.‘‘ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం... పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన అభిమానానికి నిదర్శనం.. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం’’ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.‘‘అదేవిధంగా.. రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన, పేద-మధ్య తరగతి ప్రజల సంక్షేమం, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, కార్యాచరణతో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఈ తీర్పు ద్వారా తమ సంపూర్ణ ఆమోదం తెలిపారు. ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ.. భవిష్యత్లో ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను గొప్పగా అభివృద్ధి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికి ఉన్న అనంతమైన…— Revanth Reddy (@revanth_anumula) February 13, 2026 -
శంషాబాద్ నుంచే హైస్పీడ్ రైళ్లు!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన మూడు హైస్పీడ్ రైలు కారిడార్లను అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని తెలిపారు. ‘హైదరాబాద్–చెన్నై (778 కి.మీ.) కారిడార్ అమరావతి మీదుగా వెళుతుంది. అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేస్తే, డ్రైపోర్టు నుంచి బందరు పోర్టుకు సరుకు రవాణా వేగవంతం అవుతుంది. హైదరాబాద్–బెంగళూరు (586 కి.మీ.), హైదరాబాద్–పుణే (556 కి.మీ.) కారిడార్లను కూడా శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుంది. ఈ మూడు కారిడార్లకు భూ సేకరణ వెంటనే చేపట్టి పనులు ప్రారంభించండి..’అని సీఎం కోరారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి గురువారం పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. మూసీ పునరుజ్జీవం, రైలు మార్గాల మంజూరు, విమానాశ్రయాల పనులు వేగవంతమే లక్ష్యంగా చర్చలు జరిపారు. ఆ మార్గం కేంద్ర నిధులతో చేపట్టండి కృష్ణా–వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాల్సిందిగా రైల్వే మంత్రిని సీఎం కోరారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయం మొత్తం తామే భరిస్తామని తెలిపారు. ఈ మార్గంలోని టేకల్కోడ్లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని.. సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్ణాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని..కొడంగల్, టేకల్కోడ్, దౌల్తాబాద్లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. సీఎం వినతులపై అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ‘గాంధీ సరోవర్’శంకుస్థాపనకు రండి హైదరాబాద్లోని ఈసా, మూసీ నదుల సంగమ స్థలిలో ప్రపంచస్థాయి విద్యా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ముఖ్యమంత్రి ఆ హ్వనించారు. 1948లో జాతిపిత మహత్మాగాంధీ చితాభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూఘాట్ వద్ద ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని తెలిపారు. సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 100 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. ఫిబ్రవరి నెలాఖరులో భూమి పూజ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. మామునూరు విమానాశ్రయ పనులు ప్రారంభించండి రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్కు సమీపంలో నిర్మించనున్న మామునూరు ఎయిర్పోర్ట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడును సీఎం కోరారు. మామునూరు ఎయిర్పోర్ట్కు అవసరమైన భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని, విమానాశ్రయం ఏర్పాటుకు అదనంగా అవసరమైన 249.82 ఎకరాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాగా మామునూరు ఎయిర్పోర్ట్ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను పంపిస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. 18 ఎల్ఎంటీల అదనపు ధాన్యం తీసుకోండి వానాకాలం పంటకు (2025–26 సీజన్) సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకునేలా ఆదేశించాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో సీఎం కలిశారు. వానాకాలం పంటకు సంబంధించి 53.73 ఎల్ఎంటీల ధాన్యం సేకరణకు అనుమతించారని, కానీ వరి భారీగా పండటంతో తాము అదనంగా 18 ఎల్ఎంటీలు సేకరించామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘అలాగే 2024–25 యాసంగి పంటకు సంబంధించి 5 శాతం నూకతో అదనంగా 10 ఎల్ఎంటీల బాయిల్డ్ రైస్ మిల్లింగ్కు అనుమతించాలి. 2024–25 వానాకాలం పంటకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్కు ఈ నెల 28వ తేదీ వరకు గడువు నిర్దేశించారు. అయితే దానిని మరో రెండు నెలలు పాటు పొడిగించాలి.2014–15 వానాకాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు ఎఫ్సీఐ బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన అదనపు బియ్యం, 2022 ఏప్రిల్లో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి బకాయి పడిన రూ.343.27 కోట్లు కూడా విడుదల చేయాలి..’అని కేంద్ర మంత్రికి సీఎం, మంత్రి విజ్ఞప్తి చేశారు. రాహుల్, కేసీ వేణుగోపాల్తోనూ భేటీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ విడివిడిగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పనితీరును వివరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదని తెలిపారు. అందుకు సంబంధించిన నివేదికలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ తదితర పథకాల అమలుతో ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని వివరించారు. కాగా క్షేత్ర స్థాయి ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించడంపై సీఎంను రాహుల్, కేసీ వేణుగోపాల్ అభినందించారు. హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్పై సీఎం సూచనలు హైస్పీడ్ రైలు కారిడార్ల అలైన్మెంట్కు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్సల్టెంట్ సంస్థకు పలు సూచనలు చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ తయారీ బాధ్యతను ‘రైట్స్’(ఖఐఖీఉ ) సంస్థకు రైల్వే శాఖ అప్పగించింది. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు గురువారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ఇందుకు సంబంధించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలైన్మెంట్లు, డీపీఆర్కు సంబంధించి వారు చేసిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం.. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, కార్యదర్శి (కో ఆర్డినేషన్) డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ‘రైట్స్’ఈడీ లలిత్కుమార్ పాల్గొన్నారు. -
నేనే రాజు.. నేనే మంత్రి!
సాక్షి, న్యూఢిల్లీ: ‘జనగణన 2027కు పూర్తి అవుతుంది...2029 కల్లా మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతాయి. అదే ఏడాది ఏప్రిల్లో జమిలి ఎన్నికలు ఉంటాయి. సీఎంగా నాకు మరో 6 నెలల సమయం అదనంగా లభిస్తుంది. ఇలా ఐదున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా. మొత్తం పదిన్నరేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. నేనే రాజు.. నేనే మంత్రిని. నేను ఎవరితోనూ పోల్చుకోను. జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. నేను నా ఊరు దాట..’ అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటులో ప్రధాన దోషి అప్పటి సీఎం కె.చంద్రశేఖర్రావు అని దానిపై విచారణ జరిపిన కమిషన్ స్పష్టంగా చెప్పినప్పటికీ దీనిపై సీబీఐ విచారణలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జాతీయ నేత అని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని అన్నారు. కేంద్ర మంత్రులు, పార్టీ అధిష్టానం పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేసీఆర్ను జైల్లో ఎందుకు వేయడంలేదు? ‘కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 24 గంటల్లో కేసీఆర్ను అరెస్టు చేస్తామని గతంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి కుండబద్దలు కొట్టారు. అలాంటిది రెండేళ్లుగా కేసీఆర్ను జైల్లో ఎందుకు వేయడంలేదు? ఆయన కోరారు కాబట్టే కాళేశ్వరంపై విచారణ చేయమని సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రతిపాదనను సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి అందజేశాం. ప్రధాని కార్యాలయం వరకు విషయం వెళ్లింది. అయినప్పటికీ అతీగతీ లేదు. ఇంతవరకు విచారణ జరపలేదు.. కేసీఆర్ను జైల్లోనూ వేయలేదు. దీనికి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి. కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్గాంధీ, సోనియా గాం«దీలను విచారించారు. ఈ–ఫార్ములా కేసును కూడా ఈడీకి ఇచ్చాం. కానీ మాజీమంత్రి కేటీఆర్ను ఈడీ ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్రావును విదేశాల నుంచి తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి ఆయనను తీసుకొచ్చేందుకు 20 నెలలు పట్టింది. ఆయన చెప్పిన సమాచారం ఆధారంగా మిగతావాళ్లకు నోటీసులు ఇచ్చాం ఇందులో రాజకీయం ఏమీలేదు. నేను ఇందులో జోక్యం చేసుకుంటే ఎవరూ బయట ఉండరు. ‘నైనీ’పై అసెంబ్లీలో ఆధారాలు వెల్లడిస్తా.. నైనీ కోల్ బ్లాక్లో సైట్ విజిట్ అనే నిబంధన కేంద్రమే పెట్టింది. ఒక్క సింగరేణిలోనే ఆ రూల్ ఉందని కిషన్రెడ్డి చెబుతున్నారు. నేను చెప్పింది నిజమైతే కిషన్రెడ్డి క్షమాపణ చెప్పాలి. లేదంటే నేను చెబుతా. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అన్ని ఆధారాలను వెల్లడిస్తా. కిషన్రెడ్డి లేఖ రాస్తే విద్యుత్ కొనుగోళ్లు సహా అన్ని కేసులూ సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం. రాష్ట్ర పోలీసులపై కిషన్రెడ్డికి విశ్వాసం లేదంటే బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య కేసును కూడా సీబీఐకి అప్పగిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. గోదావరికి ఒక రూలు, కృష్ణాకు ఒక రూలా? ‘పాలమూరు, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో ఉన్నవే. వీటిపై ఏపీవాళ్లు పిటిషన్లు వేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టుకోకుండా మాకు అవాంతరాలు సృష్టిస్తున్నారు. గోదావరిలో వాళ్లకు కావాల్సింది వాళ్లు అడుగుతున్నారు. కృష్ణాలో మాకు కావాల్సింది కూడా ఇవ్వాలి కదా. మా ప్రాజెక్టులు అడ్డుకుంటే ఊరుకుంటామా? వాళ్లకు ఏది నచ్చితే అది తీసుకుంటామంటే ఎలా? గోదావరికి ఒక రూలు, కృష్ణాకు ఒక రూలు అంటే కుదరదు. వాళ్ల ప్రాజెక్టులకు ఏ రూలు వర్తిస్తుందో అదే రూలు మాకూ వర్తిసుంది. ఇక్కడ ప్రధాన సమస్య కృష్ణా జలాలే. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ఎన్ఓసీ ఇస్తే.. వాళ్లు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు..’ అని రేవంత్ స్పష్టం చేశారు. బుల్లెట్ ట్రైన్ హబ్గా హైదరాబాద్ ‘రాష్ట్రంలో కేంద్రం మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్గా మారబోతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో, ఫ్యూచర్ సిటీకి దగ్గర్లో బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం భూమిని కూడా పూలింగ్ చేస్తున్నాం. ఎయిర్ట్పోర్ట్ని బుల్లెట్ రైళ్లకు అనుసంధానం చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాం. 2034 లోపు బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. మెట్రో ఫేజ్–2కు మార్చి 31 డెడ్లైన్గా పెట్టుకుని పని చేస్తున్నాం. జూన్ 2కు మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్నాం..’ అని సీఎం తెలిపారు. ఎఫ్ఎస్ఎల్పై విపక్షాల విష ప్రచారం ‘ఎఫ్ఎస్ఎల్లో కీలక కేసులకు సంబంధించిన రికార్డులు కాలిపోయాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కావాలని విష ప్రచారం చేస్తున్నాయి. అసలు విషయం వాళ్లకు తెలియదు. ఒక కేసుకు సబంధించిన వివరాలను పరిశీలించిన తర్వాత.. అవి తిరిగి దర్యాప్తు సంస్థకే అప్పగిస్తారు. 2021లో ‘ఓటుకు నోటు’ కేసు రిపోర్టు కూడా అలాగే తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ రికార్డులు కూడా అందులో ఉన్నాయంటే ఎలా?..’ రేవంత్ అని ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్కు భాష, రాష్ట్రాల సరిహద్దులు లేవు. ఆయన ఏ ఒక్కరి సొత్తూ కాదు.. జాతీయ సొత్తు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆయనకు భారతరత్న ఇవ్వాలి. అందుకు నేను మద్దతిస్తా. ఇది నా వ్యక్తగత అభిప్రాయం, డిమాండ్. త్వరలో హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా..’ అని రేవంత్ చెప్పారు. -
తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి: సీఎం రేవంత్
సాక్షి, ఢిల్లీ: ‘‘తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీ కాదు’’ అంటూ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. 2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని.. పదిన్నరేళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని రేవంత్ అన్నారు. తానూ ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనని..తనను అన్నవాళ్లనే తాను అంటున్నానన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకెళ్తామని.. కేసీఆర్, హరీష్రావు కోరినట్లు ప్రభుత్వం నడవదన్నారు.‘‘మున్సిపల్ ఎన్నికల్లో నేను డిస్టింక్షన్లో పాస్ అవుతా. జూబ్లీహిల్స్లో ఎన్టీఆర్ విగ్రహం నేనే ఆవిష్కరిస్తా. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి. కేసీఆర్ సెల్ఫ్ హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. సింగరేణిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెడతా. సైట్ విజిట్ నిబంధన కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. మా ప్రభుత్వం వచ్చినట్టుకే సింగరేణి అప్పుల్లో ఉంది. మా ప్రభుత్వం ఎవరి ఫోన్లు టాపింగ్ చేయడం లేదు. జనాభా గణన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, నియోజకవర్గాల పెంపు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి’’ అని రేవంత్ పేర్కొన్నారు.ప్రభాకర్రావును విచారించేందుకే మాకు 20 నెలలు పట్టింది. ఫోన్ టాపింగ్ కేసు విచారణకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. సుప్రీంకోర్టు ద్వారా ప్రభాకర్రావును రప్పించాను. త్వరలో చార్జిషీట్ కూడా వేయమని ఆదేశాలు ఇచ్చా. ప్రభాకర్రావు ఇచ్చిన సమాచారం మేరకే కేసీఆర్ విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును ఎవరు బాంబులతో పేల్చలేదు. బాంబులతో పేలిస్తే ప్రాజెక్టుపైకి లేస్తుంది. గుంతలోకి కూరుకుపోదు. ఎన్డీఎస్ఎ నివేదిక మేరకు కాళేశ్వరంపై అధ్యయనం జరుగుతుంది’’ అని రేవంత్ వెల్లడించారు. -
మూసీలో ముందడుగు.. నిర్వాసితులకు పరిహారం
సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ మూసీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిన భూ సమీకరణకు మార్గం సుగమమైంది. నది సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్ జిల్లాలోని గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో సుమారు 55 ఎకరాల భూములను సేకరించనుంది. ఈమేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) నోటిఫికేషన్ను విడుదల చేసింది. భూ నిర్వాసితులకు భూ బదలాయింపు హక్కు (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్–టీడీఆర్) రూపంలో పరిహారం అందించాలని నిర్ణయించారు. పట్టా భూములకు టీడీఆర్ సర్టిఫికెట్లు.. సుందరీకరణలో సీఎం రేవంత్ లక్ష్యానికి అనుగుణంగా.. బాపూఘాట్ ప్రాంతాన్ని గాంధీ సరోవర్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి దశలో జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ల నుంచి బాపూఘాట్ వరకు అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్–1ఏలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ, ఫేజ్–1బీలో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టి.. నదికి రెండు వైపులా మొత్తం 21 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నారు. పరీవాహక ప్రాంతంలో సరైన రెవెన్యూ పత్రాలు, పట్టా భూములున్న వారికి టీడీఆర్ సరి్టఫికెట్లను అందజేయనున్నారు. సుందరీకరణ ఇలా.. ఘన, జల వ్యర్థాలతో నిండిపోయిన నదిని మొదట శుభ్రం చేస్తారు. 2 మీటర్ల లోతు వ్యర్థాలు, పూడిక తీస్తారు. ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. చుట్టూ మురుగునీటి శుద్ది కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను మళ్లించి.. 24/7 నదిలో పారేలా సుందరీకరిస్తారు. నడక మార్గాలు, సైకిల్ ట్రాక్లు, భూగర్భ జలాల రీచార్జ్ కోసం పార్క్లు, వర్షపు తోటలు, గ్రీన్రూఫ్లు, బ్యాటరీ వాహనాలు, ఎలక్ట్రిక్ రిక్షాలు వంటివి ఉంటాయి. నైట్ ఎకానమీలో భాగంగా అమ్యూజ్మెంట్పార్క్, వాటర్ ఫాల్స్, చి్రల్డన్స్ వాటర్ స్పోర్ట్స్, వీధి వర్తకుల వ్యాపార సముదాయాలు, వంతెనలు, వినోద కేంద్రాలు, రెస్టారెంట్లు, క్రీడా సౌకర్యాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలను అభివృద్ది చేస్తారు. -
పురపోరులో సత్తా చాటుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతుందని, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్రెడ్డి వివరించారు. దీంతో ఇదే ఊపుతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ముందుకెళ్లాలని ఖర్గే చెప్పారు. బుధవారం ఢిల్లీ వచ్చిన ఆయన నేరుగా తుగ్లక్ రోడ్డులోని అధికార నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల సమయంలో రాజాజీ మార్గ్లోని ఖర్గే నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికలు, విజయావకాశాలపై సుమారు 30 నిమిషాల పాటు నేతలు చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ వంటి అంశాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఈ అంశాలు పారీ్టకి కలిసివస్తాయని రేవంత్ వివరించారు. 70 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తామని, మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని చెప్పారు. గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల పదవుల్లో బీసీ సామాజిక వర్గం, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా ఖర్గే, రేవంత్ చర్చించినట్లు సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొద్దిసేపు ఖర్గే, రేవంత్రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలిసింది. బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇటీవల రాజకీయ, పాలనా పరమైన అంశాలు బయటకు రావడంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ యంత్రాంగం, ప్రభుత్వం మధ్య సమన్వయం దెబ్బతినకుండా చూసుకోవాలని, నేతల మధ్య విభేదాలు ఉన్నా వాటిని వెంటనే పరిష్కరించుకోవాలని రేవంత్కు ఖర్గే హితబోధ చేసినట్లు సమాచారం. అదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖర్గే సూచించారు. ఒకవైపు బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఖర్గే దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. నేడు కేంద్ర మంత్రులతో భేటీ ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి గురువారం రాష్ట్రానికి సబంధించిన పలు అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రల్హాద్ జోషిని కలిసి అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీతోనూ భేటీ కానున్నట్లు సమాచారం. -
ఓటమి భయంతోనే దౌర్జన్యకాండ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల లోనే ఘోరమైన పాలనా వైఫల్యాలు మూటగట్టుకు న్న సీఎం రేవంత్ రెడ్డి ఓటమి భయంతో మున్సిపల్ ఎన్ని కల్లో దౌర్జన్యకాండకు దిగార ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం పట్టణ ఎన్నికల్లోనూ తప్పదనే ఆందోళన తోనే రేవంత్ అడుగడుగునా అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారని మండిపడ్డారు. అక్రమంగా లూటీ చేసిన వేల కోట్ల రూపాయలతో ప్రజాతీర్పు నే మార్చాలని చూస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బుధవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణు లపై సాగించిన వేధింపులకు, దాడులకు రేవంత్రెడ్డి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతుంది’అని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఎన్నిక ల్లో అధికార పక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొక్కవోని దీక్షతో బీఆర్ఎస్ కార్యకర్తలు వీరో చితంగా పోరాడారు. వారు కనబరిచిన పోరాట స్ఫూర్తి పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది’అని కేటీఆర్ కొనియాడారు. దాడులు చేయడం హీనమైన సంస్కృతిముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ ఎన్నికల్లో అడుగడుగునా అధికార దుర్వినియో గాని కి, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడ్డా రని మాజీ మంత్రి హరీశ్రా వు విమర్శించారు. ‘నామినే షన్ల దాఖలు మొదలు పోలింగ్ ముగిసేంత వరకు కాంగ్రెస్ అనేక అరాచకాలకు పా ల్పడింది. బీఆర్ఎస్ అభ్యర్థు లను బెదిరించడమే గాక, వారిపై భౌతిక దాడులకు తెగబడటం హీనమైన రాజకీయ సంస్కృతికి నిద ర్శనం. చట్టాన్ని కూడా లెక్క చేయ కుండా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడు గులొత్తిన కొందరు పోలీసుల తీరు గర్హనీయం. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఇలాంటి నీచ రాజకీయాలకు తెగబ డటం ప్రజాస్వామ్య వ్యవస్థ ను అవమానించడమే. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చివరి వరకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు’అని హరీశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
‘సీఎం రేవంత్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుంది’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం రేవంత్రెడ్డి ఇంతటి దౌర్జన్యకాండకు దిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రెండేళ్ల పాలనలో ఘోరమైన పరిపాలనా వైఫల్యాలను మూటగట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ ఓటమి భయంతోనే ఈ ఎన్నికల్లో ఇంతటి దౌర్జన్యకాండకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో మొదలైన పరాభవం, పట్టణాల్లోనూ తప్పదనే ఆందోళనతోనే అడుగడుగునా రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.అక్రమంగా లూటీచేసిన వేలకోట్ల ప్రజాధనంతో, ప్రజాతీర్పునే మార్చాలన్న ఈ కుట్రలను తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. పోలీసుశాఖను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులపై సాగించిన వేధింపుల పర్వానికి, దాడులకు రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలకిచ్చిన హామీలను, మొత్తంగా పరిపాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం రేవంత్ రెడ్డిని ప్రతినిత్యం వెంటాడుతూనే ఉంటది’ అని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా వీరోచితంగా పోరాడిన గులాబీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక అభినందనలు.. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ పురపాలక సమరంలో మీరు కనబరిచిన పోరాట స్ఫూర్తి బీఆర్ఎస్ కు కొండంత బలాన్నిచ్చింది, పార్టీలో ఆకాశమంత…— KTR (@KTRBRS) February 11, 2026 -
‘కావాలంటే మీరు రేవంత్ఖాన్ అని మార్చుకోండి’
ఢిల్లీ : తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి మండిపడ్డారు. తాను ఎవరికీ దత్తపుత్నుడ్ని కాదనే విషయాన్ని రేవంత్ తెలుసుకుంటే మంచిదన్నారు. తన తల్లి పెట్టిన పేరును మార్చడానికి రేవంత్ ఎవరని, కావాలంటే రేవంత్.. రేవంత్ఖాన్ అని పేరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్తో మీరు కాపురం చేసినన్నాళ్లూ తాము నిప్పులు పోస్తామన్నారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఏమిచ్చారో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్రెడ్డిదా..? లేక కిషన్రెడ్డిదా? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలన్నారు. ‘మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. ఎంపీ,ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఒక సీటు రాదని మాట్లాడారు. నా పేరు మార్చినా ఎన్ని మాట్లాడినా గెలిచేది బీజేపీనే. తల తోకా లేకుండా రేవంత్ మాట్లాడుతున్నారు. రేవంత్ రెండేళ్లుగా మాటలతో గడిపారు. రేవంత్ ఏం చేస్తారో చేతల్లో చూపించాలి. ఇచ్చిన మాటపై నిలబడే శక్తి లేకపోతే రాజీనామా చేయాలి. రేవంత్ చేతగానితనాన్ని బీజేపీ పై రుద్దొద్దు. రేవంత్ ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి’ అని స్సష్టం చేశారు. -
సీఎం గారు.. మీకు మానవత్వం ఉందా? బండి సంజయ్ లేఖ
-
2029లో అసెంబ్లీ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. 2028 అక్టోబర్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన గణన, కుల గణన ప్రక్రియ తర్వాత నియోజకవర్గవర్గాల పునరి్వభజన జరుగుతుందని, అలాగే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, జమిలి ఎన్నికలు.. ఇవన్నీ అమలు చేయాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు. సోమవారం తన నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘పార్లమెంట్ స్థానాల డీలిమిటేషన్ను జనాభా లేదా ప్రోరేటా ప్రకారం చేసినా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అందుకే ప్రస్తుతం ఉన్న మాదిరిగానే సీట్ల పెంపు ఉండాలి తప్ప మార్చకూడదు. అయితే ఏ విధానాన్ని అవలంభిస్తారన్నది కేంద్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. కానీ కొత్తగా కట్టిన పార్లమెంట్ను 840 సభ్యులు కూర్చొనే విధంగా నిర్మించారు. 50 శాతం సీట్ల పెంపు ప్రోరేటా పద్ధతిలో చేస్తే తమిళనాడులో 40 సీట్లున్న లోక్సభ స్థానాలు 60కి పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 120కి పెరుగుతాయి..’ అని సీఎం చెప్పారు. జిల్లాలను ముట్టుకోవడానికి వీల్లేదు ‘రాష్ట్రంలో జిల్లాల కుదింపు లేదా పెంపు ఏదీ చేపట్టడానికి ఇప్పుడు వీలులేదు. ఎందుకంటే జనగణన పూర్తయ్యే వరకు ఎలాంటి సరిహద్దుల మార్పులు చేయొద్దని కేంద్రం అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలిచి్చంది. అయినా ఎలాంటి మార్పు చేయాలన్నా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామే తప్ప నాలుగు గోడల మధ్య కాదు. పరిగిలో జరిగిన సమావేశంలో నేను మాజీ ఎంపీ రంజిత్రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అన్నట్లు పత్రికల్లో రాయడం సమంజసం కాదు. చేవెళ్ల నియోజకవర్గంలోని మునిసిపాలిటీలకు నిధులు తీసుకురావడం, అభివృద్ధి చేసే బాధ్యతను రంజిత్రెడ్డికి ఇస్తానని నేను చెప్పా..’ అని రేవంత్ వివరణ ఇచ్చారు. కల్వకుంట్ల కవితది ఇంటి సమస్య.. కల్వకుంట్ల కవిత సమస్య వారి అంతర్గత కుటుంబ సమస్య అని సీఎం వ్యాఖ్యానించారు. కవిత వెనుక తానున్నానన్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పలు రాష్ట్రాల్లోని రాజకీయ కుటుంబాల్లో సమస్యలుంటే వాటన్నింటికీ నేను బాధ్యుడినా అని ప్రశ్నించారు. అధికారం ఉన్నంతవరకు కవిత, అందరూ కలిసే ఉన్నారుగా అని వ్యాఖ్యానించారు. తానేదో బూతులు మాట్లాడుతున్నట్లు తప్పుపడుతున్న వారు.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఉద్దేశించి రండా అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ‘మంది సంసారాలను కూలదోసేలా వార్తలు ప్రసారం చేస్తే జైలుకు వెళ్లాల్సిందే.కాళేశ్వరంపై సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? వారు తిరస్కరిస్తే మేము విచారణ చేయిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసు 3 నెలలుగా పురోగతి సాధిస్తోంది. నేను ఏ ఎన్నికలను రెఫరండంగా భావించడం లేదు. స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేదు. స్థానిక నాయకులకే వదిలిపెట్టాం. ఎన్ని మునిసిపాలిటీల్లో విజయం సాధిస్తామన్నది అంచనా వేయలేదు. అజహరుద్దీన్ను ఎమ్మెల్సీగా నియమించేందుకు గవర్నర్కు ప్రతిపాదన పంపించాం..’ అని సీఎం తెలిపారు. జైలుకెళితే సీఎం అవుతామనుకుంటున్నారు.. తిరుమల లడ్డూ వ్యవహారంపై విలేకరులు ప్రశ్నించగా..అది పక్క రాష్ట్రానికి సంబంధించిన విషయమని రేవంత్ అన్నారు. తెలంగాణలోని దేవాలయాల్లో విజయా డెయిరీ నెయ్యినే వాడాలని ఆదేశించామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకెళ్లడానికి కేటీఆర్, హరీశ్ పోటీ పడుతున్నారని, అలా వెళ్తే సీఎం కావచ్చని భావిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే జైలుకెళ్లిన కవిత కూడా సీఎం అవుతానని భావిస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు. -
బీజేపీ తెచ్చిందేమీ లేదు.. బీఆర్ఎస్కు అర్హత లేదు
సాక్షి, హైదరాబాద్: పన్నెండేళ్లలో రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి ఇవ్వని బీజేపీ ఇప్పుడు నిధులు తెస్తామంటే నమ్మాలా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్రెడ్డి, బండి సంజయ్లు ఏ ఒక్క పథకం కిందనైనా అదనంగా నిధులు తీసుకుని వచ్చారా? అని నిలదీశారు. పదేళ్లు వార్డు సభ్యుని నుంచి సీఎం వరకు అన్ని పదవులు అనుభవించిన బీఆర్ఎస్కు సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఓటు వేయాలని అడిగే అర్హత లేదని అన్నారు. మున్సిపాలిటీల్లో సమస్యలకు బీఆర్ఎస్ కారణమని, ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వాన్ని పట్టణ ప్రాంత ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును విశ్లేషించి ఓటు వేయాలని కోరారు. కళ్లముందున్న గతం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నదని చెప్పారు. సోమవారం సీఎం తన నివాసంలో సలహాదారు వేం నరేందర్రెడ్డి, టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్రెడ్డి, టీపీసీసీ నేత నీలం మధుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఒక్క ప్రాజెక్టు అయినా కేటాయించిందా? ‘2014 ఎన్నికల ముందు మోదీ పాలమూరు సభలో రంగారెడ్డి– పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నారు. 12 సంవత్సరాలు గడిచినా రాలేదు. మొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చారు. ఆ విషయం ప్రస్తావిరని భావించా. కానీ దాని ఊసెత్తకుండా మోదీని చూసి ఓటేయండని అడిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదిలాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో కట్టుకోవడానికి అనుమతిస్తామంటూ చెప్తారని ఆశించా. అదేమీ లేకుండా మహారాష్ట్రలో భూమి మునిగితే తెలంగాణ కనీసం నష్టపరిహారం ఇవ్వలేదంటూ రాష్ట్రాన్ని అవమానించారు. హైదరాబాద్లో వరద సమయంలో బండి సంజయ్ ఆటోకు ఆటో, బండికి బండి, ఇంటికి ఇల్లు అని ప్రచారం చేశారు. వారి మాట నమ్మి ప్రజలు దాదాపు 50 డివిజన్లలో గెలిపించారు. ఎన్నికలయ్యాక..మీకు ఇన్సూరెన్స్ ఉంది అన్నీ వస్తాయని చెప్పారు. సత్రంలో భోజనం ఉచితమే.. దానికి నెల్లూరు పెద్దారెడ్డి సిఫారసు లేఖలా ఉంది బండి సంజయ్ తీరు. తాజాగా కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని నమ్మించే యత్నం చేస్తున్నారు. 12 ఏళ్లుగా అదనంగా ఒక్క రూపాయి ఇవ్వని వారిని ఇప్పుడు నమ్మొచ్చా? రాజ్యాంగబద్ధంగా, ఎవరి ప్రమేయం లేకుండా వచ్చే నిధులను తాము ఇచ్చినట్లు చెప్పుకోవడమేమిటి? కేంద్రం తన విచక్షణతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా కేటాయించిందా? రాష్ట్రం నుంచి ఎన్నికైన 8 మంది బీజేపీ ఎంపీలు ఒక్కరైనా మోదీ దృష్టికి తీసుకెళ్లారా?..’అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లు మాట్లాడతారా? ‘కిషన్రెడ్డి, బండి సంజయ్, అర్వింద్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీకి, ఢిల్లీకి తాకట్టు పెట్టినట్లు మాట్లాడడం ఏమి న్యాయం? మూసీకి, మెట్రోకు, సమ్మక్క సారక్కకు, ఇతర దేవాలయాలకు ప్రత్యేకంగా నిధులు తెచ్చారా? వరంగల్ విమానాశ్రయం కోసం వందల కోట్లు ఖర్చు చేసి భూములు కేంద్రానికి ఇచ్చాం. పక్కనున్న ఏపీలో ఆరేడు విమానాశ్రయాలు ఉంటే.. తెలంగాణకు ఒక్కటి మాత్రమే ఉంది. ఇప్పుడు మోదీని చూసి ఓట్లు వేయాలంటున్నారు. మోరీల్లో చెత్త తీయడానికి మోదీ వస్తారా? అసదుద్దీన్ను భూతంగా చూపించి ఎంతకాలం మత రాజకీయాలు చేస్తారు? బీజేపీకి అసదుద్దీన్ లైఫ్లైన్గా మారారు..’అని రేవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ను యాసిడ్ పోసి కడగాలి ‘బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రారు. వచ్చిన వారు అభివృద్ధి కోసం కాకుండా సభను అడ్డుకోవడానికి వస్తారు. సభల్లో వారిద్దరు అహంకారం, విద్వేషంతో గంజాయి, కొకైన్ తీసుకున్న వారిలా మాట్లాడుతున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో ఈ పార్టీ వారికి ఓటు వేస్తే వారు మునిసిపాలిటీలకు రారు. అభివృద్ధి పట్టించుకోరు. ఇప్పుడున్న సమస్యలన్నింటికీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు కారణం కాదా? ఇప్పుడు మూడోసారి మళ్లీ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్లు వసూలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లది 2023 వరకు విడదీయలేని అనుబంధం. నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్లచట్టాలు, ట్రిపుల్ తలాక్కు మద్దతిచ్చారు. అందుకే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతోంది. బీఆర్ఎస్ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు. బీఆర్ఎస్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వొద్దు..’అని సీఎం వ్యాఖ్యానించారు. మేం రెండేళ్లలో ఎన్నో చేశాం.. ‘మేం అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదటి తారీఖునే వచ్చేలా చేశాం. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు చెల్లించి లాభాల బాటలోకి తెచ్చాం. రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా రూ.9 వేల కోట్లు చెల్లించాం. సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. పేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5 లక్షలు అందిస్తున్నాం.70 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నాం. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. వందేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా బీసీ కులగణన చేసి చూపించాం. నలభై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలంగాణ సమాజానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి..’అని రేవంత్ కోరారు. -
ఆయన రేవంత్ రెడ్డి కాదు.. లాగుల తొండల రెడ్డి: కేటీఆర్
-
మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
సాక్షి,హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలు తీర్పు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్రెడ్డి. నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనున్న తరుణంలో కొద్ది సేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు.12ఏళ్లగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతోంది. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయండి. ఓటు వేసే ముందు గత పాలను గుర్తు చేసుకోండి. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. పాలమూరు-రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్ట్గా గుర్తిస్తామని ప్రధాని మోదీ విస్మరించారు.మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలంగాణను అవమానించారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ తెచ్చారు: హరీశ్
-
‘ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక రేవంత్ హస్తం’
మెదక్: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక రేవంత్ హస్తం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లో ప్రజలనుద్దేశించి మాట్లాడిన హరీష్.. రేవంత్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు పోవడం ఖాయం. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్ను దగ్ధం చేసిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేసిండు. ఆ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంత్ డైరెక్షన్లో జరిగిన ప్రమాదం అది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ ను దగ్దం చేసిండు. పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నిండు. హైదరాబాద్లో పేదల బతుకులు కూల్చిండు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేసిండు. రేవంతు డైరెక్షన్ లో పోలీసులు చేసిన దహనకాండ. ఓటుకు నోటు కేసులో రేవంతుకు శిక్ష పడక తప్పడు, జైలుకు పోక తప్పదు. రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా. మిర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ పోయిండు ముఖ్యమంత్రి..కానీ మెదక్కు వచ్చేందుకు ముఖం లేదు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిండు కాబట్టి ఆయనకు భయంరుణమాఫీ మాట తప్పి మోసం చేసిండు. రైతు బంధు ఎగ్గొట్టిండు. ఎరువుల కరువు తెచ్చిండు రేవంత్. రేవంత్ బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదు. రంజాన్ తోఫా కూడా ఇవ్వడం లేదు. షాదీ ముబారక్ చెక్కులు రావడం లేదు. తులం బంగారం దిక్కు లేదు. కేసీఆర్ గారు మైనార్టీ గురుకులాలు కట్టారు. షాదీ ఖానా ఏర్పాటు చేశారు. కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీని సెక్యూలర్ పార్టీగా నిలబెట్టారు. హిందూ ముస్లింలను అన్నదమ్ములుగా చూసింది బీఆర్ఎస్. తెల్లారితే మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ను తిడితే, హరీశ్ రావును తిడితే పేదల కడుపు నిండుతుందా?, ఇక్కడి ఎమ్మెల్యే చాలా గొప్పోడు. ఎన్నికల సమయంలో 25 గంటల కరెంటు ఇస్తా అన్నడు. కనీసం 12 గంటలు కూడా రావడం లేదు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేలు అని గుండు కొట్టిండు. ఉద్యోగస్థులకు డీఏ లేదు, పీఆర్సీ లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్ బెన్ఫిట్స్ లేవు. అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి’ అని ధ్వజమెత్తారు హరీష్రావు. -
MLA Yashaswini: ఓడిపోయిన బాధలో KCR నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు
-
Ranganath: నెక్స్ట్ గవర్నమెంట్ మారితే హైడ్రా ఫ్యూచరేంటి?
-
రేవంత్.. సింగరేణి బంగారం బామ్మర్దికి రాసిచ్చావా?: కేటీఆర్
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణికి న్యాయం చేసేందే కేసీఆర్. సింగరేణి నల్ల బంగారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన అత్తగారి కొంగు బంగారంగా బావమరిదికి రాసిచ్చారు అంటూ ఆరోపణలు చేశారు.భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ కార్యకర్తలను, కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయి?. జిల్లాలపై కమిటీ వేసిన రేవంత్ నిన్నటి సభలో భూపాలపల్లి జిల్లాను తీసేయం అని చెప్తున్నాడు.అసలు జిల్లాలు ఇచ్చింది కేసీఆర్. అలాంటి జిల్లాలను తీసేయడానికి నువ్వెవరు రేవంత్?. సింగరేణికి న్యాయం చేసింది కేసీఆర్. కానీ, సింగరేణి నల్ల బంగారాన్ని రేవంత్ తన బావ మరిదికి రాసిచ్చారు. నల్ల బంగారం కుంభకోణాన్ని బయటపెట్టగానే ఫోన్ ట్యాపింగ్ అని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన ఆధారాలు అన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు అగ్గి పెట్టి సాక్షా లు లేకుండా తగలపెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
హార్వర్డ్ కోర్సు తెచ్చిన మార్పు సున్నా!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో ఓ కోర్సుకు హాజరు కావడం ఎంతైనా అభినందనీయం. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ.. నాయకత్వ లక్షణాలన్న అంశంపై సాగిన ఈ కోర్సులో ఆయన అంతర్జాతీయ పోకడల గురించి నేర్చుకుని ఉండవచ్చు. అయితే కోర్సు ముగించుకుని హైదరాబాద్ రావడంతోనే ఆయనలో పాత రాజకీయ నాయకుడు మళ్లీ ప్రత్యక్షమైనట్టు కనిపిస్తోంది. భాష, తీరులో రెండింటిలోనూ ఏ మాత్రం మార్పు కనిపించలేదు. ఇతర రాజకీయ పార్టీల నేతలు భిన్నంగా ఉండకపోవచ్చు. అది వేరే సంగతి. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలలో రేవంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత, విపక్ష నేత కేసీఆర్పై పరుష వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను ఆకర్షించడానికి, కాంగ్రెస్ కేడర్లో ఊపు తేవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. సాధారణంగా మున్సిపల్ ఎన్నికలు లోకల్ సమస్యల ఆధారంగా జరుగుతాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్కు మెజార్టీ స్థానాలు దక్కినా, బీఆర్ఎస్ కూడా గణనీయ విజయాలు సాధించింది. దీంతో మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం అవుతున్నాయి. ఫలితాలు నాయకత్వంపై ప్రభావం చూపుతుందన్న అంచనాతో రేవంత్ కాంగ్రెస్ 90 శాతం సీట్లు గెలుచుకోవాలని మంత్రులకు, నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆ క్రమంలో రేవంత్ చేస్తున్న ప్రసంగాలలో ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలు, అమలు చేసిన హామీలు మొదలైన వాటి గురించి కంటే కేసీఆర్, బీఆర్ఎస్లపై విమర్శలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు అనిపిస్తోంది.‘‘మొగుడు,పెళ్లాల ఫోన్లు విన్నోడు జాతిపిత ఎట్లయితడు? నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు.. మాకు కాదు. సన్నాసి, దొంగ ఎప్పటికి జాతిపిత కాలేడు’’ అన్న వ్యాఖ్యలు ఆ కోవకు చెందినవే. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ఫ్రొఫెసర్ జయశంకరే జాతిపిత అని రేవంత్ స్పష్టం చేశారు. ‘‘జర్నలిస్టులు, సినీ తారలు జడ్జిల ఫోన్లు విన్నారు.. మీరు చేసిన తప్పులకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులకు ముసుగు తొడిగి విచారణకు తీసుకురావల్సింది అని కూడా వ్యాఖ్యానించారట. ఇది పూర్తిగా అభ్యంతరకరం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీరిపై ఆరోపణలకు ఆధారాలుంటే వాటిని జనానికి చూపించవచ్చు కాని ఇంతవరకు అలాంటివి ఏవీ ప్రజల దృష్టికి రాలేదు. తాజాగా ఫోరెన్సిక్ లాబ్ అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ఎన్ని కేసుల ఆధారాలు పోయాయో చెప్పలేని పరిస్థితి. ప్రజలు నిజానికి ఇలాంటి వాటిని పట్టించుకుని ఓట్లు వేసే పరిస్థితి ఉందా అన్నది సందేహం. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి ముందు ఆయన పై వచ్చిన కేసు కూడా తీవ్రమైనదే. జైలుకు కూడా వెళ్లవలసి వచ్చింది. అయినా తర్వాత కాలంలో రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హామీలు అమలు చేయడం, నాలుగు మంచి పనులు చేయడం ద్వారా ప్రజల ఆదరణ చూరగొనడానికి ప్రయత్నం చేస్తే కీర్తి వస్తుంది. అలా కాకుండా కేసీఆర్ను, బీఆర్ఎస్ను దూషించుకుంటూపోతే ఏమి కలిసి వస్తుంది? రాజకీయ విమర్శలు చేయడం తప్పు కాదు.కాని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల రాజకీయ పార్టీల మధ్య ద్వేషాలు పెరుగుతాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అచ్చంగా ఇదే తరహాగా ఉన్నవి, లేనివి ఆరోపణలు చేస్తూ అసలు విషయాలను పక్కదారిని పట్టించడానికి, జగన్పై విషం కక్కడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఆయన శిష్యుడైన రేవంత్ కూడా అదే ధోరణిలో వెళుతున్నారా అన్న అనుమానం వస్తుంది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు అంటూ ఆరోపణలు చేసి చంద్రబాబు అప్రతిష్టపాలయ్యారు. తెలంగాణలో రేవంత్ జడ్జిల ఫోన్లు, సినిమా తారల ఫోన్లు, చివరికి మొగుడు ,పెళ్లాల ఫోన్లు టాప్ అయ్యాయని అంటున్నారు. ఇది బట్టకాల్చి మీద వేయడమా? లేక వాస్తవాలు ఉన్నాయా? సినిమా తారల ఫోన్లు టాప్ కాలేదని పోలీసు అధికారులే స్పష్టం చేసినట్లు కేటీఆర్ అంటున్నారు. అలాగే అంతకన్నా సంచలనం జడ్జిల ఫోన్లు టాప్ అయ్యాయని ఒక ముఖ్యమంత్రి అంటే అది సీరియస్ అంశం అవుతుంది. బహుశా రాజకీయ ప్రసంగంగా పరిగణించి న్యాయ వ్యవస్థ పట్టించుకుని ఉండకపోవచ్చు. ఎదుటి వారిపై వ్యక్తిత్వ హననం అన్నది చంద్రబాబు విధానం. దానినే రేవంత్ కూడా ఫాలో అవుతున్నారా అన్న సంశయం కలుగుతుంది. కేసీఆర్ జాతిపిత కాదని విమర్శ చేసినంతవరకు ఫర్వాలేదు కాని, ‘‘నీ జాతికి పిత’’ అనడం బాగోలేదు. కేసీఆర్ను జైలులో వేశాక బీజేపీ ఓట్లు వేయాలని రేవంత్ అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసింది తెలంగాణ ప్రభుత్వం కదా!కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేదు? దీనిని బీజేపీ తప్పుపడుతుంటే కేంద్రం సీబీఐ విచారణ చేయాలని రేవంత్ అంటున్నారు. ఇది ఒక గేమ్ గా మారింది.తెలంగాణలో ఎవరు ఎవరితో రహస్య అవగాహనతో ఉన్నారో తెలియని రీతిలో రాజకీయాలు సాగుతున్నాయన్న అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతోంది. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన విమర్శలకు బదులుగా తనను రేవంతుద్దీన్ అంటే సంతోషమేనని బదులు ఇచ్చారు. దీనివల్ల కాంగ్రెస్కు కొంత నష్టం, కొంత లాభం ఉండవచ్చు. కేసీఆర్కు కేటీఆర్ దొంగపుత్రుడు అయితే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దత్తపుత్రుడు అని విమర్శించారు. కిషన్ రెడ్డి కిషన్ రావుగా మారి కేసీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు కూడా ఇలాటి డైలాగులనే వాడి ప్రధాని మోడీకి జగన్ దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేసేవారు. కాని సీన్ కట్ చేస్తే చంద్రబాబు వెళ్లి మోడీతో పొత్తు పెట్టుకున్నారు.తెలంగాణలో అలా జరుగుతుందని కాదు..రాజకీయ విమర్శల బదులు వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఇలాంటివి ప్రస్తావనకు వస్తాయి. ఈ రకమైన వ్యాఖ్యల వల్ల రేవంత్ అమెరికా వెళ్లి నేర్చుకువచ్చింది ఏమిటి అన్న ప్రశ్నకు తావిస్తున్నారు.రేవంత్పై కేటీఆర్ కొన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వాటిపై రేవంత్ వివరణ ఏమిటో తెలియదు.అయితే కేటీఆర్ కూడా రేవంత్ ను ఘాటుగానే విమర్శిస్తున్నారు. దానిని కూడా సమర్ధించజాలం. అయినా, ముఖ్యమంత్రి గా ఉన్నది రేవంత్ కనుక ఆయన మరింత బాధ్యతగా ఉంటే రాజకీయాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి.కాని ఓట్ల వేటలో రాజకీయాలలో ప్రమాణాలు ఆశించడం అత్యాశే అవుతుందా!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
కాంగ్రెస్ది భస్మాసుర హస్తం
తాండూరు/ నర్సంపేట/వర్ధన్నపేట/తొర్రూరు: ‘ముఖ్యమంత్రిని రైతు భరోసా ఇస్తా అంటివి కదా అని అడిగితే లాగులో తొండలు విడుస్తా అంటడు. మహిళలకు రూ.2 వేలు ఏమాయె అంటే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటుండు. తులం బంగారం ఎప్పుడంటే పేగులు తీసి మెడలేసుకుంటా అంటుండు. ఇంతకు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రా లేక బోటీ కొట్టేటోడా అర్థం కావడం లేదు. ఇక నుంచి ఆయన్ను లాగుల తొండల్రెడ్డి అనాలేమో’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరుతోపాటు వికారాబాద్ జిల్లా తాండూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదని అది భస్మాసుర హస్తమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు దాటుతున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కామారెడ్డికి ఎన్నికల ప్రచారానికి వెళితే ఓ పెద్దమ్మ మాట్లాడుతూ.. రూ.4 వేలు పింఛన్ తీసుకునేవారు కాంగ్రెస్కు, బీఆర్ఎస్ హయాంలో రూ.2 వేలు పెన్షన్ తీసుకున్నోళ్లు కారు గుర్తుకు ఓటేయాలని తాండూరు ప్రజలకు చెప్పమని పంపించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోనియాగాం«దీపై ఒట్టేసి రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారని.. ఫిబ్రవరి వచ్చినా రైతులకు పెట్టుబడి సాయం అందలేదన్నారు. రేవంత్రెడ్డి పాలనలో రైతులు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి ఎన్నికలకు ముందు పచ్చి అబద్ధాల వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కేటీఆర్ దుయ్యబట్టారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పైసలు పంపడంలో మాత్రమే సక్సెస్ అవుతున్నదని, రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తోందన్నారు. దొంగ, పోలీస్ కలిసి వర్ధన్నపేట ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజునుద్దేశించి విమర్శించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్పైనే కేసులు మోపుతున్నారని, నన్నేమైనా అంటే పడతానని..మా అయ్య జోలికి వస్తే మూడు భాషల్లో తిడతానన్నారు. ఎన్నికలు వచ్చినపుడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రోహిత్రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో అన్నీ స్కామ్లే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పట్టణాల్లో వీధిదీపాలను కూడా వెలిగించలేని మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి.. తన భాషతో వీధి రౌడీలా తయారయ్యారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పట్టణాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే, రేవంత్రెడ్డి మాత్రం కండ్లకు గంతలు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో పట్టణాల్లో దోమల నివారణకు ఫాగింగ్ జరగడం లేదని.. కేవలం ఫ్రాడింగ్ మాత్రమే చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక స్కీములు బంద్ అయ్యాయని, స్కామ్లు మాత్రం జోరందుకున్నాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, గడ్డపోతారం తదితర ప్రాంతాల్లో 15 కార్నర్మీటింగ్లు, రోడ్షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. తన తండ్రి వయసు ఉన్న కేసీఆర్ను పట్టుకుని కనీస గౌరవం లేకుండా, అతినీచమైన భాషను మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ను దూషిస్తే నిరుపేదల కడుపులు నిండవని, సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే పేదల కడుపులు నిండుతాయని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తున్న కేసీఆర్ను జైలులో పెడతామని కాంగ్రెస్ అంటోందని హరీశ్రావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల హామీలను అమలు చేస్తామని రేవంత్రెడ్డి రాసిచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందని హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఈ రెండున్నరేళ్ల పాలనలో కొత్త పథకాలు ఇవ్వకపోగా, బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను బంద్ చేశారని విమర్శించారు. సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు అన్నం పెట్టిన కేసీఆర్కు ఓటేస్తారా?, హామీల పేరుతో జనాలకు సున్నం పెట్టిన రేవంత్రెడ్డికి ఓటేస్తారో?.. ప్రజలు ఆలోచన చేయాలని హరీశ్రావు అన్నారు. అసలు ఎవరో.. నకిలీ ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూపాలపల్లిలో చేసిన వ్యాఖ్యలకు హరీశ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల హామీలను ఎగ్గొట్టిన రేవంత్రెడ్డినే నకిలీ అని అన్నారు. -
జిల్లాలను రద్దు చేయం.. కొత్తవి ఏర్పాటు చేయం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘పాత జిల్లాల మార్పు..కొత్త జిల్లాల ఏర్పాటుపై కొందరు విష ప్రచారం చేస్తున్నారు. జిల్లాలను తీసివేయం.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయం.. ఒకవేళ జిల్లాల పునర్విభజన చేయాల్సి వస్తే అసెంబ్లీలో చర్చకు పెడతాం. ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అబద్ధాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వారిని నమ్మొద్దని, భూపాలపల్లి జిల్లా ఎటూపోదని.. జిల్లాల మార్పులపై ఎవరూ అపోహ పడొద్దని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. హెలికాప్టర్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు, కొండా సురేఖతో ముందుగా రేగొండ మండలం కొడవటంచ గ్రామానికి చేరుకున్న సీఎం.. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ రూ.63 కోట్లతో ఆలయ పునరుద్ధరణ, గెస్ట్హౌస్ నిర్మాణ పనులను సురేఖ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం చెల్పూరులో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన–ప్రగతి బాట’బహిరంగ సభలో రేవంత్రెడ్డి ప్రసంగించారు. జిల్లాల పునర్విభజనపై అందరి అభిప్రాయాలు తీసుకొని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే దీనిపైన ఆలోచిస్తామని, కుట్రలు, కుతంత్రాలతో విష ప్రచారం చేస్తున్న వారిని గమనించాలని పునరుద్ఘాటించారు. ఆ ముగ్గురి అరెస్ట్కు కిషన్రెడ్డే అడ్డు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కల్వకుంట్ల కిషన్రావుగా మారి కేసీఆర్ను అరెస్టు చేయకుండా అడ్డుపడుతున్నాడని రేవంత్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులను అరెస్ట్ చేసే వరకు కిషన్రెడ్డిని కల్వకుంట్ల కిషన్రావనే పిలుస్తానని స్పష్టం చేశారు. రూ.వేల కోట్ల ఆస్తులను పేదలకు దానం చేసిన సోనియా, రాహుల్గాం«దీని సీబీఐ, ఈడీ కేసుల పేరుతో వేధించి అమానించలేదా? గాంధీ కుటుంబంపైన ఈడీ, సీబీఐని ఉపయోగిస్తున్నప్పుడు కాళేశ్వరంపైన సీబీఐ విచారణకు పంపిస్తే ఎవరు అడ్డుకుంటున్నారు’అని ప్రశ్నించారు. ఫెవికాల్ బంధంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావును కిషన్రెడ్డి కంచె వేసి కాపాడుతున్నాడన్నారు. కేసీఆర్కు కేటీఆర్ సొంత కొడుకైతే.. కిషన్రెడ్డి దత్త పుత్రుడని చెప్పారు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ‘ఇందిరమ్మ’ ఏప్రిల్ తర్వాత రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు అందజేస్తామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. వచ్చే బడ్జెట్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం’అని స్పష్టం చేశారు. ‘కేసీఆర్, మోదీని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ చెబుతున్నాయి. గల్లీలో మోరీలు కేసీఆర్ వచ్చి తీస్తాడా? కేసీఆర్, మోదీ బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికి వస్తారు.. పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తే సంసారం ఆగం అవుతుంది’అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఎర్రవెల్లి పాంహౌస్లో బోర్లబొక్కల పడుకున్న కేసీఆర్ నిధులు ఇవ్వడని అన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.17,442 కోట్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు పర్యాటక ప్రాంతాన్ని రూ. 3, 4 వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు. సింగరేణిపై అపోహలు వద్దు.. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు రద్దు చేస్తారని విష ప్రచారం చేసే వారిని మోకాళ్లపై కూర్చొబెట్టాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. సింగరేణి కార్మీకులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ‘బీఆర్ఎస్ను ఇక నుంచి బ్లాక్మెయిల్ రాజకీయ సమితి అని పిలుస్త. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి రూ. వందల కోట్లు దోచుకున్నారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ. 1,500 కోట్లు ఎవడబ్బ సొమ్ము’అని రేవంత్ ప్రశ్నించారు. అక్కలు దసరా రోజు పాలపిట్టల్లా ఉన్నారు.. ‘మా అక్కలు దసరా పండుగ రోజు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు. బతుకమ్మ చీరలను బాయికాడ పిట్టలను బెదిరించడానికి కట్టారు.. ఇందిరమ్మ చీరను సారె రూపంలో మీ తమ్ముడు పెట్టాడు.. ప్రతి ఏడాది ఇందిరమ్మ చీరను తప్పకుండా ఇస్తాం’అని రేవంత్రెడ్డి అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు ఎంపీ కడియం కావ్య, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సిరిసిల్ల రాజయ్య, ఐత ప్రకాశ్రెడ్డి, జనక్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
FSL అగ్నిప్రమాదంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో అగ్నిప్రమాదం జరిగేలా కుట్ర జరిగిందన్నారు. ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదం సీఎం రేవంత్ పనే. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అంతా బిజీగా ఉండగా ఈ కుట్రలు. పక్కా ప్రణాళికతో ఆధారాలు మయం చేసేందుకు ఇలా చేశారు.తాను తప్పించుకోవడానికి మిగతా కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా దెబ్బతినేలా చేశారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ తూతూ మంత్రంగా వివరణిచ్చారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
‘బీజేపీ, బీఆర్ఎస్ రెండూ బొమ్మ-బొరుసులే’
భూపాలపల్లి: ఫోన్ల ట్యాపింగ్తో బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు సంపాదించారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ఫోన్ల ట్యాపింగ్ కేసుల నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్కు బీజేపీకి సహకరిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్లు రెండూ బొమ్మ-బొరుసు లాంటి పార్టీలని మండిపడ్డారు. ఇక భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారనే వార్తలపై సీఎం రేవంత్ స్పందించారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మారింది. కాంగ్రెస్ అభివృద్ధితోనే భూపాలపల్లి ఈ స్థాయికి చేరింది. భూపాలపల్లి ఎక్కడికి పోదు.. తప్పుడు ప్రచారం నమ్మొద్దు. మరొకవైపు మెడికల్ బోర్డు రద్దు అవుతుందనే విషం ప్రచారం కూడా మొదలుపెట్టారు. మెడికల్ బోర్డు రద్దు ఆలోచన ప్రభుత్వ దృష్టిలో లేదు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు’ అని సీఎం రేవంత్ హెచ్చరించారు. -
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉన్న జిల్లాలను తొలగించేది లేదు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేది లేదు. జిల్లాల పునర్వవస్థికరణ కోసం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆ తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దు’ అని సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.గత జనవరిలో సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) డైరీ ఆవిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ విభజన కోణంలో ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజల అభీష్టం మేరకు హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పట్లో అడ్డగోలుగా విభజన ‘గత ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించింది. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉన్నాయి. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన అడ్డగోలుగా జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం అని కాదు కానీ రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి..ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్లో ఎంత ఉండాలి, ఒక జిల్లాలో ఎంత ఉండాలనేది నిర్ణయించాలి. ప్రస్తుతం ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లాలో కోటి జనాభా ఉంది. ఇలాంటప్పుడు పరిపాలన ఏవిధంగా చేస్తారు? ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఒక లీడర్ తనకు నచ్చిన 3, 4 గ్రామాలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకుంటే... మరొకాయన 2, 3 ఎంపీటీసీలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మేడ్చల్ జిల్లా పరిషత్ సమావేశానికి వెళ్లా. వేదికపై చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. మరొకాయన రాలేదు. నాకు ఎవర్ని చూసి మాట్లాడాలో అర్థం కాలేదు. జిల్లా ఈ విధంగా ఉంటే ఎలా? ఇలాంటి తప్పిదాల వల్ల పాలనపై నమ్మకం పోతుంది. దీన్ని సరి చేయాలి..’ అని సీఎం అన్నారు. తొలుత మండలాల హేతుబద్ధీకరణ ‘ముందుగా మండలాలను హేతుబద్ధీకరించాలి. మండలంలో 10 శాతం ఎక్కువ జనాభా లేదా తక్కువ.. రెవెన్యూ డివిజన్, జిల్లాల్లో కూడా ఇదే ఫార్ములాతో విభజన జరగాలి. దీనిపై అసెంబ్లీలో డిబేట్ పెడతాం. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. మార్గదర్శకాలు రూపొందిస్తాం. కూలంకషంగా చర్చించిన తర్వాతే విధివిధానాలు ఖరారు చేసి నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ పద్ధతిలో వీటిని హేతుబద్ధీకరించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఇందుకోసం ప్రత్యేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్ను ఏర్పాటు చేస్తాం. ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు సంబంధిత అధికారులంతా సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్నెల్లు పర్యటించి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తాం’ అని రేవంత్ తెలిపారు. -
అబ్బో.. తులం బంగారం ‘లక్షా డెబ్బై’..
సిరిసిల్ల టౌన్: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తనదైన శైలిలో నవ్వులు పూయించారు. స్థానిక శాంతినగర్ చౌరస్తాలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా, కొందరు మహిళలు ఆయనను చుట్టుముట్టి ‘తులం బంగారం ఎక్కడ?’ అంటూ సూటిగా నిలదీశారు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు నేతలు సీరియస్ అవుతుంటారు.. కానీ వీహెచ్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ‘అబ్బో.. ఇప్పుడు తులం బంగారం ధర రూ. 1.70 లక్షలైంది!’.. అంటూ చమత్కరించడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే మెజారిటీ హామీలను అమలు చేశామని గుర్తు చేస్తూనే, తులం బంగారం, రూ.2500 పెన్షన్ అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మహిళలకు భరోసా ఇచ్చారు. -
అంతా తుస్సే.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్: హరీష్ సెటైర్లు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అన్నం పెట్టిన కేసీఆర్ కావాలా.. నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్ కావాలా? అని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు తప్ప కాంగ్రెస్ పాలన అంతా 'తుస్సు'.. భర్తలకు డబల్ టికెట్ బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరువు నియోజకవర్గంలోని గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించారు. కార్నర్ మీటింగ్స్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అవినీతి చిట్టాను, స్కామ్ క్యాలెండర్ని బయటపెట్టారు. ఈ సందర్బంగా హరీష్ మాట్లాడుతూ.. తల్లి చేతిలో బిడ్డ ఎంత పదిలంగా ఉంటుందో.. కేసీఆర్ చేతిలో తెలంగాణ అంత పదిలం. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం చిమ్ముతున్నాడు.. బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతాడు. నాడు కేసీఆర్ పాలనలో జాబ్ క్యాలెండర్.. నేడు రేవంత్ పాలనలో స్కామ్ క్యాలెండర్.జనవరి: సివిల్ సప్లైస్ స్కామ్ఫిబ్రవరి: ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్మార్చి: సాండ్ స్కామ్ఏప్రిల్: ఆర్టీసీ స్కామ్మే: బామ్మర్దికిచ్చిన అమృత్ టెండర్ల స్కామ్జూన్: ఫోర్త్ సిటీ స్కామ్జూలై: లగచర్ల, సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్ఆగస్టు: పీజీ మెడికల్ సీట్ల స్కామ్సెప్టెంబర్: HILTP ఇండస్ట్రియల్ స్కామ్అక్టోబర్: పవర్ స్కామ్నవంబర్: సింగరేణి స్కామ్డిసెంబర్: ముఖ్యమంత్రి & KLSR స్కామ్. ఇలా రాష్ట్ర సంపదను, దళితుల భూములను రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడు.కాంగ్రెస్ అంటేనే కరెంట్ కష్టాలు.. మళ్ళీ పవర్ హాలిడేలతో కార్మికుల పొట్ట కొడుతున్నారు. గడ్డపోతారంలో బస్తీ దవాఖాన, ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత నాది. గుమ్మడిదలను మున్సిపాలిటీ చేసి ఉపాధి హామీ పని లేకుండా చేశారు.. డంప్ యార్డ్ తెచ్చి డంపింగ్ చేస్తున్నారు. మొదటిసారి మున్సిపాలిటీ అయిన గడ్డపోతారంలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి. ఇక్కడ బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి మంచి వైద్యాన్ని అందిస్తాం. ప్రతి ఇంటికి నల్లా నీళ్లను అందించే బాధ్యత మాది. పేదలకు ఇళ్ల స్థలాలు, రోడ్లు, మోరీలు కట్టించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది.రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం...గాడిదల ఓట్లు మాకు వద్దు అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు. ప్రజలను గాడిదలు అంటావా? నువ్వే ఒక అడ్డ గాడిదవు.. నువ్వే పెద్ద గాడిదవు. రేపు ఎన్నికల్లో ఎవరైనా నీకు ఓటేస్తారా? కేసీఆర్ ఉన్నప్పుడు ల్యాండ్ రేట్లు పెరిగాయి, నువ్వు వచ్చాక పడిపోయాయి. బచ్చుగూడెంలో రూ. 7.50 కోట్లతో రోడ్డు వేసి భూముల విలువ పెంచింది కేసీఆర్ కాదా? ప్రతినెలా ఒక స్కామ్.. ఇదీ రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఇచ్చిన స్కామ్ క్యాలెండర్. అసెంబ్లీలో రేవంత్ గల్లా పట్టి రైతుల గోస వినిపించాలంటే కారు గుర్తు గెలవాలి. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధం. నోరు తెరిస్తే మోసం. రైతుల రుణమాఫీ అని ఒట్టేసి మోసం చేశాడు. విషయం ఉన్నోడు విషం చిమ్మడు. రేవంత్ రెడ్డి దగ్గర విషయం లేదు కాబట్టే.. తెలంగాణ తెచ్చి, బాగు చేసిన కేసీఆర్ గారి మీద విషం చిమ్ముతున్నాడు. కరోనా కష్టకాలంలో కూడా నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్కు చెప్పి రైతు బంధు వేయించాను’ అని చెప్పుకొచ్చారు. -
ఏనాటికైనా కాంగ్రెస్ పుట్టి ముంచెటోడే...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/సిరిసిల్ల: ‘రేవంత్ బీజేపీ మనిషే.. బడేభాయ్ తమ్ముడే.. ఏనాడూ కాంగ్రెస్ మనిషి కాలేడు.. ఏనాటికైనా కాంగ్రెస్ పుట్టి ముంచెటోడే.. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కేసీఆర్ను తిట్టుడే పనిగా పెట్టుకుండు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డితోపాటు, సిరిసిల్లలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు రోడ్షోలు, ర్యాలీలు నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్లలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను తిట్టడానికే సమయం వెచ్చిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఫ్రీ బస్సు ఒక్కటి ఇచ్చి సీటు, గౌరవం లేకుండా చేసి మగవాళ్ల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తుండని విమర్శించారు. స్టూవర్టుపురం దొంగలుకాంగ్రెసోళ్లు ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామని ఓట్లేయించుకున్నారని, ఎక్కువ అడిగితే మెడలో ఉన్న పుస్తెలు లాక్కెళ్లే దండుపాళ్యం, స్టూవర్టుపురం దొంగల ముఠాలుగా తయారయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఐదేళ్లు మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్గా అవకాశమిచ్చి బాన్సువాడ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఇచ్చిన కేసీఆర్ను, కారు గుర్తుపై ఓటేసి గెలిపించిన ప్రజలను దగా చేసి రేవంత్రెడ్డి కింద చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డికి రోషముంటే రాజీనామా చేయాలని కేటీఆర్ సవాల్ చేశారు. పార్టీ మారిన పోచారంపై చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్కు ఫిర్యాదు చేస్తే, తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పాడని, మరి బీఆర్ఎస్లో ఉంటే ఈ వేదిక మీద తన పక్కన ఎందుకు లేడని ప్రశ్నించారు. కులం.. మతం బువ్వ పెట్టవు‘బీడీ కార్మికులు తంబాకు వాసనతో ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా కుటుంబ పోషణకు మగవాళ్లకు తోడుగా కొంతైనా సంపాదించాలని శ్రమిస్తారు. చిన్నప్పుడు దుబ్బాకలో ఓ శాలోళ్ల ఇంట్లో ఉండి చదువుకున్న కేసీఆర్కు బీడీకార్మికుల బాధలన్నీ తెలిసే రూ.2 వేలు ఆసరా పెన్షన్ను కల్పించాడు’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కులం, మతం బువ్వ పెట్టవని, మంచి గుణం ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే.. మంచి జరుగుతుందన్నారు. మా కులపోడు.. మా మతపోడు అని ఎన్నికల్లో ఓట్లు వేయొద్దన్నారు. సిరిసిల్లలో నేతన్నల ఆత్మహత్యలు ఆగాలని, వాళ్ల బతుకుల్లో మార్పు రావాలని బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తే.. కాంగ్రెసోళ్లు బతుకమ్మ చీరలను బంద్ చేసి నేతన్నల బతుకులను ఆగం చేశారన్నారు. ‘నా మీద కోపంతో రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేస్తారట.. మనకు జిల్లాలు వద్దా.. పాలన ప్రజలకు చేరువ కావద్దా..’ అని అడిగారు. తొండి సంజయ్ ఏం చేశారు?కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్కి తొండి సంజయ్ అనే పేరు సరిగ్గా సరిపోతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి.. సిరిసిల్లకు ఏమైనా చేశాడా? రాష్ట్రానికి ఏమైనా తెచ్చాడా? అని ప్రశ్నించారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడం తప్ప ఏమీ చేయలేదన్నారు. మనకు మంచి చేసే వాళ్లకే ఓట్లు వేయాలని, మోసం చేసే వాళ్లకు కాదన్నారు. పలువురు నాయకులు ఇతర పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరగా.. కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయా సభల్లో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్షిందే, జాజాల సురేందర్, బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.బాన్సువాడలో కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న కేటీఆర్ -
కేసీఆర్ది ఉద్యమ చరిత్ర.. రేవంత్ది ద్రోహ చరిత్ర
జిన్నారం (పటాన్చెరు)/గజ్వేల్: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ది ఉద్యమ చరిత్ర అయితే, ముఖ్యమంత్రి రేవంత్ది ద్రోహ చరిత్రని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో శనివారం జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎంగా ఉంటూ.. ఆంధ్రప్రదేశ్కు మన నీళ్లు తాకట్టు పెడుతున్న ద్రోహి అని విమర్శించారు.చంద్రబాబుతో దోస్తీ కట్టి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్రెడ్డి మాటలు నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని హరీశ్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఘర్షణసిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఆర్అండ్ఆర్ కాలనీలో శనివారం కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కాలనీలోని ఏటిగడ్డకిష్టాపూర్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు మాజీ మంత్రి హరీశ్రావు వస్తున్నారనే సమాచారంతో ఆ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు పోటీగా నినాదాలు చేశారు.ఈ ఘటన నేపథ్యంలో హరీశ్రావు ఆర్అండ్ఆర్ కాలనీకి రాకుండానే తూప్రాన్కు వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డిలు ఇక్కడికి చేరుకొని సభను కొనసాగించే ప్రయత్నం చేస్తుండగా... కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం చెప్పులు విసురుకుంటూ బాహాబాహీకి దిగారు. ఏసీపీ నర్సింహులు, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. -
‘ప్రాణహిత – చేవెళ్ల’ను పునరుద్ధరిస్తాం
వికారాబాద్: దివంగత సీఎం వైఎస్సార్ డిజైన్ చేసి, శిలాఫలకం వేసిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పిన సబితమ్మ కేసీఆర్తో ప్రాణహిత– చేవెళ్లను ఎందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నించారు. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి అధ్యక్షతన వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణ్పూర్ శివారులో శనివారం నిర్వహించిన ‘ప్రజాపాలన– ప్రగతి బాట’ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జిల్లాకు 300 టీఎంసీల నీరు ఇవ్వటానికి చేతకాలేదా..? ప్రాజెక్టు డిజైన్ మార్చి ఉమ్మడి జిల్లా పొలాలను ఎండబెడుతుంటే సబితమ్మ ఏం చేశారని ఎద్దేవా చేశారు.పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలోనే భూసేకరణ చేపడతామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఓ పక్క బీజేపీ, బీఆర్ఎస్లపై ఘాటైన విమర్శలు చేస్తూనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ఉమ్మడి జిల్లాకు నీరందించేందుకు దివంగత నేత వైఎస్సార్ ప్రాజెక్టులు మంజూరు చేస్తే.. కేసీఆర్ రద్దు చేశాడని విమర్శించారు. గోదావరి జలాలను తెచ్చి చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. అనంతగిరిలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసేందుకు ఓ సంస్థతో ఇప్పటికే ఎంఓయూ కుదుర్చుకున్నామని సీఎం రేవంత్ తెలిపారు. వికారాబాద్ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లా మీదుగా ట్రిపుల్ఆర్ నిర్మించటంతోపాటు ఓఆర్ఆర్ టు జిల్లా వరకు రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. వారివి చీకటి ఒప్పందాలు ‘బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు ఎవరికి తెలియనివి? బీజేపీ వాళ్ల బీ ఫారంలు బీఆర్ఎస్ ఆఫీసులో ఇస్తున్నారు. ఇది తాండూరులో రుజువైంది’అని సీఎం రేవంత్ అన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి..కల్వకుంట్ల కిషన్రావు అని రాసుకుంటే బాగుంటుందని చెప్పారు. కేసీఆర్ అన్ని వర్గాలను వంచించారని, ఆయన ఎస్సీలను సీఎం చేస్తానని వంచిస్తే, మేము ప్రసాద్కుమార్ను స్పీకర్ చేశాం.. ఆ సామాజిక వర్గాలకు మంత్రి పదవులిచ్చామని సీఎం స్పష్టం చేశారు. చెరిగిపోని నీచ చరిత్ర కేసీఆర్ది..కేసీఆర్ చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్రావు, కేటీఆర్ తనను విమర్శిస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ‘కేసీఆర్ది దొంగనోట్లు, పాస్పోర్టు బ్రోకర్ల చరిత్ర .. ఆ చరిత్ర నేను చెరిపేస్తే పోయేదా? కేసీఆర్పై దొంగనోట్ల కేసు నమోదైందని మీ పక్కన ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్కుమారే చెప్పిండు. తెలంగాణ చరిత్ర ఉన్నంత కాలం పాపాల భైరవుడి చరిత్ర చెరిపినా చెరిగిపోదు.. ఆ చరిత్ర చెరిగిపోకుండా చూసే బాధ్యత నాది. కావాలంటే ఆ చరిత్రను మావాళ్లకి చెప్పి గోడలపై రాయించి భద్రపరుస్తా’అని సీఎం ఎద్దేవా చేశారు. రంజిత్రెడ్డిని మున్సిపల్ మంత్రిని చేస్తా..చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో రంజిత్రెడ్డిని గెలిపించి ఉంటే ఢిల్లీలో మన బలం పెరిగి ఉండేదని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అయినా, రంజిత్రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రభుత్వం నుంచి మీకు అండగా నిలబడతారని స్పష్టం చేశారు. మున్సిపాలిటీల అభివృద్ధిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఇస్తామన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిని చేసి ఈ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్బాబు, శాసనమండలి చీఫ్ విప్ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్, కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ కాంగ్రెస్ కాదు.. బీజేపీ మనిషి: కేటీఆర్
సాక్షి, బాన్సువాడ: మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. అధికార కాంగ్రెస్పై ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు.. బీజేపీ మనిషి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.జుక్కల్ నియోజకవర్గం బాన్సువాడ(బిచ్కుంద మున్సిపాలిటీ) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉచిత బస్సు పేరిట మహిళలను మోసం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశాడు రేవంత్. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది, ఒక్క హామీ అయినా నేరవేరిందా?. కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.ఒక ఆంబోతు రెండు దున్నపోతులంటూ పోచారం బండ కట్టుకొని బాయిలో దూకలే అంటూ ఎద్దవా చేశారు. పోచారానికి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. కాంగ్రెస్ నేతలందరూ స్టువర్టుపురం దొంగలే. కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బంగారు తెలంగాణ అయింది. ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. -
నాంపల్లి అగ్ని ప్రమాదం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో కీలక ఫైల్స్ కాలిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో అగ్నిప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్.. అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని సందేహం వ్యక్తంచేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మొత్తం ల్యాబ్ కాలిపోతుంది.. ఏ ఆధారాలు నాశనం చేశావు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.I am guessing the voice recordings of the famous “Vote for Note” case And trying to cover up for lack of evidence in cooked up political cases like Phone Tapping https://t.co/7bKa4lGAwj— KTR (@KTRBRS) February 7, 2026ఇదిలా ఉండగా.. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL)లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లో తొలుత మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి. అగ్నిప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు.ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలున్న తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ అగ్నిప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారంనేర పరిశోధనకు సంబంధించిన ఫైలు ఎవిడెన్స్ ల్యాబరేటరీ మొత్తం ఇక్కడి నుండే ఆపరేషన్ జరుగుతుందిఏ ఫైల్స్ తగలబడ్డాయో ఇంకా స్పష్టత లేదుషార్ట్ సర్క్యూట్… https://t.co/4w0yY1tB17 pic.twitter.com/TrUmEPqY4Z— Telugu Scribe (@TeluguScribe) February 7, 2026అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలనున అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కాగా, ప్రమాదం గురించి తెలియగానే నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ల్యాబ్కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ల్యాబ్లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైనా దెబ్బతిన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టంపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. -
వారిదే ఫెవికాల్,ఫెవిక్విక్ బంధం
సాక్షి.హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఫెవికాల్, ఫెవిక్విక్ బంధం ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైందని, నేటికీ కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు వ్యాఖ్యానించారు. గతంలో ‘ఓటుకు కోట్లు’కేసులో రేవంత్రెడ్డిని కేసీఆర్ కాపాడితే, నేడు కాళేశ్వరం అవినీతి విషయంలో కేసీఆర్ను రేవంత్ కాపాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బరాజ్లు కూలినపుడు కేవలం వాటి పైనే జస్టిస్ ఘోష్ కమిషన్ను వేసి రేవంత్ చేతులు దులుపుకున్నారని, అయితే కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోందని చెప్పారు.శుక్రవారం బీజేపీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సహ ఇన్చార్జిలు అశోక్ పర్మాణి, రేఖాశర్మ, మాజీ ఎంపీ పి.రాములు, పార్టీ నేతలు డా.ఎన్.గౌతమ్రావు, ఎన్వీ సుభాషలతో కలిసి.. ‘వికసిత్ తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం’పేరిట మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార గీతాన్ని కూడా వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడారు. కమీషన్ల సర్కార్ నడిపిస్తున్నారు.. ‘ఈ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందనే పూర్తి నమ్మకం ఉంది. బీజేపీ విజయం తథ్యమని తెలుసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అసహనంతో మాట్లాడుతున్నారు. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని సీఎం రేవంత్ అంటున్నారు. జిల్లాల వారీగా ఎంతెంత ఇచ్చామో చిట్టా మా వద్ద ఉంది. రాష్ట్ర బడ్జెట్లో ఏ జిల్లాకు ఎంత నిధులు ఇచ్చారో రేవంత్ చెప్పగలరా? ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో కమీషన్లు తీసుకుంటూ కమీషన్ సర్కార్ నడిపిస్తున్నారు..’అని రాంచందర్రావు విమర్శించారు. కేంద్రంలో మా సర్కార్ ఉందని మరిచిపోవద్దు ‘మా పార్టీ కార్యకర్తలపై పోలీసులు అనవసర కేసులు, దాడులు, బెదిరింపుల వంటి అరాచకాలకు పాల్పడితే బీజేపీ చూస్తూ ఊరుకోదు. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉందని పోలీసులు మరిచిపోవద్దు. జాతీయ మానవహక్కుల కమిషన్ వద్దకు లాక్కెళ్లి నిలబెడతాం. శనివారం మంచిర్యాలలో ఎన్నికల ప్రచారానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వస్తుంటే.. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థులను కొట్టి, బెదిరించి ఉపసంహరింపజేసిన ఉదంతాలను సీరియస్గా తీసుకుంటాం. కర్ణాటకలో మాదిరిగా హేట్స్పీచ్ యాక్ట్ (విద్వేషపూరిత వ్యాఖ్యల చట్టాన్ని)ను బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ తెలంగాణలోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చట్టాన్ని తీసుకొస్తే ముందుగా సీఎం రేవంత్రెడ్డిపై మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టినందుకు కేసులు పెట్టాల్సి వస్తుంది..’అని రాంచందర్రావు అన్నారు. బీజేపీ ప్రధాన హామీలివే.. ⇒ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదు ⇒ ఆన్లైన్, సింగిల్ విండో సిస్టం ద్వారా వారం రోజుల్లో ఇంటి అనుమతులు ⇒ ప్రతి వార్డు/డివిజన్లో బస్తీ దవాఖానాల బలోపేతానికి కృషి, చౌక ధరల్లో మందులు ⇒ అర్హత కలిగిన మున్సిపాలిటీలు/కార్పొరేషన్లను స్మార్ట్ సిటీలుగా ప్రకటించేలా కేంద్రాన్ని ఒప్పిస్తాం ⇒ మున్సిపాలిటీ/కార్పొరేషన్లను గ్రీన్ టౌన్/క్లీన్ సిటీలుగా తీర్చిదిద్దుతాం ⇒ అన్ని చోట్లా 100% భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ.. షీ టీమ్స్ వ్యవస్థ బలోపేతం ⇒ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, క్రమం తప్పకుండా జాబ్ మేళాలు ⇒ ఏఐ సాంకేతికత సహకారంతో అవినీతి రహితంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ⇒ 100% ఇంటింటి చెత్త సేకరణ, సమర్థవంతంగా వ్యర్థాల నిర్వహణతో చెత్త రహిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు -
రేవంతుద్దీన్ అంటే నాకు సంతోషమే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నన్ను రేవంతుద్దీన్ అని ముస్లిం పేరుతో పిలిచారు. ఈ పిలుపును నేను సంతోషంగా స్వీకరిస్తా. అయితే రాంచందర్రావు పక్కన కూర్చున్న కిషన్రెడ్డి మాత్రం కల్వకుంట్ల కిషన్రావుగా మారి కేసీఆర్ను జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నారు. కేసీఆర్కు కేటీఆర్ అనే దొంగ పుత్రుడు ఉండగా, కేంద్రమంత్రి కిషన్రెడ్డి కల్వకుంట్ల కిషన్రావు దత్తపుత్రుడిగా మారాడు.ఈ దత్తపుత్రుడు కేసీఆర్, హరీశ్రావులను కాపాడుతున్నాడు. గతంలో మోదీ రాష్ట్రానికి వచి్చనప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ను ఆరు నెలల్లో జైలుకు పంపుతామని చెప్పిన కిషన్రెడ్డి ఇప్పుడు ఏ బొక్కలో దాక్కున్నాడు?..’అంటూ సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. కిషన్రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును కోరుతున్నా అని అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కేశాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ను ఎప్పుడు జైలుకు పంపుతారు? ‘కేసీఆర్ను ఎప్పుడు జైలుకు పంపుతారని కిషన్రెడ్డి, ఎంపీ అరి్వంద్లను ప్రశి్నస్తున్నా. కేసీఆర్, హరీశ్రావులను జైల్లో పెట్టి చిప్ప కూడు తినిపించాలని «ఎంపీ ధర్మపురి అరి్వంద్ అంటుంటారు. మేం కాళేశ్వరం విషయమై శాసనసభలో చర్చ పెట్టి కేసును సీబీఐకి ఇచ్చాం. ఇప్పటివరకు సీబీఐ పట్టించుకోలేదు. కేసీఆర్, హరీశ్రావులను చర్లపల్లి జైలులో పెట్టకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? దీనిపై ధర్మపురి అరి్వంద్ ఎందుకు మాట్లాడరు?..’అని సీఎం ప్రశ్నించారు. అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ వెళ్తా.. ‘బ్రిటిష్ హయాం తర్వాత 100 ఏళ్ల వరకు బీసీ కులగణన జరగలేదు. ఇప్పుడు కులగణన చేసినందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ నన్ను గతంలో రేవంత్గౌడ్ అని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపడంతో మంత్రి దామోదర రాజనర్సింహ రేవంత్ మాదిగ అన్నారు. 30 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన వాకిటి శ్రీహరిని మంత్రిని చేస్తే ముదిరాజ్ వర్గం నన్ను రేవంత్ ముదిరాజ్ అని వ్యాఖ్యానించింది. అనిల్కుమార్ యాదవ్ను రాజ్యసభకు పంపిస్తే రేవంత్ యాదవ్ అని పిలిచారు. స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తానన్నందుకు సిక్కు సోదరులు సర్దార్ రేవంత్ సింగ్ అని పిలిచారు.ఇవన్నీ నాకు సంతోషం కలిగించాయి. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఆ వర్గానికి అనేక పదవులు ఇచి్చంది. షబ్బీర్ అలీ నిజామాబాద్లో గెలవకపోయినా పదవి ఇచ్చాం. ఎమ్మెల్యేగా ఓడిపోయినా అజహరుద్దీన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నాం. 8 మంది మైనారిటీ నాయకులకు కార్పొరేషన్ పదవులు ఇచ్చాం. కాబట్టి రాంచందర్రావు నన్ను రేవంతుద్దీన్ అని పిలిచినా సంతోషంగా తీసుకుంటా. నాకు ఎలాంటి సమస్య లేదు. అన్ని కులాలు, మతాలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తా. తెలంగాణను నంబర్ వన్గా తయారు చేస్తా..’అని ముఖ్యమంత్రి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లది వీణావాణి బంధం ‘కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్లలో ఒక్క రేషన్కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చాం. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.500లకే 50 లక్షల కుటుంబాలకు సిలిండర్ ఇస్తున్నాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. సన్న ధాన్యానికి రూ.500 బోనస్ అమలు చేస్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరికి ఓటేసినా మూసీలో వేసినట్లే. ఈ రెండు పార్టీలది వీణావాణి బంధం.. ఫెవికాల్ బంధం..’అని సీఎం విమర్శించారు. నేను, మహేశ్గౌడ్ జోడెద్దుల్లా పనిచేస్తున్నాం.. ‘నేను, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ జోడెద్దుల్లాగా కలిసి పని చేస్తున్నాం. వైఎస్ రాజశేఖర్రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్ సారథ్యంలో 2004, 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 2023లో నేను పీసీసీ అధ్యక్షుడిగా, మహేశ్గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చాం. 2028లోనూ నేను సీఎంగా, మహేశ్గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా ఎనిమిదేళ్లు అధికారంలో ఉంటుంది..’అని రేవంత్ చెప్పారు. ఈ సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ. ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


