
సాక్షి, తాడేపల్లి: ఆసియా కప్ ఫైనల్ (Aisa Cup Final 2025)లో అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) అభినందనలు తెలిపారు. పాకిస్తాన్పై విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై అద్వితీయ విజయం సాధించిన మన క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు. మీ అసాధారణ నైపుణ్యం, అంకితభావం.. జట్టు కృషి మొత్తం దేశాన్ని గర్వపడేలా చేశాయి. ఫైనల్లో కీలక ప్రదర్శన, సీరిస్లో అద్భుత ప్రతిభ కనబరించిన తెలుగు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు(Tilak Varma) ప్రత్యేక అభినందనలు. వర్మ ప్రదర్శన నిజంగా ప్రశంసనీయం’ అని కొనియాడారు.
Hearty congratulations to our cricket team on their outstanding victory in the Asia Cup 2025 final against Pakistan! Your exceptional skill, dedication, and teamwork have made the entire nation proud.
A special shoutout to our very own Telugu star, @TilakV9, for his crucial… pic.twitter.com/GWexoLzkSt— YS Jagan Mohan Reddy (@ysjagan) September 29, 2025