
14 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 118/3
పరుగు వ్యవధిలో రెండు వికెట్లు (సైమ్ అయూబ్ (14), మొహమ్మద్ హరీస్ (0)) కోల్పోవడంతతో పాక్ స్కోర్ నెమ్మదించింది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 118/3గా ఉంది. ఫకర్ జమాన్ (38), సల్మాన్ అఘా (3) క్రీజ్లో ఉన్నారు.
100 పరుగులు పూర్తి చేసుకున్న పాకిస్తాన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 11.2 ఓవర్లలోనే 100 పరుగులు (వికెట్ నష్టానికి) పూర్తి చేసుకుంది. 12 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 107/1గా ఉంది. ఫకర్ జమాన్ (33), సైమ్ అయూబ్ (13) క్రీజ్లో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పాక్
9.4వ ఓవర్- 84 పరుగుల వద్ద పాక్ తొలి వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ అనంతరం సాహిబ్జాదా ఫర్హాన్ (57) ఔటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ పెవిలియన్కు చేరాడు.
ధాటిగా ఆడుతున్న పాక్ ఓపెనర్లు.. ఫర్హాన్ హాఫ్ సెంచరీ
తొలుత నిదానంగా ఆడిన పాక్ ఓపెనర్లు గేర్ మార్చారు. సాహిబ్జాదా ఫర్హాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓపెనర్ ఫకర్ జమాన్ 18 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 22 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 9 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 77/0గా ఉంది.
జాగ్రత్తగా ఆడుతున్న పాకిస్తాన్ ఓపెనర్లు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ ఆచితూచి ఆడుతుంది. ఓపెనర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (24), ఫకర్ జమాన్ (6) చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. 4 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 32/0గా ఉంది.
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సేవలను కోల్పోయింది. గాయం కారణంగా అతను ఈ మ్యాచ్లో ఆడటం లేదు. అతని స్థానంలో రింకూ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. గత మ్యాచ్ మిస్ అయిన శివమ్ దూబే, బుమ్రా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
తుది జట్లు..
పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి