breaking news
Asia Cup 2025
-
ఆసియా కప్ వైఫల్యాల ఎఫెక్ట్.. శ్రీలంక కోచింగ్ బృందంలో భారీ మార్పులు
ఆసియా కప్ 2025లో ఘోర వైఫల్యాల తర్వాత శ్రీలంక క్రికెట్ జట్టు (Sri Lanka) తమ కోచింగ్ బృందంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. లాంగ్ స్టాండింగ్గా ఉన్న స్పిన్ బౌలింగ్ కోచ్తో పాటు రెండేళ్ల క్రితం నియమితుడైన బ్యాటింగ్ కోచ్ను కూడా మార్చింది. 2006 నుంచి స్పిన్ బౌలింగ్ కోచ్గా ఉన్న పియాల్ విజేతుంగే స్థానంలో రెన్ ఫెర్డినాండ్స్ను.. 2023 డిసెంబర్ నుంచి బ్యాటింగ్ కోచ్గా ఉన్న తిలిన్ కందాబి స్థానంలో జూలియన్ వుడ్ను నియమించింది. జూలియన్ వుడ్ ఏడాది ఒప్పందం మేరకు లంక పరిమిత ఓవర్ల జట్టుతో చేరతాడు. అతను లంక బ్యాటర్లకు పవర్ హిట్టింగ్లో శిక్షణ ఇవ్వనున్నాడు. వుడ్ గతంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ఇంగ్లండ్ కౌంటీలైన హ్యాంప్షైర్, గ్లోసెస్టర్షైర్, మిడిల్సెక్స్కు శిక్షణ ఇచ్చాడు. అలాగే అతను ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్కు కూడా బ్యాటింగ్ కన్సల్టెంట్గా పని చేశాడు.రెన్ ఫెర్డినాండ్స్ విషయానికొస్తే.. ఇతను లంక బోర్డుతో రెండేళ్ల ఒప్పందం మేరకు పని చేస్తాడు. ఈ సమయంలో అతను లంక స్పిన్ విభాగాన్ని పటిష్ట పరిచే ప్రయత్నం చేస్తాడు. గతంలో అతను న్యూజిలాండ్ క్రికెట్లో కన్సల్టెంట్గా పని చేశాడు. అలాగే బీసీసీఐ నేషనల్ అకాడమీలోనూ కొంతకాలం సేవలందించాడు.శ్రీలంక జట్టు తాజాగా ముగిసిన ఆసియా కప్లో గ్రూప్ దశలో మంచి విజయాలు సాధించినా.. సూపర్-4 దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించింది. సూపర్-4లో వారికంటే బలహీనమైన బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక పరాభవాన్ని ఎదుర్కొంది.ఆసియా కప్ తర్వాత నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్న శ్రీలంక జట్టు నవంబర్లో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్ పర్యటనకు వెళ్తుంది. ఈ మ్యాచ్లు నవంబర్ 11, 13, 15 తేదీల్లో రావల్పిండి వేదికగా జరుగుతాయి. అనంతరం ఈ జట్టు పాకిస్తాన్లోనే జరిగే ముక్కోణపు ట్రై సిరీస్లో కూడా పాల్గొంటుంది. ఈ సిరీస్ నవంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. చదవండి: భారీ శతకంతో కదంతొక్కిన ఆసీస్ ప్లేయర్ -
భారత జట్టుతో అనుబంధం.. హర్మన్ గొప్ప ప్లేయర్: పాక్ కెప్టెన్ ప్రశంసలు
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)పై పాకిస్తాన్ సారథి ఫాతిమా సనా ప్రశంసలు కురిపించింది. హర్మన్ అనుభవజ్ఞురాలైన ప్లేయర్ అని.. ఆమె జట్టును నడిపించే తీరు అద్భుతమని కొనియాడింది. కాగా వరుసగా నాలుగో ఆదివారం భారత్- పాకిస్తాన్ మ్యాచ్కు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే.పాక్పై వరుస విజయాలతో ట్రోఫీ సొంతంఇటీవల పురుషుల క్రికెట్ ఆసియా టీ20 కప్-2025 (Asia Cup) సందర్భంగా దాయాదులు తలపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం ఈ ఖండాంతర టోర్నీలో తొలిసారి జరిగిన ముఖాముఖి పోరులో టీమిండియా.. లీగ్, సూపర్ దశలతో పాటు ఫైనల్లో పాక్ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది.అయితే, ఈ మ్యాచ్ల సందర్భంగా పాక్ జట్టుతో కరచాలనానికి సూర్యకుమార్ సేన నిరాకరించగా.. పాక్ జట్టు హైడ్రామా నడిపించింది. అంతేకాదు.. హ్యారిస్ రవూఫ్తో పాటు ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించి ఐసీసీతో మొట్టికాయలు తిన్నారు.ట్రోఫీ, మెడల్స్ ఎత్తుకుపోయిన నక్వీఇక పీసీబీ చైర్మన్, పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీనుంచి ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించగా.. అతడు ట్రోఫీ, మెడల్స్తో పారిపోయాడు. తన దగ్గరకు వస్తేనే వాటిని ఇస్తానంటూ ఓవరాక్షన్ చేయగా.. బీసీసీఐ ఐసీసీ వద్దనే ఈ పంచాయితీ తేల్చుకునేందుకు సిద్ధమైంది.ఈసారి కూడా నో షేక్హ్యాండ్ఇలాంటి పరిణామాల నడుమ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2025 సందర్భంగా భారత్- పాక్ జట్ల మధ్య ఆదివారం (అక్టోబరు 5) జరిగే మ్యాచ్పై ఆసక్తి నెలకొంది. కొలంబో వేదికగా దాయాదితో జరిగే పోరులో హర్మన్సేన కూడా కరచాలనానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో మ్యాచ్కు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘హర్మన్ప్రీత్ కౌర్ సీనియర్, అనుభవజ్ఞురాలైన ప్లేయర్. అద్బుత రీతిలో జట్టును ముందుకు నడిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.తనొక ప్రతిభావంతమైన ప్లేయర్. పరిస్థితులకు తగ్గట్లు హిట్టింగ్ ఆడగలదు.. డిఫెండ్ కూడా చేసుకోగలదు. మైదానంలో తన వ్యూహాలను పక్కాగా అమలు చేస్తుంది’’ అని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ప్రశంసించింది.అంతా ఒకే కుటుంబం అదే విధంగా.. ‘‘2022 వరల్డ్కప్లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత.. భారత జట్టు మొత్తం మా దగ్గరికి వచ్చి.. మమ్మల్ని పలకరించింది. మాతో కలిసి వారు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆరోజు ఎంతో ప్రత్యేకం.ఆరోజే ఆ ఇరుజట్ల మధ్య గొప్ప అనుబంధం ఉందని నాకు అనిపించింది’’ అంటూ ఫాతిమా సనా గత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంది. ప్రస్తుతం బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసనని.. అయితే, మైదానంలో ఉండే 20- 22 ప్లేయర్లు అంతా ఒక కుటుంబం లాంటివారేనని పేర్కొంది. ఐసీసీ వరల్డ్కప్ ఆడటం ప్రతి ఒక్క ప్లేయర్ కల అని.. తామంతా కేవలం ఆట మీద మాత్రమే దృష్టి పెడతామని ఫాతిమా సనా తెలిపింది.ఈసారి ఏకపక్ష విజయమేఅయితే, సనా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఆటగాళ్ల మనస్తత్వం ఎలాంటిదో ఇటీవలే మరోసారి చూశామని.. ట్రోఫీ ఎత్తుకెళ్లే నక్వీ నడిపించే బోర్డుకు చెందిన ఆటగాళ్లు ఇలా మాట్లాడటం ఆశ్చర్యకరమని నెటిజన్లు పేర్కొంటున్నారు.కాగా భారత్- పాక్ మహిళా జట్లు గతంలో 11 వన్డేల్లో ముఖాముఖి తలపడగా.. అన్ని మ్యాచ్లలోనూ భారత్ విజయం సాధించింది. ఈసారి కూడా గెలుపు ఏకపక్షమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. అయితే, వర్షం రూపంలో దాయాదుల పోరుకు ప్రమాదం పొంచి ఉంది. ఇదిలా ఉంటే.. హర్మన్ప్రీత్ కౌర్కు బదులుగా భారత బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వీ మీడియా సమావేశానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో భారత్- పాక్ మహిళా జట్ల మధ్య అనుబంధం గురించి పాక్ జర్నలిస్టు ప్రశ్నించగా.. టీమిండియా మేనేజర్ తదుపరి ప్రశ్నకు వెళ్దామని చెప్పారు.చదవండి: 50 ఓవర్ల క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ.. ఆసీస్ బ్యాటర్ విధ్వంసం -
ఆసియాకప్ ట్రోఫీని భారత్కు ఇవ్వొద్దు.. ఆ మొండితనం ఏంటి?
భారత క్రికెట్ జట్టు ఆసియాకప్ విజేతగా నిలిచి ఐదు రోజులు అవుతున్నప్పటికి ట్రోఫీ మాత్రం ఇంకా తమ వద్దకు చేరలేదు. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా మెడల్స్తో పాటు ట్రోఫీని అందుకోవడానికి భారత్ నిరాకరిచింది.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్తో పాటు ఆ దేశ మంత్రిగా ఉండడంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నఖ్వీ ట్రోఫీని, మెడల్స్ను తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగొచ్చిన నఖ్వీ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డు అందజేయనున్నట్లు వార్తలు వచ్చాయి.కానీ ఇప్పటివరకు యూఏఈ క్రికెట్ బోర్డు, బీసీసీఐ గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ ట్రోఫీ వివాదంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తన చేతుల మీదగా ట్రోఫీని తీసుకోకూడదనే వైఖరిని కొనసాగిస్తే, నఖ్వీని తన నిర్ణయాన్ని మార్చుకోవద్దని అలీ సూచించాడు. ఈ పాక్ మాజీ క్రికెటర్ టీమిండియాపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు."టీమిండియా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. కానీ వారు చేసే పనులు మాత్రం థర్డ్ క్లాస్ను తలపిస్తున్నాయి. మొహ్సిన్ నఖ్వీనే ఆసియాకప్ ట్రోఫీని అందజేయాలి. వారు అందుకు నిరాకరిస్తే, ఖచ్చితంగా ప్రపంచం దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకుంటారు.అటువంటి అప్పుడు ఎట్టిపరిస్థితిలలోనూ ట్రోఫీని అప్పగించకూడదు. భారత్ బాగా ఆడి గెలిచింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ మొండితనం ఏంటి? మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్గా ఉన్నారు. అదే ఐసీసీ ఈవెంట్ అయివుండి చైర్మెన్ జై షా నుండి పాకిస్తాన్ ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించినా కూడా నేను తప్పు పట్టేవాడిని" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ పేర్కొన్నాడు.కాగా ఈ ఏడాది ఆసియాకప్ టోర్నీలో మొత్తంగా మూడు సార్లు పాక్ను భారత్ చిత్తు చేసింది. అయితే అతడి వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు కౌంటరిస్తున్నారు. ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు, ముందు మీ జట్టు సంగతి చూసుకో అని నెటిజన్లు పోస్ట్లు పెడుతున్నారు.చదవండి: IND vs AUS: పాపం తిలక్ వర్మ.. సెంచరీ జస్ట్ మిస్! భారత్ స్కోరెంతంటే? -
ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్ విమర్శలు
ఆసియాకప్-2025 ఫైనల్ మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విజేతగా నిలిచిన భారత జట్టు ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవడానికి నిరకారించింది.టీమిండియా చర్యతో మొహ్సిన్ నఖ్వీకి ఘోర అవమానం ఎదురైంది. దీంతో నఖ్వీ ట్రోఫీని తనతో పాటు హోటల్కు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి తీరుపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఇప్పటికీ ఇంకా ట్రోఫీ భారత్ వద్దకు చేరలేదు. అతడు ఆసియాకప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అదేవిధంగా ఈ టోర్నీ అంతటా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం కూడా చేయలేదు. ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఎబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించిన భారత జట్టు వైఖరిని డివిలియర్స్ తప్పు బట్టాడు. క్రీడలకు రాజకీయాలను దూరంగా ఉంచాలని అతడు కోరాడు."ఆసియాకప్ ట్రోఫీని ఏసీసీ చైర్మెన్ చేతుల మీదగా తీసుకోవడానికి టీమిండియా సముఖత చూపలేదు. అందుకు కారణం మనందరికి తెలుసు. కానీ నావరకు అయితే అది క్రీడలకు సంబంధించినది కాదు. క్రీడల నుంచి రాజకీయాలను పక్కన పెట్టాలి.స్పోర్ట్స్ను మనం ప్రత్యేకంగా చూడాలి. పాలిటిక్స్తో ముడిపెట్టకూడదు. ఆసియాకప్లో చోటు చేసుకున్న పరిణామాలు నాకు చాలా బాధ కల్గించాయి. అయితే భవిష్యత్తులో ఈ సమస్యలను పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు క్రీడాకారులను మానసికంగా దెబ్బతీస్తాయి. నాకు ఇటువంటివి అస్సలు నచ్చవు. చివరికి వివాదాలతోనే ఆసియాకప్ ముగిసింది" అని ఏబీడీ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.అదేవిధంగా ఛాంపియన్స్గా నిలిచిన భారత జట్టు ఈ సౌతాఫ్రికా లెజెండ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా చాలా పట్టిష్టంగా కన్పిస్తోందని, టీ20 ప్రపంచకప్-2026కు సిద్దంగా ఉందని అతడు కొనియాడాడు.చదవండి: IND vs WI: టీమిండియాతో మ్యాచ్.. చందర్పాల్ తనయుడు అట్టర్ ప్లాప్ -
దిగొచ్చిన పీసీబీ చైర్మెన్ నఖ్వీ.. ఆసియా కప్ ట్రోఫీ అందజేత?
ఆసియా కప్-2025 ట్రోఫీ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ భారత క్రికెట్ బోర్డు దెబ్బకు దిగొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జీ న్యూస్ కథనం ప్రకారం.. నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అందజేసినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఏసీసీ సమావేశంలో ఈ విషయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అయితే ట్రోఫీ కావాలంటే భారత కెప్టెన్ నేరుగా ఏసీసీ కార్యాలయానికి వచ్చి తీసుకోవాలని నఖ్వీ చెప్పినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.కానీ ఇప్పుడు నఖ్వీ వెనక్కి తగ్గి ట్రోఫీ యూఏఈ క్రికెట్ బోర్డు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయంపై బీసీసీఐ గానీ, యూఏఈ క్రికెట్ బోర్డు గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా ఈ ఏడాది ఆసియాకప్ యూఏఈ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.అసలేంటి ఈ ట్రోఫీ వివాదం..?ఆసియాకప్ విజేతగా నిలిచిన అనంతరం ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి భారత్ నిరాకరించింది. నఖ్వీ ఏసీసీ చైర్మెన్తో పాటు పీసీబీ ఛీప్, పాకిస్తాన్ మంత్రిగా ఉండడమే ఇందుకు కారణం.అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్, యూఏఈ క్రికెట్ బోర్డు చైర్మెన్ చేతులు మీదగా ట్రోఫీని తీసుకుంటామని టీమిండియా తెలియజేసింది. కానీ అందుకు నఖ్వీ అంగీకరించలేదు. దీంతో అతడు ట్రోఫీని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయాడు.అప్పటి నుంచి ఆసియాకప్ ట్రోఫీ అతడి వద్దే ఉంది. కాగా ఫైనల్ మ్యాచ్లో పాక్ను 5 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ టోర్నీ అంతటా పాక్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ చేయడానికి నిరకారించారు. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.చదవండి: IND vs AUS: ఆసీస్పై శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. 413 పరుగులు చేసిన భారత్ -
ఆసియాకప్ తర్వాత టీమిండియా బిజీ బిజీ.. షెడ్యూల్ ఇదే
ఆసియాకప్-2025 ఛాంపియన్స్గా నిలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు వరుస సిరీస్లతో బిజీబిజీగా గడపనుంది. టీమిండియా 3 నెలలపాటు మూడు ఫార్మాట్లలోనూ తలపడనుంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లను భారత్ ఢీకొట్టనుంది. ఈ క్రమంలో 2025 ఏడాదిలో టీమిండియా మిగిలిన షెడ్యూల్పై ఓ లుక్కేద్దాం.వెస్టిండీస్తో రెడ్ బాల్ సమరం..ఆసియాకప్ ముగిసిన మూడు రోజులకే వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. అక్టోబర్ 2 నుంచి ఈ రెడ్ బాల్ సిరీస్ ప్రారంభం కానుంది.🔹వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ షెడ్యూల్1వ టెస్ట్: అక్టోబర్ 2–6, నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్2వ టెస్ట్: అక్టోబర్ 10–14, ఈడెన్ గార్డెన్స్, కోల్కతావిండీస్ సిరీస్ ముగిసిన 5 రోజులకే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, 5 టీ20ల్లో తలపడనుంది. ఈ వైట్బాల్ సిరీస్లు అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి.టీమిండియా ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్ ఇదే..వన్డే సిరీస్:అక్టోబర్ 19: పెర్త్(తొలి వన్డే)అక్టోబర్ 23: అడిలైడ్(రెండో వన్డే)అక్టోబర్ 25: సిడ్నీ(మూడో వన్డే)టీ20 సిరీస్:అక్టోబర్ 29: మనుకా ఓవల్(తొలి టీ20)నవంబర్ 2: మెల్బోర్న్(రెండో టీ20)నవంబర్ 6: హోబర్ట్(మూడో టీ20)నవంబర్ 8: గోల్డ్ కోస్ట్(నాలుగో టీ20)నవంబర్ 10: బ్రిస్బేన్(ఐదో టీ20)ఆ తర్వాత భారత పురుషుల జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్లో తలపడనుంది.భారత్-దక్షిణాఫ్రికా మల్టీ ఫార్మాట్ సిరీస్ షెడ్యూల్ ఇదే..టెస్ట్ సిరీస్:నవంబర్ 14–18: అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ(తొలి టెస్టు)నవంబర్ 22–26: బర్సపారా స్టేడియం, గౌహతి(రెండో టెస్టు)వన్డే సిరీస్:నవంబర్ 30: రాంచీ(తొలి వన్డే)డిసెంబర్ 3: రాయ్పూర్(రెండో వన్డే)డిసెంబర్ 6: విశాఖపట్నం(మూడో టీ20)టీ20 సిరీస్:డిసెంబర్ 9: కటక్(తొలి టీ20)డిసెంబర్ 11: న్యూ చండీగఢ్(రెండో టీ20)డిసెంబర్ 14: ధర్మశాల(మూడో టీ20)డిసెంబర్ 17: లక్నో(నాలుగో టీ20)డిసెంబర్ 19: అహ్మదాబాద్(ఐదో టీ20)👉ఆసీస్, సౌతాఫ్రికాలతో టీ20 సిరీస్లు పొట్టి ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా జరగనున్నాయి. -
ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్కు నఖ్వీ షరతు
ఆసియా కప్ (Asia cup 2025) ట్రోఫీ విషయంలో ఏసీసీ (Asia Cricket Council) అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) మొండిపట్టు వీడటం లేదు. తన వద్ద ఉంచుకున్న ట్రోఫీని నిర్వహకులకు ఇచ్చేయాలని నిన్న (సెప్టెంబర్ 30) జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాథ్యక్షుడు రాజీవ్ శుక్లా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. పైగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు (Surya Kumar Yadav) కొత్త షరతు పెట్టాడు.ట్రోఫీ కావాలంటే స్వయంగా నా ఆఫీస్కు వచ్చి తీసుకోవాలని అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. నఖ్వీ వాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నఖ్వీ ఓవరాక్షన్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నఖ్వీ విషయంలో బీసీసీఐ, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. తక్షణమే అతన్ని ఏసీసీ అధ్యక్ష హోదా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా, ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్న మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరస్కరించాడు. ఇందుకు ప్రతిగా నఖ్వీ భారత ఆటగాళ్లకు అందించాల్సిన మెడల్స్ను, ట్రోఫీని ఎత్తుకెళ్లిపోయాడు. నఖ్వీ ట్రోఫీ ఇవ్వకపోయినా భారత ఆటగాళ్లు కృత్రిమంగా ట్రోఫీని అందుకున్నట్లు సంబురాలు చేసుకున్నారు. దీనిపై నిన్న జరిగిన ఏసీసీ సర్వసభ్య సమావేశం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. అయినా నఖ్వీ మొండిపట్టు వీడలేదు. ట్రోఫీ గురించి ఏజీఎంలో చర్చించాల్సిన అవసరం లేదని, మరో సమావేశంలో మాట్లాడుకుందామని దాటవేశాడు. నఖ్వీ ప్రవర్తనపై యావత్ భారతావణి మండిపడుతుంది. వీడి వేశాలేంట్రా బాబు అని అనుకుంటుంది. ట్రోఫీ తీసుకున్నా, తీసుకోకపోయినా విజేతలం మనమే అని సర్దుకుపోతుంది.చదవండి: అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా.. -
అయ్యయ్యో! పుండు మీద కారం జల్లినట్లుగా..
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించగా.. బీసీసీఐ(BCCI) వెంటనే రూ.21 కోట్లు బోనస్గా ప్రకటించి ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ఇది మన క్రీడాకారుల శ్రమకు గౌరవం, ప్రోత్సాహం, దేశం తరఫున పోరాడినందుకు ఇచ్చే గుర్తింపు అని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. సాధారణంగా రన్నరప్గా నిలిచిన జట్ల ఆటగాళ్లకూ ఆ దేశాలు ఎంతో కొంత ప్రొత్సాహాకం అందిస్తుంటాయి. మరి రన్నరప్గా నిలిచిన పాక్ ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?..ఆసియా కప్లో రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు ఆసియా క్రికెట్ కంట్రోల్ బోర్డు(75,000 డాలర్ల) తరఫున రూ.66.5 లక్షల ప్రైజ్మనీ లభించింది. అంతేగానీ పాక్ క్రికెట్ బోర్డు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి నజరానా ప్రకటించలేదు. దీంతో ఏదైనా నజరానా ప్రకటిస్తారేమోనని ఆటగాళ్లు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో.. అలాంటి ఆశలేం వద్దంటూ ఓ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అది 2009 టీ20 వరల్డ్ కప్ విజేతగా పాక్ నిలిచిన సమయం. ఆ సమయంలో పాక్ ఆటగాళ్లకు నజరానాను ప్రకటించింది అప్పటి యూసఫ్ రజా గిలానీ ప్రభుత్వం. అయితే ప్రధాని స్వయంగా జారీ చేసిన ఆ 25 లక్షల చెక్కు బౌన్స్ అయ్యిందట. దీంతో అప్పటి పీసీబీ చైర్మన్ను ఆటగాళ్లు ఆశ్రయిస్తే.. అది ప్రభుత్వం ఇస్తామన్న నజరానా అని, దాంతో మాకేం సంబంధం అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారట. చివరికి ICC ఇచ్చిన ప్రైజ్ మనీ తప్ప ఆటగాళ్లకు ఇంకేమీ అందలేదు... ప్రభుత్వం ఇచ్చే చెక్కు కూడా బౌన్స్ అవుతుందా? అని పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్(Syeed Ajmal Comments Viral) చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. రెండేళ్ల కిందట నదీర్ అలీ అనే యూట్యూబర్ పాడ్కాస్ట్లో అజ్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు.. పాక్ జట్టులో వ్యక్తిగత విజయాలకూ తగిన గుర్తింపు ఉండదని అన్నాడాయన. 2012, 2013లో ICC టీమ్ ఆఫ్ ది ఇయర్లో తనకి చోటు దక్కినా.. పీబీసీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సాహాకం అందలేని గుర్తు చేసుకుని వాపోయాడు. దీనితో పాక్ ఆటగాళ్ల దుస్థితి ఇలా ఉందంటూ.. సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది.అదే సమయంలో.. మరోవైపు ఏసీసీ అద్యక్షుడైన పీబీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ(Mohsin Naqvi) ఆటగాళ్ల నజరానా గురించి ఆలోచించే స్థితిలో ఏమాత్రం లేడు. ఆయన పరిస్థితి కూడా ‘చంద్రుడి కోసం ఎదురుచూసే చకోర పక్షి’ పరిస్థితిని తలపిస్తోంది. 2025 ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టు.. నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో ఆయన ట్రోఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆయన ట్రోఫీతో పారిపోయాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. ఈ తరుణంలో.. తాజాగా ఏసీసీ మీటింగ్లో ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగానైనా వచ్చి ట్రోఫీ తీసుకెళ్లాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే అది జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీసీసీఐ ఇప్పటికే నఖ్వీ ట్రోఫీ తస్కరించిన వ్యవహారంపై అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంటోంది కూడా. మరోవైపు.. మా టీమ్ మేట్స్, మా సపోర్ట్ స్టాఫ్.. వీళ్లే నా నిజమైన ట్రోఫీలు” అంటూ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ఏరకంగా చూసుకున్నా ట్రోఫీ కోసం నఖ్వీ ఎదురు చూస్తూ ఉండిపోవాల్సిందేనంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇదీ చదవండి: ఆ పాక్ ప్లేయర్కు థ్యాంక్స్.. అతని వల్లే గెలిచాం! -
కెమెరా ముందు అవి చెప్పలేను.. మ్యాచ్ మధ్యలో చాలా రెచ్చగొట్టారు..
-
తిలక్ వర్మకు సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశాడు. పాకిస్తాన్తో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ అజేయ అర్ధ సెంచరీ సాధించి భారత్ను విజయతీరాలకు చేర్చాడు. ఈ సందర్భంగా తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ను, జెర్సీని అందజేశాడు. తిలక్ ఇచ్చిన బ్యాట్తో రేవంత్ రెడ్డి క్రికెట్ షాట్ కొడుతున్న ఫోజు పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ శివసేనారెడ్డి, ‘శాట్స్’ ఎండీ సోనీ బాలాదేవి, సీఎం ముఖ్యకార్యదర్శి శ్రీనివాస్ రాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆశలు వమ్ము చేయకూడదని... శేరిలింగంపల్లి: పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో ఎంతో ఒత్తిడి ఉన్నా... ప్రత్యర్థి ఆటగాళ్లు ఎంత రెచ్చగొట్టినా... ఎక్కడా సంయమనం కోల్పోలేదని... వారికి తన బ్యాట్తోనే సమాధానం ఇచ్చానని తిలక్ వర్మ వ్యాఖ్యానించాడు. చిన్ననాటి నుంచి తాను ప్రాక్టీస్ చేసిన శేరిలింగంపల్లిలోని లేగలా క్రికెట్ అకాడమీకి మంగళవారం తిలక్ వచ్చాడు. ఈ సందర్భంగా తన కోచ్ సలామ్ బాయష్, అకాడమీ ఎండీ పృథ్వీ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ‘కోట్లాది మంది భారతీయుల ఆశలను వమ్ము చేయకూడదనుకున్నాను. చివర్లో ఒత్తిడి వచ్చినా... దేశం కోసం ఆడాలి, గెలిపించాలన్న లక్ష్యంతో ఓపికగా ఆడాను. హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతో ప్రోత్సహించారు. నేనీ స్థాయికి చేరుకోవడం వెనుక కోచ్ సలామ్, పృథ్వీ పాత్ర ఎంతో ఉంది. ఈ ఇద్దరినీ ఎప్పటికి మర్చిపోలేను. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. ఈ విషయంలో కోహ్లి, రోహిత్ శర్మలు ఆదర్శం’ అని తిలక్ తెలిపాడు. -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: యువ క్రికెటర్ తిలక్ వర్మ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy)ని కలిశారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసియా కప్ ఫైనల్లో పాక్పై అద్భుతంగా ఆడి భారత్ను గెలిపించిన తిలక్ను.. సీఎం రేవంత్ సత్కరించి అభినందించారు. అనంతరం సీఎంకు తిలక్వర్మ బ్యాటును బహురించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. యువ క్రికెటర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మను సత్కరించి, అభినందించాను. క్రికెట్ బ్యాట్ ను ఆయన నాకు బహూకరించారు.కార్యక్రమంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శ్రీ శివసేనా రెడ్డి… pic.twitter.com/o8x5b9Eusc— Revanth Reddy (@revanth_anumula) September 30, 2025 -
ఆ పాక్ ఆటగాడికి థ్యాంక్స్.. అతడి వల్లే గెలిచాము: అశ్విన్
ఆసియాకప్-2025ను సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ను ఓడించి టైటిల్ను భారత్ ముద్దాడింది. ఈ విజయంలో భారత టాపార్డర్ బ్యాటర్ తిలక్ వర్మది కీలక పాత్ర. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ తమ మార్క్ చూపించలేకపోయారు. ఈ సమయంలో తిలక్ వర్మ(69) జట్టు బాధ్యతను తన భుజానపై వేసుకున్నాడు. ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. దీంతో తిలక్ వర్మపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేరాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన తిలక్ వర్మను అశూ ప్రశంచాడు. ఈ లెజెండరీ స్పిన్నర్ సెటైరికల్గా పాకిస్తాన్ పేసర్ హరిస్ రౌఫ్కు కూడా కృతజ్ఞతలు తెలిపాడు.భారత్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో రవూఫ్ తన ఓవరాక్షన్తో వార్తల్లో నిలిచాడు. మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా అభిమానులు కోహ్లి, కోహ్లి అని అరవగా.. రవూఫ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సైగలు చేశాడు.దీంతో అతడిపై భారత అభిమానులు ఫైరయ్యారు. ఫైనల్లో మ్యాచ్లో భారత బ్యాటర్లు అతడిని ఉతికారేశారు. అతడు ఓకే ఓవర్లో ఏకంగా 17 పరుగులు ఇచ్చాడు. అతడు కేవలం 3.4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చి పాక్ ఓటమికి, భారత్ గెలుపునకు పరోక్షంగా కారణమయ్యాడు. ఈ కారణంతోనే అతడికి అశ్విన్ ధన్యవాదాలు తెలిపాడు."తిలక్ వర్మ తన అద్బుతమైన ఇన్నింగ్స్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్లో అతడు తన పరిపక్వతను చూపించాడు. తిలక్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంతచెప్పుకొన్న తక్కువే. తిలక్ వర్మ ఒత్తిడిని తట్టుకుని ఆడాడు. స్పిన్నర్లను కూడా అద్బుతంగా ఎదుర్కొన్నాడు. అదేవిధంగా హారిస్ రవూఫ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అతడి బౌలింగ్ వల్లే మేము సునాయసంగా మ్యాచ్ను గెలిచాము. తిలక్ వికెట్ పై బౌన్స్ కొంచెం ఉందని గ్రహించి స్క్వేర్ గా ఆడటం ప్రారంభించాడు. అతడి షాట్ సెలక్షన్ కూడా బాగుంది.హరిస్ రౌఫ్ వేసిన ఆఖరి ఓవర్లో తిలక్ వర్మ కొట్టిన సిక్స్ చాలా సులభం అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆ షాట్ ఆడటం చాలా కష్టం. లైన్ లో పడిన బంతిని పిక్ చేయడం అంత సులువు కాదు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లు కూడా బాగా బౌలింగ్ చేశారు. వారి కమ్బ్యాక్ వల్లే పాక్ను 150 పరుగులు లోపు కట్టడి చేయగలిగాము" అని తన యూట్యూబ్ ఛానెల్ అశ్విన్ పేర్కొన్నాడు. -
'అతడు కోచ్గా పనికిరాడు.. చెత్త కెప్టెన్సీ కూడా'.. పాక్ టీమ్పై అక్తర్ ఫైర్
ఆసియాకప్ 2025 ఫైనల్లో భారత్ చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 146 పరుగులకు ఆలౌటైంది. ఒకనొక దశలో స్కోర్ బోర్డు 200 పరుగులు దాటేలా కన్పించినప్పటికి భారత బౌలర్లు కమ్బ్యాక్ ఇవ్వడంతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో భారత్ తడబడినప్పటికి.. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ(69) అద్భుతపోరాటంతో జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో లెజెండరీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్పై విమర్శలు గుప్పించాడు. జట్టు ప్లానింగ్ లో లోపాలు ఉన్నాయని, యువ ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని అక్తర్ మండిపడ్డాడు."టీమ్ మెనెజ్మెంట్ సరైన వ్యూహాలను రచించడంలో పూర్తిగా విఫలమైంది. సెన్స్లెస్ కోచింగ్. హెడ్ కోచ్ ఏమి నిర్ణయాలు తీసుకుంటున్నాడో నాకు ఆర్ధం కావడం లేదు. అతడు కోచ్గా పనికిరాడు. ఇలా కఠినంగా మాటలు ఆడుతున్నందుకు క్షమించండి. జట్టు సెలక్షన్ కూడా బాగోలేదు. యువ ఆటగాడు హసన్ నవాజ్ను మళ్లీ బెంచ్కే పరిమితం చేశారు. అతడొక మ్యాచ్ విన్నర్. అయినా అతడిని ఆడించడం లేదు. అంతేకాకుండా పేసర్ సల్మాన్ మీర్జా ఓ అవకాశమివ్వాల్సింది. ఒక్క మ్యాచ్లో కూడా అతడిని ఆడించలేదు. ఈ ఓటమి మమ్మల్ని చాలా బాధించింది. దేశం మొత్తం గెలుపు కోసం ఎదురు చూసింది. కానీ మరోసారి మమ్మల్ని నిరాశపరిచారు. మిడిలార్డర్లో బ్యాటింగ్ కష్టాలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. అందరికి ఆ విషయం తెలుసు. కానీ అందుకు పరిష్కారం మాత్రం మెనెజ్మెంట్ వెతకడం లేదు.మిడిలార్డర్లో మొహమ్మద్ నవాజ్పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అంతేకాకుండా లోయార్డర్లో బ్యాటర్లు కనీసం 50 పరుగులు జోడించాలని ఆశిస్తున్నారు. కొన్ని సార్లు షాహీన్ అఫ్రిదిని ఫహీమ్ అష్రఫ్ కంటే ముందు బ్యాటింగ్ పంపుతున్నారు. ఆఖరిలో వారు రాణిచండం వల్లే 175 పరుగులకు చేరుకోగల్గుతున్నారు. ఏదేమైనప్పటికి చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది.సల్మాన్ కెప్టెన్సీ కూడా బాగోలేదు. బౌలింగ్ మార్పులు చేయడంలో అతడు విఫలమయ్యాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నప్పుడు.. హారిస్ రౌఫ్ను తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అతడు ఒకే ఓవర్లో 17 పరుగులు ఇచ్చాడు. ఇదే మ్యాచ్ను టర్న్ చేసింది. పాక్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి" అని తప్మాడ్ అనే ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. -
రోహిత్ శర్మ భార్య రితిక సలహా.. అలా చేశా..
హిట్మాన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దేహ్ సలహా పాటించానంటున్నాడు టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav). ఆ సలహా పాటించడం వలన తనకు మంచే జరిగిందంటున్నాడు స్కై. ఇంతకీ ఏ విషయంలో ఆమె సలహా పాటించాడో తెలుసా?చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఉత్కంఠపోరులో గెలిచి ఆసియా కప్ 2025 (Asia Cup 2025) కైవసం చేసుకోవడంతో మెన్ ఇన్ బ్లూ పిచ్చ హ్యాపీ మూడ్లో ఉంది. సిరీస్ ఆరంభం నుంచి చివరి వరకు సమిష్టిగా రాణించి కప్ అందుకోవడంతో బీసీసీఐతో పాటు ఫ్యాన్స్ కూడా సూర్య సేనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వ్యక్తిగతంగా విఫలమైనప్పటికీ జట్టును విజేతగా నిలపడంలో సక్సెస్ అయ్యాడు సూర్య. పదునైన వ్యూహాలతో మైదానంలో జట్టును ముందుండి నడిపించి విజయపథంలో నిలిపాడు. హ్యాండ్షేక్ లేని సంఘటన నుంచి చివరి రోజు ట్రోఫీ లేని వేడుకల వరకు వరుస వివాదాలు నడుమ కూల్గా నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించాడు. పాకిస్థాన్ జట్టుతో వ్యవహరించిన తీరుతో టీమిండియా అభిమానులకు మరింత దగ్గరయ్యాడు.అదే ఫాలో అవుతున్నాతాను కూల్గా ఉండటానికి రోహిత్ శర్మ వైఫ్ రితిక ఇచ్చిన సలహా ఉపయోగపడిందని సూర్యకుమార్ వెల్లడించాడు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్తో అతడు మాట్లాడుతూ.. మేజర్ టోర్నమెంట్లు ఆడటానికి ముందు రోహిత్ శర్మ సోషల్ మీడియాకు (Social Media) దూరంగా ఉంటాడని రితిక చెప్పిందని తెలిపాడు. తాను కూడా అదే ఫాలో అవుతున్నానని చెప్పాడు. ఆసియాకప్ ఆడటానికి ముందు తన ఫోన్లోని సోషల్ మీడియా యాప్స్ అన్ని తొలగించినట్టు రివీల్ చేశాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండడంతో ప్రశాంతత లభించడంతో పాటు డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ అయిందన్నాడు.ఆ యాప్స్ తీసేశా'ఆసియాకప్ ఆడేందుకు దుబాయ్ రావడానికి ముందు నా ఫోన్లోని ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్ యాప్స్ డిలీట్ చేశాను. కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ ఒకటే ఉంచాను. మన ఫోన్లో సోషల్ మీడియా యాప్స్ ఉంటే అందులో వచ్చే మెసేజ్లు అన్ని చూడాలనిపిస్తుంటుంది. మెగా టోర్నమెంట్లు ఆడటానికి ముందు రోహిత్ శర్మ (Rohit Sharma) సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడని రితిక చెప్పిన విషయం నాకు బాగా గుర్తుంది. రోహిత్ తన ఫోన్లోని యాప్స్ తొలగిస్తాడని ఆమె చెప్పింది. దీన్ని నేను కూడా ఫాలో అవుతున్నాడు. దీనివల్ల నాకు మంచే జరిగింద'ని సూర్యకుమార్ చెప్పాడు. చదవండి: మా ఆటగాళ్లంతా ఒక్కో ట్రోఫీతో సమానం -
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్లో ఆడేందుకు ఆటగాళ్లకు మంజారు చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది. ఆసియాకప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి దృష్ట్యా పీసీబీ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆసియాకప్లో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 28) దుబాయ్ వేదికగా జరిగిన తుది పోరులో 5 వికెట్ల తేడాతో పాక్ను టీమిండియా చిత్తు చేసింది. ఈ మెగా టోర్నీలో పాక్ జట్టు వరుసగా మూడో సారి చిరకాల ప్రత్యర్ధి చేతిలో ఓడిపోయింది. ఈ వరుస ఓటములను పీసీబీ జీర్ణించుకోలేకపోతుంది. దీంతో టీ20 వరల్డ్కప్-2026ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లను మరింత రాటు దేల్చాలని పాక్ క్రికెట్ సిద్దమైంది. ఆసియాకప్ పాక్ జట్టులో చోటు కోల్పోయిన బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్లతో పాటు మొత్తం ఏడుగురు ఆటగాళ్లు బిగ్ బాష్ లీగ్ 2025-26లో ఆడాల్సి ఉంది. వీరిందరికి పీసీబీ ఇప్పటికే ఎన్వోసీ కూడా మంజారు చేసుకుంది. ఇప్పుడు పీసీబీ ఆకస్మిక నిర్ణయంతో వారి బిగ్ బాష్ లీగ్ భవితవ్యం సందిగ్ధంలో పడినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తమ కథనంలో పేర్కొంది. ఆజాం, రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిలు ఇంటర్ననేషన్ టీ20 లీగ్ వేలంలో కూడా తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు."పీసీబీ చైర్మెన్ ఆమోదంతో పాటు విదేశీ టోర్నమెంట్లలో పాల్గొనడానికి ఆటగాళ్లకు మంజారు చేసిన అన్ని నిరభ్యంతర సర్టిఫికెట్లు (ఎన్ఓసీలు) తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి" అని పీసీబీ సుమైర్ అహ్మద్ సయ్యద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఇప్పటివరకు తమ కాంట్రాక్ట్ కలిగి ఉన్న ఆటగాళ్లు 12 నెలల వ్యవధిలో రెండు విదేశీ టీ20 లీగ్స్లో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అనుమతి ఇచ్చింది. తాజాగా రెండు లీగ్స్లో ఆడేందుకు కూడా అనుమతిని పీసీబీ నిరాకరించింది.చదవండి: టీమిండియాకు బ్యాడ్ న్యూస్ -
హైదరాబాద్లో సందడి చేసిన ఆసియా కప్ ఫైనల్ హీరో
సెప్టెంబర్ 28న పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia Cup 2025) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి భారత్ను ఒంటిచేత్తో గెలిపించిన హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma).. ఇవాళ నగరంలో సందడి చేశాడు. తాను చిన్నతనంలో శిక్షణ పొందిన లేగాలా క్రికెట్ అకాడమీని (Legala Cricket Academy) సందర్శించాడు. తిలక్ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు. తిలక్కు, అతని కోచ్ సలామ్ బయాష్కు అకాడమీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా గెలవడం చాలా సంతృప్తినిచ్చింది. ఆ మ్యాచ్లో టీమిండియాను గెలిపించడమే టార్గెట్గా పెట్టుకొని ఆడాను. ఆ సమయంలో మా కళ్ల ముందు దేశమే కనిపించింది. నేను ఆడిన ఇన్నింగ్స్లలో ఇదే అత్యుత్తమమైంది. ఫైనల్లో పాక్ ఆటగాళ్ల స్టెడ్జింగ్ మాపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. విరాట్ కోహ్లి నాకు ఎంతో స్పూర్తినిచ్చాడు. విరాట్ కోహ్లితో నన్ను పోల్చడం గర్వంగా ఉందని అన్నాడు.కాగా, 23 ఏళ్ల తిలక్కు లెగాలా క్రికెట్ అకాడమీనే పునాది. లింగంపల్లి ప్రాంతంలో ఉన్న ఈ అకాడమీ తిలక్కు క్రికెట్లో తొలి పాఠాలు నేర్పింది. కోచ్ సలాం బయాష్ మార్గదర్శకత్వంలో తిలక్ 11 ఏళ్ల వయసులోనే ప్రతిభను చాటాడు. తిలక్ ఇంటి నుంచి అకాడమీకి రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వచ్చేది.కోచ్ సలాం బయాష్ తిలక్ను స్వయంగా తన వాహనంలో తీసుకొచ్చి, తిరిగి ఇంటికి చేర్చేవాడు. 2020లో తిలక్ అండర్-19 వరల్డ్కప్కు ఎంపిక కావడంలో అకాడమీ పాత్ర చాలా కీలకం. తిలక్ టీమిండియాకు ఎంపికయ్యే వరకు వారానికి నాలుగు రోజుల పాటు అకాడమీకి వెళ్లేవాడు. ఆసియా కప్ హీరోయిక్స్ తర్వాత తిలక్ హైదారాబాద్ యువతకు స్పూర్తిగా మారాడు. చదవండి: టీమిండియాకు బ్యాడ్ న్యూస్ -
కొనసాగుతున్న ఆసియా కప్ హైడ్రామా.. ట్రోఫీ తిరిగి ఇచ్చేందుకు షరతులు పెట్టిన నఖ్వీ
ఆసియా కప్ 2025 (Asia cup 2025) హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. టోర్నీ ముగిసి రెండు రోజులైనా ఛాంపియన్గా నిలిచిన భారత జట్టుకు (Team India) విన్నింగ్ ట్రోఫీ అందలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీద నుంచి విన్నింగ్ ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా నిరాకరించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా నఖ్వీ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ను తీసుకెళ్లిపోయాడు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకున్నా గెలుపు సంబురాలు అద్భుతంగా చేసుకున్నారు.తాజాగా నఖ్వీ తాను ఎత్తుకెళ్లి పోయిన ట్రోఫీని, మెడల్స్ను భారత ఆటగాళ్లకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించినట్లు తెలుస్తుంది. అయితే ఇందుకు ఓ కండీషన్ పెట్టాడట. అతనే స్వయంగా భారత కెప్టెన్కు ట్రోఫీని, మిగతా ఆటగాళ్లకు మెడల్స్ను ఇస్తానని చెప్పాడట. నఖ్వీ పెట్టిన ఈ కండీషన్కు భారత ఆటగాళ్లు ససేమిరా అన్నట్లు సమాచారం. ఈ వివాదం అతి త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ (సెప్టెంబర్ 30) జరుగబోయే ఏసీసీ సమావేశంలో బీసీసీఐ నఖ్వీని తూర్పారబెట్టాలని డిసైడైంది. ఇది అతని పదవికే ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ఈ వివాదాన్ని బీసీసీఐ ఐసీసీ వరకు కూడా తీసుకెళ్లకుండా ఏసీసీలోనే తెంచేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది.కాగా, సెప్టెంబర్ 28న జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు.ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు సార్లు పాక్ను ఓడించింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్షేక్ను నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పీసీబీ నానా యాగీ చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.తమకు అనుకూలంగా ఏదీ జరగడం లేదని తెలిసి పీసీబీ వారి ఆటగాళ్లను రెచ్చగొట్టింది. భారత్ను, భారత ఆటగాళ్లను ఉద్దేశిస్తూ పాక్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ చాలా ఓవరాక్షన్ చేశారు. దీనికి కూడా పాక్ ఆటగాళ్లు మూల్యం చెల్లించుకున్నారు. పాక్ ఆటగాళ్ల కవ్వింపులకు ఎక్కడా సహనం కోల్పోని టీమిండియా మైదానంలో వారికి తగు రీతో బద్ది చెప్పింది.చదవండి: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్ను మట్టికరిపించిన పసికూన -
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన వికెట్కీపర్ బ్యాటర్గా అవతరించాడు. తాజాగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో సంజూ ఈ ఘనత సాధించాడు. ఎంఎస్ ధోని (MS Dhoni) పేరిట ఉండిన ఈ రికార్డును సంజూ తన పేరిట బదిలి చేసుకున్నాడు.పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో (Asia Cup 2025) సంజూ ఓ సిక్సర్ కొట్టాడు. దీంతో కలుపుకొని టీ20ల్లో అతని సిక్సర్ల సంఖ్య 55కి చేరింది. కేవలం 48 ఇన్నింగ్స్ల్లోనే సంజూ ఈ సిక్సర్లను బాదాడు. ధోని విషయానికొస్తే.. అతని ఖాతాలో 54 టీ20 సిక్సర్లు ఉన్నాయి. ఈ విభాగంలో సంజూ, ధోని తర్వాతి స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. పంత్ ఖాతాలో 52 సిక్సర్లు ఉన్నాయి.ఆసియా కప్లో సంజూ మరో ఘనత కూడా సాధించాడు. ఓ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత వికెట్కీపర్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఈ టోర్నీలో సంజూ మొత్తం 7 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు ధోని, పంత్ పేరిట సంయుక్తంగా ఉంది. ధోని 2009 టీ20 వరల్డ్కప్లో, పంత్ 2024 టీ20 వరల్డ్కప్లో తలో 6 సిక్సర్లు బాదారు.కాగా, ఆసియా కప్ 2025లో భారత్ విజేతగా అవతరించింది. ఫైనల్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, 9వ సారి ఆసియా ఛాంపియన్గా నిలిచింది. ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తొలుత తడబడినప్పటికీ.. తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు. ఈ టోర్నీలో భారత్ మొత్తం మూడు సార్లు పాక్ను ఓడించింది. చదవండి: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్ను మట్టికరిపించిన పసికూన -
విరాట్ కోహ్లీని అధిగమించిన తిలక్ వర్మ
ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) పాకిస్తాన్పై భారత్ (India vs Pakistan) విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) తన కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 147 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో తిలక్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 53 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఫహీమ్ అష్రఫ్ ధాటికి టాపార్డర్ కుప్పకూలిన వేల తిలక్ ప్రశాంతంగా, సమర్థంగా ఇన్నింగ్స్ను పునర్నిర్మించాడు. సంజు శాంసన్, శివమ్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బౌండరీలు, సిక్సర్లు బాదడంతో పాటు స్ట్రైక్ రొటేషన్లో తన నైపుణ్యాన్ని చూపించాడు. ఈ ఇన్నింగ్స్కు గానూ తిలక్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సూపర్ సిక్సర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు లభించాయి.ఈ టోర్నీలో తిలక్ 7 మ్యాచ్ల్లో 71.00 సగటున, 131.48 స్ట్రైక్ రేట్తో 213 పరుగులు చేశాడు. మొత్తం T20I కెరీర్లో 32 మ్యాచ్లు ఆడిన తిలక్.. 53.44 సగటున, 149.14 స్ట్రైక్ రేట్ 962 పరుగులు చేశాడు.కోహ్లీని అధిగమించిన తిలక్ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. తిలక్ వర్మ 30 T20I ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక సగటు కలిగిన భారత బ్యాటర్గా విరాట్ కోహ్లీని (Virat Kohli) అధిగమించాడు.30 T20I ఇన్నింగ్స్ల తర్వాత అత్యధిక సగటు కలిగిన భారత బ్యాటర్లు:తిలక్ వర్మ- 53.4విరాట్ కోహ్లీ- 50.7మనీష్ పాండే- 43.1కేఎల్ రాహుల్- 41.9సూర్యకుమార్ యాదవ్- 39.0ఛేజింగ్లో మొనగాడుఅంతర్జాతీయ టీ20ల్లో తిలక్కు ఛేజింగ్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 11 ఇన్నింగ్స్ల్లో ఏకంగా 92.50 సగటున, 134.54 స్ట్రైక్ రేట్తో 370 పరుగులు చేశాడు. ఛేజింగ్లో ఇంత అద్భుతమైన సగటు చాలా తక్కువ మందికి ఉంది.ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన తిలక్ వర్మ, క్రమంగా భారత జట్టులో నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్గా ఎదిగాడు. ఒత్తిడిలో ఇన్నింగ్స్ నిర్మించడం, మ్యాచ్ ఫినిష్ చేయడం వంటి అంశాల్లో తిలక్ ఇప్పటికే తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు.ఇదిలా ఉంటే, నిన్న (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాక్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, 9వ సారి ఆసియా ఛాంపియన్గా అవతరించింది.ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం ఆదిలో తడబడినప్పటికీ.. తిలక్ వర్మ అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు.చదవండి: Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ చేశాడని పాకిస్తాన్ కెప్టెన్ కూడా..! -
Asia Cup 2025: సూర్యకుమార్ యాదవ్ చేశాడని పాకిస్తాన్ కెప్టెన్ కూడా..!
నిన్న (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025) భారత్ పాకిస్తాన్ను (India vs Pakistan) చిత్తుగా ఓడించి 9వ సారి టైటిల్ను (వన్డే, టీ20) కైవసం చేసుకుంది. టీమిండియా (Team India) టైటిల్ గెలిచిన అనంతరం చాలా హైడ్రామా చోటు చేసుకుంది.భారత ఆటగాళ్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్కు ఛైర్మన్గా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించారు. దీనికి ప్రతిగా నఖ్వీ టీమిండియాకు ఇవ్వాల్సిన ట్రోఫీని, మెడల్స్ను ఎత్తుకెళ్లిపోయాడు.భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సంబురాలు చేసుకొని నఖ్వీ పుండుపై కారం చల్లారు. మధ్యలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా నఖ్వీ చేతి నుంచి అందుకున్న రన్నరప్ చెక్ను అక్కడే పడేసి ఓవరాక్షన్ చేశాడు. పహల్గాం ఉగ్రవాడికి ప్రతిగా భారత ఆటగాళ్లు ఈ టోర్నీ ఆరంభం నుంచి పాక్ ఆటగాళ్లకు హ్యాండ్ షేక్ను నిరాకరించిన విషయం తెలిసిందే. ఫైనల్ సహా ఇరు జట్లు తలపడిన మూడు సందర్భాల్లో ఇదే జరిగింది.ఈ హైడ్రామా నడుమ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సంచలన నిర్ణయం తీసుకొని పాకిస్తానీల గుండెల్లో అగ్గి రాజేస్తూ, తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆసియా కప్ ద్వారా అతనికి లభించబోయే మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని పహల్గాం ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు, అలాగే భారత సాయుధ దళాలకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.స్కై తీసుకున్న ఈ నిర్ణయంపై యావత్ భారతావణి హర్షం వ్యక్తం చేస్తుంది. భారతీయులంతా స్కైను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. స్కైను కాపీ కొడుతూ పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా (Salman Agha) 'ఆపరేషన్ సిందూర్' బాధితులకు తన ఆసియా కప్ మ్యాచ్ ఫీజ్ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.కాగా, నిన్న జరిగిన ఫైనల్లో పాకిస్తాన్పై టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తడబడింది. అయితే తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు.చదవండి: Asia Cup: సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం.. -
ఆటలోనే కాదు.. సంపదలోనూ తిలక్వర్మ భేష్
భారత్ నిన్న జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్లో ఘన విజయ సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మ కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచ్లో 69 పరుగులు చేసి టైటిల్ గెలిచేందుకు కృషి చేశారు. క్రీడా రంగంలో ఆయన విజయాలు ఎంతగానో ప్రశంసించదగినవి. అదే సమయంలో బిజినెస్ కోణంలో కూడా ఆయన ఎదుగుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ లైఫ్స్టైల్, కార్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల గురించి తెలుసుకుందాం.లగ్జరీ కార్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు..తిలక్ వర్మ వద్ద మెర్సిడెజ్ జెంజ్ ఎక్స్-క్లాస్ మోడల్ ఉంది. దీని ధర సుమారు రూ.1.7 కోట్లుగా ఉంది. దాంతోపాటు బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు కూడా ఉంది. దీని ధర దాదాపు రూ.1.8 కోట్లు. ఇటీవల తన తల్లిదండ్రులకు మహీంద్రా థార్ మోడల్ కారును బహుమతిగా ఇచ్చిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు, బీసీసీఐ కాంట్రాక్ట్ల ద్వారా ఈయన నెలవారీ ఆదాయం రూ.20–25 లక్షలుగా ఉందని అంచనా. 2025 ఐపీఎల్ వేలంలో రూ.8 కోట్లు సమకూరాయి. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చే ఆదాయం నెలకు రూ.40–50 లక్షలుగా ఉంది. ఇన్స్టాగ్రామ్లో(Instagram) ఈయనకు 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఇదీ చదవండి: స్విస్ వాచ్లు, చాక్లెట్లు, సైకిళ్ల ధరలు తగ్గింపుఎండార్స్ చేస్తున్న బ్రాండ్లు (2025)బిగ్బాస్కెట్బాంబే షర్ట్ కంపెనీబూస్ట్ ఎనర్జీ -
అంత పొగరా?.. స్టేజ్ పైనే చెక్ను విసిరేసిన పాక్ కెప్టెన్! వీడియో
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్లు మూడు సార్లు తలపడ్డాయి. మూడు సార్లు కూడా పాక్కు జట్టుకు భారత్ చేతిలో పరాభావం ఎదురైంది. లీగ్ స్టేజి, సూపర్-4లో టీమిండియాపై ఓటమి చవిచూసిన పాకిస్తాన్కు ఇప్పుడు ఫైనల్లో కూడా భంగపాటు తప్పలేదు.ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన తుది పోరులో 5 వికెట్ల తేడాతో పాక్పై భారత్ ఘన విజయం సాధించింది. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ ఆటగాళ్లు జీర్ణించుకులేకపొతున్నారు. అంతకుతోడు భారత ఆటగాళ్లు కనీసం కరచాలనం చేయకపోవడం, ఫైనల్ ప్రెజెంటేషన్ వేడుకలలో వారితో కలిసి పాల్గోకపోవడంతో దాయాది ఆటగాళ్లు ఫ్రస్టేషన్ పీక్స్ చేరింది.ఫైనల్ మ్యాచ్ ముగిసినంతరం ఏసీసీ ఛీప్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. పాక్ ఆటగాళ్లు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీకు సిద్దంగా ఉన్నప్పటికి భారత ఆటగాళ్లు మాత్రం వేదిక దగ్గరకు కూడా రాలేదు. దీంతో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీ దాదాపు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్ను తీసుకున్నారు.పాక్ కెప్టెన్ ఓవరాక్షన్..ఈ క్రమంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు ఆసియన్ క్రికెట్ కౌన్సెల్ (ఏసీసీ) చైర్మెన్, ఏసీసీ ప్రతినిథి ఆమినుల్ ఇస్లాం రన్నరప్ టైటిల్ అందజేశారు. అయితే ఇక్కడే సల్మాన్ అలీ ఓవరాక్షన్ చేశాడు. చెక్కు తీసుకున్న పాక్ కెప్టెన్ వెంటనే స్టేజ్ మీద నుంచి కిందకు విసిరేశాడు.అతడి తీరుతో వేదిక మీద ఉన్న వారు షాక్కు గురయ్యారు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆసియా కప్ టైటిల్ అందుకోవడానికి ఇష్టపడకపోవడంతో సల్మాన్ ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్టేజిపై నుంచి కిందకు వస్తుండగా సల్మాన్ను భారత్ ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ హేళన చేశారు. దీంతో అతడు చేసేదేమి లేక నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మరి అంత పొగరు పనికిరాదు అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్Salman agha gadiki ekkado kalinattu vundi lucha gadu🤣🤣🤣 #INDvPAK pic.twitter.com/GkEn7deKZj— 𝙸𝚝𝚊𝚌𝚑𝚒 ❟❛❟ (@itachiistan1) September 28, 2025 -
చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్.. ఆసియాకప్ హిస్టరీలోనే
ఆసియాకప్-2025లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కుల్దీప్ తన స్పిన్ మ్యాజిక్తో పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. చెలరేగి ఆడుతున్న పాక్ బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేశాడు.కుల్దీప్ యాదవ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో కుల్దీప్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా కుల్దీప్ నిలిచాడు. పాక్ బ్యాటర్ సైమ్ అయూబ్ను ఔట్ చేసినంతరం ఈ రికార్డును కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ పేరిట ఉండేది.తాజా మ్యాచ్తో మలింగ(33 వికెట్లు) ఆల్టైమ్ రికార్డును యాదవ్ బ్రేక్ చేశాడు. కుల్దీప్ తన ఆసియాకప్(వన్డే, టీ20)లో ఇప్పటివరకు 36 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ఆసియాకప్లో ఏడు మ్యాచ్లు ఆడిన కుల్దీప్ మొత్తంగా 17 వికెట్లు పడగొట్టాడు.అంతేకాకుండా ఒక ఆసియాకప్ ఏడిషన్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్గా కూడా కుల్దీప్ రికార్డు స్పష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉంది. ఆసియాకప్-2004లో పఠాన్ 14 వికెట్లు పడగొట్టాడు. తాజా ఎడిషన్లో 17 వికెట్లు సాధించిన కుల్దీప్.. పఠాన్ను అధిగమించాడు. కాగా ఫైనల్లో పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో రికార్డు స్ధాయిలో తొమ్మిదోసారి ఆసియాకప్ను భారత్ కైవసం చేసుకుంది.ఆసియాకప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు..కుల్దీప్ యాదవ్(భారత్)-36లసిత్ మలింగ(శ్రీలంక)-33ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)-30చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్ -
సూర్యకుమార్ యాదవ్ సంచలన నిర్ణయం..
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన దేశభక్తిని చాటుకున్నాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో తను ఆడిన మ్యాచ్ల ఫీజుల మొత్తాన్ని భారత సైన్యంతో పాటు పహల్గాం ఉగ్రదాడిలో బాధితులైన కుటుంబాలకు సూర్య విరాళంగా ఇచ్చాడు.ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ అనంతరం సూర్య తన నిర్ణయాన్ని వెల్లడించాడు. "ఆసియాకప్ టోర్నీలో వచ్చే నా మొత్తం మ్యాచ్ ఫీజును పహల్గామ్ ఉగ్రవాద దాడిలో బాధితులైన కుటంబాలకు, మన సాయుధ దళాలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీరు ఎల్లప్పుడూ నా ఆలోచనలలో ఉంటారు. జై హింద్." అని ఎక్స్లో స్కై పేర్కొన్నాడు. ఈ ఖండాంతర టోర్నీలో మిస్టర్ 360 మొత్తం 7 మ్యాచ్లు ఆడాడు. ఒక్కో మ్యాచ్కు రూ. 4 లక్షలు అందుకుంటున్నాడు. ఈ ఏడు మ్యాచ్లకు గానూ రూ.28 లక్షలు మ్యాచ్ ఫీజు రూపంలో సూర్యకి దక్కనుంది. అయితే పాకిస్తాన్పై లీగ్ మ్యాచ్ విజయాన్ని సాయుధ దళాలకు అంకితం చేసినందుకు సూర్య మ్యాచ్ ఫీజులో ఐసీసీ 30 శాతం కోత విధించింది.దీంతో అతడు రూ. 26.80 లక్షలు డొనేట్ చేయనున్నాడు. కాగా ఆదివారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాక్ను భారత్ ఓడించింది. టీమిండియా ఆసియాకప్ను కైవసం చేసుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. పాక్పై గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. కాగా టోర్నీ ఆరంభం నుంచే పాకిస్తాన్పై భారత్ తమ నిరసనను తెలియజేసింది. పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ టోర్నీ మొత్తంగా పాక్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయలేదు. ఆఖరికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని కూడా భారత్ తీసుకోలేదు.చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్ -
ట్రోఫీ, మెడల్స్ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్
ఆసియాకప్-2025 ఛాంపియన్స్గా టీమిండియా నిలిచిన అనంతరం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని స్వీకరించడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు.ప్రోటోకాల్ ప్రకారం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాస్ అయిన మొహ్సిన్ నఖ్వీనే విజేతకు ట్రోఫీ అందించాలి. కానీ భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ట్రోఫీని అతడి నుంచి తీసుకోవాడనికి మెన్ ఇన్ బ్లూ సముఖత చూపలేదు.దీంతో దాదాపు గంట అలస్యంగా ప్రారంభమైన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కేవలం పాక్ ఆటగాళ్లే రన్నరప్ మెడల్స్ను అందుకున్నారు. అయితే భారత జట్టు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని తెలియజేసింది. అందుకు వారిద్దరూ అంగీకరించారు. కానీ మొహ్సిన్ నఖ్వీ మాత్రం తానే అందిస్తానని మొండిపట్టు పట్టాడు. దీంతో టీమిండియా పూర్తిగా ట్రోఫీనే తీసుకోమని తేల్చి చెప్పేసింది. భారత్ తీరుతో సహనం కోల్పోయిన పీసీబీ చీఫ్.. ఆసియా కప్ ట్రోఫీతో పాటు, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ను హోటల్కు తీసుకువెళ్లిపోయాడు. ఈ క్రమంలో నఖ్వీ వ్యవహరించిన తీరు పట్ల సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. మొహ్సిన్ నఖ్వీ చర్యను భారత క్రికెట్ బోర్డు సీరియస్గా తీసుకుంటున్నట్లు సైకియా తెలిపారు.బీసీసీఐ సీరియస్.."భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. పాకిస్తాన్ సీనియర్ లీడర్స్లో ఒకరిగా ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ కొనసాగుతున్నారు. అటువంటి అప్పుడు అతడి చేతుల మీదగా ట్రోఫీని ఎలా తీసుకుంటాము? అతడి నుంచి మేము ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకూడదని ముందే నిర్ణయించుకున్నాము. అతడు చేతుల మీదగా తీసుకోవడం లేదంటే ట్రోఫీ వద్దని కాదు. ట్రోఫీని, పతకాలను హోటల్ గదికి తీసుకువెళ్లే హక్కు ఎవరు ఇచ్చారు? నఖ్వీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు. అతడికి కొంచెం కూడా జ్ఞానం లేదు. ఈ విషయంపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ట్రోఫీ, పతకాలు వీలైనంత త్వరగా భారత్కు పంపిస్తారని ఆశిస్తున్నా" అని ఎఎన్ఐతో సైకియా పేర్కొన్నాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
టీమిండియాకు వైఎస్ జగన్ అభినందనలు
-
నా కెరీర్లో ఇలా ఎప్పుడు జరగలేదు.. కానీ చాలా సంతోషంగా ఉంది: సూర్య
ఆసియాకప్-2025కు ఆదివారం(సెప్టెంబర్ 28) ఎండ్ కార్డ్ పడింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించిన భారత జట్టు.. రికార్డు స్ధాయిలో తొమ్మిదోసారి ఆసియాకప్ విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో అనుహ్యపరిణామాలు చోటు చేసుకున్నాయి.ఈ టోర్నీ ఆరంభం నుంచే పాక్తో అంటి ముట్టకుండా ఉంటున్న భారత జట్టు.. ఫైనల్ మ్యాచ్లోనూ అదే తీరును కొనసాగించింది. అయితే ఈసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మెన్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీకి టీమిండియా ఝులక్ ఇచ్చింది.అతడి చేతుల మీదగా విన్నింగ్ ట్రోఫీని తీసుకోవడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు. మొహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం పీసీబీ చైర్మెన్తో పాటు పాకిస్తాన్ మంత్రిగా కొనసాగుతున్నాడు. ఈ కారణంతోనే అతడి చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా సముఖత చూపలేదు. దీంతో గ్రౌండ్కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. భారత ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్నారు. ఇదే విషయంపై పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తన కెరీర్లో ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీ తీసుకోపోవడం ఇదే తొలిసారి సూర్య చెప్పుకొచ్చాడు."నా క్రికెట్లో కెరీర్లో ఇలాంటి సంఘటనను ఇప్పటివరకు చూడలేదు. ఓ జట్టు ఛాంపియన్స్గా తర్వాత ట్రోఫీని అందుకోకపోవడం ఇదే మొదటి సారి. మేము కష్టపడి ఛాంపియన్గా నిలిచినప్పటికి, ట్రోఫీని తిరస్కరించాలని నిర్ణయించుకున్నాము. మేము ఈ నెల 4వ తేదీ నుంచి ఇక్కడే(దుబాయ్) ఉన్నాము. ప్రతీ మ్యాచ్లోనూ వంద శాతం ఎఫక్ట్ పెట్టి విజయం సాధించాము. ఒక్క రోజు వ్యవధిలో వరుసగా రెండు మ్యాచ్లు ఆడి టైటిల్ను సొంతం చేసుకున్నాము. ఇందుకు మేము అన్ని రకాలగా అర్హులు. ఇంతకుమించి నేను చెప్పలేను. ట్రోఫీల గురించి మాట్లాడితే.. 14 మంది సహచరులు, సహాయక సిబ్బంది రూపంలో నా డ్రెసింగ్ రూమ్లో ఉన్నాయి. నా దృష్టిలో వారే నిజమైన ట్రోఫీలు. ఈ ఆసియా కప్ ప్రయాణంలో సపోర్ట్ స్టాప్ మాకు అన్ని విధాలగా అండగా నిలిచారు. మా కుర్రాళ్లు కూడా టోర్నీ అంతటా అద్బుతంగా రాణించారు. ఫైనల్ మ్యాచ్లో గెలవాలనకున్నాము. మేము అనుకున్నట్లు గెలిచాం. మ్యాచ్ ముగిసిన తర్వాత బిగ్ స్క్రీన్పై భారత్ గెలిచినట్లు, ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ అని రాసి ఉంది. అంతకంటే మాకు ఇంకేమి కావాలి. చాలా సంతోషంగా ఉంది అని" సూర్య పేర్కొన్నాడు. అయితే హ్యాండ్ షేక్ వివాదం, ట్రోఫీ తీసుకోకపోవడానికి కారణాలపై పాక్ జర్నలిస్టు అడిగిన సమాధానాలను సూర్య దాటవేశాడు. చదవండి: అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్ -
అదే మా కొంపముంచింది.. లేదంటే కథ మరోలా ఉండేది: పాక్ కెప్టెన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమిండియా చేతిలో మరోసారి చావు దెబ్బ ఎదురైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియాకప్ ఫైనల్లో పాక్ను ఐదు వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో 13 ఏళ్ల తర్వాత ఆసియాకప్ టైటిల్ను ముద్దాడాలన్న పాక్ ఆశలపై మెన్ ఇన్ బ్లూ నీళ్లు జల్లింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. పెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ 57, ఫకర్ జమాన్ 46 పరుగులతో రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ తలా రెండేసి వికెట్లు సాధించారు. అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 పరుగులు నాటౌట్) చారిత్రత్మక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని అఘా చెప్పుకొచ్చాడు.జీర్ణించుకోలేక పోతున్నాం.."ఈ ఓటమిని మేం జీర్ణించుకోలేక పోతున్నాం. బ్యాటింగ్లో మెరుగ్గా రాణించలేకపోయాము. మాకు మంచి ఆరంభం లభించినప్పటికి భారీ స్కోర్ సాధించలేకపోయాము. బౌలింగ్లో మాత్రం మేము అద్భుతంగా రాణించాము. ఆఖరి వరకు గెలిచేందుకు అన్ని విధాలగా మేము ప్రయత్నించాము.బ్యాటింగ్లో మంచి ఫినిషింగ్ చేసి ఉంటే కథ వేరేలా ఉండేది. స్ట్రయిక్ని సరిగ్గా రొటేట్ చేయలేకపోయాం. కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోయాం. అందుకే మేము అనుకున్న స్కోర్ చేయలేకపోయాము. ఈ మ్యాచ్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాము.మా బ్యాటింగ్ తప్పిదాలను సరిదిద్దుకుంటాము. భారత బౌలర్లు కూడా బాగా బౌలింగ్ చేశారు. మా ఇన్నింగ్స్ మిడిల్ ఓవర్లలో అద్బుతమైన కమ్బ్యాక్ ఇచ్చారు. ఆఖరి 6 ఓవర్లలో భారత విజయానికి 63 పరుగులు అవసరమయ్యాయి. దీంతో మాకు గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని భావించాను.కానీ దురదృష్టవశాత్తూ ఓటమి చవి చూశాము. అయితే మా బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారు. వారి ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. ఈ టోర్నీలో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మా తదుపరి సవాల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాము.మేము బలంగా తిరిగి వస్తామన్న నమ్మకం మాకు ఉందని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సల్మాన్ పేర్కొన్నాడు. కాగా ఈ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ను భారత్ బహిష్కరిచింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది.చదవండి: Asia Cup 2025: పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్ -
నాడు అవమానించారు.. నేడు అతనే కాపాడాడు
-
టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే?
టీ20 ఫార్మాట్లో తమకు తిరుగులేదని భారత జట్టు మరోసారి నిరూపించుకుంది. ఆసియాకప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు.. రికార్డు స్థాయిలో తొమ్మిదో ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో సామాన్యుని నుంచి ప్రధాని వరకు భారత సూర్య అండ్ కోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించింది. ఈ చారిత్రత్మక విజయంలో భాగమైన ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి రూ. 21 కోట్ల భారీ రివార్డు ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.మూడు దెబ్బలు.. అస్సలు సమాధానమే లేదు. ఆసియా కప్ చాంపియన్స్, కావాల్సిన సందేశం అందించాం. జట్టుకు, సహాయక సిబ్బందికి రూ. 21 కోట్ల బహుమతి అంటూ ఫైనల్ అనంతరం బీసీసీఐ ఎక్స్లో పేర్కొంది. కాగా ఈ ఖండాంతర టోర్నీలో మొత్తంగా మూడు సార్లు పాక్ను భారత్ చిత్తు చేసింది.అదరగొట్టిన తిలక్..ఇక భారత్ ఛాంపియన్స్గా నిలవడంలో హైదరాబాదీ తిలక్ వర్మది కీలక పాత్ర. 147 పరుగుల లక్ష్య చేధనలో తిలక్ మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య చేధనలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ తన వీరొచిత ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు.తిలక్ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో అందుకుంది. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కగా.. ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు.చదవండి: Asia Cup 2025: పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్ -
తెలుగోడి సత్తా చాటిన తిలక్ వర్మ
-
తిలక్ ఆట అద్భుతం.. భారత్ విజయంపై వైఎస్ జగన్ ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: ఆసియా కప్ ఫైనల్ (Aisa Cup Final 2025)లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) అభినందనలు తెలిపారు. పాకిస్తాన్పై విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై అద్వితీయ విజయం సాధించిన మన క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. మీ అసాధారణ నైపుణ్యం, అంకితభావం.. జట్టు కృషి మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశాయి. ఫైనల్లో కీలక ప్రదర్శన, సీరిస్లో అద్భుత ప్రతిభ కనబరించిన తెలుగు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు(Tilak Varma) ప్రత్యేక అభినందనలు. వర్మ ప్రదర్శన నిజంగా ప్రశంసనీయం’ అని కొనియాడారు. Hearty congratulations to our cricket team on their outstanding victory in the Asia Cup 2025 final against Pakistan! Your exceptional skill, dedication, and teamwork have made the entire nation proud.A special shoutout to our very own Telugu star, @TilakV9, for his crucial… pic.twitter.com/GWexoLzkSt— YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2025 -
పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్
ఆసియాకప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దాయాది పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తొమ్మిదో సారి ఆసియాకప్ టైటిల్ను ముద్దాడింది. ప్రత్యర్ధి నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది.భారత విజయంలో మిడిలార్డర్ బ్యాటర్, హైదరాబాదీ తిలక్ వర్మ (53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 69 పరుగులు నాటౌట్) కీలక పాత్ర పోషించాడు. లక్ష్య చేధనలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ తన అద్బుత ఇన్నింగ్స్తో ఛాంపియన్గా నిలిపాడు.అతడితో పాటు సంజూ శాంసన్(24), శివమ్ దూబే(33) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. బుమ్రా, వరుణ్, అక్షర్ తలా రెండు వికెట్లు సాధించారు.ట్రోఫీని నిరాకరించిన భారత్.. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత హైడ్రామా చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసి 45 నిమిషాల సమయం దాటినా బహుమతి ప్రదానోత్సవం జరగలేదు. దాంతో ఏం జరిగిందనే అంశంపై చర్చ మొదలైంది. భారత జట్టు విజేత ట్రోఫీని స్వీకరించే విషయంలో వివాదం నెలకొనడమే అందుకు కారణమని తేలింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా కప్ను అందుకునేది లేదని టీమిండియా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్ అమీనుల్ ఇస్లాం ట్రోఫీని అందించడానికి ముందుకొచ్చారు. అందుకు టీమిండియా కూడా అంగీకరించింది. కానీ మొహసిన్ నఖ్వీ మాత్రం తనే స్వయంగా ట్రోఫీ అందిస్తాని పట్టుబట్టాడు. దీంతో భారత్ ప్రేజెంటేషన్ వేడుకునే కాకుండా ఏకంగా ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరించింది. దెబ్బకు పీసీబీ చైర్మెన్తో పాటు పాక్ ఆటగాళ్లు షాకయ్యారు.కేవలం పాక్ ఆటగాళ్లు మాత్రమే రన్నరప్ మెడల్స్ను అందుకున్నారు. భారత్ నుంచి తిలక్, దూబే, అభిషేక్ మాత్రం స్పాన్సర్ల నుంచి తమ వ్యక్తిగత బహుమతులు అందుకున్నారు. అయితే ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండానే తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి.Big Breaking 🚨🚨Team India refuses to accept the Asia Cup 2025 Trophy 🏆 from Pakistan interior minister and ACC Chairman Mohsin Naqvi.Someone just picked up the trophy and walked off the ground.Another Embarrassing Moment for 🇵🇰Video 📷#INDvsPAK #AsiaCupFinal #Tilak pic.twitter.com/h4CrRZgcUF— Globally Pop (@GloballyPop) September 28, 2025చదవండి: ‘ఠాకూర్’ జితాదియా... -
పాకిస్తాన్పై భారత్ విజయం.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
ఢిల్లీ: ఆసియా కప్ ఫైనల్ (Asia Cup Final 2025)లో దాయాది పాకిస్తాన్ను భారత్ (Team India) మరోసారి మట్టికరిపించింది. ఫైనల్ అద్భుతంగా ఆడి.. టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొమ్మిదోసారి ఆసియా కప్ను సొంతం చేసుకుంది. భారత్ విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. భారత క్రికెటర్లపై ప్రశంసలు కురిపించారు.ఆసియా కప్లో భారత్ విజయంపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితం అని పేర్కొన్నారు. మైదానంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. భారత్ మళ్లీ గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు అని పోస్టు చేశారు.#OperationSindoor on the games field. Outcome is the same - India wins!Congrats to our cricketers.— Narendra Modi (@narendramodi) September 28, 2025ఇక, పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్(India vs Pakistan) ఫైనల్ ఉత్కంఠ పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధించడంతో భారతీయులు సంబురాలు చేసుకున్నారు. భారత జట్టుపై ప్రశంసలు కురిపించారు. భారత క్రికెటర్ తిలక్ వర్మ.. ‘ఆపరేషన్ తిలక్’తో దాయాదిని చిత్తు చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. After Operation Sindoor... it was Operation Tilak 🇮🇳Battlefield or cricket field - India’s victory over Pakistan comes every time... pic.twitter.com/zGu4vkZMcN— PoliticsSolitics (@IamPolSol) September 28, 2025 -
ఆపరేషన్ ‘తిలక్’.. ఫైనల్లో పాక్ను మట్టికరిపించిన భారత్ (ఫొటోలు)
-
పాక్ కు చెంపదెబ్బ.. ట్రోఫీ నిరాకరించిన భారత్
-
ఆసియా కప్ భారత్దే... ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో విజయకేతనం
-
ఫైనల్ లో పాక్ ను చీల్చి చెండాడిన భారత్
-
‘ఠాకూర్’ జితాదియా...
సాక్షి క్రీడా విభాగం : నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ... భారత క్రికెట్లో రాబోయే కొన్నేళ్లు ఈ పేరును ఎవరూ మర్చిపోలేరు. ఆసియా కప్ (Asia Cup 2025) ఫైనల్లో అతని ఇన్నింగ్స్పై అభిమానుల్లో సుదీర్ఘ కాలం చర్చ సాగటం ఖాయం. టోర్నీ ఆసాంతం అసాధారణ ప్రదర్శనతో జట్టుకు వరుస విజయాలు అందించిన అభిషేక్ శర్మ ఆరంభంలోనే వెనుదిరిగాడు. సూర్య, గిల్ విఫలమయ్యారు. స్కోరు 20/3. ఇలాంటప్పుడు జట్టును గెలిపించేదెవరు అని భారత అభిమానుల్లో ఒక రకమైన ఆందోళన. ఈ స్థితిలో నేనున్నానంటూ తిలక్ నిలబడ్డాడు. తీవ్రమైన ఒత్తిడి, మరో వికెట్ పడితే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదం ఉంది. క్రీజ్లో నిలబడి జాగ్రత్తగా ఆడాలా, లేక భారీ షాట్లకు పోవాలా అనే సందేహాల నడుమ అతని ఇన్నింగ్స్ ప్రారంభమైంది. కానీ తిలక్ ఏమాత్రం తడబడలేదు. సామ్సన్ వెనుదిరిగినా, జాగ్రత్తగా ఆడుతూ అవకాశం లభించగానే చెలరేగిపోయాడు. ఫహీమ్ ఓవర్లోనే వరుసగా ఫోర్, సిక్స్తో తన ఉద్దేశాన్ని చాటిన అతను, అబ్రార్ ఓవర్లో సిక్స్తో అందరిలో గెలుపు నమ్మకాన్ని పెంచాడు. రవూఫ్ బౌలింగ్లో భారీ సిక్స్తో స్కోరును 100 దాటించడంతో మ్యాచ్ నియంత్రణలోకి వచ్చేసింది. మరోవైపు దూబే దూకుడుగా ఆడిన సమయంలో తాను కాస్త సంయమనం పాటించాడు. 8 పరుగులు చేయాల్సిన దశలో డీప్ స్క్వేర్ లెగ్ వైపు కొట్టిన భారీ సిక్సర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ తర్వాత గెలుపు సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దాదాపు పది నెలల క్రితం.. దక్షిణాఫ్రికా గడ్డపై తిలక్ వర్మ (Tilak Varma) వరుసగా రెండు టి20ల్లో సెంచరీలతో చెలరేగాడు. ఆ తర్వాత భారత్కు రాగానే ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మరో శతకం బాది... టి20 క్రికెట్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత చెన్నైలో ఇంగ్లండ్పై అజేయంగా చేసిన 72 పరుగులు అతని సత్తాను మరోసారి చూపించాయి. అయితే కొద్ది రోజులకే ఐపీఎల్లో అతనికి అవమానకర స్థితి ఎదురైంది. మూడు సీజన్ల పాటు ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో టీమ్ మేనేజ్మెంట్ అనూహ్య నిర్ణయం తిలక్ను షాక్కు గురి చేసింది. 23 బంతుల్లో 25 పరుగులు చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ‘రిటైర్డ్ అవుట్’తో తిలక్ను బయటకు పంపించారు. అదృష్టవశాత్తూ ఐపీఎల్లో ప్రదర్శన అతని అంతర్జాతీయ కెరీర్పై ప్రభావం చూపించలేదు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత సహజంగానే ఈ సారి ఆసియా కప్ టీమ్లో అతనికి స్థానం లభించింది. వరుసగా చక్కటి ఇన్నింగ్స్లతో తన ముద్ర చూపించిన అతను లంకతో చివరి మ్యాచ్లో త్రుటిలో అర్ధ సెంచరీ కోల్పోయాడు. అయితే తన విశ్వరూపం చూపించాల్సింది ఇక్కడ కాదు అన్నట్లుగా అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్ కోసం దాచి ఉంచినట్లున్నాడు. అసాధారణ షాట్లతో జట్టుకు ఆసియా కప్ అందించే వరకు ఆగకుండా తానేంటో నిరూపించుకొని తిలక్ సగర్వంగా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్కు ముందు తిలక్ కెరీర్లో 30 మ్యాచ్ల అంతర్జాతీయ టి20 కెరీర్లో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో ఎన్నో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు కూడా ఉన్నాయి. కానీ ఈ మ్యాచ్లో ఆడిన ఆట అన్నింటికంటే శిఖరాన నిలుస్తుంది. ఇప్పటికే 49.61 సగటు, 150.84 సగటుతో దూసుకుపోతున్న తిలక్ ఈ ఫార్మాట్లో మున్ముందు మరిన్ని సంచలన ప్రదర్శనలు చూపించడం ఖాయం. -
ఆసియా కప్ విజేతగా టీమిండియా.. ఫైనల్లో పాకిస్తాన్పై గెలుపు
ఆసియా కప్ 2025 (Asia cup 2025) విజేతగా టీమిండియా (Team India) అవిర్భవించింది. ఇవాళ (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్పై (India vs Pakistan) 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.అనంతరం 147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ సైతం తడబడింది. అయితే తిలక్ వర్మ (53 బంతుల్లో 69; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. సంజూ శాంసన్ (24), శివమ్ దూబే (33) తిలక్కు సహకరించారు. రింకూ సింగ్ బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు. అంతకుముందు భారత్ 20 పరుగులకే అభిషేక్ శర్మ (5), శుభ్మన్ గిల్ (12), సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్లు కోల్పోయింది. పాక్ బౌలర్లలో ఫహీమ్ అఫ్రాఫ్ 3 వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో భారత్ పాక్పై గెలవడం ఇది మూడోసారి. అంతకుముందు గ్రూప్ దశలో, సూపర్-4లో కూడా టీమిండియానే విజయం సాధించింది. -
Asia cup 2025 Final: పాక్కు కౌంటరిచ్చిన బుమ్రా
భారత్, పాకిస్తాన్ (India vs pakistan) మధ్య జరుగుతున్న ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) హైడ్రామా చోటు చేసుకుంది. సూపర్-4 మ్యాచ్లో పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ (Haris Rauf) చేసిన ఓవరాక్షన్కు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కౌంటరిచ్చాడు.BUMRAH HAS GIVEN A PERFECT MEDICINE TO RAUF...!!! 🥶💥 pic.twitter.com/DpItOev4aO— Johns. (@CricCrazyJohns) September 28, 2025ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అద్భుతమైన యార్కర్తో హరిస్ రౌఫ్ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. విమానం కూలిపోయినట్లు సంజ్ఞ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. రౌఫ్కు సరైన సమాధానం చెప్పావంటూ భారత అభిమానులు బుమ్రాను ప్రశంసిస్తున్నారు.సూపర్-4 మ్యాచ్లో రౌఫ్ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. రౌఫ్ చర్యలపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేయగా.. అతనికి 30 శాతం మ్యాచ్ ఫీజ్ను జరిమానాగా విధించారు.అదే మ్యాచ్లో మరో పాక్ ఆటగాడు కూడా అభ్యంతరకంగా ప్రవర్తించాడు. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్ను గన్లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇతనిపై కూడా బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫర్హాన్ను ఐసీసీ మందలింపుతో వదిలిపెట్టింది.కాగా, నేటి ఫైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.చదవండి: Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం -
Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం
ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) ఇవాళ (సెప్టెంబర్ 28) భారత, పాకిస్తాన్ (India vs Pakistan) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా (Team India) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. టాస్ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడేందుకు ఇద్దరు ప్రతినిధులు ఏర్పాటు చేయబడ్డారు.సాధారణంగా ఏ మ్యాచ్కైనా టాస్ సమయంలో ఒకరే ప్రతినిధి ఇద్దరు కెప్టెన్లతో మాట్లాడతాడు. అయితా ఈసారి అలా కాకుండా పాకిస్తాన్ (Pakistan) కెప్టెన్తో ఒకరు, భారత కెప్టెన్తో మరొకరు మాట్లాడేందుకు ఏర్పాటు చేయబడ్డాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో భారత్కు చెందిన రవిశాస్త్రి మాట్లాడగా.. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాతో అదే దేశానికి చెందిన వకార్ యూనిస్ సంభాషించాడు.టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి పాక్ కెప్టెన్తో హ్యాండ్ షేక్కు దూరంగా ఉన్నాడు. టాస్ సమయంలో ఇద్దరు ప్రతినిధుల ఐడియాను బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలుస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తున్న టీమిండియా సాధారణంగా బౌలింగ్ చేస్తుంది. పాకిస్తాన్ ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్, ఫకర్ జమాన్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ శివమ్ దూబేతో బౌలింగ్ అటాక్ను ప్రారంభించాడు. అతను 2 ఓవర్లలో 12 పరుగులకే ఇచ్చి పర్వాలేదనిపించాడు. బుమ్రా 2, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో ఓవర్ వేశారు.6 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 45/0గా ఉంది. ఫర్హాన్ 31, ఫకర్ జమాన్ 12 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, భారత్, పాకిస్తాన్ 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. అందుకే ఈ మ్యాచ్కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత టోర్నీలో భారత్, పాక్ ఇప్పటికే రెండు సార్లు తలపడగా.. రెండు సందర్భాల్లో టీమిండియానే విజయం సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన రాహుల్ చాహర్.. 166 ఏళ్ల పురాతన రికార్డు బద్దలు -
ఆసియా కప్ 2025 విజేత టీమిండియా
ఆసియా కప్ 2025 విజేతగా టీమిండియా అవిర్భవించింది. ఇవాళ (సెప్టెంబర్ 28) జరిగిన ఫైనల్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ లో స్కోరింగ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ మరో 2 బంతులు మిగిలుండగా లక్ష్యాన్ని ఛేదించింది. తిలక్ వర్మ (69) అజేయ అర్ద శతకంతో టీమిండియాను గెలిపించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తిలక్తిలక్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్డాను. 16 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 111/4గా ఉంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే 24 బంతుల్లో 36 పరుగులు చేయాలి. నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా12.2వ ఓవర్- 77 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో ఫర్హాన్కు క్యాచ్ ఇచ్చి సంజూ శాంసన్ (24) ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న తిలక్, శాంసన్20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో భారత బ్యాటర్లు తిలక్ వర్మ (24), సంజూ శాంసన్ (16) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 10 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 58/3గా ఉంది.స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతున్న టీమిండియా147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడుతుంది. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. గిల్ (12) మూడో వికెట్గా వెనుదిరిగాడు. ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్లో హరీస్ రౌఫ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కష్టాల్లో టీమిండియా147 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా కష్టాల్లో పడింది. 10 పరుగులకే ఇన్ ఫామ్ బ్యాటర్ అభిషేక్ శర్మ (5), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1) వికెట్లు కోల్పోయింది. చెలరేగిన కుల్దీప్.. 146 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.చెలరేగిన కుల్దీప్ఇన్నింగ్స్ 17వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసి పాక్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి బంతికి సల్మాన్ అఘా, నాలుగో బంతికి షాహీన్ అఫ్రిది (0), ఆఖరి బంతికి ఫహీమ్ అష్రాఫ్ (0) ఔటయ్యారు. 16 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 134/8గా ఉంది. నవాజ్, హరీస్ రౌఫ్ క్రీజ్లో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన పాక్16.1వ ఓవర్- 133 పరుగుల వద్ద పాక్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో సంజూ శాంసన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సల్మాన్ అఘా (8) ఔటయ్యాడు. కష్టాల్లో పాకిస్తాన్పాక్ జట్టు మరోసారి కష్టాలో పడింది. తొలుత పరుగు వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఈసారి 5 పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్ 15.3 ఓవర్లలో 132 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. సల్మాన్ అఘా (7), మొహమ్మద్ నవాజ్ (1) క్రీజ్లో ఉన్నారు. 14 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 118/3పరుగు వ్యవధిలో రెండు వికెట్లు (సైమ్ అయూబ్ (14), మొహమ్మద్ హరీస్ (0)) కోల్పోవడంతతో పాక్ స్కోర్ నెమ్మదించింది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 118/3గా ఉంది. ఫకర్ జమాన్ (38), సల్మాన్ అఘా (3) క్రీజ్లో ఉన్నారు. 100 పరుగులు పూర్తి చేసుకున్న పాకిస్తాన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 11.2 ఓవర్లలోనే 100 పరుగులు (వికెట్ నష్టానికి) పూర్తి చేసుకుంది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 107/1గా ఉంది. ఫకర్ జమాన్ (33), సైమ్ అయూబ్ (13) క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన పాక్9.4వ ఓవర్- 84 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం సాహిబ్జాదా ఫర్హాన్ (57) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ పెవిలియన్కు చేరాడు. ధాటిగా ఆడుతున్న పాక్ ఓపెనర్లు.. ఫర్హాన్ హాఫ్ సెంచరీతొలుత నిదానంగా ఆడిన పాక్ ఓపెనర్లు గేర్ మార్చారు. సాహిబ్జాదా ఫర్హాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ 18 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 22 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 9 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 77/0గా ఉంది. జాగ్రత్తగా ఆడుతున్న పాకిస్తాన్ ఓపెనర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (24), ఫకర్ జమాన్ (6) చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 32/0గా ఉంది.క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సేవలను కోల్పోయింది. గాయం కారణంగా అతను ఈ మ్యాచ్లో ఆడటం లేదు. అతని స్థానంలో రింకూ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్ మిస్ అయిన శివమ్ దూబే, బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. తుది జట్లు.. పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి -
Ind vs Pak: అప్పుడు బాయ్కాట్ అన్నారు.. ఇప్పుడేమో ఎగబడుతున్నారు..!
ఆసియా కప్-2025లో (Asia Cup 2025) ఇవాళ (సెప్టెంబర్ 28) భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మెగా ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.ఈ టోర్నీలో భారత్, పాక్ తలపడటం ఇది మూడోసారి. అంతకుముందు గ్రూప్ దశ, సూపర్-4లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ రెండు పర్యాయాల్లో టీమిండియా పాక్ను చిత్తుగా ఓడించింది. నేడు జరుగబోయే ఫైనల్లోనూ అదే సీన్ రిపీట్ కాబోతుందని భారత అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కాగా, నేటి భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ను భారతవ్యాప్తంగా 100కు పైగా పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇదే టోర్నీలో భారత్, పాక్ గ్రూప్ దశ, సూపర్-4లో తలపడినప్పుడు బాయ్కాట్ అన్న జనాలు.. ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి టికెట్ల కోసం ఎగబడుతున్నారు.ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ కొందరు నెటిజన్లు వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు. బాయ్కాట్ గ్యాంగ్ టికెట్ బుకింగ్ గ్యాంగ్గా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని ఉద్యమాలు చేసిన వాళ్లే, ఇప్పుడు టికెట్ల కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా దేశంలోని ప్రధాన నగరాల్లో స్క్రీనింగ్ హంగామా నడుస్తుంది. PVR INOX స్క్రీన్లపై దాయాదుల తుది సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడుతున్నారు. PVR INOX స్క్రీన్లతో పాటు దేశవాప్తంగా చాలా చోట్ల ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన టికెట్లు దక్కించుకునేందుకు అభిమానులు చిన్నపాటి యుద్దాలే చేస్తున్నారు. చదవండి: ఇకపై అదే అర్హత.. వైభవ్ సూర్యవంశీ అలానే వచ్చాడు.. బీసీసీఐ కీలక నిర్ణయం -
పాక్తో ఫైనల్... ‘స్టార్ ప్లేయర్’పై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత జట్టు యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. ఏడుగురు బ్యాటర్లు చాలని.. నలుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ అజేయంగా ఫైనల్కు చేరుకుంది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్.. దాయాది పాకిస్తాన్ (IND vs PAK)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పుపై మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.శివం దూబే వద్దు‘‘నేనైతే శివం దూబే (Shivam Dube) బదులు అర్ష్దీప్ సింగ్ను ఆడిస్తా. ఆల్రౌండర్ అయిన దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశమే రావడం లేదు. కాబట్టి ఈసారి నేను ఏడుగురు బ్యాటర్లనే ఆడిస్తా. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు.ఆ స్థానంలో వచ్చిన వాళ్లు 20, 50 పరుగులు చేయాల్సిన అవసరమేమీ ఉండకపోవచ్చు, ఓ బౌండరీ లేదంటే సిక్సర్ బాది పది పరుగులు చేసినా చాలు. కుల్దీప్ ఆ మాత్రమే స్కోరు చేయగలడు.టీమిండియాదే విజయంఏదేమైనా శివం దూబే బంతితో మెరుగ్గా రాణిస్తున్న మాట నిజమే. పాకిస్తాన్తో గత మ్యాచ్లో రెండు కీలక వికెట్లు తీశాడు. అయితే, ఫైనల్లో మాత్రం అర్ష్దీప్ సింగ్కే నా ఓటు. రామ్ లేదంటే రావణ్.. ఎవరు ఆడినా సరే టీమిండియా విజయం సాధించడం మాత్రం ఖాయం’’ అని చిక్కా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ లీగ్ దశలో పాకిస్తాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. సూపర్-4 మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఆసియా కప్-2025 ఫైనల్కు క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఎంపిక చేసుకున్న తుదిజట్టుఅభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.చదవండి: ఆసియా కప్-2025 ఫైనల్: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
‘సూర్యకుమార్ వెంట పడకండి.. అలా చేయమని ఒత్తిడి పెంచకండి’
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin)అండగా నిలిచాడు. సూర్యపై ఒత్తిడి పెంచడం సరికాదని.. కెప్టెన్గా తనదైన శైలిలో అతడు విజయాలు సాధిస్తున్న తీరు అద్భుతమని కొనియాడాడు. కాగా ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో టీమిండియా అజేయంగా ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.అయితే, నామమాత్రపు మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేయడం.. బ్యాటర్గా విఫలం కావడం పట్ల సూర్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కాగా గత కొంతకాలంగా సూర్య బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత తొమ్మిది ఇన్నింగ్స్లో సూర్య 12.41 సగటు, 112.98 స్ట్రైక్రేటుతో కేవలం 87 పరుగులే చేయగలిగాడు.బ్యాటింగ్ వైఫల్యంపై విమర్శలుఇక ఆదివారం నాటి ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ (IND vs PAK)తో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ బ్యాటింగ్ వైఫల్యంపై మరోసారి చర్చ జరుగుతుండగా.. అశ్విన్ స్పందించాడు. ‘‘కెప్టెన్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ సగటు పడిపోయిందని చాలా మంది విమర్శిస్తున్నారు.కానీ అతడు పగ్గాలు చేపట్టిన తర్వాతే కదా.. కొత్త బ్రాండ్తో టీమిండియా ముందుకు సాగుతోంది. అతడి సగటు 40 ఉండాల్సిన అవసరం లేదు. టీ20 క్రికెట్లో యావరేజ్ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.హైరిస్క్ మ్యాచ్లుకెప్టెన్గా సూర్య హైరిస్క్ మ్యాచ్లు ఆడుతున్నాడు. నిజంగా అతడి నైపుణ్యాలు అద్భుతం. గతంలో రోహిత్ శర్మ కూడా ఇలానే చేశాడు. తన వికెట్ కంటే కూడా.. దూకుడుగా ఆడటంపైనే దృష్టి పెట్టాడు. ఇప్పుడు సూర్య అదే అనుసరిస్తున్నాడు. వన్డౌన్కే పరిమితం కాకుండా బ్యాటింగ్ ఆర్డర్లో వేర్వేరు స్థానాల్లో వస్తున్నాడు.అతడి వెంట పడకండిసూర్య తక్కువ స్ట్రైక్ రేటుతో 40 పరుగులు చేయడం కంటే కూడా... 170కి పైగా స్ట్రైక్రేటుతో 25 పరుగులు చేసినా నేను సంతోషిస్తా. దయచేసి అతడి వెంట పడకండి. అతడిపై ఒత్తిడి పెంచకండి. టీ20 క్రికెట్లో బ్యాటర్ సగటు కంటే.. అతడి ఇన్నింగ్స్ ఎంతమేర ప్రభావం చూపుతుందనేదే ముఖ్యం’’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియా కప్-2025లో సూర్య ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్ ఆడి 71 పరుగులు చేశాడు. లీగ్ దశలో పాక్తో మ్యాచ్లో 37 బంతుల్లో 47 పరుగులు చేయడం అతడి తాజా అత్యుత్తమ ప్రదర్శన. చదవండి: ఆసియా కప్-2025 ఫైనల్: అది సూర్య ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
అది సూర్యకుమార్ ఇష్టం.. గెలిచేది మేమే: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో లీగ్, సూపర్-4 దశలో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది పాకిస్తాన్. తొలుత గ్రూప్-‘ఎ’ మ్యాచ్లో భాగంగా ఏడు వికెట్ల తేడాతో ఓడిన పాక్.. తర్వాత సూపర్-4లో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.అయితే, సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల తప్పిదాల కారణంగా అదృష్టవశాత్తూ ఫైనల్కు చేరుకోగలిగింది. ఈ క్రమంలో ఆదివారం నాటి టైటిల్ పోరులో టీమిండియా (IND vs PAK)తో తలపడేందుకు అర్హత సాధించింది.ఫొటోషూట్కు వెళ్లని సూర్యఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టీమిండియా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించడంతో పాటు.. వారితో మైదానంలో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఫైనల్ కోసం జరిగే కెప్టెన్ల ఫొటోషూట్కు టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) హాజరు కాలేదని సమాచారం.అది సూర్యకుమార్ ఇష్టంఈ నేపథ్యంలో ఫైనల్కు ముందు మీడియాతో మాట్లాడిన పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) ఈ విషయంపై స్పందించాడు. ‘‘అది పూర్తిగా అతడి (సూర్య) ఇష్టం. అదే అతడి నిర్ణయం. ఒకవేళ రావాలి అనుకుంటే వస్తాడు. లేదంటే లేదు. ఇందులో నేను చేయగలిగింది ఏమీ లేదు’’ అని సల్మాన్ పేర్కొన్నాడు.గెలిచేది మేమేఇక టైటిల్ పోరు గురించి ప్రస్తావన రాగా.. ‘‘మేము గెలుస్తాం. అత్యుత్తమ క్రికెట్ ఆడటమే మా లక్ష్యం. ఒకవేళ మేము ఉత్తమంగా రాణించి.. 40 ఓవర్ల పాటు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలిగితే.. ఏ జట్టునైనా ఇట్టే ఓడించగలము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరుజట్లపై తీవ్రమైన ఒత్తిడి ఉండటం సహజం. ఒకవేళ ఒత్తిడి లేదని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుంది. ఏదేమైనా ఈ ఎడిషన్లో మేము వాళ్ల కంటే ఎక్కువ తప్పిదాలు చేశాము. అందుకే కొన్ని మ్యాచ్లు గెలవలేకపోయాము.తక్కువ తప్పులు చేసిన వారిదే విజయంఅయితే, ఈసారి ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వారిదే విజయం. మేము మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగితే తప్పకుండా అనుకున్న ఫలితాన్ని రాబట్టగలము’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు.కాగా పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బలు తగిలాయి. శ్రీలంకతో నామమాత్రపు సూపర్-4 మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కండరాలు పట్టేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే, అభి, తిలక్ ఫిట్గానే ఉన్నా.. హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దం నెలకొంది. ఏదేమైనా ఇప్పటి వరకు ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన సూర్యకుమార్ సేననే టైటిల్ ఫేవరెట్ అని చెప్పడంతో సందేహం లేదు. అయితే, ఫీల్డింగ్ విషయంలో మాత్రం భారత జట్టు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటేనే దాయాదిపై సులువుగా గెలవగలదు.చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం -
ఆసియా కప్ లో ఆఖరి పోరాటం
-
IND vs PAK: బలహీనంగానే పాకిస్తాన్.. భయపెడుతున్న ముఖాముఖి రికార్డు!
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఫైనల్కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి టైటిల్ పోరులో దాయాదులు భారత్- పాకిస్తాన్ (IND vs PAK) తలపడనున్నాయి. లీగ్ దశలో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ జట్లను ఓడించి అజేయంగా సూపర్-4కు చేరింది టీమిండియా.అదే విధంగా.. సూపర్-4లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించింది. తద్వారా ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లలో గెలిచి అజేయంగా ఫైనల్లో తలపడేందుకు సిద్ధమైంది. మరోవైపు.. పాకిస్తాన్ లీగ్ దశలో యూఏఈ, ఒమన్లపై గెలిచి సూపర్-4 చేరగలిగింది.పాకిస్తాన్ బలహీనంగానేతర్వాత సూపర్-4లో శ్రీలంక, బంగ్లాదేశ్తో మ్యాచ్లలో గట్టెక్కడం ద్వారా ఎట్టకేలకు ఫైనల్కు అర్హత సాధించింది. అయితే, టీమిండియాతో పోలిస్తే అన్ని రంగాల్లో పాకిస్తాన్ బలహీనంగానే కనిపిస్తోంది. తమ చివరి సూపర్–4 మ్యాచ్లో కూడా బంగ్లాదేశ్తో దాదాపు ఓటమికి చేరువై అదృష్టవశాత్తూ తప్పించుకోగలిగింది. ఇక భారత్తో ఆడిన రెండు మ్యాచ్లలో కూడా టీమ్ ప్రదర్శన పేలవంగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో కూడా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు కనిపించడం లేదు. 160 పరుగులతో టీమ్ టాప్ స్కోరర్గా ఉన్న ఫర్హాన్ ఒక్క మ్యాచ్లో అర్ధ సెంచరీ మినహా ప్రభావం చూపలేదు. సయీమ్ విఫలమైనా.. జట్టులోనేఫఖర్ జమాన్ (Fakhar Zaman) తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోగా... మిగతా ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) కనీసం ఒక్క మ్యాచ్లో కూడా రాణించలేదు. ఆరు ఇన్నింగ్స్లలో కలిపి అతను చేసింది 64 పరుగులే. ‘పాక్ అభిషేక్ శర్మ’ అంటూ కొన్నాళ్ల క్రితం కీర్తించిన సయీమ్ అయూబ్ ఏకంగా రికార్డు స్థాయిలో 4 డకౌట్లతో ఘోర ప్రదర్శన కనబర్చాడు. అయితే మరో చెప్పుకోదగ్గ ప్రత్యామ్నాయం కూడా లేదు కాబట్టి ఈ మ్యాచ్లోనూ అతని స్థానంపై ఎలాంటి ఢోకా లేదు. వీరందరిలో తుది పోరులో ఎవరు రాణిస్తారనేది చూడాలి. పాక్ సాధారణ స్కోరు నమోదు చేయాలన్నా మిడిలార్డర్లో తలత్, హారిస్లు కనీస ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్లో షాహిన్ అఫ్రిది ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించినా... భారత్ ఓపెనర్లు అతడిని అలవోకగా ఎదుర్కొంటున్నారు. రవూఫ్, అబ్రార్, ఫహీమ్, నవాజ్ మన బ్యాటర్లనను అడ్డుకోవడం అంత సులువు కాదు.పిచ్, వాతావరణం దుబాయ్లో సాధారణ వికెట్. అటు బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్కు కూడా అనుకూలం. అయితే రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయని పదే పదే రుజువైంది. కాబట్టి టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం ముఖాముఖి పోరులో..భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే, టీ20లు కలిపి ఇప్పటి వరకు పన్నెండు ఫైనల్ మ్యాచ్లు జరిగాయి. వీటిలో భారత్ నాలుగు గెలవగా... పాకిస్తాన్ ఎనిమిది ఫైనల్లలో విజయం సాధించింది.తుదిజట్ల వివరాలు అంచనా:టీమిండియా:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.పాకిస్తాన్సల్మాన్ ఆఘా (కెప్టెన్ ), సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సయీమ్ అయూబ్, హొసేన్ తలత్, మొహమ్మద్ హ్యారిస్, షాహిన్ అఫ్రిది, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్. చదవండి: Asia Cup Ind vs Pak: ఆఖరి పోరాటం -
హార్దిక్ అవుట్? బుమ్రా డౌట్? అతడే దిక్కు!
-
ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తారా?.. హర్షిత్ రాణాపై అశ్విన్ ఫైర్
టీమిండియా యువ బౌలర్ హర్షిత్ రాణా (Harshit Rana) ఆట తీరును భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) విమర్శించాడు. శ్రీలంకతో మ్యాచ్లో అతడి టెక్నిక్ సరిగ్గా లేదని.. తప్పులు సరిచేసుకోవాలని సూచించాడు. తన బౌలింగ్లో ప్రత్యర్థులు చితక్కొడుతున్నా మూస పద్ధతిలో వెళ్లడం సరికాదంటూ మండిపడ్డాడు.ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఆడే భారత జట్టులో పేస్ బౌలర్ల కోటాలో.. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh)తో పాటు హర్షిత్ రాణా స్థానం దక్కించుకున్నాడు. అయితే, ఈ టీ20 టోర్నీలో ఇప్పటికి టీమిండియా ఆడిన ఆరు మ్యాచ్లలో.. అతడికి కేవలం రెండు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. 26 పరుగులుతొలుత లీగ్ దశలో భాగంగా ఆఖరిగా ఒమన్తో జరిగిన నామమాత్రపు మ్యాచ్లో హర్షిత్కు తుదిజట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్లో 13 పరుగులతో అజేయంగా నిలిచిన హర్షిత్.. బౌలింగ్ పరంగానూ ఫర్వాలేదనిపించాడు. నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.ఎక్స్పెన్సివ్ బౌలింగ్అయితే, తాజాగా.. శుక్రవారం రాత్రి శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో మాత్రం హర్షిత్ తేలిపోయాడు. అతడి బౌలింగ్లో లంక ఓపెనర్ పాతుమ్ నిసాంక చితక్కొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ రైటార్మ్ పేసర్ ఏకంగా 54 పరుగులు సమర్పించుకుని ఒకే ఒక్క వికెట్ తీశాడు.ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. ‘‘హర్షిత్ రాణా గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. అవును.. అతడికి కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. వేరే వారి కోసం అతడు బెంచ్కే పరిమితం కావాల్సి వస్తోంది.ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తారా?ఇలా జట్టులోకి వస్తూ పోతూ ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. లయ కూడా మారుతుంది. అయితే, ఈ మ్యాచ్లో.. ఒకటి వేగంగా.. మరొకటి నెమ్మదిగా.. ఇంకోటి వేగంగా.. మరొకటి నెమ్మదిగా.. ఇలా పరిణతి లేకుండా సాగిపోయింది అతడి బౌలింగ్.ఈ తప్పుల నుంచి అతడు కచ్చితంగా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది’’ అని అశూ సుతిమెత్తగానే చురకలు అంటించాడు. ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం మరింతగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించాడు. కాగా శ్రీలంకతో నామమాత్రపు సూపర్-4 మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్లో గెలిచిన టీమిండియా అజేయంగా ఫైనల్లో ఆడనుంది. దుబాయ్లో దాయాది పాకిస్తాన్తో టీమిండియా టైటిల్ కోసం ఆదివారం తలపడుతుంది.చదవండి: IND vs WI: ‘అతడి తండ్రి గట్టిగానే నిలదీశాడు.. అందుకే ఆ ప్లేయర్పై వేటు’ -
భవిష్యత్ ఆశాకిరణం.. అతడిని బెంచ్కే పరిమితం చేయండి: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా చేతిలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ ఎట్టకేలకు ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్కు చేరుకుది. సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించడం ద్వారా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మరోవైపు.. భారత్ లీగ్, సూపర్-4 దశలో పరాజయమన్నదే లేకుండా ఫైనల్లో పాక్ (IND vs PAK)తో తలపడేందుకు సిద్ధమైంది.అయితే, ఈ టోర్నీలో పాకిస్తాన్ బౌలింగ్ పరంగా ఫర్వాలేదనిపించినా.. బ్యాటింగ్లో మాత్రం తడబడుతోంది. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ (Saim Ayub) దారుణంగా విఫలమవుతున్నాడు.హ్యాట్రిక్ డకౌట్లుఒమన్తో మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అయిన సయీమ్ ఆయుబ్.. టీమిండియా, యూఏఈతో మ్యాచ్లలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఇలా హ్యాట్రిక్ డకౌట్లతో విమర్శల పాలైన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సూపర్-4లో భాగంగా భారత్తో మ్యాచ్లో 21 పరుగులు చేయగలిగాడు.ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్లో రెండు పరుగులు చేయగలిగిన సయీమ్.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో మరోసారి డకౌట్ అయ్యాడు. బ్యాటింగ్ పరంగా విఫలమైనా పార్ట్ టైమ్ స్పిన్నర్గా ఏడు వికెట్లు తీయగలిగాడు.భవిష్యత్ ఆశాకిరణంఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ సయీమ్ ఆయుబ్ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. ‘‘అతడు రెండోసారి డకౌట్ అయినపుడే.. బెంచ్కే పరిమితం చేయాలని చెప్పాను. దానర్థం అతడిలో ప్రతిభ లేదని కాదు.అతడు టాలెంటెడ్ ప్లేయర్. పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణం. కానీ కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రావు. ఆ క్రమంలో రోజురోజుకీ మరింత దిగజారితే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆయుబ్ విషయంలో ఇదే జరిగింది. అతడి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా వీక్గా అనిపిస్తోంది.ఇలాంటపుడు బెంచ్కే పరిమితం చేయాలిబౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి అతడిని తుదిజట్టులోకి తీసుకుంటున్నారు. కానీ అతడు బౌలింగ్ కోసం కాదు.. బ్యాటింగ్ కోసం జట్టులో ఉంటున్నాడు. అతడు పరుగులు చేస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అది జరగడం లేదు. అతడిని బెంచ్కే పరిమితం చేయాల్సి ఉంటుంది’’ అని వకార్ యూనిస్ పేర్కొన్నాడు. కాగా భారత్- పాకిస్తాన్ ఆసియా కప్-2025 ఫైనల్లో ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు వేదిక దుబాయ్.చదవండి: ఆసియా కప్: చరిత్ర సృష్టించిన నిసాంక.. కోహ్లి ఆల్టైమ్ రికార్డు బద్దలు -
IND Vs SL: అతడి వల్లే ఇది సాధ్యమైంది: సెహ్వాగ్ ప్రశంసలు
టీమిండియా యువ ఆటగాడు, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ (Tilak Varma)పై భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. శ్రీలంకతో మ్యాచ్లో ఈ యువ బ్యాటర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. తిలక్ వర్మ వల్లే టీమిండియా భారీ స్కోరు చేసిందని పేర్కొన్నాడు. అదే విధంగా.. సంజూ శాంసన్ ఆట తీరును కూడా సెహ్వాగ్ ఈ సందర్భంగా ప్రశంసించాడు.ఆసియా కప్-2025 టోర్నమెంట్లో ఇప్పటికే ఫైనల్ చేరిన టీమిండియా.. సూపర్-4లో చివరిగా నామమాత్రపు మ్యాచ్లో శ్రీలంకతో తలపడింది. దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.అభిషేక్తో పాటు ఆ ఇద్దరుఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ (31 బంతుల్లో 61) ఆడగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (Shubman Gill) (4) విఫలమయ్యాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12), ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (2) కూడా పూర్తిగా నిరాశపరిచారు.అయితే, నాలుగో నంబర్ బ్యాటర్.. తిలక్ వర్మ, ఐదో స్థానంలో వచ్చిన సంజూ శాంసన్ బ్యాట్ ఝులిపించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. తిలక్ 34 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 49 పరుగులతో అజేయంగా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ 23 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఆఖర్లో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.Tilak Varma showing us the art of the “𝐠𝐡𝐮𝐭𝐧𝐚 𝐭𝐞𝐤 𝐜𝐡𝐡𝐚𝐤𝐤𝐚” 🤌 Watch #INDvSL LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/uLCfH4YepT— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 తిలక్ వర్మ వల్లే ఇలా..ఈ నేపథ్యంలో వీరేందర్ సెహ్వాగ్ తిలక్ వర్మ ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్తో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ కాకుండా.. ఇంకా ఎవరైనా రాణించాలని, పరుగులు రాబట్టాలని టోర్నీ ఆరంభం నుంచి ఎదురుచూస్తూనే ఉన్నాం.ఈరోజు తిలక్ వర్మ.. సంజూ శాంసన్ ఆ పని చేశారు. వారిద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోవచ్చు. కానీ ఇద్దరూ అద్భుతమైన, జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి వల్లే టీమిండియా 200 పరుగుల మార్కు అందుకుంది.ముఖ్యంగా తిలక్ వర్మ ఆఖరి వరకు అజేయంగా ఉండటం కలిసి వచ్చింది. ఇలా ఓ బ్యాటర్ ఇన్నింగ్స్ ఆసాంతం నాటౌట్గా ఉన్నాడంటే.. అతడు తప్పక భారీ స్కోరు చేయగలడనే నమ్మకం వస్తుంది.ఫైనల్కు ముందు ఫామ్లో ఉండటం సానుకూలాంశంఫైనల్కు ముందు తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఇలా బ్యాట్ ఝులిపించడం సానుకూలాంశం. వీరిద్దరి వల్ల టైటిల్ పోరులో భారత జట్టుకు తప్పక ప్రయోజనం చేకూరుతుంది’’ అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.కాగా 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. టీమిండియా మాదిరే ఐదు వికెట్లు కోల్పోయి సరిగ్గా 202 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్లో భారత్ విజయఢంకా మోగించింది. ఇదిలా ఉంటే.. హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ ఆసియా కప్ తాజా ఎడిషన్లో లెఫ్టాండర్ బ్యాటర్ తిలక్ వర్మ ఐదు ఇన్నింగ్స్ ఆడి 144 పరుగులు చేశాడు. మరోవైపు.. సంజూ మూడు ఇన్నింగ్స్లో 108 పరుగులు రాబట్టాడు. ఇక ఆదివారం నాటి ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా.. దాయాది పాకిస్తాన్తో తలపడనున్న విషయం తెలిసిందే.చదవండి: Asia Cup 2025: పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు -
వాళ్లిద్దరు సూపర్.. అతడికే ఇది సాధ్యం.. ఫైనల్లా అనిపించింది: సూర్య
శ్రీలంకతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గెలుపొందడం పట్ల టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) హర్షం వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టి కృషి, పట్టుదల కారణంగానే విజయం సొంతమైందని సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు. ఫైనల్ మాదిరి ప్రతి ఒక్కరు పట్టువదలకుండా పోరాడిన తీరు అద్భుతమంటూ కొనియాడాడు.ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నమెంట్లో లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తొలుత పాకిస్తాన్ను... ఆ తర్వాత బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్ చేరింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నామమాత్రపు సూపర్-4 మ్యాచ్లో శ్రీలంకతో తలపడింది.నువ్వా- నేనాఅయితే, ఇప్పటి వరకు పెద్దగా కష్టపడకుండానే ఈ టోర్నీలో మ్యాచ్లు గెలిచిన సూర్యకుమార్ సేనకు.. శ్రీలంక జట్టు చెమటలు పట్టించింది. నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీగా పోటీనిచ్చింది. 202 పరుగుల భారీ స్కోరు సాధించినా.. ధీటుగా బదులిచ్చి లంక మ్యాచ్ను టై చేసింది.అర్ష్దీప్ సింగ్ చేతికి బంతిఈ క్రమంలో సూపర్ ఓవర్ అనివార్యం కాగా.. ఈసారి భారత్ తమ సత్తా చూపించింది. యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ చేతికి సూర్య బంతిని ఇవ్వగా.. అతడు నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. లంకను రెండు పరుగులకే పరిమితం చేసి.. రెండు వికెట్లు తీశాడు. అనంతరం సూర్య బ్యాట్తో రంగంలోకి దిగి తొలి బంతికే మూడు పరుగులు రాబట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ నేపథ్యంలో లంకపై గెలిచిన అనంతరం మీడియాతో సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ‘‘నాకైతే ఇదే ఫైనల్ మ్యాచ్లా అనిపించింది. మ్యాచ్ చేజారుతుందనుకున్న సమయంలో మా వాళ్లు అద్భుత పోరాటపటిమ కనబరిచి టై వరకు తీసుకువచ్చారు. ఆ తర్వాత అదే జోరు కొనసాగించి మేము గెలిచాము.సంజూ, తిలక్ సూపర్సంజూ, తిలక్ వర్మ బ్యాటింగ్ చేసిన తీరు కనువిందు చేసింది. సంజూ ఓపెనర్గా రాగలడు. మిడిలార్డర్లోనూ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగలడు. తిలక్ కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది.ఇక అర్ష్దీప్ సింగ్.. గత రెండు- మూడేళ్లుగా జట్టుకు ఎంతో చేశాడు. ఈరోజు కూడా తన ప్రణాళికలకు కట్టుబడి ఉండి.. తనకు నచ్చినట్లుగానే వాటిని అమలు చేయమని చెప్పాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో (సూపర్ ఓవర్) అతడు అద్భుతం చేశాడు.అతడికే ఇది సాధ్యంగతంలో కూడా టీమిండియా తరఫున, ఐపీఎల్లోనూ ఇదే చేశాడు. అతడి ఆత్మవిశ్వాసమే బంతి రూపంలో ఇలా మాట్లాడుతుంది. అర్ష్దీప్ తప్ప ఈ సూపర్ ఓవర్ ఎవరూ ఇంత చక్కగా వేయలేరు’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు.Arshdeep '𝘊𝘭𝘶𝘵𝘤𝘩' Singh 🔝🔥#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/GnOq4conhn— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 కాగా లంకతో మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) మరోసారి విజృంభించగా.. సంజూ శాంసన్ (23 బంతులో 39), తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్), అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్) రాణించాడు. ఇక పేసర్ అర్ష్దీప్ సింగ్ నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్లో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.చదవండి: Asia Cup 2025: పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు1 ball is all it took! 😎Surya Kumar Yadav seals an epic super over win for India 👏#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/H1z9GQQWDO— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 -
చరిత్ర సృష్టించిన నిసాంక.. ఆసియా కప్ హిస్టరీలోనే...
టీమిండియాతో ఆసియా కప్-2025 సూపర్-4 మ్యాచ్లో.. శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక అద్భుత ప్రదర్శన కనబరిచాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి... 52 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 58 బంతులు ఎదుర్కొని 107 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.కోహ్లి ఆల్టైమ్ రికార్డు బద్దలుఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా పాతుమ్ నిసాంక (Pathum Nissanka) ఆసియా కప్ టీ20 టోర్నీలో సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర క్రికెట్ ఈవెంట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును నిసాంక బద్దలు కొట్టాడు.కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. మరోవైపు.. లీగ్, సూపర్-4 మ్యాచ్లలో పరాజయమే ఎరుగక ఫైనల్ చేరింది టీమిండియా. ఈ క్రమంలో సూపర్-4 దశలో చివరిగా ఈ రెండు జట్లు (IND vs SL) నామమాత్రపు మ్యాచ్లో తలపడ్డాయి.అభిషేక్ శర్మ ధనాధన్దుబాయ్లో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక.. తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) మరోసారి మెరుపులు మెరిపించగా.. తిలక్ వర్మ (49 నాటౌట్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39) రాణించారు.Beast mode Abhishek Sharma! 🥵#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/CrQW1M492m— Sony Sports Network (@SonySportsNetwk) September 27, 2025 నిసాంక మెరుపు సెంచరీఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లంకకు.. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్ కుశాల్ మెండిస్ను డకౌట్ చేశాడు. అయితే, భారత శిబిరానికి ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో ఓపెనర్ నిసాంకతో పాటు వన్డౌన్ బ్యాటర్ కుశాల్ పెరీరా (32 బంతుల్లో 58) ధనాధన్ దంచికొట్టాడు.టీమిండియా సూపర్ విజయంఆఖర్లో దసున్ శనక (11 బంతుల్లో 22 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసేసరికి శ్రీలంక కూడా ఐదు వికెట్ల నష్టానికి సరిగ్గా 202 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు.అయితే, ఈసారి టీమిండియా ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వలేదు. ఆరు బంతుల్లో లంకను రెండు పరుగులకు కట్టడి చేసి రెండు వికెట్లు తీసిన వికెట్ తీసిన భారత్.. ఆ తర్వాత తొలి బంతికే మూడు పరుగులు చేసి జయభేరి మోగించింది.ఆసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక పరుగుల వీరులు వీరే🏏పాతుమ్ నిసాంక (శ్రీలంక)- 12 ఇన్నింగ్స్లో 434* పరుగులు🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 9 ఇన్నింగ్స్లో 429 పరుగులు🏏అభిషేక్ శర్మ (ఇండియా)- 6 ఇన్నింగ్స్లో 309 పరుగులు🏏బాబర్ హయత్ (హాంకాంగ్)- 8 ఇన్నింగ్స్లో 292 పరుగులు🏏మొహమ్మద్ రిజ్వాన్ (ఇండియా)- 6 ఇన్నింగ్స్లో 281 పరుగులు.చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మPathum Nissanka anchors the chase with a six-hitting spree 💥 Watch #INDvSL LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/jlzQgHf6Ga— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025 -
ఆసియా కప్ లో శ్రీలంకపై టీమిండియా గెలుపు
-
ఆసియా కప్: పాక్తో ఫైనల్కు ముందు టీమిండియాకు రెండు భారీ షాకులు
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మతో పాటు.. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడినట్లు సమాచారం. సూపర్-4 దశలో ఆఖరిగా టీమిండియా శ్రీలంకతో తలపడిన విషయం తెలిసిందే.ఒకే ఒక్క ఓవర్ వేసిదుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఏడు పరుగులు ఇచ్చి.. కుశాల్ మెండిస్ (0) రూపంలో కీలక వికెట్ తీశాడు. అయితే, ఆ తర్వాత హార్దిక్ మళ్లీ బౌలింగ్కు రానేలేదు. అంతకు ముందు బ్యాటింగ్కు దిగిన హార్దిక్ రెండు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.ఫీల్డింగ్కు రాని అభిషేక్మరోవైపు.. మరోసారి మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగిన అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61) కూడా శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా పూర్తిస్థాయిలో ఫీల్డింగ్కు అందుబాటులో ఉండలేదు. దీంతో టీమిండియా అభిమానుల్లో కలవరం నెలకొంది. కాగా లంకపై సూపర్ ఓవర్లో భారత్ విజయం సాధించిన తర్వాత టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడాడు.అప్పుడే ఫిట్నెస్పై అంచనాకు వస్తాంఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మల గురించి ప్రస్తావన రాగా.. ‘‘హార్దిక్ కండరాలు పట్టేశాయి. శుక్రవారం రాత్రి.. శనివారం ఉదయం పరీక్షించిన తర్వాత అతడి ఫిట్నెస్పై అంచనాకు వస్తాము. ఆ తర్వాతే అతడి గురించి నిర్ణయం తీసుకుంటాం. ఇక అభిషేక్ శర్మ కూడా కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. అయితే, తను బాగానే ఉన్నాడు. ఇప్పటికైతే గాయం పెద్దదేమీ కాదు’’అని మోర్నీ మోర్కెల్ తెలిపాడు. కానీ దురదృష్టవశాత్తూ హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ పూర్తిస్థాయిలో ఫిట్గా లేకుంటే మాత్రం టీమిండియాకు తలనొప్పి తప్పదు.ఇద్దరూ అత్యంత కీలకంఇప్పటి వరకు ఆసియా కప్-2025 టోర్నీలో టాప్ రన్ స్కోరర్గా ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ టీమిండియా టాపార్డర్లో అత్యంత కీలకం. మరోవైపు.. ఫైనల్ మ్యాచ్లలో ఒత్తిడిని అధిగమించి వికెట్లు తీయడంతో పాటు పరుగులు రాబట్టడంలో హార్దిక్ పాండ్యా దిట్ట. ముఖ్యంగా పాకిస్తాన్తో మ్యాచ్లలో మరింత మెరుగ్గా రాణించిన రికార్డు పాండ్యాకు ఉంది. కాగా లీగ్, సూపర్-4 దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. ఆదివారం (సెప్టెంబరు 28) నాటి ఫైనల్లో దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ఈ టైటిల్ పోరుకు దుబాయ్ వేదిక. చదవండి: సూర్యకుమార్పై ఐసీసీ చర్య -
Asia cup 2025: ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్లో శ్రీలంకపై టీమిండియా గెలుపు
ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 26న జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్లో శ్రీలంకపై టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు (202/5) సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత్ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది. ఈ గెలుపుతో సంబంధం లేకుండా భారత్ ఇదివరకే ఫైనల్కు చేరింది. సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39; ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు.ఆఖర్లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, సిక్స్) ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా భారత్ చేసినంత స్కోరే చేసింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక వీరోచిత శతకంతో (58 బంతుల్లో 107; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కుసాల్ మెండిస్ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో చివరి వరకు లంక గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు.అయితే నిస్సంక సెంచరీ అనంతరం 19వ ఓవర్ తొలి బంతికి ఔట్ కావడంతో సీన్ మారిపోయింది. శ్రీలంక లక్ష్యానికి పరుగు దూరంలో నిలిచిపోయింది. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులో భారత్ శ్రీలంకపై విజయం సాధించింది. -
IND vs SL: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. స్టార్ ఆటగాడి రికార్డు బద్దలు
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసకాండ కొనసాగుతోంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే చెలరేగిపోతున్న అతను.. ఇవాళ (సెప్టెంబర్ 26) శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లోనూ (India vs Sri Lanka) మెరుపులు కొనసాగించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ 31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేశాడు.ఈ టోర్నీలో అభిషేక్కు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ. అంతకుముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్పై కూడా హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి మ్యాచ్ నుంచి వరుసగా 30 (16), 31 (13), 38 (15), 74 (39), 75 (37), 61 (31) స్కోర్లు చేసిన అభిషేక్.. 6 మ్యాచ్ల్లో మొత్తంగా 309 పరుగులు (204.63 స్ట్రయిక్రేట్తో, 51.50 సగటున, 3 హాఫ్ సెంచరీలు, 31 ఫోర్లు, 19 సిక్సర్లు) చేశాడు. ఈ టోర్నీలో అభిషేక్ మరో మ్యాచ్ (ఫైనల్) కూడా ఆడాల్సి ఉంది.ఈ క్రమంలో అభిషేక్ ఓ ఆల్టైమ్ రికార్డును సెట్ చేశాడు. టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ చరిత్రలో ఓ సింగిల్ ఎడిషన్లో 300 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఎవ్వరూ ఈ మార్కును తాకలేదు. అభిషేక్కు ముందు టీ20 ఆసియా కప్ చరిత్రలో అత్యధిక పరుగులు (సింగిల్ ఎడిషన్) చేసిన రికార్డు పాకిస్తాన్ స్టార్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ (281) పేరిట ఉండేది. రోహిత్ శర్మ సరసనప్రస్తుత ఎడిషన్లో వరుసగా 7 ఇన్నింగ్స్ల్లో 30 ప్లస్ స్కోర్లు చేసిన అభిషేక్ మరో రికార్డును కూడా సమం చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు వరుసగా 30 ప్లస్ స్కోర్లు చేసిన బ్యాటర్గా రోహిత్ శర్మ (Rohit Sharma) సరసన చేరాడు. రోహిత్ కూడా అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 7 ఇన్నింగ్స్ల్లో 30 ప్లస్ స్కోర్లు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 13 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అభిషేక్ (61), శుభ్మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12) ఔట్ కాగా.. తిలక్ వర్మ (27), సంజూ శాంసన్ (22) క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ ఇదివరకే ఫైనల్కు చేరాయి. ఇవాళ జరుగుతున్నది నామమాత్రపు మ్యాచ్. సెప్టెంబర్ 28న ఫైనల్ జరుగుతుంది.చదవండి: వైభవ్ విఫలమైనా..! ఆసీస్ను వారి సొంతగడ్డపై ఊడ్చేసిన టీమిండియా -
Asia cup 2025: శ్రీలంకపై టీమిండియా గెలుపు
శ్రీలంకపై టీమిండియా గెలుపుశ్రీలంకతో జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పేలవంగా 5 బంతుల్లో 2 పరుగులే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత్ తొలి బంతికే 3 పరుగులు తీసి విజయం సాధించింది.స్కోర్లు సమం.. సూపర్ ఓవర్లో తేలనున్న ఫలితంభారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేయగా.. శ్రీలంక కూడా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అన్నే పరుగులు చేసింది.లక్ష్యం దిశగా దూసుకుపోతున్న శ్రీలంకశ్రీలంక టీమిండియాకు షాకిచ్చే దిశగా సాగుతోంది. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు 15 ఓవర్ల తర్వాత 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 157 పరుగులు చేసింది. ఆ జట్టు 30 బంతుల్లో మరో 46 పరుగులు చేస్తే టీమిండియాపై సంచలన విజయం సాధిస్తుంది. నిస్సంక (93), అసలంక (5) క్రీజ్లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక12.2వ ఓవర్-వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కుసాల్ పెరీరా (58) స్టంపౌటయ్యాడు. దుమ్మురేపుతున్న నిస్సంక, పెరీరా.. లక్ష్యం దిశగా సాగుతున్న శ్రీలంక203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు పథుమ్ నిస్సంక, కుసాల్ పెరీరా దుమ్మురేపుతున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకొని శ్రీలంకను లక్ష్యంగా తీసుకెళ్తున్నారు. పెరీరా 27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 52.. నిస్సంక 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 114/1గా ఉంది. ఈ మ్యాచ్లో లంక గెలవాలంటే 60 బంతుల్లో 89 పరుగులు చేయాలి.భారీ లక్ష్య ఛేదన.. ధాటిగా ఆడుతున్న శ్రీలంక203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ధాటిగా ఆడుతుంది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినా (కుసాల్ మెండిస్ డకౌట్).. పథుమ్ నిస్సంక (17 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుసాల్ పెరీరా (9 బంతుల్లో 14; 2 ఫోర్లు) వేగంగా పరుగులు రాబడుతున్నారు. ఫలితంగా శ్రీలంక 4.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. అభిషేక్ విధ్వంసం.. టీమిండియా భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 ఫోర్లు) విధ్వంసం సృష్టించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), సంజూ శాంసన్ (23 బంతుల్లో 39; ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. ఆఖర్లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (4), సూర్యకుమార్ యాదవ్ (12), హార్దిక్ పాండ్యా (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ, చమీరా, హసరంగ, షనక, అసలంక తలో వికెట్ తీశారు.భారీ స్కోర్ దిశగా టీమిండియాటీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 18 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 179/5గా ఉంది. తిలక్ వర్మ (42), అక్షర్ పటేల్ (9) క్రీజ్లో ఉన్నారు. నిరాశపరిచిన హార్దిక్16.1వ ఓవర్- హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు. చమీరా బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా15.3వ ఓవర్- 39 పరుగులు చేసి సంజూ శాంసన్ ఔటయ్యాడు. షనక బౌలింగ్లో అసలంకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.అభిషేక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా8.4వ ఓవర్- 92 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అసలంక బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ శర్మ (61) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 94/3గా ఉంది. తిలక్ వర్మ (10), సంజూ శాంసన్ (1) క్రీజ్లో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా6.5వ ఓవర్- హసరంగ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 7 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 75/2గా ఉంది. అభిషేక్తో పాటు తిలక్ వర్మ (1) క్రీజ్లో ఉన్నాడు.వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ప్రస్తుత ఆసియా కప్లో అభిషేక్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ చేశాడు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో 22 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని తాకాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 71/1గా ఉంది. అభిషేక్తో పాటు సూర్యకుమార్ యాదవ్ (11) క్రీజ్లో ఉన్నాడు.దుమ్మురేపుతున్న అభిషేక్ శర్మఆసియా కప్లో అభిషేక్ శర్మ విధ్వంసకాండ కొనసాగుతోంది. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లోనూ అతను దుమ్మురేపుతున్నాడు. 19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 59/1గా ఉంది. అభిషేక్తో పాటు సూర్యకుమార్ యాదవ్ (11) క్రీజ్లో ఉన్నాడు.టీమిండియాకు ఆదిలోనే షాక్1.3వ ఓవర్- టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాకు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. తీక్షణ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (4) ఔటయ్యాడు. ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. బుమ్రా, శివమ్ దూబే స్థానాల్లో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా తుది జట్టులోకి వచ్చారు. శ్రీలంక ఓ మార్పు చేసింది. చమిక కరుణరత్నే స్థానంలో లియనాగే జట్టులోకి వచ్చాడు. ఈ టోర్నీలో ఇదివరకే ఫైనల్ బెర్త్లు ఖరారైన నేపథ్యంలో ఈ మ్యాచ్ నామమాత్రంగా జరుగుతుంది. ఆదివారం జరుగబోయే ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడతాయి.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తిశ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (wk), కుసల్ పెరెరా, చరిత్ అసలంక (c), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, జనిత్ లియనాగే, దుష్మంత చమీర, మహీశ తీక్షణ, నువాన్ తుషార -
Asia cup 2025: పాకిస్తాన్ ఆటగాళ్ల ఓవరాక్షన్పై ఐసీసీ చర్యలు
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా సెప్టెంబర్ 21న టీమిండియాతో జరిగిన సూపర్-4 మ్యాచ్లో (India vs Pakistan) పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రౌఫ్ (Haris Rauf), సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ఓవరాక్షన్ చేసిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్లో రౌఫ్ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్ను గన్లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. పాక్ ఆటగాళ్లు చేసిన ఈ ఓవరాక్షన్పై బీసీసీఐ అభ్యంతం వ్యక్తం చేసింది. ఐసీసీకి ఫిర్యాదు చేసింది.దీనిపై రౌఫ్, ఫర్హాన్ ఇవాళ (సెప్టెంబర్ 26) విచారణ ఎదుర్కొన్నారు. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ (Richie Richardson) ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో వారిద్దరూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ను (Level 1 offence) ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ చర్యలు గేమ్ స్పిరిట్ను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.ఇలాంటి ప్రవర్తన మరోసారి రిపీట్ చేస్తే సహించేది లేదంటూ రౌఫ్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జరిమానాగా మ్యాచ్ ఫీజ్లో 30 శాతం కోత విధించారు. ఫర్హాన్కు సైతం వార్నింగ్ ఇస్తూ.. మందలింపుతో వదిలిపెట్టారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.సూర్యకుమార్కు జరిమానాఇదే టోర్నీలో పాకిస్తాన్తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించగా.. ఆ విజయాన్ని సూర్యకుమార్ "ఆపరేషన్ సిందూర్" అనే ప్రభుత్వ చర్యను ప్రస్తావిస్తూ, భారత మిలిటరీ సర్వీసెస్కు అంకితం చేశాడు.ఈ వ్యాఖ్యలపై పీసీబీ అభ్యంతరం తెలుపుతూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయమై సూర్యకుమార్ను సైతం విచారణ చేసి, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించింది. అలాగే మ్యాచ్ ఫీజ్లో 30 శాతం విధించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ఆసియా కప్లో ఇదివరకే రెండు సార్లు (గ్రూప్ దశ, సూపర్-4) తలపడిన భారత్-పాకిస్తాన్.. ఆదివారం జరుగబోయే ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. పై రెండు సందర్భాల్లో భారత్ పాక్ను చిత్తుగా ఓడించింది. చదవండి: సెలెక్ట్ చేస్తారని అనుకున్నా.. కరుణ్ నాయర్ ఆవేదన -
Abhishek Sharma: ప్రేమలో పడ్డ అభిషేక్ శర్మ?.. ఇంతకీ ఎవరీమె?
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma)కెరీర్లోనే ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ పంజాబీ బ్యాటర్.. అనతికాలంలోనే ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్గా ఎదిగాడు. ఇక ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టీ20 ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్లో 907 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు.ఇక ఆసియా కప్ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న అభిషేక్ శర్మ ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్లో కలిపి 248 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్రేటు 206కు పైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్న 25 ఏళ్ల అభిషేక్ శర్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ వదంతి వ్యాప్తిలోకి వచ్చింది.ప్రేమలో పడ్డ అభిషేక్ శర్మ?లైలా ఫైజల్ ( Laila Faisal) అనే అమ్మాయితో అభిషేక్ ప్రేమలో ఉన్నాడనేది ఆ వార్త సారాంశం. అభిషేక్ అక్క కోమల్ శర్మ డాక్టర్ అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తన తమ్ముడి మ్యాచ్ ఉన్న సమయంలో స్టేడియానికి వెళ్లి అతడిని ఉత్సాహపరచడంలో కోమల్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది.ముఖ్యంగా ఐపీఎల్లో అభి ప్రాతినిథ్యం వహించే సన్రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్లన్నింటీకి తల్లి మంజుతో కలిసి కోమల్ హాజరవుతుంది. ఇక వీరితో పాటు లైలా కూడా చాలాసార్లు కెమెరా కంటికి చిక్కింది. నిజానికి లైలా కోమల్ బెస్ట్ ఫ్రెండ్ అని వారి సోషల్ మీడియా అకౌంట్లలోని పోస్టుల ద్వారా తెలుస్తోంది.ఇటీవల కోమల్ బ్యాచిలరెట్ పార్టీలోనూ లైలా హైలైట్గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆసియా కప్ ఆడేందుకు అభిషేక్ యూఏఈ వెళ్లగా.. అతడి తల్లి మంజు, అక్క కోమల్ కూడా అక్కడే ఉన్నారు. వీరితో పాటు లైలా కూడా వెళ్లినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.ఎవరీ లైలా ఫైజల్?LRF అనే లగ్జరీ దుస్తుల బ్రాండ్ సహ వ్యవస్థాపకురాలు. తల్లి రూహీ ఫైజల్తో కలిసి లైలా దీనిని ప్రారంభించింది. కశ్మీర్ సిల్క్స్తో పాటు చేనేత వస్త్రాలకు ఈ బ్రాండ్ ప్రసిద్ధి. ఇప్పుడిప్పుడే భారత ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న లైలా పేరు అభిషేక్తో ముడిపడటంతో ఒక్కసారిగా ఆమె వెలుగులోకి వచ్చింది.కాగా వ్యాపార రంగంలో అడుగుపెట్టే ముందు లైలా లండన్లో సైకాలజీ చదివినట్లు సమాచారం. ఆ తర్వాత అక్కడే ఫ్యాషన్ టెక్నాలజీలోనూ కోర్సు చేసినట్లు తెలుస్తోంది. మలన్ బ్రెటాన్, రాకీ స్టార్ వంటి ప్రఖ్యాత డిజైనర్లతో కలిసి పనిచేసిన లైలా.. తర్వాత తనకంటూ సొంత బ్రాండ్ను స్థాపించింది.చదవండి: IND vs AUS: కేఎల్ రాహుల్ భారీ సెంచరీ.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్ -
ఇదేందయ్యా ఇది.. ఇంత చెత్త ఫీల్డింగ్!.. గొప్పలకేమీ తక్కువలేదు
బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్తో విమర్శల పాలైంది. ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్లో ఉండీ.. అప్పటికి ఫీల్డర్ బంతిని తన చేతుల్లోకి తీసుకున్నా.. రనౌట్ చేసే సువర్ణావకాశాన్ని మిస్ చేసుకుంది. ఎట్టకేలకు పదకొండు పరుగుల తేడాతో గట్టెక్కడం వల్ల సరిపోయింది గానీ లేదంటే.. ఈ చెత్త ఫీల్డింగ్ కారణంగా పాక్ ఫైనల్ అవకాశం చేజారేదే!అసలేం జరిగిందంటే.. ఆసియా టీ20 కప్-2025 సూపర్-4లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ గురువారం బంగ్లాదేశ్ (PAK vs BAN)తో తలపడింది. దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఫైనల్కు అర్హతఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మొహమ్మద్ హ్యారిస్ (31), మొహమ్మద్ నవాజ్ (25) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో పదకొండు పరుగుల తేడాతో పాక్ గెలుపొంది.. ఫైనల్కు అర్హత సాధించింది.అయితే, బంగ్లా ఇన్నింగ్స్లో ఐదో ఓవర్లో షాహిన్ ఆఫ్రిది బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతిని తౌహీద్ హృదయ్ (Towhid Hridoy) ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. దీంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సయీమ్ ఆయుబ్ (Saim Ayub) బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపాడు.రనౌట్ అవకాశం మిస్కానీ అప్పటికే మరో ఎండ్లో ఉన్న సైఫ్ హసన్ తౌహీద్ హృదయ్ వైపు పరుగెత్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ స్ట్రైకర్ ఎండ్లో ఉండగా.. ఆయుబ్ బౌలర్ ఎండ్ వైపు బంతిని విసిరాడు. అయితే, మిస్ ఫీల్డ్ అయింది. బంతిని అందుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. మిడాన్లో ఉన్న ఫీల్డర్ వచ్చి బంతిని అందుకోవాల్సి వచ్చింది.ఇంతలో సైఫ్ వేగంగా తన స్థానంలోకి వచ్చేశాడు. దీంతో రనౌట్ అవకాశం మిస్సవగా.. ఆయుబ్ ముఖం మాడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్పై విజయం తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. తమ ఫీల్డింగ్ అద్భుతమంటూ కొనియాడాడు.గొప్పలకు మాత్రం ఏం తక్కువ లేదుఈ నేపథ్యంలో రనౌట్ చాన్స్ మిస్ చేసిన ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘చెత్త ఫీల్డింగ్.. గొప్పలకు మాత్రం ఏం తక్కువ లేదు’’ అంటూ నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాక్ ఫీల్డర్ల కారణంగా లైఫ్ పొందిన బంగ్లా ఓపెనర్ సైఫ్ హసన్ 18 పరుగులే చేయగలిగాడు. మరోవైపు.. తౌహీద్ హృదయ్ (5) కూడా ఫెయిలయ్యాడు. షమీమ్ హొసేన్ (30) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. ఇక బంగ్లాపై గెలిచిన పాక్.. సెప్టెంబరు 28న టీమిండియాతో ఫైనల్లో తలపడుతుంది.చదవండి: సూర్య... అలాంటి వ్యాఖ్యలొద్దుBoth batters at the same end but still survive 😲Watch #PAKvBAN Live now on the Sony Sports Network TV channels Sony LIV. #SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/b6tXLSMI1d— Sony Sports Network (@SonySportsNetwk) September 25, 2025 -
మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. మా ఫీల్డింగ్ సూపర్: పాక్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థిగా పాకిస్తాన్ ఖరారైంది. దుబాయ్లో గురువారం జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై పదకొండు పరుగుల తేడాతో గట్టెక్కిన పాక్.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబరు 28) భారత జట్టుతో ఫైనల్లో (IND vs PAK In Final) తలపడేందుకు సిద్ధపడింది.135 పరుగులుకాగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో టాస్ ఓడిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (4), ఫఖర్ జమాన్ (13) నిరాశపరచగా.. సయీమ్ ఆయుబ్ డకౌట్ అయ్యాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) 19 పరుగులు చేయగా.. హుసేన్ తలట్ 3 పరుగులకే నిష్క్రమించాడు.Mustafizur Rahman sends the Pakistan captain packing 💨☝️Watch #PAKvBAN LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/bkPfVMxULa— Sony Sports Network (@SonySportsNetwk) September 25, 2025ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ హ్యారిస్ 23 బంతుల్లో 31, మొహమ్మద్ నవాజ్ 15 బంతుల్లో 25 పరుగులతో ఆకట్టుకున్నారు. వీరికి తోడుగా పేసర్ షాహిన్ ఆఫ్రిది 13 బంతుల్లో 19 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 135 పరుగులు చేయగలిగింది.రాణించిన పాక్ బౌలర్లుబంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా... మెహదీ హసన్, రిషాద్ హొసేన్ రెండేసి వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రహమాన్కు ఒక వికెట్ దక్కింది. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. పాక్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 124 పరుగులే చేసింది. షమీమ్ హొసేన్ (30) ఒక్కడే ఇరవై పరుగుల వ్యక్తిగత స్కోరు దాటాడు.పాక్ ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్ మూడేసి వికెట్లు కూల్చి సత్తా చాటగా.. సయీమ్ ఆయుబ్ రెండు, మొహమ్మద్ నవాజ్ ఒక వికెట్ పడగొట్టారు.అతడి బౌలింగ్ అద్భుతంఇక బంగ్లాదేశ్పై విజయంతో ఫైనల్లో అడుగుపెట్టిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. తాము ఆదివారం నాటి పోరుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.‘‘ఇలాంటి మ్యాచ్లలో గెలిచామంటే మేమొక ప్రత్యేక జట్టు అనే చెప్పవచ్చు. మా జట్టులోని ప్రతి ఒక్కరు మెరుగ్గా ఆడారు. అయితే, బ్యాటింగ్ విభాగంలో మేము మరింత మెరుగుపడాల్సి ఉంది. ఆ దిశగా మేము ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్నాము కూడా!షాహిన్ ఓ ప్రత్యేకమైన ఆటగాడు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా రాణించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అతడి బౌలింగ్ అద్భుతంగా ఉంది. ఏదేమైనా మేము ఇంకో 15 పరుగులు చేసి ఉంటే విజయం సులభమయ్యేది.ఏ జట్టునైనా ఓడించగలముఅయితే, మా బౌలర్లు గొప్పగా రాణించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి అనుకున్న ఫలితం రాబట్టారు. ఇక మేము అద్భుతంగా ఫీల్డింగ్ చేయడం వల్లే విజయం సాధ్యమైందని చెప్పవచ్చు. మా కోచ్ కఠినంగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఎక్స్ట్రా సెషన్స్ పెడుతున్నారు.హెడ్కోచ్ మైక్ హసన్.. ‘ఫీల్డింగ్ చేస్తేనే మీకు జట్టులో స్థానం ఉంటుంది’ అని చెప్పాడు. ఫీల్డింగ్ విషయంలో మా వాళ్లు అంత కఠినంగా ఉంటున్నారు. మా జట్టు ప్రస్తుతం గొప్పగా ఉంది. మేము ఏ జట్టునైనా ఓడించగలము. ఆదివారం నాటి మ్యాచ్లో ఇది చేసి చూపించేందుకు ప్రయత్నిస్తాం’’ అని సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బంగ్లాపై నామ మాత్రపు గెలుపు సాధించినందుకే ఇంత అతి వద్దంటూ నెటిజన్లు సల్మాన్ను ట్రోల్ చే స్తున్నారు.టీమిండియా చెత్త ఫీల్డింగ్కాగా లీగ్ దశలో అజేయంగా ఉండి సూపర్-4 చేరిన భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ చేరింది. అయితే, ఆసియా కప్ తాజా ఎడిషన్లో టీమిండియా ఇప్పటి వరకు అత్యధికంగా.. ఏకంగా 12 క్యాచ్లు డ్రాప్ చేసింది. మరోవైపు.. పాక్ కేవలం నాలుగు క్యాచ్లు మాత్రమే నేలపాలు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా ఉన్న సూర్యసేన.. ఫీల్డింగ్ తప్పిదాలు సరిచేసుకుంటేనే విజయం నల్లేరు మీద నడక అవుతుంది. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.చదవండి: IND vs WI: అందుకే అతడిని ఎంపిక చేయలేదు: అజిత్ అగార్కర్ -
Asia Cup 2025: భారత్ ప్రత్యర్థి పాక్
దుబాయ్: ‘చేతులు’ కలుపుకోలేని దాయాదులే టైటిల్ కోసం తలపడేందుకు సిద్ధమయ్యారు. ఆసియా కప్ టి20 టోర్నీలో భారత్తో అమీతుమీకి పాకిస్తాన్ అర్హత సంపాదించింది. ఆదివారం ఈ తుది సమరం జరుగుతుంది. ఓవరాల్ ‘ఆసియా’ కప్ చరిత్రలో ఇరుజట్లు తొలిసారి ఫైనల్లో పోటీపడనున్నాయి. సెమీస్ కానీ సెమీస్ను తలపించిన సూపర్–4 మ్యాచ్లో పాకిస్తాన్ 11 పరుగులతో బంగ్లాదేశ్పై గెలిచింది. సాధారణంగా విధ్వంసరచన చేసే టి20 ఫార్మాట్ను ఈసారి బౌలర్లు శాసించారు. దీంతో 40 ఓవర్లలోనే 17 వికెట్లు కూలాయి. ముందుగా పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మొహమ్మద్ హరిస్ (23 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. బంగ్లా బౌలర్లు తస్కిన్ అహ్మద్ 3, మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేయగలిగింది. షమీమ్ హొస్సేన్ (25 బంతుల్లో 30; 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించాడు. షాహిన్ అఫ్రిది, హరిస్ రవూఫ్ చెరో 3 వికెట్లు తీయగా, సయీమ్ అయూబ్కు 2 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్లో తడబడి... బౌలింగ్తో గట్టెక్కి పాకిస్తాన్ బ్యాటింగ్లో తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు ఫర్హాన్ (4), ఫఖర్ జమన్ (13), సయీమ్ అయూబ్ (0) చేతులెత్తేశారు. తర్వాత తలత్ (3) కూడా వారిని అనుసరించగా, కెపె్టన్ సల్మాన్ ఆగా (23 బంతుల్లో 19; 2 ఫోర్లు), మొహమ్మద్ హరిస్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. నవాజ్ (15 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్లు), షాహిన్ అఫ్రిది (13 బంతుల్లో 19; 2 సిక్స్లు) 20 ఓవర్ల కోటా ఆడేందుకు దోహదపడ్డారు. బంగ్లా బౌలర్లు పాక్ను ఎలా దెబ్బకొట్టారో అదే బౌలింగ్ ఆయుధంతో పాకిస్తాన్ కూడా బంగ్లాను వణికించింది. షాహిన్ అఫ్రిది ఓపెనర్ పర్వేజ్ హొస్సేన్ (0)ను... కాసేపటికి వన్డౌన్ బ్యాటర్ తౌహిద్ హృదయ్ (5)ని అవుట్ చేశాడు. స్వల్ప వ్యవధిలో మరో ఓపెనర్ సైఫ్ హసన్ (18)ను రవూఫ్, మెహదీ హసన్ (11)ను నవాజ్ అవుట్ పెవిలియన్ చేర్చడంతో 44 పరుగులకే టాప్–4 వికెట్లను కోల్పోయింది. షమీమ్ హొస్సేన్ (25 బంతుల్లో 30; 2 సిక్స్లు) ఆశలు రేపినా... షాహిన్ అఫ్రిది నిప్పులు చెరిగే బౌలింగ్తో తుంచేశాడు. కెపె్టన్ జాకిర్ అలీ (5), తంజిమ్ హసన్ (10), తస్కిన్ అహ్మద్ (4)లు కూడా పాక్ బౌలర్లకు తలవంచడంతో వందలోపే (97/8) ఎనిమిది వికెట్లను కోల్పోయి పరాజయానికి సిద్ధమైంది. -
ఆసియా కప్-2025: ఇది కరెక్ట్ కాదు సూర్య!.. మేమిలాగే చేస్తాం
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా మరోసారి తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. లీగ్ దశలో ఒమన్తో మ్యాచ్లో బ్యాటింగ్ దిగని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ (Abhishek Sharma)- శుబ్మన్ గిల్ (Shubman Gill)లను మినహా దాదాపుగా అందరి స్థానాలు మార్చాడు.అపుడు అలా.. ఇపుడు ఇలాసంజూ శాంసన్ (Sanju Samson)ను వన్డౌన్లో.. ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్లను బరిలోకి దించాడు. తాజాగా సూపర్-4లో బంగ్లాదేశ్తో కీలకమైన బుధవారం నాటి మ్యాచ్లోనూ భారత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరిగాయి.ఓపెనర్లుగా అభి (37 బంతుల్లో 75)- గిల్ (19 బంతుల్లో 29)లను కొనసాగించిన యాజమాన్యం.. ఆల్రౌండర్, ఫినిషర్ శివం దూబే (2)ను వన్డౌన్లో పంపగా విఫలమయ్యాడు. తనదైన నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సూర్య (5) కూడా విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా (38) ఐదు, తిలక్ వర్మ (5) ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయగా.. అక్షర్ పటేల్ (10 నాటౌట్) ఏడో ఆటగాడిగా వచ్చాడు.ఇక సంజూ శాంసన్ను ఎనిమిది.. ఆ తర్వాతి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి బ్యాటింగ్ చేయాల్సింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. వీరంతా మైదానంలో అడుగుపెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.ఇదెలాంటి క్రికెట్ లాజిక్?అయితే, బంగ్లాదేశ్తో ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్లో భారత్ నామమాత్రపు స్కోరు చేయడం.. ఆ తర్వాత 41 పరుగుల తేడాతో గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలపై కెప్టెన్ సూర్యకుమార్పై విమర్శలు వచ్చాయి.ముఖ్యంగా ఓ వైపు వికెట్లు పడుతున్నా సంజూ శాంసన్ ఎనిమిదో స్థానంలో దింపాలనుకోవడంపై భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘సంజూ శాంసన్ ఎనిమిదో స్థానంలో రావడమా? ఇదెలాంటి క్రికెట్ లాజిక్. ఇది ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదు’’ అంటూ సూర్య నిర్ణయాన్ని తప్పుబట్టాడు.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్పై విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విమర్శలకు బదులు ఇచ్చాడు. ‘‘ఈ టోర్నీలో మాకు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. ఒమన్పై మొదట బ్యాటింగ్ చేశాం. మళ్లీ ఇప్పుడు. సూపర్-4లో అనుకున్నట్లుగానే ముందుకు సాగుతున్నాం.మేమిలాగే చేస్తాంబంగ్లా బౌలింగ్ లైనప్ చూసిన తర్వాతే మా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకున్నాం. వారి జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ ఉన్నారు. దూబే స్పిన్ బాగా ఆడతాడనే అతడిని ముందుగా పంపించాం.కానీ ఈసారి అది వర్కౌట్ కాలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అంతమాత్రాన మా ప్రణాళికలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అవుట్ఫీల్డ్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే మేమే 180- 185 పరుగులు చేసేవాళ్లం. ఇక 12- 14 ఓవర్లు బాగా బౌలింగ్ చేసిన సందర్భాల్లోనూ మేము మెజారిటీ మ్యాచ్లలో గెలుపొందాం’’ అని తన నిర్ణయాన్ని సూర్య సమర్థించుకున్నాడు. కాగా బంగ్లాదేశ్పై విజయంతో టీమిండియా ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇక.. టీమిండియా తదుపరి శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఇందుకు దుబాయ్ వేదిక. The moment India stormed into the Asia Cup Final 🌟 Watch #DPWorldAsiaCup2025 from September 9-28, 7 PM onwards, Live on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvBAN pic.twitter.com/7VN6tJ0rwa— Sony Sports Network (@SonySportsNetwk) September 24, 2025చదవండి: టీమిండియా కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
పాక్ ఆటగాళ్ల బరితెగింపు.. షాకిచ్చిన బీసీసీఐ!.. మరోసారి పీసీబీ ఓవరాక్షన్
టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా కవ్వింపులకు పాల్పడ్డ పాకిస్తాన్ ఆటగాళ్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చర్యలకు ఉపక్రమించింది. భారతీయల మనోభావాలు దెబ్బతినేలా.. రెచ్చగొట్టేలా ప్రవర్తించిన సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ఫిర్యాదు చేసింది.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా టీ20 కప్-2025 వేదికగా భారత్- పాక్ (IND vs PAK)జట్లు తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. లీగ్ దశలో మ్యాచ్ సందర్భంగానే టీమిండియా తమ వైఖరిని దాయాదికి తెలియజేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది.రెచ్చగొట్టేలా సెలబ్రేషన్స్ఇక సూపర్-4 మ్యాచ్లోనూ టీమిండియా తన వైఖరిని కొనసాగించింది. అయితే, లీగ్ దశ మ్యాచ్లో కాస్త సైలెంట్గానే ఉన్నపాక్ ఆటగాళ్లు.. ఈసారి మాత్రం రెచ్చగొట్టేలా కవ్వింపులకు పాల్పడ్డారు. ఓపెనర్ ఫర్హాన్ అర్ధ శతకం పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్ను ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి.. కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు.పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘటనను ఈ చర్య ద్వారా ఫర్హాన్ మరోసారి గుర్తుచేసినట్లయింది. అయితే, మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ కూడా.. తాను సాధారణంగా హాఫ్ సెంచరీకి సెలబ్రేట్ చేసుకోనని.. ఈసారి మాత్రం ఇలా సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించిందని మరోసారి రెచ్చగొట్టాడు.‘6-0’ సంజ్ఞతో రవూఫ్ కవ్వింపులుఅంతేకాదు.. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా తాను లెక్కచేయనంటూ ఫర్హాన్ అహంకారపూరితంగా మాట్లాడాడు. ఇక హ్యారిస్ రవూఫ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘6-0’ సంజ్ఞతో టీమిండియా అభిమానుల వైపు చూస్తూ అతి చేశాడు.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత ఆర్మీ.. ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు బదులుగా పాక్ సైన్యం రంగంలోకి వచ్చి ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ ఘటనలో పాక్ ఎయిర్బేస్లు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.కిక్కురమనలేదుఅయితే, రవూఫ్ మాత్రం పాక్ చెప్పుకొంటున్నట్లుగా.. తాము భారత్కు చెందిన ఆరు యుద్ధ విమానాలు కూల్చేశామన్నట్లు ఇలా సైగ చేయడం గమనార్హం. లీగ్ దశలో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఆటలు, రాజకీయం వేరు అంటూ సుద్దులు చెప్పిన పాక్.. సూపర్-4 మ్యాచ్లో తమ ఆటగాళ్లు ఇంత యథేచ్చగా బరితెగించినా కిక్కురమనలేదు.షాకిచ్చిన బీసీసీఐఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ.. పాక్ ఆటగాళ్ల ప్రవర్తనపై ఐసీసీకి ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సాహిబ్జాదా ఫర్హాన్, హ్యారిస్ రవూఫ్ల నుంచి ఐసీసీ లిఖిత పూర్వక వివరణ అడిగే అవకాశం ఉంది. విచారణలో భాగంగా వీరిద్దరు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. లీగ్, సూపర్-4 దశలో పాక్ను చిత్తు చేసిన టీమిండియా.. బుధవారం నాటి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి ఆసియా కప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.పాక్ బోర్డు ఓవరాక్షన్బీసీసీఐ చర్యల నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు కూడా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లీగ్ దశలో పాకిస్తాన్పై తమ విజయాన్ని సూర్య.. పహల్గామ్ బాధితులు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత ఆర్మీకి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి పీసీబీ.. ఐసీసీని ఆశ్రయించినట్లు సమాచారం.చదవండి: అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’ -
పాకిస్తాన్పై గెలుస్తాం.. ఫైనల్లో ఆడతాం: బంగ్లాదేశ్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్ చేరింది. సూపర్-4లో తొలుత పాకిస్తాన్ (IND vs PAK)ను ఓడించిన భారత జట్టు.. బుధవారం నాటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఈ క్రమంలో గురువారం (సెప్టెంబరు 25) జరిగే మ్యాచ్ ద్వారా మరో ఫైనలిస్టు ఖరారు కానుంది. దుబాయ్ వేదికాగా జరిగే ఈ మ్యాచ్లో పాకిస్తాన్- బంగ్లాదేశ్ (Pak vs Ban) చావో రేవో తేల్చుకోనున్నాయి.ఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ జాకిర్ అలీ (Jaker Ali) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్పై తప్పకుండా పైచేయి సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం‘‘టీమిండియాతో మ్యాచ్లో మా వాళ్లు మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా పది ఓవర్ల తర్వాత మా బౌలర్లు అద్భుతం చేశారు. ఈ మ్యాచ్లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం.గురువారం మేము కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇందులో గెలిచి.. ఫైనల్లో ఆడాలనే కసితోనే బరిలో దిగాల్సి ఉంటుంది. మా ఆట ఎలా ఉంటుందో చూద్దాం. ఏదేమైనా అత్యుత్తమ ప్రదర్శన మాత్రం ఇస్తామని కచ్చితంగా చెప్పగలను.పాకిస్తాన్పై గెలుస్తాం.. ఫైనల్లో ఆడతాంమేము ఏ జట్టును తేలికగా తీసుకోము. మా బలాలు, సామర్థ్యాలపై పూర్తిగా దృష్టి పెడతాం. పాకిస్తాన్ గడ్డ మీద, స్వదేశంలో పాక్తో ఆడిన అనుభవం మాకు ఉంది. కచ్చితంగా మేము పని పూర్తి చేస్తాము’’ అని జాకిర్ అలీ పాక్ను ఓడించి.. టీమిండియాతో ఫైనల్ ఆడతామనే ధీమా వ్యక్తం చేశాడు.ముఖాముఖి పోరులో పాక్దే పైచేయికాగా ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్లో పర్యటించిన బంగ్లా జట్టు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో.. పాక్ చేతిలో 3-0తో క్లీన్స్వీప్ అయింది. ఆ తర్వాత పాక్ జూలైలో బంగ్లా పర్యటనకు రాగా.. పర్యాటక జట్టుపై బంగ్లాదేశ్ 2-1తో గెలిచి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే.. టీమిండియాతో ఆసియా కప్ మ్యాచ్కు బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో 27 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ జాకిర్ అలీ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.ఇక టీ20 ఫార్మాట్లో బంగ్లాదేశ్- పాకిస్తాన్ ఇప్పటి వరకు 25సార్లు ముఖాముఖి తలపడగా.. పాక్ 20, బంగ్లాదేశ్ ఐదు సార్లు విజయం సాధించాయి.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు👉భారత్: 168/6 (20)👉బంగ్లాదేశ్: 127 (19.3)👉ఫలితం: బంగ్లాదేశ్పై 41 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75)చదవండి: BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్! -
అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరోసారి అదరగొట్టాడు. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్ (IND vs BAN)తో బుధవారం నాటి మ్యాచ్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లతో పాటు ఐదు సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్రేటు 202.70.And just like that, Abhishek Sharma reaches his fifty 🤯 Watch #INDvBAN LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/fP1RpHC0Eu— Sony Sports Network (@SonySportsNetwk) September 24, 2025తొందరపాటు చర్యక్రీజులో కుదురుకున్న తర్వాత ధనాధన్ దంచికొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన అభిషేక్ శర్మ.. ఓ దశలో సెంచరీ చేసే దిశగా పయనించాడు. అయితే, తన తొందరపాటు చర్య కారణంగా ఊహించని రీతిలో రనౌట్గా వెనుదిరిగాడు.టీమిండియా ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్లో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ బంతితో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా షాట్ కట్ చేశాడు. అయితే, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రిషాద్ హొసేన్ వేగంగా స్పందించాడు.సూర్య చెప్పినా కూడా..డైవ్ కొట్టి మరీ బంతిని ఆపాడు. అయితే, అప్పటికే అభిషేక్ శర్మ సింగిల్ కోసమని నాన్-స్ట్రైకర్ పొజిషన్ నుంచి ముందుకు కదిలాడు. ఈ విషయాన్ని గమనించిన సూర్య.. అభిషేక్ను వెనక్కి వెళ్లమని చెప్పాడు. దీంతో అతడు తిరిగి తన స్థానంలోకి వస్తుండగా.. రిషాద్.. బౌలర్ ముస్తాఫిజుర్ వైపు బంతిని త్రో చేయగా.. అతడు ఒడిసి పట్టాడు.అక్కకు హార్ట్బ్రేక్అభిషేక్ క్రీజులోకి వచ్చే కంటే ముందే బంతిని వికెట్లకు గిరాటేయడంతో అతడు రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో అభిషేక్ 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మైదానంలోని ప్రేక్షకులతో పాటు.. అభి అక్క కోమల్ కూడా తీవ్ర నిరాశకు గురైంది.సెంచరీ చేసే ఛాన్స్ మిస్.. గావస్కర్ ‘ఫైర్’ఇక కామెంటేటర్, టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం.. అభిషేక్ శర్మ తొందరపాటు చర్యను విమర్శించకుండా ఉండలేకపోయాడు. ‘‘అసలు అక్కడ పరుగు తీయాల్సిన అవసరమే లేదు. అక్కడ సింగిల్కు అసలు ఆస్కారమే లేదు. అసలు అక్కడ ఏం ఉంది?’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫైనల్లో భారత్కాగా అభిషేక్ శర్మ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్ నెమ్మదించింది. హార్దిక్ పాండ్యా (38) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. అంతకు ముందు మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 168 పరుగులు చేయగలిగింది.అయితే, లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాను భారత బౌలర్లు 127 పరుగులకే ఆలౌట్ చేయడంతో.. 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఆసియా కప్-2025 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. విధ్వంసర బ్యాటింగ్తో చెలరేగిన అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. Unfortunate end! 💔 "Abhishek Sharma departs after an absolute power-packed show. Missed out on a well-deserved 💯 but what a knock! "🔥 Absolute cinema!!🚀#AbhishekSharma #AsiaCup2025 #INDvsBAN #TeamIndia pic.twitter.com/cgRQFUkQNh— ममता राजगढ़ (@rajgarh_mamta1) September 24, 2025చదవండి: BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్!pic.twitter.com/SjXZnnshzK— The Game Changer (@TheGame_26) September 24, 2025 -
ఆసియా కప్ లో ఫైనల్ కు టీమిండియా
-
Asia cup 2025: అభిషేక్ విధ్వంసం.. ఫైనల్లో టీమిండియా
ఆసియా కప్ 2025లో టీమిండియా ఫైనల్కు చేరింది. బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన సూపర్-4 మ్యాచ్లో 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్కు చేరడమే కాకుండా శ్రీలంకను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్లో విజేత ఫైనల్లో భారత్తో తలపడుతుంది.బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభాన్ని ఇచ్చినా టీమిండియా నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది.అభిషేక్ క్రీజ్లో ఉండగా భారత్ స్కోర్ 200 పరుగులు దాటుతుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతులు వృధా చేసి (11 బంతుల్లో 5) ఔటయ్యాడు. అంతకుముందే శివమ్ దూబే (2) నిరాశపరిచాడు.తిలక్ వర్మ (7 బంతుల్లో 5) కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. అక్షర్ పటేల్ (15 బంతుల్లో 10 నాటౌట్) దారుణంగా ఆడాడు. చివరి ఓవర్లో బంతులు వృధా చేసి భారత్ ఓ మోస్తరు స్కోర్కే పరిమితమయ్యేలా చేశాడు.తొలి 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన భారత్.. చివరి 9 ఓవర్లలో కేవలం 56 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.అనంతరం 169 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆది నుంచే ప్రత్యర్ధిపై ఒత్తిడి తెచ్చింది. బుమ్రా (4-0-18-2), వరుణ్ చక్రవర్తి (4-0-29-2), కుల్దీప్ యాదవ్ (4-0-18-3), అక్షర్ పటేల్ (4-0-37-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ సైఫ్ హసన్ (69) ఒంటరిపోరాటం చేశాడు. అతనితో పాటు పర్వేజ్ హొస్సేన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సెప్టెంబర్ 26న జరిగే నామమాత్రపు మ్యాచ్లో భారత్.. శ్రీలంకతో తలపడుతుంది. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
Asia cup 2025: సూర్యకుమార్ యాదవ్పై ఫ్యాన్స్ ఫైర్
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో (India vs Bangladesh) టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నామమాత్రపు స్కోర్కు పరిమితమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభాన్ని ఇచ్చినా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులే చేసింది.అభిషేక్ క్రీజ్లో ఉండగా భారత్ స్కోర్ తప్పకుండా 200 పరుగులు దాటుతుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔట్ కావడంతో పరిస్థితితారుమారైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) బంతులు వృధా చేసి (11 బంతుల్లో 5) ఔటయ్యాడు. అంతకుముందే శివమ్ దూబే (2) నిరాశపరిచాడు.తిలక్ వర్మ (7 బంతుల్లో 5) కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడినా.. టీ20 స్థాయి తగ్గట్టుగా లేదు. అక్షర్ పటేల్ (15 బంతుల్లో 10 నాటౌట్) దారుణంగా ఆడాడు. చివరి ఓవర్లో బంతులు వృధా చేసి భారత్ ఓ మోస్తరు స్కోర్కే పరిమితమయ్యేలా చేశాడు.తొలి 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన భారత్.. చివరి 9 ఓవర్లలో కేవలం 56 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.మంచి ఆరంభం లభించినా టీమిండియా నామమాత్రపు స్కోర్కు పరిమితమవడానికి అభిషేక్, గిల్ మినహా అంతా కారణమైనప్పటికీ.. భారత అభిమానులు మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను నిందిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇన్ ఫామ్ బ్యాటర్ సంజూ శాంసన్ను కాదని అక్షర్ పటేల్ను ముందుగా పంపడాన్ని తప్పుబడుతున్నారు. శివమ్ దూబే విషయంలోనూ (తిలక్ వర్మను కాదని దూబేను వన్డౌన్లో పంపారు) ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. వ్యక్తితంగా విఫలమవడాన్ని నిందిస్తున్నారు. మొత్తంగా బ్యాటింగ్ ఆర్డర్లో అనవసర మార్పులపై ఫైరవుతున్నారు.భారత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి అటుంచితే, ఈ మ్యాచ్లో బంగ్లా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. భారత ఆటగాళ్ల వరుస విరామాల్లో ఔట్ చేసి ఒత్తిడి తెచ్చారు. ముస్తాఫిజుర్ తన అనుభవాన్నంతా రంగరించి చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రిషద్ హొసేన్, తంజిమ్ హసన్ కూడా భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.169 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆదిలోనే సత్ఫలితాన్ని రాబట్టగలిగింది. బుమ్రా తన తొలి ఓవర్లోనే తంజిద్ను (1) ఔట్ చేశాడు. ఆతర్వాత కుల్దీప్ ధాటిగా ఆడుతున్న పర్వేజ్ హొసేన్ను (21) పెవిలియన్కు పంపాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 57/2గా ఉంది. సైఫ్ హసన్ (24), తౌమిద్ హృదోయ్ (6) క్రీజ్లో ఉన్నారు. చదవండి: Asia cup 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ -
Asia cup 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో (India vs Bangladesh) మరో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించాడు. ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్తో మ్యాచ్లోనూ అభి'షేక్' (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించడంతో అభిషేక్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది.ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లి (Virat kohli) తర్వాత వరుసగా రెండు ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ప్రస్తుత ఎడిషన్లో భీకర ఫామ్లో ఉన్న అభిషేక్ ఇప్పటికే లీడింగ్ రన్స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్లో ఇప్పటిదాకా 5 మ్యాచ్లు ఆడిన అతను.. 206.67 స్ట్రయిక్రేట్తో 248 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి 3 ఓవర్లలో నిదానంగా ఆడినప్పటికీ.. ఆతర్వాత అభిషేక్ గేర్ మార్చడంతో ఒక్కసారిగా పుంజుకుంది. అభిషేక్, గిల్ క్రీజ్లో ఉన్నంత వరకు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు.. ఈ ఇద్దరు ఔట్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది.వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 15 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా (11), అక్షర్ పటేల్ (2) క్రీజ్లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో అభిషేక్ 75, గిల్ 29, శివమ్ దూబే 2, సూర్యకుమార్ యాదవ్ 5, తిలక్ వర్మ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలరల్లో రిషద్ హొసేన్ 2, తంజిమ్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు. అభిషేక్ శర్మ రనౌటయ్యాడు. చదవండి: సందిగ్దంలో సెలెక్టర్లు.. విండీస్ సిరీస్కు భారత జట్టు ప్రకటన వాయిదా -
Asia cup 2025: బంగ్లాదేశ్పై టీమిండియా ఘన విజయం
బంగ్లాదేశ్పై టీమిండియా ఘన విజయంఆసియా కప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన సూపర్-4 మ్యాచ్లో టీమిండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది.భారత్ తరఫున అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మరోసారి విధ్వంసం సృష్టించగా.. బంగ్లాదేశ్ తరఫున సైఫ్ హసన్ (69) ఒంటరిపోరాటం చేశాడు. ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్15.2వ ఓవర్- 109 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి సైఫుద్దీన్ (4) ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్12.3వ ఓవర్- 87 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ జాకిర్ అలీ (4) రనౌటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్10.4వ ఓవర్-74 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి షమీమ్ హొస్సేన్ను (0) క్లీన్ బౌల్డ్ చేశాడు. 11 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 75/4గా ఉంది. జాకిర్ అలీ (1), సైఫ్ హసన్ (40) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే 54 బంతుల్లో 94 పరుగులు చేయాలి.టార్గెట్ 169.. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్1.2వ ఓవర్- 5 పరుగుల వద్దనే బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో శివమ్ దూబే క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (1) ఔటయ్యాడు. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైన టీమిండియాటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (75), శుభ్మన్ గిల్ (29) క్రీజ్లో ఉన్నంత సేపు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు, ఆతర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులకే పరిమితమైంది. అభిషేక్, గిల్ తర్వాత హార్దిక్ పాండ్యా (38) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. అఖరి ఓవర్లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 10 నాటౌట్) బంతులు వృధా చేశాడు. శివమ్ దూబే (2), సూర్యకుమార్ యాదవ్ (5), తిలక్ వర్మ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 2, తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు. నిదానించిన భారత స్కోర్వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో భారత స్కోర్ నిదానించింది. 16 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 135 పరుగులుగా ఉంది. హార్దిక్ పాండ్యా (12), అక్షర్ పటేల్ (4) క్రీజ్లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్11.6వ ఓవర్-114 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్ (5) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా11.1వ ఓవర్- 112 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అనూహ్యంగా రనౌటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 96/210 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 96/2గా ఉంది. అభిషేక్ శర్మ 60 (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (3) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా8.1వ ఓవర్-83 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రిషద్ హొసేన్ బౌలింగ్లో శివమ్ దూబే (2) ఔటయ్యాడు. అభిషేక్ మెరుపు అర్ద శతకంఅభిషేక్ శర్మ మరో సారి బ్యాట్ ఝులిపించాడు. 25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 8 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 83/1గా ఉంది. అభిషేక్తో పాటు శివమ్ దూబే (2) క్రీజ్లో ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా6.2వ ఓవర్- 77 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రిషద్ హోసేన్ బౌలింగ్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో శుభ్మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. మరో ఎండ్లో అభిషేక్ 46 (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పూనకాలు ఎత్తి ఉన్నాడు. అతనికి జతగా శివమ్ దూబే క్రీజ్లోకి వచ్చాడు. గేర్ మార్చిన అభిషేక్, గిల్3 ఓవర్ల వరకు నిదానంగా ఆడిన భారత ఓపెనర్లు అభిషేక్, గిల్ ఆతర్వాత ఒక్కసారిగా గేర్ మార్చారు. 4,5,6 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు పిండుకున్నారు. ఫలితంగా 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 72/0గా ఉంది. అభిషేక్ 46 (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్మన్ గిల్ 25 (17 బంతుల్లో ఫోర్, సిక్స్) పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న టీమిండియా ఓపెనర్లుభారత ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ తమ సహజ శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ నెమ్మదించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అభిషేక్ 8 బంతుల్లో కేవలం ఒకే బౌండరీతో 8 పరుగులు చేయగా.. గిల్ 10 బంతుల్లో బౌండరీలు లేకుండా 8 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 17/0గా ఉంది. ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్ దూరమయ్యాడు. ప్రాక్టీస్ సందర్భంగా అతను గాయపడినట్లు తాత్కాలిక కెప్టెన్ జాకిర్ అలీ తెలిపాడు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిబంగ్లాదేశ్: సైఫ్ హసన్, తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(వికెట్కీపర్/కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ -
BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్!
టీమిండియా యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆసియా టీ20 కప్- 2025 టోర్నమెంట్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 208కి పైగా స్ట్రైక్రేటుతో అభిషేక్ శర్మ 173 పరుగులు సాధించాడు.తీవ్రమైన ఒత్తిడిలోనూతద్వారా ఇప్పటికి టాప్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్పై రెండుసార్లు అభిషేక్ శర్మ చితక్కొట్టిన తీరు టీమిండియా విజయాల్లో హైలైట్గా నిలిచింది. లీగ్ దశలో పాక్పై 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. సూపర్-4లో 39 బంతుల్లోనే 74 పరుగులతో చెలరేగాడు.బంపరాఫర్దాయాదితో సూపర్-4 మ్యాచ్లో తీవ్రమైన ఒత్తిడిలోనూ అభిషేక్ శర్మ.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (47)తో కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ పంజాబీ బ్యాటర్కు బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఆసియా కప్-2025 టోర్నీ ముగిసిన తర్వాత.. టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మను ఆసీస్తో టీ20లతో పాటు వన్డేల్లోనూ ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.గిల్కు విశ్రాంతి?కాగా శుబ్మన్ గిల్ ఇటీవలే టెస్టు జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ గడ్డపై ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ను కెప్టెన్గా 2-2తో సమం చేశాడు. అనంతరం.. నెలరోజుల విరామం తర్వాత ఆసియా కప్ బరిలో దిగాడు. అయితే, ఆసియా కప్ ముగిసిన వెంటనే విండీస్తో సిరీస్ ఆడనున్నాడు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టూర్ సందర్భంగా గిల్కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీ20లలో ఇప్పటికే ఓపెనర్గా పాతుకుపోయిన అభిషేక్ శర్మ ఇంతవరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి గిల్ వన్డేల్లో ఓపెనింగ్ చేస్తున్నాడు.జైస్వాల్కు అన్యాయంఅయితే, ఆసీస్తో సిరీస్లలో గిల్ రెస్ట్ తీసుకుంటే అభిషేక్ శర్మను ఓపెనర్గా ఎంపిక చేస్తారనే వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అభిషేక్ శర్మ ఆసీస్ గడ్డపై వన్డేల్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా దేశీ యాభై ఓవర్ల ఫార్మాట్లో అతడికి మెరుగైన రికార్డు ఉంది.లిస్ట్-ఎ క్రికెట్లో 61 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 2014 పరుగులు చేశాడు. ఒకవేళ అభిని ఆసీస్తో వన్డేలకు ఎంపిక చేస్తే.. మరో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు అన్యాయం చేసినట్లే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.ఇప్పటికే టీమిండియా టెస్టు ఓపెనర్గా స్థానం సుస్థిరం చేసుకున్న యశస్వి జైస్వాల్.. టీ20లలో తన మార్కు చూపించాడు. అయితే, వన్డేల్లో మాత్రం ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా జైసూ ఒకే ఒక్క వన్డే ఆడి.. 15 పరుగులు చేశాడు. ఇంత వరకు అతడికి వన్డేల్లో నిరూపించుకునే అవకాశమే రాలేదు.వన్డే టాపార్డర్లోఇలాంటి సమయంలో అభిషేక్ శర్మ జట్టులోకి వచ్చాడంటే.. జైసూకు అవకాశాలు సన్నగిల్లవచ్చు. అయితే, ఇప్పటికే టీ20, టెస్టుల నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం వన్డే టాపార్డర్లో జైసూ, అభి, గిల్లను చూసే అవకాశాలను కొట్టిపారేయలేము. కాగా టీమిండియా తరఫున టీ20లలో అభిషేక్ శర్మ 21 టీ20లలో 708 పరుగులు సాధించాడు. మరోవైపు.. జైస్వాల్ 23 టీ20లలో 723, 24 టెస్టుల్లో 2209 రన్స్ రాబట్టాడు.చదవండి: IND vs AUS: మరోసారి దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ భారీ స్కోరు -
‘వాళ్లు ఎలా ప్రవర్తించారో చూశాం.. మా జట్టు గర్వకారణం’
సూర్యకుమార్ సేనపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే (Ryan ten Doeschate) ప్రశంసలు కురిపించాడు. పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు సంయమనంతో వ్యవహరించిన తీరు గర్వకారణం అన్నాడు. పాక్ ఆటగాళ్ల కవ్వింపు చర్యలకు తమ ప్లేయర్లు బ్యాట్తో సమాధానమిచ్చిన విధానం అమోఘమని కొనియాడాడు.ఆసియా కప్ టీ20- 2025 టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఇప్పటికి రెండుసార్లు తలపడ్డాయి. లీగ్ దశలో పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఆ జట్టుతో షేక్హ్యాండ్కు నిరాకరించింది.తీవ్రస్థాయిలో కవ్వింపులుఇక సూపర్-4 మ్యాచ్లోనూ భారత జట్టు మరోసారి పాక్పై పైచేయి సాధించింది. ప్రత్యర్థిని ఆరు వికెట్ల తేడాతో ఓడించి.. వరుసగా రెండో గెలుపు అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు తీవ్రస్థాయిలో కవ్వింపులకు పాల్పడ్డారు.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే ఏకే-47 మాదిరి బ్యాట్ ఎక్కుపెట్టి కాల్పులు జరుపుతున్నట్లు సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలు పొట్టనబెట్టుకున్న విషయం విదితమే.బ్యాట్తోనే సమాధానమిచ్చారుదీంతో ఫర్హాన్ సెలబ్రేషన్స్ పాక్ బుద్ధిని చూపిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నపుడు పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్ భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ- శుబ్మన్ గిల్ (Shubman Gill)లతో మాటల యుద్ధానికి దిగారు.అయితే, ఈ యువ ఆటగాళ్లకు పాక్ ఆటగాళ్లకు బ్యాట్తోనే సమాధానమిచ్చారు. అభి- గిల్ కలిసి తొలి వికెట్కు ఏకంగా 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి పాక్కు తమ స్థాయి ఏమిటో చూపించారు. ఈ పరిణామాలపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ డష్కాటే స్పందించాడు.వాళ్ల చేష్టలు పట్టించుకోము‘‘హ్యారిస్ రవూఫ్ ఏం చేశాడో నేను కూడా చూశాను. అయితే, మా వాళ్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆట మీద మాత్రమే దృష్టి పెటారు. అందుకు నాకు గర్వంగా ఉంది.బ్యాట్తోనే క్రీడా యుద్ధంలో మా వాళ్లు గెలిచారు. ఈ టోర్నీలో మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. సంయమనంగా ఉంటున్నారు. మాతో మ్యాచ్లో పాక్ తొలుత బాగానే బ్యాటింగ్ చేసింది. అప్పుడే అతడు (ఫర్హాన్) అలా చేశాడు.అయితే, మేము తిరిగి పుంజుకున్న తీరు గొప్పగా ఉంది. 10 ఓవర్ల తర్వాత మా బౌలర్లు మ్యాచ్ను చేతుల్లోకి తీసుకున్నారు. కానీ పాక్ ఆటగాళ్ల ప్రవర్తన ఎలా ఉందో అందరం చూశాం.గర్వకారణంవాళ్లు ఏదో చెప్పాలని ప్రయత్నించారు. అయితే, మా వాళ్లు కేవలం ఆటకే పరిమితమై తమ పని పూర్తి చేశారు. నిజానికి ఈ మ్యాచ్లో మా ఆటగాళ్లపై కూడా ఒత్తిడి ఉంది. కానీ వాళ్లు ఎప్పుడూ కట్టు దాటలేదు.ఇలాంటి మ్యాచ్లలో నియంత్రణ కోల్పోవడం సహజం. మా వాళ్లు మాత్రం అలా చేయలేదు. వాళ్ల సెలబ్రేషన్స్, మా బ్యాటర్లతో పాక్ బౌలింగ్ విభాగం వాగ్వాదాలు దృష్టి మళ్లించేవే. అయితే, ముందుగా చెప్పినట్లు మా జట్టు వేటినీ పట్టించుకోకుండా.. అత్యుత్తమ ప్రదర్శనతో గెలిచిన తీరు మాకు ఆనందదాయకం’’ అని డష్కాటే హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను... -
ఆసియా కప్-2025: ఫైనల్ రేసు.. ఏ జట్లకు అవకాశాలు ఎక్కువ?
ఆసియా కప్ టీ20- 2025 టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంటోంది. సూపర్-4 దశలో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంక (BAN vs SL)పై నాలుగు వికెట్ల తేడాతో గట్టెక్కగా.. టీమిండియా పాకిస్తాన్ (IND vs PAK)ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఇక తాజాగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్.. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలను సజీవం చేసుకుంది. మరోవైపు.. ఇప్పటికే సూపర్-4లో బంగ్లా చేతిలో ఓడిన శ్రీలంక.. తాజాగా పాక్ చేతిలోనూ ఓడి ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.అయితే, ఇతర జట్ల ఫలితాల ఆధారంగా లంక జట్టుకు ఇంకా దింపుడుకళ్లెం ఆశలు మిగిలి ఉన్నట్లే!.. ఈ నేపథ్యంలో టైటిల్ పోరుకు అర్హత సాధించేందు (Asia Cup 2025 Final Scenarios)కు నాలుగు జట్లకు అవసరమైన సమీకరణలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం!ఫైనల్ రేసు.. ఏ జట్లకు అవకాశాలు ఎక్కువ?సూపర్-4లో టీమిండియా తొలి మ్యాచ్లో పాక్పై గెలిచి రెండు పాయింట్లు సాధించింది. నెట్ రన్రేటు పరంగానూ(+0.689) మెరుగ్గా ఉండటం వల్ల ప్రస్తుతం టాపర్గా ఉంది. ఇక పాకిస్తాన్ రెండింట ఒక విజయంతో రెండు పాయింట్లతో.. +0.226 నెట్ రన్రేటుతో రెండో స్థానంలో ఉంది.మరోవైపు.. బంగ్లాదేశ్ ఒక విజయంతో రెండు పాయింట్లు (+0.121) సాధించి మూడో స్థానంలో ఉండగా.. లంక రెండింటికి రెండు ఓడి ఆఖరి ప్లేస్లో నిలిచింది.టీమిండియాకు నల్లేరు మీద నడకేఇక బుధవారం నాటి మ్యాచ్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్తో తలపడనుంది. టీ20 ఫార్మాట్లో ఇరుజట్లు ముఖాముఖి ఎదురుపడిన సందర్భాల్లో భారత్ 16 సార్లు గెలుపొందగా.. బంగ్లా ఒకే ఒక్కసారి విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితాన్ని తేలికగానే అంచనా వేయవచ్చు.బంగ్లాపై గెలిస్తే భారత్ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. ఆ తర్వాత శ్రీలంకను కూడా ఓడిస్తే.. టీమిండియా అజేయంగా ఫైనల్కు చేరుకుంటుంది. మరోవైపు.. పాకిస్తాన్ తమకు మిగిలిన ఒక్క మ్యాచ్లో బంగ్లాదేశ్ను తప్పక ఓడించాల్సి ఉంటుంది. లేదంటే పాక్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.అలాంటపుడు టీమిండియా చేతిలో బంగ్లా ఓడినప్పటికీ.. పాక్, బంగ్లాలు పాయింట్ల పరంగా సమమవుతాయి. అప్పుడు నెట్ రన్ రేటుది కీలక పాత్ర. అలా కాకుండా.. పాక్ బంగ్లాపై గెలవడంతో పాటు.... టీమిండియా బంగ్లా, లంకలను ఓడించిందంటే.. పాక్ కూడా టైటిల్ పోరుకు నేరుగా అర్హత సాధిస్తుంది.ఇది టీ20 ఫార్మాట్ గురూ!ఒకవేళ ఊహించని రీతిలో బంగ్లాదేశ్ గనుక టీమిండియాపై గెలిస్తే.. అదే విధంగా శ్రీలంక చేతిలో భారత జట్టు ఓడితే అప్పుడు పాక్తో పాటు బంగ్లాకు అవకాశాలు మిగిలి ఉంటాయి. ఇది దాదాపు అసాధ్యం. ప్రస్తుత టీమిండియా పటిష్టంగా ఉంది కాబట్టి.. ఇది జరగకపోవచ్చు. ఏదేమైనా ఫైనల్ చేరే అవకాశాలు టీమిండియా, పాకిస్తాన్లకే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఇది టీ20 ఫార్మాట్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. అయితే, చరిత్రను బట్టి భారత్- పాక్ ఫైనల్లో ఢీకొట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము. ఇదిలా ఉంటే.. దాయాది పాక్ను లీగ్ దశలో, సూపర్-4లో టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే.మరి శ్రీలంక పరిస్థితి ఏమిటి?శ్రీలంక ఫైనల్ రేసులోకి రావాలంటే.. బంగ్లాదేశ్.. టీమిండియా, పాకిస్తాన్లపై గెలవాలి. అంతేకాదు.. తమ ఆఖరి మ్యాచ్లో టీమిండియాపై శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడే లంక ఆశలు మిగిలి ఉంటాయి.చదవండి: వెక్కిరించిన పాక్ బౌలర్.. ఒకటి కాదు.. రెండుసార్లు ఇచ్చిపడేసిన హసరంగ -
వెక్కిరించిన పాక్ బౌలర్.. ఇచ్చిపడేసిన హసరంగ
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ గట్టెక్కింది. సూపర్-4లో తమ రెండో మ్యాచ్లో భాగంగా శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించి.. ఫైనల్ అవకాశాలు సజీవం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) అతి చేశాడు.వెక్కిరించిన పాక్ బౌలర్శ్రీలంక ఆల్రౌండర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga)ను అవుట్ చేసిన తర్వాత.. హసరంగను అనుకరిస్తూ అతడి శైలిలోనే సెలబ్రేట్ చేసుకుని.. ఏవో మాటలు అన్నాడు. ఇందుకు సహచర ఆటగాళ్లు కూడా వంత పాడారు. శ్రీలంక ఇన్నింగ్స్ పదమూడో ఓవర్ తొలి బంతికి ఈ ఘటన జరిగింది.టాపార్డర్ విఫలమైన వేళ కమిందు మెండిస్ అర్ధ శతకం (50)తో రాణించగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హసరంగ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు బాది 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న వేళ.. అబ్రార్ అహ్మద్ హసరంగను బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలోనే అతడిని వెక్కిరించినట్లుగా సెలబ్రేట్ చేసుకున్నాడు.ఒకటి కాదు.. రెండుసార్లు ఇచ్చిపడేసిన హసరంగఅయితే, వనిందు హసరంగ ఇందుకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. పాక్ లక్ష్య ఛేదనకు దిగినపుడు.. మహీశ్ తీక్షణ బౌలింగ్లో.. ఓపెనర్ ఫఖర్ జమాన్ (17) క్యాచ్ అందుకున్న హసరంగ.. అబ్రార్ మాదిరి గాల్లోకి జంప్ కొడుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. తర్వాత సయీమ్ ఆయుబ్ (2), కెప్టెన్ సల్మాన్ ఆఘా (5) రూపంలో కీలక వికెట్లు తీసి మరోసారి అబ్రార్ను అనుకరిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే, మ్యాచ్ తర్వాత అబ్రార్ హసరంగకు క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది.ఫైనల్ ఆశలు సజీవంఇక మ్యాచ్ విషయానికొస్తే.. అబుదాబి వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్..లంకను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో అసలంక బృందం నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది.పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది మూడు, హ్యారీస్ రవూఫ్, హుసేన్ తలట్ రెండేసి వికెట్లు తీయగా.. అబ్రార్ అహ్మద్కు ఒక వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో పాక్ ఓపెనర్ సాహిబ్జాదా (24), హుసేన్ తలట్ (32 నాటౌట్), మొహమ్మద్ నవాజ్ (38 నాటౌట్) రాణించడంతో పాక్ 18 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి.. ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.చదవండి: పాయింట్ తేడాతో గట్టెక్కిన టైటాన్స్In today’s episode of "𝘈𝘴 𝘺𝘰𝘶 𝘴𝘰𝘸, 𝘴𝘰 𝘴𝘩𝘢𝘭𝘭 𝘺𝘰𝘶 𝘳𝘦𝘢𝘱…" 🤭Watch the #DPWorldAsiaCup2025 from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #PAKvSL pic.twitter.com/evBAkIIEyx— Sony Sports Network (@SonySportsNetwk) September 23, 2025Man I just love this celebration. Abrar should steal it. pic.twitter.com/O380ryOLun— Hopeful (@high_hopeful) September 23, 2025 -
మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైన భారత్
-
Asia Cup 2025: గట్టెక్కిన పాకిస్తాన్
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీ సూపర్–4 దశలో పాకిస్తాన్కు కీలక విజయం దక్కింది. తొలి మ్యాచ్లో ఓడిన ఆ జట్టు ఫైనల్ అవకాశాలు నిలిచి ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పోరులో పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో పాక్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కమిందు మెండిస్ (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అనంతరం పాకిస్తాన్ 18 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. మొహమ్మద్ నవాజ్ (24 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు), హుస్సేన్ తలత్ (30 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లతో పాక్ను గెలిపించారు. సూపర్–4 దశలో వరుసగా రెండో ఓటమితో లంక ఫైనల్ అవకాశాలకు తెర పడినట్లే! ఇన్నింగ్స్ రెండో బంతికి కుశాల్ మెండిస్ (0)ను అవుట్ చేసిన షాహిన్ అఫ్రిది తన తర్వాతి ఓవర్లో నిసాంక (8)ను కూడా వెనక్కి పంపాడు. కుశాల్ పెరీరా (15)ను రవూఫ్ అవుట్ చేయడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 53/3కి చేరింది. ఎనిమిదో ఓవర్లో తలత్ వరుస బంతుల్లో అసలంక (20), షనక (0)లను డగౌట్ చేర్చగా, కొద్ది సేపటికే హసరంగ (15) కూడా అవుట్ కావడంతో లంక 80/6 వద్ద నిలిచింది. ఈ దశలో కమిందు, చమిక కరుణరత్నే (17 నాటౌట్) కలిసి ఏడో వికెట్కు 39 బంతుల్లో 43 పరుగులు జోడించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... తలత్, రవూఫ్ చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో పాక్కు సరైన ఆరంభం లభించింది. ఫర్హాన్ (24; 1 ఫోర్, 2 సిక్స్లు), ఫఖర్ జమాన్ (17) తొలి వికెట్కు 33 బంతుల్లో 45 పరుగులు జత చేశారు. అయితే ఆ తర్వాత ఆట ఒక్కసారిగా మలుపు తిరిగింది. 12 పరుగుల వ్యవధిలో పాక్ 4 వికెట్లు కోల్పోయింది. తీక్షణ ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను వెనక్కి పంపించగా...హసరంగ తన వరుస ఓవర్లలో అయూబ్ (2), సల్మాన్ (5)లను అవుట్ చేశాడు. హారిస్ (13) కూడా నిలవలేకపోయాడు. ఈ దశలో పాక్ ఓటమి దిశగా వెళుతున్నట్లు అనిపించింది. అయితే తలత్, నవాజ్ కలిసి జట్టును గట్టెక్కించారు. వీరిద్దరు 41 బంతుల్లో అభేద్యంగా 58 పరుగులు జోడించారు. -
ఏ జట్టైనా టీమిండియాను ఓడించగలదు.. బంగ్లాదేశ్ కోచ్ అహంకారపూరిత వ్యాఖ్యలు
ఆసియా కప్-2025లో (Asia cup 2025) బంగ్లాదేశ్ (Bangladesh) ఓ మోస్తరు ప్రదర్శనలతో ముందుకెళ్తుంది. గ్రూప్ దశలో హాంగ్కాంగ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్లను ఓడించి సూపర్-4కు చేరిన ఆ జట్టు.. ఈ దశలో శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఆ జట్టు రేపు జరుగబోయే వారి రెండో సూపర్-4 మ్యాచ్లో పటిష్టమైన భారత జట్టును ఢీకొట్టాల్సి ఉంది (India Vs Bangladesh). ఈ మ్యాచ్కు ముందు బంగ్లాదేశ్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ (Phil Simmons) టీమిండియాపై (Team India) అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకపై గాలివాటంగా లభించిన గెలుపును (వాపును) చూసుకొని బలుపులా భావిస్తున్న అతను.. ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టైన టీమిండియాతోనే మైండ్గేమ్ ఆడుతున్నాడు. ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ప్రతి జట్టుకి భారత్ను ఓడించే సామర్థ్యం ఉందంటూ అతి వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు ఆట ఎలా ఆడతామన్నదే ముఖ్యం కాని, రికార్డులు కాదంటూ బీరాలు పలికాడు.భారత్ ప్రపంచంలో నంబర్ వన్ టీ20 జట్టు అయ్యుండొచ్చు, మేము మా బెస్ట్ క్రికెట్ ఆడి వాళ్ల నుంచి తప్పులు రాబడతామని అతి విశ్వాసం ప్రదర్శించాడు. మేము శ్రీలంకను మాత్రమే ఓడించేందుకు కాదు, టోర్నీని గెలిచేందుకు వచ్చామని గొప్పలు పోయాడు.రేపు భారత్తో, ఆతర్వాతి రోజు (సెప్టెంబర్ 25) పాకిస్తాన్తో ఆడటంపై మాట్లాడుతూ.. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు ఆడటం ఏ జట్టుకైనా కష్టమే అని అన్నాడు. మా పట్ల ఇలా జరగడం అన్యాయమని వ్యాఖ్యానించాడు.సిమ్మన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు తాహతకు మించినవిగానే అనిపిస్తున్నప్పటికీ.. వారిలోని ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. కొందరు భారత అభిమానలు ఈ వ్యాఖ్యలను తప్పుబడుతుంటే, చాలామంది లైట్గా తీసుకుంటున్నారు.ఆమాత్రం జోష్తో బరిలోకి దిగితేనే టీమిండియాకు కనీస పోటీ అయినా ఇవ్వగలదని అంటున్నారు. సిమ్మన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కాగా, సూపర్-4లో జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మరో బంతి మిగిలుండగా లక్ష్యాన్ని చేరుకుంది. వాస్తవానికి బంగ్లాదేశ్కు ఈ గెలుపు అంత ఈజీగా ఏమీ దక్కలేదు. కాస్త అటు, ఇటు అయ్యుంటే శ్రీలంకనే గెలిచేది. చివరి ఓవర్లో గెలుపుకు 5 పరుగులు మాత్రమే చేయాల్సిన దశలో బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. నసుమ్ అహ్మద్ ఐదో బంతికి రిస్క్ చేసి సింగిల్ తీయడంతో ఆ జట్టు గెలుపు ఖరారైంది. చదవండి: యాషెస్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన -
పాక్తో డూ ఆర్ డై మ్యాచ్కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా పాకిస్తాన్తో (Bangladesh Vs Sri Lanka) ఇవాళ (సెప్టెంబర్ 23) జరుగబోయే 'డూ ఆర్ డై' మ్యాచ్కు (సూపర్-4) ముందు శ్రీలంక జట్టుకు (Sri Lanka) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ మతీష పతిరణ (Matheesha Pathirana) ఈ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. పతిరణ గాయం కారణంగా శ్రీలంక ఆడిన గత రెండు మ్యాచ్లకు కూడా దూరం ఉన్నాడు. అయితే అతను కీలకమై పాక్ మ్యాచ్కు అందుబాటులోకి వస్తాడని లంక మేనేజ్మెంట్ భావించింది. అతని గాయం ఇంకా తగ్గకపోవడంతో నేటి పాక్ మ్యాచ్కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు అధికారికంగా ప్రకటించింది. అబుదాబీలో నేడు పాక్తో జరుగబోయే మ్యాచ్కు పతిరణ లంక మేనేజ్మెంట్ పరిశీలనలో ఉన్నాడు. అబుదాబీ పిచ్కు పేసర్లకు సహకరించే స్వభావం ఉండటంతో వారు పతిరణపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే పతిరణ గాయం మానకపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి.నేటి మ్యాచ్ శ్రీలంకతో సహా పాక్కు కూడా అత్యంత కీలకం. ఇరు జట్లు సూపర్-4లో తమ తొలి మ్యాచ్ల్లో (పాక్ భారత్ చేతిలో, శ్రీలంక బంగ్లాదేశ్ చేతిలో ఓడాయి) పరాజయాలపాలయ్యారు. నేటి మ్యాచ్లో గెలిచిన జట్టుకే ఫైనల్స్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరు జట్లకు నేటి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటి మ్యాచ్లో ఓడిన జట్టు దాదాపుగా ఫైనల్స్ రేసు నుంచి నిష్క్రమించినట్లే.చదవండి: ఏ జట్టైనా టీమిండియాను ఓడించగలదు.. బంగ్లాదేశ్ కోచ్ అహంకారపూరిత వ్యాఖ్యలు -
‘అతడికి అసలు ఆ అర్హత ఉందా?.. ఏం చేస్తున్నాడో తనకైనా తెలుసా?’
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) మండిపడ్డాడు. సల్మాన్ జట్టుకు బలహీనతగా మారాడని.. తనేం చేస్తున్నాడో తనకైనా అర్థమవుతోందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. కోచ్ మైక్ హసన్ నిర్ణయం చెత్తగా ఉందంటూ అక్తర్ విమర్శించాడు.ఆసియా కప్-2025 టీ20 టోర్నమెంట్లో భారత్ చేతిలో పాక్ వరుస పరాజయాలు చవిచూసిన విషయం తెలిసిందే. లీగ్ దశలో సూర్యకుమార్ సేన చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక సూపర్-4లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఆరో స్థానంలో బ్యాటింగ్కు...దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58)తో రాణిచంగా.. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ సల్మాన్ ఆఘా 13 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. భారత్ ఏడు బంతులు మిగిలి ఉండగానే పాక్ విధించిన లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా బ్యాటింగ్ స్థానంలో ఆరో ఆటగాడిగా రావడం పట్ల అక్తర్ స్పందించాడు.అతడికి అసలు ఆ అర్హత ఉందా?‘‘జట్టులో బలహీనమైన లింక్ ఏదైనా ఉందంటే.. సల్మాన్ ఆఘానే. అసలు అతడు ఆరోస్థానంలో ఆడేందుకు అర్హుడా? మిడిలార్డర్లో వీకెస్ట్ లింక్. అతడు ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.టీమిండియాతో మ్యాచ్లో డౌన్లో వస్తాడా? హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ వంటి వాళ్లు భారత జట్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారా?.. ప్రత్యర్థి జట్టుతో కనీసం పోలికైనా అక్కర్లేదా?కోచ్ చెప్పిన మాట వినడం మంచిదే. కానీ దాని వల్ల ఉపయోగం లేనపుడు ఎందుకు అలా చేయడం?.. కోచ్ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్గా తనేం చేస్తున్నాడో అసలు సల్మాన్కైనా తెలుసా?’’ అంటూ అక్తర్ ఫైర్ అయ్యాడు. కాగా ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో పాకిస్తాన్ మంగళవారం శ్రీలంకతో చావో రేవో తేల్చుకోనుంది. అబుదాబి ఇందుకు వేదిక.చదవండి: IND vs AUS: శ్రేయస్ అయ్యర్ అనూహ్య నిర్ణయం.. గుడ్బై చెప్పేసి.. -
టీ తాగారు.. భారత్ దెబ్బకు తోకముడిచారు!.. పాక్ బుద్ధి మారదు!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్ల వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి. భారత్పై తమదే పైచేయి అని నమ్మించే ప్రయత్నంలో బొక్కబోర్లా పడుతున్నా వారి తీరు మాత్రం మారడం లేదు. సీనియర్ క్రికెటర్లకు తామేమీ తీసిపోమన్మట్లుగా ఫుట్బాల్ యువ ఆటగాళ్లు కూడా ఓవరాక్షన్తో వివాదాలకు కారణమవుతున్నారు.కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇందుకు భారత ఆర్మీ ఉగ్రమూకలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో నేలమట్టం చేసింది. అయితే, ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేస్తే.. అందుకు ప్రతిగా పాక్ ఆర్మీ ముందుకు వచ్చి మరోసారి తమ బుద్ధిని చాటుకుంది. ఈ క్రమంలో పాక్తో అన్ని సంబంధాలు.. ముఖ్యంగా క్రీడల్లోనూ వారితో ఎలాంటి పోటీ వద్దంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆసియాకప్-2025 (Asia Cup 2025) టోర్నీలో మాత్రం టీమిండియా పాక్తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. బహుళ దేశాలు పాల్గొంటున్న టోర్నీ కావున ఇందుకు సమ్మతించింది.పప్పులు ఉడకపోవడంతోఈ నేపథ్యంలో లీగ్ దశలో పాక్ ఆటగాళ్లతో టీమిండియా కరచాలనానికి నిరాకరించింది. దీనిని అవమానంగా భావించిన పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. తమ పప్పులు ఉడకపోవడంతో ఆదివారం నాటి సూపర్-4 మ్యాచ్లో ఆటగాళ్లు మైదానంలో ఆటతో కాకుండా తమ చేష్టలతో కవ్వింపులకు పాల్పడ్డారు.ఇక పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్ ఎక్కుపెట్టి ప్రేక్షకులను కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు.. హ్యారిస్ రవూఫ్ (Haris Rauf).. ‘మీ యుద్ధ విమానాలను కూల్చామన్నట్లుగా’ టీమిండియా అభిమానులకు సైగ చేశాడు.టీ తాగారు.. తోక ముడిచారుతాజాగా ఫుట్బాల్ మ్యాచ్లో కూడా పాక్కు చెందిన ఓ ఆటగాడు ఇదే తరహాలో భారత జట్టును రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కొలంబో వేదికగా దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 టోర్నమెంట్లో భాగంగా సోమవారం గ్రూప్-‘బి’లోని చివరి మ్యాచ్లో భారత్- పాక్ తలపడ్డాయి. భారత్ తరఫున దలాల్మువాన్ గాంగ్టే 31వ నిమిషంలో గోల్ చేయగా.. 43వ నిమిషంలో పాక్ ప్లేయర్ మొహమ్మద్ అబ్దుల్లా ఒక గోల్ సాధించాడు. ఈ క్రమంలోనే పాక్ ఆటగాళ్లు అతి చేశారు. టీ తాగుతున్నట్లుగా అభినయిస్తూ భారత జట్టును టీజ్ చేశారు. కాగా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా ఎయిర్ఫోర్స్ వింగ్ అభినందన్ వర్ధమాన్ అనూహ్య రీతిలో పాక్ ఆర్మీ చేతికి చిక్కగా.. ఆయన టీ తాగుతున్నట్లుగా ఉన్న ఫొటోను విడుదల చేసింది.అయితే, 2019 నాటి ఈ ఘటనలో అభినందన్ దాదాపు 60 గంటలపాటు పాక్ నిర్బంధంలో ఉండగా.. జనీవా ఒప్పందం ప్రకారం తిరిగి భారత్కు అప్పగించారు. ఇపుడు ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నట్లుగా పాక్ యువ ఆటగాడు వ్యవహరించడం విశేషం.భారత్ చేతిలో ఓటములేఅయితే, ఈ మ్యాచ్లో భారత్- పాకిస్తాన్ను 3-2తో ఓడించడంతో పరాజయ భారంతో దాయాది తోకముడిచింది. ఇక ఈ గెలుపుతో భారత్ గ్రూప్-బి టాపర్గా సెమీస్ చేరగా.. రెండో స్థానంలో పాక్ కూడా క్వాలిఫై అయింది. సెమీ ఫైనల్లో భారత్- నేపాల్తో, పాకిస్తాన్ బంగ్లాదేశ్తో తలపడతాయి. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ లీగ్, సూపర్ దశలో పాక్ను చిత్తు చేసింది.చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్ట్రాలుSuch a disgraceful celebration by Pakistani U17 Team at SAFF, Glad we beat them 3-2 today! pic.twitter.com/kfksfrP4h3— The Khel India (@TheKhelIndia) September 22, 2025 -
సెహ్వాగ్ ఆడినపుడు ఇలాంటి వాళ్లు లేరు: అభిషేక్ శర్మ
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు తన సత్తా ఏమిటో మరోసారి చూపించాడు. ఆసియా కప్-2025 టోర్నీలో లీగ్ దశలో పాక్పై 13 బంతుల్లో 31 పరుగులు చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా ఆదివారం నాటి సూపర్-4 మ్యాచ్లో మరోసారి దంచికొట్టాడు.ధనాధన్ దంచికొట్టిన అభి.. పాక్ బౌలర్లు విలవిల దుబాయ్లో జరిగిన పాక్తో జరిగిన ఈ మ్యాచ్లో 39 బంతుల్లోనే 74 పరుగులు సాధించాడు. పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi), హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో అభిషేక్ చితక్కొట్టాడు. అయితే, స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (Abrar Ahmed) బౌలింగ్లో హ్యారిస్ రవూఫ్కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది.ఏదేమైనా షాహిన్, రవూఫ్ల బౌలింగ్లో అభిషేక్ ధనాధన్ దంచికొట్టిన తీరు అభిమానులకు మజా ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఇక అభిషేక్కు తోడు మరో ఓపెనర్ , వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47), నాలుగో నంబర్ బ్యాటర్ తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్) రాణించడంతో.. మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే.. పాక్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది.వీరూ పాజీ హిట్టింగ్ ఆడిన రోజుల్లోఈ నేపథ్యంలో విజయానంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ శర్మ ఆసియా కప్ బ్రాడ్కాస్టర్ సోనీ స్పోర్ట్స్తో మాట్లాడాడు. ఈ క్రమంలో పాక్ జట్టు బౌలర్ల గురించి మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్తో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘‘వీరూ పాజీ హిట్టింగ్ ఆడిన రోజుల్లో పాక్ బౌలర్లు గట్టి పోటీనిచ్చేవారు. కానీ ప్రస్తుత జట్టులో అలాంటి బౌలర్లు ఎవరూ లేరు’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుత పాక్ బౌలింగ్ దళం బలహీనంగా ఉందని అభిషేక్ శర్మ అభిప్రాయపడ్డాడు. కాగా సెహ్వాగ్ టీమిండియాకు ఆడిన సమయంలో షోయబ్ అక్తర్ వంటి మేటి బౌలర్లు పాక్ జట్టులో ఉండేవారన్న సంగతి తెలిసిందే.సెంచరీ చేయాల్సిందిఇదిలా ఉంటే.. అభిషేక్ శర్మ పాక్తో మ్యాచ్లో సెంచరీ మిస్ కావడం తనకు కాస్త వెలితిగా అనిపించిందని ఈ సందర్భంగా సెహ్వాగ్ అన్నాడు. ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయని.. 50s, 70s లను శతకాలుగా మార్చాలని ఈ వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్కు సెహ్వాగ్ సూచించాడు.‘‘నువ్వు 70 పరుగులు దాటావంటే.. 100 చేసేందుకు కచ్చితంగా ప్రయత్నించు. సునిల్ గావస్కర్ నాకో మాట చెప్పారు. ‘నువ్వు రిటైర్ అయినపుడు ఈ 70, 80 స్కోర్లు నీకు గుర్తుకువస్తాయి. ఆరోజే వాటిని సెంచరీలుగా మలిస్తే బాగుండదని అనిపిస్తుంది’ అన్నారు.ఎందుకంటే వందకు చేరువయ్యే అవకాశం మళ్లీ మళ్లీ రాదు కదా!.. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోజు నాటౌట్గా ఉండేందుకు నువ్వు ప్రయత్నించు’’ అని సెహ్వాగ్ అభిషేక్ శర్మతో అన్నాడు.చదవండి: ఫ్రాంఛైజీ సహ యజమానిగా కేఎల్ రాహుల్Abhishek Sharma gets a priceless advice from Virender Sehwag ✨ @YUVSTRONG12, did the call finally happen? 👀 😅Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/SqHa1k4mAA— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
Asia Cup 2025: చావో రేవో మ్యాచ్
అబుదాబి: ఆసియా కప్ సూపర్–4 దశలో తమ తొలి మ్యాచ్ల్లో ఓడిన రెండు జట్లు కీలక సమరానికి సన్నద్ధమయ్యాయి. నేడు జరిగే పోరులో పాకిస్తాన్తో శ్రీలంక తలపడుతుంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన శ్రీలంక గత పోరులో అనూహ్యంగా బంగ్లాదేశ్ చేతిలో ఓడగా... భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తయింది. ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్లో గెలవడం తప్పనిసరి. సూపర్–4లో రెండో పరాజయం ఎదురైతే ముందంజ వేసే అవకాశాలు దాదాపుగా ముగిసిపోతాయి. ఈ నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం. భారత్ చేతిలో ఓడిన మ్యాచ్లో ఆరంభంలో పాక్ బ్యాటింగ్ మెరుగ్గానే కనిపించింది. టాప్–3 బ్యాటర్లు ఫఖర్, ఫర్హాన్, అయూబ్ రాణించారు. అయితే జట్టు మిడిలార్డర్ మరీ పేలవంగా కనిపిస్తోంది. తలత్, నవాజ్, కెపె్టన్ సల్మాన్ ఏమాత్రం ప్రభావం చూపలేక పోతున్నారు. పాక్ బౌలింగ్ కూడా గొప్పగా లేదు. మరోవైపు శ్రీలంక కూడా బ్యాటింగ్ వైఫల్యం వల్లే బంగ్లా చేతిలో ఓటమిపాలైంది. అయితే లీగ్లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే ఆ జట్టు కోలుకునే అవకాశం ఉంది. ప్రధాన బ్యాటర్లు కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, నిసాంకపై అంచనాలు ఉండగా... బౌలింగ్లో చమీరా, హసలంక రాణిస్తున్నారు. ఆల్రౌండర్గా షనక ప్రభావం చూపించాడు. ఇప్పటి వరకు ఆకట్టుకోని కెపె్టన్ అసలంక ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని టీమ్ కోరుకుంటోంది. -
పాకిస్తాన్కు మరోసారి షాకిచ్చాడు!.. అప్పుడలా.. ఇప్పుడు ఇంకో ఏడుపు!
ఆసియా కప్-2025 టోర్నీలో పాకిస్తాన్కు మరోసారి చేదు అనుభవం తప్పలేదు. దుబాయ్లో ఆదివారం జరిగిన సూపర్- 4 మ్యాచ్లో టీమిండియా చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో.. నో-షేక్హ్యాండ్ వివాదం తర్వాత పాక్ క్రికెట్ బోర్డు మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తలుపుతట్టింది.అప్పుడలా.. ఇప్పుడు ఇంకో ఏడుపు!కాగా లీగ్ దశలో పాక్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీనిని అవమానంగా భావించిన పాక్.. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycropt) వల్లే ఇలా జరిగిందంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలంటూ డిమాండ్ చేసింది. అయితే, ఐసీసీ మాత్రం దిగిరాలేదు. పాక్ ఆడే మ్యాచ్లకు మరోసారి అతడినే రిఫరీగా ఎంపిక చేసింది. లీగ్ దశలో ఆఖరిగా యూఏఈతో పాటు.. తాజాగా టీమిండియాతో సూపర్-4 మ్యాచ్లోనూ ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించాడు.క్యాచ్ విషయంలో వివాదంఇదిలా ఉంటే.. ఆదివారం నాటి మ్యాచ్లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బౌలింగ్లో భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson)కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, బంతి నేలను తాకిన తర్వాతే సంజూ చేతుల్లోకి వెళ్లిందని భావించిన ఫఖర్ జమాన్.. కాసేపు క్రీజులోనే ఉండి అసహనం వ్యక్తం చేశాడు.ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ స్పష్టతనివ్వకపోవడంతో.. టీవీ అంపైర్ దగ్గరకు పంచాయతీ చేరింది. అయితే, వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత.. బంతి కింద సంజూ వేళ్లు ఉన్నాయంటూ.. దీనిని క్లీన్ అవుట్గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ అంపైర్ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కింది.పాకిస్తాన్కు మరోసారి షాకిచ్చాడు!ఈ విషయమై రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు ఫిర్యాదు చేయగా.. తన పరిధిలో లేదంటూ ఆయన బదులిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ సన్నిహిత వర్గాలు టెలికామ్ఏసియా.నెట్తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవీద్ చీమా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్కు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు.అయితే, తన పరిధిలో లేదంటూ ఆయన రిప్లై ఇచ్చాడు. దీంతో మేనేజర్ ఐసీసీకి మెయిల్ చేశాడు. అంపైర్పై ఫిర్యాదు చేశాడు’’ అని పేర్కొన్నాయి.ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘అంపైర్లు కొన్నిసార్లు తప్పులు చేస్తారు. అది సహజమే. కానీ ఈసారి బంతి కీపర్ చేతుల్లో పడేకంటే ముందు నేలను తాకినట్లు అనిపించింది’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్ట్రాలు -
నువ్వు ఏకే-47 అంటే.. వాళ్లు ఏకంగా ‘బ్రహ్మోస్’ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ (IND vs PAK) జట్టు ఆట తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) విమర్శలు గుప్పించాడు. ప్రత్యర్థి జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నపుడు కనీసం 200 పరుగులైనా స్కోరు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.ఆసియా కప్-2025 టోర్నీలో తొలుత లీగ్ దశలో భారత్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన పాక్.. తాజాగా సూపర్-4 మ్యాచ్లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సల్మాన్ ఆఘా బృందం.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫర్హాన్ ఓవరాక్షన్పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. అయితే, చేసింది హాఫ్ సెంచరీయే అయినా.. ఏకే-47 మాదిరి గన్ ఎక్కుపెట్టి కాలుస్తున్నట్లు ఫర్హాన్ ఓవరాక్షన్ చేశాడు. అయితే, లక్ష్య ఛేదనలో టీమిండియా ఇందుకు బ్యాట్తోనే సమాధానమిచ్చింది.ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74)- శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47) పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. విధ్వంసకర బ్యాటింగ్తో తొలి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరికి తోడు తిలక్ వర్మ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి.. పాక్ను మరోసారి కంగుతినిపించింది.ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma), శుబ్మన్ గిల్లపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు ఆది నుంచే అద్భుత రీతిలో బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. ఈ క్రమంలో ఫర్హాన్ సెలబ్రేషన్ చేసుకున్న తీరును కూడా కనేరియా విమర్శించాడు.నువ్వు ఏకే-47 అంటే.. వాళ్లు ఏకంగా ‘బ్రహ్మోస్’ ప్రయోగించారు‘‘సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే-47 గన్ కాలుస్తున్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత శుబ్మన్ గిల్- అభిషేక్ శర్మ తమ బ్యాట్లతోనే ఏకంగా బ్రహ్మోస్ ప్రయోగించారు.ముఖ్యంగా అభిషేక్ శర్మ అయితే ముద్దులు విసురుతూనే బౌండరీల వర్షం కురిపించాడు. పాక్ బౌలింగ్పై వారిద్దరు విరుచుకుపడ్డారు. ఇందుకు పాక్ ఆటగాళ్ల వద్ద సమాధనమే లేకుండా పోయింది.మీరు ఉతుకుడు అని సంబరపడ్డారు. వారు ఉతికి.. ఉతికి ఆరేశారు. ప్రత్యర్థి జట్టులో అభిషేక్ శర్మ- శుబ్మన్ గిల్ వంటి ఓపెనర్లు ఉన్నపుడు 200 పరుగుల స్కోరు కూడా చిన్నదే అయిపోతుంది. వాళ్లిద్దరు క్లాస్ ప్లేయర్లు’’ అంటూ డానిష్ కనేరియా వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు. -
ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్ట్రాలు
టీమిండియాతో మ్యాచ్లో అతి చేసిన పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan)పై విమర్శల వర్షం కురుస్తోంది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అతడు సంబరాలు చేసుకున్న తీరే ఇందుకు కారణం.ఐ డోంట్ కేర్అయితే, తానేమీ సెలబ్రేషన్స్ విషయంలో పశ్చాత్తాపపడటం లేదని.. తన తీరే అంత అని ఫర్హాన్ తన చర్యను సమర్థించుకున్నాడు. ఎవరేమనుకున్నా ‘ఐ డోంట్ కేర్’ అంటూ హెచ్చులకు పోయాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్-2025 వేదికగా భారత్- పాక్ తొలిసారి తలపడ్డాయి.లీగ్ దశలో పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్ (IND vs PAK).. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో సూపర్-4 దశలో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో ఆది నుంచే కరచాలనానికి నిరాకరించారు.గన్ పేలుస్తున్నట్లుగా ఈ నేపథ్యంలో సాహిబ్జాదా ఫర్హాన్ చర్య వివాదానికి దారితీసింది. భారత్తో మ్యాచ్లో 34 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న అతడు.. వెంటనే బ్యాట్ను ఏకే-47 తుపాకి మాదిరి ప్రేక్షకుల వైపు ఎక్కుపెట్టి గన్ పేలుస్తున్నట్లుగా అభినయించాడు.ఓవైపు పహల్గామ్లో అమాయక పర్యాటకులను కాల్చి చంపిన ఘాతుకానికి నిరసనగా టీమిండియా షేక్హ్యాండ్ No- Shakehand)కు నిరాకరిస్తుంటే.. ఫర్హాన్ ఇలా రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై సాహిబ్జాదా ఫర్హాన్ తాజాగా స్పందిస్తూ.. మరోసారి అతి చేశాడు. ఈసారి అలా చేయాలనిపించింది‘‘మీరు సిక్సర్ల గురించి మాట్లాడుతున్నారేమో.. భవిష్యత్తులో ఇంకా ఎక్కువే చూస్తారు. ఇక సెలబ్రేషన్ గురించి అంటారా.. ఆ సమయంలో అలా చేయాలని అనిపించిందంతే.మామూలుగా 50 కొడితే నేను సెలబ్రేట్ చేసుకోను. కానీ ఈసారి అలా చేయాలనిపించింది. దాని గురించి ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఎక్కడైనా సరే దూకుడుగా ఆడటం నా లక్ష్యం. టీమిండియా అయినా.. ఏ జట్టు అయినా నా శైలి ఇలాగే దూకుడుగా ఉంటుంది’’ అని మీడియా సమావేశంలో ఫర్హాన్ పేర్కొన్నాడు.అంతొద్దుకాగా 2018లో ఆస్ట్రేలియాతో టీ20 సందర్భంగా 29 ఏళ్ల ఫర్హాన్ పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 24 టీ20 మ్యాచ్లు ఆడి.. 510 పరుగులు చేయగలిగగాడు. ఈ నేపథ్యంలో అతడి వ్యాఖ్యలను ఉటంకిస్తూ నెటిజన్లు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. సెంచరీలు బాదిన వాళ్లు కూడా ఇలా ఓవరాక్షన్ చేయరంటూ చురకలు అంటిస్తున్నారు.ఇక టీమిండియాతో మ్యాచ్లో ఫర్హాన్ 45 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. శివం దూబే బౌలింగ్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్యసెకండ్ వికెట్ పడగొట్టిన Shivam Dube 💥 చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/EZGkRemo4D— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025इनको कौन समझाये ये बैट है AK47 नहीं 😡😡#INDvPAK pic.twitter.com/oV456mlCXq— Shivani (@shivani_di) September 21, 2025 -
పాక్ను చిత్తు చేసిన భారత్.. గౌతం గంభీర్ పోస్ట్ వైరల్
దాయాది పాకిస్తాన్కు టీమిండియా మరోసారి తమ స్థాయి ఏమిటో చూపించింది. దూకుడైన ఆటతో ‘చిరకాల ప్రత్యర్థి’కి చెక్పెట్టి .. పొట్టి ఫార్మాట్లో మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. కాగా ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా లీగ్ దశలో ఏడు వికెట్ల తేడాతో పాక్ను ఓడించిన భారత్.. తాజాగా కీలకమైన సూపర్-4 దశలోనూ సత్తా చాటింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ సేన.. సల్మాన్ ఆఘా బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్ను నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకు కట్టడిచేయగలిగింది.అభిషేక్- గిల్ ధనాధన్ఇక లక్ష్య ఛేదనలో టీమిండియా మరోసారి తన మార్కును చూపించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishek Sharma)- శుబ్మన్ గిల్ (Shubman Gill) అద్భుత రీతిలో ఆకట్టుకున్నాడు. అభిషేక్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లు బాది 74 పరుగులు చేయగా.. గిల్ 28 బంతుల్లో 47 పరుగులు సాధించాడు.వీరికి తోడుగా తిలక్ వర్మ (19 బంతుల్లో 30) ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు. ఈ క్రమంలో 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20 ఫార్మాట్లో పదిహేనుసార్ల ముఖాముఖి పోరులో టీమిండియా పాక్పై పన్నెండోసారి గెలుపు జెండా ఎగురవేసింది.దిగ్గజాలు లేకుండానేఈసారి ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు లేకుండానే యువ భారత జట్టు పాక్ను ఓడించడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ జట్టు ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.ఫియర్లెస్..ఇన్స్టా స్టోరీలో ‘‘ఫియర్లెస్.. ఫియర్లెస్.. ఫియర్లెస్’’ అంటూ అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్లతో పాటు టీమిండియా ఫొటోను గంభీర్ షేర్ చేశాడు. తమకు భయం లేదు.. తిరుగు లేదు అన్నట్లుగా గంభీర్ ప్రత్యర్థి జట్లకు పరోక్షంగా హెచ్చరిక జారీ చేశాడు. ముఖ్యంగా మైదానంలో అతి చేసిన దాయాది పాక్కు తనదైన శైలిలో ఇలా కౌంటర్ వేశాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య -
పాక్ బౌలర్ల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన అభిషేక్, గిల్
ఆసియా కప్-2025 సూపర్-4 మ్యాచ్లో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ పేసర్లకు చేదు అనుభవం ఎదురైంది. తమ బౌలింగ్లో భారత బ్యాటర్లు చితక్కొడుతుంటే వారి అసహనం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఆటపై దృష్టి పెట్టాల్సింది పోయి .. నోటికి పనిచెప్పారు.పాక్ జట్టుకు ఓటమిని కానుకగాతమ బౌలింగ్లో ఉతికారేస్తున్న ఓపెనర్లు అభిషేక్ శర్మ (Abhishesk Sharma)- శుబ్మన్ గిల్ (Shuban Gill)లతో వాదులాటకు దిగేందుకు ప్రయత్నించారు. ఇందుకు వారిద్దరు బ్యాట్తోనే సమాధానమిచ్చి.. పాక్ జట్టుకు ఓటమిని కానుకగా అందించారు. దీంతో ఆడలేక అతి చేసిన పాక్ ఆటగాళ్లకు మరోసారి అవమానం తప్పలేదు.అసలేం జరిగిందంటే.. లీగ్ దశలో టీమిండియా చేతిలో చిత్తైన పాక్ (IND vs PAK).. తాజాగా సూపర్-4 మ్యాచ్లోనూ ఓడిపోయింది. అయితే, బ్యాటింగ్ పరంగా మాత్రం మెరుగ్గా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.ఆది నుంచే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారుఅయితే, టీ20 వరల్డ్ నంబర్ వన్ అయిన భారత జట్టు పాక్ విధించిన లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో ఊదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆది నుంచే పాక్ బౌలర్లపై దూకుడు ప్రదర్శించారు. ఇద్దరూ బౌండరీలు బాదుతూ పాక్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టారు.ఈ క్రమంలో పాక్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారీస్ రవూఫ్.. అభిషేక్- గిల్లను మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. షాహిన్ బౌలింగ్లో ఇరగొట్టిన గిల్.. అతడి ఓవరాక్షన్కు బదులుగా ‘‘వెళ్లి బంతి తెచ్చుకో’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.ఇక హ్యారిస్ రవూఫ్ పదే పదే మాటలతో కవ్వింపులకు పాల్పడగా.. అభిషేక్ ఓ దశలో అతడికి దగ్గరగా వెళ్లి బదులిచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో అంపైర్ వచ్చి రవూఫ్ను పక్కకు తీసుకువెళ్లాడు.అస్సలు నచ్చలేదుఈ విషయంపై మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. పాక్ బౌలర్లు కారణం లేకుండా మీద మీదకు వచ్చారని.. దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నాడు. తనకు అది అస్సలు నచ్చలేదని తెలిపాడు. తాము మాత్రం అనవసర విషయాల పట్ల కాకుండా ఆటపై మాత్రమే దృష్టి పెట్టామంటూ పాక్ బౌలర్లకు మరోసారి కౌంటర్ ఇచ్చిపడేశాడు.ఇక గిల్- అభిషేక్ శర్మ సోషల్ మీడియా వేదికగా.. ‘‘మీవి మాటలు- మావి చేతలు’’ అంటూ పాక్కు తమ ఓటమిని గుర్తు చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఈ ఇద్దరు పంజాబీ ఆటగాళ్లు చిన్ననాటి నుంచి స్నేహితులు. భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వీరికి మెంటార్. ఇక తాజా మ్యాచ్లో విరాట్ కోహ్లిలేని లోటు పాక్ ఆటగాళ్లకు తెలియకుండా చేశారంటూ గిల్- అభిలపై టీమిండియా అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.చదవండి: ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!Ye Naya Bharat Hain. Ye Bekhauf Bharat hai! 💪 Watch the Asia Cup, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/mn3n9OEZjv— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా ఘనత
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అదరగొడుతున్నాడు. లీగ్ దశలో తొలుత యూఏఈపై ప్రతాపం చూపించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 16 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు.మరోసారి విశ్వరూపంఆ తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్ (IND vs PAK)లో అభిషేక్ శర్మ విజృంభించాడు. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించి.. దాయాదికి తన సత్తా ఏమిటో చూపించాడు. అనంతరం ఒమన్పై 15 బంతుల్లోనే 38 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. తాజాగా సూపర్-4లో భాగంగా పాకిస్తాన్కు మరోసారి విశ్వరూపం చూపించాడు.దుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో అభిషేక్.. పాక్ బౌలింగ్ను ఉతికారేశాడు. 39 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47)తో కలిసి తొలి వికెట్కు వందకు పైగా పరుగులు జతచేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లుఇలా కెరీర్ ఆరంభం నుంచి అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ.. తాజాగా పాక్తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో.. అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఎవిన్ లూయీస్ వరల్డ్ రికార్డును అభిషేక్ సమం చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా పాక్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సూపర్-4 దశలోనూ మరోసారి దాయాదికి ఓటమి రుచి చూపించింది. కాగా లీగ్ దశలో భారత్.. పాక్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.అతి తక్కువ బంతుల్లోనే అంతర్జాతీయ టీ20లలో 50 సిక్సర్లు బాదిన ఫుల్ మెంబర్ (టెస్టు హోదా) జట్ల ఆటగాళ్లుఅభిషేక్ శర్మ (ఇండియా)- 331 బంతుల్లోనే 50 సిక్సర్లుఎవిన్ లూయీస్ (వెస్టిండీస్)- 366 బంతుల్లో 50 సిక్సర్లుఆండ్రీ రసెల్ (వెస్టిండీస్)- 409 బంతుల్లో 50 సిక్సర్లుహజ్రతుల్లా జజాయ్ (అఫ్గనిస్తాన్)- 492 బంతుల్లో 50 సిక్సర్లుసూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 509 బంతుల్లో 50 సిక్సర్లుఅతి తక్కువ ఇన్నింగ్స్లో అంతర్జాతీయ టీ20లలో సిక్సర్లు బాదిన ఆటగాళ్లు (ఫుల్ మెంబర్ జట్లు)అభిషేక్ శర్మ- 20 ఇన్నింగ్స్లోఎవిన్ లూయీస్- 20 ఇన్నింగ్స్లోహజ్రతుల్లా జజాయ్- 22 ఇన్నింగ్స్లోక్రిస్ గేల్- 25 ఇన్నింగ్స్లోసూర్యకుమార్ యాదవ్- 29 ఇన్నింగ్స్లో. చదవండి: ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!కోత.. ఊచకోత 💥Abhishek Sharma ఇచ్చిపడేసాడంతే! 🥁చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/0ufRZ5nDs6— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
పవర్ ప్లేలో వాళ్లు అద్భుతం.. మేమింకా స్థాయికి తగ్గట్లు ఆడలేదు: పాక్ కెప్టెన్
టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరోసారి పరాభవమే ఎదురైంది. ఆసియా కప్-2025 టోర్నీమెంట్లో లీగ్ దశలో భారత్ చేతిలో పరాజయం పాలైన పాక్.. తాజాగా సూపర్-4 దశలోనూ అదే ఫలితాన్ని చవిచూసింది. అయితే, గత మ్యాచ్ కంటే ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శన చేయగలిగింది.ఈ నేపథ్యంలో టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) స్పందించాడు. తాము ఇంతవరకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని.. అయితే, మెరుగ్గా ఆడామని పేర్కొన్నాడు. పవర్ ప్లేలో టీమిండియా మ్యాచ్ను తమ నుంచి లాగేసుకుందని .. తాము ఇంకో 10- 15 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని వ్యాఖ్యానించాడు.171 పరుగులుదుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58) రాణించగా.. ఫఖర్ జమాన్ (9 బంతుల్లో 15) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. హ్యాట్రిక్ డకౌట్ల ‘స్టార్’ సయీబ్ ఆయుబ్ (17 బంతుల్లో 21) ఈసారి ఫర్వాలేదనిపించగా.. హుసేన్ తలట్ (10), మొహమ్మద్ నవాజ్ (21) తేలిపోయారు.అభి- గిల్ రఫ్పాడించారుకెప్టెన్ సల్మాన్ ఆఘా 17, ఫాహిమ్ ఆష్రఫ్ 20 బంతులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి పాక్ 171 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74), శుబ్మన్ గిల్ (28 బంతుల్లో 47) ఆకాశమే హద్దుగా చెలరేగారు.పవర్ ప్లేలో విజృంభణతో తొలి వికెట్కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అభి (Abhishek Sharma)- గిల్ (Shubman Gill) మ్యాచ్ను టీమిండియా వైపు తిప్పేశారు. తిలక్ వర్మ (19 బంతుల్లో 30 నాటౌట్) కూడా వేగంగా ఆడగా.. 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా పని పూర్తి చేసింది.మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదుఈ నేపథ్యంలో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు మేము మా స్థాయికి తగ్గట్లుగా ఆడనేలేదు. అయితే, మెరుగ్గా ఆడామని చెప్పగలను. కానీ పవర్ ప్లేలోనే వారు మ్యాచ్ను మా నుంచి లాగేసుకున్నారు. ఇంకో 10- 15 పరుగులు చేసి.. 180 వరకు స్కోరు బోర్డు మీద పెట్టి ఉంటే బాగుండేది.పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంఏదేమైనా పవర్ ప్లేలో వాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అదే మ్యాచ్ను మలుపు తిప్పింది. మా జట్టులోనూ ఫఖర్, ఫర్హాన్ బాగా బ్యాటింగ్ చేశారు. హ్యారీ కూడా మెరుగ్గా ఆడాడు. తదుపరి శ్రీలంకతో మ్యాచ్లో సత్తా చాటుతాం’’ అని పేర్కొన్నాడు.కాగా గతంలో సొంతగడ్డపై బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లలో సల్మాన్ బృందం మూడు మ్యాచ్లలోనూ 200కు పైగా స్కోరు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విలేకరులు సల్మాన్ ఆఘా దగ్గర తాజాగా ప్రస్తావించారు.ఇందుకు బదులిస్తూ.. ‘‘అక్కడికి .. ఇక్కడికి పరిస్థితులు వేరు. మాకు మంచి పిచ్ దొరికితే కచ్చితంగా 200కు పైగా స్కోరు చేస్తాము. కానీ ఈ పిచ్లు మాకు అంతగా సహకరించడం లేదు’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్యStarting your Monday with the Blue Storm that lit up Dubai last night 🌪️ 💙 Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/DNKy14ylYn— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!
టీమిండియాతో మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లు బరితెగించారు. ఓ బ్యాటర్ ఏకే-47 మాదిరి బ్యాట్తో సంబరాలు చేసుకుంటే.. ఇంకో ఆటగాడు ఇంకాస్త దిగజారి వ్యవహరించాడు. ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో భారత నెటిజన్లు పాక్ ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఛీ.. మీ బుద్ధి మారదా?‘‘ఛీ.. మీ బుద్ధి మారదా? ఇంతకంటే ఇంకెంతకు దిగజారుతారు?’’ అంటూ చివాట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 టోర్నీ సూపర్-4లో భాగంగా భారత్- పాకిస్తాన్ (IND vs PAK) ఆదివారం తలపడ్డాయి.దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసి.. పాక్ను 171 పరుగులకు కట్టడిచేసింది. ఆపై 18.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే.. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) టాప్ రన్స్కోరర్గా నిలిచాడు.ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగాఫర్హాన్ నలభై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 58 పరుగులు సాధించాడు. అయితే, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగానే ఏకే-47 గన్ ఎక్కుపెట్టినట్లుగా అభినయిస్తూ బ్యాట్ను చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.విరాట్ కోహ్లి నామస్మరణయువ ఆటగాడు ఫర్హాన్ సంగతి ఇలా ఉంటే.. సీనియర్ ప్లేయర్ హ్యారిస్ రవూఫ్ మరో అడుగు ముందుకు వేశాడు. బౌండరీ రోప్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత దిగ్గజం విరాట్ కోహ్లి నామస్మరణ చేస్తూ ప్రేక్షకులు టీమిండియాను ఉత్సాహపరిచారు. దీంతో టీ20 ప్రపంచకప్-2022లో కోహ్లి తన బౌలింగ్లో రెండు వరుస సిక్స్లు బాది.. మ్యాచ్ను లాగేసుకున్న విషయం అతడికి గుర్తుకు వచ్చినట్లు ఉంది.ఇదొక దిగజారుడు చర్యఅయితే, ఇందుకు తాజా మ్యాచ్లో తన బౌలింగ్తో సమాధానం ఇవ్వాల్సింది పోయి.. రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్.. భారత్కు చెందిన ఆరు ఫైటర్ జైట్లను కూల్చామని ప్రగల్బాలు పలికిన విషయం తెలిసిందే. మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేస్తూ.. హ్యారిస్ రవూఫ్ సైగలు చేశాడు.అంతకు ముందు ప్రాక్టీస్ సమయంలో ఫుట్బాల్ ఆడుతూ.. 6-0sతో లీడ్లో ఉన్నామంటూ భారత జర్నలిస్టుల ముందు పాక్ ఆటగాళ్లు అతి చేశారు. ఈ నేపథ్యంలో ఇదొక దిగజారుడు చర్య అంటూ క్రికెట్ ప్రేమికులు పాక్ ఆటగాళ్ల తీరును విమర్శిస్తున్నారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరిస్తున్న విషయం తెలిసిందే.ఆసియా కప్ -2025 సూపర్ 4: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్👉పాకిస్తాన్ స్కోరు: 171/5 (20)👉టీమిండియా స్కోరు: 174/4 (18.5)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసిన టీమిండియా.చదవండి: ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య Haris Rauf never disappoints, specially with 6-0. pic.twitter.com/vsfKKt1SPZ— Ihtisham Ul Haq (@iihtishamm) September 21, 2025సెకండ్ వికెట్ పడగొట్టిన Shivam Dube 💥 చూడండి #INDvPAK లైవ్Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/EZGkRemo4D— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025 -
Asia Cup 2025: పాక్ ను చిత్తు చేసిన భారత్
-
ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య
దాయాది పాకిస్తాన్పై టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా కప్-2025 లీగ్ దశలో పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన సూర్యకుమార్ సేన.. సూపర్-4లో భాగంగా మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్.. పాకిస్తాన్ (IND vs PAK)ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టీ20 ఫార్మాట్లో పాక్పై టీమిండియాకు ఇది పన్నెండో విజయం. ఇప్పటికి పదిహేను సార్లు ముఖాముఖి పోటీ పడగా.. భారత్ ఈ మేరకు ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది.ఇంకోసారి అలా అనకండి ఈ నేపథ్యంలో పాక్పై విజయానంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీడియా సమావేశంలో భాగంగా చిరకాల ప్రత్యర్థుల పోరు అంటూ ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘‘సర్.. ఇకపై నుంచైనా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ను ప్రత్యర్థుల పోరు అని అనడం మానేయాలి.పాక్ జట్టు పరువు తీసిన సూర్యసర్.. ఏ రకంగా చూసినా ఇలా అనేందుకు నాకు ఎలాంటి కారణం కనపడటం లేదు. ఇంకా రైవలరీ ఏంటి? రెండు జట్లు 15 మ్యాచ్లలో తలపడి ఒకటి 8.. ఇంకోటి 7 గెలిస్తే దానిని ప్రత్యర్థుల పోరుగా అభివర్ణించవచ్చు. కానీ ఇక్కడ 13- 1, 12-3 లా ఉన్నపుడు ఇంకా ఇలా ఎలా అనగలం?అసలు రెండు జట్ల మధ్య పోటీ అనేదే లేదు కదా!’’ అని సూర్యకుమార్ యాదవ్.. పాక్ జట్టుకు తమ స్థాయి ఏమిటో తెలియజేశాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా ఆసియా కప్ లీగ్ దశలో భారత్- పాక్ ముఖాముఖి పోటీపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించింది.బుద్ధి చూపించారుదీంతో రచ్చకెక్కిన పాక్ బోర్డు.. నానాయాగీ చేసి.. టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది. అయితే, ఐసీసీ దిగిరాకపోవడంతో టోర్నీలో కొనసాగుతోంది. ఇక ఆదివారం నాటి మ్యాచ్లోనూ పాక్ తన బుద్ధి చూపించింది. అర్ధ శతకం (34 బంతుల్లో) పూర్తి చేసుకున్న తర్వాత పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే-47 పేలుస్తున్న తరహాలో బ్యాట్ చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్ మధ్యలోనూ ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు.సూపర్-4 : భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: భారత్.. తొలుత బౌలింగ్👉పాక్ స్కోరు: 171/5 (20)👉భారత్ స్కోరు: 174/4 (18.5)👉ఫలితం: పాక్పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74).చదవండి: వైభవ్ సూర్యవంశీ ధనాధన్.. ఆసీస్ను చిత్తు చేసిన భారత్..Starting your Monday with the Blue Storm that lit up Dubai last night 🌪️ 💙 Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/DNKy14ylYn— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
అభిషేక్ సూపర్ షో.. పాకిస్తాన్కు చుక్కలు చూపించిన భారత్ (ఫొటోలు)
-
విధ్వంసం సృష్టించిన అభిషేక్.. పాక్ను మరోసారి చిత్తు చేసిన భారత్
ఆసియా కప్-2025లో టీమిండియా పాక్ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్-4 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.రాణించిన ఫర్హాన్ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 15, సైమ్ అయూబ్ 21, హుస్సేన్ తలాత్ 10, మొహమ్మద్ నవాజ్ 21, సల్మాన్ అఘా 17 (నాటౌట్) పరుగులు చేశారు.ఫీల్డర్ల వైఫల్యం.. భారీగా పరుగులిచ్చిన బుమ్రా ఈ మ్యాచ్లో భారత బౌలర్లు పాక్కు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోర్ ఇచ్చారు. ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్లు (అభిషేక్ 2, కుల్దీప్, గిల్ తలో ఒకటి) వదిలిపెట్టారు. బుమ్రా ఎన్నడూ లేనంత ధారాళంగా పరుగులు (4-0-45-0) సమర్పించుకోగా.. మిగతా బౌలర్లు కూడా ఓ మోస్తరు ప్రదర్శనలే చేశారు.వరుణ్ చక్రవర్తి చాలా మ్యాచ్ల తర్వాత వికెట్ లేకుండా మిగిలిపోయాడు. స్ట్రయిట్ బౌలర్లు పెద్దగా రాణించని వేళ, శివమ్ దూబే 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు. అక్షర్ పటేల్తో కెప్టెన్ సూర్యకుమార్ ఒకే ఓవర్ వేయించాడు.విధ్వంసం సృష్టించిన అభిషేక్ 172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు), అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయారు. తొలి వికెట్కు 9.5 ఓవర్లలో 105 పరుగులు జోడించారు. అనంతరం భారత్ పరుగు వ్యవధిలో గిల్, సూర్యకుమార్ యాదవ్ (0) వికెట్లు కోల్పోయింది. మరో 17 పరుగుల తర్వాత (123 పరుగుల వద్ద) అభిషేక్ శర్మ కూడా ఔటయ్యాడు.ఈ దశలో సంజూ శాంసన్, తిలక్ వర్మ నిదానంగా ఆడటంతో స్కోర్ నెమ్మదించింది. 148 పరుగుల వద్ద సంజూ (13) ఓ చెత్త షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు. అనంతరం హార్దిక్ (7 నాటౌట్) సాయంతో తిలక్ వర్మ (30 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 2, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్కు తలో వికెట్ దక్కాయి. -
Ind VS Pak Super 4 Match: రికార్డును మరింత మెరుగుపర్చుకున్న హార్దిక్
ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన పేరిట ఉన్న ఓ రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ మ్యాచ్లో ఫకర్ జమాన్ (9 బంతుల్లో 15; 3 ఫోర్లు) వికెట్ తీసిన అతను.. పాకిస్తాన్తో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా మరింత మెరుగయ్యాడు. హార్దిక్ పాక్తో కేవలం 8 టీ20 ఇన్నింగ్స్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.హార్దిక్ తర్వాత పాక్పై అత్యధిక టీ20 వికెట్లు తీసిన ఘనత భువనేశ్వర్ కుమార్కు దక్కుతుంది. భువీ 7 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో హార్దిక్, భువీ తర్వాతి స్థానాల్లో బుమ్రా (7), అర్షదీప్ సింగ్ (7) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ జోరు ప్రదర్శిస్తుంది. 11.2 ఓవర్లలోనే ఆ జట్టు 100 పరుగుల మార్కును తాకింది. సాహిబ్జాదా ఫర్హాన్ (56) మెరుపు అర్ద సెంచరీతో బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా హుస్సేన్ తలాత్ (6) క్రీజ్లో ఉన్నాడు. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 103/2గా ఉంది. హార్దిక్ ఫకర్ జమాన్ వికెట్ తీయగా.. శివమ్ దూబేకు సైమ్ అయూబ్ (21) వికెట్ దక్కింది.కాగా, ఈ మ్యాచ్ టాస్ సమయంలో కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ నిరాకరించాడు. ఈ కారణంగా గ్రూప్ దశ మ్యాచ్లో పెద్ద వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ బోర్డు ఈ వివాదానికి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను బాధ్యుడిగా చూపుతూ అతన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ను ఐసీసీ తోసిపుచ్చి పైక్రాఫ్ట్కు అండగా నిలిచింది. పైగా నేటి మ్యాచ్లో కూడా పైక్రాఫ్ట్నే రిఫరీగా కొనసాగించింది. -
Ind VS Pak Super 4 Match: పాక్ను చిత్తు చేసిన భారత్
పాక్ను మరోసారి చిత్తు చేసిన భారత్ఆసియా కప్-2025లో టీమిండియా పాక్ను మరోసారి చిత్తు చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 21) జరిగిన సూపర్-4 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు), తిలక్ వర్మ (30 నాటౌట్) కూడా రాణించారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్16.4వ ఓవర్- 148 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. హరీస్ రౌఫ్ బౌలింగ్లో సంజూ శాంసన్ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన భారత్12.2వ ఓవర్- 123 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో సిక్సర్ బాదిన మరుసటి బంతికే అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔటయ్యాడు. అభిషేక్ మరో భారీ షాట్కు ప్రయత్నించే క్రమంలో హరీస్ రౌఫ్కు క్యాచ్ ఇచ్చాడు. తిలక్ వర్మకు (1) జతగా సంజూ శాంసన్ క్రీజ్లోకి వచ్చాడు. రెండో వికెట్ కోల్పోయిన భారత్10.3వ ఓవర్- హరీస్ రౌఫ్ బౌలింగ్లో అబ్రార్ అహ్మద్ క్యాచ్ తీసుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ (0) ఔటయ్యాడు. బంతి లీడింగ్ ఎడ్జ్ తీసుకొని నేరుగా అబ్రార్ చేతుల్లోకి వెళ్లింది. భారత్ స్కోర్ ప్రస్తుతం 106/2గా ఉంది. అభిషేక్కు (58) జతగా తిలక్ వర్మ క్రీజ్లోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్9.5వ ఓవర్- 105 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఫహీమ్ అష్రాఫ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ శర్మకు (57) జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చాడు.దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లు172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. గిల్ 35, అభిషేక్ 33 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలుపుకు ఇంకా 84 బంతుల్లో 103 పరుగులు మాత్రమే చేయాలి. విధ్వంసం సృష్టిస్తున్న భారత ఓపెనర్లు172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. గిల్ 22, అభిషేక్ 21 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్172 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి బంతికే సిక్సర్ బాదాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్లో ఈ ఘనత సాధించాడు. తొలి ఓవర్ తర్వాత భారత్ స్కోర్ 9/0గా ఉంది. అభిషేక్ 8, గిల్ 1 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్ పాక్కు ఊహించిన దానికంటే ఎక్కువ స్కోరే ఇచ్చింది. ఫీల్డర్లు ఏకంగా నాలుగు క్యాచ్లు (అభిషేక్ 2, కుల్దీప్, గిల్ తలో ఒకటి) వదిలిపెట్టడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బుమ్రా ఎన్నడూ లేనంత ధారాళంగా పరుగులు (4-0-45-0) సమర్పించుకోగా.. మిగతా బౌలర్లు కాస్త పర్వాలేదనిపించారు. వరుణ్ చక్రవర్తి చాలా మ్యాచ్ల తర్వాత వికెట్ లేకుండా మిగిలిపోయాడు. స్ట్రయిట్ బౌలర్లు పెద్దగా రాణించని వేళ, శివమ్ దూబే 2 వికెట్లతో పర్వాలేదనిపించాడు. కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీశారు అక్షర్ పటేల్తో కెప్టెన్ సూర్యకుమార్ ఒకే ఓవర్ వేయించాడు. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) టాప్ స్కోరర్గా నిలువగా.. ఆఖర్లో ఫహీమ్ అష్రాఫ్ (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 15, సైమ్ అయూబ్ 21, హుస్సేన్ తలాత్ 10, మొహమ్మద్ నవాజ్ 21, సల్మాన్ అఘా 17 (నాటౌట్) పరుగులు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చుకున్న భారత బౌలర్లు11.2 ఓవర్లలోనే 100 పురుగులు పూర్తి చేసి భారీ స్కోర్ చేస్తుందనుకున్న పాక్కు భారత బౌలర్లు పగ్గాలు వేశారు. 19 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 159/5గా మాత్రమే ఉంది. నాలుగో వికెట్ కోల్పోయిన పాక్14.1వ ఓవర్- 115 పరుగుల వద్ద పాక్ నాలుగో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో సూర్యకుమార్ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ (58) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన పాక్13.1వ ఓవర్-110 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి హుస్సేన్ తలాత్ (10) ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన పాక్.. ఎట్టకేలకు క్యాచ్ పట్టిన అభిషేక్ఈ మ్యాచ్లో రెండు క్యాచ్లు వదిలేసిన అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఓ క్యాచ్ పట్టుకున్నాడు. శివమ్ దూబే బౌలింగ్లో సైమ్ అయూబ్ (21) ఆడిన షాట్ను అభిషేక్ కష్టమైనా క్యాచ్గా మలిచాడు. 10.3 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 93/2గా ఉంది. ఫర్హాన్కు (53) జతగా హుస్సేన్ తలాత్ క్రీజ్లోకి వచ్చాడు. పాక్ ఓపెనర్ మెరుపు హాఫ్ సెంచరీపాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ మెరుపు అర్ద సెంచరీతో మెరిశాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని తాకాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో సిక్సర్తో ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 10 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 91/1గా ఉంది. ఫర్హాన్తో (52) పాటు సైమ్ అయూబ్ (21) క్రీజ్లో కొనసాగుతున్నాడు. మరో క్యాచ్ జారవిడిచిన అభిషేక్తొలి ఓవర్లో ఈజీ క్యాచ్ వదిలేసిన అభిషేక్ శర్మ 8వ ఓవర్లో మరో క్యాచ్ జారవిడిచాడు. క్యాచ్ పట్టకపోగా బంతి బౌండరీ ఆవల పడింది (సిక్సర్). 8 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 70/1గా ఉంది. ఫర్హాన్ 39, సైమ్ అయూబ్ 13 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రెండు డ్రాప్ క్యాచ్లు.. పవర్ ప్లేలో భారీగా స్కోర్ చేసిన పాకిస్తాన్భారత ఫీల్డర్లు రెండు ఈజీ క్యాచ్లు డ్రా చేయగా, పాకిస్తాన్ పవర్ ప్లేలో భారీగా స్కోర్ చేసింది. 6 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ఈజీ క్యాచ్ జారవిడిచిన కుల్దీప్4.4వ ఓవర్- వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో సైమ్ అయూబ్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను కుల్దీప్ యాదవ్ జారవిడిచాడు. 5 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 42/1గా ఉంది. ఫర్హాన్ 20, సైమ్ 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మ కూడా ఓ ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. హార్దిక్ బౌలింగ్లో ఫకర్ ఔట్పాకిస్తాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ (15) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కీపర్ సంజూ శాంసన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. హర్దిక్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఫకర్ ఆడదామా.. వ ద్దా అనే అనుమానంతో బ్యాట్ ను పెట్టాడు. ఆ బంతి ఫకర్ బ్యాట్ను ముద్దాడుతూ వెళ్లి కీపర్ సంజూ చేతుల్లో పడింది. అయితే దీనిపై కాస్త అనుమానం వచ్చింది. అది సంజూ శాంసన్ గ్లౌజ్లో పడే ముందు నేలను తాకినట్లు అనిపించింది. కానీ అది నేలను తాకకుండా సంజూ ఫింగర్స్ను తాకుతూగ్లౌజ్లో పడటంతో ఫకర్ పెవిలియన్కు చేరక తప్పలేదు. అయితే ఈ నిర్ణయంపై ఫకర్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.తొలి ఓవర్లోనే పాక్ ఓపెనర్కు లైఫ్పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్కు తొలి ఓవర్లోనే లైఫ్ లభించింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అభిషేక్ శర్మ చేతిలో పడిన క్యాచ్ను వదిలేశాడు. బుమ్రా వేసిన రెండో ఓవర్లో ఫకర్ జమాన్ రెండు బౌండరీలు బాది జోరును ప్రదర్శించాడు. 2 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 17/0గా ఉంది. ఫకర్ 11, ఫర్హాన్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానాల్లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చారు. పాకిస్తాన్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్లో ఆడిన హసన్ నవాజ్, ఖుష్దిల్ షా ఈ మ్యాచ్లో ఆడటం లేదు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్(w), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(c), మహ్మద్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఫమీమ్ అష్రాఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్ -
అదో గల్లీ జట్టు.. భారత్-పాక్ హోరాహోరీ సమరాలు ఇక చరిత్రే..!
ఆసియా కప్ 2025లో భాగంగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 21) జరుగబోయే సూపర్ 4 మ్యాచ్కు ముందు పాకిస్తాన్ జట్టుపై భారత మాజీ సెలెక్టర్, వరల్డ్కప్ విన్నిర్ (1983) కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ జట్టు చెన్నై లోకల్ లీగ్లో 7వ డివిజన్ జట్టులా ఉందని అన్నారు.ఇలాంటి బలహీనమైన జట్టుతో ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పాల్గొనడం పాకిస్తాన్ చేసుకున్న అదృష్టమని తెలిపారు. ఈ జట్టుకు టీమిండియాతో ఆడే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. పాక్ జట్టును అసోసియేట్ దేశాల జట్లతోనే ఆడించాలని సూచించారు.ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్లు ఇకపై జనాన్ని ఆకర్షించవని అన్నారు. భారత్-పాక్ హోరీహోరీ సమరాలు చరిత్రే అని అభిప్రాయపడ్డారు. హెస్సన్ లాంటి కోచ్ వల్ల కూడా పాక్కు ఒరిగేదేమీ లేదని తెలిపారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో వ్యాఖ్యానించారు.శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులే సానుకూలంగా స్పందిస్తున్నారు. నిజంగానే తమ జట్టు గల్లీ జట్ల కంటే హీనంగా ఉందని అంటున్నారు. తమ దేశ క్రికెట్ చరిత్రలో ఇంత దారుణమైన జట్టును చూడలేదని చర్చించుకుంటున్నారు.కాగా, ప్రస్తుత ఆసియా కప్లో పాకిస్తాన్ చచ్చి చెడి సూపర్ 4కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఒమన్పై ఘనంగా గెలిచినా.. టీమిండియా చేతిలో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది. సూపర్ 4కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో యూఏఈ చేతిలో భంగపాటును తృటిలో తప్పించుకుంది. -
Asia cup 2025: చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్.. అడుగు దూరంలో ముస్తాఫిజుర్
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 20) జరిగిన తొలి సూపర్-4 మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో 16 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ను వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించాడు.షకీబ్ 129 మ్యాచ్ల్లో 13 హాఫ్ సెంచరీల సాయంతో 2551 పరుగులు చేయగా.. దాస్ 114 మ్యాచ్ల్లో 15 హాఫ్ సెంచరీల సాయంతో 2556 పరుగులు చేశాడు. ఓవరాల్గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (4231) పేరిట ఉంది.ముస్తాఫిజుర్ మరో వికెట్ దూరంలో..!శ్రీలంకతో మ్యాచ్కు ముందు వరకు బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు, వికెట్ల రికార్డులు షకీబ్ అల్ హసన్ పేరిట సోలోగా ఉండేవి. ఈ మ్యాచ్లో షకీబ్ పేరిట ఉండిన అత్యధిక పరుగుల రికార్డును లిట్టన్ దాస్ బద్దలు కొట్టగా.. ఇదే మ్యాచ్లో షకీబ్ పేరిటే ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును ముస్తాఫిజుర్ రెహ్మాన్ సమం చేశాడు. లంకతో మ్యాచ్లో 3 వికెట్లు తీసిన తర్వాత ముస్తాఫిజుర్, షకీబ్ తలో 149 వికెట్లతో సమంగా ఉన్నారు. ముస్తాఫిజుర్ మరో వికెట్ తీస్తే బంగ్లాదేశ్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరిస్తాడు. -
పాక్తో పోరు.. ఆ ఇద్దరిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే!
ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్లో అసలైన పోటీ మొదలైంది. లీగ్ దశలో సత్తా చాటిన టీమిండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టైటిల్ వేటలో భాగంగా బంగ్లా- లంక మధ్య శనివారం జరిగిన మ్యాచ్లో.. బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది.బంగ్లా సంచలన విజయంతోఆఖరి వరకు పట్టువదలకుండా పోరాడి.. శ్రీలంకను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. ముందంజ వేసింది. ఇక ఆదివారం (సెప్టెంబరు 21) నాటి మ్యాచ్లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తలపడనున్నాయి. దుబాయ్లో జరిగే ఈ మ్యాచ్లో భారత తుదిజట్టులో కీలక మార్పు జరిగే అవకాశం ఉంది.బుమ్రా రీఎంట్రీ.. ఆ ఇద్దరిపై వేటులీగ్ దశలో ఆఖరిగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వడం లాంఛనమే. అదే విధంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో యువ పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.అక్షర్ దూరమైతే మాత్రంఅయితే, ఒమన్తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడిన అక్షర్ తల మైదానాన్ని బలంగా కొట్టుకోవడంతో.. అతడు గ్రౌండ్ వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా మళ్లీ ఫీల్డింగ్కు రాలేదు. ఈ నేపథ్యంలో పాక్తో మ్యాచ్కు అక్షర్ దూరమయ్యే అవకాశం ఉంది.అదే జరిగితే అర్ష్దీప్ లేదంటే హర్షిత్లలో ఒకరు తమ స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున వంద వికెట్ల క్లబ్లో చేరిన అర్ష్ వైపు మేనేజ్మెంట్ మొగ్గుచూపుతుందా?.. లేదంటే హెడ్కోచ్ గౌతం గంభీర్ ప్రియ శిష్యుడు హర్షిత్కు ఓటు వేస్తుందా? అన్నది చూడాల్సి ఉంది. ఈ స్వల్ప మార్పులు మినహా భారత్ పాత జట్టుతోనే పాక్తో బరిలో దిగే అవకాశం ఉంది.గ్రూప్-ఎ టాపర్గా టీమిండియాగ్రూప్-ఎలో భాగంగా యూఏఈ, పాకిస్తాన్, ఒమన్ జట్లపై హ్యాట్రిక్ విజయాలు సాధించిన టీమిండియా.. టాపర్గా సూపర్-4లో అడుగుపెట్టింది. ఇదే గ్రూపు నుంచి యూఏఈ, ఒమన్లపై విజయాలతో పాక్ కూడా సూపర్-4కు అర్హత సాధించింది. మరోవైపు.. గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్, హాంకాంగ్లను ఎలిమినేట్ చేసి.. శ్రీలంక, బంగ్లాదేశ్ క్వాలిఫై అయ్యాయి.భారత్ వర్సెస్ పాకిస్తాన్ సూపర్-4భారత తుదిజట్టు అంచనా:అభిషేక్ శర్మ (ఓపెనర్), శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్- ఓపెనర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్-బ్యాటర్), తిలక్ వర్మ (బ్యాటర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్ బ్యాటర్), శివం దూబే (ఆల్రౌండర్), హార్దిక్ పాండ్యా (ఆల్రౌండర్), అక్షర్ పటేల్ (ఆల్రౌండర్)/అర్ష్దీప్ సింగ్ (పేసర్), వరుణ్ చక్రవర్తి (స్పిన్నర్), కుల్దీప్ యాదవ్(స్పిన్నర్), జస్ప్రీత్ బుమ్రా (పేసర్). -
ఓడిపోయామన్న బాధ లేదు.. నేనే గనుక అక్కడి ఉంటేనా..! కథ వేరే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఓడిపోయామన్న బాధ లేకుండా.. కేవలం ‘నో- షేక్హ్యాండ్’ మీద రాద్ధాంతం చేయడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డాడు. కరచాలనం విషయంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తప్పేమీ లేదని.. తానే గనుక అతడి స్థానంలో ఉంటే పాక్ జట్టుతోనే సారీ చెప్పించుకునేవాడినని అశూ అన్నాడు.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తాన్ (IND vs PAK) జట్లు ఆసియా కప్ టీ20-2025లో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా గత ఆదివారం (సెప్టెంబరు 14) జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు.. పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని డ్రామాఈ విషయాన్ని అవమానంగా భావించిన పాక్ క్రికెట్.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహారశైలిపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇక ముందు పాక్ ఆడే మ్యాచ్లకు రిఫరీగా ఆయనను తొలగించాలని కోరింది. లేదంటే ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని డ్రామా చేసింది. అయితే, ఐసీసీ దిగిరాకపోగా.. యూఏఈతో పాక్ మ్యాచ్లోనూ ఆండీనే కొనసాగించింది. అంతేకాదు.. తదుపరి సూపర్-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబరు 21) నాటి భారత్- పాక్ పోరులోనే అతడినే రిఫరీగా ఎంపిక చేసింది.స్కూల్ టీచరా? లేదా ప్రిన్సిపలా?ఈ నేపథ్యంలో పాక్ వ్యవహారశైలిపై అశ్విన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ‘‘నిజానికి మీ పరువు పోకుండా ఆండీ పైక్రాఫ్ట్ మిమ్మల్ని కాపాడారు. తాము హ్యాండ్షేక్ చేయమన్న విషయాన్ని టీమిండియా ముందుగానే రిఫరీకి చెప్పింది. అదే విషయాన్ని ఆయన మీకు చెప్పారు. అంతే. కానీ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత మీరు చేసిన డ్రామా ఏంటి? అసలు దేని గురించి మీ రాద్ధాంతం?..అయినా ఆండీ పైక్రాఫ్ట్ ఏమైనా స్కూల్ టీచరా? లేదా ప్రిన్సిపలా?.. సూర్య దగ్గరికి వెళ్లి.. ‘రండి.. వచ్చి కరచాలనం చేయండి’ అని చెప్పాలా? ఆయన పని అది కాదు కదా!.. కాబట్టి ఇందులో మీకు ఆయన తప్పు ఎక్కడ కనిపించింది? మీతోనే సారీ చెప్పించుకునేవాడినినేనే గనుక ఆండీ స్థానంలో ఉండి ఉంటే.. ఇలా చేసినందుకు మీతోనే సారీ చెప్పించుకునేవాడిని. ఆయన మీకెందుకు క్షమాపణ చెప్పాలి?’’ అంటూ పాక్ క్రికెట్ బోర్డు తీరును అశ్విన్ ఏకిపారేశాడు. కాగా యూఏఈతో మ్యాచ్కు ముందు బాయ్కాట్ నాటకం ఆడిన పాక్.. ఐసీసీ దిగిరాకపోవడంతో రిఫరీ ఆండీ తమకు క్షమాపణలు చెప్పాడంటూ ఆడియోలేని ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. -
సండే గ్రేట్ వార్.. మ్యాచ్ కు ముందు భారత్ కు షాక్
-
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. స్వల్ప కెరీర్లోనే..!
ఆసియా కప్ 2025లో భాగంగా ఒమన్తో నిన్న (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్రయోగాలకు పోయి 188 పరుగులకే పరిమితమైంది. 56 పరుగులు చేసిన సంజూ శాంసన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. వాస్తవానికి ఒమన్ లాంటి చిన్న జట్టుపై భారత్ భారీ స్కోర్ చేసుండాల్సింది. ఒమన్ బౌలర్లను తక్కువ అంచనా వేయడం, నిర్లక్ష్యంగా షాట్లు ఆడటం, అతి విశ్వాసంగా ఉండటం వల్ల భారత్ ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది.అనంతరం లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఒమన్ బ్యాటర్లు కూడా భారత బౌలర్లకు దడ పుట్టించారు. ఆమిర్ కలీమ్ (64), హమ్మద్ మీర్జా (51) అనే అనామక బ్యాటర్లు అనుభవజ్ఞులైన భారత బౌలర్ల పాలిట కొరకరాని కొయ్యలయ్యారు. కాస్త అటో ఇటో అయ్యుంటే ఈ మ్యాచ్లో భారత్కు ఘోర పరాభవం ఎదురయ్యేది. నిర్దేశిత లక్ష్యానికి ఒమన్ అతి చేరువగా (167/4) వచ్చి భారత ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. అంతిమంగా భారత్ ఈ మ్యాచ్లో బయటపడి గ్రూప్ దశలో ఓటమెరుగని జట్టుగా సూపర్-4లోకి ప్రవేశించింది. భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచినందుకు గానూ సంజూ శాంసన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ అవార్డుతో సంజూ ఓ ఘనత సాధించాడు. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న వికెట్కీపర్ బ్యాటర్ అవతరించాడు. సంజూ 45 మ్యాచ్ల స్వల్ప కెరీర్లో 3 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచాడు. ఈ మ్యాచ్కు ముందు సంజూ దినేశ్ కార్తీక్తో (2) కలిసి సంయుక్తంగా ఈ అవార్డును పంచుకున్నాడు. భారత లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని 98 మ్యాచ్ల సుదీర్ఘ కెరీర్ కలిగి కూడా కేవలం ఒకే ఒకసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ధోని తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రిషబ్ పంత్ కూడా తన 76 మ్యాచ్ల కెరీర్లో ఒకే ఒకసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా చూస్తే.. దిగ్గజ వికెట్కీపర్ బ్యాటర్ అయిన ధోని 98 మ్యాచ్ల కెరీర్లో సాధించలేనిది, సంజూ స్వల్ప కెరీర్లోనే సాధించాడు. ఓవరాల్గా అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ల జాబితాలో పాకిస్తాన్కు చెందిన మొహమ్మద్ రిజ్వాన్ (12) ముందున్నాడు. అతని తర్వాతి స్థానాల్లో జోస్ బట్లర్ (10), మొహమ్మద్ షెహజాద్ (9), సంజూ శాంసన్ (3) ఉన్నారు. -
IND vs OMAN: అద్భుతం.. నమ్మశక్యం కాని రీతిలో అదరగొట్టారు: సూర్య
ఒమన్ క్రికెట్ జట్టుపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ ఆద్యంతం అద్బుత పోరాటపటిమ కనబరిచారని కొనియాడాడు. ఇందుకు ప్రధాన కారణం వారి కోచ్ సులక్షణ్ కులకర్ణి అంటూ సూర్య ప్రశంసించాడు.ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో భారత్, పాకిస్తాన్, యూఏఈతో పాటు ఒమన్ గ్రూప్-ఎ నుంచి పోటీపడింది. పాక్, యూఏఈ చేతిలో ఓడిన ఒమన్.. శుక్రవారం నాటి మ్యాచ్లో టీమిండియా చేతిలో మరో పరాజయాన్ని చవిచూసింది. అయితే, పటిష్ట భారత జట్టుతో ఒమన్ బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా రాణించి గట్టిపోటీనివ్వడం విశేషం.నమ్మశక్యం కాని రీతిలో..ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఒమన్ అద్భుతంగా ఆడింది. వారి ఆట నన్ను ఆకట్టుకుంది. నమ్మశక్యం కాని రీతిలో ఆడారు. వారి కోచ్ సులూ సర్ వల్లే ఇది సాధ్యమైంది.ఆయన వారిలో పట్టుదలకు కారణం. ప్రత్యర్థి ముందు తేలికగా తలవంచకూడదనే ధైర్యాన్ని నూరిపోశారు. ఒమన్ జట్టు బ్యాటింగ్ చేస్తుంటూ చూడముచ్చటగా అనిపించింది’’ అని కితాబు ఇచ్చాడు.కాస్త కష్టంగానే ఉంటుందిఇక యూఏఈ, పాక్ జట్లతో మ్యాచ్లతో బెంచ్కే పరిమితమైన పేసర్లు అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా ఒమన్తో నామమాత్రపు మ్యాచ్లో ఆడిన విషయం తెలిసిందే. అర్ష్దీప్ నాలుగు ఓవర్ల కోటాలో 37 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. హర్షిత్ మూడు ఓవర్ల బౌలింగ్లో 25 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఒమన్ వంటి జట్టుకు కూడా వీరు పరుగులు ధారాళంగా సమర్పించుకోవడంతో విమర్శలు వచ్చాయి. అయితే, సూర్య మాత్రం వారిద్దరికి అండగా నిలిచాడు. ‘‘అకస్మాత్తుగా బెంచ్ నుంచి వచ్చి ఆడటం కాస్త కష్టంగానే ఉంటుంది’’ అని అర్ష్దీప్, హర్షిత్లను వెనకేసుకువచ్చాడు. ఇక తదుపరి పాకిస్తాన్తో మ్యాచ్కు తాము పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నట్లు సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.ఆసియా కప్-2025: భారత్ వర్సెస్ ఒమన్ స్కోర్లు👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి👉టాస్: భారత్.. తొలుత బ్యాటింగ్👉భారత్ స్కోరు: 188/8 (20)👉ఒమన్ స్కోరు: 167/4 (20)👉ఫలితం: ఒమన్పై 21 పరుగుల తేడాతో భారత్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్ (45 బంతుల్లో 56)చదవండి: IND vs OMAN: సూర్యకుమార్ అనూహ్య నిర్ణయం.. గావస్కర్ స్పందన ఇదేAamir Kaleem, take a bow 🫡An innings that will go down in Oman cricket history 🇴🇲Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/4nqXWJCDYH— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025 -
Asia Cup 2025: భారత్తో సూపర్-4 మ్యాచ్.. పాకిస్తాన్కు భారీ పంచ్..!
ఆసియా కప్ 2025లో భాగంగా రేపు (సెప్టెంబర్ 21) భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ పంచ్ పడినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో భారత్తో గ్రూప్ స్టేజీ మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదంలో పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.ఆ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వలేదు (టాస్ సందర్భంగా, మ్యాచ్ అయిపోయాక). దీన్ని అవమానంగా భావించిన పీసీబీ భారత ఆటగాళ్లను ఏమీ చేసుకోలేక, మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్పై పడింది. పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్ల పట్ల పక్షపాతంగా (తమ ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వరన్న భారత మేనేజ్మెంట్ సందేశాన్ని పాక్ కెప్టెన్కు చేరవేశాడని) వ్యవహరించి, క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని ఆరోపించింది.ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐసీసీకి పలు లేఖలు రాసింది. యూఏఈతో మ్యాచ్కు ముందు ఓ అడుగు ముందుకేసి బాయ్కాట్ బెదిరింపులకు దిగింది. ఐసీసీ కన్నెర్ర చేయడంతో కనీసం తమ మ్యాచ్లకైనా పైక్రాఫ్ట్ను పక్కన పెట్టాలని కాళ్ల బేరానికి వచ్చింది.పీసీబీ ఉడత ఊపులను, డిమాండ్లను తోసిపుచ్చిన ఐసీసీ, పైక్రాఫ్ట్కు మద్దతుగా నిలిచింది. అతన్నే యూఏఈతో మ్యాచ్కు రిఫరీగా కొనసాగించింది. ఒకవేళ పాక్ జట్టు ఆసియా కప్ను బాయ్కాట్ చేయాలనుకుంటే భారీ మొత్తంలో నగదు చెల్లించాలని రివర్స్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతటితో ఆగకుండా తాజాగా మరో షాక్ ఇచ్చింది.గత మ్యాచ్ తాలూకా గాయాలు తగ్గకముందే రేపు భారత్తో జరుగబోయే సూపర్-4 మ్యాచ్కు మరోసారి పైక్రాఫ్ట్నే రిఫరీగా నియమించింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ మేరకు ఐసీసీ ఇదివరకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఐసీసీ కొట్టిన ఈ చావుదెబ్బకు సూపర్-4 మ్యాచ్కు ముందే పాక్ ఢీలా పడిపోయింది. కాగా, రేపటి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. పాకిస్తాన్ను దాటేసి సోలోగా ప్రపంచ రికార్డు
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్లో భారత్ పసికూన ఒమన్పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఓ చారిత్రక రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక దేశాలపై (19) విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు భారత్, పాకిస్తాన్ (18) పేరిట సంయుక్తంగా ఉండేది.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక దేశాలపై విజయాలు సాధించిన జట్లుభారత్- 19 దేశాలు (166 విజయాలు)పాకిస్తాన్- 18 దేశాలు (156 విజయాలు)న్యూజిలాండ్- 17 దేశాలు (123 విజయాలు)ఆస్ట్రేలియా- 16 దేశాలు (119 విజయాలు)సౌతాఫ్రికా- 15 దేశాలు (112 విజయాలు)ఇంగ్లండ్- 15 దేశాలు (110 విజయాలు)అంతర్జాతీయ టీ20ల్లో భారత్ టెస్ట్ హోదా కలిగిన దేశాలతో పాటు చాలా అసోసియేట్ సభ్య దేశాలను మట్టికరిపించింది.టీ20ల్లో టీమిండియా విజయాలు నమోదు చేసిన దేశాలుఆస్ట్రేలియా- 32 మ్యాచ్ల్లో 20 విజయాలుశ్రీలంక- 32 మ్యాచ్ల్లో 21 విజయాలుసౌతాఫ్రికా- 31 మ్యాచ్ల్లో 18 విజయాలువెస్టిండీస్- 30 మ్యాచ్ల్లో 19 విజయాలుఇంగ్లండ్- 29 మ్యాచ్ల్లో 17 విజయాలున్యూజిలాండ్- 25 మ్యాచ్ల్లో 12 విజయాలుపాకిస్తాన్- 14 మ్యాచ్ల్లో 10 విజయాలుజింబాబ్వే- 13 మ్యాచ్ల్లో 10 విజయాలుబంగ్లాదేశ్- 17 మ్యాచ్ల్లో 16 విజయాలుఆఫ్ఘనిస్తాన్- 9 మ్యాచ్ల్లో 7 విజయాలుఐర్లాండ్- 8 మ్యాచ్ల్లో 8 విజయాలుహాంగ్కాంగ్- 1 మ్యాచ్లో 1 విజయంనమీబియా- 2 మ్యాచ్ల్లో 2 విజయాలుయూఏఈ- 2 మ్యాచ్ల్లో 2 విజయాలుస్కాట్లాండ్- 1 మ్యాచ్లో 1 విజయంనెదర్లాండ్స్- 2 మ్యాచ్ల్లో 2 విజయాలుఒమన్- 1 మ్యాచ్లో 1 విజయంనేపాల్- 1 మ్యాచ్లో 1 విజయంకెన్యా- 1 మ్యాచ్లో 1 విజయంమొత్తంగా 19 దేశాలపై 250 మ్యాచ్లు ఆడి 166 విజయాలు సాధించిన భారత్, పొట్టి ఫార్మాట్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా, అత్యధిక విజయాల శాతం (66) కలిగిన జట్టుగా చలామణి అవుతుంది.పొట్టి ఫార్మాట్లో రెండు ప్రపంచకప్లు (2007, 2024) గెలిచిన భారత్ ప్రస్తుతం ఈ ఫార్మాట్లో నంబర్ వన్ జట్టుగా (ర్యాంకింగ్స్లో) కొనసాగుతుంది. అలాగే ఈ ఫార్మాట్లో అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లే టాప్ ర్యాంక్ల్లో ఉన్నారు. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా నంబర్ వన్గా ఉన్నారు. -
సంజూ ఎందుకు?.. అతడిని ఇంకెప్పుడు ఆడిస్తారు?
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. లీగ్ దశలో తొలుత యూఏఈ, పాకిస్తాన్లను ఓడించిన సూర్యకుమార్ సేన.. శుక్రవారం నాటి నామమాత్రపు మ్యాచ్లో ఒమన్పై 21 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా గ్రూప్-ఎ టాపర్గా కొనసాగుతూ సూపర్-4 దశను ఆదివారం మొదలుపెట్టనుంది.ఓపెనర్లు మినహాఇదిలా ఉంటే.. ఒమన్తో మ్యాచ్లో టీమిండియా తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38)- శుబ్మన్ గిల్(5) మినహా మిగతా వారి ఆర్డర్ను మార్చింది. వన్డౌన్లో సంజూ శాంసన్ (45 బంతుల్లో 56), నాలుగో నంబర్లో హార్దిక్ పాండ్యా (1).. ఆ తర్వాతి స్థానాల్లో అక్షర్ పటేల్ (13 బంతుల్లో 26), తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్), అర్ష్దీప్ సింగ్ (1), కుల్దీప్ యాదవ్ (1 నాటౌట్)లను ఆడించింది.బ్యాటింగ్కు రాని సూర్యఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్కు రానేరాలేదు. మరోవైపు.. గత రెండు మ్యాచ్లలోనూ బ్యాటింగ్ చేసే అవకాశమే పొందని వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson).. తాజాగా టాప్ రన్ స్కోరర్గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూకు బదులు జితేశ్ శర్మను వికెట్ కీపర్గా బరిలోకి దించాల్సిందని అభిప్రాయపడ్డాడు. లీగ్ దశలో అన్ని మ్యాచ్లు ముగిసినా జితేశ్కు అవకాశం రాలేదని.. అతడొక్కడినే వదిలేశారని పేర్కొన్నాడు.వికెట్ కీపర్గా సంజూ ఎందుకు?‘‘తిలక్ వర్మ మరీ లోయర్ ఆర్డర్లో వచ్చాడు. సూర్య అసలు బ్యాటింగ్కు రాలేదు. అలాంటపుడు జితేశ్ను ఈ మ్యాచ్లో ఆడించాల్సింది కదా!.. జితేశ్ను ఆడిస్తారనే అనుకున్నా. ఇప్పటి వరకు.. అతడిని తప్ప అందరినీ ఆడించారు. వందకు వంద శాతం సూపర్ పవర్ హిట్టర్ను మాత్రం వదిలేశారు.అతడికి ఒక అవకాశమైతే ఇవ్వాలి కదామిడిలార్డర్లో వికెట్ కీపర్ అవసరం ఉంటుంది. కానీ మీరు సంజూను ఆ స్థానంలో ఆడించాలని ఫిక్సయిపోయారు కాబట్టి జితేశ్ను పక్కనపెట్టారు. వికెట్ కీపర్ రేసులో ఉండాలన్న.. సంజూతో పోటీపడాలన్నా అతడికి ఒక అవకాశమైతే ఇవ్వాలి కదా!’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.సంజూ సూపర్ఏదేమైనా ఒమన్తో మ్యాచ్లో వన్డౌన్లో వచ్చిన సంజూ.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని ఆకాశ్ చోప్రా అభినందించాడు. ఆరంభంలో ఫాస్ట్బౌలర్ల కారణంగా కాస్త ఇబ్బందిపడినప్పటికీ.. తర్వాత పరుగులు రాబట్టాడని పేర్కొన్నాడు. వికెట్లు పడుతున్న వేళ విలువైన అర్ధ శతకంతో రాణించాడని ప్రశంసించాడు. కాగా తదుపరి సూపర్-4 దశలో తొలుత టీమిండియా ఆదివారం నాటి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడనుంది. ఇందుకు దుబాయ్ వేదిక.చదవండి: IND vs OMAN: సూర్యకుమార్ అనూహ్య నిర్ణయం.. గావస్కర్ స్పందన ఇదేThe Sanju Show was in full swing tonight! 👌Watch #INDvOMAN LIVE now on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/ZYT9ptqCKR— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025 -
IND vs OMAN: గర్వంగా ఉంది.. మా వాళ్లు సూపర్: ఒమన్ కెప్టెన్
భారత్ వంటి పటిష్ట జట్టుపై పసికూన ఒమన్ (IND vs OMAN) అద్బుత ఆట తీరుతో ఆకట్టుకుంది. వరల్డ్ నంబర్ వన్ టీమిండియా చేతిలో ఓటమిని అంతతేలికగా అంగీకరించకుండా ఆఖరి వరకు పోరాటం చేసింది. చివరికి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైనా.. ఈ మ్యాచ్ ఒమన్ చరిత్రలో గుర్తుంచుకోదగ్గదిగా ఉండిపోతుందనడంలో సందేహం లేదు.ఈ నేపథ్యంలో భారత్తో మ్యాచ్ తర్వాత ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ (Jatinder Singh) మాట్లాడుతూ.. తమ జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘మా వాళ్ల ఆట తీరును చూస్తుంటే గర్వంగా అనిపించింది. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేశాం,.గర్వంగా ఉంది.. మా వాళ్లు సూపర్ఎలాంటి పరిస్థితుల్లోనూ మా వాళ్లు పోరాట పటిమను వదల్లేదు. చివరి వరకు అద్భుతంగా పోరాడారు. ఇది నాకు గర్వకారణం. నిజానికి మా జట్టులో అంతగా అనుభవం ఉన్న ఆటగాళ్లులేరు. మా గురించి ఏమాత్రం హైప్ కూడా లేదు.అయినా సరే మేము ఇలా ఆడటం గొప్పగా అనిపించింది. మా దేశంలోనే వరల్డ్కప్ క్వాలిఫయర్స్ జరుగబోతున్నాయి. ఇందుకు మా వాళ్లు సిద్ధంగా ఉన్నారు. పపువా న్యూగినియా, సమోవా జట్లను మేము ఎదుర్కోబోతున్నాము.అతడు హైలైట్ఏదేమైనా టీమిండియాతో మ్యాచ్లో మా వాళ్లు సూపర్. ముఖ్యంగా జితేన్ రామ్నంది రనౌట్లతో హైలైట్ అయ్యాడు. అతడు టీమ్ మ్యాన్. జట్టు కోసం ఏమైనా చేస్తాడు’’ అని జతీందర్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా టీమిండియాతో మ్యాచ్లో ఒమన్ బౌలింగ్ ఆల్రౌండర్ జితేన్ రామ్నంది రెండు వికెట్లు తీయడంతో పాటు.. హార్దిక్ పాండ్యా (1), అర్ష్దీప్ సింగ్ (1)లను రనౌట్ చేశాడు.ఇక ఒమన్ బ్యాటర్లలో కెప్టెన్ జతీందర్ సింగ్ (32) ఓ మోస్తరుగా రాణించగా.. మరో ఓపెనర్ ఆమిర్ ఖలీమ్ (46 బంతుల్లో 64), వన్డౌన్ బ్యాటర్ హమ్మద్ మీర్జా (33 బంతుల్లో 51) మెరుపులు మెరిపించారు. అయితే, 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఒమన్ 167 పరుగులకే పరిమితమైంది.టీమిండియా వర్సెస్ ఒమన్ స్కోర్లు👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి👉టాస్: టీమిండియా.. తొలుత బ్యాటింగ్👉టీమిండియా స్కోరు: 188/8 (20)👉ఒమన్ స్కోరు: 167/4 (20)👉ఫలితం: ఒమన్పై 21 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్ (టీమిండియా- 45 బంతుల్లో 56).Awww… we agree with you @sanjaymanjrekar 😊Sending some virtual hugs from us too Jatinder! 🤗Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/A6ZIElXmhl— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025చదవండి: పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్! -
జస్ట్ మిస్..! టీమిండియాని వణికించిన ఒమన్
-
IND vs OMAN: సూర్య అనూహ్య నిర్ణయం.. గావస్కర్ స్పందన ఇదే
ఆసియా కప్-2025లో ఒమన్తో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. నామమాత్రపు మ్యాచ్లో అతడు బ్యాటింగ్కు రాలేదు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. సూర్య మాత్రం డగౌట్లోనే ఉండిపోయాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేస్తూ.. ఆల్రౌండర్లతో పాటు బౌలర్లను ముందుకు పంపాడు.ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ (15 బంతుల్లో 38)- శుబ్మన్ గిల్(5)లను అలాగే కొనసాగించిన సూర్య.. వన్డౌన్లో సంజూ శాంసన్ (45 బంతుల్లో 56)ను పంపాడు. నాలుగో స్థానంలో హార్దిక్ పాండ్యా (1), ఐదో స్థానంలో అక్షర్ పటేల్ (13 బంతుల్లో 26)లను ఆడించాడు.ఆ తర్వాత వరుసగా తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్), అర్ష్దీప్ సింగ్ (1), కుల్దీప్ యాదవ్ (1 నాటౌట్)లను పంపాడు. ఈ క్రమంలో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత ఒమన్ను 167 పరుగులకు పరిమితం చేసి విజయం సాధించింది.ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో సూర్య తీసుకున్న నిర్ణయంపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ స్పందించాడు. ‘‘ఈ మ్యాచ్లో సూర్య బ్యాటింగ్ వస్తే కాసేపు ఫోర్లు, సిక్సర్లు కొట్టేవాడు. అతడికి అది మంచిది కూడా.అయితే, పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా సూర్యకు కావాల్సినంత బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది. తదుపరి అన్నీ కీలక మ్యాచ్లే. అందుకే ఒకవేళ టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోతే బ్యాటింగ్ పరిస్థితి ఏమిటన్నది చెక్ చేసేందుకు సూర్య ఈ నిర్ణయం తీసుకున్నాడు.కుల్దీప్ యాదవ్ను కూడా అందుకే బ్యాటింగ్కు పంపాడు. నిజంగా సూర్య వినూత్నమైన ఆలోచనలు గలవాడు. శ్రీలంకతో గతంలో ఓ మ్యాచ్లో తాను కూడా బౌలింగ్ చేశాడు. రింకూ చేతికి కూడా బంతినిచ్చాడు. తన నిర్ణయాలతో చేజారే మ్యాచ్లో టీమిండియాను గెలిపించాడు.ఇప్పుడు కూడా ప్రయోగం చేశాడు. తాను బ్యాటింగ్కు వెళ్లకుండా బౌలర్లు అర్ష్దీప్, కుల్దీప్లను ముందుకు పంపించాడు’’ అంటూ గావస్కర్ సూర్య నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రశంసలు కురిపించాడు. కాగా లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన టీమిండియా తదుపరి సూపర్-4 దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో మ్యాచ్లు ఆడనుంది. -
‘అతడి’ని హగ్ చేసుకున్న సూర్య.. ఎందుకిలా చేశావు?
టీమిండియాతో మ్యాచ్లో ఒమన్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అంచనాలకు మించి రాణించి.. గెలుపు కోసం సూర్యుకుమార్ సేనను శ్రమించేలా చేసింది. పటిష్ట భారత జట్టుకు గట్టి పోటీనిచ్చి సత్తా చాటి ప్రశంసలు అందుకుంటోంది.ఆసియా కప్-2025 టీ20 టోర్నీలో భాగంగా శుక్రవారం టీమిండియాను ఢీకొట్టింది ఒమన్. అబుదాబి వేదికగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ మరోసారి ధనాధన్ (15 బంతుల్లో 38) దంచికొట్టగా.. శుబ్మన్ గిల్ (Shubman Gill- 5) మరోసారి నిరాశపరిచాడు.సంజూ శాంసన్ అర్ధ శతకంఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) అర్ధ శతకం (56)తో రాణించి భారత ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అతడికి తోడుగా ఆల్రౌండర్ అక్షర్ పటేట్ (13 బంతుల్లో 26), తిలక్ వర్మ (18 బంతుల్లో 29), హర్షిత్ రాణా (8 బంతుల్లో 13 నాటౌట్) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లలో షా ఫైజల్, జితేన్ రామనంది, ఆమిర్ ఖలీమ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఒమన్ టాపార్డర్ సూపర్ హిట్ఇక టీమిండియా విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ శుభారంభం అందుకుంది. ఓపెనర్లలో కెప్టెన్ జతీందర్ సింగ్ (32) ఫర్వాలేదనిపించగా.. ఆమిర్ ఖలీమ్ అద్భుత అర్ధ శతకం (46 బంతుల్లో 64, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు.ఇక వన్డౌన్ బ్యాటర్ హమ్మద్ మీర్జా సైతం హాఫ్ సెంచరీ (33 బంతుల్లో 51) చేశాడు. అయితే, జతీందర్ను కుల్దీప్ యాదవ్, ఆమిర్ను హర్షిత్ రాణా, మీర్జాను హార్దిక్ పాండ్యా పెవిలియన్కు పంపడంతో ఒమన్ జోరుకు బ్రేక్ పడింది. మిగిలిన వారిలో వికెట్ కీపర్ వినయ్ శుక్లా (1)ను అర్ష్దీప్ సింగ్ అవుట్ చేశాడు.అంచనాలు తలకిందులుఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయిన ఒమన్.. 167 పరుగుల వద్ద నిలిచింది. దీంతో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలిచి.. లీగ్ దశను అజేయంగా ముగించింది. అయితే, ఈ మ్యాచ్లో ఒమన్పై భారత జట్టు ఏకపక్ష విజయం సాధిస్తుందని అంతా ఊహించారు.కానీ అంచనాలు తలకిందులు చేస్తూ సూర్యసేనకు జతీందర్ సింగ్ బృందం గట్టి పోటీనిచ్చింది. టీ20 ఫార్మాట్లోని మజాను పంచింది. ఒమన్ ఆట తీరుకు భారత జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ కూడా ఫిదా అయ్యాడు. మ్యాచ్ అనంతరం ఒమన్ ఆటగాళ్లతో ముచ్చటిస్తూ వారిపై ప్రశంసలు కురిపించాడు.ఆమిర్ ఖలీమ్ను హగ్ చేసుకున్న సూర్యఅంతేకాదు.. ఒమన్పై గెలిచిన తర్వాత ఇరుజట్లు ఆటగాళ్లు కరచాలనం చేసే సమయంలో సూర్య చేసిన పని వైరల్గా మారింది. 43 ఏళ్ల వయసులో అద్భుత బ్యాటింగ్తో అలరించిన ఆమిర్ ఖలీమ్ను సూర్య ఆలింగనం చేసుకున్నాడు. అయితే, అతడు పాకిస్తాన్లోని కరాచీకి చెందిన వాడు కావడం గమనార్హం.ఇలా ఎందుకు చేశావు? నీకిది తగునా?ఈ నేపథ్యంలో ఆమిర్ను అభినందిస్తూ సూర్య చేసిన పనిని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం .. ‘‘పాక్కు చెందిన వ్యక్తిని ఎలా హత్తుకుంటావు?’’ అని ప్రశ్నిస్తున్నారు.కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ వేదికగా దాయాది పాకిస్తాన్తో ముఖాముఖి తలపడిన టీమిండియా.. ఆ జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. బాధితులకు అండగా మెగా వేదికగా ఇలా నిరసన తెలిపింది. అయితే, సూర్య ఇప్పుడిలా అదే దేశానికి చెందిన ఆటగాడిని హగ్ చేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. జట్టంతా ఒకే కుటుంబమని..కాగా యూఏఈతో పాటు ఒమన్ క్రికెట్ జట్లలో భారత్, పాక్కు చెందిన ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయం గురించి యూఏఈ కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ మాట్లాడుతూ.. తమ జట్టంతా ఒకే కుటుంబమని.. యూఏఈనే తమ దేశమని.. తమలో భారత్, పాక్ అనే మాట వినిపించవని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమిర్ను సూర్య హత్తుకోవడం నేరమేమీ కాదంటూ అతడి ఫ్యాన్స్ సపోర్టు చేసుకుంటున్నారు.చదవండి: PKL 12: తెలుగు టైటాన్స్ గెలుపుబాట𝘚𝘶𝘳𝘺𝘢 𝘋𝘢𝘥𝘢, 𝘦𝘬 𝘩𝘪 𝘥𝘪𝘭 𝘩𝘢𝘪𝘯, 𝘬𝘪𝘵𝘯𝘦 𝘣𝘢𝘢𝘳… 💙Encouraging words from India’s captain to Oman’s heroes ✨Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/Mng5zOIrOH— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025 -
పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్!
ఆసియా కప్-2025 టోర్నమెంట్ లీగ్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. ఆఖరిగా శుక్రవారం ఒమన్తో జరిగిన మ్యాచ్లో 21 పరుగుల తేడాతో గెలిచి.. గ్రూప్-ఎ టేబుల్ టాపర్గా తన స్థానాన్ని నిలుపుకొంది. తదుపరి సూపర్-4 దశలో తమ తొలి మ్యాచ్లో భాగంగా భారత్.. దాయాది పాకిస్తాన్తో తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది.అయితే, దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఒమన్తో మ్యాచ్ సందర్భంగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Injury) గాయపడ్డాడు. భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ వన్డౌన్ బ్యాటర్ మహ్మద్ మీర్జా (33 బంతుల్లో 51) దూకుడగా ఆడాడు.మైదానానికి బలంగా కొట్టుకున్న తలఈ క్రమంలో పదిహేనో ఓవర్లో శివం దూబే (Shivam Dube) బౌలింగ్లో మీర్జా బంతిని గాల్లోకి లేపగా.. మిడాఫ్ నుంచి పరిగెత్తుకుని వచ్చిన అక్షర్.. క్యాచ్ పట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిన అక్షర్ తల మైదానానికి బలంగా కొట్టుకుంది.దీంతో ఫిజియో వచ్చి పరీక్షించి.. అతడిని మైదానం నుంచి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత అక్షర్ మళ్లీ ఫీల్డింగ్కు రాలేదు. అయితే, ఈ విషయం గురించి స్పందించిన భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ అప్డేట్ అందించాడు. అక్షర్ పటేల్ బాగానే ఉన్నాడని చెప్పాడు.స్పష్టత లేదుకానీ అక్షర్ గాయం తీవ్రతపై పూర్తి స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో సూపర్-4 మ్యాచ్కు అతడు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దత నెలకొంది. కాగా యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచింది. యూఏఈ, పాకిస్తాన్, ఒమన్లను ఓడించి అజేయంగా నిలిచింది. ఇక స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు రెండు వికెట్లు తీయడంతో పాటు.. 26 పరుగులు సాధించాడు. చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు -
చరిత్ర సృష్టించిన అర్ష్దీప్ సింగ్.. భారత తొలి బౌలర్గా..
టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వంద వికెట్ల క్లబ్లో చేరిన తొలి బౌలర్గా రికార్డు సాధించాడు. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా ఒమన్తో మ్యాచ్ సందర్భంగా అర్ష్దీప్ సింగ్ ఈ ఘనత సాధించాడు.గత కొంతకాలంగా అర్ష్దీప్ సింగ్ బెంచ్కే పరిమితమైన విషయం తెలిసిందే. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని భావించినా.. ఐదు టెస్టుల్లో అతడికి ఒక్కదాంట్లోనే ఆడే అవకాశం రాలేదు. ఫిట్నెస్ సమస్యలు కూడా ఇందుకు కారణం.స్పిన్నర్లకు పెద్దపీటఅయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా కప్ టోర్నీలో మాత్రం అర్ష్దీప్ సింగ్ ఆడటం ఖాయమని విశ్లేషకులు భావించారు. కానీ ఈ ఈవెంట్ యూఏఈ వేదికగా జరుగుతోంది కాబట్టి.. మేనేజ్మెంట్ స్పిన్నర్లకు పెద్దపీట వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే తుదిజట్టులో దక్కించుకోగా.. అర్ష్ బెంచ్ మీదే ఉన్నాడు.బుమ్రాకు విశ్రాంతి.. అర్ష్దీప్నకు అవకాశంఇక ఈ టోర్నీలో యూఏఈ, పాకిస్తాన్ జట్లను ఓడించి సూపర్-4కు అర్హత సాధించిన టీమిండియా.. లీగ్ దశలో ఆఖరిగా ఒమన్తో శుక్రవారం తలపడింది. ఈ నామమాత్రపు మ్యాచ్లో బుమ్రాకు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం అర్ష్దీప్ను ఆడించింది.అబుదాబిలో జరిగిన ఈ మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్.. ఒమన్ బ్యాటర్ వినాయక్ శుక్లా (1)ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో వందో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అర్ష్ బౌలింగ్లో వినాయక్ ఇచ్చిన క్యాచ్ను రింకూ సింగ్ పట్టడంతో ఇది సాధ్యమైంది.వంద వికెట్ల క్లబ్లోఈ నేపథ్యంలో టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన వీరుడిగా అర్ష్దీప్ సింగ్ తన రికార్డును నిలబెట్టుకోవడంతో పాటు.. వంద వికెట్ల క్లబ్లో చేరిన భారత తొలి బౌలర్గా నిలిచాడు. అంతేకాదు.. తక్కువ మ్యాచ్లలోనే ఈ ఘనత సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానం సంపాదించాడు.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ (173) మొదటి స్థానంలో ఉన్నాడు. రషీద్ 53 మ్యాచ్లలో ఈ ఫీట్ అందుకోగా.. 26 ఏళ్ల లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ 64 మ్యాచ్లలో వంద వికెట్లు సాధించాడు.భారత్ వర్సెస్ ఒమన్ స్కోర్లు👉వేదిక: షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి👉టాస్: భారత్.. తొలుత బ్యాటింగ్👉భారత్ స్కోరు: 188/8 (20)👉ఒమన్ స్కోరు: 167/4 (20)👉ఫలితం: ఒమన్పై 21 పరుగుల తేడాతో భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్ (45 బంతుల్లో 56)చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలుArshdeep Singh shines with a milestone to remember! 🤩 He becomes the first Indian player to take 100 wickets in men's T20Is.Watch #DPWorldAsiaCup2025 from Sept 9-Sept 28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #INDvOMAN pic.twitter.com/jzIgYcKQV4— Sony Sports Network (@SonySportsNetwk) September 19, 2025 -
Asia Cup 2025: రాణించిన సంజూ.. ఒమన్పై టీమిండియా విజయం
ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబర్ 19న జరిగిన నామమాత్రపు మ్యాచ్లో పసికూన ఒమన్పై భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (56) అర్ద సెంచరీతో రాణించగా.. అభిషేక్ శర్మ (38), అక్షర్ పటేల్ (26), తిలక్ వర్మ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-1-23-2), జితేన్ రామనంది (4-0-33-2), ఆమిర్ కలీమ్ (3-0-31-2) వికెట్లు తీశారు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగనప్పటికీ.. భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని శభాష్ అనిపించుకుంది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.ఓపెనర్ ఆమిర్ కలీమ్ (64), వన్ డౌన్లో వచ్చిన హమ్మద్ మీర్జా (51) అద్బుతమైన అర్ద సెంచరీలతో టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. మరో ఓపెనర్, ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ (32) కూడా పర్వాలేదనిపించారు.ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ సూపర్-4కు అర్హత సాధించగా.. ఒమన్ ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. సూపర్-4 దశలో భారత్ సెప్టెంబర్ 21న పాకిస్తాన్తో తలపడుతుంది. -
Asia Cup 2025: ఒమన్పై టీమిండియా విజయం
ఒమన్పై టీమిండియా విజయంఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబర్ 19న జరిగిన నామమాత్రపు మ్యాచ్లో పసికూన ఒమన్పై భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగనప్పటికీ.. భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొని శభాష్ అనిపించుకుంది. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. నత్త నడకన సాగుతున్న ఒమన్ బ్యాటింగ్189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఒమన్ బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. ఈ జట్టు బ్యాటర్లు వికెట్లు కాపాడుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తున్నారు. గెలుపు కోసం ఆడుతున్నట్లు కనబడటం లేదు. 14 ఓవర్లు ముగిసే సమయానికి వారి స్కోర్ 100/1గా ఉంది. హమ్మద్ మీర్జా (24), ఆమిర్ కలీమ్ (39) క్రీజ్లో ఉన్నారు.ఆచితూచి ఆడుతున్న ఒమన్189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 27/0గా ఉంది. ఓపెనర్లు కలీమ్ (13), జతిందర్ సింగ్ (13) ఆచితూచి ఆడుతున్నారు. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైన టీమిండియాటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేసింది. భారత మేనేజ్మెంట్ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసి విఫలమైంది. హార్దిక్ పాండ్యా (1), శివమ్ దూబే (5) ప్రమోషన్ లభించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. సంజూ శాంసన్ (56) అర్ద సెంచరీ చేసి టీమిండియాను ఆదుకున్నాడు. అభిషేక్ శర్మ (38), అక్షర్ పటేల్ (26), తిలక్ వర్మ (26) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చివరి వరకు బ్యాటింగ్కు దిగలేదు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్ (4-1-23-2), జితేన్ రామనంది (4-0-33-2), ఆమిర్ కలీమ్ (3-0-31-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. సంజూ హాఫ్ సెంచరీసంజూ శాంసన్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రామనంది బౌలింగ్లో బౌండరీ బాది ఈ మార్కును చేరుకున్నాడు. 17 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 167/5గా ఉంది. సంజూకు జతగా తిలక్ వర్మ (27) క్రీజ్లో ఉన్నాడు. సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా13.2వ ఓవర్- టీమిండియా 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కలీమ్ బౌలింగ్లో శివమ్ దూబే (5) ఔటయ్యాడు. సంజూ శాంసన్కు (45) జతగా తిలక వర్మ క్రీజ్లోకి వచ్చాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్11.2వ ఓవర్- 118 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఆమిర్ కలీమ్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (26) ఔటయ్యాడు. అక్షర్ అంతకముందు బంతికి సిక్సర్ బాది జోరు మీదున్నట్లు కనిపించాడు. సంజూ శాంసన్కు (38) జతగా శివమ్ దూబే క్రీజ్లోకి వచ్చాడు. సెంచరీ పూర్తి చేసిన టీమిండియాటీమిండియా 10 ఓవర్లలో 100 పరుగుల మార్కును (3 వికెట్లు కోల్పోయి) తాకింది. సంజూ శాంసన్ (37), అక్షర్ పటేల్ (10) క్రీజ్లో ఉన్నారు. మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియాజితేన్ రామనంది వేసిన 8వ ఓవర్లో టీమిండియాకు వరుస షాక్లు తగిలాయి. తొలి బంతికి అభిషేక్ శర్మ (38) వికెట్కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. మూడో బంతికి హార్దిక్ పాండ్యా (1) రనౌటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 75/3గా ఉంది. సంజూ శాంసన్ (27), అక్షర్ పటేల్ క్రీజ్లో ఉన్నారు. అభిషేక్ జోరురెండో ఓవర్లోనే శుభ్మన్ గిల్ వికెట్ కోల్పోయినా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ తన సహజ శైలిలో జోరు కొనసాగిస్తున్నాడు. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసే సమయానికి అతను 14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేశాడు. అభిషేక్కు జతగా క్రీజ్లో ఉన్న సంజూ శాంసన్ (14 బంతుల్లో 13; సిక్స్) నిదానంగా ఆడుతున్నాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 60/1గా ఉంది.టీమిండియాకు ఆదిలోనే షాక్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్ మూడో బంతికే భారత్ శుభ్మన్ గిల్ (5) వికెట్ కోల్పోయింది. గిల్ను షా ఫైసల్ అనే బౌలర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అభిషేక్కు (0) జతగా సంజూ శాంసన్ క్రీజ్లోకి వచ్చాడు. 1.3 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 6/1గా ఉంది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ఆసియా కప్ 2025లో ఇవాళ (సెప్టెంబర్ 19) నామమాత్రపు మ్యాచ్ జరుగుతుంది. ఇదివరకే సూపర్-4కు చేరిన భారత్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ఒమన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. స్టార్ పేసర్ బుమ్రా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానాల్లో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాను బరిలోకి దించింది. తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (c), తిలక్ వర్మ, సంజు శాంసన్ (wk), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ఒమన్: అమీర్ కలీమ్, జతిందర్ సింగ్ (c), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (WK), షా ఫైసల్, జిక్రియ ఇస్లాం, ఆర్యన్ బిస్ట్, మొహమ్మద్ నదీం, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ, జితేన్ రామనంది -
ఆసియా కప్: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు
ఆసియా కప్-2025 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ ఖండాంతర టోర్నీలో రెండు గ్రూపులు ఉన్న విషయం తెలిసిందే. లీగ్ స్టేజ్లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీ పడ్డాయి. అయితే, వీటిలో భారత్, పాకిస్తాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 (Asia Cup Super 4)లో అడుగుపెట్టగా.. యూఏఈ, ఒమన్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి. కాగా లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. నామమాత్రపు మ్యాచ్ఆఖరిగా భారత్- ఒమన్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగుతుంది. అయితే, టీమిండియా ఇప్పటికే యూఏఈ, పాకిస్తాన్ జట్లను ఓడించి సూపర్-4కు చేరగా.. పాక్ ఒమన్, యూఏఈలపై గెలిచి అర్హత సాధించింది. దీంతో టీమిండియా- ఒమన్ మధ్య మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్గానే మిగిలిపోనుంది. మరోవైపు.. నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్ రేటు (+4.793) పరంగానూ టీమిండియా ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నందున.. ఒమన్ మ్యాచ్ తర్వాత కూడా గ్రూప్-ఎ టాపర్గా ఉండటం లాంఛనమే.గ్రూప్-బి నుంచి ఆ రెండు జట్లుఇక గ్రూప్-బి విషయానికొస్తే... అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ ద్వారా ఫలితం తేలింది. అఫ్గనిస్తాన్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన లంక.. రషీద్ ఖాన్ బృందాన్ని నాకౌట్ చేసింది. ఫలితంగా లంకతో పాటు బంగ్లాదేశ్ సూపర్-4కు క్వాలిఫై అయింది. గ్రూప్-బి లీగ్ మ్యాచ్లన్నీ ముగిసిపోవడంతో టాపర్గా శ్రీలంక నిలవగా.. బంగ్లాదేశ్ రెండో స్థానం ఆక్రమించింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్-2025 సూపర్-4 దశ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్ వివరాలు తెలుసుకుందాం!సూపర్-4 షెడ్యూల్👉మ్యాచ్ 1: సెప్టెంబరు 20- శనివారం- శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 2: సెప్టెంబరు 21- ఆదివారం- భారత్ వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్👉మ్యాచ్ 3: సెప్టెంబరు 23- మంగళవారం- పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి👉మ్యాచ్ 4: సెప్టెంబరు 24- బుధవారం- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 5: సెప్టెంబరు 25- గురువారం- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 6: సెప్టెంబరు 26- శుక్రవారం- భారత్ వర్సెస్ శ్రీలంక- దుబాయ్ఫైనల్👉సెప్టెంబరు 28- దుబాయ్టైమింగ్స్👉ఫైనల్ సహా సూపర్-4 మ్యాచ్లన్నీ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభంలైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే👉టీవీ: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్👉డిజిటల్: సోనీ లివ్ వెబ్సైట్, మొబైల్ యాప్జట్లు ఇవేటీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్శ్రీలంకచరిత్ అసలంక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్కీపర్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.బంగ్లాదేశ్లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదోయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్స్టాండ్బై ప్లేయర్లు: సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్. చదవండి: Asia Cup: మా జట్టులో భారత్, పాక్ వినిపించదు.. మేమంతా ఒకే కుటుంబం -
SL vs AFG: ఓవైపు చావో-రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్.. ఇంతలోనే తీవ్ర విషాదం
శ్రీలంక యువ క్రికెటర్ దునిత్ వెల్లలగే (Dunith Wellalage) కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దునిత్ తండ్రి సురంగ వెల్లలగే హఠాన్మరణం చెందారు. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా శ్రీలంక- అఫ్గనిస్తాన్తో చావో రేవో తేల్చుకునేందుకు తలపడుతున్న వేళ ఈ వార్త తెలిసింది.అయితే, మ్యాచ్ ముగిసేంత వరకు దునిత్ వెల్లలగేకు తండ్రి మరణం గురించి తెలియనివ్వలేదు. అఫ్గన్పై లంక గెలుపొందిన తర్వాత హెడ్కోచ్ సనత్ జయసూర్య దునిత్కు ఈ విషయం చెప్పాడు. దీంతో అతడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు.నో సెలబ్రేషన్స్ఈ విషయం గురించి శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ సోనీ స్పోర్ట్స్తో గురువారం రాత్రి మాట్లాడుతూ.. ‘‘దునిత్ వెల్లలగే తండ్రి సురంగ కొద్ది సేపటి క్రితమే మరణించారు. ఆయన కూడా ఒకప్పుడు క్రికెట్ ఆడేవారు. మా స్కూల్ టీమ్ కెప్టెన్గా ఉండేవారు.ఆయన మరణ వార్త తెలియగానే నా మనసు బాధతో నిండిపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత దునిత్కు ఈ విషయం చెప్పారు. అతడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి. అందుకే అఫ్గన్పై విజయాన్ని లంక ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోలేదు’’ అని వెల్లడించాడు.కుమారుడి ద్వారా నెరవేరిన కలకాగా పాఠశాల, కాలేజీ స్థాయిలో క్రికెట్ ఆడిన సురంగ వెల్లలగే జాతీయ జట్టుకు మాత్రం ఎప్పుడూ ప్రాతినిథ్యం వహించలేకపోయారు. కుమారుడు దునిత్ ద్వారా తన కలను నెరవేర్చుకున్నారు. ఇరవై రెండేళ్ల దునిత్ లెఫ్టార్మ్ స్పిన్నర్.శ్రీలంక 2022లో తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్.. ఇప్పటి వరకు ఒక టెస్టు, 31 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన దునిత్.. వన్డేల్లో 39, టీ20లలో ఏడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా.. వన్డేల్లో 386 పరుగులతో సత్తా చాటాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.సూపర్-4కు అర్హత సాధించిన శ్రీలంకదుబాయ్ వేదికగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో శ్రీలంక మెరుగైన ప్రదర్శనతో రాణించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన లంక జట్టు.. అఫ్గన్ను 169 పరుగులకు కట్టడి చేసింది. మహ్మద్ నబీ (22 బంతుల్లో 60) మెరుపుల కారణంగా అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించగలిగింది. లంక బౌలర్లలో నువాన్ తుషార నాలుగు వికెట్లతో చెలరేగగా.. దుష్మంత చమీర, వెల్లలగే, దసున్ శనక ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో పని పూర్తి చేసింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ అర్ధ శతకం (52 బంతుల్లో 74 నాటౌట్)తో అలరించగా.. కుశాల్ పెరీరా (28), కమిందు మెండిస్ (13 బంతుల్లో 26 నాటౌట్) కూడా రాణించారు. ఈ క్రమంలో ఆరు వికెట్ల తేడాతో అఫ్గన్పై గెలుపొందిన శ్రీలంక.. గ్రూప్-బి నుంచి సూపర్ ఫోర్కు అర్హత సాధించింది. ఇక ఇదే గ్రూపు నుంచి బంగ్లాదేశ్ కూడా తమ బెర్తును ఖరారు చేసుకోగా.. అఫ్గన్, హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: IND VS AUS: శతక్కొట్టిన ధృవ్ జురెల్.. టీమిండియా భారీ స్కోర్ No son should go through this💔Jayasuriya & team manager right after the game communicated Dinuth Wellalage the news of his father's passing away.pic.twitter.com/KbmQrHTCju— Rajiv (@Rajiv1841) September 18, 2025 -
Asia Cup: మా జట్టులో భారత్, పాక్ వినిపించదు.. మేమంతా ఒకే కుటుంబం
ఆసియా కప్-2025లో పాల్గొన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జట్టులో ఆ దేశంలో పుట్టినవారు కాకుండా వలస వచ్చిన ఆటగాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఐదుగురు భారత్కు చెందినవారు కాగా, మరో ఐదుగురు పాకిస్తానీలు.ఇక ఈ టోర్నీలో టీమిండియా- పాక్ జట్ల మధ్య తాజా ‘షేక్ హ్యాండ్’ వివాదం నేపథ్యంలో యూఏఈ టీమ్లో ఉన్న ఇరు దేశాల క్రికెటర్ల మధ్య సంబంధాలపై కూడా చర్చ జరిగింది. అయితే కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ ఈ మొత్తం అంశాన్ని తేలిగ్గా కొట్టిపారేశాడు. భారత్, పాక్ మధ్య ఏం జరిగినా తమకు సంబంధం లేదని, తామంతా యూఏఈ జట్టు ఆటగాళ్లం మాత్రమేనని అతడు స్పష్టం చేశాడు.ఇక వసీమ్ స్వయంగా పాకిస్తాన్లోని ముల్తాన్కు చెందిన వాడు కాగా...హైదర్ అలీ, జునైద్, రోహిద్, ఆసిఫ్ ఇతర పాకిస్తాన్ క్రికెటర్లు. భారత్కు చెందిన సిమ్రన్జీత్ సింగ్, రాహుల్ చోప్రా, హర్షిత్ కౌశిక్, ధ్రువ్ పరాశర్, అలీషాన్ షరఫు టీమ్లో కీలక సభ్యులు.‘యూఏఈ టీమ్ సభ్యులంతా ఒక కుటుంబ సభ్యుల్లాంటివాళ్లం. ఎవరూ భారతీయుడు కాదు, ఎవరూ పాకిస్తానీ కాదు. భారత్, పాక్ వివాదానికి సంబంధించి మా జట్టులో అసలు ఎలాంటి చర్చా జరగలేదు, జరగదు కూడా. మా టీమ్ సభ్యులంతా కలిసి ఎంతో క్రికెట్ ఆడాం. ఒకే కుటుంబంలాగే ఉంటూ ఒకే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం’ అని వసీమ్ వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్తో విభేదాల నేపథ్యంలో బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్కు పాక్ టీమ్ చాలా ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం యూఏఈ అప్పీల్ చేస్తే పాక్ వాకోవర్ ఇచ్చినట్లుగా ప్రకటించి యూఏఈని విజేతగా ఖరారు చేయవచ్చు. అయితే తమకు అలాంటి ఆలోచన ఏమాత్రం రాలేదని మొహమ్మద్ వసీమ్ వెల్లడించాడు. ఇక యూఏఈపై విజయంతో.. టీమిండియాతో పాటు పాక్కు సూపర్-4 దశకు అర్హత సాధించిది. గ్రూప్-ఎ నుంచి దాయాదులు తదుపరి దశకు క్వాలిఫై కాగా.. యూఏఈ, ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అయితే, ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీలో యూఏఈ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. -
Asia Cup 2025: అఫ్గానిస్తాన్పై గెలుపుతో ‘సూపర్–4’కు శ్రీలంక
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో గ్రూప్ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించాయి. గురువారం జరిగిన కీలక మ్యాచ్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై విజయం సాధించింది. ఈ గ్రూప్లో మూడు విజయాలతో లంక, రెండు విజయాలతో బంగ్లాదేశ్ ముందంజ వేయగా... అఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి నిష్రమించింది. ‘సూపర్–4’ దశకు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన పోరులో... టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మొహమ్మద్ నబీ (22 బంతుల్లో 60; 3 ఫోర్లు, 6 సిక్స్లు) విధ్వంసకర ఇన్నింగ్స్తో జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. వెలలాగే వేసిన చివరి ఓవర్లో నబీ ఏకంగా 5 సిక్స్లు కొట్టడం బాదడం విశేషం. ఈ ఓవర్లో అతను వరుసగా 6, 6, 6, (నోబాల్), 6, 6 బాదాడు. ఇతర బ్యాటర్లలో రషీద్ ఖాన్ (24), ఇబ్రహీమ్ జద్రాన్ (24) కొన్ని పరుగులు జోడించారు. శ్రీలంక బౌలర్లలో నువాన్ తుషార 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం లంక 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ కుశాల్ మెండిస్ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు) అర్ధ సెంచరీతో జట్టును గెలిపించగా... కుశాల్ పెరీరా (28), కమిందు మెండిస్ (26 నాటౌట్) రాణించాడు. శనివారం జరిగే తొలి సూపర్–4 మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడతాయి. -
అందుకే ఆసియా కప్లో ఆడుతున్నాం!.. అవునా?.. నిజమా?!
‘నో- షేక్హ్యాండ్’ వివాదంలో రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆఖరికి తలవంచకతప్పలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై పీసీబీ చేసిన ఫిర్యాదులకు ఆధారాల్లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ బోర్డు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. ఫలితంగా ‘బాయ్కాట్’ నాటకాన్ని పక్కనపెట్టిన పాక్ జట్టు.. యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడింది. అంతేకాదు ఈ మ్యాచ్కు రిఫరీ కూడా ఆండీనే కావడం విశేషం. అయితే, ‘సమాచార లోపం కారణంగానే ఇది జరిగిందంటూ పైక్రాఫ్ట్ మాకు క్షమాపణ చెప్పారు. ఆడియో లేని వీడియో.. చీప్ ట్రిక్స్ ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపిస్తామని ఐసీసీ కూడా చెప్పింది’ అంటూ పీసీబీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పైక్రాఫ్ట్తో తమ బృందం చర్చిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. అయితే పాక్ ఏదైనా రుజువులు చూపిస్తే తప్ప వారి ఆరోపణలపై తాము విచారణ చేసే అవకాశాలు లేవని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఆడియో లేకుండా పాక్ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ పనికిరావని.. నిజంగానే రిఫరీ క్షమాపణ చెప్పి ఉంటే ఆడియో కూడా పెట్టాల్సిందని చురకలు అంటిస్తున్నారు.బాయ్కాట్కు అందరి మద్దతు ఉంది.. కానీఇదిలా ఉంటే.. తాము ఆసియా కప్ నుంచి వైదొలగకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ‘‘సెప్టెంబరు 14 తర్వాత జరిగిన పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మ్యాచ్ రిఫరీ విషయంలో మేము అభ్యంతరాలు లేవనెత్తాము.కాసేపటి క్రితమే మ్యాచ్ రిఫరీ మా జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్తో మాట్లాడారు. నో- షేక్హ్యాండ్ ఘటన జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో విచారణ జరపాల్సిందేనని మేము ముందుగానే ఐసీసీకి ఫిర్యాదు చేశాం.రాజకీయాలు, క్రీడలను కలపకూడదు. ఆటను ఆటగానే ఉండనివ్వాలి. ఒకవేళ మనం బాయ్కాట్ చేస్తే.. అదొక అతిపెద్ద నిర్ణయం అవుతుంది. మనకు ప్రధాన మంత్రి, ప్రభుత్వ అధికారులు, ప్రజల మద్దతు ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు!కానీ ఈ విషయాన్ని మేము నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’’ అంటూ నక్వీ అసలు కారణం చెప్పకుండా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా రిఫరీ విషయంలో తమదే పైచేయి అయినందన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.కాగా సెప్టెంబరు 14న పాక్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది. దీంతో అవమానభారంతో రగిలిపోయిన పాక్.. బాయ్కాట్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ఒకవేళ నిజంగానే వాళ్లు ఈ టోర్నీని బహిష్కరిస్తే మిగతా వారికి వచ్చే నష్టమేమీ లేదు.వారికే నష్టంఇప్పటికే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న పాక్ బోర్డు పరిస్థితి మాత్రం మరింత దిగజారడం ఖాయం. టోర్నీ నుంచి రావాల్సిన ఆదాయం కోసమే కొనసాగినా.. నక్వీ ఇలా సాకులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్లో యూఏఈని ఓడించిన పాక్.. సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంటో సెప్టెంబరు 21న సల్మాన్ ఆఘా బృందం టీమిండియాను ఢీకొట్టనుంది.చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్ -
అంపైర్పైకి బంతిని విసిరిన పాక్ ఫీల్డర్.. తర్వాత ఏమైందంటే?
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు- మ్యాచ్ అధికారులకు అస్సలు పడటం లేదనిపిస్తోంది. ఇప్పటికే టీమిండియాతో ‘నో-షేక్హ్యాండ్’ వివాదంలో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్న పాక్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)తో మ్యాచ్ సందర్భంగా అనూహ్య రీతిలో ఫీల్డ్ అంపైర్ను గాయపరిచింది.ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా.. పాక్ ఫీల్డర్ చేసిన పని కారణంగా సదరు అంపైర్ నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడటం కనిపించింది. యూఏఈ ఆరో ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాక్ విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ధ్రువ్ పరాశర్ (Dhruv Parashar) ఆరో ఓవర్లో సయీమ్ ఆయుబ్ బౌలింగ్ను ఎదుర్కొన్నాడు.అంపైర్పైకి పాక్ ఫీల్డర్ త్రో.. బలంగా తాకిన బంతిఓవర్ ఐదో బంతిని థర్డ్మ్యాన్ రీజర్ దిశగా తరలించిన పరాశర్.. సింగిల్ కోసం పరుగు తీశాడు. ఇంతలో ఫీల్డర్ బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. అయితే, నేరుగా అది ఫీల్డ్ అంపైర్ రుచిర పల్లియాగురుగే (Ruchira Palliyaguruge) తలకు తాకింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడగా.. సయీమ్ ఆయుబ్ వచ్చి ఆరా తీశాడు. మిగతా ఆటగాళ్లు కూడా వచ్చి అతడిని పరామర్శించారు.తర్వాత ఏమైందంటే?అదే విధంగా పాక్ ఫిజియో వచ్చి అంపైర్కు కంకషన్ టెస్టు చేశాడు. ఈ క్రమంలో రుచిరా (శ్రీలంక) మైదానం వీడగా.. రిజర్వ్ అంపైర్ గాజీ సోహెల్ (బంగ్లాదేశ్) అతడి స్థానంలో బాధ్యతలు నిర్వర్తించాడు. Andy Pycroft- just missedRuchira - successRevenge from the previous game against India.. #Uaevpak pic.twitter.com/CY1hb7N8KM— Nibraz Ramzan (@nibraz88cricket) September 17, 2025 ఆండీ పైక్రాఫ్ట్పై ఫిర్యాదుకాగా భారత ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదనే సాకుతో ఆదివారం నుంచి అసహనాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన పాకిస్తాన్ జట్టు చివరకు ఏమీ సాధించకుండానే యూఏఈతో మ్యాచ్ బరిలోకి దిగింది.భారత క్రికెటర్లు తమతో కరచాలనం చేయకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిలువరించారని, ఆయనను ఆసియా కప్ రిఫరీ బాధ్యతల నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన డిమాండ్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఏమాత్రం పట్టించుకోలేదు. టోర్నీ సంగతి తర్వాత... యూఏఈతో బుధవారం పాక్ ఆడిన మ్యాచ్కు కూడా పైక్రాఫ్ట్నే రిఫరీగా ఎంపిక చేసి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.‘క్షమాపణ’ చెప్పారంటూ...ఈ మ్యాచ్ తాము ఆడబోమని, టోర్నీనే బహిష్కరిస్తామంటూ పాక్ మేనేజ్మెంట్ నుంచి ముందుగా సందేశాలు వచ్చాయి. అందుకు తగినట్లుగానే నిర్ణీత సమయానికి పాక్ ఆటగాళ్లు మైదానానికి బయలుదేరకుండా హోటల్లోనే ఉండిపోయారు కూడా. అయితే చివరకు తమకు పైక్రాఫ్ట్ ‘క్షమాపణ’ చెప్పారంటూ పాక్ ఆటగాళ్లు స్టేడియానికి వచ్చారు.ఈ క్రమంలో పసికూన యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించిన పాక్ జట్టు.. సూపర్-4కు అర్హత సాధించింది. తదుపరి.. ఆదివారం నాటి మ్యాచ్లో మరోసారి టీమిండియాను ఢీకొట్టనుంది. కాగా గ్రూప్-ఎ టేబుల్ టాపర్గా టీమిండియా ముందుగానే సూపర్-4కు చేరగా.. పాక్ రెండో స్థానంతో బెర్తును ఖరారు చేసుకుంది. యూఏఈ, ఒమన్ ఎలిమినేట్ అయ్యాయి. చదవండి: Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే? Not textbook, but definitely effective 💥Watch the #DPWorldAsiaCup, from Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork pic.twitter.com/n31XKIwlah— Sony Sports Network (@SonySportsNetwk) September 17, 2025 -
భారత్ అంటే ఇంత భయమా..? బయటపడ్డ పాక్ డ్రామా
-
Asia Cup 2025: మళ్లీ భారత్-పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే?
ఆసియాకప్-2025లో చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన గ్రూపు-ఎ మ్యాచ్లో యూఏఈను 41 పరుగుల తేడాతో పాక్ చిత్తు చేసింది. దీంతో గ్రూపు-ఎ నుంచి సూపర్ 4కు ఆర్హత సాధించిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది.ఈ క్రమంలో సెప్టెంబర్ 21(ఆదివారం) దుబాయ్ వేదికగా జరగనున్న సూపర్-4 మ్యాచ్లో మెన్ ఇన్ బ్లూ.. మెన్ ఇన్ గ్రీన్ తాడోపేడో తెల్చుకోనున్నాయి. మరోసారి దాయాది పాక్ను చిత్తు చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. కాగా లీగ్ స్టేజిలో భాగంగా గత ఆదివారం(సెప్టెంబర్ 14) జరిగిన మ్యాచ్లో పాక్పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్ షేక్ వివాదమే ఎక్కువగా హైలెట్ అయింది. ఈ మ్యాచ్లో పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరాచాలనాన్ని తిరష్కరించారు.దీంతో ఘోర అవమానంగా భావించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. భారత్ ఆటగాళ్లతో పాటు మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాప్ట్పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ రూల్ బుక్లో ప్రత్యర్ధి ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడం తప్పనిసారి అని లేకపోవడంతో ఐసీసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సూపర్-4లో కూడా నో హ్యాండ్ షేక్ విధానాన్ని భారత్ కొనసాగించనుంది.చదవండి: మరోసారి బీభత్సం సృష్టించిన సాల్ట్.. ఈసారి పసికూన బలి -
‘సూపర్–4’కు పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీలో రెండో విజయంతో పాకిస్తాన్ ‘సూపర్–4’ దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో పాక్ 41 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (36 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలవగా, ఇతర ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. సయీమ్ అయూబ్ (0) వరుసగా మూడో మ్యాచ్లోనూ డకౌటై అంతర్జాతీయ టి20ల్లో ఈ చెత్త రికార్డును నెలకొల్పిన మూడో పాకిస్తానీ ఆటగాడిగా నిలిచాడు. ఫర్హాన్ (5), కెపె్టన్ సల్మాన్ ఆగా (27 బంతుల్లో 20), హసన్ (3), ఖుష్దిల్ (4), హారిస్ (18) ప్రభావం చూపలేకపోయారు. చివర్లో షాహిన్ అఫ్రిది (14 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడటంతో పాక్ మెరుగైన స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో జునేద్ సిద్దిఖీ 4 వికెట్లు పడగొట్టగా, సిమ్రన్జీత్ సింగ్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం యూఏఈ 17.4 105 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (35 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్) రాణించగా, ధ్రువ్ పరాశర్ (20) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, రవూఫ్, అబ్రార్ అహ్మద్ రెండు వికెట్లు చొప్పున తీశారు. నేడు జరిగే మ్యాచ్లో అఫ్గానిస్తాన్తో శ్రీలంక తలపడుతుంది. -
Asia Cup 2025: పాక్ 'బాయ్కాట్' బెదిరింపులకు తలొగ్గని ఐసీసీ
నో హ్యాండ్షేక్ ఉదంతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెనక్కు తగ్గింది. ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో మ్యాచ్కు కొద్ది గంటల ముందు పీసీబీ హైడ్రామా నడిపింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని భీష్మించుకు కూర్చుంది. పైక్రాఫ్ట్ను తప్పించకపోతే యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేసింది. మ్యాచ్ ప్రారంభానికి సమయం ఆసన్నమైనా, వారి ఆటగాళ్లను హోటల్ రూమ్ల నుంచి బయటకు రానివ్వలేదు.దీంతో ఆసియా కప్లో పాక్ కొనసాగడంపై కాసేపు నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఈ విషయంలో ఐసీసీ కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డే తోక ముడిచింది. నో హ్యాండ్షేక్ ఉదంతంతో పైక్రాఫ్ట్ది ఏ తప్పు లేదని ఐసీసీ మరోసారి పీసీబీకి స్పష్టం చేసింది. మ్యాచ్ అఫీషియల్స్ విషయంలో పీసీబీ అతిని సహించబోమని స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.దీంతో చేసేదేమీ లేక పీసీబీ తమ ఆటగాళ్లను మ్యాచ్ ఆడటానికి మైదానానికి రావాల్సిందిగా ఆదేశించింది. మ్యాచ్ను గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వహకులకు కబురు పంపింది. భారతకాలమానం ప్రకారం పాక్-యూఏఈ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్లో భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అలాగే ఆ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని గగ్గోలు పెట్టింది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని, యూఏఈతో మ్యాచ్కు అతన్నే రిఫరీగా కొనస్తామని ప్రకటించింది. -
Asia Cup 2025: యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేయనున్న పాకిస్తాన్..?
ఆసియా కప్-2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్షేక్ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్ క్రికెట్ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్ సహా ఆసియా కప్ మొత్తాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. యూఏఈతో మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్ క్రికెటర్లు ఇంకా హోటల్ రూమ్ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ కాసేపట్లో పాక్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అలాగే ఆ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఆసియా కప్లో ముందు దశకు (సూపర్-4) వెళ్లాలంటే పాక్ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో పాక్ పసికూన ఒమన్పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్పై విజయం సాధించింది.ప్రస్తుతం పాక్, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్ యూఏఈతో మ్యాచ్ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్తో పాటు సూపర్-4కు చేరుకుంటుంది. -
‘వాళ్ల క్యారెక్టరే అంత.. చదువు, సంస్కారం ఉంటే ఇలాంటివి చేయరు’
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్పై టీమిండియా మాజీ ఆల్రౌండర్ మదన్ లాల్ (Madan Lal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారడం పాక్ క్రికెటర్లకు అలవాటేనని.. వాళ్ల క్యారెక్టరే అంత అంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా పాకిస్తాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.నో- షేక్హ్యాండ్దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్ను 127 పరుగులకే పరిమితం చేసింది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనను 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి దాయాదితో ముఖాముఖి తలపడిన టీమిండియా మైదానంలో ఏ దశలోనూ పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోలేదు.టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా ఇదే పంథా అనుసరించింది. దీనిని తీవ్ర అవమానంగా భావించిన పాక్.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ నానాయాగీ చేసింది.సూర్యకుమార్ యాదవ్పై దిగజారుడు వ్యాఖ్యలుఈ క్రమంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును కావాలనే తప్పుగా పలుకుతూ ‘ఆ పంది’ కుమార్ అంటూ చీప్ కామెంట్లు చేశాడు. అంతేకాదు.. అంపైర్లను అడ్డుపెట్టుకుని టీమిండియా మ్యాచ్ గెలిచిందంటూ ఆరోపించాడు.పాకిస్తాన్ క్రికెటర్ల క్యారెక్టరే అంతఈ నేపథ్యంలో 1983 వరల్డ్కప్ విజేత మదన్ లాల్ మొహ్మద్ యూసఫ్ తీరుపై మండిపడ్డాడు. ‘‘పాకిస్తాన్ క్రికెటర్ల క్యారెక్టరే అంత. ఎవరైనా దూషించే హక్కు మీకెక్కడిది?.. వాళ్లకు ఇలా మాట్లాడటం మాత్రమే తెలుసు. అంతకంటే ఇంకేమీ పట్టదు.సొంత జట్టు ప్లేయర్లనే తిట్టిన చరిత్ర వారికి ఉంది. వరుస పరాజయాలతో విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇతర జట్ల ఆటగాళ్లను కూడా దూషించడం మొదలుపెట్టారు. దీనిని బట్టి వాళ్ల చదువు, సంస్కారాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఇలా మాట్లాడేవారంతా మూర్ఖులు.పబ్లిసిటీ కోసమే ఈ విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. నిజానికి మనమే వాళ్లకు ఎక్కువగా ప్రచారం ఇస్తున్నాం. వాళ్లకు కావాల్సింది కూడా ఇదే. పబ్లిసిటీ కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. భారత జట్టు గురించి మాట్లాడుతూ వ్యూస్ కోసం యూట్యూబ్ చానెళ్లు ఇలాంటి పనిచేస్తున్నాయి’’ అని 74 ఏళ్ల మదన్ లాల్ ANIతో పేర్కొన్నాడు.అదే విధంగా.. టీమిండియా తమ అద్భుత ఆట తీరుతో గెలిచిందంటూ యూసఫ్కు మదన్ లాల్ కౌంటర్ ఇచ్చాడు. కొన్నిసార్లు అంపైర్లు తప్పు చేసినా.. ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతికతో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే.. -
మా స్థాయి ఇది కాదు!.. అందుకే బంగ్లా చేతిలో ఓటమి: రషీద్ ఖాన్
బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపై అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) స్పందించాడు. తాము స్థాయికి తగ్గట్లు ఆడలేదని.. అందుకే ఓడిపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్లతో కలిసి గ్రూప్-బిలో ఉంది.ఈ క్రమంలో తొలుత హాంకాంగ్తో తలపడిన అఫ్గన్ జట్టు.. 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, తాజాగా తమ రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఢీకొట్టిన రషీద్ ఖాన్ బృందం ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. అబుదాబిలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా.. తొలుత బ్యాటింగ్ చేసింది.తప్పక గెలిస్తేనే.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అయితే, ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో అఫ్గనిస్తాన్ విఫలమైంది. 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా బంగ్లా చేతిలో ఎనిమిది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో అఫ్గన్ సూపర్-4 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లీగ్ దశలో చివరిగా శ్రీలంకతో ఆడబోయే మ్యాచ్లో తప్పక గెలిస్తేనే.. రషీద్ బృందానికి సూపర్-4 ఆశలు సజీవంగా ఉంటాయి.మా స్థాయి ఇది కాదుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ఆఖరి వరకు పోరాడినా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాము. 18 బంతుల్లో 30 పరుగుల సమీకరణం పెద్ద కష్టమేమీ కాదు. దూకుడైన క్రికెట్ ఆడే జట్టుగా మాకు పేరుంది. కానీ ఈసారి స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాము.చెత్త బ్యాటింగ్ వల్లే ఓటమిఅనవసరంగా ఒత్తిడికి లోనయ్యాము. ఆరంభంలో తడబడ్డా ప్రత్యర్థిని 160 పరుగులలోపే కట్టడి చేశాము. కానీ బ్యాటింగ్ పరంగా విఫలమయ్యాము. కొన్ని చెత్త, బాధ్యతారహిత షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాము.టీ20 ఫార్మాట్లో కొన్నిసార్లు ప్రత్యర్థి తొలి ఆరు ఓవర్లలోనే మ్యాచ్ను తమవైపునకు తిప్పేసుకున్నా.. తిరిగి పుంజుకోవడం కష్టం. ఈ మ్యాచ్ ద్వారా మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. ఆసియా కప్ టోర్నీలో ప్రతీ మ్యాచ్ ముఖ్యమైనదే.శ్రీలంకతో మ్యాచ్కు అన్ని విధాలుగా సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రస్తుతం మా ముందున్న అతిపెద్ద సవాలు ఇదే’’ అని పేర్కొన్నాడు. కాగా అఫ్గన్ జట్టు గురువారం (సెప్టెంబరు 18) శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరుజట్ల మధ్య జరిగే ఈ నాకౌట్ పోరుకు అబుదాబి వేదిక.బంగ్లాదేశ్ వర్సెస్ అఫ్గనిస్తాన్ స్కోర్లుబంగ్లాదేశ్: 154/5 (20)అఫ్గనిస్తాన్: 146 (20)చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే..Bangladesh win, keeping playoff hopes alive 🤞 Group B battles are going down the wire. Watch #DPWorldAsiaCup2025 from Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #BANvAFG pic.twitter.com/9mHoLUcTGw— Sony Sports Network (@SonySportsNetwk) September 16, 2025 -
ఆల్టైమ్ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆసియా కప్ టోర్నమెంట్లో అఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. ఈ ఖండాంతర టోర్నీ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా వెటరన్ ఫాస్ట్బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) పేరిట ఉన్న ఆల్టైమ్ ఆసియా కప్ టీ20 వికెట్ల రికార్డును బద్దలు కొట్టాడు.రెండు వికెట్లు పడగొట్టిన రషీద్బంగ్లాదేశ్తో మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్తో తలపడింది. అబుదాబిలో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఓపెనర్లు సైఫ్ హసన్ (30), తాంజిద్ హసన్ (52)లతో పాటు తౌహీద్ హృదోయ్ (26) రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లా ఐదు వికెట్ల నష్టానికి 154 పరుగులు స్కోరు చేసింది. అఫ్గన్ బౌలర్లలో కెప్టెన్ రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఈ మ్యాచ్లో అఫ్గన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్.. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో 26 పరుగులు ఇచ్చి.. సైఫ్ హసన్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోవడంతో పాటు షమీమ్ హొసేన్ను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలోనే ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా రషీద్ ఖాన్ అవతరించాడు.ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసింది వీరే👉రషీద్ ఖాన్(అఫ్గనిస్తాన్)- 10 మ్యాచ్లలో కలిపి 14 వికెట్లు👉భువనేశ్వర్ కుమార్ (భారత్)- 6 మ్యాచ్లలో కలిపి 13 వికెట్లు👉అమ్జద్ జావేద్ (యూఏఈ)- 7 మ్యాచ్లలో కలిపి 12 వికెట్లు👉వనిందు హసరంగ (శ్రీలంక)- 8 మ్యాచ్లలో కలిపి 12 వికెట్లు👉హార్దిక్ పాండ్యా (భారత్)- 10 మ్యాచ్లలో కలిపి 12 వికెట్లు.ఆఖరి వరకు పోరాడినా..ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లా విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించలేక అఫ్గనిస్తాన్ చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆఖరి వరకు పోరాడినా ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.అఫ్గన్ బ్యాటర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (35), అజ్మతుల్లా ఒమర్జాయ్ (30) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ మూడు వికెట్లతో చెలరేగగా.. సనూమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, రిషాద్ హొసేన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక అఫ్గన్కు సూపర్-4 ఆశలు సజీవంగా ఉండాలంటే.. తదుపరి మ్యాచ్లో శ్రీలంకను తప్పక ఓడించాలి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్కు ఊరట?!Rashid Khan proves his genius, even in a loss 🌟 Watch #DPWorldAsiaCup2025 from Sept 9-28, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #BANvAFG pic.twitter.com/voUMwhtD2g— Sony Sports Network (@SonySportsNetwk) September 16, 2025 -
చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు చేరాలంటే..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా ఇప్పటికే సూపర్-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత జట్టు తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ని ఓడించింది. యూఏఈ విధించిన లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేదించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.సూపర్-4 బెర్తు ఖరారైంది ఇలా..ఇక రెండో మ్యాచ్లో సూర్యకుమార్ సేన.. దాయాది పాకిస్తాన్ (Ind vs Pak)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో నాలుగు పాయింట్లు సంపాదించిన టీమిండియా.. యూఏఈ- ఒమన్ను ఓడించి.. ఎలిమినేట్ చేయగానే సూపర్-4 బెర్తు ఖరారు చేసుకుంది. ఇక గ్రూప్-‘ఎ’ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్- యూఏఈ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి మ్యాచ్లో ఇరుజట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. కాగా యూఏఈ- పాకిస్తాన్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెరో మ్యాచ్ గెలిచాయి. ఈ రెండు జట్లు ఒమన్ను ఓడించి చెరో రెండు పాయింట్లు సాధించాయి.గెలిచిన జట్టుకే అవకాశంఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరిగే బుధవారం జరిగే మ్యాచ్లో గెలిచిన జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. తద్వారా మొత్తంగా నాలుగు పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది.అంటే.. పాకిస్తాన్ యూఏఈని ఓడిస్తే.. నేరుగా సూపర్-4లో అడుగుపెడుతుంది. ఒకవేళ యూఏఈ గెలిస్తే.. టీమిండియాతో కలిసి గ్రూప్-‘ఎ’ నుంచి సూపర్-4కు అర్హత సాధిస్తుందన్న మాట.ఫలితం తేలకుంటే మాత్రంఒకవేళ మ్యాచ్ గనుక ‘టై’ అయినా.. ఏదేని కారణాల చేత ఫలితం తేలకపోయినా ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది. అప్పుడు నెట్ రన్రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టుకు బెర్తు ఖరారు అవుతుంది. ప్రస్తుతం నెట్ రన్రేటు పరంగా పాకిస్తాన్ (+1.649).. యూఏఈ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ సమీకరణ ఆధారంగా పాకిస్తాన్కే సూపర్-4 చేరే అవకాశం ఉంటుంది.AI ఆధారిత టేబుల్ఒమన్, హాంకాంగ్ ఎలిమినేట్యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్ టోర్నీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ... గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పాల్గొంటున్నాయి. ఇప్పటికే గ్రూప్-‘ఎ’ నుంచి ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి.చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్కు ఊరట?! -
Handshake Row: ఐసీసీ యూటర్న్.. పాకిస్తాన్కు ఊరట?!
ఆసియా కప్-2025 టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడాన్ని పీసీబీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను తక్షణం ఆసియా కప్ నుంచి తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసింది.ఆయనే బాధ్యుడంటూ..ఈ మేరకు ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ ఆఘాకు చెప్పాడని, ఈ వివాదానికి ఆయనే బాధ్యుడని ఫిర్యాదులో ప్రముఖంగా పేర్కొంది.ఈ విషయంపై మంగళవారం స్పందించిన ఐసీసీ పాక్ బోర్డు ఫిర్యాదును తోసిపుచ్చింది. ‘సోమవారం రాత్రే ఐసీసీ తమ నిర్ణయాన్ని వెలువరించింది. రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ను తప్పించలేమని పాక్ బోర్డు ఫిర్యాదును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాం’ అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కాగా జింబాబ్వేకు చెందిన పైక్రాఫ్ట్కు అంతర్జాతీయ క్రికెట్లో విశేషానుభవం వుంది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో సీనియర్ రిఫరీ అయిన ఆయన మూడు ఫార్మాట్లలో కలిసి 695 మ్యాచ్లకు రిఫరీగా వ్యవహరించారు. పురుషులు, మహిళల మ్యాచ్లు కలిపి ఉన్నాయి.ఐసీసీ యూటర్న్.. పాక్కు ఊరట?!ఈ నేపథ్యంలో కనీసం తమ మ్యాచ్ల వరకైనా ఆండీ క్రాఫ్ట్ను దూరం పెట్టి రిచీ రిచర్డ్సన్కు రిఫరీ బాధ్యతలు ఇవ్వాలని పీసీబీ కోరింది. కాగా ఆసియా కప్ టోర్నీలో బుధవారం పాకిస్తాన్- యూఏఈ మధ్య జరిగే మ్యాచ్కూ పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. అయితే, పీసీబీ విజ్ఞప్తిని మన్నించిన ఐసీసీ.. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే అన్ని మ్యాచ్ల నుంచి పైక్రాఫ్ట్ను రిఫరీగా తప్పించినట్లు ఎన్డీటీవీ తన తాజా కథనంలో పేర్కొంది.కాగా పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేయలేదు. కచ్చితమైన నిబంధనలేమీ లేవుఈ నేపథ్యంలో పీసీబీ రిఫరీతో పాటు టీమిండియా తీరును తప్పుబట్టగా.. ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవని బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది.ఇక దుబాయ్ వేదికగా ఏడు వికెట్ల తేడాతో పాక్ను ఓడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కొన్ని అంశాలు క్రీడాస్ఫూర్తికి మించినవి ఉంటాయంటూ పాక్ విమర్శలను తిప్పికొట్టాడు. పాక్పై ఈ గెలుపును ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సూర్య స్పష్టం చేశాడు.చదవండి: సూర్యకుమార్పై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్ -
Asia Cup: గట్టెక్కిన బంగ్లాదేశ్
అబుదాబి: ఆసియా కప్ టి20 టోర్నీలో బంగ్లాదేశ్ కీలక విజయాన్ని అందుకుంది. ‘సూపర్–4’ రేసులో తమకు పోటీగా వచ్చే అవకాశం ఉన్న అఫ్గానిస్తాన్పై పైచేయి సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో బంగ్లా 8 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ను ఓడించింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జీద్ హసన్ (31 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. తన్జీద్, మరో ఓపెనర్ సైఫ్ హసన్ (28 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి తొలి వికెట్కు 40 బంతుల్లో 63 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత అఫ్గాన్ స్పిన్నర్లు నూర్ అహ్మద్ (2/23), రషీద్ ఖాన్ (2/26) బంగ్లా బ్యాటర్లను కట్టి పడేసి తొలి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ దశలో తౌహీద్ హృదయ్ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్) కొంత పోరాడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. గుర్బాజ్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఒమర్జాయ్ (16 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించగా...ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. చివర్లో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు ప్రయత్నించినా ... 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన దశలో అతను అవుట్ కావడంతో అఫ్గాన్ ఓటమి ఖాయమైంది. ముస్తఫిజుర్ రహమాన్ 3 వికెట్లు పడగొట్టగా... నసుమ్ అహ్మద్, రిషాద్ హుస్సేన్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు జరిగే మ్యాచ్లో యూఏఈతో పాకిస్తాన్ ఆడుతుంది. -
చరిత్ర సృష్టించిన నిసాంక.. శ్రీలంక తొలి ప్లేయర్గా..
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో శ్రీలంక వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్-బిలో ఉన్న లంక జట్టు తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే, రెండో మ్యాచ్లో భాగంగా పసికూన హాంకాంగ్తో తలపడిన శ్రీలంక (SL vs HK).. గెలుపు కోసం ఆపసోపాలు పడింది.దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగుల మేర మెరుగైన స్కోరు సాధించింది.నిజాకత్ ఖాన్ మెరుపులుఓపెనర్లు జీషన్ అలీ (23), అన్షుమాన్ రథ్ (48) శుభారంభం అందించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ నిజాకత్ ఖాన్ అజేయ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 52)తో అలరించాడు. అయితే, హాంకాంగ్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంక గట్టిగానే శ్రమించాల్సి వచ్చింది.హాంకాంగ్ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఓపెనర్ కుశాల్ మెండిస్ 11, కమిల్ మిశారా 19, కుశాల్ పెరీరా 20 పరుగులు చేయగా.. కెప్టెన్ చరిత్ అసలంక (2), కమిందు మెండిస్ (5) పూర్తిగా విఫలమయ్యారు.పాతుమ్ నిసాంక హాఫ్ సెంచరీఅయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్ పాతుమ్ నిసాంక మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. నిసాంక అర్ధ శతకానికి తోడు ఆఖర్లో వనిందు హసరంగ (9 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో లంక గట్టెక్కగలిగింది.శ్రీలంక తొలి ప్లేయర్గా..ఇక శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన పాతుమ్ నిసాంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాదు ఈ మ్యాచ్ సందర్భంగా నిసాంక ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో శ్రీలంక తరఫున అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.కాగా అంతకు ముందు ఈ రికార్డు కుశాల్ మెండిస్ పేరిట ఉండేది. అతడి ఖాతాలో 16 ఫిఫ్టీ ప్లస్ టీ20 స్కోర్లు ఉండగా.. నిసాంక (17) అతడిని అధిగమించాడు. ఇదిలా ఉంటే కుశాల్ పెరీరా కూడా 16సార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించి కుశాల్ మెండిస్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.శ్రీలంక వర్సెస్ హాంకాంగ్ స్కోర్లు👉హాంకాంగ్:149/4 (20)👉శ్రీలంక: 153/6 (18.5)👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హాంకాంగ్పై శ్రీలంక గెలుపు.చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే! -
సూర్యపై పాక్ మాజీ కెప్టెన్ దిగజారుడు వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన కోచ్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్ (Mohammed Yousuf)పై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ మండిపడ్డాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ నుంచి ఇలాంటి చెత్త మాటలు ఊహించలేదన్నాడు. అయినా అతడి స్థాయికి ఇంతకంటే గొప్పగా మాట్లాడతాడనుకోలేదంటూ చురకలు అంటించాడు.ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం పాక్తో మ్యాచ్ ఆడింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టీ20 పోరులో సూర్యకుమార్ సేన సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. బీసీసీఐ కౌంటర్ అయితే, టాస్ సమయంలోగానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత గానీ భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మద్దతుగా పాక్ ఆటగాళ్లతో షేక్హ్యాండ్కు నిరాకరించింది.దీనిని అవమానంగా భావించిన పాక్ జట్టు.. విషయాన్ని ఐసీసీ వరకు తీసుకువెళ్లగా.. కచ్చితంగా షేక్హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదంటూ బీసీసీఐ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్ టీమిండియాపై అవాకులు, చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కాడు.సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూషేక్హ్యాండ్ గురించి సామా టీవీలో మాట్లాడుతూ.. సూర్యకుమార్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును ఉద్దేశపూర్వకంగానే తప్పుగా పలుకుతూ పంది అనే అర్థం వచ్చేలా దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు అంపైర్లను అడ్డుపెట్టుకుని గెలిచారంటూ నిరాధార ఆరోపణలు చేశాడు. అతడి మాటలకు అక్కడున్న వాళ్లు పళ్ళు ఇకిలిస్తూ శునకానందం పొందారు.ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు?ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ స్పందించాడు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘ఇంతకంటే ఇంకా ఎంతకు దిగజారగలరు? వాళ్లు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతూనే ఉంటారు.మైదానంలో ఏం చేయాలో మాత్రం అది చేయరు. కానీ మైదానం వెలుపల ఇలాంటి పిచ్చి మాటలతో హైలైట్ అవుతారు. ప్రపంచం మొత్తం వీరిని గమనిస్తూనే ఉంది. ఇంతకంటే టీమిండియాను వారు ఏం చేయగలరు?ప్రతి ఒక్కరికి తమకంటూ గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే వారు ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు. అయినా.. ఎవరైనా సరే తమ స్థాయికి తగ్గట్లే మాట్లాడతారు కదా!మా జట్టు గొప్పగా ఆడుతోందిఆట గురించి ఎలాంటి విమర్శలు చేసినా తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఇలా చేయడం ముమ్మాటికీ తప్పే. మీరు ఏదైనామాట్లాడాలనుకుంటే ఆట గురించి మాట్లాడండి. మా జట్టు గొప్పగా ఆడుతోంది. మీ ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెట్టి.. బాగా ఆడితే మిమ్మల్ని కూడా ఎవరో ఒకరు పొగుడుతారు. అంతేగానీ ఇతర జట్ల ఆటగాళ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు’’ అంటూ అశోక్ అస్వాల్కర్ మొహ్మద్ యూసఫ్నకు గట్టిగానే చురకలు అంటించాడు.చదవండి: టీమిండియా ‘బిగ్ లూజర్’ అంటూ కామెంట్లు?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్ -
టీమిండియా ‘బిగ్ లూజర్’?.. పాక్ మీడియాపై పాంటింగ్ ఫైర్
టీమిండియా- పాకిస్తాన్ మధ్య ‘నో-షేక్హ్యాండ్ No- Shakehand)’ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా దాయాదులు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత జట్టు పాక్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించింది. షేక్హ్యాండ్ లేకుండానే డ్రెసింగ్ రూమ్కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో తమను అవమానించారంటూ పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది.మరోవైపు.. షేక్హ్యాండ్ చేయాలన్న నిబంధన లేదని.. తమ ఆటగాళ్లు చేసిన దాంట్లో తప్పేమీ లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియాను సమర్థిస్తూ భారత మాజీ క్రికెటర్లు వ్యాఖ్యలు చేయగా.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ మాత్రం సూర్యకుమార్ సేనను విమర్శించినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.టీమిండియా ‘బిగ్ లూజర్’?‘‘ఈ మ్యాచ్ ఎల్లకాలం గుర్తుండిపోతుంది. ఇండియా బిగ్ లూజర్గా మనకు గుర్తుంటుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు వెళ్లిన పాకిస్తానీ జట్టు ప్రవర్తన జెంటిల్మేన్ గేమ్లో వాళ్లను అమరులుగా నిలిపితే.. భారత జట్టు మాత్రం పరాజితగా మిగిలిపోతుంది’’ అని పాంటింగ్ అన్నట్లుగా పాక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదుఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్పై భారతీయ నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో పాంటింగ్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. ‘‘సోషల్ మీడియాలో నా పేరు చెప్పి వైరల్ అవుతున్న వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి.నేను అసలు అలాంటి కామెంట్లు చేయనేలేదు. అసలు ఆసియా కప్ టోర్నమెంట్ గురించి నేను ఇంత వరకు బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడనే లేదు’’ అంటూ పాక్ నెటిజన్లకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు. ‘ఎక్స్’ వేదికగా పాంటింగ్ ఈ మేరకు స్పష్టతనిచ్చాడు.ఐపీఎల్తో విడదీయరాని అనుబంధంకాగా ఆసీస్ దిగ్గజ కెప్టెన్గా పేరొందిన పాంటింగ్కు ఐపీఎల్తో విడదీయరాని అనుబంధం ఉంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు హెడ్కోచ్గా పనిచేసిన ఈ లెజెండరీ బ్యాటర్.. గతేడాది పంజాబ్ కింగ్స్కు మార్గనిర్దేశనం చేశాడు. అతడి గైడెన్స్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ ఫైనల్ చేరింది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. చదవండి: ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి? -
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్
టీమిండియాకు కొత్త జెర్సీ స్పాన్సర్ వచ్చేసింది. అపోలో టైర్స్ (Apollo Tyres) భారత జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఒప్పందం ప్రకారం 2027 వరకు అపోలో టైర్స్ టీమిండియా జెర్సీ స్పాన్సర్గా వ్యవహరించనుంది. ‘డ్రీమ్ 11’తో కటీఫ్కాగా ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ ఇటీవలే భారత క్రికెట్ జట్టు జెర్సీ స్పాన్సర్ హక్కులు కోల్పోయిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్’ను అనుసరించి.. డ్రీమ్ 11తో బీసీసీఐ తమ బంధాన్ని తెంచుకుంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కాగా మూడేళ్ల కాలానికి 2023లో రూ.358 కోట్లతో డ్రీమ్ 11 ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.ఒక్కో మ్యాచ్కు రూ. 4.5 కోట్లుఅయితే, ఇప్పుడు అనూహ్య రీతిలో డ్రీమ్ 11పై వేటు పడగా.. అపోలో టైర్స్ ఆ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ క్రమంలో ఒక్కో మ్యాచ్కు రూ. 4.5 కోట్ల చొప్పున అపోలో టైర్స్ బోర్డుకు చెల్లించనుంది. ఒప్పంద కాలంలో దాదాపు 130 మ్యాచ్లకు ఈ సంస్థ జెర్సీ స్పాన్సర్గా ఉండనుంది. అంతకు ముందు డ్రీమ్ 11 జెర్సీ స్పాన్సర్గా ఉండి.. ఒక్కో మ్యాచ్కు రూ. 4 కోట్లు చెల్లించింది.కాగా టీమిండియా జెర్సీ స్పాన్సర్ హక్కులు దక్కించుకునేందుకు కాన్వా, జేకే టైర్, బిర్లా ఓప్టస్ పెయింట్స్ వంటివి ఆసక్తి చూపగా.. అపోలో టైర్స్ తమ బిడ్ను ఖరారు చేసుకుంది. ఇదిలా ఉంటే.. అర్ధంతరంగా డ్రీమ్ 11 తప్పుకోవాల్సి రావడంతో టీమిండియా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగిన విషయం తెలిసిందే.చదవండి: ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి? -
నీ గర్ల్ఫ్రెండ్ నాలా ఉండాలని కోరుకోవా?.. ఆమెతో హార్దిక్ పాండ్యా డేటింగ్?
టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ఆసియా కప్-2025 టోర్నమెంట్తో బిజీగా ఉన్నాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ ఆల్రౌండర్ ఇప్పటి వరకు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు.తొలుత యూఏఈతో మ్యాచ్లో వికెట్లు తీయలేకపోయిన హార్దిక్.. పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. సయీమ్ ఆయుబ్ రూపంలో కీలక వికెట్ కూల్చి టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన హార్దిక్.. సాహిబ్జదా ఫర్హాన్ (40), మొహమ్మద్ హ్యారిస్ (3) ఇచ్చిన క్యాచ్లు అందుకుని ఫీల్డర్గా తన వంతు పాత్ర పూర్తి చేశాడు.ఇక పాక్ విధించిన 128 పరుగుల లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యాకు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఇక ఆటతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతోనూ హార్దిక్ ఇటీవలి కాలంలో వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రాక్టీస్ సమయంలో రూ. 22 కోట్ల ధర కలిగిన వాచ్ ధరించి హాట్ టాపిక్ అయ్యాడు.మూడుసార్లు పెళ్లితాజాగా హార్దిక్ పాండ్యా రిలేషన్షిప్నకు సంబంధించి మరో వార్త తెరమీదకు వచ్చింది. కాగా సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిక్ను ప్రేమించిన హార్దిక్.. ఆమెను పెళ్లాడాడు. వీరికి కుమారుడు అగస్త్య సంతానం. అయితే, కోవిడ్ సమయంలో ఘనంగా పెళ్లి చేసుకోలేకపోయామన్న లోటు లేకుండా.. ఆ తర్వాత హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో కుమారుడి ముందే ఈ జంట వివాహం చేసుకుంది.జాస్మిన్కు కూడా గుడ్బై?ఎంతో అన్యోన్యంగా ఉండే హార్దిక్- నటాషా విడాకులు తీసుకున్నామంటూ గతేడాది ప్రకటన విడుదల చేసి అభిమానులకు షాకిచ్చారు. ఆ తర్వాత నటాషా కొన్నాళ్లు సెర్బియా వెళ్లిపోగా.. ఇంతలో హార్దిక్.. సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఇవి నిజమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, హార్దిక్ జాస్మిన్కు కూడా గుడ్బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అతడు మరో ముద్దుగుమ్మతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహీక శర్మతో హార్దిక్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పరస్పరం సోషల్ మీడియాలో ఫాలో కావడంతో పాటు.. మహీక ప్రతీసారి హార్దిక్కు సంబంధించిన హింట్ ఇచ్చేలా పోస్టులు పెట్టడం ఇందుకు ఊతమిచ్చింది.నీ గర్ల్ఫ్రెండ్ నాలా ఉండాలని కోరుకోవా?ఇక హార్దిక్ పాండ్యా తాజా ప్రేమాయణానికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్న వేళ.. అతడి మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ షేర్ చేసిన సాంగ్ క్లిప్ వైరల్ అవుతోంది. ‘‘నీ గర్ల్ఫ్రెండ్ నాలా హాట్గా ఉండాలని కోరుకోవా.. నీ గర్ల్ఫ్రెండ్ నాలా ఫ్రీక్గా ఉండాలని కోరుకోవా?’’ అంటూ సాగే లిరిక్స్కు పెదాలు కదుపుతూ నటాషా డాన్స్ చేయడం నెటిజన్లను ఆకర్షించింది. View this post on Instagram A post shared by @angreziedaaru -
‘అల్లుడు’ నీ పరుగులేం అక్కర్లేదు.. పాక్ ప్లేయర్పై అఫ్రిది ఫైర్
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా ఆదివారం భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయితే ప్రస్తుతం అంతా పాక్ చెత్త ప్రదర్శన గురించి కాకుండా ఈ మ్యాచ్ అనంతరం చెలరేగిన హ్యాండ్ షేక్ వివాదం గురించే చర్చించుకుంటున్నారు.కానీ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రం తమ జట్టు చెత్త ఆటను మర్చిపోలేదు. తాజాగా ఓ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గోన్న అఫ్రిది.. తన అల్లుడు షాహీన్ షా అఫ్రిదిని విమర్శించాడు. షాహీన్ షా అఫ్రిది బౌలింగ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.అఫ్రిది బౌలింగ్ను భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉతికారేశాడు. కానీ బ్యాటింగ్లో మాత్రం అఫ్రిది మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లో 33 పరుగులు చేసి పాక్ స్కోర్ 100 పరుగుల మార్కు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే షాహీన్ బ్యాట్తో కాకుండా బంతితో రాణించి ఉంటే బాగుండేదని షాహిద్ అఫ్రిది అన్నాడు."షాహీన్ బ్యాటింగ్లో కొన్ని పరుగులు చేశాడు. అతడి ఆడిన ఇన్నింగ్స్ ఫలితంగానే మా జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. అందుకు అతడికి ధన్యవాదాలు. కానీ షాహీన్ నుంచి నేను ఆశించింది పరుగులు కాదు. అతడు నుంచి మంచి బౌలింగ్ కావాలి. అలాగే అయుబ్ నుంచి నేను బౌలింగ్ను కోరుకోను.అతడు పరుగులు చేయాలి. జట్టులో అతడి పాత్ర ఎంటో షాహీన్ ఆర్ధం చేసుకోవాలి. కొత్త బంతిని స్వింగ్ చేసి, వికెట్లు సాధించేందుకు మార్గాలను అన్వేషించాలి. అతను తన గేమ్ ప్లాన్పై దృష్టి సారించాలి" అని సామా టీవీ ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు -
ఛీ.. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు.. ఇదేం పద్ధతి?
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ (Atul Wassan) తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మరీ సిగ్గు లేకుండా తయారయ్యారంటూ ఘాటు విమర్శలు చేశాడు. అసలేం జరిగిందంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమిండియా- పాకిస్తాన్ ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నీలో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే.మరోసారి జయభేరిదుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు పాక్పై ఆధిపత్యం కొనసాగిస్తూ మరోసారి జయభేరి మోగించింది. సల్మాన్ ఆఘా బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో సూర్యకుమార్ సేన చిత్తు చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా.. భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.రచ్చకెక్కిన పాక్ బోర్డుటాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత జట్టు ఇదే పంథా అనుసరించింది. పాక్ ప్లేయర్లు షేక్హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించగా.. భారత ఆటగాళ్లు మాత్రం ఇందుకు విముఖత వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు రచ్చకెక్కింది. తమను అవమానించారని.. క్రీడాస్ఫూర్తికి ఇది విరుద్దమని గగ్గోలు పెడుతోంది. మ్యాచ్ రిఫరీపై వేటు వేయాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.మరీ సిగ్గు లేకుండా తయారయ్యారుఈ విషయంపై భారత మాజీ పేసర్ అతుల్ వాసన్ ఘాటుగా స్పందించాడు. ‘‘ఛీ.. వాళ్లు మరీ సిగ్గు లేకుండా తయారయ్యారు. షేక్హ్యాండ్ ఇవ్వాలంటూ మనల్ని బలవంతపెట్టాలని చూస్తున్నారు. ఇదేం పద్ధతి?.. మీకు అవమానం జరిగిందని ప్రపంచం మొత్తానికి తెలిసింది.మీతో కరచాలనం చేసేందుకు మేము సిద్ధంగా లేమని స్పష్టంగా అర్థమైంది కదా!.. మరి ఇంకెందుకు కరచాలనం కావాలంటూ పట్టుబడుతున్నారు? ఈ విషయంపై ఫిర్యాదు చేయడం ద్వారా తమను తామే మరింతగా కించపరుచుకున్నట్లు అయింది. అందుకే మ్యాచ్ ఆడారుఇలా కంప్లైంట్ చేయడం ద్వారా తమకు పరిణతి లేదని వారే చెప్పినట్లుగా ఉంది. క్రీడా విధానానికి అనుగుణంగానే మనం ఆ మ్యాచ్ ఆడాము.అంతేగానీ.. వాళ్లు మన నుంచి ఇంతకంటే ఎక్కువగా ఆశించడం తప్పే అవుతుంది. ఎందుకంటే మీరంటే మాకు ఇష్టం లేదు’’ అంటూ అతుల్ వాసన్ వార్తా సంస్థ ANIతో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్? -
'షేక్ హ్యాండ్’ వివాదంలో బిగ్ ట్విస్ట్.. అతడి తప్పేమీ లేదు?
ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అనంతరం ‘నో-షేక్ హ్యాండ్’ వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిగా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత రాజుకుంది.పాకిస్తాన్ జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదనే తమ నిర్ణయానికి భారత్ టాస్ నుంచి ఆట ముగిసే వరకు కట్టుబడి ఉంది. టాస్ సందర్భంగా ఆండీ పైక్రాప్ట్.. భారత సారధి సూర్యకుమార్ దగ్గరికి షేక్ హ్యాండ్ కోసం వెళ్లవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో చెప్పాడు.ఇక్కడ నుంచే ఈ వివాదం మొదలైంది. దీంతో మ్యాచ్ రిఫరీ క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని వెంటనే అతడిని ఆసియాకప్ నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది.అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు వరకు ఇండియన్ టీమ్ మెనెజ్మెంట్ సూచన మేరకే పై క్రాప్ట్.. నో షేక్ హ్యాండ్ కోసం అఘాకు చెప్పాడని అంతా అనుకున్నారు. కానీ టైమ్స్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. పీసీబీ ఛీఫ్ మొహ్సిన్ నఖ్వీ హెడ్గా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచనల మేరకే పై క్రాప్ట్ నో షేక్ హ్యాండ్ గురించి సల్మాన్ అఘాకు తెలియజేశాడంట."హ్యాండ్ షేక్ వివాదంతో ఐసీసీకి సంబంధం ఏంటి? మ్యాచ్ అధికారులను నియమించడంతో ఐసీసీ పాత్ర ముగిస్తోంది. ఆ తర్వాత అంతా ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏసీసీ నుంచి ఒకరు పైక్రాఫ్ట్తో మాట్లాడారు.దాని ఫలితమే టాస్ వద్ద మనం చూశాము. పైక్రాప్ట్తో ఎవరు మట్లాడారు..? దేని గురించి చర్చించారో తెలుసుకోవాల్సి బాధ్యత ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీపై ఉంది. అంతే తప్ప ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తూ ఐసీసీ వైపు వేలు చూపిస్తే ఫలితం ఉండదు అని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి.చదవండి: సూర్య గ్రేట్.. మా ఐన్స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్ -
మా ఐన్స్టీన్ మాత్రం తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు: షోయబ్ అక్తర్
ఆసియాకప్-2025లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్లో దుమ్ములేపిన టీమిండియా దాయాది పాక్ను చావుదెబ్బ కొట్టింది. అయితే భారత్ చేతిలో ఓటమిని పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.అంతేకాకుండా మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. ఒకవైపు ఓటమి, మరోవైపు భారత్ చేసిన పనికి పాక్ మాజీ ఆటగాళ్లు ఘోర అవమానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాపై ఆ జట్టు మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ విమర్శల వర్షం కురిపించాడు. సల్మాన్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని అక్తర్ తప్పుబట్టాడు."టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పిచ్ రిపోర్ట్ మొత్తం చెప్పాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉండే అవకాశముందని, పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని అతడు అంచనా వేశాడు. మా బ్యాటింగ్ లైనప్ చాలా డెప్త్గా ఉంది.మేం మొదట బౌలింగే చేయాలనుకున్నాం అని సూర్య స్పష్టంగా చెప్పాడు. కానీ మా ఐన్స్టీన్ (సల్మాన్ అలీ ఆఘా) మాత్రం పిచ్ గురించి ఏమీ తెలుసుకోకుండానే మేం మొదట బ్యాటింగ్ చేస్తాం అన్నాడు. అందుకు తగ్గ మూల్యం పాక్ చెల్లించుకుందని" అక్తర్ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.అదేవిధంగా భారత్ ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వడంపై కూడా అక్తర్ స్పందించాడు. "నాకు మాటలు రావడం లేదు. చాలా బాధగా ఉంది. గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు. కానీ మీరు క్రికెట్ మ్యాచ్ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము. మేము ఈ నో షేక్ హ్యాండ్ చర్య గురించి మాట్లాడొచ్చు. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మరచిపోయి ముందుకు సాగిపోవాలి" అని అక్తర్ అన్నాడు.చదవండి: పాకిస్తాన్తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ -
పాకిస్తాన్తో ఆడితే తప్పు కాదా? షేక్ హ్యాండ్ ఇస్తేనే తప్పా?: మనోజ్ తివారీ
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ జట్టుతో సంప్రదాయ కరచాలనాన్ని టీమిండియా ఆటగాళ్లు తిరష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఖండాంతర టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు మధ్య పోరు జరిగింది. అయితే ఈ మ్యాచ్ టాస్ దగ్గర నుంచి ఆట ముగిసే వరకు భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో అంటిముట్టనట్టు ఉన్నారు.తొలుత టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక కూడా కరచాలనం చేసేందుకు భారత జట్టు ఇష్టపడలేదు. దీంతో భారత జట్టు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.కానీ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాత్రం టీమిండియా మెనెజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. పాకిస్తాన్తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు, షేక్ హ్యాండ్ ఇస్తే తప్పు ఏముందని తివారీ అన్నాడు. అయితే పాకిస్తాన్ మ్యాచ్తో భారత్ బహిష్కరించాలని తివారీ ముందే నుంచే తన వాదన వినిపిస్తూ వస్తున్నాడు."నేను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్తో ఆసియాకప్ మొత్తాన్ని బాయ్కట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే. క్రీడలకు ఇచ్చిన విలువ జీవితాలకు ఇవ్వడం లేదు. ఇది నాకు నచ్చడం లేదు. మనం మానవ జీవితాలను క్రీడలతో పోల్చడం సరి కాదు" అని పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు తివారీ స్టెట్మెంట్ ఇచ్చాడు.ఇప్పుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ను తిరష్కరించడం సరైన నిర్ణయం కాదు. మీరు పాకిస్తాన్తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు.. హ్యాండ్ షేక్ చేస్తే తప్పు ఏముంది. పాక్తో మ్యాచ్ను బహిష్కరించి మీరు ఏది చెప్పినా ప్రజులు నమ్మేవారు.ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్యకుమార్ యాదవ్.. పాకిస్తాన్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వీడియోను నేను చూశాను. మరి అప్పుడు ఎలా కరచాలనం చేశారు. ఆ సమయంలో మీకు తప్పు అన్పించలేదా? అంటే ఇప్పుడు విమర్శకుల నుంచి తప్పించుకోవడం కోసం నో హ్యాండ్ షేక్ నిర్ణయం తీసుకున్నారా? ముందే వారి కెప్టెన్, చైర్మెన్కు హ్యాండ్ షేక్ ఇచ్చి ఇప్పుడు మ్యాచ్లో తిరష్కరించి ఏమి సాధించారో నాకు ఆర్ధం కావడం లేదు. విమర్శకుల నుంచి తామును తాము రక్షించుకోవడానికే ఈ విజయాన్ని పహల్గామ్ బాధితులకు, భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు" అని ఇన్సైడ్ స్పోర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తివారీ పేర్కొన్నాడు.చదవండి: Asia Cup Handshake Controversy: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్? -
సూపర్-4కు అర్హత సాధించిన భారత్.. పాకిస్తాన్ మరి?
ఆసియాకప్ 2025లో గ్రూపు-ఎ నుంచి భారత క్రికెట్ జట్టు సూపర్-4కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ గ్రూపు-ఎలో భాగంగా సోమవారం అబుదాబి వేదికగా యూఏఈ, ఒమన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఒమన్ను 42 పరుగుల తేడాతో యూఏఈ చిత్తు చేసింది.దీంతో ఆడిన మూడు మ్యాచ్లలోనూ ఓటమి పాలైన ఒమన్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. ఇదే సమయంలో వరుసగా రెండు మ్యాచ్లలో గెలిచి టేబుల్ టాపర్గా కొనసాగుతున్న సూపర్ ఫోర్కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది.రెండో జట్టు ఏది?ఇక గ్రూపు-ఎ నుంచి సూపర్ ఫోర్ రౌండ్కు అర్హత సాధించేందుకు పాకిస్తాన్, యూఏఈ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో భారత్, పాకిస్తాన్, యూఏఈ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. సెప్టెంబర్ 17న దుబాయ్ వేదికగా యూఏఈ-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు భారత్తో పాటు సూపర్-4లో అడుగు పెడుతోంది. బుధవారం జరిగే మ్యాచ్లో యూఏఈను ఓడించడం పాక్కు అంత సులువు కాదు.ఈ టోర్నీకి ముందు జరిగిన ట్రైసిరీస్లో కూడా పాక్కు యూఏఈ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు ఆసియాకప్లోనూ అదే పట్టుదలతో పాక్ను ఢీకొట్టేందుకు ఆతిథ్య యూఏఈ సిద్దమైంది. పాకిస్తాన్ ఎప్పుడూ ఎలా ఆడుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్ జట్టు జింబాబ్వే వంటి పసికూన చేతిలో కూడా ఓడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఎవరూ సూపర్-4కు వస్తారన్నది ముందే అంచనా వేయడం కష్టమనే చెప్పాలి. మరోవైపు భారత ఆటగాళ్లు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్తాన్ ఘోర అవమానంగా ఫీల్ అవుతోంది. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బెదరిస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే యూఏఈ సూపర్-4కు ఆర్హత సాధిస్తోంది.చదవండి: Asia cup 2025: హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్? -
సూర్య బర్త్డే గిఫ్ట్ అదిరిపోయిందిగా.. దేవిషాతో కలిసి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
హ్యాండ్ షేక్ వివాదం.. పాకిస్తాన్కు ఐసీసీ షాక్?
ఆసియాకప్-2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ప్లేయర్లు కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పెహల్గమ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడటంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలోనే బీసీసీఐ సూచన మేరకు నో హ్యాండ్షేక్ విధానాన్ని భారత్ అనుసరించినట్లు తెలుస్తోంది. ఇందుకు నిరసనగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్కు హాజరకాలేదు. అదేవిధంగా భారత ఆటగాళ్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పాకిస్తాన్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది.ఈ ఘటనపై పీసీబీ ఐసీసీకి,ఏసీసీకి ఫిర్యాదు చేసింది. భారత్, పాక్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను ఆసియాకప్ 2025 నుంచి వెంటనే తొలగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. 'నో హ్యాండ్షేక్' గురుంచి పైక్రాఫ్ట్కు ముందే తెలుసు అని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ టాస్ సందర్బంగా ఈ విషయాన్ని తమ కెప్టెన్కు తెలియజేశాడని, కానీ మ్యాచ్ అనంతరం కూడా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన చెప్పలేదని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఉల్లంఘన జరిగింది. మ్యాచ్ రిఫరీపై చర్య తీసుకోవాలి పాక్ క్రికెట్ ఐసీసీని అభ్యర్దించింది. ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకోపోతే యూఏఈతో జరిగే తమ తదుపరి మ్యాచ్ను బహష్కిరిస్తామని పీసీబీ బెదరింపులకు దిగింది.పీసీబీకి షాక్..?అయితే ఆసియా కప్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుండి ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని పీసీబీ చేసిన అభ్యర్థనను ఐసీసీ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. క్రిక్బజ్ ప్రకారం.. పీసీబీ వాదనతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏకీభవించకపోయినట్లు సమాచారం.ఈ ఘటనతో పైక్రాఫ్ట్కు సంబంధం లేదని పీసీబీకి ఐసీసీ తెలియజేసినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్ షేక్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్లో లేదు అని ఐసీసీ ప్రతినిథులు పీసీబీ చీఫ్కు మెయిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఐసీసీ అధికారికంగా స్పందించాల్సిన అవసరముంది.చదవండి: PKL 12: ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. -
Asia Cup 2025: ‘చేయి’ కలపలేదని...
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నిలో భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఫలితం ఏకపక్షంగా ముగిసింది. చెత్తగా ఆడిన పాకిస్తాన్ తమ ఆటతీరును విశ్లేషించు కోవాల్సిందిపోయి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదనే అంశంపై వివాదాన్ని రాజేస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) దీనిపైనే దృష్టి పెట్టినట్లుంది. ఫిర్యాదులు, చర్యలు చేపట్టాలంటూ తెగ హడావుడి చేస్తోంది. కానీ కరచాలనం తిరస్కరణ కొత్తదేమీ కాదు. టెన్నిస్లో, ఫుట్బాల్లోనూ ఉద్రిక్తతలు, రాజకీయ వైరం కారణంగా ఆయా దేశాలకు చెందిన ప్లేయర్లు ఎన్నోసార్లు ‘షేక్ హ్యాండ్’ ఇచ్చుకోలేదు. దీనిపై టెన్నిస్ ఇంటిగ్రిటీ గానీ, ఫుట్బాల్ సమాఖ్య (ఫిపా) గానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పీసీబీ మాత్రం నానా యాగీ చేస్తోంది. మ్యాచ్ రిఫరీని తొలగించండి మ్యాచ్ ముగిసిన తర్వాత తమ జట్టు ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు పరస్పర కరచాలనం తిరస్కరించడంపై పీసీబీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఆదివారం నాటి లీగ్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన అండీ పైక్రాఫ్ట్ను తక్షణమే తొలగించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి ఫిర్యాదు చేసింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ఏసీసీ చీఫ్గా పీసీబీ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ఉంటే, ఐసీసీ చీఫ్గా భారత్కు చెందిన జై షా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై ఎవరెలా స్పందిస్తారోనన్నది, ఎలా ముగింపు పలుకుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. ‘మ్యాచ్ రిఫరీపై ఐసీసీకి ఫిర్యాదు చేశాం. ఐసీసీ నియమావళి, ఎంసీసీ చట్టాలు, క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ వ్యవహరించారు. దీన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే ఆయన్ని ఆసియా కప్ నుంచి తొలగించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది’ అని ఏసీసీ చీఫ్ కూడా అయిన నఖ్వీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. టాస్ వేసే సమయంలోనే భారత కెపె్టన్ సూర్యకుమార్తో షేక్హ్యాండ్ చేయొద్దని పాక్ కెపె్టన్ సల్మాన్ అగాతో రిఫరీ పైక్రాఫ్ట్ చెప్పారని పీసీబీ పేర్కొంది. టీమ్ షీట్ల మారి్పడి సజావుగా జరగలేదని పాకిస్తన్ జట్టు మేనేజర్ నవిద్ చిమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేశారు. షీమ్ షీట్లను ఇద్దరు కెపె్టన్లు మార్చుకోవడం సహజం. కానీ ఈ సారి టీమ్ షీట్లను కెపె్టన్ల నుంచి రిఫరీ తీసుకున్నారు. తెలుసా... ఆతిథ్య హక్కులు దక్కవు!పాక్తో క్రికెట్ మ్యాచ్లు ఆడొద్దు, ఇకపై జరగొద్దు అని భారత్లో చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కానీ బహుళ జట్లు బరిలో ఉండే ఈవెంట్లలో తప్పుకుంటే ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్ ఆతిథ్య హక్కులు పొందే అవకాశాలు రావు. ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ ఇప్పుడు ఒలింపిక్ చార్టర్లో భాగమైంది. లాస్ ఏంజెలిస్–2028 ఒలింపిక్స్లో నిర్వహణకు సిద్ధమైంది. ఇక భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం పోటీపడాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో పాక్తో ఆడం, మ్యాచ్లను బహిష్కరిస్తామంటే ఆతిథ్య ఆశలు, అవకాశాలు అడుగంటుతాయి.గతంలో... టెన్నిస్లో...ఇప్పుడు ఆసియా కప్ క్రికెట్లో షేక్హ్యాండ్ ఇవ్వకపోవడం వివాదాస్పదం చేస్తున్నారు కానీ... ఇలా జరగడం క్రీడల్లో ఇదేమీ మొదటిసారి కాదు. 2023లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నిలో ఉక్రెయిన్కు చెందిన స్వితోలినా, బెలారస్ ప్లేయర్ విక్టోరియా అజరెంకా మ్యాచ్ అనంతరం షేక్హ్యాండ్ ఇచ్చుకోలేదు. వింబుల్డన్ నిర్వాహక కమిటీ స్వితోలినాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అంశాన్ని అసలు పట్టించుకోనేలేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో బెలారస్ అండగా నిలవడమే ఈ వైఖరికి కారణం కాగా... ఇప్పటికీ కూడా పలువురు ఉక్రెయిన్ ప్లేయర్లతో... బెలారస్, రష్యా ప్లేయర్లు కరచాలనం చేయడం లేదు. అమెరికా, ఇరాన్ దేశాల వైరం కారణంగా ఫుట్బాల్లో ఇరుజట్లు తలపడినపుడు కూడా ఆటగాళ్ల మధ్య షేక్హ్యాండ్స్ కనిపించవు. అదేమీ నిబంధన కాదు... రూల్ బుక్ చూస్కోండి పహల్గాంలో పాక్ ఉగ్రమూకల ఊచకోతకు గురైన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు పాకిస్తానీ క్రికెటర్లతో పరస్పరం చేయి కలపకూడదని జట్టు మేనేజ్మెంట్ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఇది కోచ్ గంభీర్దో లేదంటే కెపె్టన్ సూర్యకుమార్ నిర్ణయం కానేకాదని జట్టు వర్గాలు స్పష్టం చేశాయి. దాయాది క్రికెటర్ల షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమర్థించుకుంది. ‘ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వాలనే నిబంధనేది రూల్ బుక్లో లేదు. ఇది పూర్తిగా గుడ్విల్తో ముడిపడిన స్నేహపూర్వక అంశమే! అంతేకానీ చట్టం అయితే కాదు. కాబట్టి కచ్చితంగా షేక్హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు’ అని బోర్డు సీనియర్ అధికారి ఒకరు స్పష్టత ఇచ్చారు. -
Asia Cup 2025: బోణీ కొట్టిన యూఏఈ
ఆసియా కప్-2025లొ ఆతిథ్య యూఏఈ బోణీ కొట్టింది. ఇవాల్టి సాయంత్రం మ్యాచ్లో ఒమన్పై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచి మూడో స్థానానికి ఎగబాకింది. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.పూర్తి వివరాల్లో వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఓపెనర్లు ముహమ్మద్ వసీం (54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు), అలీషాన్ షరాఫు (38 బంతుల్లో 51; 7 ఫోర్లు, సిక్స్) అర్ద సెంచరీతో రాణించడంతో మంచి స్కోర్ చేసింది. ఆరంభంలో ధాటిగా ఆడి 200 స్కోర్ దిశగా పయనించిన యూఏఈ.. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఆసిఫ్ ఖాన్ (2), వికెట్ కీపర్ రాహుల్ చోప్రా (0) నిరాశపర్చగా.. ముహమ్మద్ జోహైబ్ (21), హర్షిత్ కౌశిక్ (19 నాటౌట్) తేలికపాటి మెరుపులు మెరిపించారు. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది 2, హస్నైన్ షా, సమయ్ శ్రీవాత్సవ తలో వికెట్ తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఆ దశలోనే మ్యాచ్పై ఆశలు వదులుకుంది. ఆర్యన్ బిస్త్ (24), వినాయక్ శుక్లా (20), రామనంది (13) కొద్ది సేపు ఓటమిని వాయిదా వేయగలిగారు. 18.4 ఓవర్లలో ఆ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. జునైద్ సిద్దిఖీ 4 వికెట్లు తీసి ఒమన్ను దెబ్బకొట్టాడు. హైదర్ అలీ, ముహమ్మద్ జవాదుల్లా తలో 2, రోహిద్ ఖాన్ ఓ వికెట్ తీశారు. యూఏఈ తమ చివరి గ్రూప్ మ్యాచ్లో పాకిస్తాన్తో (సెప్టెంబర్ 17) తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆ జట్టుకు సూపర్ 4 అవకాశాలు ఉంటాయి.