breaking news
Revanth Reddy
-
చిత్ర పరిశ్రమ కోసం ప్రత్యేక వెబ్సైట్: దిల్ రాజు
సినీ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ విండో ద్వారా ఒక సినిమాకు కావాల్సిన అనుమతులన్నీ ఇచ్చేలా ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ పేరుతో ఒక వెబ్సైట్ రూపొందించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సినిమా షూటింగ్ అనుమతులకు, థియేటర్స్ నిర్వహణలకు పొందాల్సిన అనుమతల్ని ఈ వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఈమేరకు హైదరబాద్లో ప్రత్యేక వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్రాజుతో పటాఉ ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్.ప్రియాంక, టూరిజం కార్పొరేషన్ ఎండీ క్రాంతి పాల్గొన్నారు.తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో సానుకూలంగా ఉన్నారని దిల్ రాజు చెప్పారు. సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్తో వచ్చినా సరే వారి సినిమాకు కావాల్సిన షూటింగ్ లొకేషన్లతో పాటు అందుకు కావాల్సిన అనుమతులు సింగిల్ విండో ద్వారా లభిస్తాయన్నారు. సినిమా థియేటర్ల నిర్వహణకు కావాల్సిన బీ-ఫామ్ను చాలా సులువుగా ఆన్లైన్ ద్వారా పొందేలా కొత్త విధానాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ఆయన అన్నారు. థియేటర్ల నిర్వహణ కోసం ఇప్పటి వరకు ఉన్న పద్ధతుల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్సైట్ను రూపొందించేందుకు చిత్ర పరిశ్రమ ప్రతినిధుల నుంచి పలు సలహాలతో పాటు సూచనలు తీసుకుంటామన్నారు. వెబ్సైట్ను పూర్తి స్థాయిలో రూపొందించాక సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో ప్రారంభిస్తామని దిల్ రాజు అన్నారు. -
స్వయంగా పర్యవేక్షిస్తా
సాక్షి హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు చాలా అవసరమని, పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా గెలిపించాల్సిన గురుతర బాధ్యత ఇన్చార్జిలపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం పార్టీ నాయకత్వం ఇప్పటివరకు చాలా బాగా పని చేసిందని, ఇకపై ప్రతీరోజూ కీలకమని, ఈ ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని వ్యవహారాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ఆయన వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆదివారం సాయంత్రం తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ, సాంస్కృతిక విభాగం చైర్మన్ వెన్నెల గద్దర్తో పాటు పార్టీ డివిజన్ ఇన్చార్జులుగా పనిచేస్తున్న కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్న ఈ సమావేశంలో.. ఉప ఎన్నికలో గెలుపునకు అవసరమైన కార్యాచరణపై ముఖ్యమంత్రి, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలి.. పార్టీ నేతలందరూ సమన్వయంతో పనిచేసి, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ సూ చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి చేరేలా కృషి చేయా లని ఆదేశించారు. ’జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచా రం చేయాలి. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించాలి. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది. అభ్యర్థి ఎవరైనా పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’ అని సీఎం స్పష్టం చేశారు. కాగా, ఈనెల 21వ తేదీ కల్లా నియోజకవర్గంలోని 407 పోలింగ్ బూత్లలో ప్రతి బూత్కు పదిమంది చురుకైన కార్యకర్తలను ఎంపిక చేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. -
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక ఏఐసీసీ చూసుకుంటుంది: సీఎం రేవంత్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశానికి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ఆదివారం(సెప్టెంబర్ 14వ తేదీ) జూబ్లీహిల్స్ ఎన్నికపై పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చిస్తున్నారు. దీనికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ ఇంచార్జ్ మంతరులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్లతో సర్వే ఏజెన్సీల నుంచి పలువురు హాజరయ్యారు. ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో అభివృద్ధి పనులు , అభ్యర్థి ఎంపిక పై మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ రేసులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్లు పోటీలు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై సీక్రెట్ సర్వే రిపోర్ట్ను సీఎంకు అందజేశారు పీసీసీ చీఫ్దీనిలో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి.కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుంది. అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి’ అని పేర్కొన్నారు.కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అంటున్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభవృద్ధి కోసం కృషి చేశానన్నారు. ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్. ‘నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి. అందులో భాగంగా నాకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలిఉమ్మడి ఏపీ నుండి యాదవ సామాజికవర్గంకి మంత్రి పదవి కేటాయించారు. నాకన్న సీనియర్లు ఎవరు లేరు....నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్న ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. జూబ్లీహిల్స్లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది’ అని పేర్కొన్నారు. -
‘చోటే భాయ్’ని కాపాడుతున్న ‘బడే భాయ్’.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు దాటినా కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురి మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయింది. ఇంకా కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా చెల్లించలేదంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదంటు కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్ని కాపాడుతున్నారంటూ దుయ్యబట్టారు.బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తాం. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు మేము సమాధానాలు రాబడతాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. More than 200 days since the Srisailam Left Bank Canal tunnel collapsed, killing 8 hapless workers due to the criminal negligence of the corrupt Revanth GovtThis inefficient Congress govt couldn’t even retrieve the bodies of 6 victims, and hasn’t paid any compensation to the… pic.twitter.com/Rl11OwVJvf— KTR (@KTRBRS) September 14, 2025 -
కృష్ణా జలాల్లో 904 టీఎంసీలే లక్ష్యం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటిని సాధించడమే లక్ష్యంగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కృష్ణా జలాలపై ఈ నెల 23, 24, 25 తేదీల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ వద్ద వాదనలు వినిపించాల్సి ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఎస్కే వోహ్రా, ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్దాస్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్బొజ్జా, కార్యదర్శి పీజీ పాటిల్, చీఫ్ ఇంజనీర్లతో శనివారం సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేశారు. కృష్ణానదిలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే.. తెలంగాణకు చెందాల్సిన నీటివాటాలో ఒక చుక్క నీరు కూడా వదులుకునేది లేదని సీఎం చెప్పారు. న్యాయ నిపుణులకు అవసరమైన ఆధారాలన్నీ ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. స్వయంగా మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని ముఖ్యమంత్రి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందు ఉంచాలని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంటన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్కు అందించాలని తెలిపారు. గత ప్రభుత్వంలో అన్యాయం... గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాను సాధించకపోగా, ఏపీకీ 512 టీఎంసీలు కట్టబెట్టి, 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందనే చర్చ ఈ సమీక్షలో వచ్చింది. అప్పటి సీఎం కేసీఆర్ 299 టీఎంసీల వాటాకు ఒప్పుకున్న విషయాన్ని ఏపీ ఇప్పుడు ట్రిబ్యునల్ముందుకు తెచ్చిందని న్యాయ నిపుణులు సీఎం రేవంత్కు ఈ సందర్భంగా వివరించారు. గడిచిన పదేళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటాను సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణానదిపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ పెండింగ్లో పెట్టిందని చెప్పారు. నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతోపాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణాలో 904 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని, అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీ అక్రమంగా నీటిని తరలించిన విషయంపై ... ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిందని, ఆ విషయాన్ని ట్రిబ్యునల్ముందుకు తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే, పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్స్కీమ్ద్వారా రోజుకు పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లిస్తుందని, ఇతర బేసిన్లకు తరలించుకుపోతోందన్నారు. ఎక్కడ పడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవటంతోపాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రిబ్యునల్కు నివేదించాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా మళ్లించటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్తో పాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ముంచుకొచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే జల విద్యుత్తు ఉత్పత్తికి విఘాతం కలుగుతోందని తెలిపారు. ఈ విషయాలన్నీ ట్రిబ్యునల్ ఎదుట వినిపించాలని సీఎం ఆదేశించారు. తెలంగాణకు అన్ని అర్హతలు.... కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కావటంతో తెలంగాణకు రావాల్సిన హక్కులు, నీటి వాటాలను సాధించుకునేందుకు అన్ని అర్హతలున్నాయని సీఎం అన్నారు. సాగునీటి, తాగునీటి అవసరాలతోపాటు మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతమైన ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణలో తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లనే కృష్ణా జలాశయాలను రాష్ట్రం వినియోగించుకోలేకపోయిందని గుర్తు చేయాలన్నారు. తెలంగాణ తరఫున వాదనలను వినిపించేందుకు ఇదే సరైన అవకాశమని సీఎం చెప్పారు. -
పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తికి సంపూర్ణ సహకారం
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు వేగవంతమైన, రైలు–రోడ్డు–పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసేలా రైల్వే ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్రెడ్డి దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను కోరారు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షించారు. వివరాలు సీఎం మాటల్లోనే.... పెండింగ్లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అవసరమైన నిధులను సమకూర్చటంతోపాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలి. దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలి. – రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉంది. – రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. దానికి అనుగుణంగా రైల్వేలైన్ ఏర్పాటు చేయాలి. రైల్వే విభాగ పరిశీలనలో ఉన్న అన్లైన్మెంట్తోపాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ను పరిశీలించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి. హైవే వెంట రైలుమార్గం ఉండాలి, హైవేకు ఇరువైపులా కిలోమీటరన్నర దూరం వరకు ఇండ్రస్టియల్ కారిడార్ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయి. – కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగుళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలి. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించటంతోపాటు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలి. – వికారాబాద్– కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలి. గద్వాల–డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా పనులు చేపట్టాలి. వరంగల్లోనూ రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలి. భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలి. కాజీపేట జంక్షన్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్తోపాటు వరంగల్ను అభివృద్ధి చేయాలి. అందుకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలి’అని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు సూచించారు. ఆర్ఆర్ఆర్ చుట్టూరా రీజనల్ రింగ్ రైల్ హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైల్వే అధికారులకు వివరించారు. దాదాపు 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటు చేస్తే.. హైదరాబాద్ మహానగర భవిష్యత్ స్వరూపం మారిపోతుందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ ఇండ్రస్టియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వేలైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్అండ్బీ స్పెషల్ సెక్రెటరీ వికాస్రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. -
మగువల మనసు దోచేలా బతుకమ్మ చీరలు
కరీంనగర్ అర్బన్: బతుకమ్మ పండుగకు చీరలొస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక పేరిట మహిళలకు చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ డిజైన్లలో చీరలను తయారు చేయగా.. ఒక్కో మహిళకు 2 చీరలు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ చేపట్టగా.. గత సంవత్సరం చీరల పంపిణీకి బ్రేక్ పడింది. తాజాగా చీరల పంపిణీకి శరవేగంగా సన్నాహాలు సాగుతున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. అతి వలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఎంగిలి పూల నాటి నుంచి మహిళలు చేసే సందడి కను ల విందే. ఉదయం వేళలో పూలు తేవడం.. బొడ్డెమ్మలను పేర్చడం.. సాయంత్రం వేళలో పాటల కో లాహలంతో బతుకమ్మను కీర్తించడం ప్రతీతి. జిల్లాలోని లోగిళ్లలో చిన్నారుల నుంచి మహిళా వృద్ధుల వరకు పండుగ వాతావరణం తొణికిసలాడుతుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, రంజాన్ పండుగలకు దుస్తులు పంపిణీ చేసినట్లే.. బతుకమ్మకు అత్యంత ప్రా ధాన్యమిస్తూ ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోంది.వివిధ రకాల డిజైన్లుగతానికి భిన్నంగా చీరలను తయారు చేయించారని అధికారులు చెబుతున్నారు. ఒక్కో చీరకు సుమారు రూ.500కు పైగా ఖర్చు కాగా.. మగువల మనసు దోచేలా పలు రకాల డిజైన్లను జోడించారు. బంగారు, వెండి జరి అంచు చీరలు, చెక్స్ డిజైన్లు ఈసారి ప్రత్యేకమని అధికారులు చెబుతున్నారు. అయితే చీరల పంపిణీ ఎపుడన్నది ఇంకా సందిగ్ధమే. ఈనెల 21 నుంచి ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభం కానుండగా.. వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈనెల మూడో వారంలో పంపిణీ చేస్తారని తెలుస్తుండగా.. ఎవరు అందజేస్తారన్నది తేలాల్సి ఉంది.నేడో, రేపో రానున్న చీరలుగతంలో రెవెన్యూ డివిజన్లవారీగా చీరలను వేరు చేసి మండలాలవారీగా సరఫరా చేయగా.. అక్కడి రేషన్ దుకాణాల డీలర్లు వారివారి జాబితా ప్రకారం చీరలను తీసుకొని పంపిణీ చేశారు. 2023లో గ్రామాల్లో ఐకేపీ సంఘాలు, పట్టణాల్లో మెప్మా సంఘాలు పంపిణీ చేశాయి. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పంచాయతీ సిబ్బంది సభ్యులుగా వ్యవహరించారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేశారు. ఆహార భద్రత కార్డులో పేరుండి 18 ఏళ్లు నిండిన మహిళలకు గతంలో చీరలను పంపిణీ చే యగా.. జిల్లాలో 2.72లక్షల కార్డుదారులకు అందజేశారు. గత ప్రభుత్వంలో సదరు ప్రక్రియలో పంపి ణీ జరగగా.. తాజాగా జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రా మీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండిన స్వయం సహా యక సంఘాల్లోని సభ్యులకు డీఆర్డీవో శాఖ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నారు. నేడో, రేపో కలెక్టరేట్కు చీరలు రా నుండగా.. అక్కడి నుంచి మండలాలు, గ్రామాలకు చేరనున్నాయి. వచ్చేవారం గ్రామాలు, పట్టణాల్లోని మహిళలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సంఘాల్లో ఉన్న సభ్యులకు రెండేసి చొప్పున పంపిణీ చేస్తారా.. రెండో విడతలో మరికొన్ని తెప్పిస్తారా అన్నది స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదేశాల క్రమంలో పంపిణీ జరుగుతుందని డీఆర్డీవో విభాగ అధికారులు వివరించారు. -
గాంధీ సరోవర్కు ‘రక్షణ’ భూములివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘గాంధీ సరోవర్’ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదలాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువల స్ఫూర్తిని చాటేలా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం భేటీ అయ్యారు. 98.20 ఎకరాలు కేటాయించండి మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ’నిర్మించ తలపెట్టామని, ఇందుకు గాను అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, మ్యూజియం, శాంతి విగ్రహం వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ల్యాండ్ స్కేపింగ్, ఘాట్లు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే వినోద ప్రదేశాలను కూడా అభివృద్ధి చేస్తామని రేవంత్ చెప్పారు. దీనిపై రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా ఈ సమావేశంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్కుమార్ రెడ్డి, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి కొత్త ‘దారులు’
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో రహదారి నెట్వర్క్ విస్తరణ, విద్యాభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర మంత్రులు నితిన్గడ్కరీ, నిర్మలా సీతారామన్ను మంగళవారం ఆయన వేర్వేరుగా కలిసి ఈ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. హైదరాబాద్ సమీపంలోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా బందరు ఓడరేవు వరకు 12 వరుసల రహదారి నిర్మించాలని నితిన్ గడ్కరీని కోరారు. ఈ ప్రతిపాదిత మార్గంలో 118 కిలోమీటర్లు తెలంగాణ పరిధిలో ఉంటుందని సీఎం వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) పనులను వేగవంతం చేయాలని కోరారు. శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించండి హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్లే మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా మన్ననూర్–శ్రీశైలం మధ్య నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సీఎం రేవంత్ ప్రతిపాదించారు. దీనితో పాటు రావిర్యాల–ఆమన్గల్–మన్ననూర్ మార్గాన్ని నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిగా, రద్దీ అధికంగా ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్–మంచిర్యాల మధ్య కొత్త గ్రీన్ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని కోరారు. సీఎం విజ్ఞప్తులపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. సీఆర్ఐఎఫ్ కింద ప్రతిపాదించిన రూ.868 కోట్ల పనులకు వారంలోగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. బందరు పోర్టుకు గ్రీన్ఫీల్డ్ రహదారిపై ఈ నెల 22న హైదరాబాద్లో ఎన్హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. రూ.30 వేల కోట్లతో విద్యా ప్రణాళిక తెలంగాణలో విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు తమ ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు రేవంత్రెడ్డి వివరించారు. మంగళవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో ఆమెను కలిసి.. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కూళ్ల ఏర్పాటు, ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి ఉద్దేశించిన రూ.30 వేల కోట్ల ప్రణాళికకు అనుమతులివ్వాలని కోరారు. 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో పాఠశాలలో 2,560 మంది చొప్పున సుమారు 2.70 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని వివరించారు. ఈ స్కూళ్లకు రూ.21 వేల కోట్లు, ఇతర ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి రూ.9 వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. నిధుల సమీకరణకు ఏర్పాటు చేసే ప్రత్యేక కార్పొరేషన్కు అనుమతి ఇవ్వడంతో పాటు ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం కోరారు. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు చేసిన అప్పుల రీస్ట్రక్చర్కు అనుమతించాలని విన్నవించారు. సీఎం విజ్ఞప్తులపై నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సీఎం వెంట ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, పోరిక బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, చామల కిరణ్కుమార్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘సీఎం రేవంత్ నోరు విప్పితే గోబెల్ ప్రచారం’
హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి నోరు విప్పితే గోబెల్ ప్రచారమేనని, మొత్తం అబద్ధాలేనని మండిపడ్డారు. అసత్యాల ప్రచారంలో సీఎం రేవంత్ ఉన్నారని విమర్శించారు హరీష్. ఈ రోజు(మంగళవారం, సెప్టెంబర్ 9వ తేదీ) తెలంగాణ భవన్లో హరీష్ మాట్లాడారు. ‘ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మేమే కట్టం అంటున్నావు.. కత్తెర పట్టుకొని కేసీఆర్ కట్టినవి కట్ చేస్తున్నావ్.. పేర్లు మార్చుడు, కత్తెర పట్టుకొని కేసీఆర్ తిరగలేదు. ఎల్లంపల్లి కోసం 2వేల కోట్లు ఖర్చు పెట్టాము. రేవంత్ ప్రారంభోత్సవం చేసిన ఫ్లై ఓవర్లు, డ్యాములు కేసీఆర్ హాయంలోనివే. ఎల్లంపల్లి ద్వారా 20టిఎంసి హైదరాబాద్కు ఎలా తెస్తావ్?, సీఎం కుర్చీకి గౌరవం పోగొడుతున్నావ్. కాళేశ్వరం మోటర్లతోనే నీళ్లు ప్రాజెక్టులకు వస్తున్నాయి. కేసీఆర్ ముందుచూపుతో మల్లన్నసాగర్ నిర్మించారు. గండిపేట, హిమాయత్ సాగర్ కి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లే. కాళేశ్వరం లో 12రిజర్వాయర్లు.. అందులో భాగమే మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తెస్తా అంటే నీళ్లు ఎక్కడివి..?, కాళేశ్వరం నీళ్లే మల్లన్న సాగర్కి వస్తాయి. కేసీఆర్ హయాంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపడితే... రేవంత్ నియామక పత్రాలు ఇస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగం.. మల్లన్నసాగర్. కాళేశ్వరంను తిడుతావ్ అక్కడి నుండే నీళ్లు వచ్చేవి’ అని హరీష్ కౌంటర్ ఇచ్చారు. -
నేను లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. రేవంత్ సిద్ధమా? కేటీఆర్
హైదరాబాద్: తనపై పెట్టిన ఫార్మాలా ఈ-కార్ రేసు ఒక లొట్టపీస్ కేసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు ఆనాడు ఈ-కార్ రేస్ నిర్వహించామన్నారు. లొట్టపీస్ కేసులో ఎటువంటి చార్జ్షీటైనా వేసుకోమనండి, అందులో అవినీతే జరగలేదన్నారు. ఈరోజు(మంగళవారం, పెప్టెంబర్ 9వ తేదీ) ఫార్మాలా ఈ-కార్ రేస్ చార్జ్షీటు దాఖలుపై కేటీఆర్ స్పందించారు. ‘ ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతే జరగలేదు. ేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం , రేవంత్ రెడ్డి సిద్ధమా?, దమ్ముంటే రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలి. రేవంత్ వస్తారా.. ఏసీబీ డీజీ వస్తారా.. లై డిటెక్టర్ సిద్ధం. ూ. 45 కోట్లు ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశించింది నేనే. ఎక్కడా కూడా రూపాయి తారుమారు కాలేదు. ప్రాసిక్యూషన్, చార్జిషీట్, జైలు.. ఏదైనా చేసుకోండి.. నేను సిద్ధం’ అని కేటీఆర్ సవాల్ చేశారు. కాగా, అంతకుముందు ప్రెస్మీట్లో మాట్లాడిన కేటీఆర్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ‘కొందరు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేదని దుస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మీటింగ్లకు ఎందుకు రావడం లేదు?.కాంగ్రెస్ కండువా వేసుకుని సిగ్గులేకుండా బీఆర్ఎస్లో ఉన్నానంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటువేయాలి’అని డిమాండ్ చేశారు. -
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ భేటీ
ఢిల్లీ: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి సంభవించిన నష్టంపై ఆర్థిక మంత్రికి నిర్మలా సీతారామన్కు నివేదిక అందజేశారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు ఆర్థిక సహాయం అందించాలని నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. ఇక సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఓం బిర్లాతో సమావేశమైన వారిలో సీఎం రేవంత్తో పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, కె.రఘువీర్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాం నాయక్లు ఉన్నారు. -
‘గ్రూప్-1’ తీర్పు.. రేవంత్కో గుణపాఠం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 కేసులో హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠమంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు ప్రకారం, విద్యార్థులు కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పిళ్లు, మళ్ళీ కోర్టు కేసుల పేరు చెప్పి యువతకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు.నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్న తీరుగా మళ్లీ తిరిగి పరీక్షను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్న కేటీఆర్.. ఇన్ని రోజుల పాటు గ్రూప్-1 అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా వారిపై అణిచివేతకు పాల్పడిన రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.హైకోర్టు తీర్పు.. రేవంత్ సర్కార్ సమాధానం ఏంటి?: హరీష్హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలపై ఆయన మండిపడ్డారు. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ హరీష్రావు ట్వీట్ చేశారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ఈ కోర్టు తీర్పుకు చెప్పే సమాధానం ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ మీ నిరక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు’’ అంటూ రేవంత్రెడ్డిపై హరీష్రావు మండిపడ్డారు.గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు..పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న…— Harish Rao Thanneeru (@BRSHarish) September 9, 2025 -
అంచనాలు పెంచి ప్రజాధనం లూటీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్కు గోదావరి జలాలను తరలించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రూ.1,100 కోట్లతో అంచనాలను రూపొందించగా.. రేవంత్రెడ్డి ప్రభుత్వం దాన్ని రూ.7,390 కోట్లకు పెంచి ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీ రామారావు ఆరోపించారు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును రూ.లక్షన్నర కోట్లకు పెంచడాన్ని బీఆర్ఎస్ అడ్డుకుందని.. దీంతో రూటు మార్చిన రేవంత్రెడ్డి విడతల వారీగా జనం సొమ్మును దోచుకునేందుకే గోదావరి జలాల తరలింపు పనులు మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయ పోరాటం చేస్తాం.. ‘సము‘ద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా రావల్కోల్ చెరువుకు, అక్కడి నుంచి 540 మీటర్ల ఎత్తున ఉన్న గండిపేటకు తరలించడం ద్వారా మూసీతో అనుసంధానం చేసే వీలుంది. అయినా 560 మీటర్ల ఎత్తులో ఉన్న మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలించేలా ప్రతిపాదనలు మార్చి నీటి శుద్ధి కేంద్రాలు, పంప్ హౌస్లు ఎవరి లాభం కోసం కడుతున్నారో ప్రభుత్వం చెప్పాలి. కాంట్రాక్టర్లకు దోచిపెట్టి కమీషన్లు దండుకునేందుకే సీఎం ఈ పనులు చేపడుతున్నారా? హైదరాబాద్కు గోదా వరి జలాల తరలింపులో అవినీతిపై న్యాయ పోరాటం చేస్తాం..’అని కేటీఆర్ చెప్పారు. కుర్చీ కాపాడుకునేందుకే.. ‘కాళేశ్వరం ప్రాజెక్టును విఫల పథకంగా ప్రచారం చేసిన రేవంత్, కాంగ్రెస్ నేతలు ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ విచారణకు ఆదేశించిన రేవంత్రెడ్డి.. అదే ప్రాజెక్టు ఆధారంగా నిర్మించిన మల్లన్నసాగర్, మూసీ నదుల అనుసంధానం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అయితే కాళేశ్వరంపై చెప్పిన అబద్ధాలను కప్పి పుచ్చుకునేందుకు మల్లన్నసాగర్కు బదులుగా గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టు చేసిన కాంట్రాక్టు కంపెనీకి. రేవంత్ తాను నిర్వహిస్తున్న మున్సిపల్ శాఖలో అంతర్భాగమైన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ బోర్డు నుంచి రూ.7 వేల కోట్ల విలువైన కాంట్రాక్టును ఇచ్చారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్లు దోచుకుని ఢిల్లీకి మూటలు పంపి, వాటాలు పంచి తన సీఎం కురీ్చని కాపాడుకునేందుకే ఇదంతా చేస్తున్నారు..’అని మాజీమంత్రి ఆరోపించారు. యూరియా కొరతపై స్పందించని బీజేపీ, కాంగ్రెస్ ‘ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇద్దరూ మంచి అభ్యర్థులే. అయితే మేము రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న యూరియా కొరతపై బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా స్పందించక పోవడంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాం. నోటా ఉంటే దానికే వేసేవాళ్లం కానీ, ఆ అవకాశం లేనందున ఓటింగ్కు దూరంగా ఉంటున్నాం. కవిత విషయంలో అవసరమైన నిర్ణయం తీసుకున్నాం.. ఎమ్మెల్సీ కవిత విషయంలో పార్టీ వేదికపై, అంతర్గతంగా చర్చించి అవసరమైన నిర్ణయం తీసుకున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ఓ టీవీ చర్చలో అంగీకరించి అప్రూవర్గా మారాడు. నేరాంగీకారం తర్వాత ఇంకా విచారణ ఎందుకు? వేటు వేయాల్సిందే. మహారాష్ట్ర పోలీసులు ఫ్యాక్టరీ కార్మీకులుగా అవతారం ఎత్తి తెలంగాణలో రూ.12 వేల కోట్లు విలువైన డ్రగ్స్ను పట్టుకుంటే తెలంగాణ పోలీసులు, ఇంటెలిజెన్స్, ఈగిల్, హైడ్రాలు ఏం చేస్తున్నాయి? డ్రగ్స్ వ్యవహారంలో సీఎం రేవంత్కు ముడుపులు ముట్టినందునే తెలంగాణ పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారా?..’అని కేటీఆర్ ప్రశ్నించారు. మాజీ మంత్రులు జి.జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సు«దీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమావేశంలో పాల్గొన్నారు. -
రాజకీయ యుద్ధాలకు కోర్టును వాడుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్రెడ్డిపై బీజేపీ తెలంగాణ శాఖ దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ కె. వినోద్చంద్రన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్లతో కూడిన ధర్మాసనం బీజేపీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాజకీయ యుద్ధాలకు ఈ కోర్టును ఉపయోగించుకోవద్దని పదేపదే చెబుతున్నాం’అంటూ సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో జోక్యం చేసుకోదలచుకోలేదని తేల్చిచెప్పారు.రాజ కీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు తట్టుకొనే శక్తి ఉండాలని పేర్కొంటూ పిటిషన్ను డిస్మిస్ చేశారు. రాజకీయ వ్యాఖ్యలను రాజకీయంగానే ఎదుర్కోవాలని హితవు పలికారు. అయినా రంజిత్ కుమార్ వాదనలు కొనసాగించేందుకు ప్రయతి్నంచడంతో సీజేఐ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘మేం ఇప్పటికే పిటిషన్ను కొట్టేశాం. ఇంకా వాదనలు దేనికి? మళ్లీ ఇలాంటి పిటిషన్తో కోర్టుకు వస్తే రూ. 10 లక్షల జరిమానా విధిస్తాం’అంటూ హెచ్చరించారు. ఇదీ నేపథ్యం.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గతేడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు తమ పార్టీకి రాజకీయంగా పరువునష్టం కలిగించాయంటూ బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు హైదరాబాద్ ట్రయల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారించి ఐపీసీ సెక్షన్ 499, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 కింద విచారణకు ఆదేశించింది.ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ‘రాజకీయ ప్రసంగాలు తరచుగా అతిశయోక్తులతో నిండి ఉంటాయి. వాటిని పరువునష్టంగా పరిగణించడం సరికాదు’అని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ రేవంత్కు అనుకూలంగా తీర్పు ఇచి్చంది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు అభిõÙక్ మను సింఘ్వీ, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. -
జస్టిస్ సుదర్శన్రెడ్డి గెలుపే లక్ష్యంగా..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఢిల్లీలో రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు. మంగళవారం జరగనున్న ఎన్నికల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యరి్థ, తెలుగుబిడ్డ జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల వ్యూహాలపై కీలక చర్చలు జరిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు రేవంత్రెడ్డి క్షుణ్ణంగా దిశానిర్దేశం చేశారు.ముఖ్యంగా, ఇది రహస్య ఓటింగ్ పద్ధతిలో జరిగే ఎన్నిక కాబట్టి, దీనిని ఇండియా కూటమికి అనుకూలంగా ఎలా మలచుకోవాలనే దానిపై ప్రధానంగా చర్చించారు. మిగతా పారీ్టల ఎంపీలతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని కోరుతూ ఎవరెవరితో సంప్రదింపులు జరపాలి అనే అంశాలపై సీఎం ఎంపీలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది.రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన అభ్యరి్థగా జస్టిస్ సుదర్శన్రెడ్డికి ఓటు వేయడం చారిత్రక అవసరమని, ఈ విషయాన్ని ఇతర పార్టీల ఎంపీలకు కూడా నొక్కిచెప్పాలని సూచించారు. తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకునేలా ఎంపీలందరూ సమష్టిగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. మంగళవారం జరిగే పోలింగ్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఎంపీలకు స్పష్టం చేశారు.రెండు రోజులు ఢిల్లీలోనే సీఎం.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి మంగళవారం జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికలను పర్యవేక్షిస్తారు. వీలును బట్టి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించేందుకు ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ను అడిగినట్టు తెలిసింది. ప్రధాని అపాయింట్మెంట్ లభిస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి కూడా సీఎం మాట్లాడే అవకాశముందని సమాచారం. మరోవైపు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీల సమర భేరి సభకు ఏఐసీసీ పెద్దలను రేవంత్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. -
చుక్క నీరు తేలేదు! : సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేళ్లలో కృష్ణా, గోదావరి నదుల నుంచి చుక్క నీరు కూడా హైదరాబాద్కు తరలించలేదు. గత పాలకులు నగర ప్రజల దాహార్తిని పట్టించుకోలేదు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు. నెత్తి మీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు..’ అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. సోమవారం గోదావరి రెండు, మూడో దశ తాగునీటి సరఫరా, మూసీ నది పునరుజ్జీవం పథకాలకు గండిపేట వద్ద ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. నిజాం దూరదృష్టి వల్లే నగరానికి తాగునీళ్లు ‘శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్కు తరలిస్తున్నాం. కానీ ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం వైఎస్సార్ చొరవతోనే కృష్టా, గోదావరి జలాలు హైదరాబాద్కు వచ్చాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరోసారి గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతోందంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టే కారణం. నగరానికి ప్రతి ఏటా 3 శాతం చొప్పున వలసలు పెరుగుతున్నాయి. జనాభా కోటిన్నర దాటడంతో అందుకు తగ్గట్టుగా భవిష్యత్తు ప్రణాళికలు అవసరం..’ అని సీఎం పేర్కొన్నారు. ‘తుమ్మిడిహెట్టి’పై మహారాష్ట్రను ఒప్పిస్తాం ‘గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం. దివంగత వైఎస్సార్ తుమ్మిడిహెట్టి వద్దే దీనిని ప్రారంభించారు. అయితే గత బీఆర్ఎస్ పాలకులు కాసుల కక్కుర్తితో తలను తొలగించి చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకుండా చేశారు. త్వరలో ఈ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర సీఎంను కలిసి చర్చించి ఒప్పిస్తాం..’ అని రేవంత్ చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసి తీరతాం.. ‘మూసీ మురికికూపంగా మారి విషం చిమ్ముతోంది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో నీరు తాగితే పశువులే కాదు, మనుషుల ప్రాణాలు సైతం పోతున్నాయి. పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుడుతున్నారు. నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఎలాగైనా సరే మూసీని పునరుజ్జీవింపజేయాలని స్థానికులు కోరారు. వారికిచ్చిన మాట ప్రకారం మూసీ ప్రక్షాళన చేసి తీరతాం. గోదావరి జలాల తరలింపు ద్వారా జంట నగరాల తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా మూసీ కాలుష్యాన్ని నివారించడం ద్వారా ఆ సమస్య నుంచి నల్లగొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తాం. ఫ్యాక్టరీల కాలుష్యం మూసీలో కలవకుండా నియంత్రిస్తాం. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు నిర్వాసితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దుతాం..’ అని ముఖ్యమంత్రి అన్నారు. డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్ విడుదల ‘వందేళ్లకు సరిపడా ప్రణాళికతో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేసి తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నాం. గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ప్రాజెక్టు కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. రాబోయే పదేళ్లలో హైదరాబాద్ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. మహానగరాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలి. ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసిరావాలి..’ అని సీఎం పిలుపునిచ్చారు. నియో పొలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభం కోకాపేట వద్ద నియో పొలిస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ను సోమవారం సీఎం ప్రారంభించారు. అదేవిధంగా గండిపేట వద్ద హెదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 రిజర్వాయర్లను కూడా ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
రండి.. హైదరాబాద్ను అభివృద్ధి చేద్దాం: సీఎం రేవంత్
హైదరాబాద్: ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధికి అందరూ కలిసి రావాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నామన్నారు సీఎం రేవంత్. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వం తిప్పికొడుతుందన్నారు సీఎం రేవంత్. ఇది ఇందిరమ్మ రాజ్యమని, ఈ రాజ్యంలో పేదోళ్లకు న్యాయం జరుగుతుందన్నారు. గోదావరి ఫేజ్ 2&3 శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లడారు. గంగా నదీ, యమునా, సబర్మతీ నదులు ప్రక్షాళన చేయొచ్చని, కానీ తాము మూసీని ప్రక్షాళన చయొద్దా? అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదని నిలదీశారు. ‘1908 లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడింది. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణం. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. 1965 లో మంజీరా నది నుంచి నగరానికి తాగు నీరు అందించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 2002 లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారు. నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడింది. కాలుష్యమయమైన మూసీతో నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చా. 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్కు తరలించబోతున్నాం. ఇందులో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వినియోగించబోతున్నాం. చెరువులను నింపుకుంటూ 4 టీఎంసీలను మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తాం. శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్ తరలిస్తున్నాం. ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారు. చేవెళ్లలో వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాసుల కక్కుర్తితో తలను తొలగించింది మీరు కాదా?, చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకపోవడానికి కారణం మీరు కాదా?, తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తాం’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
కాళేశ్వరం కమిషన్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి టైంపాస్ చేశారు
-
అదే ‘కూలేశ్వరం’ నీళ్లను హైదరాబాద్కు తెస్తున్నారు.. రేవంత్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శనాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కక్షగట్టారని, కమిషన్ పేరుతో టైంపాస్ చేశారని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. అలాంటి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష గట్టారు. కాంగ్రెస్ కాళేశ్వరంపై ఎన్నికల ముందు నుండే అడ్డమైన ఆరోపణలు చేస్తోంది. సీబీఐ, ఈడీలు బీజేపీ జేబు సంస్థలంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. కానీ, ఆయన విమర్శించే సీబీఐకే రేవంత్ కాళేశ్వరం కేసు అప్పగించారు. ఇవాళేమో మూసీ పునరుజ్జీవం(జలాల అనుసంధానం) పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తోంది. మల్లన్న సాగర్ వద్ద కాకుండా తలాతోకా లేకుండా గండిపేట వద్ద శంకు స్థాపన చేస్తున్నారు. కాళేశ్వరం కూళేశ్వరం అయ్యింది అని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అదే ప్రాజెక్టు నీళ్లను హైదరాబాద్కు తెస్తున్నారు. అదే కాళేశ్వరం ద్వారా గంధమల్ల రిజర్వాయర్కి సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూనే.. కాళేశ్వరంపై సీఎం రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ తెస్తున్న నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టువి అవునో.. కాదా ఆయన సమాధానం చెప్పాలి..కాళేశ్వరం ప్రాజెక్టుకు 94 వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. మరి లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ జరిగింది?. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను బద్నాం చేస్తున్న వారు ముక్కు నేలకు రాయాలి. ఎల్లకాలం మోసం చేయలేమని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని కేటీఆర్ అన్నారు. అదే సమయంలో.. విడతల వారిగా భారీ అవినీతికి ప్రభుత్వం తెరతీసిందని ఆరోపించారాయన. మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన సంస్థనే కూలిన పిల్లర్లను నిర్మిస్తామని ముందుకు వస్తే.. ప్రభుత్వం అడ్డుకుంటోంది. కొండ పోచమ్మ ద్వారా రూ.1,100 కోట్లతో హైదరాబాద్కి నీళ్లు తేవోచ్చు. కానీ, ఈ రోజు రూ. 7,700 కోట్లకు వ్యయం.. అంటే 7 రెట్లు ఎలా పెరిగింది?. కేవలం కమిషన్ ల కోసమే వ్యయం పెంచారు. అవినీతే కాదు ఇందులో క్రిమినల్ కోణం కూడా ఉంది. సుంకిశాల రైటింగ్ వాల్ కూలిన సంస్థకే రూ.7,400 కోట్ల ప్రాజెక్ట్ ఎలా ఇస్తున్నారు?. వారిపైన చర్యలు తీసుకోక పోగా వారికే మళ్ళీ కాంట్రాక్ట్ లు ఎలా ఇస్తున్నారు?. ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపణలు చేసిన వారికి ఇప్పుడు బెస్ట్ ఇండియా కంపెనీ ఎలా అయ్యింది అని కేటీఆర్ ప్రశ్నించారు.ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థ వైఖరి అవలంభిస్తోందని కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. ఫిరాయింపుల వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రజాస్వామాన్ని ఈ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని అన్నారాయన. ‘‘బీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నాం అని టీపీసీసీ అధ్యక్షుడే ఒప్పుకున్నారు. అలాంటప్పుడు ఇంక విచారణ దేనికి?. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే వేటు వేయాలి’’.. కేటీఆర్ డిమాండ్ చేశారు. -
తెలంగాణ బీజేపీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తున్నారని, రిజర్వేషన్లను ఎత్తివేస్తారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రేవంత్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ.. సుప్రీంకోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా బీజేపీ పిటిషన్పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్. గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోవద్దు అని హితవు పలికారు. రాజకీయ నాయకులు వీటిని గట్టిగా ఎదుర్కోవాలి. రాజకీయపరమైన వ్యాఖ్యలు రాజకీయ స్ఫూర్తితోనే ఎదుర్కోవాలి అని వ్యాఖ్యానించారు. చివరగా.. పది లక్షల జరిమానా విధిస్తామని బీజేపీని హెచ్చరించారు. అనంతరం, పిటిషన్ను కొట్టివేశారు.ఇదిలా ఉండగా.. గతంలో ఇదే విషయంపై బీజేపీ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు సైతం కొట్టివేసింది. దీంతో, రాష్ట్ర బీజేపీ.. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా మరోసారి బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. -
ఆ పార్టీ అద్భుతాలు రేవంత్కే తెలియాలి!
రాజకీయంగా అనూహ్యంగా ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించినా పాత వాసనలు మాత్రం పోగొట్టుకోలేక పోతున్నట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఒక్కోసారి ఆత్మరక్షణలో పడిపోతున్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఏర్పడ్డ సంక్షోభంలో తన పాత్ర లేదని చెప్పే ప్రయత్నంలో ఆయన ఆ పార్టీ నేతలపై కొన్ని అభ్యంతరకరమైన పదాలు ప్రయోగించడం, తెలుగుదేశం పార్టీని పొగడటం ఇలాంటిదే. కొందరి కుట్రల వల్ల తెలంగాణలో తెలుగుదేశం ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కానీ అదో అద్భుతమైన పార్టీ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతవరకూ ఓకే. కానీ అందుకు ప్రకృతి ప్రతీకారం తీర్చుకుందని, అన్ని దుర్మార్గాలు చేసిన మీరు (బీఆర్ఎస్) మాత్రం ఎలా మనుగడ సాగిస్తారని ప్రశ్నించడంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అంత గొప్ప పార్టీనే అయితే రేవంత్ ఎందుకు వదిలిపెట్టారు? దాన్ని వృద్ధిలోకి తీసుకురాకుండా కాంగ్రెస్లో చేరారు ఎందుకు? ఇదిలా ఉంటే.. ఆయా సందర్భాల్లో రేవంత్ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పనిగట్టుకుని ప్రశంసించడం కాంగ్రెస్ నేతలు చాలామందికి రుచించడం లేదు. సీఎం కాబట్టి పెద్దగా ప్రశ్నించడం లేదని అంటున్నారు. కాంగ్రెస్లో ఒకసారి విమర్శించడం మొదలైందంటే గోల, గోల అవుతుందన్న సంగతి రేవంత్కు తెలియనిది కాదు. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్కు సహకరించిందన్నది వాస్తవం. కొంతమంది టీడీపీ జెండాలు పట్టుకుని ఏకంగా గాంధీభవన్కే వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉన్నాయని అంటారు. ఈ అంశం కూడా కలిసిరావడంతో రేవంత్ సీఎం కాగలిగారని చాలా మంది అభిప్రాయం. రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందుగా చంద్రబాబు అనుమతి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మిగిలి ఉన్న టీడీపీ అభిమానుల మద్దతు పొందడానికి ఆయన ఇలా మాట్లాడారా? స్థానిక ఎన్నికలలో కాని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాని వారి సహకారం పొందడానికి ఈ వ్యూహంలో వెళుతున్నారా ? అన్న సంశయం వస్తుంది. అయితే రేవంత్ వ్యాఖ్యలు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు చికాకు తెప్పిస్తాయి. కాంగ్రెస్ సీఎంగా ఉండి టీడీపీని పొగుడుతుంటే నష్టం కదా? అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాక, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండే వారు. రహస్య సంబంధాలు పెట్టుకున్నా, బయటికి మాత్రం ఘాటుగా మాట్లాడేవారు. కానీ రేవంత్ ఆ పార్టీతో ఏ స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తున్నారో తెలియదు కాని, ఇలా వేరే పార్టీని బహిరంగంగా పొగడడమేమిటని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. 1982లో ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం రాజకీయ పోరు కాంగ్రెస్, టీడీపీల మధ్యే సాగింది. రేవంత్ ఈ విషయాన్ని ఎలా విస్మరిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో చంద్రబాబు వ్యూహం కారణంగానే టీడీపీ కనుమరుగైంది కానీ నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ల వల్ల కాదని కొందరి విశ్లేషణ. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనో, ఇరుకున పెట్టాలనో చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని ప్రయత్నించడం, దానికి రేవంత్ను వాడుకోవడం, పోలీసులు నిఘా పెట్టి పట్టుకుని కేసు పెట్టడం, రేవంత్ జైలుకు వెళ్లడం.. ఇదంతా చరిత్రే. ఆ తర్వాత కేసీఆర్తో రాజీలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ను వదలుకుని ఏపీకి వెళ్లిపోయారు. పలితంగా ఆయనపై కేసు లేకుండా చేసుకోగలిగారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వారు ఎలా మనుగడ సాగించగలరని అనడం ద్వారా బీఆర్ఎస్కు ఇక భవిష్యత్తు లేదన్న అభిప్రాయం కలిగించారు. బిఆర్ఎస్ను చచ్చిన పాముతో పోల్చారు. ఒకసారి ఓడిపోతేనే ఏ పార్టీకైనా ఫ్యూచర్ లేకపోతే, కాంగ్రెస్ పదేళ్ల తర్వాత మళ్లీ ఎలా అధికారంలోకి వచ్చింది? కాంగ్రెస్ తెలంగాణలో 2014 నుంచి రెండుసార్లు ఓడిపోయింది. అయినా మూడోసారి విజయం సాధించింది. దేశంలోనే తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. 2014 నుంచి కేంద్రంలో అధికారానికి దూరమైంది. అంతమాత్రాన ఇక కాంగ్రెస్ దేశంలో ఉండదని చెప్పగలమా? 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం రాకపోయినా, ప్రతిపక్ష హోదా సాధించే స్థితిలో గెలవగలిగింది కదా? తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని కేసీఆర్ కూడా అనేవారు.అయినా ఇప్పుడు అధికారంలోకి ఎలా వచ్చింది? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పే రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీని, దాని అధినేత చంద్రబాబును పదే, పదే ప్రశంసించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏపాటి మేలు జరుగుతుందో కూడా చెప్పాలి. వ్యక్తిగతంగా ఆయనకు ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో తెలియదు. కొద్ది రోజుల క్రితం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభలో మాట్లాడుతూ రెండు రూపాయలకు కిలో బియ్యం స్కీమ్ ఎన్టీఆర్దని అని చెప్పారు. అది టీడీపీ వారు చెప్పుకోవలసిన విషయం. నిజానికి ఎన్టీఆర్ ఈ స్కీమ్ ప్రతిపాదించి ప్రచారం ఆరంభించగానే, ఆనాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి రూపాయి తొంభై పైసలకే పేదలకు బియ్యం అందించే పథకాన్ని అమలు చేశారు. కాంగ్రెస్ వారు ఆ విషయం చెప్పుకోకుండా టీడీపీ స్కీమ్ అని వ్యాఖ్యానించడం ఏ మాత్రం తెలివి అవుతుంది. అలాగే అంతకుముందు ఒక కార్యక్రమంలో హైటెక్ సిటీ నిర్మాణం ప్రస్తావన తెచ్చి చంద్రబాబు ను మెచ్చుకున్నారు. చంద్రబాబు ఒక భవనం నిర్మించిన మాట నిజమే. కాని అంతకు ముందే నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్కు కు శంకుస్థాపన చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలే మర్చిపోతే ఏమి చేయాలన్న అసంతృప్తి పార్టీలో ఏర్పడుతోంది. చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే వంటివి నిర్మించారు. రేవంత్ వైఎస్ ప్రస్తావనను తెస్తున్నప్పటికి, చంద్రబాబుకు ఇస్తున్న ప్రాధాన్యత మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డి బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. తదుపరి టీఆర్ఎస్లో క్రియాశీలం అయ్యారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచారు. తదుపరి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. లోక్సభ ఎన్నికలలో టీడీపీ పక్షాన 2014లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డికి టీడీపీ టిక్కెట్ లభించినప్పుడు పార్టీపై, నాయకత్వంపై రేవంత్ చేసిన విమర్శలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అద్భుతమైన పార్టీ అయితే సొంత అల్లుడు ఎన్టీఆర్ను ఎందుకు కూలదోశారో చెప్పాలి. కొన్నిసార్లు వామపక్షాలు, మరికొన్నిసార్లు బీజేపీ, ఇంకోసారి కాంగ్రెస్తో, మరోసారి టీఆర్ఎస్తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకున్నదో, అది ఏపాటి అద్భుతమో చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని లేఖ ఇచ్చి, ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దెయ్యంతో పోల్చిన టీడీపీ ఎలా అద్భుతమో రేవంత్కే తెలియాలి. బీఆర్ఎస్పై రాజకీయ విమర్శలు చేయడం తప్పుకాదు. కాని వ్యక్తిగతంగా నేతలను ఉద్దేశించి చెత్తగాళ్లు అని వ్యాఖ్యానించడం సీఎం హోదాకు తగదని చెప్పాలి. బీఆర్ఎస్లో తాను సంక్షోభం సృష్టించలేదని చెబుతున్నప్పటికీ రాజకీయ వర్గాలలో మాత్రం నమ్మకం కుదరడం లేదు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఆ ప్రయత్నం చేయడం తప్పుకాదు. కాని రాజకీయాలలో ఒక పార్టీ మనుగడ సాగించడానికి, కాలగర్భంలో కలిసిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం కాంగ్రెస్కు ,రేవంత్ కు కలిసి వచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దానిపై రేవంత్ దృష్టి పెడితే మంచిది. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు కీలక భేటీ
-
ఏం చేద్దాం.. ఏం చెప్దాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులు కూడా హాజరు కావడం విశేషం. వీరి అనర్హత విషయంలో సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించడం, సుప్రీం ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపుపై జవాబు చెప్పాలని అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసుల గడువు ముగుస్తుండడం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశంలో తమ నియోజకవర్గాల అభివృద్ధి తమకు పాత కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యల పరిష్కారం పైనే చర్చించామని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు బయటకు చెబుతున్నప్పటికీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో కేసు, స్పీకర్ జారీ చేసిన నోటీసుల విషయంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు, ఎలా ముందుకు వెళ్లాలి? ఏం చెప్పాలి అనేది నిర్ణయించేందుకే ఈ భేటీ జరిగిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సమావేశంలో ఏఏజీ..! ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్తో పాటు అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. కాగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మహీపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికపూడి గాం«దీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకటరావు, కాలె యాదయ్యలు పాల్గొన్నారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరుకాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ భేటీలో ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు, స్పీకర్ ఇచ్చిన నోటీసులపై చర్చ జరిగింది. దీంతో పాటు ఈ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం.. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తమే ముఖ్యమంత్రిని కలిసామనే రీతిలో సమాధానమివ్వాలనే నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అన్ని విషయాల్లో తాను అండగా ఉంటానని, పార్టీని, తనను నమ్మి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోమని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న పనులకు వీలున్నంత మేర నిధులు మంజూరు చేస్తామని, నియోజకవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు పాత కాంగ్రెస్ నాయకత్వంతో సమన్వయంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కోర్టు కేసుల విషయంలో కూడా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్టు సమాచారం. గతంలోనే కలవాలనుకున్నాం.. సమావేశం అనంతరం ఓ ఎమ్మెల్యే ’సాక్షి’తో మాట్లాడుతూ.. అందరం కలిసి సీఎంతో సమావేశం అవుదామని గతంలోనే నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆ మేరకే ఆయన్ను కలిశామని, అనేక అంశాలపై చర్చించామని, సీఎం కూడా తమకు భరోసా ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దామని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. -
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ..సీఎం రేవంత్తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ
సాక్షి,తెలంగాణ: సీఎం రేవంత్రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే నోటీసులు పంపించారు. తాజా సీఎం రేవంత్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీలో సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
బైబై గణేశా..!
నిమజ్జనోత్సాహం వెల్లువెత్తింది. హైదరాబాద్ మహానగరం గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగింది. ఆబాలగోపాలమంతా వినాయకసాగర్ బాటపట్టింది. తొమ్మిది రోజులపాటు వివిధ ప్రాంతాల్లో ఘనమైన పూజలందుకున్న గణనాథుడు జనసంద్రమై తరలివచి్చన భక్తకోటి ఆనందోత్సాహాల నడుమ గంగమ్మ ఒడికి చేరాడు. నిమజ్జనోత్సవం సందర్భంగా ఉదయం నుంచే నగరం ఆధ్యాతి్మక శోభను సంతరించుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే విగ్రహాలు, ఆటపాటలు, నృత్యప్రదర్శనలతో శోభాయమానమైంది. ఉదయమే బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకలు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో ముగిశాయి. 69 అడుగుల గణనాథుడి విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పరిపూర్ణమైన నిమజ్జనాన్ని కనులారా వీక్షించిన భక్తులు గొప్ప అదృష్టంగా భావించారు. వేలాదిమంది ఆ దృశ్యాన్ని తమ మొబైల్ఫోన్లలో బంధించారు. మహాగణపతి నిమజ్జనం సందర్భంగా హుస్సేన్సాగర్ మహాజన సాగరమైంది. పోటెత్తిన భక్తజనం... నిమజ్జనోత్సవాలకు తరలి వచ్చిన భారీ భక్తజనసందోహంతో రహదారులు పోటెత్తాయి. ఖైరతాబాద్ విగ్రహం నిమజ్జనం తరువాత భక్తులు కొద్దిగా తగ్గుముఖం పట్టారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటల నుంచి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. బాలాపూర్ వినాయకుడి విగ్రహంతోపాటు నగరం నలువైపుల నుంచి తరలివచి్చన విగ్రహాల నిమజ్జన వేడుకలు అర్ధరాత్రి తరువాత కూడా కొనసాగాయి. దీంతో ట్యాంక్బండ్, సెక్రటేరియట్, నెక్లెస్రోడ్డు, అంబేడ్కర్ విగ్రహం, పీపుల్స్ప్లాజా తదితర ప్రాంతాలు భారీగా తరలివచి్చన భక్తజనులతో కిటకిలాడాయి. యువత పెద్ద సంఖ్యలో తరలిచి్చంది. ‘జై బోలో గణపతి మహారాజ్కీ ’నినాదాలతో ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్ పరిసరాలు హోరెత్తాయి. మెట్రో కిటకిట..... నిమజ్జనం సందర్భంగా మెట్రో రైళ్లు భక్తులతో కిక్కిరిశాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ లక్షలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడింది. నిమజ్జన వేడుకలను తిలకించేందుకు వచ్చిన భక్తుల రద్దీతో ఖైరతాబాద్ స్టేషన్లో ప్రయాణికుల ఎగ్జిట్, ఎంట్రీ గేట్లు సైతం స్తంభించాయి. మియాపూర్, ఎల్బీనగర్ మార్గాల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. నాగోల్, అమీర్పేట్, రాయదుర్గం ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల తాకిడి దృష్ట్యా ఖైరతాబాద్ వద్ద కొద్దిసేపు ప్రవేశద్వారాలను మూసి ఉంచారు. సోషల్ మీడియాలో గణేశుడి హవా వినాయక నిమజ్జన వేడుకలను ఇళ్లళ్లో టీవీల ముందు ఎంత మంది చూశారో.. అంతకు రెట్టింపు జనాలు సోషల్ మీడియాలో ఫాలో అయ్యారు. ట్యాంక్బండ్లో గణేశ్ నిమజ్జన సరిళిని హైదరాబాద్ సిటీ పోలీస్, సరూర్నగర్ ట్యాంక్ రాచకొండ పోలీసులు, ఐడీఎల్ చెరువు, హస్మత్పేట చెరువులలో జరుగుతున్న నిమజ్జనాల సన్నివేశాలను సైబరాబాద్ పోలీసులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ చేశారు. ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్, బాలాపూర్ వినాయక నిమజ్జనాలు సాగుతున్న తీరును, ప్రయాణ మార్గం, జన సందోహం, పూజలు తదితర ఏర్పాట్ల గురించి పోలీసులు నిరంతరం పోస్ట్లు పెట్టారు. వినూత్న రీతిలో, విభిన్నంగా ఉన్న గణేష్ ప్రతిమలను షేర్ చేశారు. ప్రత్యేకంగా ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం, బాలాపూర్ లడ్డూ వేలం సరళిని ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. సమాచారం అందిస్తూ... వినాయక నిమజ్జనం వేడుకలతోపాటు ప్రయాణ మార్గాలు, రోడ్ మళ్లింపులు, పార్కింగ్ ప్లేస్లు, అత్యవసర ఫోన్ నంబర్లు, ఇతరత్రా సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేందుకు అన్ని పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల భద్రత కోసం పోలీసులు ప్రత్యేకంగా కటౌట్లను తయారు చేసి పోస్ట్ చేశారు. ‘భగవంతుడి కళ్లు ఎప్పుడూ గమనిస్తూ ఉంటాయి. అలాగే మా సీసీటీవీ కెమెరాలు కూడా గమనిస్తూ ఉంటాయి’అనే తెలుగు, ఇంగ్లి‹Ù, హిందీ మూడు భాషల్లో స్లోగన్తో షీ టీమ్ పోస్ట్లతో అప్రమత్తం చేశారు. పోలీసుల పోస్ట్లను గమనించిన ఫాలోవర్స్ పోలీస్ డ్రెస్తో వినాయక ఫొటోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. డీజేల హోరు.. భక్తుల జోరు.. గ్రేటర్లో వినాయకుడు మోత మోగించేశాడు. నిమజ్జనం వేళ డీజీలు, టపాసులతో హోరెత్తించారు. గ్రేటర్ వ్యాప్తంగా పరిమితికి మించి శబ్ద కాలుష్యం వెలువడింది. నివాస, సున్నితమైన ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్దేశించిన దాని కంటే చాలా రెట్లు ధ్వని కాలుష్యం మించిపోయింది. రాత్రి వేళల్లో డీజేలు, టపాసుల మోతతో కాలనీలు దద్దరిల్లిపోయాయి. సామాజిక మాధ్యమాలలో ఫిర్యాదు చేసినా పీసీపీ, మున్సి పల్, పోలీసు విభాగాలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాల్లేవు. శబ్ద కాలుష్యంతో పిల్లలు, వృద్ధులలో వినికిడి సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హుస్సేన్సాగర్, అబిడ్స్, బహదూర్పుర, చారి్మనార్, ఖైరతాబాద్, సరూర్నగర్, ఎల్బీనగర్, బాలాపూర్, రామాంతాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్ వంటి ప్రాంతాలలో ధ్వని కాలుష్యం ఎక్కువగా నమోదైంది. శబ్ద కాలుష్యంపై నిర్లక్ష్యంపుణే, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించి, పరిమితికి మించి శబ్ద కాలుష్యం కలిగించిన గణేష్ మండప నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కానీ, మన దగ్గర ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రశాంతంగా సామూహిక ఊరేగింపులు గణేష్ ఉత్సవాల్లో తుది, కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం శనివారం ప్రారంభమైంది. నగర పోలీసు ఉన్నతాధికారులు బంజారాహిల్స్లో టీజీఐసీసీసీ నుంచి ఈ శోభాయాత్రను ఆద్యంతం పర్యవేక్షిస్తున్నారు. సామూహిక నిమజ్జన క్రతువు ఆదివారం ఉదయానికి పూర్తయ్యే అవకాశం ఉంది. పోలీసులు తీసుకున్న చర్యలతో ఈ కీలక ఘట్టం అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా సాగు తోంది. నగరంపై పోలీసు విభాగం డేగకన్ను వేసింది. ఆయా మార్గాల్లో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన అదనంగా కెమెరాలు ఏర్పాటు చేసింది. శోభాయాత్ర జరిగే రూట్లో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంటూ సీసీ, పీటీజెడ్, వైఫై వంటి ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు అన్నింటినీ ఐసీసీసీలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించింది. ఐసీసీసీలో ఉన్న మల్టీ ఏజెన్సీ ఆపరేషనల్ సెంటర్ను సమర్థంగా వినియోగించారు. ఇక్కడే ఉన్న పోలీసు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ సహా అన్ని విభాగాల అధికారులు హుస్సేన్సాగర్, ఎంజే మార్కెట్, చారి్మనార్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ ఊరేగింపులు పర్యవేక్షించారు. నగర సీపీ పర్యవేక్షణసిటీ సీపీ ఆనంద్, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ పరిస్థితుల్ని పర్యవేక్షించారు. ఏఏ చోట్ల కరెంటు సరఫరా ఆగిపోయిందే తక్షణం గుర్తిస్తూ విద్యుత్ అధికారులకు తెలిపి తక్షణం పునరుద్ధరించే ఏర్పాట్లు చేశారు. హుస్సేన్సాగర్ చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు చాంద్రాయణగుట్ట–నాగుల్చింత చౌరస్తా, ఇంజన్»ౌలి–ఎంజే మార్కెట్, కట్టమైసమ్మ–ఫలక్నుమ, ఇంజన్»ౌలి–మదీన, మదీన–నిజాం కాలేజీ మధ్య ఉన్న ప్రాంతాలపై తొమ్మిది డ్రోన్లు వినియోగించిన పోలీసు విభాగం పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసింది. ఆయా చోట్ల ఉన్న సమస్యల్ని గుర్తించి ఐసీసీసీ నుంచి పరిష్కారాలను సూచించింది. 2.54 లక్షల చిన్న విగ్రహాల నిమజ్జనంజీహెచ్ఎంసీలోని పైస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది దాకా అందరూ తగిన జాగ్రత్తలతో, సమన్వయంతో పనులు చేయడంతో నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వైద్యశిబిరాల నిర్వహణతోపాటు ఐదువేల మందికి ఉచితంగా భోజనాలు అందజేసినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. హుస్సేన్ సాగర్లో పెద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుండగా, ఐదడుగుల లోపు చిన్న విగ్రహాలను తాత్కాలిక కొలనుల్లో నిమజ్జనాలు చేశారు. ఇలాంటి విగ్రహాలు శనివారం రాత్రి 8 గంటల వరకు 2,54,685 నిమజ్జనమైనట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. జోన్ల వారీగా వివరాలిలా ఉన్నాయి.నిర్విఘ్నం.. సంపూర్ణం..ఖైరతాబాద్: ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మహా నిమజ్జనం నిర్విఘ్నంగా... సంపూర్తంగా సాగర్లో నిమజ్జనం గావించారు. నవరాత్రులు 69 అడుగుల ఎత్తులో విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ఘట్టం 6 గంటల్లో పూర్తిచేశారు. శనివారం ఉదయం 7.41 నిమిషాలకు ప్రారంభమైన శోభాయాత్ర సాగర తీరానికి చేరుకొని ఎనీ్టఆర్ మార్గ్లోని క్రేన్ నెం 4 వద్ద 1.45 నిమిషాలకు సంపూర్ణంగా నిమజ్జనం ముగిసింది. 15 రోజుల ప్రణాళిక మహాగణపతి సంపూర్ణ నిమజ్జనం చేసేందుకు సైఫాబాద్ ఏసీపీ సంజయ్కుమార్, హెచ్ఎండీఏ అధికారి గణేష్ జాదవ్ నిమజ్జన ప్రాంతంలో 70 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్లకుపైగా లోతు ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేసి ఆ ప్రాంతంలో రెడ్ఫ్లాగ్ ఏర్పాటు చేసి మార్కింగ్ చేశారు. మహాగణపతి లిఫ్ట్ చేసినప్పటి నుంచి సూపర్ క్రేన్ ఆపరేటర్ అజయ్ శర్మకు ఖచి్చతమైన సూచనలు చేస్తూ సంపూర్ణంగా నిమజ్జనం అయ్యేలా చూశారు. -
సీఎం రేవంత్ సడన్ ఎంట్రీ.. ట్యాంక్బండ్పై ప్రత్యక్షం
హైదరాబాద్: ఒకవైపు నగరంలో గణేశ్ నిమజ్జనం కోలాహలంగా సాగుతున్న వేళ.. సీఎం రేవంత్రెడ్డి ఉన్న పళంగా ట్యాంక్ బండ్ను సందర్శించారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎటువంటి ఆర్భాటం లేకుండా ట్యాంక్ బండ్కు వచ్చారు. పూర్తిస్థాయి భద్రత లేకుండా నలుగురైదుగురు వ్యక్తిగత సిబ్బందితో ట్యాంక్ బండ్ వద్దకు వచ్చారు సీఎం రేవంత్. అసలు నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో స్వయంగా వచ్చి పరిశీలించారు. అక్కడకు వచ్చిన భక్తులతో సీఎం రేవంత్ మాట్లాడారు. గణేష్ నిమజ్జనంకు సంబంధించి ఏమైనా ఇబ్బందులున్నాయో అని అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్. -
విద్యా రంగాన్ని సంస్కరిద్దాం
సాక్షి, హైదరాబాద్: విద్యారంగాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందని, దీని కోసం ప్రతి ఒక్కరూ కలిసి నడవాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సరికొత్త విద్యావిధానం రూపొందించేందుకే ప్రత్యేక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేటు, కార్పొరేట్ రంగానికి మించిన నాణ్యతతో ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించాలని కోరారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో శుక్రవారం గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి కీలకోపన్యాసం చేశారు.గత పదేళ్లలో విద్యాశాఖ నిర్వీర్యమైందని, చారిత్రక ప్రాధాన్యత గల ఉస్మానియా యూనివర్సిటీ మూతపడే దశకు చేరి ందన్నారు. విద్యా శాఖను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యా విధానంలో సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షించాలన్న ఉద్దేశంతోనే దానిని తన వద్ద ఉంచుకున్నానని సీఎం తెలిపారు.దీనిపై కొంతమంది చేస్తున్న విమర్శలు అర్థం లేనివని కొట్టిపారేశారు. పదేళ్లుగా ఈ శాఖ అస్తవ్యస్తమైందని విమర్శించారు. ప్రొఫెసర్లను నియమించకుండా యూనివర్సిటీలను నీరుగార్చారని ఆరో పించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే టీచర్ల బదిలీలు, 55 రోజుల్లోనే 11 వేల మంది టీచర్ల నియామకాలు చేపట్టామని చెప్పారు. టీచర్లు బాగా పనిచేస్తే మేము మళ్లీ గెలుస్తాం తెలంగాణ ఉద్యమాన్ని పల్లెలకు తీసుకెళ్లిన ఘనత టీచర్లదేనని సీఎం అన్నారు. ‘ఢిల్లీలో కేజ్రీవాల్ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి విద్యాభివృద్ధే కారణం. నాలోనూ ఆ స్వార్థం ఉంది. టీచర్లు బాగా పనిచేస్తేనే నేను రెండోసారి సీఎం అవుతాను. ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడొచ్చినా సమస్యలు విని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా. ప్రైవేట్ కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ విద్యావంతులు, సామాజిక బాధ్యత తెలిసినవారు. టీచర్లకు జీతాలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. పాఠశాలల నిర్వహణకు ఏటా రూ.130 కోట్లు మంజూరు చేస్తున్నాం’అని తెలిపారు.విద్యార్థులతో కలిసి భోజనం చేయండి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కొన్నిసార్లు విషపూరితం కావటం దురదృష్టకరమని సీఎం అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో పిల్లలతో కలసి ఉపాధ్యాయులు భోజనం చేయాలని కోరారు. అప్పుడే తప్పులు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడ్డారు. అప్పుడప్పుడు తాను కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు పెరిగాయని చెప్పారు. ప్రైవేటు, కార్పొరేట్ కన్నా మంచి విద్యను అందిస్తామని టీచర్లు ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. బలమైన పునాది అవసరం విద్యకు బలమైన పునాది అవసరమని సీఎం అన్నారు. ‘విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవడం కీలకం. దీని దృష్టిలో ఉంచుకునే వరల్డ్ బెస్ట్ మోడల్గా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ను నిర్మిస్తున్నాం. నిరుద్యోగ యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. 65 ఐటీఐలను టాటా కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్గా ఏటీసీలుగా అప్గ్రేడ్ చేశాం. దేశ ప్రతిష్టను పెంచేలా తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాం’అని వివరించారు.డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ ఫోర్స్ తెస్తున్నామని ప్రకటించారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురుపూజోత్సవ విశిష్టతను, గురువులకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేని శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎమ్మెల్సీలు పింగిళి శ్రీపాల్రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సాంకేతిక విద్య కార్యదర్శి దేవసేన తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అవార్డులు అందించారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ను పరిశీలించారు. -
‘దొంగ’ ముద్ర చెరుపుకోండి..
సాక్షి, హైదరాబాద్: ‘రెవెన్యూ శాఖ సిబ్బందిని దొంగలుగా గత ప్రభుత్వం ముద్ర వేసింది. రాష్ట్రాన్ని దోచుకున్న వారిలో రెవెన్యూ సిబ్బంది ఉన్నారని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఇది మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం. జాగ్రత్తగా ఉండండి. సమయస్ఫూర్తి, సంయమనంతో వ్యవహరించండి. మీపై వేసిన ముద్రను తొలగించుకోవడమే కాకుండా నాటి పాలకులు దోపిడీకి పాల్పడిన విధానాన్ని ప్రజలకు వివరించే విధంగా ప్రతిజ్ఞ చేయండి’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.పరిపాలన చేయలేనంటూ తనపై చేస్తున్న ఆరోపణలు, పాలనలో దోపిడీకి పాల్పడ్డారని రెవెన్యూ సిబ్బందిపై వేసిన ముద్ర తప్పని నిరూపించాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా కొత్తగా నియమితులైన గ్రామ పాలనాధికారుల (జీపీవో)కు శుక్రవారం హైదరాబాద్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. భూములు చెరబట్టేందుకే నాడు ధరణి భూతం.. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో భూమికి, ప్రజలకు ఉన్న అవినాభావ సంబంధం తల్లీబిడ్డ బంధం లాంటిదన్నారు. నాటి పాలకులు ధన, భూదాహంతో తెలంగాణ భూభాగాన్ని చెరబట్టాలనే ఆలోచనతో ధరణి అనే భూతాన్ని తెచ్చారని రేవంత్ దుయ్యబట్టారు. ఆ భూతం ద్వారా కొల్లగొట్టే భూముల లెక్కలు ప్రజలకు తెలియకూడదనే దురాలోచనతోనే వీఆర్వో, వీఆర్ఏలను బలి ఇచ్చి ఆ వ్యవస్థలను తొలగించారని ఆరోపించారు. ప్రజల ముందు రెవెన్యూ సిబ్బందిని దోషులుగా నిలబెట్టి నిస్సహాయులను చేశారని విమర్శించారు.దోపిడీదారులంటూ పచ్చపోట్టు లాంటి ముద్ర వీఆర్వోలు, వీఆర్ఏలపై వేసిన నాటి పాలకులు కాళేశ్వరం కూలిపోయిందని ఆ పార్టీని రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. వీఆర్వోలు, వీఆర్ఏల తరహాలోనే ఆ పార్టీ నేతలను ఉద్యోగాల నుంచి తొలగిస్తారా? అని నిలదీశారు. రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిపోయిన విషయాన్ని తాను కాదని.. గ్రామాల్లోకి ఇప్పుడు వెళ్తున్న గ్రామ పాలనాధికారులే ప్రజలకు చెబుతారన్నారు. నాటి పాలకులు కొల్లగొట్టిన భూముల లెక్కలు తీయండి గతంలో వీఆర్వో వ్యవస్థ రద్దు కారణంగా పేదలకు న్యాయం జరగలేదని.. వీఆర్వోలు, వీఆర్ఏలు లేని లోటు తమ 20 నెలల పాలనలో కనిపించిందని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు గ్రామ పాలనాధికారుల రూపంలో రెవెన్యూ సిబ్బంది పేదలకు సేవ చేస్తారని.. రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు.నాడు ధరణితో పట్టిన దరిద్రాన్ని భూభారతి చట్టంతో వదిలించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ‘నాటి పాలకులు అంటించిన వైరస్ ధరణి. ఆ వైరస్తో కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందర్లోనే గ్రామ పాలనాధికారులు బయటకు తీయాలి. ఈ వ్యవస్థను పనిచేయించే బాధ్యత మంత్రి పొంగులేటిదే. మీపై, మంత్రిపై నాకు నమ్మకం ఉంది’అని సీఎం రేవంత్ అన్నారు. భూసమస్యలన్నింటినీ పరిష్కరించండి భూభారతి చట్టం ఫలాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతోనే గ్రామ పాలనాధికారుల నియామకం చేపట్టామని.. సాధారణ భూసమస్యలతోపాటు సాదాబైనామాల సమస్యలనూ పరిష్కరించాలని కోరారు. నిజాం, రజాకార్లు, భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లకు పట్టిన గతే ధరణి ముసుగులో భూదోపిడీకి పాల్పడాలనుకునే వారికి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో గుణపాఠం రూపంలో పట్టిందని రేవంత్ పేర్కొన్నారు. అందుకే ప్రజాపాలన వచ్చిందని.. ఇందిరమ్మ రాజ్యంలో మళ్లీ కొలువుల జాతర మొదలైందన్నారు.‘ఉద్యోగం ఒకటి కాకపోతే ఇంకొకటి వస్తుంది. ఏదో పని దొరకుతుంది. కానీ మీపై పడిన మచ్చను చెరిపేసుకొనే అవకాశం అరుదుగా వస్తుంది. రెవెన్యూ శాఖపై పడిన మరకను చెరిపేసే బాధ్యత మీ 5 వేల మందిపై ఉంది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. భుజం తట్టి ప్రోత్సహిస్తుంది. మీరిచ్చిన సూచనలను తీసుకుంటుంది’అని సీఎం రేవంత్ అన్నారు. కాగా, క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించినందుకు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు వి.లచ్చిరెడ్డి, కె. రామకృష్ణ, రమేశ్పాక, బాణాల రాంరెడ్డి, వంగ రవీందర్రెడ్డి, కె. గౌతమ్కుమార్, గోల్కొండ సతీశ్ తదితరులు సీఎం రేవంత్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగాది నాటికి 7 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లు... రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కొత్తగా నియమితులైన జీపీవోలు ప్రభుత్వానికి చిన్న మచ్చ కూడా రాకుండా పనిచేయాలని కోరారు. గత సర్కారు ధరణి చట్టానికి మూడేళ్లయినా నియమ, నిబంధనలు రూపొందించలేదని.. భూభారతి చట్టానికి మాత్రం 90–92 రోజుల్లోనే పకడ్బందీగా నియమ, నిబంధనలు రూపొందించి ప్రజలకు అంకితమిచ్చామని ఆయన చెప్పారు. అందరికీ రోల్మోడల్గా ఉండేలా చట్టం చేసేందుకు సీఎంను చాలాసార్లు విసిగించామని.. ఆయన కూడా 36 గంటలు నిద్రపోలేదని గుర్తుచేసుకున్నారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి పెండింగ్లో పెట్టిన సాదాబైనామాల దరఖాస్తులు పరిష్కరిస్తున్నామని.. నాడు రద్దయిన క్షేత్రస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఉగాది నాటికి 7 వేల మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమిస్తామని వెల్లడించారు. ప్రతి డిసెంబర్ 31న జమాబందీ నిర్వహిస్తామని.. భూభారతి చట్టం చుట్టంలాగా రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ సందర్భంగా కొత్త జీపీవోలతో మంత్రి పొంగులేటి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్, మండలి చీఫ్ విప్ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న సీఎం రేవంత్ (ఫోటోలు)
-
ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ శుభవార్త
-
అందుకే విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. విద్యాశాఖ ముఖ్యమైందని.. అందుకే తన దగ్గర పెట్టుకున్నానని తెలిపారు. శుక్రవారం ఆయన శిల్పకళా వేదికలో టీచర్స్ డే వేడుకల్లో మాట్లాడుతూ.. విద్యాశాఖలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయన్నారు. పదేళ్ల పాటు టీచర్ల నియామకాలు జరగలేదని.. మేం వచ్చాక ఉపాధ్యాయులు నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు.కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ అమలు జరిగిందా? అంటూ ప్రశ్నించిన రేవంత్.. విద్యాశాఖలో ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. ‘‘గత ప్రభుత్వంలో విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. ఉస్మానియా వర్శిటీని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చారు. విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. పేదల తలరాత మార్చేది చదువు ఒక్కటే. ఫుడ్ పాయిజన్ వార్తలు చూస్తే బాధేస్తుంది. టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి’’ అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యూనివర్సిటీ వీసీలు, ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. -
ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
-
2027 డిసెంబర్ 9న ఎస్ఎల్బీసీ అంకితం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం (ఎస్ఎల్బీసీ) పనులు ఒక్కరోజు కూడా ఆగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని స్పష్టంచేశారు. ఆ గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతీ మూడు నెలల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను గ్రీన్ చానెల్ ద్వారా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.గురువారం తన నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ టన్నెల్ పూర్తవడం ఫ్లోరోసిస్ బాధిత జిల్లా అయిన నల్లగొండకు మాత్రమే కాకుండా తెలంగాణకు కీలకమని రేవంత్ చెప్పారు. గ్రావిటీ ద్వారా నీటిని ఇవ్వడానికి వీలున్న ఈ టన్నెల్ పనులు చాలా కాలంగా పెండింగ్లో పడటం వల్ల ఇబ్బందులు వచ్చాయన్నారు.ప్రణాళిక ప్రకారం అత్యంత నైపుణ్యంతో సొరంగం తవ్వకాల పనులు చేపట్టాలని సూచించారు. గతంలో జరిగిన తప్పులు, లోటుపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీగా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అనుభవం ఉన్న ఆర్మీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. కేస్ స్టడీగా ఉండాలి ఎస్ఎల్బీసీ ఏళ్లకేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్న కలల ప్రాజెక్ట్ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్లో దేశ విదేశాల్లో చేపట్టే టన్నెల్ ప్రాజెక్టులకు ఆదర్శంగా ఉండేలా దీని నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఇదొక కేస్ స్టడీగా ఉండాలని ఆకాంక్షించారు. అటవీ శాఖ, ఇంధన శాఖ, ఇరిగేషన్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెల 15లోగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు.ఒక్క సమావేశంలోనే అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకురావాలని నిర్ణయించారు. సొరంగం పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని.. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకునేది లేదని సీఎం స్పష్టం చేశారు. అవసరమైన యంత్ర పరికరాలతోపాటు సరిపడేంత మంది నిపుణులు, కారి్మకులను రంగంలోకి దింపాలని సూచించారు. స్పెషల్ సెక్రటరీ, ఇండియన్ ఆర్మీ కల్నల్ పరీక్షిత్ మెహ్రా మాట్లాడుతూ.. మొత్తం 44 కి.మీ. సొరంగమార్గానికిగాను ఇప్పటికే 35 కి.మీ. సొరంగం తవ్వడం పూర్తయిందని మిగిలిన సొరంగ మార్గం తవ్వడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు వివరించారు.ప్రతి నెలా 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెలీ–బోర్న్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుందని తెలిపారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్మీ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హర్ పాల్ సింగ్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వరద నష్టాలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ‘వందేళ్లలో రాని వరదలొచ్చి పెద్ద నష్టమే జరిగింది. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లాలో అమలు చేసే విధానం రాష్ట్రమంతటికీ విస్తరిస్తాం. ఇందుకు ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సమగ్ర నివేదిక రూపొందించాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లాలో గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు చూసి తగిన సాయం అందించాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చానని చెప్పారు. మళ్లీ వరదలు వచ్చి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. జిల్లా అధికారులంతా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాస్తవ నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. ఇక్కడ అమలు చేసే ప్రణాళిక రాష్ట్రమంతటికీ విస్తరించేందుకు ఉపయోగపడుతుందని, విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లా మోడల్గా నిలవాలని చెప్పారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్లతో కలిసి సీఎం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ రివ్యూ చేశారు. రైతులను ఓదార్చిన సీఎం సీఎం రేవంత్రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లింగంపేట మండలంలోని లింగంపల్లి కుర్దు వద్ద వరదలతో దెబ్బతిన్న వంతెనను, బూరుగిద్ద వద్ద కొట్టుకుపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. అక్కడి నుంచి కామారెడ్డి పట్టణంలో ముంపునకు గురైన జీఆర్ కాలనీకి వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వపరంగా సాయం అందించామని, ఫార్మా, బీడీ కంపెనీల ద్వారా పిల్లల అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సమీకృత కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావ్, లక్ష్మీకాంతరావ్, భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో వరద నష్టంపై సుదీర్ఘంగా సమీక్షించారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. నివేదికలు మార్గదర్శకాలకు లోబడి ఉంటేనే కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ సాయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. లేకపోతే మన ప్రతిపాదనలు తిరస్కారానికి గురై మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుందన్నారు. వరదలతో మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడిందని, తక్షణమే మరమ్మతులు చేశామన్నారు. అంతకుముందు తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ శివారులోని హెలిపాడ్ వద్ద దిగిన రేవంత్రెడ్డికి షబ్బీర్అలీ, జిల్లా కలెక్టర్ సంగ్వాన్ స్వాగతం పలికారు. పక్షం రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ లోపు అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి జరిగిన నష్టాలపై సరైన నివేదిక రూపొందించాలన్నారు. అలాగే, శాశ్వత పరిష్కారం చూపడానికి అయ్యే వ్యయానికి సంబంధించిన నివేదికలు కూడా తయారు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో కలిసి మంత్రి సీతక్క సమీక్ష చేస్తారని, ఆ లోపు నివేదికలు రూపొందించాలన్నారు. ఆ తరువాత తాను అందరితో కలిసి సమీక్ష చేస్తానని తెలిపారు. వరదలతో ఇసుక మేటలు వేసిన పొలాలను సరి చేయడానికి అధికారులంతా సమన్వయం చేసుకుని ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. యూరియా పంపిణీలో మార్పులు చేయాలి సహకార సంఘంలోనే యూరియా పంపిణీ చేయడం వల్ల వేలాది మంది రైతులు రావడం, వారికి సరిపోవడం లేదంటూ నెగెటివ్ ప్రచారం జరుగుతోందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. అలాకాకుండా రెండు మూడు గ్రామాలకు ఒక కేంద్రాన్ని తెరిచి అక్కడి రైతులకు అక్కడే యూరియా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల మధ్య సరైన సమన్వయం, సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రభుత్వం బద్నాం అవుతోందన్నారు. ఆస్పత్రుల్లో వైద్యుల హాజరుకోసం ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం అమలు చేయాలని వైద్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. వైద్యులు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కొడంగల్తో సమానంగా కామారెడ్డి కామారెడ్డి నియోజక వర్గాన్ని కొడంగల్తో సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తాను రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలు చూడాలి కాబట్టి ప్రజలు స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి చెబితే తనకు చెప్పినట్టేనని, ఆయన సహకారంతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. జిల్లాలో వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులను, రోడ్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. ఇళ్లు కూలిపోయిన పేదలకు ప్రత్యేక కోటా కింద ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిçస్తున్నామని, అలాగే పశువులు చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పారు. -
ఎస్ఎల్బీసీ.. సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ కేవలం నల్గొండ జిల్లాకే కాదని.. తెలంగాణకు అత్యంత కీలకమన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి ఎస్ఎల్బీసీలో అవకాశం ఉందన్నారు.‘‘శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలి. అటవీ శాఖ అనుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2027 డిసెంబరు 9 లోగా ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలి. ఎస్ఎల్బీసీ పనులకు గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలి. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకోను...సొరంగం తవ్వకంలో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. ఎస్ఎల్బీసీ పనులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ పూర్తి కావాలి. పనులు ఆగడానికి వీలు లేదు’’ అని రేవంత్రెడ్డి తేల్చి చెప్పారు. -
ఓనర్ రమణమ్మ గారూ.. రండి !
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో రిబ్బన్ కటింగ్కే సీఎం రేవంత్రెడ్డి పరిమితం కాలేదు. ఇంజనీర్ తరహాలో ప్రతీ గోడను పరిశీలించారు. ఎలా నిర్మించారు.. నాణ్యత ఉందా లేదా అని ఆరా తీశారు. నిర్మాణ నాణ్యతపై సంతృప్తి చెందిన సీఎం, ఇదే తరహాలో ఇతర చోట్ల కూడా నిర్మించాలని అధికారులకు సూచించారు.ఓనర్ రమణమ్మ గారూ.. రండి !బెండాలపాడులో గృహప్రవేశం సమయంలో పూజ పూర్తయిన వెంటనే కొబ్బరికాయ కొట్టే సమయంలో ‘ఇంటి ఓనర్ రమణమ్మ గారూ.. రండి’ అని సీఎం రేవంత్రెడ్డి పిలిచారు. ఇల్లు బాగుందని మెచ్చుకున్నారు. ఈ సమయంలో రమణమ్మ కూతురు లిఖితను ఏం చదువుతున్నావని ప్రశ్నించగా.. డిగ్రీ చదువుతున్నానని బదులిచ్చింది. బాగా చదువుకోవాలని సీఎం సూచించారు. అనంతరం ఆ ఇంటి ఆవరణలో కొబ్బరి మొక్క నాటి.. ఇది ఎంత ఎదిగితే మీ కుటుంబం అంత పచ్చగా ఉంటుందన్నారు. అనంతరం కుటుంబంతో ఫొటో దిగారు.ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ?‘నర్సమ్మా.. అంతా సంతోషమేనా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా’ అని రేవంత్రెడ్డి అడిగినప్పుడు ‘మాకు అంతా మంచే జరిగింది సార్, మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది.. సీఎం సార్ వచ్చి మా ఇల్లు ఓపెన్ చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ ఆమె బదులిచ్చింది. అనంతరం ఇంట్లో చాప మీద కూర్చున్నాక ఇంటిని పరిశీలిస్తూ పిల్లర్లు వేసి కట్టారా లేక గోడ మీదనే శ్లాబ్ వేశారా అని అడిగారు. పిల్లర్లు వేసి కట్టామంటూ నర్సమ్మ కుటుంబ సభ్యులు చెప్పగా.. అలా కడితేనే ఇల్లు బాగా ఆగుతుందని సీఎం అన్నారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డికి మక్క గారెలు, పాయసం అందించారు. నర్సమ్మ ఒడిలో ఉన్న ఆమె మనుమరాలు పాన్యశ్రీ వెన్సికకు సీఎం పాయసం తినిపించారు. ‘నీ పేరేంటి, ఏ ఊరు’ అని అడగగా.. ఆ చిన్నారి నమస్తే సార్ అంటూ బదులిచ్చింది. గృహ ప్రవేశం సందర్భంగా కుటుంబసభ్యులకు చీర, ప్యాంటు, షర్టులను ప్రభుత్వం తరఫున సీఎం అందించారు. తమ గ్రామానికి పీహెచ్సీ కావాలని సీఎంను కోరుదామనుకున్నామని, కానీ హడావుడిలో సాధ్యం కాలేదని ఇందిరమ్మ లబ్ధిదారులు తెలిపారు. -
మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు
సాక్షి ప్రతినిధులు, భద్రాద్రి కొత్తగూడెం/మహబూబ్నగర్: ‘ఏమైనా సమస్యలు ఉంటే కుటుంబంలో కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోండి.. కాదంటే కుల పెద్ద దగ్గరకు వెళ్లండి.. అదీ కుదరకపోతే మంత్రగాన్ని సంప్రదించండి. అంతేతప్ప మీ గొడవల మధ్యకు మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? ఒకప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ఉండకూడదని చూశారు. అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని జైళ్లకు పంపించారు. ఇప్పుడు వాళ్లకు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు. నేను హరీశ్రావు, సంతోష్రావు వెనుక ఉన్నానని ఒకరు.. కవిత వెంట ఉన్నానని మరొకరు అంటున్నారు. పదేళ్లలో దోచుకున్న అవినీతి సొమ్మును పంచుకోవడానికి వాళ్లు కొట్లాడుకుంటున్నారు. ఆ చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటా? మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు. నేను నాయకుడిని.. ఉంటే ముందే ఉంటా. పాలమూరు వెనుక, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా. వారికి తోడుగా ఉంటా. ప్రజల అభివృద్ధికి కృషి చేస్తా. మీ కుటుంబ, మీ కుల పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు. మాకు ఎలాంటి ఆసక్తి లేదు..’ అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడులో ఆయన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం నిర్వహించారు. అనంతరం దామరచర్లలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. అలాగే మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్జీడీ ఫార్మా కార్నింగ్ టెక్నాలజీస్ రెండవ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..చచ్చిన పామును నేనెందుకు చంపుతా..లక్షల కోట్లు దోచుకున్న నాయకుని ఇంట్లో ఈ రోజు నోట్ల కట్టల కోసం పొడుçచుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్లకు ఫామ్హౌస్లు, టీవీ చానళ్లు, వార్తా పత్రికలు, బంగ్లాలు ఎన్నో ఆస్తులు సంపాదించి ఇచ్చాడు. కానీ ఈ రోజు ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. కుటుంబ సభ్యులే ఒకరితో ఒకరు కొట్లాట పెట్టుకుంటున్నారు. ఆ గొడవల వెనక మనం ఉన్నామంటున్నారు. 2023 డిసెంబర్లోనే ఆ కాలనాగును తెలంగాణ ప్రజలు కర్రలతో కొట్టారు. అది ప్రజలను దోచుకుంటున్న అనకొండ అని పెద్ద బండరాయితో తలమీద కొట్టి బొంద పెట్టారు. ఆ చచ్చిన పామును నేను ఎందుకు చంపుతాను.ప్రకృతి శిక్షిస్తూనే ఉంటుంది..ఒకప్పుడు జనతాపార్టీకి గొప్ప పేరు ఉండేది. అది కనుమరుగైంది. కొంతమంది కుట్రల వల్ల తెలుగుదేశం పార్టీ తెలంగాణలో సమస్యను ఎదుర్కొంటోంది. ఇన్ని దుర్మా ర్గాలు చేసిన మీరు ఎట్లా మనుగడ సాగిస్తారు? ప్రకృతి అనేది ముందుంది.. అది శిక్షిస్తూనే ఉంటుంది. చేసిన పాపా లు వెంటాడుతూనే ఉంటాయి. అనుభవించి తీరాల్సిందే. శీనన్నపై నా అంచనాలు తప్పలేదుఈ రోజు నాయకపోడు మహిళ రమణమ్మకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె కళ్లలో కనిపించిన ఆనందం చూస్తుంటే.. గతంలో జూబ్లీహిల్స్లో డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నప్పుడు నేను పడిన సంతోషం గుర్తుకొచ్చింది. ఆ సంతోషం డబ్బుతో వచ్చేది కాదు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు నాకు బలమైన మనిషి అవసరం పడింది. అందుకే హైకమాండ్ దగ్గర పట్టుబట్టి మరీ గృహ నిర్మాణ శాఖను పొంగులేటి శీనన్నకు కేటాయించా. నా అంచనాలు తప్పలేదు.. ఢిల్లీ ముందు తలదించుకోవాల్సిన అవసరం లేకుండా అప్పగించిన పనిని 99.99 శాతం శీనన్న నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. వైఎస్సార్ హయాంలో 2004లో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 20 లక్షల ఇళ్లు కట్టించాం. హనుమాన్గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండదు.పాలమూరును చూడటానికి విదేశీయులు రావాలిఒకప్పుడు పాలమూరులో మన కరువును, పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని చూపించడానికి అప్పటి ముఖ్యమంత్రు లు విదేశాల నుంచి పర్యాటకులు, ప్రెసిడెంట్లను తీసుకొచ్చా రు. టోనీబ్లెయిర్ వచ్చిండంటే మన పేదరికం ఎగ్జిబిషన్గా ఉండే. ఇప్పుడు ప్రజలు, మన సాగునీటి ప్రాజెక్టులు, విద్యావసతులు చూడడానికి విదేశాల నుంచి రావాలి. దేవరకద్ర ఎమ్మెల్యే కోరినట్లు డ్రైపోర్టు ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకొంటాం. విదేశాల నుంచి మేధావులు ఇక్కడి ట్రిపుల్ ఐటీని చూసేందుకు రావాలి.దత్తత గ్రామానికే న్యాయం చేయలేదు: మంత్రి పొంగులేటిదామరచర్ల సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వాసాలమర్రి గ్రామాన్ని సీఎం హోదాలో కేసీఆర్ దత్తత తీసుకున్నారని, ఆ గ్రామంలో ఓ 90 ఏళ్ల అవ్వకు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చి నిలుపుకోలేదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఆ అవ్వకు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇచ్చిందని తెలిపారు. గృహ ప్రవేశం చేసి.. పట్టు వస్త్రాలు అందజేసి..సీఎం బెండాలపాడు చేరుకోగానే స్థానికులు ఆయనకు కొమ్ముకోయ నృత్యాలతో స్వాగతం పలికారు. నాయక్పోడు మహిళ బచ్చల రమణ ఇంటికి సీఎం వెళ్లారు. రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్లి అన్ని గదుల్లో కలియదిరిగారు. దేవుడి పటాల ముందు జ్యోతి వెలిగించి కుటుంబ సభ్యులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఇంటి ఆవరణలో మొక్కలకు నీరు పోశారు. అనంతరం కుటుంబ సభ్యులతో గ్రూప్ ఫొటో దిగారు. ఆ తర్వాత బచ్చల నర్సమ్మ ఇంటి గృహప్రవేశంలో సీఎం పాల్గొన్నారు. ముందు గదిలో చాపపై కూర్చుని మిఠాయిలు తిన్నారు. ఇంటి యజమానురాలి మనవరాలికి పాయసం తినిపించారు. వారికి వస్త్రాలు అందజేసి గ్రూప్ ఫొటో దిగారు. కాగా సీఎం రేవంత్రెడ్డిని, మంత్రి పొంగులేటిని ఇందిరమ్మ ఇంటి యజమానులు సత్కరించారు.మీ పిల్లలకు కొరియా, జపాన్లో ఉద్యోగాలు ఇప్పిస్తా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ఐటీ చదివిన వారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందరికీ ఐటీ కోర్సులు చదివే అవకాశం రాకపోవచ్చు. సాధారణ విద్యతోనే సరిపెట్టుకోవాల్సి రావొచ్చు. ఇ లాంటి వారికి కూడా ఏటీసీలతో స్కిల్స్ నేర్పించి సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉద్యోగం చేసే అవకాశాన్ని మా ప్రభుత్వం కల్పిస్తుంది’అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. దామరచర్ల సభలో రేవంత్ బుధవారం మాట్లాడుతూ.. గత సీఎం ప్రజలను గొర్రెలు కాసుకోమని, చేపలు పట్టుకోమని, చెప్పులు కుట్టుకోమని చెప్పి.. ఆయన పిల్లలను రాజ్యాలు ఏలాలి, ప్రజా సంపద దోచుకోవాలని చెప్పారని విమర్శించారు. తమ ప్రభుత్వం అలా ఉండదని, పేదరికం రూపుమాపే, తలరాతను మార్చే శక్తి ఉన్న విద్యను అందించడంపై దృష్టి పెడుతోందని తెలిపారు. కొందరు నాయకులకు పేదరికం ఎక్స్కర్షన్ వంటిదని, కానీ తనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేదరికంలోనే పుట్టి, అందులోనే పెరిగామని చెప్పారు. అది తమ జీవన విధానంలో ఓ భాగమని అన్నారు. తల్లులూ సంతోషంగా ఉన్నారా?!చండ్రుగొండ: ‘తల్లులూ.. సంతోషంగా ఉన్నారా? మేం వచ్చాక రేషన్కార్డులు, సన్న బియ్యం ఇచ్చాం.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. మీ ఊర్లో ఎందరికి ఇళ్లు వచ్చాయి?’అని చండ్రుగొండ మండలం బెండాలపాడులో గృహప్రవేశాల సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మహిళలను ఆరా తీశారు. సీఎం ప్రశ్నకు మహిళలంతా ముక్తకంఠంతో 310 మందికి వచ్చాయని సమాధానం చెప్పారు. దీంతో సీఎం స్పందిస్తూ ‘మీ కళ్లల్లో సంతోషమే మీరు ఎంత ఆనందంగా ఉన్నారో చెబుతోంది’అని అన్నారు. మీ ఇంటి మంత్రి ఎవరు? అని సీఎం ప్రశ్నించగా.. ఆదివాసీ మహిళలు ‘పొంగులేటి అన్న’అని చెప్పారు. ‘దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఇళ్లు కట్టుకుంటే.. మళ్లీ ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలతో కళ కనిపిస్తోంది’అని సీఎం తెలిపారు. బెండాలపాడులో బచ్చల రమణ, బచ్చల నరసమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేయించిన సీఎం పూజ చేశారు. ఇల్లు రావడమే గొప్ప అనుకున్నాం.. ఇందిరమ్మ ఇల్లు రావడమే గొప్ప అనుకున్నా. అలాంటిది ఇంటి నిర్మాణం పూర్తి కావడం.. స్వయంగా ముఖ్యమంత్రి మాకు బట్టలు పెట్టి గృహప్రవేశం చేయించడాన్ని నమ్మలేకపోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మేలు మరిచిపోలేము. సీఎం సార్ను శాలువాతో సన్మానించాం. నా కూతురు ఝాన్సీ, ఆమె బిడ్డ వెన్సికతో సీఎం మాట్లాడి పేర్లు అడిగారు. – బచ్చల నరసమ్మ, లబ్దిదారు, బెండాలపాడు ఈ సంతోషం మాకెప్పటికీ పదిలం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మా ఇంటికి వచ్చి మాతో గృహప్రవేశం చేయించడం ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని జీవితకాలం పదిలంగా గుండెల్లో దాచుకుంటాం. మా ఇంట్లో సీఎం రేవంత్రెడ్డి పూజ చేశారు. మేము వండిపెట్టిన పాయసం, గారెలు తిన్నారు. ఇలాంటి పాలన ఉంటే పేదల బతుకులు మారినట్లే. – బచ్చల రమణ, లబి్ధదారు, బెండాలపాడు -
కవిత వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
-
కవిత కామెంట్స్పై సీఎం రేవంత్ రియాక్షన్
సాక్షి,మహబూబ్నగర్: మాజీ మంత్రి హరీష్రావు,సంతోష్రావు వెనక సీఎం రేవంత్రెడ్డి ఉన్నారంటూ మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్జీడీ ఫార్మా రెండో యూనిట్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యలు,బీఆర్ఎస్ గురించి మాట్లాడారు.కాలగర్భంలో బీఆర్ఎస్ కలిసిపోతుంది. జనతా పార్టీకి పట్టిన గతే బీఆర్ఎస్కు పడుతుంది. అవినీతి సొమ్ము పంపకంలో తేడాతోనే కొట్టుకుంటున్నారు. మీ పంచాయితీలోకి నన్నెందుకు లాగుతున్నారని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
‘ఇందిరమ్మ’ గృహప్రవేశానికి సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్రెడ్డి బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామానికి రానున్నారు. గృహప్రవేశం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3:15 గంటలకు రోడ్డు మార్గంలో అదే మండలంలోని దామరచర్ల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. గంటపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ఏర్పాట్లలో బిజీబిజీ.. రెండు రోజులుగా సీఎం టూర్ షెడ్యూల్ ఉన్న ప్రాంతాల్లో బురదను తొలగించడం, జంగిల్ క్లియరెన్స్తో పాటు సభాస్థలిలో బురద నీళ్లు తోడటం వంటి పనులు నిరి్వరామంగా జరుగుతున్నాయి. మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం – విజయవాడ జాతీయ రహదారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గంలో వెళ్లాల్సిన వాహనాలను కల్లూరు–తల్లాడ–ఏన్కూరు మీదుగా దారి మళ్లించారు. ప్రారంభం కూడా ఇక్కడే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 మార్చి 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ప్రారంభించిన జిల్లాలోనే ఇప్పుడు గృహప్రవేశ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుండటం గమనార్హం. ఎస్జీడీ ఫార్మా రెండో యూనిట్ ప్రారంబోత్సవానికి...సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: సీఎం రేవంత్రెడ్డి బుధవారం మహబూబ్నగర్ జిల్లాకు రానున్నారు. మూసా పేట మండలం వేముల శివారులో ఉన్న ఎస్జీడీ ఫార్మా కార్మింగ్ టెక్నాలజీస్ కంపెనీ రెండో యూనిట్ను సీఎం ప్రారంభిస్తారు. హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.30గంటలకు వేముల ఎస్జీడీ ఫార్మా పరిశ్రమ వద్దకు చేరుకుంటారు. రెండో యూనిట్ను ప్రారంభించిన తర్వాత కొద్దిసేపు పరిశ్రమ ఉద్యోగులు, ఇతర అధికారులతో సీఎం ముచ్చటిస్తారు. అనంతరం 12.45 గంటలకు హెలికాప్టర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళతారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం, బహిరంగ సభ అనంతరం సాయంత్రం 4:25 గంటలకు చండ్రుగొండ నుంచి హైదరాబాద్కు హెలికాప్టర్లో సీఎం తిరుగు ప్రయాణం అవుతారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వామ్యం కావాలిసిమెంట్, స్టీల్ పరిశ్రమల యజమానులతో డిప్యూటీ సీఎం భట్టి సాక్షి, హైదరాబాద్: ప్రజాప్ర భుత్వం మహోన్నత ఆశయంతో మానవీయకోణంలో ప్ర తిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సంక్షేమ పథకం వి జయవంతానికి రాష్ట్రంలోని సిమెంట్, స్టీల్ పరిశ్రమలు భాగస్వామ్యం కావాలని డి ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. మంగళవా రం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబుతో కలిసి సిమెంట్, స్టీల్ పరిశ్రమల యజమానులు, ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణ యించిందని, ఇప్పటికే వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. స్టీల్, సిమెంట్ పరిశ్రమలను ఈ రాష్ట్రంలో ఎంతగానో ప్రోత్సహించామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించి, భారీ భవంతుల నిర్మాణానికి ఏవిధమైన నాణ్యతతో సరఫరా చేస్తారో అలాగే రాజీ పడకుండా ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై చేయూతనివ్వాలని శ్రీధర్బాబు కోరారు. పెద్ద, చిన్న అనే అంతరం లేకుండా కంపెనీలన్నీ ఒకే ధరకు సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలన్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్ర భుత్వ పథకాలకు సిమెంట్ కంపెనీలు అందిస్తున్న ధరలపై సమావేశంలో సమీక్షించారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 27.75 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ అవసరం అవుతుందని అధికారులు పరిశ్రమల యజమానులు, నిర్వాహకులకు వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రోత్సాహం అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని సిమెంట్, స్టీల్ కంపెనీల యజమానులు, ప్రతినిధులు తెలిపారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వీలైనంత త్వరగా సమావేశమై ధరలు ఫైనల్ చేస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి పాల్గొన్నారు. -
రేవంత్ కాన్వాయ్కు 18 చలాన్లు!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్ వెహికల్స్ మీద 18 చలాన్లు పడ్డాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా చలాన్లు పడినట్లు తెలుస్తోంది. ఇక చలాన్లు పడిన పలు వాహనాలకు ఒకటే నెంబర్ ప్లేటు ఉంది. కాన్వాయ్ సెక్యూరిటీ లేకుండా రోడ్లపైకి పలు వాహనాలు తిరిగాయి. ఇక TG09RR0009 బీఎండబ్ల్యూ కారు రాత్రిపూట సెక్యూరిటీ లేకుండా ఔటర్ రింగ్ రోడ్ మీద తిరిగినట్లు తెలుస్తోంది. -
ఏ సవాల్కైనా సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ‘నేను ఫలానా అని ముద్ర వేస్తూ కొంద రు మాట్లాడుతున్నారు. అలా అంటే ఈ రాజకీయాలు నాకెందుకులే అని వెనక్కు తగ్గుతానేమో అనుకున్నారు. కానీ నేను ఎలాంటి సవాల్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా’అని విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ మాట (నక్సలైట్) అన్నందుకు తనకు బాధ కలగలేదని చెప్పారు.వారు మాట్లాడినంత మాత్రాన తాను సుప్రీంకోర్టు జడ్జిగా ఇచి్చన తీర్పులో ఒక్క అక్షరాన్ని కూడా మార్చలేరని చెప్పారు. అసలు ఆ తీర్పు గురించి మాట్లాడే ముందు ఒక్కసారి చదివి మాట్లాడాలని హితవు పలికారు. అలా చదివి మాట్లాడితే తనపై ఉపయో గించిన భాషా ప్రయోగం జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో జస్టిస్ సుదర్శన్రెడ్డి, ఇండియా కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతల మధ్య పరిచయ కార్యక్రమం జరిగింది. ఏ పార్టీ సభ్యత్వం తీసుకోను.. ఈ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ రా జ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలు మసకబారుతున్న సందర్భంలో గొంతెత్తి మాట్లాడే కర్తవ్యం ప్రతి పౌరుడిపైనా ఉంటుందన్నారు. అందుకే తాను ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి అంగీకరించానని చెప్పారు. తాను రాజకీయ ముళ్ల కిరీటాన్ని నెత్తిన పెట్టుకోలేదని.. భవిష్యత్తులోనూ ఏ పార్టీ సభ్యత్వం తీసుకోనని స్పష్టం చేశారు. తాను రాజకీయేతర వ్యక్తిని కాదని.. రాజ్యాంగంపట్ల విధేయతతో ఓటు వేసే ప్రతి పౌరుడికీ రాజకీయాలతో అవినాభావ సంబంధం ఉంటుందని జస్టిస్ సుదర్శన్రెడ్డి వివరించారు. మరింత ప్రమాదంలోకి ప్రజాస్వామ్యం... దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోందని జస్టిస్ సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యుడికి ఆయుధంగా ఓటు హక్కును ఇవ్వాలని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భావించారని, కానీ ఓటరు జాబితాను చిత్తు కాగితంలా మార్చి ఇష్టం ఉన్నవారి పేర్లను జాబితాలో చేర్చి.. ఇష్టంలేని వారి పేర్లు తీసేయడం ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఇదే ధోరణితో వెళ్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించను.. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు తాను పార్టీల బలాబలాలను చూసుకోలేదని జస్టిస్ సుదర్శన్రెడ్డి చెప్పా రు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకను హిమాలయాలపై ఎగురవేశానని చెప్పేంత వెర్రివాడిని కాదని.. కానీ తెలంగాణ ప్రతిష్టకు, ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ఏ పనీ చేయనని చెప్తానన్నారు. తాను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని, దేశంలోని ప్రతిపక్ష పార్టీల అభ్యర్థినని జస్టిస్ సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఇండియా కూటమిలో లేని ‘ఆప్’సహా మరికొన్ని పార్టీలు తనకు మద్దతిచ్చాయని చెప్పారు. రెండు విధానాల మధ్య పోటీ: సీఎం రేవంత్ ఈ ఎన్నిక రెండువిధానాల మధ్య జరుగుతోందని.. రాజ్యాం గాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసే వారు.. రాజ్యాంగాన్ని రక్షించి పేదలందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలనే వారి మధ్య పో టీ జరుగుతోందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తెలుగు గౌ రవాన్ని, ప్రతిష్టను పెంచేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఒ క్కతాటిపైకి రావాలని కోరారు. జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్, వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, కేసీఆర్, ఒవైసీలు జస్టిస్ సుదర్శన్రెడ్డికి మద్దతివ్వాలని కోరారు.తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 42 మంది లోక్సభ, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొన్నారు. -
ఆ ఇద్దరి వల్లే కేసీఆర్కు మరక: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధినేత పక్కన ఉంటూ ఆయన పేరు చెప్పుకుని అనేక రకాలుగా లబ్ధి పొందిన వారు చేసిన చెత్త పనుల వల్లే కేసీఆర్కు అవినీతి మరక అంటిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్కు అవినీతి మరక అంటడంలో మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్రావుతో పాటు కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డి పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మేజర్ పాత్ర ఉన్నందునే ఐదేళ్ల పాటు నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్రావును రెండోసారి ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ దూరంగా పెట్టారన్నారు. అమెరికా పర్యటన నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. సాయంత్రం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇలాగైతే పార్టీ ఎలా ముందుకు పోతుంది? ‘కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి, ఆయనపై ఆరోపణలు రావడానికి కారకులెవరో బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్ ప్రజల కోసం ఆలోచిస్తే.. వీళ్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సొంత వనరులు, ఆస్తుల కోసం ఆలోచించారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోని వ్యక్తి కేసీఆర్ వైపు వేలెత్తి చూపి సీబీఐ విచారణ జరుపుతా అనేందుకు కారకులు ఎవరు? హరీశ్రావు, సంతోష్రావు నా మీద వ్యక్తిగతంగా అనేక కుట్రలు చేసినా ఇన్నాళ్లూ పేరు పెట్టి విమర్శించలేదు. కానీ ఇలాంటి వారిని మోస్తూ పోతే పార్టీ ఎలా ముందుకు పోతుంది? బీఆర్ఎస్ నాయకులకు కోపం వచ్చినా చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పదు..’అని కవిత అన్నారు. నన్ను విమర్శిస్తే ఖబడ్దార్! ‘హరీశ్, సంతోష్ వెనుక సీఎం రేవంత్ ఉంటూ వాళ్లను అన్ని విషయాల్లో కాపాడుతూ కేసీఆర్ను బదనాం చేస్తున్నారు. బీఆర్ఎస్ను ఇబ్బంది పెడుతున్న అవినీతి అనకొండలను ఏమీ అనడం లేదు. అంతర్గతంగా వారి నడుమ ఉన్న అవగాహన బయటకు రావాలి. నన్ను.. బీజేపీ, కాంగ్రెస్, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని రేపటి నుంచి సోషల్ మీడియాలో విమర్శిస్తే ఖబడ్దార్. నేను ఎవరో చెప్తే ఆడే తోలు»ొమ్మను కాను. నాది కేసీఆర్ రక్తం. స్వతంత్రంగా నేను అనుకున్న విషయాలను చెప్తా. రాజకీయంగా నాకు జరిగే కష్టం, నష్టాన్ని భరించేందుకు సిద్ధం. మా నాన్నకు లేఖ రాసిన నాటి నుంచి నాకు నరకం చూపిస్తూ సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్లు రాయిస్తున్నారు. కేసీఆర్పై సీబీఐ విచారణ అంటే కడుపు రగులుతోంది. అభివృద్ధి విషయంలో కేసీఆర్ నిజాం బాటలోనే నడుస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారు. అలాంటి ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్పై అభాండాలు వేస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మా నాన్న పరువు పోతే నాకు బాధ. కానీ మీకు మాత్రం డబ్బులు కావాలి. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి. బీఆర్ఎస్ నాయకులు తిట్టుకున్నా, స్థానిక ఎన్నికల్లో నష్టం జరుగుతుందని అనుకున్నా సరే. మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం ఎన్నికల్లో ఒకసారి ఓడిపోతారు.. మరోసారి గెలుస్తారు. ఇలాంటి దుర్మార్గుల వల్లే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బులు, టీవీలు, సోషల్ మీడియా ఉన్నాయని ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం. కేసీఆర్పై పీసీ ఘోష్ కమిషన్లు, సీబీఐ విచారణలు వేస్తే తెలంగాణ బంద్కు పార్టీ పిలుపునివ్వాలి కదా? కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే సీబీఐ విచారణకు ఆదేశించారు. నేను చెప్పిన పేర్లు ఉన్న వారితో రేవంత్కు అవగాహన లేకపోతే వారిపై విచారణ జరపాలి. కేసీఆర్ పేరు చెప్పుకోనిదే రేవంత్కు పూట గడవడం లేదు. వాస్తవానికి కేసీఆర్కు తెలంగాణ తప్ప.. తిండి, డబ్బు ధ్యాస ఉండదు. విచారణ నుంచి కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.’అని కవిత పేర్కొన్నారు. -
MLC Kavitha: మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీ వేశారు.. కడుపు రగిలిపోతోంది
-
CM Revanth: రాజకీయాలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపిద్దాం
-
తీర్పు పేరుతో భయపెట్టాలని చూశారు.. అది సాధ్యం కాదు: సుదర్శన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి గెలుపు అవసరం అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే తాను ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సుదర్శన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీపీఐ సీనియర్ నేత నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, కర్ణాటక రాజ్యసభ సభ్యుడు నసీర్ హుస్సేన్, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఏ పార్టీతో సంబంధం లేదు, సభ్యత్వం కూడా లేదు. ఓటు చోరీ జరుగుతున్న ఈ సమయంలో న్యాయ కోవిదుడి గెలుపు అవసరం. మీ ఆత్మప్రబోధానుసారం ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయండి. రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్డీయే ప్రయత్నిస్తోంది. సుదర్శన్ రెడ్డి గెలుపు తెలుగు వారి ప్రతిష్ట పెరుగుతుంది. ఓట్ల చోరీతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోంది. పార్టీలకు అతీతంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాం. సుదర్శన్ రెడ్డి రాకతో ఎన్డీయేకు బలమైన పోటీ ఇస్తున్నాం. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో సుదర్శన్ రెడ్డి గెలుపు అవసరం. ఉపరాష్ట్రపతి రాజీనామా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాలు పక్కన పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అసదుద్దీన్ ఒవైసీలు మద్దతు ఇవ్వాలని గతంలో విజ్ఞప్తి చేశాను. మళ్ళీ కోరుతున్నాను అని అన్నారు. అనంతరం, అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి ప్రవేశించలేదు. నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఇక ముందు కూడా ఉండదు. రాజకీయం అనే ముళ్ల కిరిటాన్ని నెత్తి మీద ఎందుకు పెట్టుకున్నావు అని చాలా మంది అడిగారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని చెప్పాను. పౌర హక్కులు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాను. ఒక తీర్పు గురించి చర్చను ప్రారంభించారు. ఆ తీర్పు గురించి చర్చిస్తే నేను భయపడతానని అనుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి చర్చ చేసేటప్పుడు ముందు దాన్ని చదవాలి’ అని హితవు పలికారు. -
CBI గురించి రాహుల్ ఏమన్నారో మీకు తెలియదా రేవంత్..!
-
రేవంత్.. కొండను తవ్వి ఎలుకను పట్టారా?: లక్ష్మణ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ బిల్లుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్. ఇదే సమయంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా? అని ప్రశ్నించారు. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు. కాళేశ్వరం అవినీతి రుజువులన్నీ సీబీఐకి అప్పగించాలి. 22 నెలల తర్వాత రేవంత్కు కనువిప్పు కలిగింది. ఆరు నెలల్లో నిగ్గు తేల్చుతామని అన్నవారు ఎందుకు కాలయాపన చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా?. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్కు చిత్తశుద్ది లేదు. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు?. బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉంది. నెహ్రు నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు బీసీలను మోసం చేశారు. కాలయాపన కొరకే ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు.సీబీఐకి అన్ని ఆధారాలు ఇవ్వాలి. లేదంటే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుంది. ప్రజలకు ఉన్న అనుమానాలు నివృతి చేయాలి. కాంగ్రెస్ బీసీ బిల్లుపై మొదటి నుంచి ద్వంద్వ వైఖరి పాటిస్తుంది. ఒక్కసారేమో ఆర్డినెన్సు అన్నారు. ఇంకోసారి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి ధర్నా చేశారు. అసలు న్యాయపరమైన చిక్కులకు మీరు తీసుకున్న చర్యలు ఏంటి?. నెపంతో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. బీసీల కొరకు సర్వే చేశారా? ముస్లిం కొరకు సర్వే చేశారా?. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. బిల్లు పెట్టడమే కాదు బిల్లు పాస్ అయ్యేలా సీఎం రేవంత్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. బీజేపీ బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది’ అని చెప్పుకొచ్చారు. -
సీబీఐకి కాళేశ్వరం.. చేతులెత్తేసిన సీఎం..!?
-
‘‘మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా?’’
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకట ఆధారంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కాంగ్రెస్పై సెటైర్లు సంధించారు. సత్యమేవ జయతే అంటూ కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో.. ‘‘కాళేశ్వరంను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ కరెన్సీ మేనేజర్(CM) నిర్ణయం తీసుకున్నారు. విపక్ష పార్టీలను నాశనం చేసే సెల్గా సీబీఐని గతంలో రాహుల్ గాంధీ అభివర్ణించారు. మిస్టర్ గాంధీ.. మీ సీఎం ఏం చేస్తున్నారో మీకు తెలుసా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే.. The Currency Manager (CM) of Rahul Gandhi in Telangana has decided to handover Kaleshwaram case to CBIThe very CBI that @RahulGandhi had famously called “Opposition Elimination Cell” of the BJPHave you any clue Mr. Gandhi on what your CM is doing? Bring it on, whatever it… pic.twitter.com/3vBYbf5Atd— KTR (@KTRBRS) September 1, 2025ఎన్ని కుట్రలు చేసినా సరే.. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని, న్యాయయ వ్యవస్థ, ప్రజలపై మాకు నమ్మకం ఉంది అని ట్వీట్లో పేర్కొన్నారాయన. ఇదిలా ఉంటే.. గతంలో దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభావితం చేస్తోందని చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్ను కేటీఆర్ తన ట్వీట్లో పోస్ట్ చేశారు. సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థలను రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలపై టార్గెట్ చేస్తున్నారని గతంలో రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. తద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తీవ్రవ్యాఖ్యలే చేశారాయన. -
తెలంగాణకు మళ్లీ సీబీఐ.. ప్రభుత్వ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు నిర్ణయించింది. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ తర్వాత సీబీఐ దర్యాప్తుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సీబీఐకి కేసు అప్పగించేందుకు ప్రత్యేక ప్రొసీజర్ను తీసుకువచ్చారు. రాష్ట్రంలోకి సీబీఐ రాకపై ఉన్న నిషేధ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కాగా, 2022లో సీబీఐ రాకపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం జరిగిన ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, జస్టిస్ పీసీ ఘోస్ విచారణ కమిషన్ నివేదిక’పై జరిగిన సుమారు తొమ్మిదిన్నర గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 1:40 గంటల వరకు సాగిన శాసనసభ చర్చలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. -
కాళేశ్వరంపై సీబీఐ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
-
కాళేశ్వరం కేసు సీబీఐకి. కాళేశ్వరం నివేదికపై తెలంగాణ శాసనసభలో చర్చ తర్వాత ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి
-
కల్వకుండా చేసే కుటుంబమది!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుటుంబం రాష్ట్రంలో వివిధ సామాజికవర్గాలు సుహృద్భావంతో కలిసిపోకుండా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించటం కల్వకుంట్ల కుటుంబానికి ఇష్టంలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం గరిష్ట పరిమితిని ఎత్తివేసేందుకు ప్రతిపాదించిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై ఆదివారం శాసనసభలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు గంగుల కమలాకర్ చేసిన విమర్శలకు సీఎం రేవంత్ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘అది కల్వకుంట్ల కాదు.. ఎవరినీ కల్వకుండ చూసే కుటుంబం. బీసీలు, ఓసీలు కలవొద్దు.. ఎస్సీలు, ఎస్టీలు కలవొద్దు.. హిందువులు, ముస్లింలు కలవకుండా చూసే కుటుంబం అది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సంతోషంగా ఉండేవారిలో మొదటి వరుసలో తాను ఉంటానని గంగుల కమలాకర్ అన్నారు. కానీ వాళ్ల నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు సంతోషంగా ఉంటారని చెప్పలేదు. వాళ్ల నాయకులు కడుపునిండా విషం పెట్టుకుని ఉన్నారని చెప్పకనే చెప్పారు’అని దుయ్యబట్టారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం.. హైకోర్టు ఆదేశాలను అనుసరించే రాష్ట్రంలో కుల గణన నిర్వహించామని సీఎం తెలిపారు. ‘బీసీల గణన బాధ్యతను తొలుత రాష్ట్ర బీసీ కమిషన్కు అప్పగించగా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఆ ప్రక్రియ చేపట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. పిటిషన్ విచారించిన హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరుక్షణమే డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసి కుల గణన నిర్వహించాం. ఎలాంటి అడ్డంకులు రాకూడదనే అధికారుల కమిటీని, మంత్రులను ఇతర రాష్ట్రాలకు పంపి సమాచారాన్ని సేకరించాం. న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను పరిశీలించిన తరువాతనే డెడికేటెడ్ కమిషన్ను నియమించాం. ఈ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 4న ప్రారంభించి 2025 ఫిబ్రవరి 4న పూర్తిచేశాం. 365 రోజుల్లోనే పకడ్బందీగా చట్టాన్ని చేసి స్థానిక సంస్థల్లో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మంత్రివర్గ తీర్మానం చేసి శాసనసభలో ఆమోదించుకుని.. విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్కు పంపించాం. గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు. 5 నెలలుగా ఆ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. సెపె్టంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది’అని సీఎం గుర్తు చేశారు. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా లాబీయింగ్ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలని గత ప్రభుత్వం 2018, 2019లో తీసుకొచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు గుదిబండగా మారాయి. అందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని గవర్నర్కు పంపించాం. ఒకప్పుడు ఓ రాష్ట్రానికి ఆయన (గవర్నర్) ఆర్థిక మంత్రి. ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి (ఈటల రాజేందర్)గా పనిచేసిన ఆయనతో మితృత్వం ఉంది. రాష్ట్రపతికి పంపించాలని తెరవెనుక లాబీయింగ్ చేస్తే ఈ ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి వద్దకు పోయింది. ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదు కాబట్టి అత్యవసరంగా ఆ బిల్లును సభలో ఆమోదించుకుందాం అంటే ఏదేదో మాట్లాడుతున్నారు. బీసీ కమిషన్కు ఇచ్చిన జీఓనైనా, డెడికేటెడ్ కమిషన్కు ఇచ్చిన జీఓనైనాం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆకాంక్షతోనే ఇచ్చాం’అని సీఎం స్పష్టం చేశారు. ఐదుసార్లు కోరినా ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. పెండింగ్ బిల్లులపై సంప్రదించేందుకు ఐదుసార్లు ప్రధానికి లేఖ రాసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. అందుకే ప్రధాని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించినట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు, గంగలు కమలాకర్ అటువైపు కన్నెత్తి చూడలేదని.. అంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ల పార్టీ నాయకుడు సిద్ధంగా లేరని అర్థమవుతోందని ఆరోపించారు.బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ తన పలుకుబడితో ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. ‘రాహుల్గాంధీ ధర్నాకు రాలేదని గంగుల అన్నారు. రాహుల్గాంధీ చెప్పకపోతే ఇంత ముఖ్యమైన పని నేను చేస్తానా? రాహుల్గాం«దీకి తెలియకుండా ఏదీ చేయను. వందేళ్లుగా చేయని పనిని మేం చేస్తే.. కేసీఆర్ సభకు వచ్చి మమ్మల్ని అభినందించి ఉంటే పెద్దరికం పెరిగి ఉండేది. వారేమో రారుం..వచ్చిన వాళ్లు ఇలా ఉన్నారు’అని సీఎం మండిపడ్డారు. -
కాళేశ్వరంపై సీబీఐ: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి విచారణ అప్పగించడం సముచితమని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు. శాసనసభలో ఆదివారం జరిగిన ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, జస్టిస్ పీసీ ఘోస్ విచారణ కమిషన్ నివేదిక’పై జరిగిన సుమారు తొమ్మిదిన్నర గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమాధానం ఇచ్చారు. ఆదివారం అర్ధరాత్రి 1:40 గంటల వరకు సాగిన శాసనసభ చర్చలో సీఎం రేవంత్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. లోతైన దర్యాప్తు అవసరం.. ‘తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ (సీఓఐ)ను నియమించింది. విచారణ కమిషన్ తన నివేదికను ఈ ఏడాది జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. గత నెల 4న జరిగిన మంత్రిమండలి సమావేశం ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కేబినెట్ చేసిన తీర్మానం ప్రకారం ఈ నివేదికపై శాసనసభలో చర్చ జరిగింది. పీసీ ఘోష్ విచారణ కమిషన్ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని.. అసలు ప్రణాళిక లేదని కమిషన్ తేల్చిచెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి’ అని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్ల కోసమే మేడిగడ్డకు మార్పు ‘కేసీఆర్ ఆదేశాల మేరకే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. లిఫ్టులు, పంపుల సంఖ్య పెరగడంతోనే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగంది. కాంట్రాక్టర్ల కమీషన్లకు తలొగ్గి నిర్మాణ లోపాలపై కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మేడిగడ్డ కుప్పకూలింది. దుర్మార్గంగా ఆలోచించి దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ దోచుకున్నాడు. కేసీఆర్కు, ఆయన కుటుంబానికి వందల ఎకరాలు, ఫామ్హౌస్లు, మీడియా సంస్థలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 85,449 కోట్లు అప్పు తీసుకున్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ఊరుపేరు మార్చి రూ. 1.50 లక్షల కోట్ల భారాన్ని తెలంగాణపై మోపారు. తెచ్చిన రుణంలో ఇప్పటివరకు అసలు, వడ్డీ కలుపుకుని రూ. 49,835 కోట్లు బ్యాంకులకు అప్పు చెల్లించాం. అసంపూర్తిగా మిగిలి ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ. 47 వేల కోట్లు అవసరం ఉంది. లోపభూయిష్ట నిర్ణయాలతో ఆర్థికభారం మోపిన కేసీఆర్, హరీశ్రావును శిక్షించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిచేయాల్సిన ప్రాణహిత ప్రాజెక్టు ఉసురు తీసి ఉరి వేసింది కేసీఆర్ కాదా? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా తెచ్చిన అప్పులను రీ–స్ట్రక్చర్ చేసి వడ్డీ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. నేను ఢిల్లీకి సర్కస్ చూడటానికి వెళ్లడం లేదు. ఇప్పటివరకు ప్రధాని మోదీని కలిసి రూ. 26,400 కోట్ల రుణం రీ–స్ట్రక్చర్ చేసి ఏటా రూ. 4 వేల కోట్లు ఆదా చేస్తున్నాం. రుణాలు రీ–స్ట్రక్చర్ అయితే ప్రతి నెలా రూ. వేయి కోట్లు ఆదా అవుతాయి. నాకు ప్రధాని మోదీ బడే భాయ్. జెండా, ఎజెండా వేరైనా అనుమతులు, నిధులు తెచ్చుకునే బాధ్యతపై నాపై ఉంది. మోదీని కలిసేందుకు నాకు భేషజాలు లేవు’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
కాంగ్రెస్కు యువకులే అంబాసిడర్లు
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలోని యువత హక్కులను బీజేపీ కొల్లగొడుతోంది. యువత హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోంది. మీరే మా నమ్మకం. యువకులే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్లు. మీ భవిష్యత్తుతోపాటు దేశం కోసం పోరాడండి’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా తమ పార్టీ ఆగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పెద్ద ఉద్యమం జరుగుతోందన్నారు. ప్రతి భారతీయుడి ఓటు హక్కును కాపాడేందుకు.. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అందరం కలిసికట్టుగా పోరాడాలని కోరారు.కేరళలోని అలెప్పి పట్టణంలో కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ఆదివారం నిర్వహించిన ‘ఎంపీ మెరిట్ అవార్డ్–2025’కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రతిభావంతులైన టెన్త్, ప్లస్ టూ విద్యార్థులు, యువతకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ యువతలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతోపాటు వారిలో స్ఫూర్తి నింపేందుకు ఈ అవార్డులు ఎంతో దోహదపడతాయన్నారు. 100 శాతం ఫలితాలు సాధించిన 150 పాఠశాలల్లోని 3,500 మంది విద్యార్థులకు అవార్డులు అందించడం అభినందనీయమన్నారు.దేశంలో విద్యకు, కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉందని.. 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కేరళ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కేరళలో అమలవుతున్న వయోజన విద్యా కార్యక్రమం కూడా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతోందని చెప్పారు. విద్యకున్న ప్రాధాన్యత గురించి తెలంగాణ సమాజానికి కూడా తాను ప్రతి సందర్భంలో చెప్పడమే కాకుండా తెలంగాణలో విద్యాభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నామని వివరించారు. తెలంగాణలోని పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పించామని చెప్పారు. విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్న కేరళపట్ల తనకు ఒకింత అసూయ కలుగుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు. 21 ఏళ్లకే ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు? దేశంలోని యువత వారిలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తిని గుర్తించాలని సీఎం రేవంత్ కోరారు. ‘చిన్న వయసులోనే యువత సివిల్స్కు ఎంపికై ఐఏఎస్లుగా జిల్లా పాలనా వ్యవస్థను సమర్థంగా నడుపుతున్నప్పుడు 21 ఏళ్లకే యువత ఎమ్మెల్యేలు ఎందుకు కాకూడదు? ఆ దిశగా రాజ్యాంగాన్ని సవరించుకోవాలి. దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 21 ఏళ్లకు ఓటు హక్కు ఉండేది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉండగా దాన్ని 18 ఏళ్లకు తగ్గించారు. కానీ ఇప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కనీస వయసు 25 ఏళ్లుగానే ఉంది. ఇకనైనా యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది’అని రేవంత్ అభిప్రాయపడ్డారు.2029లో లోక్సభ ఎన్నికలు రెండు ప్రధాన శక్తుల మధ్య జరగబోతున్నాయని.. యువత ఈ అంశాన్ని గ్రహించాలని కోరారు. వచ్చే ఏడాది జరిగే కేరళ ఎన్నికలను 2029లో దేశ భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలుగా రేవంత్ అభివరి్ణంచారు. 2029లో రాహుల్ గాం«దీని ప్రధానిని చేయాలనే సంకల్పంతో ముందుకెళ్లాలని.. ఆ ఏడాదిని రాహుల్ ప్రధానినామ సంవత్సరంగా అందరికీ చాటాలని చెప్పారు. యువతను ప్రోత్సహించేందుకు కేసీ వేణుగోపాల్ చూపుతున్న చొరవను ప్రతి రాష్ట్రంలో, ప్రతి నియోజకవర్గంలో స్ఫూర్తిగా తీసుకొని నాయకులు ముందుకెళ్లాలని రేవంత్ కోరారు. -
అసెంబ్లీలో BRS నేతల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
-
కాళేశ్వరం కమిషన్ నివేదిక.. సీఎం, అధికారులపై సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్డ్రైవ్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చారు. ఈ సందర్బంగా కమిషన్ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించింది.కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రకారం..‘ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా నిర్మాణం జరిగింది. మెయింటెనెన్స్ లేకపోవడం కారణంగానే మూడు బ్యారేజీలలో భారీగా డామేజ్ జరిగింది. క్వాలిటీ కంట్రోల్ విషయంలో నిర్మాణ సంస్థలు ప్రభుత్వాన్ని ప్లేట్ చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా బ్యారేజీ నిర్మాణాలకు బడ్జెట్ విడుదల అయింది. మూడు బ్యారేజీల ప్లానింగ్, డిజైన్స్, నిర్మాణాన్ని మినిట్ టూ మినిట్ సీఎంకు ఫాలో అప్ చేశారు. మేడిగడ్డ నిర్మాణం కోసం నిపుణుల కమిటీ సిఫార్సు చేయకపోయినా ముఖ్యమంత్రి ఆదేశాలతో మేడిగడ్డ నిర్మాణం జరిగింది. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇతర అంశాలపై క్యాబినెట్ అప్రూవల్ తీసుకోకపోవడం నిబంధనలకు విరుద్ధమే అవుతుంది అని తెలిపింది.ఇదే సమయంలో అధికారులు తప్పిదాలను కాలేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఎత్తి చూపింది. అధికారులు తప్పు చేసినట్లు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు రిపోర్టులో పేర్కొంది. పలువురు చీఫ్ ఇంజనీర్లు కమిషన్ ముందు సరైన ఆధారాలు చూపించలేదని తెలిపింది. కమిషన్ రిపోర్టులో కేసీఆర్ పేరు కాకుండా చీప్ మినిస్టర్ పేరుతో రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్ట్ నిర్మాణం అంచనాలు పెంచి ప్రజా ధనం దుర్వినియోగం చేశారు. బ్యారేజీల నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ సరిగ్గా లేదు. అధికారులు జోషి హరిరామ్, మురళీధర్పై చర్యలు తీసుకోవాలి అని ఆరోపించింది. -
తెలంగాణలో రిజర్వేషన్లపై 50 శాతం గరిష్ట పరిమితి ఎత్తివేత... పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు ఆమోదించిన రాష్ట్ర మంత్రివర్గం
-
బీఆర్ఎస్ వాకౌట్.. ముగిసిన బీఏసీ సమావేశం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు అప్డేట్స్.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై చర్చకు కాంగ్రెస్ వ్యూహం.. కమిషన్ విచారణపై పీపీటీకి చాన్స్ ఇవ్వాలంటున్న బీఆర్ఎస్.. -
ఇది కదా అసలు నిజం.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు.అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడుతుందంటూ కేటీఆర్ మండిపడ్డారు. వాస్తవానికి, గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమేనని (4 నెలల్లో రూ.9,355 కోట్లు) పేర్కొన్నారుకాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రుణ భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తుందంటూ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం స్తంభించిపోయిందని కేటీఆర్ అన్నారు. ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని, ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, విలాసవంతమైన, లాభదాయకమైన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు...గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమే - కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ అబద్ధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ 👇… pic.twitter.com/6vKlTipJbF— KTR News (@KTR_News) August 29, 2025రూ.3,50,000 కోట్ల 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ.1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ.225 కోట్ల హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల గోడును గాలికొదిలేసి, డబ్బు సంపాదించే పనులపైనే రేవంత్ అండ్ కో దృష్టి పెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. -
సీఎం సహాయ నిధికి సందీప్ రెడ్డి విరాళం.. వాళ్లపై విమర్శలు
టాలీవుడ్ దర్శకుడు సందీప్రెడ్డి వంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సీఎం సహాయక నిధికి విరాళాన్ని అందించారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జన జీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా కామారెడ్డి సిద్దిపేట, సిరిసిల్ల, ములుగు, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలను సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఇలాంటి సమయంలో తన వంతుగా సాయం చేసేందుకు దర్శకుడు సందీప్రెడ్డి ముందుకు రావాడాన్ని తన అభిమానులు సంతోషిస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డిని సందీప్రెడ్డి వంగాతో పాటు తన సోదరుడు ప్రణయ్ రెడ్డి కలుసుకున్నారు. భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున సీఎం సహాయక నిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కుండపోతగా కురిసిన వర్షంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. కామారెడ్డి పట్టణం చిగురుటాకులా వణికిపోయింది. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా టాలీవుడ్ నుంచి ఎవరూ స్పందించలేదు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటన జరిగితే కోట్ల రూపాయలు ఇచ్చే టాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పుడు తెలంగాణ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఆపద వస్తే స్పందించరా అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. వరంగల్కు చెందిన సందీప్రెడ్డి వంగా చేసిన సాయంతో అయినా మరికొందరు ముందుకు వస్తారని నెటిజన్లు ఆశిస్తున్నారు. -
సీఎస్ సర్వీసు 7 నెలలు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.రామకృష్ణారావు ఈ నెల 31తో పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన సర్వీసును మరో 7 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ) అండర్ సెక్రటరీ భూపేందర్ పాల్ సింగ్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏఐఎస్ (సీఎస్–ఆర్ఎం) రూల్స్–1960లోని రూల్–3ని ప్రయోగించడం ద్వారా ఏఐఎస్ (డీసీఆర్బీ) రూల్స్లోని 16(1) నిబంధనను సడలిస్తూ రామకృష్ణారావు సర్వీసును పొడిగించినట్టు కేంద్రం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది మార్చి 31 వరకు రామకృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. 1991 బ్యాచ్ తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన రామకృష్ణారావు గత ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.పొడిగింపు పొందిన రెండో సీఎస్తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలి సీఎస్గా పనిచేసిన రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని ఒకసారి 3 నెలలు, ఆ తర్వాత మరో మూడు నెలలు పొడిగించేందుకు కేంద్రం అనుమతించింది. ఆ తర్వాత పదవీ కాలం పొడిగింపు పొందిన రెండో సీఎస్గా రామకృష్ణారావు నిలిచారు. గతంలో ఒక ప్రయత్నంలో మూడు నెలలు మాత్రమే సర్వీసు పొడిగించగా, రామకృష్ణారావు విషయంలో మాత్రం ఒకేసారి ఏడు నెలల సర్వీస్ పొడగింపునకు కేంద్రం అనుమతించడం గమనార్హం. -
బాధితులను పట్టించుకోని సీఎం ఎందుకు?
హవేళిఘణాపూర్ (మెదక్): ప్రజలు వరదలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొట్టుమిట్టాడు తుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం వారి కష్టాలు పట్టించుకోకుండా మూసీ నది, క్రీడ లపై సమీక్షలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు ధ్వజ మెత్తారు.బాధితులను పట్టించుకోని సీఎం ఎందుకని ప్రశ్నించారు. గురువారం ఆయన వరద లతో ప్రభావితమైన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం ధూప్సింగ్ తండా, నాగా పూర్, వాడి గ్రామాలను సందర్శించారు. కొట్టు కుపోయిన బ్రిడ్జి, రోడ్లను పరిశీలించారు. -
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్/పెద్దపల్లి/మెదక్జోన్: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణ మే అంచనాలు తయారు చేసి అత్యవసర నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్తో కలిసి సీఎం రేవంత్రెడ్డి గురువారం వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలతో బుధ, గురువారాల్లో పోటెత్తిన వరదలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని సీఎంకు రెండు జిల్లాల కలెక్టర్లు నివేదించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద హెలికాప్టర్ దిగి వరదల పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులను ఏరియల్ సర్వే నిర్వహించారు. కామారెడ్డిలో హెలికాప్టర్ దిగి జిల్లా కలెక్టర్తో సమీక్షించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవటంతో సాధ్యం కాలేదు. దీంతో మెదక్ జిల్లా చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హెలికాప్టర్ను మెదక్ ఎస్పీ కార్యాలయంలో దించి జిల్లాలో వరదల పరిస్థితిపై అక్కడే సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వరద పరిస్థితిని కలెక్టర్ సీఎంకు నివేదించారు. వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పని చేసిందని సీఎం కితాబిచ్చారు. సమీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్ నుంచే సీఎం కామారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వరద పరిస్థితులపై ఆరా తీశారు. సత్వరం సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద నష్టంపై అత్యవసరంగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అప్రమత్తంగా ఉండాలిభారీ వర్షాల నేపథ్యలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవా లని సీఎం ఆదేశించారు. గురువారం ఉదయం తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు శ్రీధర్బాబు, సీతక్కతో కలిసి వరద పరిస్థితిపై సమీక్షించారు. హైదరాబాద్ నగరంతోపాటు అన్నిచోట్లా శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆస్పత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతోపాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్బృందాల సాయం తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. మామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యంమామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యంలా రూ.లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. గురువారం పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని, ఏనాడో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రస్తుతం తెలంగాణకు వరప్రదాయినిగా మారిందని అన్నారు. మామ, అల్లుడు కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్నారని, వాళ్లలా తాము 80 వేల పుస్తకాలు చదవలేదని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై సెటైర్ వేశారు. యూరియాపై ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ డిస్ప్లే చేస్తున్నామని సీఎం తెలిపారు. తదుపరి పంటలకు సైతం కొందరు రైతులు యూరియాను నిల్వ చేసుకోవడంతో కొరత ఏర్పడిందని చెప్పారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ మక్కాన్సింగ్ ఉన్నారు. -
Flooded Areas: సీఎం రేవంత్ ఏరియల్ సర్వే..
-
నేడు వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లలోకి వరద నీరు చేరింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నేడు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏరియల్ సర్వే ద్వారా మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ , నిర్మల్, సిరిసిల్ల జిల్లాలను సీఎం పరిశీలించనున్నారు. ఇక, కామారెడ్డిలో ముంపు ప్రాంతాల పరిశీలనకు ఇంఛార్జి మంత్రి సీతక్క, పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. -
మూసీ మాస్టర్ ప్లాన్.. సీఎం రేవంత్రెడ్డి కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మూసీ రివర్ డెవలప్మెంట్పై జూబ్లీహిల్స్ నివాసంలో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సిఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఏంఎఅండ్యూడీ సెక్రటరీ (హెచ్ఎండీఏ ఏరియా) ఇలంబర్తి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎఫ్సీడీఏ కమిషనర్ కె. శశాంక, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఎండీ అశోక్ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జెఎండీపీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.మూసీ రివర్ డెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలన్న సీఎం.. వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూసీ నదీ పరివాహక అభివృద్ధి జరగాలన్నారు.గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్.. అభివృద్ధి పర్యావరణహితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికలను సీఎంకు అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. -
తెలంగాణలో వర్ష బీభత్సం.. బీహార్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్
సాక్షి,తెలంగాణ: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బీభత్స సృష్టిస్తోంది. వర్షం కారణంగా వాగులు,వంకలు,లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. వరద ధాటికి వరదనీరు పొంగిపొర్లుతుంది. వరద ప్రవాహాతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని గడుపతున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలో వర్ష బీభత్సంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు. సీఎం మాత్రం తీరిగ్గా బీహార్లో ఎన్నికల యాత్ర చేస్తున్నారు. ఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసం..తెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లిందిఅధిష్ఠానం ఆశీస్సులతో.. పదవులు కాపాడుకుని ఖజానా కొల్లగొట్టే ధ్యాస తప్పితే ఆరు గ్యారంటీలు..420 హామీల అమలు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. వరదలతో ప్రజలు..యూరియా దొరక్క రైతులు.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారుచాలా చోట్ల వరదనీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రైవేట్ జెట్లలో ఊరేగుతున్న కాంగ్రెస్ సీఎం, మంత్రులకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్ల కన్నా అధ్వాన్నంగా 100 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ కార్యక్రమాలకు హెలికాప్టర్ను వినియోగిస్తున్న ఈ నేతలకు ఇప్పుడైనా హెలికాప్టర్ పంపి ప్రజల ప్రాణాలు రక్షించే తీరిక ఉందో,లేదో ?కాంగ్రెస్ నేతలారా.ఓట్లు కాదు..ప్రజల పాట్లు చూడండి..ఎన్నికలు కాదు..ఎరువుల కోసం రైతుల వెతలు చూడండి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నదిప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారుసీఎం మాత్రం తీరిగ్గా బీహార్ లో ఎన్నికల యాత్ర చేస్తున్నాడుఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసంతెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం… pic.twitter.com/AuZrpbwjN7— KTR (@KTRBRS) August 27, 2025 -
కుటుంబ సమేతంగా గణపతి పూజలో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి (ఫొటోలు)
-
ఫుట్బాల్ ఆరోపణలను ఖండించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి
-
తెలంగాణలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో కుండపోత వర్షం.. అప్డేట్స్మెదక్ అంధకారం..పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయంపిల్లికొట్టాల్లో పసుపులేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయిన సబ్ స్టేషన్కామారెడ్డిలో అంధకారంభారీ వర్షం నేపథ్యంలో విద్యుత్ సరాఫరాకు అంతరాయంజిల్లా కేంద్రంలోని గాంధీనగర్, అయ్యప్ప నగర్, బతుకమ్మ కుంట, రుక్మిణికుంట, పంచముఖి హనుమాన్ కాలనీ, గోపాలస్వామి రోడ్, షేర్ గల్లి తదితర ప్రాంతాల్లో అంధకారం.కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలుజీఆర్ కాలనీలో సహాయ చర్యల కోసం వేచి చూస్తున్న కాలనీవాసులువరదలు ఉధృతంగా ఉన్న చెరువుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులుకామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కౌండిన్య కాలనీలో వరదలో చిక్కుకున్న బాధితులురక్షించేందుకు కామారెడ్డికి చేరిన బోట్లు.సుమారు 50 మంది పైగా చిక్కుకున్న కాలనీవాసులుజల దిగ్బంధంలో ఉన్న బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగిన రెస్క్యూ టీం మెదక్ జిల్లా: రేపు విద్యాసంస్థలకు సెలవుజిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలుప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ తెలంగాణలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్వచ్చే మూడు గంటల్లో అతిభారీ వర్ష సూచననిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం మెదక్ రామాయంపేటలో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్నీట మునిగిన మహిళా డిగ్రీ కళాశాలవిద్యార్థినులను రక్షించిన సహాయక బృందాలుసురక్షిత ప్రాంతానికి 300 మంది తరలింపు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న కార్మికులు ఆరు గంటలుగా సాయం కోసం ఎదురు చూపులుస్వామి అనే కార్మికుడికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్స్వామితోపాటు మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేశ్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితిపైనా ఆరాబాధితులెవరూ భయపడొద్దని పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బండి సంజయ్జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని చెప్పిన కేంద్ర మంత్రిఅధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి వర్షాలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షరాష్ట్రంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.కామారెడ్డి ,మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు అలుగులు పొంగి పొర్లుతుండడం ,రోడ్లపై భారీ వరద నీరు వచ్చి చేరుతుండడం ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి .హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు నీరు నిలువ లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి,భారీ వర్షాలకు వరదల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలిలోతట్టు ప్రాంతాల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే వారిని అక్కడనుండి తరలించేలా చర్యలు తీసుకోవాలి .వర్షాల వల్ల గణేష్ మండపాల వద్ద ,ఇతర విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,ప్రమాదాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఉమ్మడి నల్లగొండలో వాన బీభత్సంయాదాద్రి భీమలింగం కత్వా వద్ద వరద ఉధృతిచౌటుప్పల్ నాగిరెడ్డిపల్లి మధ్య రాకపోకల బంద్ ఇంకా వరదలోనే మెదక్ హవేలిఘన్పూర్ మండలంలోని దూప్సింగ్ తండాసాయం కోసం బిల్డింగ్ల మీదకు ఎక్కిన జనంరక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు కామారెడ్డి కలెక్టర్తో మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్కామారెడ్డి జిల్లా అంతటా భారీ వర్షాలు .. జలదిగ్బంధంలో పలుగ్రామాలుకలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఇన్చార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ తక్షణ సహాయక చర్యలు కొనసాగుతాయని హామీఅధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి :మంత్రి సీతక్క,ప్రతి గ్రామం, పట్టణంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి :మంత్రి సీతక్కలోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలి :మంత్రి సీతక్కచెరువులు, వాగులు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాకపోకలను అనుమతించొద్దు :మంత్రి సీతక్కప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి :మంత్రి సీతక్కరక్షణ చర్యల్లో ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోరాదు.. ప్రతి ఒక్క అధికారి తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాలి:మంత్రి సీతక్కవర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది:మంత్రి సీతక్క బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా బలపడిన వాయుగుండంరేపూ తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలుకుండపోత వానతో రాష్ట్రమంతటా ఆగమాగంజనజీవనం అస్తవ్యస్తం భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేడు పలు రైళ్ల దారి మళ్లింపుకామారెడ్డి మీదుగా వెళ్ళే రైళ్లు నిజామాబాద్ మీదుగా మళ్లింపునిజామాబాద్ - తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఈ రోజు రద్దుమెదక్ - కాచిగూడ రైలు ఈ రోజు పాక్షికంగా రద్దు కామారెడ్డి, మెదక్లకు రెడ్ అలర్ట్ రెండు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షంరాజంపేట మండలం అర్గొండలో 31.9 సెం.మీ. అత్యధిక వర్షపాతంమెదక్ నాగపూర్లో 20.8 సెం.మీ. వర్షపాతంబిక్నూర్లో 19.1 సెం.మీటెక్మాల్ మండలంలో 18.03 సెంటీమీటర్ల వర్షపాతంపాత రాజంపేటలో 18, రామాయంపేటలో 16 సెం.మీలుచేగుంట 13.2 సెంమీ, మెదక్లో 11 సెం.మీ. కామారెడ్డి తలమట్ల దగ్గర రైల్వే ట్రాక్ నుంచి నీటి ప్రవాహం.. 12 రైళ్ల రాకపోకలకు అంతరాయం కామారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్రెడ్డివెంటనే సహాయక చర్యలు చేపట్టాలని.. అన్ని విభాగాల అధికారులు సిద్ధం చేయాలని ఆదేశంఎలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండండి :సీఎం రేవంత్రెడ్డిఅన్ని శాఖల అధికారులు.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సాయం తీసుకోవాలని సీఎస్కు ఆదేశంఇరు జిల్లాల ఎమ్మెల్యేలతోనూ మాట్లాడిన సీఎంకలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచన భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు నీట మునడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరాకామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటనపై కలెక్టర్ కు ఫోన్ చేసిన కేంద్ర మంత్రిప్రమాద బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పిన బండి సంజయ్అనంతరం ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో మాట్లాడిన బండి సంజయ్ఎల్లారెడ్డిలో తక్షణమే అవసరమైన సాయం అందించాలని ఎన్డీఆర్ఎఫ్ ను కోరిన కేంద్ర మంత్రిజిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకుని సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని సూచంచిన కేంద్ర మంత్రి కామారెడ్డిలో భారీ వర్షాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తిమ్మారెడ్డిలోని కల్యాణి వాగు వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో వరదలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులు డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్ పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపులు ఈ వరద కారణంగా కామారెడ్డి- భిక్కనూర్ సమీపంలో రైలు పట్టాల కింద గండి.. రైళ్ల రాకపోకలు నిలిపివేతసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారీ వర్షంఎగువ మానేరు నుంచి దిగువకు నీరు విడుదలనాగయ్య అనే పశువుల కాపరి గల్లంతు.. గాలిపు చేపట్టిన అధికారులుమానేరు వాగులో చిక్కుకున్న ఐదుగురు రైతులురక్షించేందుకు అధికారుల ప్రయత్నాలు -
తెలంగాణలో భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వినాయక చవితి సందర్భంగా.. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, హైదరాబాద్లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే, నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు.HYDERABAD UPDATE 🌧️ | 27 AUG, 8 AM🔔 NON-STOP MODERATE RAINS to continue across HYDERABAD City for the NEXT 3 HOURS ⚠️⚠️⚠️🌧️ Strong rain bands are moving straight from Medak towards Hyderabad.📍 Kamareddy & Medak will continue to witness HEAVY DOWNPOURS.➡️ Thankfully, the… pic.twitter.com/6RerpSc2OT— Hyderabad Rains (@Hyderabadrains) August 27, 2025వినాయక చవతి ఉత్సవాలు మొదలైన నేపథ్యంలో వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు.. చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని, వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుపత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. -
అదే కోటా... అదే తీర్మానం?
సాక్షి, హైదరాబాద్: ‘మరో 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తా. ఎవరు ఆపుతారో చూస్తా’అంటూ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కోదండరాంతోపాటు కాంగ్రెస్ నేత ఆమేర్ అలీఖాన్ల శాసనమండలి సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సీఎం చెప్పినట్లు మళ్లీ కోదండరాంను ఎలా ఎమ్మెల్సీ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే మళ్లీ గవర్నర్ కోటాలో, రాష్ట్ర మంత్రివర్గ తీర్మానంతోనే ఆయన్ను మరోసారి ఎమ్మెల్సీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని.. అందుకే ఆయనకు పదవిపై ఘంటాపథంగా మాట్లాడారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీం ఏమంటుందో? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, ఆమేర్ అలీఖాన్లను అనర్హులుగా ప్రకటిస్తూ ఈ నెల 13న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో వారు పదవులను కోల్పోవాల్సి వచ్చింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సోమవారం ఓయూలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుడికి తాము పదవి ఇస్తే పెద్దపెద్ద లాయర్లను పెట్టి కుట్రలు చేసి దింపేయాలని ప్రయత్నాలు చేశారని చెప్పారు. మళ్లీ ఆయన్ను ఎమ్మెల్సీని చేస్తానని ప్రకటించారు. దీనివెనుక గట్టి నిర్ణయమే ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీగా పంపేందుకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్సిగ్నల్ ఇచి్చందని, గవర్నర్ కోటాలో మళ్లీ కేబినెట్ ఆయన పేరును సిఫారసు చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు వచ్చే నెల 17న ఈ కేసుపై తదుపరి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెల 29న జరిగే కేబినెట్లో తీర్మానం చేస్తారా లేక సెపె్టంబర్ 17న సుప్రీం ఏం చెబుతుందో పరిశీలించి ఆ తర్వాత జరిగే కేబినెట్లో ఆమోదిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందంటున్నాయి. గవర్నర్ కోటాలో మళ్లీ నామినేట్ చేసేందుకు ఆ ఇద్దరూ ప్రాతినిధ్యం వహించిన స్థానాలను మండలి వర్గాలు ఖాళీగా చూపిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని.. నోటిఫికేషన్ వచ్చాకే కేబినెట్ తీర్మానం చేస్తుందని.. అప్పటికి కేసు పెండింగ్లో ఉన్నా కోదండరాం పేరును మళ్లీ సిఫార్సు చేసేందుకు సుప్రీంకోర్టే వెసులుబాటు ఇచ్చినందుకు ఇబ్బందులేవీ ఉండవని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అయితే కోదండరాంను ఒక్కరినే మళ్లీ గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారా లేక ఆమేర్అలీఖాన్ పేరునూ జతచేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
‘కోటా’ చిక్కుముడి విప్పేదెలా?
సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై చట్టపరంగా ఎదురయ్యే చిక్కుముళ్లను విప్పేందుకు మంత్రుల బృందం పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో భేటీ అయింది. రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లోనే ఉన్నందున దీనిని చట్టపరిధిలో పరిష్కరించే మార్గాలపై సమాలోచనలు చేసింది. ఒకవేళ జీవోలు ఇస్తే ఎదురయ్యే సవాళ్లు, దీనిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ, కులగణన ద్వారా వచ్చిన ఎంపిరికల్ డేటాను న్యాయవ్యవస్థల ముందుంచే అంశాలపై క్షుణ్ణంగా చర్చించింది. 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రాలు, వాటిపై గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు, రాజ్యాంగ నిబంధనలన్నింటిపైనా చర్చలు జరిపింది. రిజర్వేషన్లపై మార్గాన్వేషణ: 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో గంటపాటు భేటీ అయ్యారు. ఇప్పటికే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి కోసం వేచి చూస్తున్న విషయాలతోపాటు, 2018లో చంద్రశేఖర్ రావు రిజర్వేషన్లను 50శాతానికి పరిమితి చేస్తూ చేసిన చట్టాన్ని తొలగించాలన్న ఆర్డినెన్స్పైనా చర్చించారు. ఈ బిల్లుల ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ జీవో ఇవ్వడమా?, ఇస్తే ఈ ఉత్తర్వుల అమలును ఇతరులెవరూ కోర్టుకు వెళ్లి అడ్డుకోకుండా ముందుగానే కేవియట్ దాఖలు చేయడమా? అన్న అంశాలపై మంత్రులు సమాచాలోచనలు చేశారు. ఒకవేళ కోర్టులు అభ్యంతరం చెబితే కులగణన సర్వే ద్వారా సేకరించిన డేటాతో బీసీల జనాభా, వెనకబాటుతనాన్ని నిరూపించే అవకాశాలపైనా చర్చించారు. ఇప్పటికే 10శాతం ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల కోసం చేసిన 103వ రాజ్యాంగ సవరణతో విద్య, ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన దృష్ట్యా, సర్వే డేటాలోని అంశాలు తమకు కలిసి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది. 50 శాతం రిజర్వేషన్లు దాటితే సమానత్వపు హక్కు ఉల్లంఘన జరిగినట్లేనని, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 50శాతం పరిమితిని దాటవచ్చని సుప్రీంకోర్టు.. గతంలో మరాఠాల రిజర్వేషన్లపై తీర్పుఇచ్చిన నేపథ్యంలో ఎంపిరికల్ డేటాను ఎంతవరకు ప్రామాణికంగా చూపవచ్చనే అంశంపైనా చర్చించారు. హైకోర్టు విధించిన గడువు సెపె్టంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లో అదనపు గడువు కోరే అవకాశాలపైనా చర్చలు జరిగాయి. అయితే ఈ నెల 29న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి తుది నిర్ణయం చేయనున్నారు. నేడు బిహార్కు సీఎం, మంత్రులు రానున్న బిహార్ ఎన్నికలకు ముందు జాతీయ ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ ఏఐసీసీ అగ్రనేత తలపెట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మంగళవారం సీఎం రేవంత్రెడ్డితోపాటు మంత్రులు పాల్గొననున్నారు. ఓట్ల చోరీపై రాహుల్ చేస్తున్న పోరాటానికి రాష్ట్ర నేతలు సంఘీభావం తెలపనున్నారు. రోడ్షోలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ సైతం పాల్గొనే అవకాశాలున్నాయి. -
ఆక్స్ఫర్డ్లా ఓయూ!: సీఎం రేవంత్
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ వైభవానికి కృషి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీల మాదిరి తీర్చిదిద్దుదామని అన్నారు. ఓయూను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను ఆదేశించారు. ఓయూకు ఎంత ఇచ్చినా తక్కువేనంటూ, ఏమేమి కావాలో ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభ ఏర్పాటు చేస్తే వస్తానని, అధ్యాపక ఉద్యోగాల సమస్యతో పాటు అన్ని సమస్యల పరిష్కారానికి అక్కడే వెంటనే జీవోలు జారీ చేయిస్తానని చెప్పారు. సోమవారం యూనివర్సిటీ క్యాంపస్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఆయన పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన పీజీ విద్యార్థుల దుందుభి, ఇంజనీరింగ్ విద్యార్థుల భీమా హాస్టల్ భవనాలను సీఎం ప్రారంభించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నిర్మించనున్న మరో రెండు హాస్టల్ భవనాలకు, రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించే డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూంలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో వీసీ ప్రొఫెసర్ కుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ‘తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై ప్రసంగించారు. ఓయూ విశిష్టతను, ఉద్యమాల చరిత్రను వివరించారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, యాదయ్య, ఇషాంత్రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితర విద్యార్థులను స్మరించుకున్నారు. ఓయూ అంటేనే తెలంగాణ ‘ఓయూ అంటేనే తెలంగాణ. రెండింటి మధ్య విడదీయలేని సంబంధం ఉంది. 1935లో వందేమాతరం, 1938లో సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమాల్లో ఓయూ విద్యార్థుల పాత్ర కీలకం. మలి దశ తెలంగాణ ఉద్యమం విద్యార్థుల ఆత్మ బలిదానాలతోనే విజయం సాధించింది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్, మర్రి చెన్నారెడ్డి, జార్జిరెడ్డి, జైపాల్రెడ్డి, గద్దర్ తదితరులను అందించిన ఘనత ఓయూది. చదువుతో పాటు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు విద్యార్థులు ఎదిరించి పోరాడారు. యువతే దేశ సంపద. 21 ఏళ్లకు ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు. యువకులు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేలు కావాలి..’ అని సీఎం ఆకాంక్షించారు. నేనూ మీలో ఒకడినే.. ఓయూలో 60 ఏళ్లకు పైబడిన పాత భవనాలు ఉన్నాయని, కొత్త భవనాల నిర్మాణం, 2,500 మందికి సరిపడ కన్వెన్షన్ హాల్, ఇతర అవసరాలకు నిధులు మంజురు చేయాలని వీసీ కుమార్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ..ఇంజినీర్ల కమిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘ప్రజలకు పంచేందుకు భూములు లేవు.. ఇచ్చేందుకు డబ్బులు లేవు. నాణ్యమైన విద్యను మాత్రమే ఇవ్వగలం. ఈ సంవత్సరం విద్యకు రూ.40 వేల కోట్లు వెచ్చించనున్నాం. విద్యార్థులు బాగా చదువుకోవాలి. ఓయూలోనే చదివిన దయాకర్ ఎమ్మెల్సీ అయ్యాడు, బాలలక్ష్మీ, చారకొండ వెంకటేష్ ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు. నేనూ మీలో ఒకడినే. తెలంగాణలోనే పుట్టా..ఇక్కడే పెరిగా. ఇక్కడే చదువుకున్నా. జెడ్పీటీసీ సభ్యుడు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అయ్యా. మీరు చేస్తేనే సీఎం కూడా అయ్యా. మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అపోహలకు, అబద్ధాల సంఘాలకు నమ్మి మోసపోకండి. డిసెంబర్లో ఒక పోలీసు కూడా లేకుండా ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభను ఏర్పాటు చేయండి. నా రాకను అడ్డుకునేవారు అడిగే అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతా..’ అని రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్లకు అభివృద్ధి కన్పించడం లేదు.. ‘పొలిటికల్ జేఏసీ చైర్మన్గా తెలంగాణ కోసం పోరాడిన ప్రొ.కోదండరాం ఎమ్మెల్సీ పదవిని బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్డు వరకు వెళ్లి రద్దు చేయించి పైశాచిక ఆనందం పొందారు. ఆయన్ను 15 రోజుల్లో తిరిగి ఎమ్మెల్సీని చేస్తాం. హెచ్సీయూ భూముల్లో ఏఐ టెక్నాలజీతో ఏనుగులు, సింహాలు పెట్టారు. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేవు.. మానవ మృగాలే ఉన్నాయి. తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినా కేసీఆర్, కేటీఆర్కు కనిపించడం లేదు. నాపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అంతానికి ఈగల్ ఫోర్సును, అక్రమ కట్టడాల నిర్మూలనకు హైడ్రాను ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓయూ భూములను ప్లాట్లు చేసి అమ్ముకుంటారు..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. సీఎం రీసెర్చ్ ఫెలోషిప్లు ప్రారంభం ఓయూలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టిన సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ను, విదేశాలలో పరిశోధనలకు వెళ్లే పీజీ, పీహెచ్డీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫెలోషిప్ను సీఎం ప్రారంభించారు. విద్యార్థుల పరిశోధనలకు.. సింగరేణి కాలరీస్, ఓయూ, ప్రభుత్వం, హెచ్ఎండీఏ ఆర్థిక సహకారంతో ఈ ఫెలోషిప్లు అందజేయనున్నట్లు తెలిపారు. నెలకు రూ.5 వేల చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కాలేజీ విద్య కమిషనర్ శ్రీదేవసేన, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్, తదితర నేతలతో పాటు పలువురు ఓయూ అధికారులు పాల్గొన్నారు. -
ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
-
భూదాన్ భూములు అన్యాక్రాంతం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా యాచారంలో భూదాన్ భూములు అన్యాక్రాంతమైనట్లు వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశించారు. 250 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణతో పాటు ఔషద పరిశ్రమ భూ సేకరణ కింద పరిహారం పొందిన ఆరోపణలపై వెంటనే విచారణ జరపాలని కోరారు. విచారణ అనంతరం నిజానిజాలపై తనకు నివేదిక అందించాలని రెవెన్యూ సెక్రటరీని ఆదేశించారు. -
నేను ఓయూకు ఎందుకు రావొద్దు.. ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టండి: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులే కీలక పాత్ర పోషించారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉస్మానియా లేకపోతే తెలంగాణ లేదన్నారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి ఓయూ అందించిందని గుర్తు చేసుకున్నారు. కుట్ర పూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు అంటూ ఆరోపించారు. తాను మళ్లీ ఓయూకు వస్తానని.. విద్యార్థులతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, లైబ్రరీ రీడింగ్ రూమ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం, ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఉస్మానియా నుంచే. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఉస్మానియా నుంచే. ఎంతో మంది గొప్ప వ్యక్తులను దేశానికి ఓయూ అందించింది. ఉస్మానియా నుంచే పీవీ ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఓ జార్జిరెడ్డి, ఓ గద్దర్ను అందించిన గడ్డ ఈ ఉస్మానియా వర్సిటీ. మన యూనివర్సిటీలకు మన తెలంగాణ పోరాట యోధుల పేర్లు పెట్టుకున్నాం. సామాజిక న్యాయంతో వీసీలను నియమించాం.మీటింగ్ పెట్టండి.. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీలో మీటింగ్ పెట్టండి. నేను కూడా వస్తాను. విద్యార్థుల సమస్యలు తీర్చాలని అనుకుంటున్న నేను ఓయూకు ఎందుకు రావద్దు. మీ సమస్యలు ఏమున్నా చెప్పండి.. ఏమేం కావాలో చెప్పండి. మీ సమస్యలు తీరుస్తాను. మరోసారి ఓయూకు వస్తాను.. ఒక్క పోలీసును పెట్టకండి. అప్పటికప్పుడు మీకు జీవోలు ఇస్తాను. ఆరోజు ఒక్క పోలీసు కూడా క్యాంపస్లో ఉండడు. అప్పుడు విద్యార్థులు నిరసనలు తెలిపినా నేను ఏమీ అనను. విద్యార్థులు అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పే చిత్తశుద్ది నాకు ఉంది. కొంత మంది రాజకీయ నాయకులకు అధికారం పోయిన కడుపు మంట ఉంటది. మీరు ఆశీర్వదిస్తేనే తెలంగాణకు ముఖ్యమంత్రిని అయ్యాను అని చెప్పుకొచ్చారు.చట్ట సభలకు కోదండరాం.. తెలంగాణలో ఏనుగులు లేవు.. మృగాలు లేవు. ప్రొఫెసర్ కోదండరాంను 15 రోజుల్లో చట్ట సభకు పంపుతా. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. ప్రొఫెసర్ ఎమ్మెల్సీగా ఉంటే వచ్చిన తప్పేంటి?. మీ కుటుంబానికే అన్ని పదవులు ఉండలా? అని ప్రశ్నించారు.విద్యార్థులదే కీలక పాత్ర..తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులే కీలక పాత్ర పోషించారు. మలిదశ ఉద్యమంలో శ్రీకాంత చారి అమరుడై చైతన్యం అందించాడు. యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు. చైతన్యం అందించిన ఓయూను కాలగర్భంలో కలపాలని చూశారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడిన ఉస్మానియా కళా విహీనంగా మారిన పరిస్థితి ఏర్పడింది. కుట్ర పూరితంగా ఓయూను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు.నేను వచ్చాక ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాను. యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం. యువతే దేశానికి అతి పెద్ద సంపద. మనలో అసహనం పెరిగిపోయింది.. అశాంతి ఎక్కువైంది. చిన్న చిన్న కాలేజీల్లో కూడా విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్ యువతను పట్టి పీడిస్తున్నాయి. పేదలకు పంచేందుకు భూములు లేవు.. పేదల తలరాతను మార్చేది విద్య ఒక్కటే. సామాజిక, సాంకేతిక అంశాలపై చర్చ జరగాలి అని వ్యాఖ్యలు చేశారు. -
సురవరం పేరును శాశ్వతం చేస్తాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్/హిమాయత్నగర్/గాంధీ ఆస్పత్రి: తెలంగాణ ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని, అందులో భాగంగానే దివంగత కమ్యూనిస్టు అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఉద్యాన వర్సిటీకి, జైపాల్రెడ్డి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెట్టామని, అలాగే సురవరం విషయంలో కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శనివారం రాత్రి మరణించిన సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డి భౌతికకాయానికి ఆదివారం మఖ్దూమ్ భవన్లో సీఎం నివాళులర్పించారు. అనంతరం సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్రెడ్డి, కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బాలూనాయక్, కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, అంజన్కుమార్యాదవ్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. సురవరం మృతి తెలంగాణకు తీరని లోటు అని విచారం వ్యక్తంచేశారు. నిరాడంబర జీవితం గడిపిన సుధాకర్రెడ్డి ఏనాడూ తన సిద్ధాంతాలను విడిచిపెట్టలేదని కొనియాడారు. బూర్గుల రామకృష్ణారావు, సూదిని జైపాల్రెడ్డి తరహాలోనే సురవరం సుధాకర్రెడ్డి కూడా మహబూబ్నగర్ జిల్లాకు వన్నె తెచ్చారని అన్నారు. విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు విలువలకు కట్టుబడి జీవించిన గొప్ప నాయకుడు సురవరం సుధాకర్రెడ్డి అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో సురవరం సుధాకర్రెడ్డి ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు, హరియానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, వినోద్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించి చిరస్మరణీయ ముద్ర వేసుకున్న సురవరం సుధాకర్రెడ్డి మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ అన్నారు. దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందని బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో.. సురవరం సుధాకర్రెడ్డికి సీపీఐ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూమ్భవన్లో సురవరంకు ప్రభుత్వం అధికార లాంఛనాలతో గౌరవ వందనం సమర్పించింది. అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు ఆయన అంతిమయాత్ర మఖ్దూమ్భవన్ నుంచి నారాయణగూడ చౌరస్తా, చిక్కడపల్లి, ముషీరాబాద్ మీదుగా సికింద్రాబాద్లోని ప్రభుత్వ గాంధీ మెడికల్ కాలేజీకి చేరింది. అంతిమయాత్రలో ముందు భాగంలో పోలీసు కవాతు ఉండగా, అనంతరం సీపీఐ వలంటీర్లు ఎర్ర జెండాల కవాతు, ప్రజానాట్య మండలి కళాకారుల విప్లవ తీతాలాపనల మధ్య యాత్ర కొనసాగింది. అనంతరం సుధాకర్రెడ్డి పార్థీవ దేహాన్ని ఆయన సతీమణి డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, కుమారులు కపిల్, నిఖిల్ కలిసి గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఇందిర, ప్రొఫెసర్ రమాదేవి, ప్రొఫెసర్ సుధాకర్కు అప్పగించారు. సురవరం భౌతికకాయానికి ఎంబామింగ్ (రసాయనాల పూత) చేసి భద్రపరుస్తామని.. వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం వినియోగిస్తామని చెప్పారు. సురవరం తన కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు డి.రాజా, కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకట రెడ్డి, కూనంనేని సాంబశివరావు, నెల్లికంటి సత్యం, పల్లా వెంకట్రెడ్డి, కె.శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, ఎంపీ పెద్దిరాజు రవిచంద్ర, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బై ఎలక్షన్లతో కాంగ్రెస్కు బైబై
మియాపూర్: రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలు రానున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవే బైబై ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని సవాల్ విసిరారు. మియాపూర్ నరేన్ గార్డెన్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపురం రాజు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.2.80 లక్షల కోట్ల అప్పుచేసి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడవకముందే రూ.2.20 లక్షల కోట్ల అప్పుచేసి ఒక్క మంచిపని కూడా చేయలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ను మహా నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కరోనా సమయంలో ఏడాదిపాటు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకపోయినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగించామని తెలిపారు. ఇప్పుడు 20 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుతో 42 ప్లైఓవర్లు, నాలుగు అత్యాధునిక ఆస్పత్రులు, 36 మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించిందని వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం ఒక్క కొత్త వంతెన గానీ మోరీని గానీ నిర్మించిందా? అని ప్రశ్నించారు. హైడ్రా అరాచకంతో హైదరాబాద్ అతలాకుతలం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రావల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిందని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా అరాచకాలతో నగరమంతా అతలాకుతలమైందని ఆరోపించారు. దుర్గంచెరువులో కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్రెడ్డి అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా? అని సవాల్ చేశారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా.. పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. 20 నెలల్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేకపోతున్నారని, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, సిం«ధూ ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సినీ పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తాం’
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే తన ధ్యేయమని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ(ఆదివారం) జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్రెడ్డితో తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి.సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా.ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు పూర్తి సహకారం ఉంటుంది. పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది.తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. పరిశ్రమలో నిర్మాతలు,కార్మికుల అంశంలో సంస్కరణలు అవసరం. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలి.నిర్మాతలు,కార్మికులు,ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుంది. సినీ కార్మికులను,నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు. అందరూ చట్ట పరిధిలో పని చేయాల్సిందే.పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్గా ఉంటా. హైదరాబాద్లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది.తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువ గా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమ ను ఉంచడమే నా ధ్యేయం’ అని వ్యాఖ్యానించారు. -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో 'టాలీవుడ్' భేటీ..
కొన్నిరోజుల ముందు వరకు వేతనాల పెంపు విషయంలో సినీ కార్మికులు-టాలీవుడ్ నిర్మాతల మధ్య సస్పెన్స్ నడిచింది. రీసెంట్గానే అది కొలిక్కి వచ్చింది. ఎప్పటిలానే షూటింగ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాతలు-దర్శకులు ఆదివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఇండస్ట్రీ గురించి, సినీ కార్మికుల గురించి మాట్లాడారు.జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి తదితరులు ఉన్నారు. వీళ్లతో రేవంత్ రెడ్డి పలు విషయాలు చర్చించారు.(ఇదీ చదవండి: 100వ సినిమా తర్వాత రిటైర్ మెంట్: దర్శకుడు ప్రియదర్శన్)'సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా. ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి పూర్తి సహకారం ఉంటుంది. పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలి. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఓ పాలసీ తీసుకువస్తే బాగుంటుంది. సినీ కార్మికులను, నిర్మాతలను మా ప్రభుత్వం కాపాడుకుంటుంది''సినిమా పరిశ్రమ కు మానిటరింగ్ అవసరం. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు. పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్ గా ఉంటా. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ సినిమాల షూటింగ్ కూడా జరుగుతోంది. తెలుగు చిత్రాల షూటింగ్ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమని ఉంచడమే నా ధ్యేయం' అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ఆసక్తికరంగా 'లోక' ట్రైలర్.. సూపర్ హీరో కాన్సెప్ట్) -
‘దేవుడు గొప్ప డిజైనర్.. ప్రకృతి ఉత్తమ గురువు’
హైదరాబాద్: దేవుడు గొప్ప డిజైనర్, ప్రకృతి ఉత్తమ గురువు అన్నారు సీఎం రేవంత్రెడ్డి. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24వ తేదీ) నగరంలోని ఏఐజీ ఆస్పత్రి వేదికగా ఆసియా-పసిఫిక బయోడిజైన్ ఇన్నోవేషన్-2025 సమ్మిట్ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘బయోడిజైన్ ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణల సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉంది. దేనినైనా మనం రూపొందిస్తే దాని ప్రయోజనం , పనితీరు, రూపం ప్రాథమిక అంశాలుగా ఉంటాయి. దేవుడు గొప్ప డిజైనర్. ప్రకృతి ఉత్తమ గురువు. మనం మంచి విద్యార్థులమా లేదా అన్నదే ప్రశ్న.లైఫ్ సైన్సెస్లో, వైద్యంలో, ప్రకృతి ఉత్తమ గురువు. మనం ప్రకృతి నుంచి నేర్చుకుంటే, మనం తప్పు చేయొద్దు. కృత్రిమ మేధస్సు బయోడిజైన్కు మంచి ఉదాహరణ. మానవులు కృత్రిమ మెదడును సృష్టించడానికి సహజ మెదడును ఉపయోగించారు.మేము తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రారంభించాము. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకునే 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా మారుస్తాం..తెలంగాణ లైఫ్ సైన్సెన్స్కు కేంద్రం గా ఉంది..తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధించడంలో వైద్య పరికరాలు, మెడ్టెక్ కీలకమైనవి’ అని ఆయన పేర్కొన్నారు. -
సీఎం రేవంత్కు కేటీఆర్ సవాల్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. తన పాలనను రెఫరెండంగా ఉపఎన్నికలకు వెళ్లేదమ్ము రేవంత్కు ఉందా? అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి’అని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్లో నాయకులు వేలు పెట్టలేదు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 70 వేల కోట్లు వేస్తే, రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. 200 ఉన్న పెన్షన్ను కేసీఆర్ ప్రభుత్వం 2000 చేస్తే, రేవంత్ ఏం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకోరోజు తన మీద కేసులంటూ రేవంత్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని కేటీఆర్ ప్రశంసించారు. -
సెప్టెంబర్తొలి వారంలో పదవుల బొనాంజా !
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు వినాయక నిమజ్జనంలోపే పదవు ల బొనాంజా అందనుంది. ఈ మేరకు సెప్టెంబర్ మొదటివారంలోనే కార్పొరేషన్లకు డైరెక్టర్లు, బోర్డు సభ్యుల నియామకాలను పూర్తి చేయాలని సీఎం రేవంత్ సమక్షంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ భేటీ కంటే ముందు శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్లు ఈ భేటీలో పాల్గొన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి చర్చించారు. ఇప్పటికే జిల్లా పార్టీ ఇన్చార్జ్ల నుంచి వచ్చిన జాబితా వడపోతను త్వరితగతిన పూర్తిచేసి పలు కార్పొరేషన్లకు డైరెక్టర్లు, బోర్డు సభ్యుల నియామకాలను వినాయక నిమజ్జనం పూర్తయ్యేసరికి ప్రకటించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన గురించి కాంగ్రెస్ పార్టీ ముందున్న ఆప్షన్లపై కూడా నేతలు చర్చించారు. హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతోపాటు అసెంబ్లీ సమావేశపర్చడం, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లను ప్రకటించి ముందుకెళ్లడం తదితర అంశాలపై చర్చించిన నేతలు పీఏసీ సమావేశంలో సభ్యుల ముందు ప్రతిపాదించాల్సిన అంశాలు, ఎజెండాపై నిర్ణయం తీసుకున్నారు. అండగా ఉందాంముఖ్య నేతల భేటీ అనంతరం 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ గురించి చర్చించేందుకుగాను మరో సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎం రేవంత్రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్లు పాల్గొన్నారు. ఫిరాయింపు కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, తదనుగుణంగా స్పీకర్ ప్రసాద్కుమార్ పలువురు ఎమ్మెల్యేలకు జారీ చేసిన నోటీసులు, పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చ జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేందుకు నమ్మకంతో వచ్చిన వారికి పార్టీ కూడా అండగా ఉండాలని, ఈ కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీపరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై న్యాయ నిపుణులతో చర్చించాలని సూచించినట్టు తెలిసింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలతో మాట్లాడాలని, వారికి భరోసా కల్పించడంతోపాటు కేసు విచారణ విషయంలో అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించాలని కూడా సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. -
‘స్థానిక’o పై కమిటీ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలను వీలున్నంత త్వరగా నిర్వహించడానికే కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపుతోంది. ఈ విషయంలో కోర్టులకు వెళ్లి కేసులు వేయడం వల్ల కాలయాపన తప్ప ప్రయోజనం లేదని ఆ పార్టీలోని కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం గాందీభవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), సలహా కమిటీల సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. సమావేశంలో భాగంగా పలువురు సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు కొందరు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళదామని సూచించగా, మరికొందరు మాత్రం అధికారికంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇదే అంశంపై సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు ఇచి్చన గడువులోపు స్థానిక ఎన్నికలు పూర్తిచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అధికారికంగా ఇవ్వగలమా లేదంటే పార్టీపరంగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలా అనే అంశంపై న్యాయ నిపుణులతో సలహాలు, సంప్రదింపులు జరిపి పార్టీకి నివేదిక ఇచ్చేందుకుగాను ఐదుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని నియమించాలని పీఏసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్రెడ్డిలతో చర్చించిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఈ కమిటీని అధికారికంగా ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, డి.శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని, దేశంలోని న్యాయ నిపుణులు, పార్టీ నాయకులతో కమిటీ విస్తృతంగా చర్చించి ఈ నెల 26వ తేదీలోపు నివేదికను ఇస్తుందని మహేశ్గౌడ్ వెల్లడించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిన బిల్లు ప్రకారం అధికారికంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించగలమా? లేదా పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి ముందుకెళ్లాలా అనే అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆరు ప్రధాన అంశాలే ఎజెండాగా భేటీ సమావేశంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు కోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు గల ఆప్షన్లు, ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దీ చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టడం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రంలో యూరియా కొరత, రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. సమావేశానికి ముందు ఏఐసీసీ చేపట్టిన ఓట్చోరీ ప్రచార లోగోను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. ఇండియాకూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్రెడ్డిని ఎంపిక చేయడం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్గౌడ్, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్, కేకే, జీవన్రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్లతోపాటు పలువురు మంత్రులు, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. లోతుగా చర్చించి నిర్ణయం తీసుకున్నాం: డిప్యూటీ సీఎం భట్టి పీఏసీ భేటీ అనంతరం సీనియర్ మంత్రి ఉత్తమ్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్లతో కలిసి భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పన, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి గురించి పీఏసీ లోతుగా చర్చించిందని చెప్పారు. సెప్టెంబర్ 31 వరకు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సుదీర్ఘంగా పలువురు సభ్యుల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అధికారికంగా వెళ్లాలా... పార్టీ పరంగా వెళ్లాలా అనే అంశాలపై చర్చించడంతోపాటు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని, ఇందుకోసం కమిటీని నియమించాలని, ఈనెల 28వ తేదీలోపు కమిటీ నివేదిక ఇవ్వాలని పీఏసీ నిర్ణయించిందని చెప్పారు. కమిటీలో సభ్యులపై టీపీసీసీ అధ్యక్షుడు అధికారికంగా నిర్ణయం తీసుకుంటారన్నారు. న్యాయ నిపుణులతో కమిటీ చర్చించి పార్టీకి నివేదిక ఇచ్చిన అనంతరం కేబినెట్లో నిర్ణయం తీసుకొని స్థానిక ఎన్నికల విషయంలో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు జస్టిస్ సుదర్శన్రెడ్డికి మద్దతు తెలపాలని కోరుతూ పీఏసీలో తీర్మానించినట్టు వెల్లడించారు. దేశంలోని పౌరుల ఓటు హక్కును కాపాడడం, ఓట్ల చోరీని అరికట్టేందుకు బిహార్లో రాహుల్గాంధీ చేపట్టిన పాదయాత్రపై పీఏసీలో చర్చ జరిగిందని, ఆ పోరాటానికి పీఏసీ సంపూర్ణంగా మద్దతు తెలిపిందన్నారు. ఈనెల 26న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు వెళ్లనున్నట్టు చెప్పారు. విస్తృతంగా చర్చిస్తాం: మంత్రి ఉత్తమ్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, అటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల గురించి ఎలా ముందుకెళ్లాలన్న దానిపై మూడు ఆప్షన్లను పీఏసీ భేటీలో చర్చించామని చెప్పారు. ఈ విషయంలో విస్తృత స్థాయిలో పార్టీ నేతలతోపాటు న్యాయ నిపుణులతో మాట్లాడుతామని వెల్లడించారు. అభిషేక్ మనుసింఘ్వి, జస్టిస్ సుదర్శన్రెడ్డిలతోపాటు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్లను అధికారికంగా అభిప్రాయం అడుగుతామని తెలిపారు. ఘన విజయానికి అవకాశం: పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అద్భుతమైన ఫలితాలనిస్తోందని, జనహిత పాదయాత్రలో భాగంగా వెళ్లినప్పుడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించే అవకాశం ఇప్పుడు పార్టీకి ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ గెలుపు కోసం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని చెప్పారు. బీసీలకు మేలు జరగాల్సిందే: సీఎం రేవంత్ పీఏసీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ తెచి్చన చట్టం ప్రకారం ఒక్కశాతం కూడా అదనంగా బీసీలకు రిజర్వేషన్ రాదని, కానీ బీసీలకు మేలు జరగాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. అందు కోసమే చట్టాన్ని సవరించి ఆర్డినెన్సు తెచ్చామని, ఆ ఆర్డినెన్సును గవర్నర్కు పంపితే ఆయన రాష్ట్రపతికి పంపారని చెప్పారు. రాష్ట్రపతికి పంపిన బిల్లులను 90 రోజుల్లో ఆమోదించాలన్న అంశంపై సుప్రీంకోర్టులో మన వాదనలను వినిపించేందుకు ఇద్దరు న్యాయవాదులను నియమించామని చెప్పారు. ఆ కేసులోనే రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీ బిల్లు అంశం కూడా వస్తుందని, ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకు వెళ్లే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఒకవేళ అలా వెళ్లే కేసు లిస్టు కావడానికే చాలా సమయం పడుతుందన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్రెడ్డిని ఎంపిక చేసినందుకుగాను మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్గాం«దీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 26న బిహార్లో రాహుల్గాంధీ నిర్వహిస్తున్న ఓట్చోరీ పాదయాత్రకు హాజరవుతానని, రాష్ట్రంలో కూడా ఓట్చోరీ ఉద్యమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్, బీజేపీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని, యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తానని కేటీఆర్ చెప్పడంలోనే వారి తీరు అర్థమవుతోందన్నారు. యూరియా కోసం తాను నాలుగుసార్లు కేంద్ర మంత్రులు నడ్డా, అనుప్రియా పటేల్లను కలిశానని వెల్లడించారు. -
యూరియా కొరతపై బీజేపీ, బీఆర్ఎస్లు డ్రామాలు: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా కొరతపై బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి డ్రామాలాడుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని కేటీఆర్ అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోందని విమర్శించారు. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్ను కలిశానని సీఎం రేవంత్ తెలిపారు. యూరియా పంపిణీ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో మానిటరింగ్ను పెంచాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 23 వ తేదీ) గాంధీ భవన్లో మూడు గంటల పాటు జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించినందుకు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కులను కాపాడటం కోసం పని చేశారు. రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టాo. బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం.. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీ లకు మేలు జరగాల్సిందే. రాహుల్ గాంధీ మాట నిలబడాలి. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీంకోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించాం. బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్రకు ఈ నెల 26వ తేదీన హాజరవుతా’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
తెలుగు సెంటిమెంట్ పండుతుందా?
మోకాలికి... బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే. రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకునే పక్షానికే తాము ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతి ఇస్తామని బీఆర్ఎస్ చెప్పడం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమల్లోకి రావాలంటే కాంగ్రెస్ అధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలుగువాడైన జస్టిస్ సుదర్శన రెడ్డిని గెలిపించుకోవడానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు అందరూ కలిసి రావాలని కూడా ఆయన కోరారు. గతంలో పీవీ నరసింహారావు ప్రధాని అయినప్పుడు ఆయన లోక్ సభకు ఎన్నిక అవ్వడానికి అప్పటి టీడీపీ అధినేత ఎన్టీ రామారావు మద్దతిచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో సెంటిమెంట్ రాజకీయాలు పనిచేసే అవకాశం తక్కువే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పాయింట్మెంట్ ఇస్తే తాను కలిసి మద్దతు కోరతానని రేవంత్ రెడ్డి అంటే, కాంగ్రెస్ ఒక చిల్లరపార్టీ అని, రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతిచ్చే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తేల్చేశారు. మరో వైపు తాము బీఆర్ఎస్ మద్దతు కోరలేదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్తో సంబంధాలు పెట్టుకోవడానికి బీజేపీ ఇష్టపడడం లేదన్నమాట. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్ను సంప్రదించలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.మరోవైపు జస్టిస్ సుదర్శనరెడ్డి.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు సత్సంబధాలు ఉన్నట్టుగా మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణకు చెందిన పార్టీ. ఆ రాష్ట్రానికే చెందిన ప్రముఖుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతివ్వడం ఒక నైతిక బాధ్యత. జస్టిస్ సుదర్శనరెడ్డి పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండదు కానీ ఆయన కాంగ్రెస్ కూటమి పక్షాన పోటీలో ఉండడం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా బీఆర్ఎస్ పోటీపడుతోంది. అలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్ధికి మద్దతు ఇస్తే, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయన్న బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుందన్నది వారి భయం కావచ్చు.అలాగని బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతిస్తే బీజేపీ, బీఆర్ఎస్లు కలిసిపోయాయన్న కాంగ్రెస్ ప్రచారానికి బలం చేకూరినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు ఉన్న నాలుగు ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. తటస్థంగా ఉండే అవకాశం ఉంది. పీవీ నరసింహరావు నంద్యాల నుంచి లోక్సభకు పోటీ చేసినప్పుడు టీడీపీ ఆయనకు మద్దతిచ్చిన మాట వాస్తవమే కానీ.. తరువాతి కాలంలో పీవీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీని చీల్చి ఏడుగురు ఎంపీలను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. పైగా... పీవీ ప్రధానిగా ఉండగా.. ఆ తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న విషయాన్ని బీజేపీ, బీఆర్ఎస్లు ఇప్పుడు ఎత్తి చూపుతున్నాయి. పీవీ మరణాంతరం ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ఆఫీస్ ఆవరణలోకి అనుమతించలేదని ఆ పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ సమాధానం ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకో విషయం. ప్రముఖ నేత నీలం సంజీవరెడ్డి తొలిసారి కాంగ్రెస్ అధికారిక అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్టీ నిర్ణయాన్ని కాదని స్వతంత్ర అభ్యర్ది వీవీ గిరికి మద్దతిచ్చారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డికి కాకుండా వీవీ గిరికి మద్దతిచ్చింది. ఆ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నారు. అప్పుడు కూడా తెలుగు సెంటిమెంట్ పట్టించుకోలేదన్నమాట. నీలం సంజీవరెడ్డి రెండోసారి జనతా పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సపోర్టు చేసిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గోపాలకృష్ణ గాంధీని బలపరిచింది. ఇక ఏపీ విషయాన్ని చూస్తే రెండు సభలలో కలిపి తెలుగుదేశం కు 17 మంది ఎంపీల బలం ఉంది. జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. బీజేపీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్కు 11 మంది ఎంపీలున్నారు. తమకు మద్దతివ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కోరారు. రాజ్యాంగ పదవులకు ఎన్నిక జరిగినప్పుడు అనుసరించడానికి జగన్ ఒక పద్దతి పెట్టుకున్నారు. ఆ ప్రకారమే ఎన్డీయేకు మద్దతిస్తున్నట్లు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక టీడీపీ, జనసేనలు ఎన్డీయేలోనే ఉన్నందున అవి సుదర్శనరెడ్డికి ఓటు వేసే పరిస్థితి లేదు.చంద్రబాబుకు, రేవంత్ రెడ్డి కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఉప రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ కూటమికి టీడీపీ మద్దతు ఇవ్వలేదు. కాకపోతే జస్టిస్ సుదర్శనరెడ్డి తనకు చంద్రబాబుతో ఉన్న సంబంధాల గురించి వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబుతో ప్రత్యేక అనుబంధం ఉందని కాని, సంబంధం లేదని కానీ చెప్పలేనని ఆయన అంటున్నారు. 1995లో ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య జరిగిన న్యాయ పోరాటానికి సంబంధించి తీర్పు ఇచ్చిన బెంచ్లో తాను కూడా సభ్యుడనని ఆయన వెల్లడించారు. చంద్రబాబు మంచి, చెడు బెరీజు వేసుకోవచ్చని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. సుదర్శనరెడ్డి వ్యూహాత్మకంగా మాట్లాడినా చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్డీయేను కాదనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఒక ప్రకటన చేస్తూ సుదర్శనరెడ్డికి మద్దతు ఇచ్చి తన కృతజ్ఞత తెలుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై ఆశలు పెంచుకుంటున్నట్లుగా ఉంది. బీహారు శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి ఓడిపోతే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని, చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వస్తారని కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లాంబా జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం కాని చంద్రబాబుతో కాంగ్రెస్కు ఉన్న రహస్య సంబంధాలను ఆమె తెలియచేసినట్లుగా ఉంది.రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్ పెట్టుకున్నారని ఇప్పటికే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వరకు చూస్తే లోక్ సభలో కాంగ్రెస్కు ఎనిమిది, రాజ్యసభలో ముగ్గురు సభ్యులు ఉన్నారు. బీజేపీకి 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు ఒకటి, బీఆర్ఎస్కు నాలుగు రాజ్యసభ స్థానాలూ ఉన్నాయి. ఈ రకంగా చూస్తే సుదర్శనరెడ్డికి కేవలం ఈ 12 మంది మద్దతు మాత్రమే లభించే పరిస్థితి ఉంది. కాగా తెలుగు సెంటిమెంట్ను రేవంత్ రెడ్డి వాడితే, బీజేపీ కూటమి తమిళ సెంటిమెంట్ వాడే అవకాశం ఉంటుంది. అక్కడ మెజార్టీ స్థానాలు డీఎంకే పార్టీకి ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకేలు ఒకే కూటమిలో ఉన్నాయి. అక్కడ బీజేపీ పక్షాన ఒక్క ఎంపీ కూడా లేరు. అన్నాడీఎంకేకు మాత్రం ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మిగిలిన వారు డీఎంకే, కాంగ్రెస్ కూటమికి చెందినవారే. అయినప్పటికీ తమిళనాడుకు చెందిన బీజేపీ నేతను ఉప రాష్ట్రపతి పదవికి పోటీలో దించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ ఎంపిక చేసి ఉండవచ్చు. పోటీచేస్తున్న రాధాకృష్ణన్ తన సొంత రాష్ట్రమైన తమిళనాడులో, సుదర్శనరెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి మెజార్టీ మద్దతు పొందలేరన్నమాట. కాగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పదే,పదే ప్రస్తావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రెడ్డి అగ్రవర్ణాలకు చెందిన ప్రముఖుడిని అభ్యర్ధిగా ఎలా పెడతారని బీజేపీ, బీఆర్ఎస్లు ప్రశ్నిస్తున్నాయి. సుదర్శనరెడ్డి గెలిస్తే బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇది కూడా మోకాలికి, బోడు గుండుకు ముడిపెట్టడమే. కాగా ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ బీసీ వర్గానికి చెందినవారని బీజేపీ ప్రచారం చేస్తోంది. అందువల్ల కాంగ్రెస్ బీసీ కార్డు ఈ సందర్భంగా పనిచేసే అవకాశం ఉండదు. మొత్తం మీద జస్టిస్ సుదర్శనరెడ్డిని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి తన పరపతి పెంచుకునే అవకాశం ఉంది.అంతకు తప్ప ఆయన ప్రయోగించిన తెలుగు సెంటిమెంట్ కాని, బిసి రిజర్వేషన్ ల వాదన కాని ఫలించే పరిస్థితి కనిపించడం లేదు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రేవంత్.. సినీ కార్మికుల సమ్మెపై చొరవకు ధన్యవాదాలు: కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫిల్మ్ చాంబర్ , ఫెడరేషన్ నేతలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సమస్యకు ముగింపు పలకాలని సూచించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చొరవకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా కేతిరెడ్డి ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి.. తన చొరవతో సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న సమ్మె సంక్షోభం ఎట్టి పరిస్థితుల్లో 24 గంటలలో ముగింపు పలకలని అధికారులను ఆదేశించి, తన పరిపాలన దక్షతను చాటుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఎవ్వరు చెడగొట్టాలని ప్రయత్నించినా సహించేది లేదన్న సంకేతం ఇచ్చారు. హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సినిమా హబ్ చేయాలన్న తన కోరికకు ఈ సమ్మె ఒక అడ్డంకిగా ఉందని ఇటీవల బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తదితరులతో కూడా ముఖ్యమంత్రి చర్చించారు.అదేవిధంగా ఎన్నో రోజులుగా సతమతమవుతున్న సినీ కార్మికుల సమస్యలు, చిత్రపురి కాలనీ వ్యవహారంలో గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాలపై విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో నేరం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సినిమాలో ఉన్న ట్రేడ్ యూనియన్ల పేరుతో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. సొసైటీస్ రిజిస్టర్ వద్ద లెక్కలు సమర్పించకుండా ఉన్న వారిపై, దొంగ సభ్యులను చేర్చుకొని వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వాటిని సొసైటీస్ రిజిస్టర్ వద్ద సమర్పించని ట్రేడ్ యూనియన్ సంఘాలపై విచారణ చేపట్టాలన్నారు. వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలన్నీ ఇప్పుడు రెండు నగరాలపైనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీపై రేవంత్, అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే, ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితే కొంత మేలు అనిపిస్తుంది.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు.. మీరంతా నాకు సోదరులే. మీ అందరి ప్రయోజనం కోసమే దాన్ని డిజైన్ చేస్తున్నాను. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోను’ అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఫ్యూచర్సిటీ అని రేవంత్ ధైర్యంగా చెప్పగలిగారు కానీ.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమే అమరావతి అన్న బిల్డప్ను కొనసాగిస్తున్నారు. కానీ అందరూ దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నారు.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూముల అమ్మకం ద్వారా ఆ రుణాలు తీరుస్తామన్న ప్రభుత్వం వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అచ్చంగా సరిపోతుంది కూడా. అయితే చిన్న చినుకుకే చిత్తడై పోతూ.. చెరువులను తలపిస్తున్న అమరావతి ప్రాంతం సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తుంది. ఈ విషయాలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పక్క వరద లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోపక్క మంత్రి నారాయణ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు.అమరావతి నగరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రజలందరిపై పడే అప్పుల భారం ఎంత? అన్న చింత ఏపీలోని ఆలోచనాపరుల్లో కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలు అంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా అంత తేలిక కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియాల్సి ఉంది. అయినా ఇక్కడి భూ స్వభావం, వరదల వంటి సమస్యలు లేకపోవడం, ఇప్పటికే అభివృద్ది చెందిన హైదరాబాద్ చెంతనే ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన 14 వేల ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు.నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్దికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ది సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి, కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను కొన్నిటిని తీసుకుని, లేదా ప్రైవేటు భూములను సమీకరించి ప్లాట్లు వేసి వేలం నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. గత టర్మ్లో ఏపీలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆయా పట్టణాలు, నగరాలలో ప్రభుత్వపరంగా ఇలాంటి వెంచర్లు వేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలను సమకూర్చాలని ప్లాన్ చేసింది. అందుకోసం భూములు కూడా తీసుకున్నారు. ఇది ఒక క్రమ పద్దతిలో జరిగితే స్కీములు సక్సెస్ అవుతాయి. లేదంటే విఫలమవుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా వసతుల కల్పన సంస్థలు ఉన్నాయి.అవి ఆయా చోట్ల, అంతగా పంటలు పండని భూములను సేకరించి రోడ్లు, విద్యుత్, నీరు తదితర వసతులు కల్పించి పరిశ్రమలకు అనువైన రీతిలో తయారు చేసి విక్రయిస్తుంటాయి. తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే ఏపీ విభజన తర్వాత చంద్రబాబు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా, ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను పూలింగ్ కింద ఇచ్చారు.కానీ, ఇప్పటికీ పదేళ్లు అయినా వారికి ప్లాట్లు దక్కలేదు. వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44 వేల ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పడంపై రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ లక్ష ఎకరాల భూమి ఎప్పటికి అభివృద్ది కావాలి? అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి? నవ నగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా?. అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేకమంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కుకున్నారు. రైతులకు తమ ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్నా, వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామన్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపలేక పోతున్నామని వాపోతున్నారు.ఇన్ని సమస్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఓ మోస్తరు వర్షం కురిసినా ఆ ప్రాంతం అంతా నీటిమయం అవుతోంది. భూమి చిత్తడిగా మారుతోంది. ఈ భూమి భారీ నిర్మాణాలకు అనువు కాదని శివరామకృష్ణ కమిటీ, ప్రపంచ బ్యాంక్లు కూడా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. ఈ సమస్యలన్నీ సర్దుకుని నిర్మాణాలు సాగితే ఫర్వాలేదు కాని, లేకుంటే ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడకు పలు సంస్థలు వచ్చేస్తున్నట్లు, ఏఐ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వంటివి జరగబోతున్నట్లు హడావుడి చేస్తున్నారు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్లు.. అవన్నీ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు.ఇక, ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా భూ సేకరణపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. అధిక వాటా, అనాసక్తి వంటి కారణాలతో రైతులు కొంతమంది ప్రభుత్వానికి సహకరించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు కొంత పెరిగిన మాట నిజమే కాని, రకరకాల సందేహాల వల్ల ఇప్పుడు అంత ఊపు లేదు అంటున్నారు. దానిని పారదోలడానికి రేవంత్ సర్కార్ కష్టపడుతోంది. వదంతులు నమ్మవద్దని, ఫ్యూచర్ సిటీకిగాని, హైదరాబాద్కు కాని రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్లాన్డ్గా అభివృద్ది ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.అయితే ఆయా గ్రామాల మధ్య శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డుల మధ్య ఈ సిటీ అభివృద్దికి ఎన్నో ఆటంకాలు కూడా రావచ్చన్న అనుమానం ఉంది. హైడ్రాను స్థాపించడం వల్ల రేవంత్ సర్కార్కు కొంత కీర్తి, మరికొంత అపకీర్తి వచ్చింది. చెరువుల శిఖం భూములనో, మరొకటనో, కొత్తగా నిర్మిస్తున్న పలు భవనాలు, అపార్టెమెంట్లు కూల్చడం వల్ల మధ్య తరగతి ప్రజలు కొంత నష్టపోయారు. వారు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడానికి సందేహిస్తున్నారు. అయితే చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి వాటి వల్ల కొంత పేరు కూడా వచ్చింది. ఇందులో కూడా పక్షపాతంగా కొన్ని జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఓవరాల్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉండడం, ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగుల లేఆఫ్ల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై కూడా ఉందని అంటున్నారు.హైదరాబాద్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏ అభివృద్ది లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిక కాదని అంచనా. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో ఏడు ఎకరాల ప్లాటును గోద్రోజ్ కంపెనీ 547 కోట్లకు కొనుగోలు చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు, రేవంత్లు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో రెండు కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా?. ఇతర ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిది అని తప్ప ఇంకేమీ చెప్పగలం.!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సినీ కార్మికుల సమ్మెకు తెర
సాక్షి, హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి కార్మికులు సమ్మె చేస్తుండటం తెలిసిందే. కార్మికశాఖ కార్యాలయంలో కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం ఫిల్మ్ చాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులతో సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించాయి. కార్మికులు 30 శాతం వేతనాల పెంపు కోసం డిమాండ్ చేయగా 22.5 శాతం వేతనం పెంపునకు నిర్మాతలు ఓకే అన్నారు. దీంతో 18 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ఫుల్స్టాప్ పడింది. దీంతో శుక్రవారం నుంచి యథావిధిగా చిత్రీకరణలు జరగనున్నాయి. సీఎం సూచనతో పరిష్కారం చూపాం: ‘దిల్’రాజు చర్చల అనంతరం తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్, నిర్మాత ‘దిల్’ రాజుతోపాటు పలువురు సినీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ‘నిర్మాతలకు, ఫెడరేషన్కు మధ్య నెలకొన్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశంతో గురువారం ఫెడరేషన్, ఫిల్మ్ చాంబర్, ఎఫ్డీసీ ద్వారా పరిష్కారం చూపాం. ఇందుకుగాను చిత్ర పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్కు సినీ పరిశ్రమ, ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు. సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. భారతీయ చిత్రాలన్నీ హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకునేలా ఉండాలనేది ముఖ్యమంత్రి ఫ్యూచర్ విజన్. తెలుగు సినిమాలతోపాటు అన్ని భాషల సినిమాలూ హైదరాబాద్లో చిత్రీకరణలు జరుపుకునేలా చేయడం మనందరి బాధ్యత. హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా తయారు చేద్దాం’ అని ‘దిల్’రాజు పేర్కొన్నారు. రోజుకు రూ. 2 వేలలోపు ఉంటే తొలి ఏడాది 15 శాతం పెంపు సినీ కార్మికులకు 22.5 శాతం వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ముందుకురాగా ఫెడరేషన్ ప్రతినిధులు అందుకు ఒప్పుకున్నారని కార్మికశాఖ అదనపు కమిషనర్ గంగాధర్ తెలిపారు. రోజుకు రూ. 2 వేలలోపు వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారని చెప్పారు. అలాగే రూ. 2 వేల నుంచి రూ. 5 వేలు ఉన్నవారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతనాలు పెంచుతారని వివరించారు. ఇతర విషయాలపై చర్చించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు ఇప్పటివరకు ఆదివారాలు షూటింగ్ చేస్తే డబుల్ కాల్షీట్ లెక్కన వేతనాలు చెల్లిస్తుండగా ఇకపై పెద్ద సినిమాలకు ఒకటిన్నర కాల్షీట్, చిన్న సినిమాలకు మాత్రం రెండు, నాలుగో ఆదివారాలకే ఒకటిన్నర కాల్షీట్ ఉంటుందని గంగాధర్ తెలిపారు. చిన్న సినిమాల నిర్మాతలు సమస్యలపైనా చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిష్కారం: వల్లభనేని అనిల్కుమార్ ‘వేతనాల పెంపుపై లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో పరిష్కారం కుదిరింది. 30 శాతం వేతనాల పెంపు కోసం మేం అడగ్గా నిర్మాతలు 22.5 శాతానికి ఒప్పుకున్నారు. ప్రొడక్షన్ అసిస్టెంట్ యూనియన్, మహిళా వర్కర్స్, స్టూడియో వర్కర్స్, లైట్మెన్ యూనియన్ల కార్మికులకు ఎక్కువ వేతనం కావాలని అడిగాం. దీనిపై ఒక కమిటీ వేసి చర్చిస్తామని చెప్పారు. అంతిమంగా ఫైటర్లకు 7.5 శాతం, డ్యాన్సర్లకు 5.5 శాతం పెంచేందుకు ఒప్పుకున్నారు’ అని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్కుమార్ తెలిపారు. కలిసిమెలిసి ముందుకు సాగాలి‘ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను సామరస్యంగా, సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్ను దేశానికే కాదు, ప్రపంచ చలన చిత్ర రంగానికే ఓ హబ్గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవి. తెలుగు చిత్రసీమ ఎప్పుడూ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలి. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ – చిరంజీవి -
మూసీలో గోదావరిని పారిస్తాం
గచ్చిబౌలి: గోదావరి నదీ జలాలతో మూసీ నది ఏడాదంతా పారేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. గోదావరి నుంచి 35 టీఎంసీల నీటిని గండిపేట, హిమాయత్సాగర్కు తరలించి 365 రోజులూ మూసీ నది స్వచ్ఛమైన నీటితో ప్రవహించేలా చర్యలు చేపడతామని చెప్పారు. మూసీ సుందరీకరణ, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీలను ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, మెట్రో రైల్ విస్తరణతో హైదరాబాద్లో రాత్రి సమయంలో కూడా మూసీ పరీవాహక ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తా మని చెప్పారు. బుధవారం గచ్చిబౌలిలోని తాలింలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. 1994 నుంచి 2014 వరకు పనిచేసిన ముఖ్యమంత్రులు హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రపంచం చూపు హైదరాబాద్ వైపు.. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సీఎం తెలిపారు. 2034 నాటికి ప్రపంచమంతా హైదరాబాద్ నగరం వైపు చూస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హైటెక్సిటీకి పునాది వేసినప్పుడు కొందరు దానిని హేళన చేశారు.నేడు మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ కూడా కొందరికి ఇష్టం లేక విమర్శలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చూన్ –500 జాబితాలోని కంపెనీల్లో హైదరాబాద్లోనే 85 ఉన్నాయి. ఐటీ కంపెనీల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.వేల కోట్ల ఆదాయం వస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు. అదే ఒరిజినల్ సిటీ’అని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో..ఏటా రూ.15 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చే సబ్రిజి్రస్టార్ కార్యాలయాల్లో ప్రజలు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి ఉందని సీఎం అన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో సకల సౌకర్యాలతో అత్యాధునిక సబ్రిజి్రస్టార్ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కోర్ అర్బన్ ప్రాంతంలో 39 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, 11 ఇంటిగ్రేటెడ్ సబ్రిజి్రస్టార్ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. ఎనిమిది నెలల్లో రూ.30 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అపర్ణ ఇన్ఫ్రా సంస్థ గచి్చబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్రిజి్రస్టార్ కార్యాలయాన్ని నిర్మిస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 2 నాటికి మిగిలిన 10 భవనాల నిర్మాణం పూర్తిచేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఆదేశించారు. రోల్ మోడల్గా భూభారతి ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేసి రెవెన్యూ సంస్కరణల్లో రోల్ మోడల్గా భూభారతిని తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై భారం పడకుండా సీఎస్ఆర్ నిధులతో ఆయా కంపెనీల సహకారంతో ఇంటిగ్రేటెడ్ సబ్రిజి్రస్టార్ కార్యాలయాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గచ్చిబౌలి తాలింలో రూ.30 కోట్లతో మూడు ఎకరాల విస్తీర్ణంలో భవనం నిర్మిస్తామని తెలిపారు. భవనంలో డీఆర్ఓ, ఆరుగురు ఎస్ఆర్ఓల ఆఫీసులు, వెయిటింగ్ హాల్, టోకెన్ సిస్టమ్, వివాహ రిసెప్షన్ కోసం ప్రత్యేక హాల్, ఫీడింగ్ రూమ్, చిన్నారుల కోసం క్రష్ సెంటర్, వృద్ధుల కోసం ర్యాంప్, వీల్చైర్ సదుపాయం, 300 కార్లకు పార్కింగ్, గ్రీన్ బిల్డింగ్, సెల్లార్ సిస్టమ్, కేఫ్ ఉంటాయని చెప్పారు. దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ఆస్తుల రిజి్రస్టేషన్ ప్రక్రియలో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. -
యూరియా కొరతపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన ఎరువుల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చిన ఎరువుల పరిమాణం, ఎంత పంపిణీ అయ్యిందీ, పక్కదారి పట్టిన ఎరువులపై ప్రజలకు వివరణ ఇవ్వాలని అన్నారు. బీఆర్ఎస్ నేతలు వారం రోజుల పాటు ఎరువుల పంపిణీ కేంద్రాల వద్దకు వెళ్లి, గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆదుకున్న తీరును వివరించాలని ఆదేశించారు. తాము వ్యవసాయ శాఖ కార్యదర్శిని కలిసి ఎరువుల కొరతపై చర్చించడంతో పాటు పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీస్తామని తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని, పార్టీ తరఫున పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. నందినగర్ నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.రైతులు అధికారుల కాళ్ల మీద పడుతున్నారు‘కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ్ధ విధానాలతో రైతులు ఎరువుల బస్తాల కోసం అధికారుల కాళ్ల మీద పడుతున్నారు. కేసీఆర్ పాలనలో ఆరు నెలల ముందే ఎరువుల కోసం ముందస్తు ప్రణాళిక తయారు చేయడం ద్వారా రైతులకు సకాలంలో అందేలా చూశాం. కానీ ప్రస్తుతం వానాకాలం సీజన్ నడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్ష, సన్నద్ధత, ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని నడిపించే నాయకుడికి వ్యవసాయం మీద కనీస అవగాహన లేకపోవడంతోనే ఎరువుల పంపిణీలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. కృత్రిమ కొరత, సోషల్ మీడియా దుష్ప్రచారం అంటూ సీఎం కాలయాపన చేస్తున్నాడు. కానీ కొన్నిచోట్ల కాంగ్రెస్ నాయకులే ఎరువులను బ్లాక్లో అమ్ముతున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. దమ్ముంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఎరువుల కొరతపై గ్రామాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడాలి..’ అని కేటీఆర్ సవాల్ చేశారు.కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా‘బీసీ సామాజికవర్గం మీద ప్రేమ కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉప రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా అదే సామాజికవర్గానికి చెందిన వారిని ఎందుకు పోటీ చేయించడం లేదు?. కంచ ఐలయ్య లాంటి మేధావులను పోటీలో పెట్టొచ్చు కదా. ఉప రాష్ట్రపతి అభ్యర్థి.. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తే అయితే కచ్చితంగా వ్యతిరేకించాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం..’ అని కేటీఆర్ చెప్పారు.‘మార్వాడీ గో బ్యాక్’పై ప్రభుత్వం స్పందించాలి‘‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం శాంతిభద్రతల సమస్యగా మారకముందే ప్రభుత్వం స్పందించాలి. విశ్వనగరం హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు, అన్ని మతాల వారు ఉన్నారు. పొట్ట కూటి కోసం వచ్చే వారితో తెలంగాణ ప్రజలకు పేచీ లేదు. పొట్ట కొట్టే వారిపైనే పోరాటం. ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం వచ్చే వారు ఇక్కడి వారి సంస్కృతి, మనోభావాలను గౌరవించాలి..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మేము ఏ కూటమిలోనూ భాగస్వాములం కాదు‘బీఆర్ఎస్ సర్వ స్వతంత్ర పార్టీ. మాకు ఢిల్లీలో బాస్ ఎవరూ లేరు. ఢిల్లీ పార్టీలేవి మాకు బాసులు కాదు. తెలంగాణ ప్రజలే మాకు బాసులు. మేము ఎన్డీఏ కూటమిలో కానీ, ఇండియా కూటమిలో కానీ భాగస్వాములం కాదు. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇప్పటివరకు మమ్మల్ని ఏ కూటమీ సంప్రదించలేదు. మా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో అంతర్గతంగా చర్చించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం ప్రకటిస్తాం. సెప్టెంబర్ 9లోపు రాష్ట్ర రైతులకు యూరియా ఇప్పించే పార్టీ అభ్యర్థికి మద్దతు పలుకుతాం..’ అని కేటీఆర్ తెలిపారు. -
మేడారం జాతర.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, వరంగల్: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా అనబడే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన నిధుల పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరు లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం 150 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, గిరిజనులపట్ల సీఎం రేవంత్రెడ్డి కట్టుబాటు, మద్దతుకు నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగుతుంది” అని పేర్కొన్నారు. -
దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడు అయ్యారని రేవంత్ చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్బంగా తెలంగాణ సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడయ్యారు. దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని కృషి చేసిన పునాదులు వేసిన నేత రాజీవ్ గాంధీ. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజీవ్ గాంధీ కల్పించారు.రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవ్వగానే 21ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెడతాం. దేశ కలలు సహకారం కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాల్సిందే. స్థానిక సంస్థల్లో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన నేత రాజీవ్ గాంధీ. సిలికాన్ వ్యాలీని ఈరోజు మహిళలలు నడుపుతున్నారు అంటే రాజీవ్ ఘనతే. నేటి యువతకు ఆయన స్పూర్తి ప్రదాత. రాజీవ్ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నాం. ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే, మూసీ ప్రక్షాళనను మన ప్రభుత్వం చేయబోతోంది అని చెప్పుకొచ్చారు. -
సుకుమార్ కుమార్తెను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
సినీ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి (Sukriti Veni)ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి, అభినందించారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సుకృతి సత్తా చాటింది. ఆమె నటించిన 'గాంధీ తాత చెట్టు' సినిమాకు ఉత్తమ బాల నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మంగళవారం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి నివాసంలో సుకుమార్ దంపతులతో పాటు నిర్మాత యలమంచిలి రవిశంకర్ తదితరులు సీఎంను కలిశారు.పర్యావరణ పరిరక్షణ కాన్సెప్ట్తో 'గాంధీ తాత చెట్టు' సినిమాను పద్మావతి మల్లాది తెరకెక్కించారు. సుకుమార్ సతీమణి తబిత సమర్పకురాలిగా వ్యవహరించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను ఈ చిత్రం అందుకుంది. ఇందులో సుకృతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంలోని తన పాత్ర కోసం ఆమె ఏకంగా గుండు కొట్టించుకుని నటించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. -
అదిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ను కలవడానికి సిద్ధం: సీఎం రేవంత్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందన్నారు సీఎం రేవంత్. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 90 రోజుల్లో రాష్ట్రపతి పూర్తి చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లులపై సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇక ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్రెడ్డి ఓటింగ్ విషయంలో అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ను కలవడానికి సిద్ధమన్నారు. మంగళవారం(ఆగస్టు 19వ తేదీ) మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన సీఎం రేవంత్.. ‘ జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఎంపిక చేసింది. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో అదిష్టానం ఆదేశిస్తే కేసిఆర్ను కలవడానికి సిద్దం. ఆయన అపాయింట్ మెంట్ ఇస్తడో లేదో.. ఆయనకు నా మొఖం చూడటం ఇష్టం ఉందో లేదో. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంలో నా నిర్ణయం ఏం లేదు ఇండియా కూటమి నిర్ణయం. నేను రెగ్యులర్ ఆయన్ను కలుస్తాను.. మన ఊరాయనా. నేను జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్కు వెళతాను’ అని పేర్కొన్నారు. -
అడ్డుకుంటున్నది వారే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకుంటున్నది ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బీసీల కలను సాకారం చేసేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా కసరత్తు చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రతిపాదనలకు మతం రంగు పులిమి బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ 2018లో చట్టాన్ని చేయడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రిజర్వేషన్లు పెంచే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. ఇప్పుడు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలంటే ఆ చట్టం అడ్డంకిగా మారిందని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 375 జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ట్యాంక్బండ్కు సమీపంలో సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ తదితరులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సర్వాయి పాపన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రవీంద్రభారతిలో సభికులనుద్దేశించి మాట్లాడారు. పర్యాటక ప్రాంతంగా ఖిలా షాపూర్ అభివృద్ధి ‘బహుజనుల సామ్రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అలాంటి వ్యక్తి నిర్మించిన ఖిలా షాపూర్ కోటను బీఆర్ఎస్ ప్రభుత్వం మైనింగ్ పేరుతో కాలగర్భంలో కలిపేందుకు కుట్ర చేసింది. మేం ఆనాడు కోటపైకి వెళ్లి చూసి.. దాన్ని కాపాడి చారిత్రక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై దృష్టి పెట్టాం..’అని సీఎం తెలిపారు. బీజేపీకి ఆ ధైర్యం ఉందా? ‘రాహుల్గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, శాస్త్రీయంగా కుల సర్వే చేపట్టి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కులాల గణాంకాలను తేల్చింది. రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగాలు, ఉపాధితో పాటు రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించాం. ఐదు నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో బిల్లులు ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేశాం. ఈ ధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. బీసీలంటే బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు బీజేపీ మతం రంగు పులిమింది. మోదీ, కిషన్రెడ్డి వీటిని అడ్డుకుంటున్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్లో ముస్లింలు బీసీ జాబితా ద్వారానే రిజర్వేషన్లు పొందుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించే ధైర్యం బీజేపీకి ఉందా? రాహుల్గాం«దీపై కోపం ఉంటే ఆయనపై చూపాలి కానీ ఆయన సిద్ధాంతాలపై చూపొద్దు..’అని రేవంత్ అన్నారు. తెలంగాణలోనూ ఓట్లు చోరీ చేసే కుట్ర.. ‘దేశంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దొంగ ఓట్ల కుట్రను రాహుల్గాంధీ బట్టబయలు చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ కేవలం నాలుగు నెలల్లో కోటి ఓట్లు నమోదు చేసింది. అంబేడ్కర్ పుట్టిన గడ్డ మీద రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది. దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దేశం నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతోంది. ఓటు హక్కును దొంగిలించిన వారిని శిక్షించాలని రాహుల్గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో డిప్యూటీ సీఎంతో కలిసి ఆ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలియజేస్తా. ఇక్కడ కూడా ఓట్ల చోరీ చేసే కుట్ర జరుగుతోంది. అందరం కలిసికట్టుగా ఓట్ల చోరీకి పాల్పడేవారి భరతం పడదాం..’అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. బహుజనుల పిల్లలు రాజ్యాధికారం సాధించాలి ‘బహుజనుల పిల్లలంతా ఉన్నత చదువులు చదివి రాజ్యాధికారం సాధించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది. విగ్రహాలు.. వర్థంతులు, జయంతుల కోసం కాదు. ప్రతి ఒక్కరిలో వారి స్ఫూర్తిని రగిలించేందుకే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం..’అని రేవంత్ అన్నారు. తెలంగాణ నిర్ణయాలు దేశానికే ఆదర్శం: భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సామాజిక విప్లవానికి కూడా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన కుల సర్వేను కేంద్రం నమూనాగా తీసుకుని కులగణనకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని, కానీ కొన్ని రాజకీయ పార్టీలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కోసం స్థలాన్ని ఇచ్చినందుకు సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్ర ప్రజల తరఫున భట్టి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సర్వాయిపేట కోటను రూ.4.5 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. సర్వాయి పాపన్న గౌడ్ ఒంటరిగా పోరాటం చేయలేదని, బహుజనులందరితో కలిసి ఉద్యమించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ చేతకానితనం వల్లే పరిశ్రమలు పారిపోతున్నాయి: కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్ధత, సీఎం రేవంత్ రెడ్డి చేతకాని పాలనతో పరిశ్రమలు తెలంగాణ నుంచి పారిపోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ చేతకాని పాలనతో రూ. 2,800 కోట్ల కేన్స్ పెట్టుబడి గుజరాత్కు తరలిపోయిందని విమర్శించారు. ప్రత్యక్షంగా 2 వేలమంది తెలంగాణ యువత ఉద్యోగాలకు రేవంత్ సర్కార్ గండికొట్టిందని ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ శ్రమ.. రేవంత్ చేతకానితనం వల్ల బూడిదలో పోసిన పన్నీరుగా మారిందన్నారు. ఢిల్లీకి ఏటీఎంలా రాష్ట్రాన్ని వాడుకోవడమే కాంగ్రెస్ ఏకైక అజెండా అని కేటీఆర్ మండిపడ్డారు. ఇదొక "చెత్త" సర్కారు! రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు కేటీఆర్ ‘‘ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే పాలకులు మాత్రం "ఆర్ఆర్ ట్యాక్స్" వసూళ్లలో బిజీగా ఉన్నారు! ’ అని విమర్శించారు.ఇదొక "చెత్త" సర్కారు!రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు… pic.twitter.com/AUkd9C4Bel— KTR (@KTRBRS) August 18, 2025 -
ఇదొక ‘చెత్త’ సర్కారు!.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసిన మురుగు నీరు, చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ఇదొక ‘చెత్త’ సర్కారు!. రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్త కుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.బీఆర్ఎస్ హయాంలో వర్షాకాలానికి 2 నెలల ముందు నుంచే సీజనల్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు సమీక్షా, సమన్వయ సమావేశాలు నిర్వహించి, ముందస్తు చర్యలు చేపట్టేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలు ఈసురోమని అలమటిస్తుంటే పాలకులు మాత్రం ‘ఆర్ఆర్ ట్యాక్స్’ వసూళ్లలో బిజీగా ఉన్నారు!’ అంటూ కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక "చెత్త" సర్కారు!రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు… pic.twitter.com/AUkd9C4Bel— KTR (@KTRBRS) August 18, 2025అలాగే, అంతకుముందు.. రామంతాపూర్లో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు మృతి చెందిన ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో కేటీఆర్..‘రామంతపూర్ గోఖలేనగర్లో శ్రీ కృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం. కరెంట్ షాక్కు గురై ఐదుగురు యువకులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైనది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని అన్నారు.రామంతపూర్ గోఖలేనగర్లో శ్రీ కృష్ణాష్టమి ఊరేగింపులో జరిగిన దుర్ఘటన అత్యంత విషాదకరం. కరెంట్ షాక్కు గురై ఐదుగురు యువకులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. పండుగ వేళ జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరమైనది.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా…— KTR (@KTRBRS) August 18, 2025 -
బాబు, రాహుల్ హాట్లైన్ బంధం నిజమే!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కుమ్మక్కు అయినట్లేనా? రాహుల్ గాంధీ ఒకవైపు కేంద్రంలో బీజేపీతో పోరాడుతున్నట్లు హడావుడి చేస్తూ.. ఇంకోపక్క అదే ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించడం లేదు ఎందుకన్న ప్రశ్న కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య ఉన్న హాట్ లైన్ సంబంధాల గుట్టు రట్టు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా ఈ కథ నడుస్తోందని ఆయన వెల్లడించారు. అంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా అటు బీజేపీతో పొత్తు, ఇటు కాంగ్రెస్తో రహస్య బంధం పెట్టుకున్నారన్న మాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది కాని పెద్దగా ఫీల్ కాలేదనిపిస్తుంది. అందువల్లే ఇప్పుడు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. జగన్పై కొద్దిమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరిగిందని, బీజేపీకి మేలు చేసేందుకు ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఏపీ, ఒడిశాలల్లో జరిగిన ఎన్నికల తీరుపై ఎందుకు మాట మాత్రం కూడా ప్రస్తావించడం లేదన్నదానికి జవాబు దొరకడం లేదు. ఏపీలో పోలింగ్ నాటితో పోలిస్తే కౌంటింగ్ రోజు 12.5 శాతం ఓట్లు అధికంగా లెక్కవేశారని... అంటే సుమారు 49 లక్షల ఓట్ల మాయాజాలం జరిగిందని ఎన్నికల సంస్కరణల సంస్థ (ఎడిఆర్) ఒక నివేదికలో తెలిపింది.అయినా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఈ విషయం తెలియనట్లు నటిస్తోంది. అదే జగన్ మాత్రం హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలై, బీజేపీ గెలిచిన రోజే ఎన్నికల అక్రమాలపై తన నిరసన తెలిపారు. ఈవీఎంలు మానిప్యులేషన్కు గురవుతున్నాయిని, బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు జరపాలని సూచించారు. జగన్ అలా వ్యాఖ్యానించినా, ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పలేదు. ఎన్నికల కమిషన్కు ఇచ్చిన పత్రంలో ఈవీఎంల మాయ, ఓట్ల రిగ్గింగ్ తదితర కారణాలతో వైఎస్సార్సీపీ 88 సీట్లు కోల్పోయిందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మోడీ అంటే వెరచేవారైతే జగన్ ఈ విషయాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలిగేవారా? వైఎస్సార్సీపీ నేతలు కొందరు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ హైకోర్టుకు కూడా వెళ్లారు. కానీ ఎన్నికల అధికారులు వాటిని పది రోజులలోనే దగ్ధం చేయించిన విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇన్ని జరిగినా కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పలేదు. ఈ ఆధారాలను రాహుల్ వాడుకోగలిగి ఉంటే ఆయన వాదనకు మరింత బలం చేకూరేది. ఈ విషయాలన్నిటిని కప్పిపుచ్చి రాహుల్ గాంధీకి జగన్ మద్దతు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, చామల కిరణ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికీ జగన్ను విమర్శించడానికి ప్రాధాన్యత ఇచ్చారే కాని, ఏపీలో ఎన్నికల అవకతవకలు జరిగాయా?లేదా? అన్నదానిపై తమ అభిప్రాయం చెప్పలేదు. మోడీ,అమిత్ షాలపై జగన్ విమర్శలు చేయడం లేదట. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై జగన్ ఎవరిపై విమర్శలు చేసినట్లో తెలియడం లేదా? పైగా షర్మిల ఆధ్వరంలో జరిగే ర్యాలీలో జగన్ పాల్గొనాలని ఒక పిచ్చి సలహా పారేసి చంద్రబాబు పట్ల, బీజేపీ కూడా భాగస్వామి అయిన కూటమి పట్ల ఎంత విధేయత ఉందో ఈ కాంగ్రెస్ నేతలు మరోసారి చెప్పకనే చెప్పారనిపిస్తుంది.రాహుల్ గాంధీ చెప్పుడు మాటలు వింటారని గతంలో అనుకునేవారు. తల్లి సోనియాగాంధీ కూడా అదే తరహాలో వ్యవహరించిన కారణంగానే ఏపీలో కాంగ్రెస్ నాశనమైందని కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైందని అంతా విశ్వసిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన కుమారుడు జగన్ పట్ల కాంగ్రెస్ నాయకత్వం సరైన రీతిలో వ్యవహరించలేదు. జగన్ను ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తీర్మానం చేసినా, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకుండా, మరో సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. తదుపరి అది తప్పు నిర్ణయమన్న భావనకు వచ్చిన అధిష్టానం ఆయనను మార్చి అప్పట్లో స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేశారు. ఈ ఎంపికలో రాహుల్ గాంధీ పాత్ర అధికంగా ఉందని అంటారు.చిదంబరం వంటి నేతలను ప్రభావితం చేసి రాహుల్ తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా కిరణ్ వ్యూహం అమలు చేశారని అంటారు. ఆ పిమ్మట జగన్ తన సొంత పార్టీ పెట్టుకుని ముందుకు వెళ్లారు. దాంతో కక్షకట్టి ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇందులో చంద్రబాబు సహకారాన్ని కూడా తీసుకున్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు కాపాడడం, చంద్రబాబు కోరుకున్నట్లు జగన్పై అక్రమ కేసులు పెట్టడం వంటివి కూడా చేశారు. తత్పలితంగా కాంగ్రెస్ తన సమాధికి తానే రాళ్లు పేర్చుకున్నట్లయింది. ఫలితంగా ఈ 15 ఏళ్లు అధికారానికి దూరం కావల్సి వచ్చింది. అధికారం పోయిన తరువాత కూడా వారిలో పెద్దగా మార్పేమీ రాలేదు. బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పరోక్ష స్నేహం చేస్తోందన్నది బహిరంగ రహస్యమే.ఏపీ కాంగ్రెస్లో కాస్తో, కూస్తో మిగిలి ఉన్న కేడర్ కూడా ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసి ఓటమిపాలైన తర్వాత ఏపీలో ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోలేదు. 2019లో ఏపీలో పరాజయం తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ను పూర్తిగా వదలివేశారు. కాంగ్రెస్తో పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ అగ్రనేతలతో కలిసి ప్రచారాలు కూడా నిర్వహించారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలు కొందరికి టీడీపీ నాయకత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా లభించిందని చెబుతారు. 2019 ఓటమి తర్వాత కాంగ్రెస్ను వదలి బీజేపీ కూటమితో సాన్నిహిత్యం కోసం నానా పాట్లు పడ్డారు. అయినా ఎన్నడూ చంద్రబాబును రాహుల్ గాంధీ తప్పు పట్టలేదు. చివరికి 2024లో బీజేపీతో కలిసి చంద్రబాబు పోటీ చేసినా ఒకటి, అర సందర్భంలో తప్ప టీడీపీపై కాంగ్రెస్ అగ్రనేతలు విమర్శలు చేయలేదన్నది వాస్తవం. అలాగే సోనియాగాందీ, రాహుల్ గాంధీలతోపాటు ,కాంగ్రెస్ ముఖ్యనేతలెవరిని చంద్రబాబు కూడా విమర్శించరు. ఈ మధ్యకాలంలో ప్రధాని మోడీపై రాహుల్ ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా, వాటిని ఖండించడానికి, మోడీకి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడానికి చంద్రబాబు పెద్దగా చొరవ చూపిన సందర్భాలు కనిపించవు. ఆపరేషన్ సిందూర్ వంటి కీలకమైన అంశంలో సైతం రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ పెద్ద ఎత్తున తప్పుపట్టినా చంద్రబాబు మాత్రం నోరెత్తలేదని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. మోడీతో కలిసి పాల్గొనే సభలలో మాత్రం ఆయనను చంద్రబాబు ఆకాశానికి ఎత్తుతుంటారు. మోడీ,అమిత్ షా వంటివారితో సంబంధం లేకుండా ఏపీలో నిత్యం జరిగే సభలలో మాత్రం చంద్రబాబు వారి ఊసే ఎత్తకుండా, మొత్తం తన గురించే ప్రచారం చేసుకుంటుంటారని, అయినా తమ నాయకత్వం చూసి చూడనట్లు పోతోందని బీజేపీ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని చేయడంలో, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచాక ముఖ్యమంత్రి పదవి వచ్చేలా చేయడంలో చంద్రబాబు ప్రభావం కూడా ఉందని బీజేపీ వారికి కూడా తెలుసట. అయినా బీజేపీ వ్యూహాత్మకంగా ఏపీలో పొత్తు పెట్టుకుంది. తెలంగాణలో మాత్రం పొత్తుకు ఈ రాష్ట్ర నాయకులు అంత సుముఖంగా లేరని అంటున్నారు. అసలు ఏపీ కాంగ్రెస్లో చాలామందికి ఇష్టం లేకపోయినా వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిని చేశారు. ఆమె అచ్చంగా అధికారం కోల్పోయిన జగన్ పై విమర్శలు చేస్తూ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సపోర్టుగా వ్యవహరిస్తుంటారన్న అభిప్రాయం ఉంది. ఆమెకు మాణిక్యం ఠాకూర్ వంటి వారు వంతపాడుతున్నారు. ఏపీలో అనేక స్కామ్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా ఆమె కాని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కాని వాటి గురించి కాకుండా విపక్షంలో ఉన్న జగన్ పై విమర్శలు చేస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కొంతకాలం క్రితం ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడితే, షర్మిల తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఈవీఎంలకు బదులు బాలెట్ల వ్యవస్థను తీసుకురావాలని కోరుతుంటే ఈమె ఇలా ఎలా మాట్లాడతారో తెలియదు. ఈ కారణాలన్నిటి రీత్యానే రాహుల్ గాంధీపై జగన్ విమర్శలు చేశారు. చంద్రబాబుకు, రేవంత్కు ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇప్పటికీ సజావుగానే కొనసాగుతున్నాయని కాంగ్రెస్ కేడర్ సైతం చెబుతుంటుంది.అందువల్ల రేవంత్ ద్వారా రాహుల్ గాంధీ, చంద్రబాబుల మధ్య హాట్ లైన్ నడుస్తోందని, వారి మధ్య నిత్య సంబందాలు ఉన్నాయని జగన్ అభిప్రాయపడ్డారన్నమాట. చిత్రమేమిటంటే చంద్రబాబుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ నేతలు అనడం లేదు. తాము చంద్రబాబు ఆద్వర్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై పోరాడతామని చెప్పడం లేదు. మళ్లీ జగన్ పైనే విమర్శలు చేసి చంద్రబాబును సంతోషపెట్టారనిపిస్తుంది. మరో వైపు ఒడిశాలో ఎన్నికల అక్రమాలపై బీజేడీ హైకోర్టుకు వెళుతోంది. అయినా రాహుల్ గాంధీ ఏపీ, ఒడిశాల గురించి మాట్లాడకుండా బీజేపీపై పోరాడుతున్నామని చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం ఉంటుంది?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తోపుడు బండిపై ఆస్పత్రికి మృతదేహం..
నారాయణపేట జిల్లా: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడి మృతదేహాన్ని పోలీసులు తోపుడు బండిపై పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలంతా చూ స్తుండగానే పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఈ ఘటన జరిగింది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మొగులయ్య (28) భార్యాపిల్లలతో కలసి కోస్గి లోని అత్తగారింట్లో ఉంటూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఆదివారం అతను ద్విచక్రవాహనంపై బస్టాండ్ వైపు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్క డే మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని మొగులయ్య మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తోపుడు బండిలో తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించేందుకు వచి్చన ఓ చిరువ్యాపారికి చెందిన తోపుడు బండిని అతని అను మ తి లేకుండానే తీసుకొని పోలీసులు మృతదేహాన్ని తరలించిన తీరును చూ సి అక్కడ గుమిగూడిన జనం అవాక్కయ్యారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడి యో తీసి ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో ఇదీ పరిస్థితి.. అంటూ వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేయడంతో ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్థానిక ఎస్ఐ బాలరాజును వివరణ కోరగా తాను సెలవులో ఉన్నానని చెప్పారు. ఎస్హెచ్ఓగా ఉన్న ఏఎస్ఐ ఆంజనేయులును వివరణ కోరగా మృతుని కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో తోపుడు బండిపై మృతదేహం తరలించామన్నారు. సమయానికి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఇలా చేయాల్సి వచి్చందని చెప్పారు. -
21న ఓయూకు సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్లో నిర్మించిన కొత్త హాస్టల్ భవనాలు, ఇతర అభివృద్ధి పనుల ప్రారంబోత్సవానికి సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాశీం ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలసి 21వ తేదీన ప్రారంబోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహా్వనించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓయూలో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హాస్టళ్ల భవనాలను ప్రారంభించడంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నిర్మించనున్న మరో రెండు కొత్త హాస్టల్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రూ.10 కోట్ల నిధులతో డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూం పనులను సైతం సీఎం ప్రారంభించనున్నారు.అనంతరం ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక’అనే అంశంపై ముఖ్యమంత్రి.. ప్రొఫెసర్లు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా, గత ఇరవై ఏళ్ల కాలంలో ఓయూకు ముఖ్యమంత్రి వచ్చి ప్రసంగించడం ఇదే ప్రథమమని వీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘సీఎం రీసెర్చ్ ఫెలో షిప్’తో పాటు విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నామని వీసీ తెలిపారు. -
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం.. రాజగోపాల్రెడ్డిపై యాక్షన్!
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చే చాన్స్ ఉంది.అంతకుముందు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి.. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ..‘వరంగల్ పంచాయతీపై నలుగురిని అక్కడికి పంపాలని నిర్ణయం తీసుకున్నాం. వారు ఎవరెవరు అనేది పార్టీ సూచిస్తుంది. నేను మంటలు పెట్టడానికి లేను. చల్లార్చే పనిలో ఉన్నాను. నా పని ఫైరింజన్ చేసే పని. పీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ నాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్లపై చర్చ చేశారు.. పరిశీలిస్తాం’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరితే మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పారని, కానీ మాట తప్పారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మంత్రి పదవి లభించలేదనే కారణంతో అసహనానికి గురైన రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. -
కాళేశ్వరంపై మరో కుట్ర.. మోటర్లే టార్గెట్: హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం మోటర్లను నాశనం చేసే కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మోటర్లను నాశనం చేసి అది.. బీఆర్ఎస్పై నెపం వేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ మధ్య విభేదాలు ఉంటే మీరు మీరు చూసుకోండి.. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద పగ, ప్రతీకారం తీర్చుకుంది. నీళ్లను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకు 62వేల క్యూసెక్కుల వరద వస్తోంది. నేను వారం రోజుల క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్కు లేఖ రాశాను. సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్కు నీళ్ల విలువ తెలియదు. ప్రభుత్వం నడపడం చేతకావడం లేదు.. ఎందుకు ప్రాజెక్టుల నీళ్లను వృథా చేస్తున్నారు. ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా అన్నపూర్ణ, మిడ్ మానేరు, ప్రాజెక్టును నింపాలి. వేలాది మంది రైతులతో వెళ్లి మేమే మోటార్లు ఆన్ చేస్తాం. మీరు ఆన్ చేయకుంటే మేమే ఆన్ చేస్తాం.కాళేశ్వరంపై మరో కుట్ర చేస్తున్నారు.. మోటర్లను ఆన్ అండ్ ఆన్ చేయడం వలన మోటార్లు పనికి రాకుండా చేస్తున్నారు. కాళేశ్వరంపై బురద రాజకీయాలు మానుకోండి. ఆన్ చేసి ఆఫ్ చేయకూడడని బీహెచ్ఈఎల్ ఇప్పటికే హెచ్చరించింది. మోటర్లను నాశనం చేసి.. అది బీఆర్ఎస్పై వేయాలని కుట్ర చేస్తున్నారు. మీ మధ్య ఏమైనా విభేదాలు ఉంటే మీరే చూసుకోండి. దేవాదుల మోటార్లు ఆన్ చేయక వరంగల్కు నష్టం జరుగుతోంది. కమీషన్ పంచుకోవడానికి సమయం సరిపోవడం లేదు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
చంద్రబాబు స్క్రిప్ట్నే రేవంత్ వినిపించారు
సూర్యాపేట టౌన్: సీఎం రేవంత్రెడ్డి తీరు చంద్రబాబు ప్రసంగానికి కొనసాగింపేనని, గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే బనకచర్లకు మద్దతు ప్రకటించడమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలకు పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాల్సిందని, ఇది చెప్పలేదు అంటే బనకచర్లకు అనుమతిస్తున్నట్లే అని స్పష్టమవుతుందన్నారు. బనకచర్ల కట్టి తీరుతామన్న చంద్రబాబుకు అనుకూలంగానే.. కాళేశ్వరంలో మాకు నీళ్లు అవసరం లేదు అన్నట్లు ఉందని ఆరోపించారు.ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికేనని అన్నారు. రేవంత్ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ని ఇక్కడ వినిపించారని విమర్శించారు. బనకచర్లకు అనుమతులు రావాలంటే కాళేశ్వరంను రికార్డ్లో నుంచి మాయం చేయాలనే కుట్ర జరుగుతుందన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇక్కడ రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై ఉన్న నందిమేడారం, కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్లను ప్రారంభించారంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్లే కదా అని అన్నారు.కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి దేవాదుల నుంచి నీళ్లు ఇస్తామంటూ కొత్త పాట అందుకున్నారని, దేవాదుల నీళ్లు ఇస్తామన్న ప్రాంతానికే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిందంతా అబద్ధం అని రుజువైందని చెప్పారు. -
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలిని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ బృందాలను తరలించాలని ముందుగా ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, చెరువులు, రిజర్వాయర్లు, కుంటల దగ్గర ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజల వినతులపై తక్షణమే స్పందించాలన్నారు సీఎం రేవంత్. ఇదిలా ఉంచితే, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనిలో భాగంగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇక ఆదిలాబాద్, కొమురం భీం, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. -
అయ్యా రేవంత్ రెడ్డి పదవులూ మీకే.. పైసలూ మీకేనా?
సంస్థాన్ నారాయణపురం: ‘పదవుల్లో మీరే ఉంటరు.. పైసలు మీరే తీసుకుంటరు. నాకు పదవి ఇవ్వకపోయినా నా నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ‘పదవి వచ్చేటప్పుడు వస్తుంది. మనను ఎవరూ ఆపలేరు. పదవులు మీకే.. పైసల్ మీకే అని కొన్ని రోజుల కిందట అన్నాను. సీఎం రేవంత్రెడ్డిని అన్నానని తెలుసు కదా. మునుగోడు నియోజకవర్గంలో రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదు. మంత్రి దగ్గరకి వెళ్లి అడిగినా రాలే. పనిచేయమంటే కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించమంటున్నారు. బిల్లులు ఇవ్వడం సీఎం రేవంత్ చేతిలో ఉంది. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. నన్ను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి’ అని వ్యాఖ్యానించారు. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, తనకు పదవి వస్తే మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందని రాజగోపాల్రెడ్డి చెప్పారు. -
మీ పెట్టుబడికి మాదీ భరోసా
మాదాపూర్: రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత తన ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. స్వదేశీ పెట్టుబడిదారులను నిర్లక్ష్యం చేస్తున్నామని కొందరు తమపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ దేశాలు తిరిగి పెట్టుబడులు తెస్తున్న తాము.. మనదేశంలోని పెట్టుబడిదారులను ఎందుకు ప్రోత్సహించం అని ప్రశ్నించారు. మాదాపూర్లోని హైటెక్స్లో మూడు రోజులపాటు నిర్వహించనున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను ఆయన శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వచ్చి అభివృద్ధి దానంతట అదే వేగంగా జరుగుతుంది. గతంలో పాలించినవారు పాలసీ పెరాలసిస్ లేకుండా చూడడం వల్లనే నేడు మన హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడగలుగుతోంది. మీరు అపోహలకు లోబడితే అది అంతిమంగా రాష్ట్రానికి, దేశానికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. పోటీ పడండి, పాలసీలు అడగండి, అభివృద్ధి ఎలా చేయాలో సూచనలు ఇవ్వండి. మీ అనుభవాన్ని మాతో పంచుకోండి’అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఎయిర్పోర్టులు పెరిగితే మరింత అభివృద్ధి గత పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరుమీద 11.5 శాతం వడ్డీకి రూ.1 లక్ష కోట్ల అప్పు తెస్తే.. తాను 50 సార్లు ప్రధానమంత్రిని కలిసి రుణ పునర్వ్యవస్థీకరణ చేయించి, వడ్డీని 7.5 శాతానికి తగ్గించానని సీఎం తెలిపారు. ‘తెలంగాణలో ఒక్కటే ఎయిర్పోర్టు ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆరేడు ఉన్నాయి. మహారాష్ట్రలో 40 ఉన్నాయి. తెలంగాణకు అదనంగా వరంగల్లో ఒకటి, ఆదిలాబాద్లో మరొక ఎయిర్పోర్టుకు అనుమతులు తెచ్చాం. ఎయిర్పోర్టులు వస్తే రెండు, మూడోస్థాయి నగరాలు కూడా అభివృద్ధి చెందుతాయి.పారిశ్రామికాభివృద్ధి జరిగితే ప్రజల, ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీని మన రాష్ట్రానికి ఆహ్వనిస్తే పోర్ట్ ఎంతదూరం ఉందని అడుగుతున్నారు. ఔటర్ రింగురోడ్డు 160 కిలోమీటర్ల నిర్మాణం జరిగితే రాష్ట్ర ఆదాయం రూ.3 లక్షల కోట్లకు చేరింది. అందుకే 360 కిలోమీటర్ల రీజినల్ రింగు రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. రీజినల్ రింగురోడ్డుతోపాటు రీజినల్ రింగ్రైల్, ఫ్యూచర్సిటీ టు అమరావతి, బందర్ పోర్ట్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే, రైల్వే కనెక్టివిటీ ఏర్పా టు చేసి ఇరువైపులా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టాం’అని వివరించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్.జయదీప్రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్రెడ్డి, కనీ్వనర్ కుర్ర శ్రీనాథ్, కో కన్వీనర్ అరవింద్రావు, జాతీయ అధ్యక్షుడు రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.నేను మిడిల్ క్లాస్ సీఎంను తమ ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తోందని సీఎం తెలిపారు. ‘నేను సగటు మధ్యతరగతి అలోచన ఉన్న ముఖ్యమంత్రిని. సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న అలోచన నాకు లేదు’అని స్పష్టంచేశారు. ప్రయాణికులు అధికంగా ఉండే మార్గాల్లోనే మెట్రో రైల్ విస్తరణ ఉంటుందని తేల్చి చెప్పారు.‘హైటెక్ సిటీ పక్కన చెరువులు, అడవులే అధికం. ఇక్కడ మెట్రో రైల్ ఎవరు ఎక్కుతారు? అందుకే నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొత్త హైకోర్టు, శంషాబాద్ నుంచి ఎయిర్పోర్టు వరకు మెట్రో రీడిజైన్ చేశాం. ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు, కూకట్పల్లి, బీహెచ్ఈఎల్, పటాన్చెరు దాటి మెట్రోను పొడిగించాలి. మెట్రోకి, మూసీ ప్రక్షాళనకు, ఎలివేటెడ్ కారిడార్స్కు అనుమతులతోపాటు నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం నుంచి మేం తెచ్చిన అనుమతుల జాబితాను అసెంబ్లీలో పెడతాం’అని సీఎం తెలిపారు. -
కృష్ణా, గోదావరి జలాలపై తగ్గేదే లేదు
సాక్షి, హైదరాబాద్: ‘కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదు. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే.. జలాల్లో శాశ్వత హక్కులు సాధించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా చిత్తు చేస్తాం. ప్రజల దృష్టి మరల్చేందుకు సెంటిమెంట్ను రగిలించాలని కొందరు చేస్తున్న కుట్రలను తిప్పికొడతాం. అందుకోసం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలి’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గోల్కొండ కోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి దాదాపు గంటపాటు ప్రసంగించారు. గత పాలకులు రూ.లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు కూలిపోయి ఆ నిధులు గోదాట్లో కలిసిపోయినా, ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాకున్నా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపామని సీఎం తెలిపారు. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన.. రాష్ట్రంలో 20 నెలల కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణను దేశానికే రోల్మోడల్గా నిలిపామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘నేను సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. మా ఆలోచనలో స్పష్టత, పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకొని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని ఎంచుకుని 20 నెలల్లోనే దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టాం. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన. రూ.13 వేల కోట్ల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం.ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు.. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పథకం. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర రాశాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద 70,11,184 మంది రైతులకు సాయం అందించాం. 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి చివరి గింజ వరకు కొన్నాం. సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రైతు సంక్షేమానికి రూ.1.13 లక్షల కోట్లు ఖర్చు చేశాం. రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాం. సమగ్ర కులగణన ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు రంగం సిద్ధం చేశాం. ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. 27 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,700 కోట్లతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. దీని ద్వారా వారికి ఇప్పటివరకు రూ.6,790 కోట్లు ఆదా అయ్యాయి. 20 నెలల్లోనే దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం’అని సీఎం వివరించారు.రాష్ట్రంలో డ్రగ్స్కు తావులేదు గడచిన పదేళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగిందని సీఎం ఆరోపించారు. ఆ కుట్రను తాము ఛేదించామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామని, ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం మూల మూలలా నిషితంగా నిఘా పెట్టిందని తెలిపారు. గేమ్ ఛేంజర్గా తెలంగాణ.. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందని సీఎం తెలిపారు. ‘2047 నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకుంటుంది. అప్పటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణను నిలిపేలా కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ లక్ష్యం దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్¯ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్లో విస్పష్టంగా ఉండబోతోంది. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ను సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఇది ఆవిష్కరిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణమయ్యే ఫ్యూచర్ సిటీ ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుంది. రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ పురోగతికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో చెప్పబోతున్నాం. డిసెంబర్ నాటికి దాన్ని ఆవిష్కరిస్తాం’అని సీఎం తెలిపారు. హైడ్రా అద్భుతంగా పని చేస్తోంది హైదరాబాద్ నగరంలో హైడ్రా అద్భుతంగా పనిచేసి కబ్జాకు గురైన చెరువులను పునరుద్ధరిస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైడ్రాను ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ అప్పులు, బకాయిలను తీర్చేందుకు తన ప్రభుత్వం రూ.2.20 లక్షల కోట్లు చెల్లించిందని, ఆ అప్పులే లేకుంటే ఈ మొత్తం ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసేవాళ్లమని అన్నారు. దక్షిణ కొరియాను ఆదర్శంగా తీసుకుని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్లో పెట్టుబడుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అమరావతితో ప్రత్యేక గ్రీన్ఫీల్డ్ రోడ్డు, రైలు కారిడార్తోపాటు అక్కడి పోర్టులతో అనుసంధానం, ఇక్కడ డ్రైపోర్టుల నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్లు వివరించారు. ఘనంగా వేడుకలు... గోల్కొండ కోటలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. సీఎం ఉదయం 10 గంటలకు కోట వద్దకు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ప్రసంగం అనంతరం పోలీసు సేవా పతకాలను ప్రదానం చేశారు. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు రూ.కోటి నజరానా అందించారు. ఈ సందర్భంగా కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కాగా, కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు రావటంతో గోల్కొండ కోట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
రాజ్భవన్లో గవర్నర్తో సీఎం రేవంత్ ప్రత్యేక సమావేశం!
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఎట్హోమ్ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు హాజరయ్యారు. దీనిలో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్వర్మతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు తాజా రాజకీయ అంశాలతో పాటు, అసెంబ్లీ సమావేశాలు, బీసీ బిల్లుల అంశాలను సీఎం రేవంత్ చర్చించారు. బీసీ బిల్లు విషయాన్ని గవర్నర్ దగ్గర్ ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు, పంచాయతీ ఎన్నికల విషయాలను గవర్నర్కు తెలిపినట్లు తెలుస్తోంది. -
Revanth Reddy: మేం అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం
-
‘హైడ్రా’ అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోంది: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా.. హైదరాబాద్ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ అని ప్రశంసించారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.గోల్కొండ కోటలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గోల్కోండ కోటలో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..‘హైదరాబాద్ను స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ. బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి నగరాలు వరదలతో చిన్నాభిన్నం అవుతున్నాయి. అలాంటి దుస్థితి హైదరాబాద్కు రాకూడదు అంటే చెరువుల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలను నిరోధించాలి. ఆ ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకువచ్చాం.ఇటీవలే ప్రత్యేక పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది. అంబర్పేట్ బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్ధంగా పని చేస్తోంది. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోంది. హైడ్రా.. హైదరాబాద్ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ. ఆ వ్యవస్థను కాపాడుకుందామని నేను మీ అందరికి పిలుపునిస్తున్నా. అలాగే, శాంతి భద్రతలు ఒక రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తాయి అని అన్నారు.ఇదే సమయంలో మాకు విల్ ఉంది.. విజన్ ఉంది.. తెలంగాణ రైజింగ్-2047 మా విజన్. ఆ విజన్ నిజం చేసే మిషన్ ఈ ప్రభుత్వం తీసుకుంది. ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్గా నిలబెట్టడమే మా విజన్. ఇందుకు ప్రజలందరి సహకారం, ఆశీర్వాదం అవసరం అని వ్యాఖ్యలు చేశారు. -
గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన రేవంత్ రెడ్డి
-
20 నెలల్లో ఇది మేం తెచ్చిన మార్పు: పంద్రాగస్టు ప్రసంగంలో సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. గోల్కొండకోటలో జరిగిన వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కోటపై జెండా ఎగరేసి.. పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ క్రమంలో 20 నెలల ప్రజాపాలనలో సాధించిన పురోగతిని ఆయన రాష్ట్ర ప్రజలకు వివరించారు. భారత ప్రజలకు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలు త్యాగం చేసిన మహనీయులకుశిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయటి శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచాం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం.ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్ల మంది భారతీయులను ఐక్యం చేసి, లక్ష్యం వైపు నడిచేలా చేసింది. కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు... ఆ దిశగా కార్యచరణ తీసుకుని దేశ పురోగతికి బలమైన పునాదులు వేశారు. దృఢమైన ప్రజాస్వామ్య, లౌకిక, సామ్యవాద, గణతంత్ర దేశంగా భారత్ ను నిలబెట్టడంలో గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, వైజ్ఞానిక, సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఆ నాటి స్ఫూర్తిని, ఆ మహనీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ..👉తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యాలతో మేం పరిపాలన సాగిస్తున్నాం. స్వాతంత్ర్యం సిద్ధించే సమయానికి దేశం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉంది. శూన్యం నుండి మన ప్రయాణం మొదలైంది. శిఖరాలే లక్ష్యంగా సంకల్పం తీసుకుని మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఈ రోజు మనం చూస్తున్న ఆధునిక భారతం ఐదేళ్లలోనో.. పదేళ్లలోనో సాధించిన విజయం కాదు. దీని వెనుక 79 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఎందరో గొప్ప నాయకుల త్యాగం, చెమట, రక్తం ఉంది.ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం. వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడం మన ముందున్న కర్తవ్యం. ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను. ఆ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పని చేస్తోంది.👉2023 డిసెంబర్ 7న మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం.👉కుల గణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించాం. ఇవి గొప్ప నిర్ణయాలు మాత్రమే కాదు.. అత్యంత సాహసోపేత నిర్ణయాలు కూడా. ఒక వైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. మరో వైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం. ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోంది.👉మా ఆలోచనలో స్పష్టత ఉంది.. అమలులో పారదర్శకత ఉంది. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని మేం ఎంచుకున్నాం. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టాం. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన.. దీనికి చరిత్రే సాక్ష్యం.👉70 ఏళ్లుగా PDS వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఈ రోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు.. ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పథకం. ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించా. ఆ రోజు వారి కళ్లలో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుంటుంది.👉రేషన్ కార్డు.. ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక. ఒక భరోసా.. భావోద్వేగం. ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు పదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు పరిష్కారం లభించింది. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో.. రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. పాడుబడి, మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. పేదవాడి ఆశలు, ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపు పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఇది మేం తెచ్చిన మార్పు.👉తెలంగాణ రైతుకు 2022, మే 6న వరంగల్ వేదికగారూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మేం మాట ఇచ్చాం. గత ఏడాది ఇదే ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర రాశాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా... రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించాం. కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. రాష్ట్రంలోని 70 లక్షల, 11 వేల, 184 మంది రైతులకు ఈ సాయం అందించాం. 👉కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం. పండించిన పంటను కొనుగోలు చేస్తూ మేం ఉన్నామన్న భరోసా ఇస్తున్నాం. 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నాం. ఇది రైతుల పట్ల, వ్యవసాయం పట్ల మాకున్న చిత్తశుద్ధి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాశాం. అన్నదాతల సంక్షేమానికి 1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం. 👉తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏ ప్రాంతాల్లో 22,016 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. 👉సామాజిక న్యాయం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. స్థానిక సంస్థలలో...విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించుకున్నాం. 50 రోజుల పాటు సమగ్ర కులగణనను యజ్ఞంలా చేపట్టాం. దీని ఆధారంగా వారికి 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం. మనం పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేస్తున్నాం. 👉దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించాం. గ్రూప్- 1 లో 15, గ్రూప్ -2 లో 18, గ్రూప్ -3 లో 26 కులాలను చేర్చాం. ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’ గా జరుపుకోవాలని నిర్ణయించాం.👉మసకబారిన ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచాం. 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం..👉మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి అనే నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మేం పని చేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా అయ్యింది. ఇటీవలే 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటడం మా విజయాలలో మరో మైలురాయి. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం మా ప్రభుత్వం మొత్తంగా 46,689 కోట్లు సమకూర్చింది.👉యువత తెలంగాణ శక్తికి ప్రతీక. గడచిన పదేళ్లలో యువతను మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగింది. ఆ కుట్రను మేం చేధించాం. ఇవ్వాళ తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం మూల మూలలా నిశితంగా నిఘా పెట్టింది. డ్రగ్స్ మాయగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.👉మాపై చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలే తిప్పికొట్టాలి. ఏవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా లక్ష్యాన్ని నెరవేర్చుతాం. సెంటిమెంట్ తో రాజకీయ లాభం పోందేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి నదీ జలాలలో రాష్ట్ర వాటా సాధిస్తాం. కృష్ణా పెండింగ్ ప్రాజెక్టులు సాధ్యమయినంత త్వరగా పూర్తి చేస్తాం. తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోం.గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే.. శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుంది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా.. ఆ ఎత్తులను చిత్తు చేస్తాం. దృష్టి మరల్చేందుకు సెంటిమెంట్ రగిలించాలన్న కొందరి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కుట్రలను ఛేదించి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తాం.మన బలం హైదరాబాద్. ప్రపంచ వేదికపై మన బ్రాండ్ హైదరాబాద్. ఈ బలాన్ని మరింత బ్రాండింగ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించాం. అందుకే పలు అంతర్జాతీయ ఈవెంట్లను హైదరాబాద్ లో నిర్వహించేలా నిర్ణయాలు తీసుకున్నాం. ఇటీవల 72వ ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ వేదిక అయ్యింది. దీంతో మన చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను ప్రపంచ దేశాలకు చూపించే అవకాశం కలిగింది👉దేశంలోనే మొదటి సారి...గత ఏడాది హైదరాబాద్ లో వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) సదస్సు నిర్వహించాం. భారత్ ఫ్యూచర్ సిటీలో AI సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నాం. గ్లోబల్ రైస్ సమ్మిట్ ను కూడా మనం హైదరాబాద్ లో నిర్వహించుకున్నాం. మన ప్రభుత్వం నిర్వహించిన బయోఏషియా సదస్సుకు 50 దేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అంతర్జాతీయ రాజకీయ సదస్సు భారత్ సమ్మిట్– 2025 ను మనం హైదరాబాద్ లో నిర్వహించాం. ఈ అన్నీ వేదికల నుండి మనం తెలంగాణ విజన్ ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాం. అదే “తెలంగాణ రైజింగ్ – 2047”.👉వచ్చే డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నాం. 2047 నాటికి స్వతంత్ర భారతం శత వసంతాలు పూర్తి చేసుకుంటుంది. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మా సంకల్పం. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’.👉2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు… ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.👉మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్ లో విస్పష్టంగా ఉండబోతోంది. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ను... స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్ ఆవిష్కరిస్తుంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదారాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ ఇస్తుంది.👉అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ... ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో తెలంగాణ రైజింగ్ – 2047 లో విస్పష్టంగా చెప్పబోతున్నాం. 2047 నాటికి దేశ ప్రగతిలో తెలంగాణది కీలక పాత్రగా చేయడమే మా సంకల్పం అని సీఎం రేవంత్ అన్నారు. -
‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇలా పతనం కావడం ఇదే తొలిసారి’
హైదరాబాద్: రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ధ్వజమెత్తారు. వరుసగా నెలలు తెలంగాణ మైనస్ ద్రవ్యోల్పణమే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యిందనడానికి నిదర్శమన్నారు. ఈ మేరకు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. వరుస రెండు నెలల పాటు తెలంగాణ మైనస్ ద్రవ్యోల్పణంలోకి వెళ్లిపోవడం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి అని మండిపడ్డారు. దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేసిందని, అదే సమయంలో ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమైందన్నారు. ఒక శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థను అవగాహన లేని పాలనతో నాశనం చేయడం చూస్తే బాధగా ఉందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన నిరాశజనకంగా కనిపిస్తోందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తోందన్నారు.For the first time since its formation, Telangana has slipped into deflation for 2 straight months - June & JulyWhat’s worth highlighting is that Telangana is the ONLY state in India in this situationDeflation is not a sign of prosperity. It means people are limiting… pic.twitter.com/AAk5ZGCNTl— KTR (@KTRBRS) August 14, 2025 -
TDF: అమెరికాలో ఘనంగా టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
మిల్పిటాస్ (కాలిఫోర్నియా): తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) USA రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ ఇండియా కమ్యూనిటీ సెంటర్లో ‘ ప్రగతి తెలంగాణం’ పేరిట ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఇండియా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు పంపగా, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, సాన్ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్ జనరల్ డా. కే. శ్రీకర్ రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డా. ఎం.వి. రెడ్డి, ‘ఆటా’ అధ్యక్షుడు జయంత్ చల్లా తదితరులు హాజరయ్యారు.కలర్ఫుల్గా మూడు రోజుల వేడుకలుటీడీఎఫ్ అమెరికా చైర్మన్ మురళి చింతలపాణి, అధ్యక్షుడు మణికొండ శ్రీనివాస్, కన్వీనర్ మహేందర్ రెడ్డి గూడూరు, కో-కన్వీనర్ సుజేందర్ ప్రొదుటూరి సమన్వయంతో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ బిజినెస్ ఫోరం, పొలిటికల్ ఫోరం, స్టార్టప్ ఫోరం, విజన్ తెలంగాణ-2050 వంటి అంశాలపై చర్చలు జరిగాయి. 2050 నాటికి తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దే వ్యూహాలపై ప్యానెలిస్టులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.పురస్కారాల ప్రదానంఈ సందర్భంగా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు డా. దివేష్ అనిరెడ్డి, డా. గోపాల్ రెడ్డి గాదేలకు, టీడీఎఫ్ లైఫ్టైమ్ ఫిలాంత్రఫీ అవార్డు టీ. రామచంద్రరెడ్డికి ప్రదానం చేశారు. సోషల్ ఇంపాక్ట్ పార్ట్నర్ అవార్డులు గ్లోబల్ ప్రగతి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అలోక్ అగర్వాల్, డాక్టర్ సంగీతకు అందజేశారు. టీడీఎఫ్ పూర్వ అధ్యక్షురాలు చల్లా కవితను ఘనంగా సత్కరించారు. వారి సేవలను ప్రతిబింబించే ప్రత్యేక వీడియోలు ప్రదర్శించారు.సాంస్కృతిక వైభవంతెలంగాణ ఫోక్ నైట్, ఆటా పాటలు, బోనాల వేడుకలు ఆహూతులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించిన ఈ కార్యక్రమాల్లో యాంకర్ వాణి గడ్డం తెలంగాణ యాసతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీరామ్ వెదిరె, బిక్ష గుజ్జ నీటి నిర్వహణపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. టీడీఎఫ్ సీనియర్ నాయకులు మధు కె. రెడ్డి, సుధీర్ కోదాటి, ఎలక్ట్ ప్రెసిడెంట్ భరత్ నేరవెట్ల, ఉపాధ్యక్షురాలు ప్రీతి జొన్నలగడ్డ, స్వాతి సుదిని, ఉపాధ్యక్షులు శ్రావణ్ పోరెడ్డి, శ్రీని గెల్లిపెల్లి, సెక్రటరీ రాజ్ గడ్డం, జాయింట్ సెక్రటరీ మనోహర్, ట్రెజరర్ శ్రీకళ, ట్రస్టీలు గోపాల్ రెడ్డి గాదే, ఇందిరా, కళ్యాణ్ రెడ్డి, కాసప్ప, రవిరెడ్డి, సదానంద్, విజేందర్, వినయ తదితరుల సమిష్టి కృషితో ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. 70 మంది బేఏరియా TDF వాలంటీర్లు వేడుకలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. తెలంగాణ నుంచి, అమెరికా నలుమూలల నుంచి ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూములకు భూధార్ నంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ, మ్యుటేషన్కు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. లైసెన్స్డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్రూ్కటినీ చేసేలా చూడాలని ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో నూతనంగా నిర్మించనున్న 10 ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలని, కార్యాలయాలు ప్రజలకు స్నేహపూర్వక వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సూచించారు. హైదరాబాద్లో హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్గా ఉన్న ప్రాజెక్టుల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. సమీక్షలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, కేఎస్ శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సీసీఎల్ఏ, రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ పాల్గొన్నారు. -
చీకట్లో బాబు, రేవంత్ రాహుల్ తో హాట్ లైన్..! బండారం బయటపెట్టిన జగన్
-
కంచ గచ్చిబౌలి కేసు: తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీం’ ఆదేశాలు
న్యూఢ్లిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కంచ గచ్చిబౌలి కేసు విచారణలో సుప్రీంకోర్టు సూచించింది. కంచ గచ్చిబౌలి భూముల్లో రేవంత్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రతిపాదనలు తీసుకురావాలన్నారు. ఈ సమస్యకు సంతోషకరమైన ముగింపు పలకాలన్నారు. అలాగే అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని జస్టిస్ బీఆర్ గవాయి పేర్కొన్నారు.పర్యావరణాన్ని కాపాడితే అన్ని ఫిర్యాదులు ఉపసంహరిస్తామని, అప్పుడు తాము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతామని జస్టిస్ అన్నారు. పర్యావరణాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సుప్రీం సూచనల దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రతిపాదనలు తీసుకొచ్చేందుకు ఆరు వారాల సమయం కావాలని సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ కోరారు.హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ పార్క్ అభివృద్ధి కోసం చెట్లను నరికివేయడం, వన్యప్రాణులను మరో ప్రాంతానికి తరలించడం లాంటి చర్యలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇప్పటికే రెండుసార్లు జరిగిన వాదనల్లో చెట్లను నరికిన వంద ఎకరాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రణాళికను కోర్టుకు సమర్పించాలని కోరింది. -
72 గంటలు హై అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు రోజుల పాటు అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బంది సెలవులను రద్దు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆన్డ్యూటీలో ఉండాలన్నారు. హైదరాబాద్తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వరద ముంపు పరిస్థితుల్లో ట్రాఫిక్ సమస్యను నివారించడానికి శాంతిభద్రతల విభాగం పోలీసుల సేవలను కూడా వినియోగించుకోవాలని చెప్పారు. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ం నిర్వహించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాజ్వేలు, వంతెనలపై రాకపోకలు ఆపండి ‘లోతట్టు కాజ్వేలు, ఉధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల వంతెనలపై నుంచి రాకపోకలు లేకుండా చూడాలి. పశువులు, గొర్రెలు, మేకల కాపర్లు తరచూ వాగుల్లో చిక్కుకుపోతున్నారు. వారిని అప్రమత్తం చేయాలి. ఎక్కడైనా ప్రమాదవశాత్తు చిక్కుకుంటే వారిని తక్షణమే బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలి. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. డ్రైనేజ్ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. గతంలో ఖమ్మంలో 2 గంటల్లో 42 సెం.మీ వర్షం పడింది. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మన దగ్గర 24 గంటల్లో 2 సెం.మీ వర్షాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణాలు నిర్మాణం అయ్యాయి. కాబట్టి ఒకటీ రెండు గంటల్లోనే 20, 30 సెంటీమీటర్ల వర్షం (క్లౌడ్ బరస్ట్) పడితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలి. అత్యధిక స్థాయిలో వర్షాలు పడే జిల్లాలు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలి. ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలి. సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. నీటి విడుదలపై అలర్ట్ చేయాలి.. ‘అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్లు ఉండేలా చూసుకోవాలి. పీహెచ్సీలు, సీహెచ్సీల్లో అవసరమైన మందులు ఉంచాలి. గర్భిణులను తక్షణమే తరలించేలా అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి ఇన్ఫ్లో, ఔట్ ఫ్లోపై నీటిపారుదల శాఖ పూర్తి అవగాహనతో ఉండాలి. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై పూర్తి సమాచారం లోతట్టు ప్రాంతాల ప్రజలకు తెలియజేయాలి. చెరువులు, కుంటలు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..’ అని రేవంత్ ఆదేశించారు. జిల్లాలు కమాండ్ కంట్రోల్తో టచ్లో ఉండాలి.. ‘భారీ వర్షాల సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అన్ని జిల్లాలను కమాండ్ కంట్రోల్తో అనుసంధానం చేయాలి. వారికి ఎప్పటికప్పుడు అలర్ట్ సమాచారం ఇవ్వాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్తో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అందరూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి. మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దు. సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి..’ అని సీఎం సూచించారు. అన్ని విభాగాలూ సమన్వయంతో పని చేయాలి ‘హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటలూ అందుబాటులో ఉండాలి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సమన్వయంతో పని చేయాలి. జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సిబ్బంది.. ప్రతి విభాగం సమన్వయంతో పని చేయాలి. అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలి. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
స్కూళ్లు,కాలేజీలకు సెలవులు .. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?
సాక్షి,హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాకాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16వరకు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితిని బట్టి విద్యా సంస్థలకు సెలవులు.. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు.కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న మూడు రోజులల్లో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులకు,ఉన్నతాధికారులకు ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు.అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలి.ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. విద్యుత్కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ఫర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.హైదరాబాద్లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటలు అందుబాటులో ఉండాలి.అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. రాబోయే 72 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలి.లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూంకు చేరేలా చూడాలి. ఉద్యోగులు,సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్లో ప్రమాద స్థాయికి నీరు చేరిన చోట ప్రజలు వెళ్లకుండా పోలీసు సిబ్బంది అలెర్ట్ చేయాలి.వర్షాల నేపథ్యంలో మూడు కమిషనరేట్లలో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలి. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి. క్లౌడ్ బరస్ట్ సమయాల్లో పరిస్థితులను ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలి. పరిస్థితులను బట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలి. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి.అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దు సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలి’ అని సూచించారు. -
సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో 2019లో నమోదైన కేసులో సీఎం రేవంత్రెడ్డికి ఊరట లభించింది. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ హైకోర్టు తుదిఉత్తర్వులు జారీ చేసింది. హుజూర్నగర్ ఉప ఎన్నిక సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు గరిడేపల్లి పీఎస్లో అప్పటి ఎంపీ రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిపై 2019, జనవరి 19న ఎఫ్ఐఆర్ నమోదైంది.ఎలాంటి అనుమతి లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పొనుగోడులో సమావేశం నిర్వహించారన్నది ఫిర్యాదు. ఆధారాలు లేకుండా తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి.. ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. ట్రయల్కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు.. వరంగల్ జిల్లా కమలాపూర్ పీఎస్లో నమోదైన కేసులో ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి రేవంత్రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను, ఫిర్యాదుదారును ఆదేశించింది. తదుపరి విచారణ సెపె్టంబర్ 9కి వాయిదా వేసింది. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 2,500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారన్న ఫిర్యాదు మేరకు రేవంత్పై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. -
ఈ వారంలోనే కార్పొరేషన్ డైరెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయి నాయకత్వానికి ఈ వారంలోనే పదవుల పంపకానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, బోర్డులకు డైరెక్టర్లు, సభ్యుల నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ నిర్ణయించారు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ నేతల ఎదురుచూపులకు మోక్షం కలగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో నెలకొన్న పరిణామాలపై చర్చించేందుకు మహేశ్కుమార్గౌడ్ సోమవారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్రెడ్డితో సమావేశమయ్యారు. గంటన్నరకుపైగా సాగిన ఈ భేటీలో నామినేటెడ్ పదవులు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, జనహిత పాదయాత్ర, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పారీ్టపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చలో భాగంగా ఆ నియోజకవర్గంలోని ప్రజలకు పార్టీని మరింత దగ్గర చేసే కార్యాచరణ రూపొందించాలని.. మంత్రులతోపాటు పార్టీ నాయకత్వానికి కూడా మరిన్ని బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే జూబ్లీహిల్స్ ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మరింత విస్తృతంగా సర్వే నిర్వహించాలని కూడా ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. మరోవైపు జనహిత పాదయాత్ర జరిగిన తీరు గురించి రేవంత్రెడ్డికి మహేశ్గౌడ్ వివరించారు. ఈ యాత్రలో ప్రభుత్వ పనితీరు గురించి సేకరించిన ప్రజాభిప్రాయాలను సీఎంకు తెలియజేశారు. ఈ నెల 23 తర్వాత రెండో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నానని.. వీలు చూసుకొని పాల్గొనాలని మహేశ్గౌడ్ విజ్ఞప్తి చేయగా రేవంత్ సానుకూలత వ్యక్తం చేశారని తెలిసింది. తనతోపాటు మంత్రివర్గం కూడా పాదయాత్రకు వస్తుందని ఆయన చెప్పినట్టు సమాచారం. -
వరదను కట్టడి చేద్దాం.. 'ట్రంక్ లైన్' గీద్దాం
సాక్షి, హైదరాబాద్/అమీర్పేట: భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్లోని అమీర్పేట, ఎస్సార్నగర్ల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలను వరద, ముంపు ముప్పు నుంచి తప్పించడానికి ప్రత్యేకంగా ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. బౌద్ధనగర్, గంగుబాయి బస్తీ, రిలయన్స్ లైన్లలో ఉన్న డ్రైనేజీ నాలాలను పరిశీలించారు. మైత్రి వనం వద్ద నీరు నిలిచిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్ నగర్ నుంచి బౌద్ధనగర్ వరకు ఉన్న మురుగునీటి కాలువను చూసిన ఆయన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ ఎక్కువ ఎత్తులో ఉండటంపై ఆరా తీశారు. ఈ కారణంగానే రోడ్డు ఇరుకుగా మారడంతో పాటు వరద బౌద్ధనగర్ను ముంచుతోందని గుర్తించారు. తక్షణమే డ్రైనేజీ వ్యవస్థ మార్పు చేర్పులపై జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. కాగా గంగూబాయి కుంట ప్రాంతంలో 25 ఏళ్ల క్రితం చెరువు ఉండేదని, అక్కడ బతుకమ్మ ఆడేవారమని స్థానికులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ కుంటను కొంతమంది పూడ్చేసి ప్రైమ్ ఆసుపత్రికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఆ కుంట పూర్వాపరాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సూచించారు. బాలుడి భుజంపై చేయి వేసి నడుస్తూ.. బౌద్ధనగర్లో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డికి ఏడో తరగతి బాలుడు జశ్వంత్ వరద సమస్యను వివరించాడు. బస్తీలో మహిళలతో కలిసి నిలబడి ఉన్న జశ్వంత్ను పిలిచిన రేవంత్రెడ్డి వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఆ బాలుడి భుజంపై చేయి వేసి కాలనీలో నడుచుకుంటూ వివరాలను తెలుసుకున్నారు. తాను ఏడో తరగతి చదువుతున్నానని, వర్షాకాలంలో చదువులకు దూరం అవుతున్నానని బాలుడు సీఎంకు తెలిపాడు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని చెప్పాడు. దీంతో భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు వరద నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అమీర్పేట కార్పొరేటర్ కేతినేని సరళ.. సీఎంను కోరారు. స్థానిక డ్రైనేజీ వ్యవస్థ వివరాలను ఆమె వెల్లడించారు. ఎర్రగడ్డ, యూసుఫ్గూడ ప్రాంతం నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తోందని, లెవలింగ్ సరిగా లేకపోవడంతో వరద నీరు నాలాల్లోకి వెళ్లక కొన్ని బస్తీలు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ, జల మండలి అధికారులు సీఎం వెంట ఉన్నారు. ట్రంక్ లైన్ అంటే ఏమిటి? హైదరాబాద్ మహానగర మురుగునీటి వ్యవస్థలో సుమారు 612 కిలోమీటర్ల మేర ప్రధాన సీవరేజీ ట్రంక్ లైన్ ఉండగా వాటికి అనుబంధంగా సుమారు 9,769 కిలోమీటర్ల వరకు మురుగు నీటి పైప్లైన్ విస్తరించి ఉంది. ఈ మొత్తం వ్యవస్థలో ట్రంక్ లైన్ కీలకం. చిన్న చిన్న పైపుల ద్వారా వచ్చే మురుగునీటిని భారీ పైపుల్లోకి మళ్ళించి వ్యర్థ జలాల శుద్ధి కేంద్రానికి లేదా మురుగు నీటిని వదిలే ప్రదేశానికి పంపించడాన్ని ట్రంక్ లైన్ వ్యవస్ధగా పిలుస్తున్నారు. ట్రంక్ లైన్లు సాధారణంగా పెద్ద వ్యాసం (600 డయా (2.5 మీటర్లు)తో కూడిన పైపులను కలిగి ఉంటాయి. పెద్ద మొత్తంలో మురుగునీటిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మంచిగా చదువుకో అన్నారు..! జస్వంత్తో కలిసి కాలనీలో తిరుగుతున్న సీఎం రేవంత్ మా కాలనీలో నన్ను చూసిన ముఖ్యమంత్రి..‘బాబు ఇక్కడ రా’ అని పిలిచారు. ‘నిన్న మీ ఇంటి దగ్గరకు వాటర్ వచ్చాయి కదా? ఎంత వచ్చాయి?’ అని అడిగారు. నేను మునిగిపోయేంత వచ్చాయని చెప్పా. మీకు ఇంటికి ఏమైనా మరమ్మతులు కావాలా? అని అడిగితే..అవును సార్..గేట్లు పెట్టియ్యాలె సార్ అని అన్నా. పెట్టిస్తానన్న సీఎం..పుస్తకాలు తడిచాయా? అంటూ ఆరా తీశారు. ‘మంచిగా చదువుకో.. మళ్లీ వాటర్ వస్తే నాకు ఫిర్యాదు చెయ్యి కవర్ చేసేస్తా..’ అని హామీ ఇచ్చారు. – జశ్వంత్, ఏడో తరగతి విద్యార్థి, బౌద్ధనగర్ -
Hyd: ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన
హైదరాబాద్: వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహా నగరం అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి పలు ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) బల్కంపేట ప్రాంతంలోని బుద్ధనగర్, గంగూబాయి బస్తీ, మైత్రీవనం ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఆకస్మికంగా పర్యటించి అక్కడ వరద పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు తన ఆకస్మిక పర్యటన అనంతరం సీఎం రేవంత్ ఎక్స్లో పోస్ట్ చేశారు. బల్కంపేట ప్రాంతంలోని…బుద్ధనగర్, గంగుబాయి బస్తీ, మైత్రీవనం ప్రాంతాల్లో …ఆకస్మికంగా పర్యటించాను.భారీ వర్షాల సమయంలో… కాలనీల్లోని ప్రాంతాల్లో… సాధ్యమైనంత త్వరగానీటి ప్రవాహం జరిగి, ముంపు తలెత్తకుండా… తీసుకుంటున్న చర్యలను …డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించాను. భారీ వర్షాల… pic.twitter.com/aiHR8JcCh3— Revanth Reddy (@revanth_anumula) August 10, 2025 -
14 లేదా 16న కొడంగల్కు సీఎం
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 14 లేదా 16వ తేదీన కొడంగల్లో పర్యటించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రాష్ట్ర, జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు స్థానిక అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం.నియోజకవర్గంలో గడిచిన ఏడాదిన్నర కాలంలో సుమారు రూ.10 వేల కోట్లతో పలు రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, వృత్తి విద్యా కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ పరిశోధనా కేంద్రం, మహిళా డిగ్రీ కళాశాల, పీజీ కళాశాల, జూనియర్ కళాశాలలు, 220 పడకల ప్రభుత్వ టీచింగ్ ఆస్పత్రి, కొడంగల్ – నారాయణపేట ఎత్తిపోతల పథకం, కొడంగల్లో రూ.6 కోట్లతో ఆర్అండ్బీ అతిథి గృహం, రూ.344 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు, రూ.30 కోట్లతో పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, సమీకృత గురుకుల విద్యా సంస్థలు, కొడంగల్లో మున్సిపల్ కార్యాలయం, రూ.300 కోట్లతో ఇతర అభివృద్ధి పనులు.. తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష చేయనున్నట్లు తెలిసింది. -
హిమాయత్సాగర్ వద్ద గేట్వే ఆఫ్ హైదరాబాద్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును బహుళ ప్రయోజనాలు ఉండేలా రూపకల్పన చేయా లని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్కు ముఖద్వారంగా ఉన్న హిమాయత్సాగర్ గాంధీ సరోవర్ వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై గేట్ వే ఆఫ్ హైదరాబాద్ పేరిట ఐకానిక్ టవర్ను నిర్మించాలని సూచించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై సీఎం శనివారం పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా గేట్ వే ఆఫ్ హైదరాబాద్ ఉండాలని తెలిపారు. ఓఆర్ఆర్కు ఒక వైపున ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి చేసి, మరోవైపు బాపూఘాట్ దిక్కున భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని ఆదేశించారు. అందుకు తగిన డిజైన్లు రూపొందించాలని సూచించారు. బాపూఘాట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని చెప్పారు. హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలని.. గాంధీ సరోవర్ చుట్టూ ఈ ప్లైఓవర్ కనెక్టివ్ కారిడార్లా ఉండాలని తెలిపారు. గాంధీ సరోవర్ వద్ద నిర్మించే ఐకానిక్ టవర్ ప్రపంచంలోనే ఎత్తయిన టవర్గా ఉండాలని సీఎం సూచించారు. ఐకానిక్ టవర్ తదితర వాటికి డిజైన్లు రూపకల్పన చేసి, రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అధ్యయనం చేయండి తాగు నీటితోపాటు వరద నీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఉండాలని సీఎం అన్నారు. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రాజెక్టుల నమూనాలు పరిశీలించాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ తాగు నీటిని హైదరాబాద్ నగర అవసరాలు తీర్చేందుకు మరింత సమర్ధంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. స్థలం వృథా కాకుండా మూసీ పరీవాహక ప్రాంతం ఇరువైపులా భూగర్భంలో భారీగా వాటర్ స్టోరేజ్ సంప్లు నిర్మించి.. అక్కడి నుంచి నీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. -
పాదయాత్ర నాదే... మీనాక్షిది కాదు
సాక్షి, హైదరాబాద్: జనహిత పాదయాత్ర నిర్వహించాలనుకున్నది తానేనని.. తమ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కాదని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. కొందరు కావాలనే దాన్ని మీనాక్షి పాదయాత్రగా ప్రచారం చేశారన్నారు. శనివారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ నెల 23 తర్వాత జనహిత పాదయాత్ర మళ్లీ మొదలు పెడతామన్నారు. విడతలవారీగా జరిగే ఈ పాదయాత్రలో వీలు, సమయాన్ని బట్టి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపారు. తొలివిడత పాదయాత్రలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తిగా కనిపించారన్నారు. 4–5 రోజుల్లో బీసీ రిజర్వేషన్లపై తదుపరి కార్యాచరణ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించనక్కర్లేదని మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. కేబినెట్ తీర్మానాలు, అసెంబ్లీలో బిల్లులు, కులగణన లాంటి వ్యవహారాలు ఆషామాషీగా జరగవని.. ప్రజలన్నీ అర్థం చేసుకుంటారన్నారు. ఢిల్లీలో తాము నిర్వహించిన ధర్నాకు రాహుల్, ఖర్గే రాకపోవడానికి షెడ్యూల్ కుదరకపోవడమే కారణమన్నారు. నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై బీసీ రిజర్వేషన్లపై తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుందని చెప్పారు. తెలంగాణకు బీసీ నేత సీఎం అవుతారని.. అది కూడా తమ పార్టీలోనే కచి్చతంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మా మధ్య విభేదాల్లేవు సీఎం రేవంత్రెడ్డికి, తనకు మధ్య విభేదాలున్నట్లు కొందరు విషప్రచారం చేస్తున్నారని.. అందులో నిజం లేదని మహేశ్గౌడ్ వివరించారు. సీఎంతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, అలా ఉండబట్టే బీసీ రిజర్వేషన్లపై ఇంతవరకు పోరాడగలిగామని చెప్పారు. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్రెడ్డి చెప్పడంలో తప్పేమీ లేదన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ యంత్రాంగంలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసమే ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారన్నారు. గతంలో పీసీసీ చీఫ్గా పనిచేసినప్పుడు.. ప్రస్తుతం సీఎంగా పనిచేస్తున్నప్పుడు రేవంత్రెడ్డిలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు పూర్తయిందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, అనిరు«ద్రెడ్డిల అంశాన్ని క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తుందన్నారు. జూబ్లీహిల్స్లో గెలుపు మాదే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ విజయం నల్లేరుపై నడకేనని మహేశ్గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అవకా శం ఇచ్చే సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది కేసీఆరేనని.. తాము జూబ్లీహిల్స్లో తప్పక పోటీ చేస్తా మ ని చెప్పారు. ఉపఎన్నిక నోటిఫికేషన్ రాగానే అభ్యర్థి ని ప్రకటిస్తామని మహేశ్కుమార్గౌడ్చెప్పారు. -
కేటీఆర్కు బండి సంజయ్ సవాల్.. హరీష్, కవిత విచారణకు రావాలంటూ..
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ను మాజీ మంత్రి కేటీఆర్.. ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై ప్రమాణానికి సిద్ధమని.. ఏ గుడికి రమ్మంటారో కేటీఆర్ టైమ్, డేట్ చెప్పాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నీకు నేను రక్ష.. నాకు నువ్వు రక్ష అని స్నేహంలో ఉన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదు. కేటీఆర్ సోదరి కవితనే.. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్పై నేను ప్రమాణానికి సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తాడా?. నా సవాల్కు కేటీఆర్ సిద్దమా?. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బీఆర్ఎస్ను వదిలేసి బయటికి రావాలి. కాళేశ్వరం రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు.సిట్ అధికారులకి నా దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చాను. సిట్ అధికారులు నిజాయితీపరులు. కానీ పరిమితులు తక్కువగా ఉన్నాయి. కానీ ప్రభుత్వంపై నమ్మకం లేదు. ఫోన్ ట్యాపింగ్ విచారణను సీబీఐకి అప్పగించండి. దాదాపు ఆరు వేలకు పైగా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. ప్రభాకర్ రావు ఐజీ అని తప్పుడు సమాచారం కేంద్రానికి ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని ఆయనను విచారణకి పిలుస్తారా?. ఎస్ఐబీ దేని కొసం పనిచేయాలి.. కేవలం మావోయిస్టుల కోసం పని చేయాలి. మావోయిస్టు సానుభూతిపరులుగా మా పేర్లు పోలీసులకు పంపారు. ఇలా ఫోన్లు ట్యాపింగ్ చేస్తారా?. హరీష్ రావు, కవిత ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. వారిని కూడా విచారణకి పిలవాలి అని వ్యాఖ్యలు చేశారు. -
యాభై శాతం హద్దు తొలగేనా?
దేశ రాజకీయం మళ్ళీ బీసీల చుట్టూ తిరుగుతున్నది. ఇందుకు తెలంగాణ ఒక వేదికగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం స్థానాలను కేటాయించాలని నిర్ణ యించి శాసన పరమైన చర్యలు చేపట్టింది. దీనిని పార్లమెంటు చేత ఆమోదింపజేసి రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించేలా కేంద్రంపై ఒత్తిడి కల్పించ డానికి సన్నాహాలు మొదలుపెట్టింది. తమిళనాడులో చాలా కాలం కిందటే 69 శాతం కోటా అమల్లోకి వచ్చింది. అంతే కాకుండా కేసులు వేయకుండా న్యాయ సమీక్షకు అతీతం చేస్తున్న రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో ఈ కోటాను తమిళనాడు ప్రభుత్వం చేర్పించుకున్నది. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా...రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి, లక్షణానికి విరుద్ధంగా ఉండే చట్టాలను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినా వాటిని సమీక్షించే అధి కారం తనకున్నదని సుప్రీంకోర్టు ప్రకటించి ఉంది. తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్టు పంచాయతీల్లో బీసీలకు 42 శాతం కోటా బిల్లును పార్లమెంటు ఆమోదించడం గానీ, అది 9వ షెడ్యూ ల్లో చేర్చడం గానీ సులభ సాధ్యమైనవి కావు. కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లే పనులను బీజేపీ ఎందుకు చేస్తుంది? పని కాకపోతే బీజేపీ బీసీలకు వ్యతిరేకి అని ప్రచారం చేయవచ్చన్నది కాంగ్రెస్ ఎత్తుగడ. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా కల్పిస్తే సుప్రీం కోర్టు మొత్తం రిజర్వేషన్లపై విధించిన 50 శాతం హద్దును అది మీరిపోతుంది. ఇలా హద్దు మీరిన రిజర్వేషన్లను కోర్టులు చాలా సార్లు రద్దు చేశాయి. తాజాగా మహారాష్ట్రలో మరాఠాలకు కేటాయించిన 16 శాతం రిజర్వేషన్లు వివాదాస్పదమయ్యాయి. దీనితో మహా రాష్ట్రలో రిజర్వేషన్లు 50 శాతం హద్దును దాటిపోతున్నాయంటూ బొంబాయి హైకోర్టును కొందరు ఆశ్రయించగా అది వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను 16 నుంచి 12 శాతానికి, విద్యాసంస్థల్లో13 శాతానికి తగ్గించివేసింది. దీని మీద సుప్రీం కోర్టు స్టే ఇచ్చి, ఇప్పుడు విచారణ జరుపుతోంది. 1931 నాటి లెక్కలతో...విచిత్రమేమిటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ 1980–90 మధ్య పదేళ్ల పాటు మండల్ కమిషన్ నివేదికను అమలుపరచకుండా ఆటకెక్కించింది. 1990లో వి.పి.సింగ్ ప్రధానిగా ఈ నివేదికను పాక్షికంగా అమలుచేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను ఆచరణలోకి తెచ్చారు. తిరిగి 2006లో మన్మోహన్ సింగ్ నాయక త్వంలోని యూపీఏ ప్రభుత్వం కేంద్ర విద్యా సంస్థలలోనూ బీసీలకు 27 శాతం కోటాను అమలు చేసింది. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం నియమించిన బి.పి. మండల్ కమిషన్ 1931 కులగణన ప్రకారం దేశ జనాభాలో ఇతర వెనుకబడిన తరగతులవారు 52 శాతం ఉంటారని నిర్ధారించి, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించ కుండా ఉండేందుకు వారికి 27 శాతం కోటాను సిఫారసు చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కుల గణన జరిపిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో తన చిరకాల వ్యతిరేకతకు తెర దించి, త్వరలో జరగబోతున్న దేశ జనాభా గణనలో భాగంగా కులాలవారీ గణనను చేపట్టడానికి అంగీకరించింది. ఇందుకు కారణం లేక పోలేదు. ఇంతవరకూ కేవలం ధనిక, మధ్యతరగతి వర్గాల పార్టీగా మాత్రమే ఉన్న బీజేపీ వైపు ఇప్పుడు పేదలు, అణగారిన వర్గాలు కూడా గణనీయంగా మళ్ళినట్టు భావిస్తున్నారు.రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని 1992 నవంబర్ 16న సుప్రీం కోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం విధించింది. ఇంద్ర సాహనీ కేసు లేదా మండల్ కమిషన్ కేసుగా ప్రసి ద్ధమైన వ్యాజ్యంలో ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు దేశంలో రిజ ర్వేషన్లపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను ప్రకటించింది. కులం ప్రాతిపదిక వెనుకబాటుతనాన్ని ఈ తీర్పు గుర్తించింది. అంటే సామాజిక న్యాయ అవసరం రాజ్యాంగ విహితమైనదని చెప్పింది. అదే సమయంలో పరిమితులను విధించింది. 50 శాతం హద్దు, బీసీలలో మీగడ వర్గం, లేదా ముందుబడిన వర్గాన్ని (క్రీమీ లేయ ర్ను) గుర్తించి కోటా నుంచి దూరం చేయడం, పదోన్నతులలో రిజర్వేషన్లు ఉండరాదనడం ఈ కోవలోకి వస్తాయి. కేంద్రం తలుచుకుంటే...పదోన్నతులలో రిజర్వేషన్లను సుప్రీం కోర్టు రద్దు చేసినా 1995లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 16(4ఎ)ను చేర్చి ఎస్సీ, ఎస్టీల విషయంలో వాటికి తిరిగి ప్రాణం పోశారు. వాస్తవానికి రాజ్యాంగం 340, 341, 342 అధికరణాలు బీసీ, ఎస్సీ, ఎస్టీల పరి స్థితులను మెరుగుపరచడానికి, వారి యెడల సానుకూల వివక్షను ఉద్దేశించి చేర్చినవి. అయితే సుప్రీం కోర్టు 50 శాతం పరిమితి ఉల్లంఘన రాజ్యాంగం 14వ అధికరణం హామీ ఇస్తున్న సమానత్వ సూత్రానికి విరుద్ధమని ప్రకటించింది. అత్యంత ప్రత్యేక పరిస్థితు లలో 50 శాతానికి మించి రిజర్వేషన్లను కేటాయించవచ్చని సైతం ఈ తీర్పు చెప్పింది. కానీ కోర్టులు ప్రధానంగా 50 శాతం హద్దును అమలు పరచడమే కర్తవ్యంగా తీర్పులు వెలువరిస్తున్నాయి. కేంద్రం తలచుకుంటే 50 శాతం హద్దును ప్రభావరహితం చేయడం కష్టమేమీ కాదు. విద్యకు, హక్కులకు సుదూరంగా విసిరి వేసిన ప్రజలను పైకి తేవడానికి ఉద్దేశించిన అధికరణాలురాజ్యాంగం ప్రసాదించినవి కాగా, 50 శాతం హద్దు సుప్రీం కోర్టు విధించినది. నిజానికి రాజ్యాంగం కేవలం సాంఘికంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాలకే విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందులో ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావనే లేదు. అయినా మోదీ ప్రభుత్వం 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థిక బలహీన (ఈడబ్ల్యూఎస్) వర్గాలకు 10% రిజర్వేషన్లను కల్పించింది. ఇది 50 శాతం పరిమితిని దాటిపోడమే కదా! రాజ్య సభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ విషయాన్నే ప్రశ్నించగా, సామాజిక న్యాయ శాఖ మంత్రి విచిత్రమైన సమాధానంతో సమర్థించుకున్నారు. ఇంద్ర సాహనీ కేసులో సుప్రీం కోర్టు విధించిన 50 శాతం హద్దు సామాజి కంగా విద్యాపరంగా (ఎస్.ఇ.బి.సి.) వెనుకబడిన వర్గాలకు మాత్రమే వర్తిస్తుందని, ఆర్థిక బలహీన వర్గాలకిచ్చిన 10 శాతం రిజర్వేషన్లకు, దానికి సంబంధం లేదని చెప్పారు. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు రాజకీయ అవకాశవాదాన్నే రుజువు చేస్తాయి. అందుకే ‘మేమెంద రమో మాకు అంత కోటా’ అనే నినాదం రోజు రోజుకీ పుంజుకుంటు న్నది. అందుకోసం మరొక రాజ్యాంగ సవరణ ద్వారా 50 శాతం హద్దును కూడా రద్దు చేయడమే ఏకైక మార్గంగా తోస్తున్నది.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు-జి. శ్రీరామమూర్తి -
ప్రతీ వరద నీటి బొట్టు మూసీలోకి చేరేలా ప్రణాళిక సిద్ధం చేయండి: సీఎం రేవంత్
హైదరాబాద్: నగరంలో వర్షాలతో తలెత్తే ఇబ్బందులకు, వరర సమస్య పరిష్కారంపై ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) సీఎం రేవంత్రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను సీఎం రేవంత్ తీసుకున్నారు. నిన్న (గురువారం, ఆగస్టు 7వ తేదీ) రాత్ర కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండటమే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందన్న అధికారులు స్పష్టం చేశారు.దీనిలో భాగంగా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్.. ‘ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ నగరంలోని వరదనీరు మూసీని చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయండి. ప్రతీ చెరువు, నాలాలు, ఇతర కాలువలను మూసీకి అనుసంధానం చేయండి. చెరువులను పునరుద్ధరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయండి. ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటునుంచి మూసీలోకి చేరేలా చర్యలు చేపట్టండి. భవిష్యత్ లో నగరంలో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరం. మూసీ పునరుజ్జీవనమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించండి. మూసీ పునరుజ్జీవనంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఆ దిశగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయండి’ అని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. -
ఘోష్ కమిషన్.. కాంగ్రెస్ దారెటు.. బీజేపీ కోర్టులోకి బంతి?
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘట్టంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. బ్యారేజీ దెబ్బతిన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 16 నెలలు విచారణ చేసి ఒక నివేదిక సమర్పించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావులతో పాటు పలువురు అధికారుల పాత్రను తప్పుపట్టింది.అలాగే ప్రస్తుతం బీజేపీ ఎంపీ, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కూడా ఆక్షేపించింది. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తదితర మంత్రుల సమక్షంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికలోని ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేసీఆర్ తన పార్టీ నేతల సమావేశంలో ఒక వ్యాఖ్య చేస్తూ అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. ఈ నివేదిక పేరుతో కొన్ని అరెస్టులు కూడా జరగవచ్చని ఆయన అంచనా వేశారు. తదుపరి హరీష్ రావు బీఆర్ఎస్ పక్షాన మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కమిషన్ చేసిన అబ్జర్వేషన్స్ను తప్పుపట్టారు. హరీష్ అలా చేయడం న్యాయ వ్యవస్థను కించపరచడమేనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ వాద ప్రతివాదాలలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నదానిపై ఇప్పటికిప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము.ఈ సందర్భంలో గతంలో ఆయా ప్రభుత్వాలపై వేసిన కమిషన్లతో ఎవరికి ఇబ్బంది కలగలేదనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవ్వరూ ఈ తరహా కేసులు ఎదుర్కోలేదు. చలన చిత్రాభివృద్ది సంస్థ అవకతవకలకు సంబంధించి జరిగిన కమిషన్ విచారణకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి హాజరయ్యారు. కమిషన్ నివేదికలో ఆయనను తప్పు పట్టలేదు. ఒక భూ సేకరణ స్కాంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఇంకో మాజీ సీఎం స్టే పొందారు. విభజన తర్వాత ఏపీలో రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబే విచారణ సంఘాన్ని నియమించుకున్నారు. అందులో ఆయనను కమిషన్ ఆక్షేపించలేదు. ఇప్పుడు కేసీఆర్ ఈ విచారణ సంఘం నివేదికను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. రేవంత్ ప్రభుత్వం ఆయనపై కేసు పెడుతుందా? అరెస్టు చేస్తారా?.ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కాంలపై దర్యాప్తు జరిపించి అంతకుముందు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టింది. కొన్ని కేసుల్లో ఆయన బెయిల్ తెచ్చుకోగా, ఒక కేసులో అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో అప్పుడే చెప్పలేం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆ అనుభవం రీత్యా కేసీఆర్ను కూడా అరెస్టు చేస్తారా అన్న చర్చ ఉన్నప్పటికీ తాము కక్ష రాజకీయాలు చేయబోమని అంటున్నారు. పైగా కేసీఆర్కు ఫాం హౌసే ఒక జైలు అని, వేరే జైలు ఎందుకు అని వ్యాఖ్యానించి అరెస్టు జరగక పోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ఇది ఒక్క కేసీఆర్కే వర్తిస్తుందా? హరీష్ రావు, ఇతర అధికారులకు కూడా వర్తిస్తుందా అన్నది చెప్పలేం. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు ఇచ్చి కుంగిన ఘటన కేసీఆర్, హరీష్రావులకు, బీఆర్ఎస్కు అప్రతిష్ట తెచ్చిందన్నది వాస్తవం.అదే సమయంలో కేసీఆర్ లక్ష్య శుద్ధితోనే కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పించారని చెప్పాలి. కాకపోతే నిర్మాణం వేగంగా చేయాలన్న తొందరపాటులో ఆయన తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు దారి తీసి ఉండవచ్చునని అనిపిస్తుంది. కమిషన్ పరిశీలనల్లో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వ స్థాయిలో కాకుండా, కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నది ఒకటి. మంత్రివర్గం నుంచి పాలనాపరమైన అనుమతులు తీసుకోలేదన్నది ఇంకో పరిశీలన. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పి, బరాజ్ను మేడిగడ్డకు మార్చడంలో నిజాయితీ కొరవడిందన్నది మరో వ్యాఖ్య. మేడిగడ్డ వద్ద నిర్మాణానికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వ్యతిరేకత తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే యత్నం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ తప్పుడు డిజైన్లు ఇచ్చిందన్నది వేరొక ఆరోపణ. అధిక వడ్డీకి రూ.84 వేల కోట్ల అప్పు చేయడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. శాసనసభలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.ఘోష్ కమిషన్ నివేదికను ఆధారం చేసుకుని బీఆర్ఎస్పై కాంగ్రెస్ దాడి పెంచింది. అయితే, వెంటనే ఏం చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది. అసెంబ్లీలో ఎటూ ఈ నివేదికను పెడతారు. అందులో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు తమ వైఖరికి అనుగుణంగానే మాట్లాడుతారు తప్ప కొత్తగా చెప్పేది ఉంటుందా అన్నది సందేహం. అయినా అసెంబ్లీలో చర్చించడం మంచిదే. ఈ నివేదికలో కొంతమంది కీలక అధికారుల పాత్ర గురించి విస్మరించారన్న వాదన ఉంది. ప్రస్తుత సీఎస్గా ఉన్న రామకృష్ణారావు జోలికి కమిషన్ వెళ్లలేదని చెబుతున్నారు. బారేజ్ను మేడిగడ్డకు మార్చడం వల్ల ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని కమిషన్ అభిప్రాయపడిందని కథనం. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన దాదాపు లక్ష కోట్ల వ్యయం వృథా అయినట్లే అన్నట్లు ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్టులో మరో రెండు బారేజీలు, కాల్వలు, టన్నెల్స్ తవ్వకం, రిజర్వాయర్ల నిర్మాణం వంటివి కూడా ఉన్న విషయాన్ని ప్రజలలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని అనిపిస్తుంది.స్థల ఎంపికపై నిపుణుల కమిటీ అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో కేసీఆర్ వివరించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లనిచ్చిందన్న ప్రశ్న వస్తుంది. పైగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు ప్రశంసించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవీస్ స్వయంగా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరై కేసీఆర్ను మెచ్చుకున్నారు. మరో పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా, కాళేశ్వరం సబ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టును సమర్థించినట్లే కదా!. దానిపై ఏం చెబుతారు?. ప్రాణహిత-చేవెళ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చిన ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మాణం చేసి ఘనత తెచ్చుకోవాలన్న క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్ని తప్పులు కూడా చేసినట్లు అర్దం అవుతుంది.అయితే, అవి పెద్ద తప్పులా? కాదా? అన్నది పరిశీలించాలి. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.. అది కూడా మంచిదే. మామూలుగా అయితే ఈ నివేదిక ఆధారంగా కేసులు పెట్టి ఉండవచ్చు. కానీ, అలా చేయకుండా అసెంబ్లీలో చర్చిస్తామని చెబుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ప్రాజెక్టుపై విచారణకు సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం అలా చేస్తుందా? అన్నది ఒక ప్రశ్న. తద్వారా ఈ బాల్ను బీజేపీ కోర్టులో వేస్తుందా? అలా జరిగితే కాంగ్రెస్ చేతిలో ఒక ఆయుధం పోయినట్లు అవుతుంది. కనుక ఆ పని చేయకపోవచ్చు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి ఇంతకాలమైనా ప్రభుత్వం మరమ్మతులకు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రాజెక్టు నిరర్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఉన్న ప్రాజెక్టును వినియోగించుకుంటూనే ప్రభుత్వం తదుపరి చర్యలకు వెళ్లితే మంచిదే.ఇక మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వాదన కూడా సమర్థంగానే ఉందని చెప్పాలి. ఇది ఏకపక్ష నిర్ణయం కాదని, అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని ఆయన అంటున్నారు. కేబినెట్ ఆమోదం కూడా ఉందన్నది ఆయన వాదన. మొత్తం 665 పేజీల రిపోర్ట్ కాకుండా సంక్షిప్త నివేదికను బహిర్గతం చేస్తే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత సరిపడా లేదని కేంద్ర జల సంఘమే చెప్పిందని హరీష్ రావు వివరిస్తున్నారు. మరి కమిషన్ తన నివేదికలో అందుకు విరుద్దంగా ఎలా పెట్టిందో తెలియదు. అలాగే మంత్రివర్గ ఆమోదం ఉందన్న హరీష్ వాదనకు కేబినెట్ తీర్మానాలు చూపించాల్సి ఉంటుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన మాట అయితే వాస్తవం. దానిని కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదా అన్నది చూడాలి. ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతం బీఆర్ఎస్కు నష్టం చేసింది.ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలడం, పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిన ప్రమాదం వంటి వాటిని ఈ సందర్భంగా హరీష్, కేటీఆర్ తదితరులు ప్రస్తావిస్తున్నారు. గుజరాత్లో ఒక వంతెన కూలిన ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన ఉదంతాన్ని కూడా ఉటంకిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే దానిని ముఖ్యమంత్రికి అంటగడితే, ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు రేవంత్, ఉత్తమ్ కుమార్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైతే మరీ తీవ్రమైన చర్య తీసుకుంటుందా అన్నది సందేహమే. రాజకీయంగా తమకు ప్రయోజనం అనుకుంటేనే అలా చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ మాత్రం డిఫెన్స్ నుంచి అఫెన్స్ వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.అందుకే కేసీఆర్ దీనిని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని ధ్వజమెత్తితే, కేటీఆర్ ఈ నివేదిక ఒక ట్రాష్ అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా.. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటనే ఆ బారేజీకి రిపేర్లు చేయించి, నీటిని ప్రజలకు అందుబాటులోకి తేవడం ఉపయుక్తం అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు, రైతులకు ఎలాంటి సాయమైనా అందించేందుకు అందుబాటులో ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు రోజులపాటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి.. హైదరాబాద్లో గురువారం భారీగా కురిసిన వర్షాలపై ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని సూచించారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
మోదీ, అమిత్ షా అడ్డుకున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో కాంగ్రెస్కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించే మోదీ, అమిత్ షా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చినా..‘బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించి పది రోజుల ముందే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరాం. అయితే కాంగ్రెస్ నేతలు అపాయింట్మెంట్ కోరాక మోదీ, అమిత్షాలు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.కానీ, రాష్ట్రపతి మా వినతిని వింటే రిజర్వేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని భావించి ఆమె అపాయింట్మెంట్ రాకుండా మోదీ, అమిత్ షా అడ్డుకున్నట్టుగా మా మంత్రివర్గ సహచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ నిర్ధారణకు వచ్చారు. 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో అందుబాటులో ఉంటామని రాష్ట్రపతికి తెలియజేసినా అపా యింట్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చినా, రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరక్కపోవడం శోచనీయం, బాధాకరం, అవమానకరం..’ అని సీఎం పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ద్రోహులు..‘బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బీసీ వ్యతిరేకులుగా మారారు. 42 శాతం రిజర్వేషన్లకు బీఆర్ఎస్ కనీస నైతిక మద్దతు తెలపడం లేదు. రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయంటూ బీజేపీ అడ్డుకుంటోంది. బీజేపీది తొలి నుంచీ బీసీ వ్యతిరేక వైఖరే. మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకునేందుకు కమండల్ యాత్రను ప్రారంభించింది. మన్మోహన్సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినప్పుడు యూత్ ఫర్ ఈక్వేషన్ పేరుతో వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీతో అంటకాగుతూ బీఆర్ఎస్ శిఖండిలా వ్యవహరిస్తోంది. విధ్వంసకర పాత్ర పోషిస్తోంది. పది రోజుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను, మూడు రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించిన బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించడం ఒక్క రోజు పని అని. కానీ చిత్తశుద్ధి లేనందునే బిల్లులు ఆమోదించడం లేదు..’ అని రేవంత్ ధ్వజమెత్తారు.గల్లీ లీడర్లా కిషన్రెడ్డి వ్యాఖ్యలు‘బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెట్టుకింద ప్లీడర్లా, గల్లీ లీడర్లా మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయ శాఖ మంత్రిని కిషన్రెడ్డి హైదరాబాద్కు తీసుకొని వస్తే ఆయనకు కావల్సిన వివరాలన్నీ అందిస్తాం. లేకుంటే ఆయన సమయం చెబితే మేమే ఢిల్లీలో అన్ని గణాంకాలు అందజేస్తాం. ముస్లింలు ముఖ్యమంత్రులు కావద్దనేలా కిషన్రెడ్డి మాట్లాడడం సరికాదు. ముస్లింలను తొలగిస్తే రిజర్వేషన్లు పెంచుతామని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా తొలగిస్తారో.. ఎలా పెంచుతారో వాళ్లు చేసి చూపాలి. రిజర్వేషన్ల పెంపు, ఇతర విషయాల్లో కిషన్రెడ్డి అబద్ధాలు చెప్పినంత కాలం నేను నిజాలు చెబుతా..’ అని ముఖ్యమంత్రి అన్నారు. మోదీని కుర్చీ దింపడమే పరిష్కారం‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక ముందు ఏం చేయాలనే దానిపై రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)తో భేటీ అవుతాం. మంత్రులు, పీఏసీతో చర్చించిన తర్వాత త్వరలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర సమస్యలన్నింటికీ పరిష్కారం మోదీని కుర్చీ నుంచి దింపడమే. ఇప్పటికైనా రాష్ట్రపతి, మోదీ బీసీ బిల్లులను ఆమోదించాలి..’ అని రేవంత్ కోరారు. అందుకే రాహుల్ రాలేదు..‘రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇందిరా భవన్లో 4 గంటల పాటు తెలంగాణ కుల సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు గురించి సావధానంగా విన్నారని.. వంద మంది ఎంపీలకు వివరించారని సీఎం చెప్పారు. శిబుసోరెన్ అంత్యక్రియలు.. ఓ కేసు విషయమై జార్ఖండ్ వెళ్లినందునే రాహుల్ జంతర్ మంతర్ సదస్సుకు హాజరుకాలేదని వివరించారు. ఓడిపోవడమే కేసీఆర్కు పెద్ద శిక్షవిలేకరుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాట్ చేశారు. ‘కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చకు పెడతాం. అక్కడేం నిర్ణయిస్తారో చూద్దాం. ఈ విషయంలో ప్రతీకార చర్యలేవీ ఉండవు. కేసీఆర్ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. చర్లపల్లి జైలుకు, ఆయన ఫాంహౌస్కు పెద్దగా తేడా లేదు. ఆయన ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. అక్కడా అదే నాలుగు గోడలు.. పోలీసు పహారా..ఫాంహౌస్లోనూ అదే పహారా. ఎన్నికల్లో ఓడిపోవడమే ఆయనకు పడిన పెద్ద శిక్ష.. ’ అని సీఎం వ్యాఖ్యానించారు.ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే..ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ లేవనెత్తిన ఓటరు జాబితా అక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించారు. ‘ఓటర్ల జాబితాలో అక్రమాలు నిజమే. 2018లో కొడంగల్లోనే 15 వేల ఓట్లు తొలగించారు. నేను 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయా..’ అని అన్నారు. చిట్చాట్ అనంతరం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమి పక్షాల విందుకు రాహుల్గాంధీ ఆహ్వానం మేరకు రేవంత్ కూడా హాజరయ్యారు. విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్కుమార్, వివేక్, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు మల్లు రవి, అనిల్ యాదవ్, చామల కిరణ్కుమార్రెడ్డి, బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఇలా 'ట్రై' చేస్తే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన కీలక బిల్లుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సర్కారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో దీనిపై సీరియస్గా దృష్టి సారించింది. తదుపరి తీసుకోవాల్సిన కార్యాచరణపై సీనియర్ నేతలు, అధిష్టాన పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్లు.. మూడు ఆప్షన్లు ముందు పెట్టుకొని సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా అధిష్టానం ఫైనల్ చేసే ఆప్షన్ ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ముమ్మరంగా మంతనాలు: స్థానిక ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బుధవారం జంతర్ మంతర్ వేదికగా కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డిలతో గురువారం ఇక్కడ మంతనాలు జరిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన మూడు మార్గాలపై చర్చించారు. మూడు ఆప్షన్లు ఇలా..: 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం నిర్ణయం చేసే వరకు వేచిచూడటం మూడు ఆప్షన్లలో మొదటిది కాగా.. 50 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన పాత జీవో ప్రకారం ఎన్నికలకు వెళుతూనే, కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం రెండోది. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో జారీ చేయడం మూడోది. ఈ మూడు ఆప్షన్లకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అయితే రిజర్వేషన్లపై కేంద్ర నిర్ణయం వెలువడే వరకు వేచిచూస్తే,సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. అప్పుడు ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత గడువు కోరాల్సి ఉంటుంది. గడువు కోరేందుకు సహేతుక కారణాలు కూడా చూపాలి. అప్పుడైనా కోర్టు అంగీకరిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమేనని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ కోర్టు అంగీకరించినా అప్పటివరకు స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం, కేంద్రం నుంచి అందాల్సిన నిధులకు ఎదరయ్యే అవాంతరాలను కూడా అంచనా వేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. జీవో ఇస్తే..కోర్టులకెళితే.. ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో ఇస్తే, దానిపై ఎవరు కోర్టులకెళ్లినా జీవో అమలు సాధ్యం కాదు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కంటి తుడుపుగా జీవో ఇచ్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాకాకుండా పాత జీవోలు అమలు చేస్తే బీసీ వర్గాలు ఎలా స్పందిస్తాయో కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా నిర్ణయం చేయాలన్నా..సొంత పార్టీలోనే అనేక అభ్యంతరాలు రావచ్చని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లపై తొలుత పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో చర్చించాల్సి ఉంటుందని, జిల్లాల వారీగా పార్టీ సమావేశాలను నిర్వహించి దీనిపై అవగాహన కల్పించడం, కొన్ని వర్గాల నేతలను ఒప్పించడం చాలా కీలకమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని సమాచారం. కాగా బీసీ ధర్నా కవరేజీకి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జర్నలిస్టులు గురువారం ఉదయం తనను మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలోనూ ముఖ్యమంత్రి ఈ మూడు ఆప్షన్లపై చర్చ పెట్టి, అందులో ఏది మంచిదో సూచించాలని కోరడం గమనార్హం. రిజర్వేషన్ల అమలు ఆలస్యమైతే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్లాలనే సూచనలు రాగా, తాము అమలు చేసినా, ఇతర పార్టీలపై ఒత్తిడి తేవడం, వారిని ఒప్పించడం అంత సులువు కాదన్న తరహాలో సీఎం స్పందించినట్లు తెలిసింది. ఖర్గేతో మంతనాలు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సీఎం రేవంత్ ఈ విషయమై భేటీ అయ్యారు. పార్లమెంట్లోని ఆయన కార్యాలయంలో మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయనతో సమావేశమై.. మహాధర్నా విజయవంతమైన తీరును వివరించారు. ఇండియా కూటమి పక్షాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని ఖర్గే దృష్టికి తెచ్చారు. రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. ఒకవేళ కేంద్రం స్పందన లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆయన మార్గదర్శనం కోరారు. దీంతో పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలు కచ్చితంగా జరగాలనే అభిప్రాయాన్ని ఖర్గే వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వచ్చే నెల 30 లోగా స్థానిక సమరం! – తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చే నెల 30వ తేదీలోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై ఏమీ తేలని నేపథ్యంలో..మూడు ఆప్షన్లు పరిశీలిస్తున్నా.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్రామపంచాయతీ పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా, మండల, జిల్లా పరిషత్ల కాలపరిమితి పూర్తయి ఏడాదికి పైగా కావడంతో...కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం గ్రాంట్లు, ఇతర పథకాల కింద వచ్చే నిధులు ఆగిపోయాయి. తద్వారా గ్రామీణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థల పనితీరును చక్కదిద్దడంతో పాటు, గ్రామ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గాడిలో పెట్టడం, కోర్టు గడువు దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రాజకీయపార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు) ఎన్నికలను ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. అవి ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్టు సమాచారం. 8వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా ఈ నెల 8వ తేదీలోగా గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాలను (అసెంబ్లీ ఓటర్ల లిస్ట్ల ఆధారంగా) రూపొందించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి గ్రామపంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ కార్యదర్శులు సరిపోల్చి సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలను మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు) పరిశీలించి పంపించాలని అధికారులకు పీఆర్శాఖ స్పష్టం చేసింది. -
కేసీఆర్ అరెస్ట్ అవుతారా?.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్
సాక్షి,న్యూఢిల్లీ: విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు,కాళేశ్వరం స్కాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆరోపణలొచ్చాయి. ఈ కేసుల్లో కేసీఆర్ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారనే ఊహాగానాలూ ఊపందుకున్నాయి. అయితే,ఈ ఊహాగానాలకు ఢిల్లీ కేంద్రం సీఎం రేవంత్ తెరదించారు. కేసీఆర్ అరెస్ట్పై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి పార్లమెంట్లో ఒత్తిడి పెంచాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ చిట్చాట్ నిర్వహించారు. కేసీఆర్ను నేనెందుకు జైల్లో వేస్తా.. ఆయనే స్వీయ నియంత్రణగా జైల్లో ఉన్నట్లు ఫామ్ హౌస్లో ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్కు.. చర్లపల్లి జైలుకు తేడా లేదు. ఫామ్ హౌస్లో పోలీసుల పర్యవేక్షణ ఉంటది. జైల్లో పోలీసుల పహారా ఉంటుంది. అప్పుడప్పుడు జైలుకు విజిటర్స్ వస్తుంటారు.. అలాగే ఫామ్ హౌస్కి విజిటర్స్ వెళ్లి వస్తున్నారు. కేసీఆర్ను ఓడించడమే పెద్ద శిక్ష. నేనెందుకు విద్వేష రాజకీయాలు చేస్తా.మేం దుప్పటి కప్పుకొని పడుకున్నా తెలంగాణ ప్రజలు రెండోసారి కాంగ్రెస్ గెలిపిస్తారు. బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక వస్తుందని అనుకుంటున్నా. బీఆర్ఎస్ నేతలు కూడా నైతిక విజయం అంటే నైతికత కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. బీఆర్ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదు . బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది మా విధానం. బీజేపీ నేతలు.. మీకు కావలసిన పద్ధతిలో చట్టం చేయండి. కిషన్ రెడ్డికి బీసీ బిల్లులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్ల కంటే ఎక్కువ రానివ్వం. 2029లో ఎన్నికలు గెలిచి చూపిస్తాం..కిషన్ రెడ్డి అడ్డుకుంటారా?’ అని అన్నారు. -
KTR: రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక డ్రామా
-
తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఓయూ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 2016లో రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించారంటూ రేవంత్పై ఫిర్యాదు చేయగా.. రేవంత్రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదైంది.విచారణ పూర్తి చేసిన పోలీసులు.. అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. ఈ కేసును కొట్టేయాలంటూ రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటరకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణ వాయిదా వేసింది. -
మా ఆఖరి పోరాటం పూర్తి చేశాం.. ఇక నిర్ణయం కేంద్రానిదే: సీఎం రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాలకు మాత్రమే వర్గీకరణ ఉంటుందని, ఆయన(కిషన్ రెడ్డి) చెప్పినట్లు ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లేం లేవని అన్నారాయన. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘‘రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ అవకాశాలు మాత్రమే ఏబీసీడీ వర్గీకరణ ఉంది. పొలిటికల్ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ లేదు. బీసీ మొత్తానికి కలిపి 42 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఒక ప్రత్యేక వర్గానికి రిజర్వేషన్లు లేవు. కిషన్ రెడ్డి ముందుగా చట్టం చదవాలి. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదు. బీసీఈ గ్రూపుకు ఇప్పటికే నాలుగు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అలాంటప్పుడు కొత్తగా 10% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి. కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ అని సీఎం రేవంత్ అన్నారు.రిజర్వేషన్ సాధన కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని రేవంత్ ఉద్ఘాటించారు. ‘‘బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలన్నది మా కమిట్మెంట్. మా కమిట్మెంట్కు విపక్షాల సర్టిఫికెట్ అవసరం లేదు. జంతర్ మంతర్ వేదికగా మావాయిస్ బలంగా వినిపించాం. మా ఆఖరి పోరాటాన్ని పూర్తి చేశాం. నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని బీజేపీనే. బీసీలపై అంత ప్రేమ ఉంటే కేంద్రం వెంటనే బిల్లు ఆమోదించాలి. అబద్ధాలతో ప్రజల్ని మభ్య పెట్టడం బీఆర్ఎస్ నైజం. లోకల్బాడీ ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. ఆలోపు బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపకపోతే ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ఆలోచన చేస్తాం. ప్రజల అభిష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుంది’’ అని రేవంత్ స్పష్టం చేశారు. -
ఎంపీ లేటు వయసు పెళ్లి.. గ్రాండ్ రిసెప్షన్, అతిథుల్లో సీఎం రేవంత్ (ఫొటోలు)
-
టార్గెట్ రేవంత్!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లక్ష్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా సీఎం వ్యాఖ్యలను, ఆయన వైఖరిని తప్పుపడుతున్న రాజగోపాల్రెడ్డి.. తాను ఎవరినీ విమర్శించడం లేదని, సూచనలు మాత్రమే చేస్తున్నానంటూనే తనదైన శైలిలో విమర్శలు కొనసాగిస్తున్నారు. తానే పదేళ్లు సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలను ఇటీవల బహిరంగంగానే ఖండించారు. అంతేకాదు సమయం వచ్చినప్పుడల్లా రేవంత్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేలుస్తుండటం కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. పార్టీ విధానాలకు వ్యతిరేకమంటూ..పాలమూరు జిల్లాలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను రాజగోపాల్రెడ్డి బహిరంగంగా ఖండించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 19 నెలల తర్వాత తొలిసారి పార్టీలో అసంతృప్త స్వరాన్ని వినిపించారు. ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని, తానే సీఎంగా ఉంటానని రేవంత్ చెప్పడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని, ఈ వ్యాఖ్యలను నిఖార్సయిన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరనే కోణంలో ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. రాజగోపాల్ వ్యాఖ్యలు అప్పట్లోనే కాంగ్రెస్ శిబిరంలో చర్చకు తెరలేపాయి. వాటి వెనుక ఆంతర్యమేంటన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ ఎపిసోడ్ మరుగునపడుతోందనుకునే లోపే రాజగోపాల్ మరోమారు మరింత ఘాటైన విమర్శలు చేశారు. సోషల్ మీడియా గురించి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఆ తర్వాత బుధవారం కూడా అదే వైఖరి కొనసాగించారు. తనను కలిసిన డిజిటల్ మీడియా ప్రతినిధులనుద్దేశించి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ప్రతిపక్షాలను ఉద్దేశించి వాడుతున్న భాషను మార్చుకోవాలని సూచించారు. తాను రేవంత్రెడ్డిని విమర్శించడం లేదంటూనే, పార్టీలో జరుగుతున్న తప్పులను చెప్పకపోతే నష్టం జరుగుతుందని, అందుకే చెపుతున్నానంటూ ముక్తాయింపునివ్వడం గమనార్హం. అధిష్టానాన్నీ వదలకుండా..రాజగోపాల్రెడ్డి అప్పుడప్పుడూ పార్టీ అధిష్టానాన్ని సైతం వదిలిపెట్టకుండా సుతిమెత్తని వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. తనకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం మాట ఇచ్చిందని చెబుతూ.. భువనగిరి ఎంపీ సీటులో గెలిపించినప్పటికీ అధిష్టానం మాత్రం తన మాట నిలబెట్టుకోవడం లేదంటూ నర్మగర్భంగా అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తుందా లేదా అన్నది వారిష్టమని అంటూనే, మునుగోడు ప్రజల కోసం మళ్లీ త్యాగం చేసేందుకు కూడా వెనుకాడేది లేదంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తుండడం గమనార్హం. రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలన్నిటిపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మంత్రిపదవి ఇవ్వనందుకే రాజగోపాల్రెడ్డి అలా మాట్లాడుతున్నారని కొందరు, మంత్రిపదవి మాత్రమే కాదని దీర్ఘకాలిక వ్యూహంతో ఆయన వెళుతున్నారని, అందుకే రేవంత్ పదేళ్ల సీఎం వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకు ముందుకు వచ్చారని మరికొందరు అంటున్నారు. పార్టీలోని కొందరు నేతలు చేయలేని పనిని ఆయన చేశారని మరికొందరు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. డీకేతో భేటీ..!రాజగోపాల్రెడ్డి బుధవారం మధ్యాహ్నం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయనతో మాదాపూర్లోని ఓ హోటల్లో సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఇరువురు వ్యక్తిగత, రాజకీయ అంశాలపై చర్చించారని, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను రాజగోపాల్రెడ్డి వివరించారని సమాచారం. కాగా ఈ వ్యవహారంపై గురువారం ఆయనతో మాట్లాడతానని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఢిల్లీలో వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించకుంటే రాహుల్గాంధీ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించుతామని హెచ్చరించారు. ఎర్ర కోటపై మూడు రంగుల జెండా ఎగురవేసి రాహుల్ గాందీని ప్రధానమంత్రిని చేసుకుని బీసీ రిజర్వేషన్ల డిమాండ్ను నెరవేర్చుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రజల శక్తిని, ఉద్యమ స్ఫూర్తిని మోదీ తక్కువగా అంచనా వేస్తే తడాఖా చూపిస్తామని అన్నారు. బిల్లులు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీ జంతర్మంతర్లో టీపీసీసీ బుధవారం నిర్వహించిన మహాధర్నాలో సీఎం ప్రసంగించారు. సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తే అదే మరణ శాసనం ‘గోధ్రా అల్లర్ల సమయంలో రాజీనామా చేయమని నాటి ప్రధానమంత్రి వాజ్పేయి నాడు సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని కోరితే చేయలేదు. 75 ఏళ్లు నిండినందున ప్రధాని పదవి నుంచి వైదొలగాలని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ కోరుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. మోదీ లేకపోతే బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఆయన భక్తుడు నిశికాంత్ దూబే అంటున్నారు. ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవు. బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటే ఆయనను గద్దె దించడం ఖాయం. రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించకుంటే ఇక ఢిల్లీ రాము.. గల్లీకి వచ్చినప్పుడు బీజేపీ నేతలను పట్టుకుంటాం. ఇందిరాగాం«దీ, రాజీవ్గాంధీ వారసునిగా వచ్చిన రాహుల్గాంధీ బీసీలకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. సామాజిక న్యాయంపై రాహుల్గాంధీ శిలాశాసనానికి వ్యతిరేకంగా వస్తే అదే మరణ శాసనం అవుతుంది..’అని రేవంత్ హెచ్చరించారు. బీజేపీకి తెలంగాణ బీసీల అవసరం లేదా? ‘బలహీన వర్గాలపై కక్ష గట్టిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చట్టం చేశారు. నాడు కేసీఆర్ చేసిన చట్టమే నేడు రిజర్వేషన్ల పెంపునకు గుదిబండగా మారింది. తెలంగాణలో బలహీన వర్గాల బిడ్డలు.. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు కాకుండా అడ్డుగా ఉన్న చట్టాన్ని తొలగించాలని ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపినా ఆమోదించడం లేదు. కేసీఆర్తో పాటు బీజేపీ నేతలు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాంచందర్రావులు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుపడుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు తెలంగాణ బీసీల అవసరం లేదా? బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాకు ఎందుకు రాలేదు? తెలంగాణతో పేరు బంధంతో పాటు పేగు బంధం కూడా తెంచుకుందా? ఆ అదృష్టం నాకు దక్కింది ‘దేశంలో వందేళ్ల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయలేదు. ఇప్పటివరకు దేశంలో 300 మంది ముఖ్యమంత్రులైనా ఎవరూ చేయని పనిని చేసే అదృష్టం నాకు దక్కింది. బీసీల రిజర్వేషన్లు పెంచే అవకాశం నాకు వచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకే ఢిల్లీలో ధర్నాకు దిగాం. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధించి తీరతాం..’అని ముఖ్యమంత్రి అన్నారు. కేటీఆర్ బుద్ధి మారలేదు.. అహంకారం తగ్గలేదుబీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాను కేటీఆర్ డ్రామా అంటున్నారు. కానీ కేటీఆర్ పేరే డ్రామారావు. కేసీఆర్ కుటుంబం డ్రామాలతో బతుకుతోంది. అధికారం, పదవులు పోయినా కేటీఆర్ బుద్ధి మారలేదు..అహంకారం తగ్గలేదు. ఆ కుటుంబంలోనే ఒకరు రిజర్వేషన్లకు అనుకూలం.. మరొకరు ప్రతికూలం.. మరొకరు అటూఇటూ కాకుండా మాట్లాడుతున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు. -
మాటలు తగ్గించి.. పని చెయ్.. రేవంత్ పై షాకింగ్ కామెంట్స్
-
‘ముందు భాష మార్చుకో రేవంత్’.. ఎమ్మెల్యే రాజ్గోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘సీఎం తన భాష మార్చుకోవాలి. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి.. ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. చాలామంది సీమాంధ్ర నాయకులు ఇంకా తెలంగాణను దోచుకుంటుంన్నారు.నాకు మంత్రి పదవి హైకమాండ్ ప్రామిస్ చేసింది. ఇంకా మూడున్నరేళ్ళు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి.. ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దాం. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. సోషల్ మీడియా విషయంలో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లుగా సీఎం రేవంత్ తీరు ఉంది’ అని ధ్వజమెత్తారు. -
ఢిల్లీలో కొనసాగుతున్న టీపీసీసీ ధర్నా.. పలువురు ఎంపీల మద్దతు
Congress Delhi dharna Updates..కొనసాగుతున్న కాంగ్రెస్ ధర్నా..బీసీ రిజర్వేషన్ల సాధనకు దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదీక్షకు సంఘీభావం తెలిపేందుకు హాజరైన కాంగ్రెస్ ఎంపీలుఎంపీలు గౌరవ్ గొగోయ్, జ్యోతిమణి సెన్నిమలై, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ, శివసేన, ఎన్సీపీ ఎంపీల మద్దతు👉ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీ ధర్నా సభా స్థలికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డిCongress Protest for 42% BC Quota at Jantar Mantar pic.twitter.com/9bh91VwPcQ— Naveena (@TheNaveena) August 6, 2025ఎమ్మెల్సీ విజయ శాంతి కామెంట్స్..బీసీ రిజర్వేషన్లు అడిగితే మమ్మల్ని ఢిల్లీ నడి రోడ్డు మీద నిలబెట్టింది బీజేపీ.బీసీ రిజర్వేషన్లు ఇచ్చే వరకు మేము వదలము.ఈరోజు దేశం ఇంత అభివృద్ధిలో ముందు ఉందని అంటే కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీలే..బీసీ బిల్లులో న్యాయపరమైన చిక్కులు ఉంటే EWS బిల్లు ఎలా అమలు అయ్యింది..బీసీలు తయారు చేసిన కుర్చీలో మీరు కూర్చున్నారు.కానీ మీరు బీసీలకు మాత్రం న్యాయం చేయడం లేదు.42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.కొండా సురేఖ కామెంట్స్..42శాతం రిజర్వేషన్లలో ముస్లింలు ఉంటే తప్పేంటి అని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడుగుతున్నానుముస్లింలు మనుషులు కాదా?వారికి ఒటుహక్కు లేదా?రాష్ట్రపతి ఒక ఎస్టీ మహిళ, వితంతువు కాబట్టి ఆమెను పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మోదీ పిలవలేదు.రాష్ట్రపతి తెలంగాణ బిల్లును ఆమోదిస్తుందనే నమ్మకం నాకు లేదు. LIVE : ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా https://t.co/R7xbpWWxBK— Telangana Congress (@INCTelangana) August 6, 2025 కనిమొళి కామెంట్స్..జంతర్ మంతర్లో కాంగ్రెస్ ధర్నాకు హాజరై మద్దతు పలికిన డీఎంకే ఎంపీ కనిమొళి50 శాతం న్యాయం కాదు.. సంపూర్ణ న్యాయం చేయాలి #WATCH | Delhi: On Congress workers holding a protest at Jantar Mantar over the 42% OBC reservation in Telangana state local bodies, DMK MP Kanimozhi says, "Tamil Nadu has 69% reservation. We stand in support to make centuries-old wrong into right. We stand with the Telangana… pic.twitter.com/QHWSCYJNc9— ANI (@ANI) August 6, 2025 కాసేపట్లో ధర్నా ప్రారంభం..కాసేపట్లో జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా ప్రారంభం కానుంది.తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ భారీ ధర్నాతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా.టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ధర్నా నిర్వహించనున్నారు.ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు.సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ గారు విచ్చేసి ప్రసంగిస్తారు.తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, జిల్లా స్థాయి ప్రముఖ నేతలు, బీసీ నాయకులు ఈ ధర్నాలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమం ద్వారా బీసీల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పోరాట పటిమను మరోసారి నిరూపించబోతుంది.👉తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించనుంది.Massive protest at Delhi’s Jantar Mantar today demanding 42% BC reservations. Led by CM @revanth_anumula & TPCC chief Mahesh Kumar Goud, joined by ministers, MPs & BC leaders the protest will be innugarted by AICC president #MallikarjunKharge @kharge at 11 AM, LoP #RahulGandhi… pic.twitter.com/EolP9x0AxK— Ashish (@KP_Aashish) August 6, 2025👉జంతర్ మంతర్ వద్ద ధర్నాలో 200 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. 1,500 మందికి పైగా కూర్చునేలా కుర్చీలు వేశారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్మంతర్కు వెళ్లే దారిలో ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు.👉మహాధర్నాలో పాల్గొనే దాదాపు వెయ్యి మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సోమవారం హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంది. వీరికి స్థానిక వైఎంసీఏతో పాటు పలు హోటళ్లలో వసతి కల్పించారు. వీరితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు సుమారు 500 మంది వరకు విమానాల్లో ఢిల్లీకి వచ్చారు. వీరందిరికీ ఎంపీల అధికారిక నివాస గృహాలు, వెస్ట్రన్ కోర్ట్లో వసతిని ఏర్పాటు చేశారు. -
సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు అధికార వర్గాల సమాచారం. ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలం పొడిగించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో మరో మూడు నెలలు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఏర్పడింది. రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తే ఆయన స్థానంలో సీఎస్గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్రంజన్, వికాస్రాజ్ పోటీలో ఉన్నా రు. కేంద్ర సరీ్వసులో ఉన్న సంజయ్ జాజు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా లేరని సమాచారం. అలాగే ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్ గోయల్కు సీఎస్గా అవకాశం లేదని సమాచారం. -
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ‘రిజర్వేషన్’ ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించనుంది. జంతర్ మంతర్లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కొండా సురేఖ, వివేక్, వాకిటి శ్రీహరి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతోపాటు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీలతో పాటు, ఇండియా కూటమి పారీ్టల ఎంపీలు పాల్గొననున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ధర్నాలో పాల్గొనాలని సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, వామపక్ష పారీ్టల ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి లేఖలు రాశారు. కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం మహేశ్కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. 200 మంది కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు. 1,500 మందికి పైగా కూర్చునేలా కురీ్చలు వేశారు. ఉదయం 10 గంటలకు మొదలయ్యే ధర్నా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, జంతర్మంతర్కు వెళ్లే దారిలో ధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. మహాధర్నాలో పాల్గొనే దాదాపు వెయ్యి మంది కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలతో సోమవారం హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం మధ్యాహా్ననికి ఢిల్లీ చేరుకుంది. వీరికి స్థానిక వైఎంసీఏతో పాటు పలు హోటళ్లలో వసతి కల్పించారు. వీరితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు సుమారు 500 మంది వరకు విమానాల్లో ఢిల్లీకి వచ్చారు. వీరందిరికీ ఎంపీల అధికారిక నివాస గృహాలు, వెస్ట్రన్ కోర్ట్లో వసతిని ఏర్పాటు చేశారు.