‘అల్లు సినిమాస్’ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు. హైదరాబాద్లోని కోకాపేటలో అల్లు ఫ్యామిలీ నిర్మించిన ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మాణం పూర్తి అయిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. అందులో అల్లు ఫ్యామిలీతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, పెద్ది సినిమా దర్శకుడు బుచ్చిబాబు, క్రిష్, డి సురేష్ బాబు, బన్నీ వాస్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ థియేటర్కు సంబంధించిన ఏర్పాటులో అల్లు అర్జున్ పాత్ర ఐకానిక్గా ఉంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 19న ధురంధర్-2, ఉస్తాద్ భగత్సింగ్ సినిమాలు ప్రదర్శించనున్నారు.


