breaking news
Peddapalli
-
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026
ఎన్టీపీసీ ఈడీ చందన్కుమార్ సమంత ఆధ్వర్యంలో..పెద్దపల్లి : పొలంలో వేడుకలు పెద్దపల్లిరూరల్ : మూలసాలలో కేక్ కట్ చేస్తున్న సర్పంచ్ శ్వేత గోదావరిఖని: నగరంలో మనాలీఠాగూర్..గోదావరిఖని/రామగుండం: జిల్లావాసులు బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకూ నూతన సంవత్సరం–2026 వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. స్వచ్ఛంద, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, యువతీయువకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు కేక్లు కట్చేసి మిఠాయిలు పంచిపెట్టారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వేకువజాము నుంచే పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.కేక్ కట్చేసి.. మిఠాయిలు పంచిపెట్టి.. -
రామగుండం ఓటర్లు1.82 లక్షల మంది
కోల్సిటీ(రామగుండం): రామగుండం బల్దియా క మిషనర్ అరుణశ్రీ గురువారం ఓటరు ముసాయి దా జాబితా ప్రదర్శించారు. నగరంలోని 60 డివిజ న్ల జాబితాను కార్యాలయంలో ప్రదర్శించారు. నగరంలోని 60 డివిజన్లలో 1,82,976 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించినట్లు కమిషనర్ తెలిపారు. 262కుపైగా పోలింగ్ కేంద్రాలు? ఓటర్లను పోలింగ్కేంద్రాల వారీగా విభజిస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800కు ఓటర్లకు మించకుండా కేటాయించేలా కసరత్తు చేస్తున్నారు. ఓటర్ల సంఖ్య ఎక్కువైతే మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పా టు చేయడానికి లెక్కింపు చేస్తున్నారు. ఓక్కో డివిజన్లో సుమారు నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేసే అవకాశాలుంటాయని తెలుస్తోంది. ఈ లె క్కన నగరంలో సుమారు 262 పోలింగ్ కేంద్రాల వ రకు ఉండవచ్చని అంచనా. వీటిపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈనెల 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిపే సమావేశంలో ప్రకటిస్తామని కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏ సీపీ) శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్వో ఆంజనేయులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
● జిల్లాలో ‘అరైవ్ .. అలైవ్’ ప్రారంభం ● రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా గోదావరిఖని: రోడ్డు ప్రమాదాల నియంత్రణ ల క్ష్యంగా అరైవ్.. అలైవ్ కార్యక్రమం చేపట్టామని రా మగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తె లిపారు. రోడ్డు భద్రతపై రూపొందించిన అరైవ్ .. అలైవ్ ప్రచార పోస్టర్ను ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్తో కలిసి తన కార్యాలయంలో గురువారం సీపీ ప్రారంభించారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు రోడ్డు భద్రత మాసోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రై వింగ్, సిగ్న ల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలు రో డ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నా యని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు.. యువతకు అవగాహన.. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, అతివేగం స రికాదన సీపీ అన్నారు. మైనర్ డ్రైవింగ్ చేయరాదనే విషయాలను స్పష్టంగా తెలియజేస్తామన్నారు. రా త్రివేళ రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చలికాలంలో దట్టమైన పొగమంచుతో రహదారులు, ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ స్పష్టంగా కనిపించవని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అతివేగం, ఓవర్టేక్ చేయకుండా జాగ్రత్త వహించాలని, సూచించారు. తప్పనిసరిగా లో బీమ్ హెడ్లైట్లనే ఉపయోగించాలని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. నిర్దిష్ట వేగంతో వాహనాలు నడపడం ద్వారా స్కీడింగ్ను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో గోదావరిఖని, పెద్దపల్లి ట్రాఫిక్ సీఐలు రాజేశ్వరరావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశావహుల సందడి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో 15 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలు కాగా.. మిగిలినవి పురపాలికలు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు కసరత్తు ప్రారంభించడంతో మున్సిపాలిటీలలో ఎన్నికల జోష్ కనిపిస్తోంది. ఆశావహుల సందడితో పట్టణాలు, నగరాల్లో రాజకీయ సందడి నెలకొంది. నిన్నటివరకు పల్లెపోరు కారణంగా పట్టణాల్లో మౌనంగా ఉన్న రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు రంగంలోకి దిగారు. బల్దియాల పరిధిలో ప్లెక్సీలు వెలుస్తుండటంతో ఎన్నికల హడావుడి మొదలైనట్లే అనిపిస్తోంది. మున్సిపాలిటీల్లోని ప్రతివార్డు, డివిజన్లోనూ తానే అభ్యర్థిని అన్నట్టు ఆశావహుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా శుభాకాంక్షల బ్యానర్లు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఏకాదశి, కొత్త ఏడాది, సంక్రాంతి వంటి పండుగలను వేదికగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. శుభాకాంక్షలతో పాటు పరిచయం పెంచుకోవడం అనే వ్యూహంతో ఇంటింటికీ తిరుగుతూ నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు పంచుతూ.. తమ ఉనికిని గుర్తు చేస్తున్నారు. ఇది కేవలం పండుగల శుభాకాంక్షలు మాత్రమే కాకుండా.. రాబోయే ఎన్నికలకు రిహార్సల్లా మారింది. పార్టీలకు ప్రతిష్టాత్మకం ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆటుపోట్లను చవిచూసిన పార్టీలు.. మున్సిపల్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బల్దియాల్లో పాగా వేసేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే పక్కాప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి జోష్ మీదున్న అధికార కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికలపైనా ధీమాగా ఉంది. గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీల్లో తామేం తక్కువ కాదన్నట్లు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక బీజేపీ పంచాయతీ ఎన్నికలో ఊహించిన దానికన్నా ఎక్కువ బలం పెంచుకుని మున్సిపాలిటీలపై కన్నేసింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆశావహుల గల్లీ బాట ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించి.. పోటీ చేసే ఆశావహులు గల్లీల బాట పట్టారు. ఉదయం ఆలయ దర్శనాలు.. మధ్యాహ్నం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం.. సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు. ఇదే రోజువారీ షెడ్యూల్గా మారింది. ప్రజల సమస్యలు వింటూ.. చిన్నచిన్న హామీలు ఇస్తూ తమపై సానుకూల అభిప్రాయం ఏర్పడేలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. పార్టీ పెద్దల కంట్లో పడేందుకు చేస్తున్న తాపత్రయం మరోస్థాయికి చేరుతోంది. జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే దానిపై ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ప్రజల్లో బలం చూపించాలి. మరోవైపు పార్టీ హైకమాండ్కు నమ్మకం కలిగించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించేందుకు వారు విశేషంగా శ్రమిస్తున్నారు. కొందరు ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో ముందుండగా.. మరికొందరు సేవా కార్యక్రమాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.బల్దియా వార్డులు జనాభా ఎస్టీ ఎస్సీ కరీంనగర్ 66 3,28,870 5,999 36,902 (కార్పొరేషన్) రామగుండం 60 2,37,636 4,278 50,744 (కార్పొరేషన్) ధర్మపురి 15 17,423 200 2,079 జగిత్యాల 50 83,168 547 5,229 కోరుట్ల 33 69,479 342 6,467 మెట్పల్లి 26 54,042 504 5,819 రాయికల్ 12 15,308 179 1,766 చొప్పదండి 14 16,459 205 3,062 హుజూరాబాద్ 30 34,555 309 6,326 జమ్మికుంట 30 39,476 286 7,623 మంథని 13 18,282 208 2,513 పెద్దపల్లి 36 50,762 312 4,527 సుల్తానాబాద్ 15 19,772 309 2,561 సిరిసిల్ల 39 92,091 104 6,346 వేములవాడ 28 43,620 453 6,545ప్రభుత్వపరంగా ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా కీలకంగా మారాయి. కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతోపాటు జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని పురపాలికల ఎన్నికలపై ప్రజల అభిప్రాయం, స్థానిక సమస్యలు, అధికార పార్టీపై ఉన్న సంతృప్తి.. లేదా అసంతృప్తి వంటి అంశాలను సేకరించేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. తొలి విడత సర్వే పూర్తయ్యిందని, రెండో విడతకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రూపకల్పన చేయనున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఆయా పార్టీలు ప్రైవేటు సర్వేలు చేయిస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలతో వార్డులు, డివిజన్లలో సర్వేలు చురుకుగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. రాజకీయంగా మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆశావహుల సందడి, పార్టీ వ్యూహాలు, ప్రభుత్వ సర్వేలు.. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల సమరం మొదలైనట్టే అనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటరు ముసాయిదా విడుదల
● పుర పోరుకు అడుగులు ● 10న తుది జాబితా ప్రకటన సాక్షి, పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికల్లో పై‘చేయి’ సాధించడంతో రాష్ట్రప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. దీనికి అనుగుణంగానే వార్డుల వారీగా ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో గురువారం ఓటరు ముసాయిదా జాబితా ప్రకటించారు. ఈనెల 4వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించి, 5న మున్సిపల్, 6న జిల్లాస్థాయిలో రాజకీయపార్టీలు, పోలింగ్ సిబ్బందితో సమావేశం కానున్నారు. ఓటరు జాబితా, వార్డులు, పోలింగ్ కేంద్రాల ప్రక్రి య పూర్తిగానే ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. పాలకవర్గాల గడువు ముగిసి రామగుండం కార్పొరేషన్ సహా పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలకు 2020 జనవరి 22న ఎన్నికలు జరగ్గా, వాటి ఫలితాలు అదే నెల వె లువడ్డాయి. అదేనెల 28న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. గతేడాది జనవరి 27తోనే పాలకవ ర్గాల కాలపరిమితి ముగిసింది. అప్పటి నుంచి బల్దియాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. మారనున్న రిజర్వేషన్లు 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన మున్సిపల్ చట్టం తీసుకొచ్చి పదేళ్లకు ఒకేరిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు మారడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ఉంటాయనే దానిపై స్పష్టత రావడంలేదు. ఈ సారి సీపెక్ సర్వే ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయా? లేక వార్డు సభల ద్వారా చేస్తారా? అనేది ఎన్నికల కమిషన్ నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రస్తుత రిజర్వేషన్లలో మహిళ, జనరల్ రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో మారే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అక్టోబర్ జాబితా ఆధారంగానే ఎన్నికల సంఘం 2023 అక్టోబర్ 31న ప్రకటించిన ఓటరు జాబితా ఆధారంగానే వార్డుల వారీగా ఓట రు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు వచ్చా యి. అధికారులు ఇప్పటికే వార్డులు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి ముసాయి దా జాబితా ప్రకటించారు. అభ్యంతరాల స్వీకరణ కు 4వ తేదీ వరకు గడువు విధించారు. 5న మున్సిపల్ స్థాయిలో వివిధ పార్టీలతో కమిషనర్లు సమావేశాలు నిర్వహించి 10న తుది జాబితా ఇస్తారు. -
ఆలయానికి స్థల పరిశీలన
మంథని: టీటీడీ ఆలయ నిర్మాణ ప్రతిపాదనల కోసం కలెక్టర్ కోయ శ్రీహర్ష పట్టణంలో గురువారం పర్యటించారు. లక్కేపూర్ శివానిగూడెంగుట్ట ప్రాంతాన్ని సందర్శించారు. కలెక్టర్ మా ట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో దేవాలయం, కల్యాణ మండపం నిర్మించేందుకు అనువైన స్థలాలు పరిశీలించామ న్నారు. ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ ఆరిఫొద్దీన్ పాల్గొన్నారు. సీఎంను కలిసిన ఎమ్మెల్యే గోదావరిఖని: రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గురువారం సీఎం రేవంత్రెడ్డిని హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశా రు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి శ్రీధర్బాబు ను కలిసి న్యూఇయర్ గ్రీటింగ్స్ అందించారు. సావిత్రీబాయికి నివాళి ధర్మారం(ధర్మపురి): సంఘ సేవకురాలు సావిత్రీబాయి పూలే మహిళా సాధికారతకు ఎంతో కృషి చేశారని కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సా ధన సమిఇ జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వా మి అన్నారు. స్థానిక బుద్ధ ఫంక్షన్హాల్లో గురువారం బహుజన నాయకులతో సమావేశం ఏ ర్పాటు చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్వామి మాట్లాడు తూ, మహిళలు విద్యను అభ్యసించి అన్నిరంగాల్లో రాణించేందుకు ఆమె చేసిన కృషి ఫలతమేనన్నారు. నాయకులు కాంపెల్లి పోచయ్య, తోడేటి రాజలింగయ్య, సుంచు మల్లేసం, చొ ప్పదండి మల్లేశం, నేరువట్ల రాజయ్య, నూనె వెంకటి, మామిడిపల్లి సంతోష్, స్వామి, వినయ్, నేరువట్ల మధు, భూక్య తిరుపతినాయక్, అజ్మీర రాజ్యనాయక్, రాజేశం పాల్గొన్నారు. షూటర్కు సన్మానం కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మీర్జంపేట గ్రా మానికి చెందిన షూటర్ ఎలగందులసాయి ప్ర ణవిని స్థానిక ఏఎంసీ కార్యాలయంలో గురువారం సన్మానించారు. తమిళనాడు ఈరోడ్లో డిసెంబర్ 27, 28వ తేదీల్లో ఇర్వహించిన ‘ఫస్ట్ ఓఫెన్ నేషనల్ మల్టీ టార్గెట్ బెంచ్ రెస్ట్ షూటింగ్ అండర్–17’లో ఆమె మూడోస్థానం సాధించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొ న్న వారిలో మనరాష్ట్రం నుంచి సాయిప్రణవి పాల్గొని కాంస్య పతకం సాధించడంతో ఆమె ను సన్మానించి, తల్లిదండ్రులు మాధురి –శేఖర్ను అభినందిచారు. మాజీ ఎంపీపీ సార య్యగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్చైర్మన్ సబ్బని రాజమల్లు, సర్పంచులు పి.శైలజ, ఆరెల్లి రమేశ్, బంగారి రమేశ్, జిన్న రాంచంద్రారెడ్డి, గాజుల మోహన్, ఉప సర్పంచ్ గోలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం రామగుండం: ఎన్టీపీసీ ఆర్యవైశ్య భవన్లో గు రువారం ఆర్యవైశ్య మహిళా సంఘం కార్యవర్గాన్ని అధ్యక్షుడు రావికంటి వరప్రసాద్ ప్రకటించారు. సంఘం అధ్యక్షురాలుగా పప్పుల ప్రియాంక, ప్రధాన కార్యదర్శిగా అల్లాడి కళావతి, కోశాధికారిగా రావికంటి హరిత, గౌరవ అ ధ్యక్షురాలుగా రావికంటి అంజలి, ఉపాధ్యక్షు రాలుగా పైడ అపూర్వ, అదనపు కార్యదర్శిగా నార్ల హరిప్రియను ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు రావికంటి ఈశ్వర్, రాచర్ల చంద్రశేఖర్, పైడ సాయికుమార్, కాసనగొట్టు నాగరాజు పాల్గొన్నారు. ‘ధూపదీపం’లోకి మరో 24 ఆలయాలు మంథని/కమాన్పూర్: మంథని నియోజకవర్గంలోని పెద్దపల్లి, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 24 ఆలయాలు ధూపదీప నైవేద్యం పథకం పరిధిలోకి చేర్చినట్లు మంత్రి శ్రీధర్బాబు గురువారం తెలిపారు. మంథని, కమాన్పూర్, రామగిరితోపాటు తూర్పు మండలాల్లోని పలు ఆలయాలకు నిధులు మంజూరు చేశారు. వాటిని త్వరలో సందర్శించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
16 పోస్టులు.. 1726 దరఖాస్తులు
● కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు డిమాండ్ ● ఆశ్రమాలు, ఓల్డేజ్ హోమ్లో ఖాళీల భర్తీకి చర్యలుపెద్దపలి: జిల్లాలోని వయోవృద్ధులకు ఆశ్రయం కల్పించడం, వారి సంక్షేమానికి కృషి చేయడం కోసం ఏర్పాటు చేసిన ఓల్డ్ ఏజ్ హోమ్, దివ్యాంగ విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన డిస్ట్రిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్లో వివిధ రకాల ఉద్యోగాల కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీచేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిన ఎంపిక చేస్తామని ప్రకటించారు. గతేడాది డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులు తక్కువ, దరఖాస్తులు అధికంగా ఉండడంతో స్క్రీనింగ్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సుల్తానాబాద్లో ఓల్డ్ ఏజ్ హోమ్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు వివిధ ఉద్యోగాల కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. సుల్తానాబాద్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వయోవృద్ధుల కేంద్రంలో వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. దీంతో అవుట్ సోర్సింగ్ పద్ధతిన భర్తీచేసే 16 పోస్టులకు 1,726 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగాల వివరాలు.. సంబంధిత అంశాల్లో అర్హలతో వివిధ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఇందులో సోషల్ వర్కర్, ఏఎన్ఎం, జీఎన్ఎం, కేస్ వర్కర్, పోస్ట్ టైటిల్, సూపరింటెండెంట్, పవర్ ఆఫ్ మెడికల్ స్టాఫ్, స్టోర్ కీపర్ కం అకౌంటెంట్, జెండర్ స్పెషలిస్ట్, హోమ్ కో ఆర్డినేటర్, విజిట్ డాక్టర్, సోషల్ వర్కర్ కం అసిస్టెంట్ హోమ్ కో ఆర్డినేటర్, యోగా థెరపిస్ట్ ఉద్యోగాలు భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పో స్టు ను బట్టి నెలకు రూ.4,000 నుంచి రూ.22,750 వే తనం చెల్లిస్తారు. జిల్లా మహిళా సమాఖ్య ఏజెన్సీ అ ర్హులను ఎంపిక చేస్తుందని అధికారులు తెలిపారు. ఉద్యోగాల ఇప్పిస్తామంటూ.. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఉద్యో గాలు పెట్టిస్తామని రూ.2 లక్షల నుంచి రూ.3లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. డబ్బులు ఇస్తే ఉద్యోగం మీదేనని జిల్లాలోని పలు ప్రాంతాల్లో దళారులు నిరుద్యోగులకు ఆశ చూపుతున్నట్లు తెలిసింది. నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొందరు దళారులు.. అధికార పార్టీతోపాటు అధికారులు సైతం తాము చెప్పినట్టే వింటారని, ఉద్యోగాలు తప్పకుండా వస్తాయని నమ్మబలుకుతూ నిరుద్యోగుల నుంచి సొమ్ము భారీగా వసూలు చేస్తున్నట్లు నిరుద్యోగులు చెబుతున్నారు. -
హ్యాపీగా.. జాలీగా..
గురువారం శ్రీ 1 శ్రీ జనవరి శ్రీ 2026సుల్తానాబాద్లోని గాంధీనగర్లో కేక్కట్ చేస్తున్న కాలనీవాసులుబుధవారం అర్ధరాత్రి దాటాక విద్యుత్ సరఫరా సెకన్లపాటు నిలిచిపోయింది.. ఆ వెంటే బాణసంచా పేలింది.. బెలూన్లు గాల్లో ఎగిరాయి.. వినసొంపైన బాణీలు కూర్చిన పాటలతో డీజేలు దద్దరిల్లాయి.. ఎప్పుడెప్పుడా అని ఎగిరి గంతేసేందుకు సిద్ధంగా ఉన్నకుర్రకారు బిగ్గరగా కేరింతలు కొట్టింది.. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ చిన్నాపెద్ద తేడాలేకుండా శుభాకాంక్షలు పర్వం జోరుగా సాగించింది. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. 2026 సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. అంతకుముందు కేక్లు, మద్యం, ముగ్గులు తదితర సామగ్రి కొనుగోళ్లకు వెళ్లిన వినియోగదారులతో మార్కెట్లు రద్దీగామారాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ముస్తాబవుతున్న మినీమేడారం
గోదావరిఖని: రామగుండం నగర శివారులోని గోదావరి నదీతీరంలో ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం గద్దెల వద్ద చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సీసీరోడ్డు, తోరణం తదితర పనులు చేపట్టారు. జాతర ఆధునికీకరణ కోసం సింగరేణి యాజమాన్యం సుమారు రూ.4కోట్లు, మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం మరికొన్ని నిధులు సమకూర్చాయి. గద్దెల ప్రాంతాన్ని 4 మీటర్ల వరకు ఎత్తుపెంచడం, ఫ్లోరింగ్ చేయడం, ప్రహరీ నిర్మాణం, గ్రిల్స్ ఏర్పాటు చేయడం, సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనుల్లో వేగం పెంచారు. జాతర ప్రాంగణం ముందు సమ్మక్క–సారలమ్మ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో లాగా జాతరలోకి వెళ్లే ఎడమవైపు టికెట్ కౌంట ర్లు, కుడివైపు క్యూలైన్లు నిర్మిస్తున్నారు. భారీ షెడ్డు నిర్మాణం జాతర సమయంతో పాటు ఇతర రోజుల్లో కూడా ఈప్రాంతానికి వచ్చే భక్తులు సేదతీరేందుకు భారీ రేకుల షెడ్డు నిర్మించారు. దాని చుట్టూ గోడల నిర్మాణం శరవేగంగా సాగుతోది. ఒకేలైన్లో అమ్మవారి గద్దెలు.. సమ్మక్క– సారలమ్మ, జంపన్న గద్దెలు ఒకేలైన్లో ఏర్పాటు చేశారు. భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా రెండువైపులా ప్రత్యేకంగా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరఘాట్ ఆధునికీకరణ భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరఘాట్ను ఆధునికీకరిస్తున్నారు. నదిలోకి వెళ్లి స్నానాలు చేసేందుకు మెట్ల మార్గాన్ని మరమ్మతు చేస్తున్నారు. జల్లు స్నానాలు చేసేందుకు వీలుగా సింగరేణి పైపులైన్లు ఏర్పాటు చేస్తోంది. మెట్ల పనులు ఇంకా ప్రారంభించలేదు. పాతికేళ్ల అవసరాలకు అనుగుణంగా నిర్మాణం జాతర సమయంలోనే కాకుండా ఏడాది పాటు భక్తులు వచ్చేలా అన్నిఏర్పాట్లు చేస్తున్నాం. సెలవురోజుల్లో కుటుంబ సమేతంగా వచ్చి ఆహ్లాదంగా గడిపేలా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నాం. మరోపాతికేళ్ల అవసరాలకు అనుగుణంగా సమ్మక్క– సారలమ్మ జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి. – ఎంఎస్ రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం -
కమిషనర్పై చర్య తీసుకోండి
● మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ● కలెక్టర్కు ఫిర్యాదు గోదావరిఖని: ఇష్టారాజ్యంగా కూ ల్చివేతలకు పాల్పడుతున్న రామగుండం మున్సిపల్ కమిషనర్పై చర్య తీసుకోవాలని మాజీఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. బుధవారం కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిసి ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా ఇష్టానుసారంగా దుకాణాల కూల్చివేతలు చేపడుతున్నారని ఫిర్యాదు చేశారు. అక్రమంగా కూల్చివేతలకు పాల్పడుతున్నా ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 43 మైసమ్మ గుడులను కూడా కూల్చివేశారని, అయినా, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, నీరటీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చోరీ కేసులో వ్యక్తికి జైలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మడంలం తారుపల్లి గ్రామానికి చెందిన ఒద్ది ప్రవీణ్రావు కారులోంచి రూ.85 వేలు చోరీచేసిన కేసులో ఖమ్మం అర్బన్ జిల్లా రోటరీనగర్ పోలీస్ కాలనీకి చెందిన గుర్రం కోటేశ్వర్రావుకు నెలల జైలు, రూ.50 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఒద్ది ప్రవీణ్రావు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తదుపరి ఎస్సై ఓంకార్యాదవ్.. నేర పరిశోధన చేసి సుల్తానాబాద్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనల తర్వాత ముద్దాయికి శిక్ష, జరిమానా విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ గణేశ్ తీర్పు చెప్పారు. ఒకేపేజీపై కొత్త క్యాలెండర్ కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మడంలం తారుపల్లి జెడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి విద్యార్థిని ఒజ్జ అక్షిత ఒకేపేజీపై 2026 సంవత్సరపు క్యాలెండర్ రూపొందించి ఔరా అనిపించింది. దీనిపై 12 నెలల తేదీల పట్టిక తయారు చేసింది. సామాన్యంగా క్యాలెండర్ 12 పేజీలు ఉంటుంది. ఉపాధ్యాయుడు కూరపాటి సత్యప్రకాశ్రావు ప్రేరణతో అరుదైన క్యాలెండర్ తయారు చేసినట్లు లక్షిత తెలిపింది. క్యాలెండర్పై ప్రజలను చైతన్య పరిచేలా వివిధ సామాజిక అంశాలతో కూడిన నినాదాలు పొందు పర్చింది. ఆమెను హెచ్ఎం శ్యాంసుందర్రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రశంసించారు. -
25 రోజలుగా నేర్చుకుంటున్న
వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రంలో 25 రోజులుగా కుట్టు నేర్చుకుంటున్న. ఇదివరకు కుట్టుపై కొంత అవగాహన ఉన్నది. ఉదయం బస్సుకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్తున్నా. కేంద్రంలో కుట్టుపై మంచిగా శిక్షణ ఇస్తున్నరు. – తాడబోయిన స్రవంతి, ఆరెంద చదువుకుంటూనే శిక్షణ నేను మంథనిలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న. కుట్టుపై శిక్షణ ఇస్తున్నారంటే రోజూ వచ్చి నేర్చుకుంటున్న. ప్రస్తుతం కళాశాలకు సెలవులు ఉండటంతో మాతోటి విద్యార్థులతో కలిసి వచ్చి నేర్చుకుంటున్నం. భవిష్యత్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్న. – జోడు శాలిని, స్టూడెంట్, ఆరెంద రెండు బ్యాచ్లకు ట్రెయినింగ్ వెంకటాపూర్ కేంద్రంలో రోజూ రెండు బ్యాచ్లకు ఇద్దరం ట్రెయినర్లం మిషన్ కుట్టుపై శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ అనంతరం స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ అధికారుల యూనిఫాం కుట్టే అవకాశం వీరికే కల్పిస్తాం. వీటిద్వారా శిక్షణ పొందిన వారు ఉపాఽధి పొందుతారు. అలాగే ఇంటివద్ద కూడా ఉపాధి మార్గాలు ఎంచుకోవచ్చు. – కుడుదుల రజిత, శిక్షకురాలు, వెంకటాపూర్ -
ఎస్టీపీపీలో ప్రమాదం.. ఆపరేటర్కు గాయాలు
జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని 1200మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ)లో బుధవారం ఉదయం 7గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న పవర్మేక్ కంపెనీకి సబ్ కాంట్రాక్టుగా వ్యవహరిస్తున్న గ్లోబస్ కంపెనీలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన కుడక శ్రీనివాస్ స్విచ్గేర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులకు వచ్చిన శ్రీనివాస్ ఉదయం 6:50సమయంలో యాష్హ్యాండ్లింగ్ ప్లాంటు(ఏహెచ్పీ)లో మాడ్యు ల్ ఆఫ్ చేసి పని చేస్తున్న క్రమంలో దాంట్లో నుంచి ఒక్కసారిగా ఫ్లాష్ అవుట్ అయి మంటలు వచ్చాయి. దీంతో శ్రీనివాస్ ముఖం, కళ్లు, చేతులు కాలిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కార్మికులకు రక్షణ పరికరాలు అందించకుండానే వారితో పని చేయించడంతో శ్రీనివాస్ గాయపడినట్లుగా స్థానిక యూనియన్ నాయకులు వాపోయారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. -
ప్రయాణికుల రద్దీ అధికం.. రైళ్ల సంఖ్య తక్కువ
రామగుండం: మరోవారం రోజుల్లో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించనున్నారు. పట్టణాలు, నగరంలో చదివే విద్యార్థులు, వృత్తిరీత్యా స్వగ్రామానికి దూరంగా ఉంటున్న కుటుంబాలు స్వగ్రామానికి చేరుకోవడం సహజం. కోల్బెల్ట్ నుంచి లక్షలాది మంది ఇలా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. సెలవులకు వచ్చేవారితో కాగజ్నగర్ వైపు నడిచే రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రద్దీ అమాంతం పెరుగుతంది. ఇందుకు అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచకపోవడం విస్మయానికి దారితీస్తోంది. అదనపు రైళ్లు నడిపించాలి.. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్కాగజ్నగర్ మధ్య నడిచే భాగ్యనగర్, ఇంటర్సిటీ, వందేభారత్, తెలంగాణ, కాగజ్నగర్, దాణాపూర్ తదితర రైళ్లకు అదనపు సర్వీసులు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. విజయవాడ నుంచి కోల్బెల్ట్కు సైతం ప్రతీరోజు రెండు ఫెస్టివల్ రైళ్లను నడిపించాలనే డిమాండ్ ఉంది. కోల్బెల్ట్ రూట్లో ఊసేలేని సంక్రాంతి పండుగ ప్రత్యేక రైళ్లు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మల్లాపూర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చిట్టాపూర్–ధర్మారం గ్రామాల మధ్య బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని ఉమ్రి మండలకేంద్రానికి చెందిన నామ్లవర్ బాలాజీ(40) తన కుటుంబంతో బతుకుదెరువు కోసం రాయికల్ మండలం ఇటిక్యాలకు నాలుగేళ్ల క్రితం వలస వచ్చాడు. బట్టలు ఉతుకుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉపాధి కోసం తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చిట్టాపూర్–ధర్మారం గ్రామాల మధ్య రహదారిపై బైక్ ఆదుపుతప్పి కందకంలో పడిపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)ని కలెక్టర్ కో య శ్రీహర్ష బుధవారం ఆకస్మికంగా తనిఖీ చే శారు. క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ సర్జరీ బ్లాక్, ఓ పీ విభాగాలను సందర్శించారు. అధికారుల తో సమావేశమయ్యారు. వైద్యులు సమయపాలన పాటించాలని, పేషెంట్లకు మెరుగైన వై ద్యసేవలు అందించాలని ఆయన ఆదేశించా రు. తమకు ఫిర్యాదులు రాకుండా వైద్యసిబ్బంది సేవలు అందించాలని సూచించారు. ఆస్ప త్రి సూపరింటెండెంట్ దయాళ్సింగ్, ఆర్ఎంవోలు కృపాబాయి, దండె రాజు పాల్గొన్నారు. నిబంధనలు అతిక్రమించొద్దుపెద్దపల్లి: నూతన సంవత్సరం సందర్భంగా జి ల్లావాసులు ప్రశాంత వాతావరణంలో వేడుక లు జరుపుకోవాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ కృష్ణ అ న్నారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు లక్ష్మణ్రావు, మల్లేశ్, శ్రీధర్తో కలిసి బుధవారం జి ల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థాలు తీసుకుని అతివేగంగా వాహనాలు నడపొద్దని, ట్రిబుల్ రైడింగ్ చేయవద్దని సూచించారు. బెల్ట్షాపులు మూసివేయాలని అన్నారు. ప్రతీ జంక్షన్ వద్ద పోలీస్లు ఉంటా రని, పెట్రోలింగ్ పార్టీలు తిరుగుతాయన్నారు. జాతీయ పోటీలకు ఎంపిక ధర్మారం(ధర్మపురి): స్థానిక ఆదర్శ పాఠశాల విద్యార్థి మేరగుతత్తుల యశ్వంత్తేజ అండ ర్– 14లో జాతీయస్థాయి వాలీబాల్ పోటీ ల కు ఎంపికై నట్లు పీఈటీ బైకని కొమురయ్య తె లిపారు. మేడారం గ్రామానికి చెందిన యశ్వంత్తేజ.. ఏడో తరగతి చదువుతున్నాడు. ఈనె ల 5 నుంచి 9వ తేదీ వరకు హిమాచల్ప్రదేశ్ లో జరిగే ఎస్జీఎఫ్ 69వ జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ జట్టు తరఫున యశ్వంత్ పా ల్గొంటాడన్నారు. విద్యార్థిని ప్రిన్సిపాల్ రాజ్కుమార్ బుధవారం అభినందించారు. వ్యాయా మ ఉపాధ్యాయులు కొమురయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అన్నివర్గాలు బాగుండాలి మంథని: కొత్త సంవత్సరంలో అన్నివర్గాలు సుఖసంతోషాలతో ఉండాలని మంథని మాజీఎమ్మెల్యే పుట్ట మధు ఆకాక్షించారు. 2025కు గుడ్బై చెబుతూ, 2026కు ఆహ్వానం పలుకుతూ స్థానిక రాజగృహలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేడుకలు జరుపుకున్నారు. పుట్ట మధు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి తదితరులు పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,468 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,468 ధర పలికింది. కనిష్టంగా రూ.5,222, సగటు రూ.7,188గా ధర నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. బుధవారం 227 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఫేక్ఫోన్కాల్స్కు స్పందించొద్దు పెద్దపల్లిరూరల్: తాను మున్సిపల్ కమిషనర్ కోటేశ్వర్రావును మాట్లాడుతున్నానని, ట్రేడ్స్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలని, ఇందు కో సం ఫోన్పే ద్వారా ఫీజు చెల్లించాలని కొందరు గుర్తుతెలియనివారు వ్యాపారులకు ఫోన్చేస్తున్నారని, ఇలాంటి వాటిని నమ్మొద్దని బల్దియా కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. పన్ను చెల్లించాలంటూ తమ ఆఫీసు నుంచి ఎవరూ ఫోన్కాల్స్ చేయరని, అధికారులు మీవద్దకే వస్తారన్నారు. ఫోన్కాల్స్పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కమిషనర్ వివరించారు. మరోవైపు.. మాజీ ఎంపీపీ డాక్టర్ జయలక్ష్మి పేరిట ఇన్స్ట్రాగామ్లో ఆమె ఫొటోను ఉంచి రూ.15వేలను ఫోన్పే చేయాలని గుర్తుతెలియని వ్యక్తులు పోస్టు చేశారని, ఎవరూ స్పందించొద్దని జయలక్ష్మి కోరారు. -
వృద్ధురాలిపై వీధి కుక్క దాడి
రాయికల్: రాయికల్ పట్టణంలోని మార్కండేయనగర్ కాలనీకి చెందిన వృద్ధురాలు బాలమ్మపై వీధికుక్కలు దాడి చేశాయి. దాడిలో ఆమె కింద పడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళారు. అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పొలంలోనే రైతు మృతికోనరావుపేట(వేములవాడ): పొలం వద్ద ద్విచక్రవాహనంపై వరినారు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం పడడంతో రైతు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్కు చెందిన నేవూరి దేవయ్య(63) పొలం వద్ద నాట్లు వేస్తున్నారు. టీవీఎస్ వాహనంపై వరినారును పెట్టుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలో పడిపోగా అతనిపై వాహనం, నారు పడింది. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టు పక్కల రైతులు గమనించి బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య అనసూయ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
అందరి సహకారంతో ప్రగతి
అధికారులు, ప్రజాప్రతినిధు లు, మంత్రుల సహకారంతో జిల్లా ప్రగతిని పరుగులు పెట్టిస్తాం. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అర్హులకు చేరవేస్తాం. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ నేరాలు నియంత్రిస్తాం జిల్లావ్యాప్తంగా ప్రతీగ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. తద్వారా నేరాలను నియంత్రిస్తాం. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రహదారుల వెంట బ్లాక్ స్పాట్లు గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం. ప్రతీఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి. – రాంరెడ్డి, డీసీపీ, పెద్దపల్లి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి కొత్త సంవత్సరంలో జిల్లావాసులు సుఖశాంతులతో ఉండాలి. రైతులకు పంటలు బాగా పండించాలి. అంద రూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. యువత, నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి పొందాలి. ప్రభుత్వ ఉద్యోగాలూ సాధించాలి. – విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి టూరిజం హబ్ లక్ష్యం 800 మెగావాట్ల పవర్ప్లాంట్కు శంకుస్థాపన చేస్తాం. సింగరేణి 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాం. టూరిజం, బిజినెస్, పవర్, మెడికల్, ఎడ్యుకేషన్ హబ్లుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం. – రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం -
రెండేళ్లుగా ‘హానీట్రాప్’ దందా..!?
మెట్పల్లిరూరల్: మూడురోజుల క్రితం మెట్పల్లిలో వెలుగుచూసిన హానీట్రాప్ దందాలో లెక్కలేని మంది బాధితులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. సుమారు రెండేళ్లుగా ఈ ముఠా తమ దందాను కొనసాగించినట్లు సమాచారం. ముఠాలో ముగ్గురిని బుధవారం సాయంత్రం పోలీసులు రిమాండ్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కిన అనంతరం తిరిగివస్తామని చెప్పి జాడలేకుండా పోయినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నిందితుల ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే యత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. రెండేళ్లుగా దందా మెట్పల్లిలో వెలుగుచూసిన హానీట్రాప్ దందా సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు సమాచారం. నిందితుని సెల్ఫోన్లో పదుల సంఖ్యలో వీడియోలు ఉన్న విషయం వెలుగులోకి రావడంతో బాధితుల సంఖ్య మరింత ఎక్కువగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హానీ ట్రాప్లో చిక్కుకుపోయిన నిందితులు తమ పరువు ఎక్కడ పోతుందన్న భయంతో ఈ ముఠా అడిగినంత మేర డబ్బులు చెల్లించి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కొంత మంది వ్యాపారులు, రియల్టర్లు, చిన్నాచితక లీడర్లు ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి రావడంతో కొంతమంది బాధితులు పోలీసులను కలిసి తాము సైతం మోసపోయామని చెప్పుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు వేగవంతంగా.. లోతుగా విచారణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. నిందితుల సెల్ఫోన్లను పూర్తిస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించే యత్నాల్లో ఉన్నారు. నిందితుల్లో ఒకరి సెల్పోన్లో సుమారు రూ.20 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. హానీ ట్రాప్ ముఠాలో నిందితులు బల్మూరి స్వప్న, కోరుట్ల రాజు, దేవ నర్సయ్యను బుధవారం సాయంత్రం పోలీసులు రిమాండ్ చేసినట్లు సమాచారం. మొదట పోలీసుల అదుపులో ఉండి తరువాత కనిపించకుండా పోయిన మరో ముగ్గురు నిందితులు ఎక్కడున్నారో జాడ తెలియడం లేదు. మంగళవారం రాత్రి నుంచి ఈ ముగ్గురు నిందితులు యాంటిసిపేటరీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేసే క్రమంలోనే జాడ లేకుండా పోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. వీరి సెల్పోన్లు ఠాణాలోనే ఉండటంతో వీరి జాడ తెలియడం సమస్యగా మారినట్లు తెలిసింది. మెట్పల్లి పరిసరాల్లో హానీట్రాప్ అంశం చర్చనీయాంశంగా మారిన క్రమంలో ఇదివరకు మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని సమాచారం. బాధితులు ఎందరో.. నిందితుల్లో ముగ్గురు రిమాండ్ మరింత లోతుగా విచారణ జాడలేని మరో ముగ్గురు నిందితులు -
కుట్టు.. ఉపాధికి మెట్టు
మంథనిరూరల్: మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. నిన్నామొన్నటి వరకు వంటింటికే పరిమితమైన గువలు.. నేడు ఉపాధి మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. కుటుంబానికి తమవంతుగా ఆసరాగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో డీఆర్డీఏ, సెర్ప్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వయం ఉపాధి కార్యక్రమాలపై ఆసక్తి చూపుతున్నారు. వియాట్రిస్ ఫెమీలైఫ్ సైన్స్ ప్రైవేట్ సంస్థ సహకారంతో ఎలీప్ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ పొందుతున్నారు. నాలుగు మండలాలు.. 20 శిక్షణ కేంద్రాలు మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో 20 ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంథని మండలంలో 11, ముత్తారంలో 03, రామగిరి మండలంలో 03, కమాన్పూర్ మండలంలో 03 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఒక్కో సెంటర్లో సుమారు 50 మంది వరకు మహిళలు ఉచితంగా కుట్టు శిక్షణ పొందుతున్నారు. కేంద్రాలను ప్రారంభించిన మంత్రి గతేడాది నవంబర్ 24న మంథని నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు.. ఎగ్లాస్పూర్ రైతువేదికలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. మహిళలకు ఆర్థిక చేయూతనందించే విధంగా ఉపాధి అవకాశాల కల్పన కోసమే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అదేనెల 25 నుంచి నాలుగు మండలాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉచిత శిక్షణ ప్రారంభమైంది. ప్రత్యేక శిక్షకుల పర్యవేక్షణలో.. ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాల్లో ప్రత్యేక శిక్షకుల పర్యవేక్షణలో మహిళలు తర్ఫీదు పొందుతున్నారు. ఒక్కో కేంద్రంలో ఇద్దరు శిక్షకులను నియమించారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు బ్యాచ్లుగా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. మధ్యాహ్న సమయంలో భోజన సదుపాయం కూడా కల్పించారు. మిషన్.. చేతి కుట్టుపై.. ఉచిత మిషన్ కుట్టు కేంద్రాల్లో మిషన్ కుట్టు, చేతికుట్టుపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కేంద్రంలో సుమారు 50 మంది మహిళలు, యువతులు శిక్షణ పొందుతున్నారు. వీరికి అవసరమైన వస్త్రాలు, టేపు, దారపురీళ్లు, సూదులు ఒక బ్యాగ్ను కంపెనీ ఉచితంగా అందజేసింది. ముఖ్యంగా ఖాజాలు కుట్టడం, కొలతలు తీసుకోవడం, పంపకాలు, కటింగ్ వంటివి ఈ శిక్షణలో నేర్పిస్తున్నారు. -
చిట్టీ డబ్బులు అడిగినందుకు దారుణహత్య
జగిత్యాలక్రైం: చిట్టీ డబ్బులు అడినందుకు కొలగాని అంజయ్య (55)ను దారుణంగా హత్య చేశారు. జగిత్యాలలోని గోవిందుపల్లికి చెందిన అంజయ్య మెస్తోపాటు, చిట్టీలు నిర్వహిస్తాడు. గణేశ్నగర్కు చెందిన శ్రీనివాస్ ఇటీవల చిట్టీ ఎత్తుకుని డబ్బులు చెల్లించకపోవడంతో బుధవారం రాత్రి గణేశ్నగర్లోని కమాన్ వద్దగల కాఫీ సెంటర్ వద్ద శ్రీనివాస్ కనిపించడంతో చిట్టీ డబ్బులు చెల్లించాలని అంజయ్య ఒత్తిడి చేశారు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకోగా.. శ్రీనివాస్ తన కుమారునికి ఫోన్ చేసి రమ్మన్నాడు. శ్రీనివాస్ కుమారుడు తీవ్ర ఆగ్రహంతో వచ్చి అంజయ్యపై విచక్షణారహితంగా దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన అంజయ్యను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యలో ఎంతమంది ప్రమేయం ఉందన్న విషయంపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
పనిచేయని కోల్డ్స్టోరేజీ
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైస్సెస్(సిమ్స్–ప్రభుత్వ)లోని అనాటమీ డి–సెక్షన్ కోల్డ్స్టోరేజీలో పార్ధివదేహాలను భద్రపరిచే ఫ్రీజర్బాక్స్లు నిరుపయోగంగా మారాయి. ఒకేఫ్రీజర్లో నాలుగు పార్థివదేహాలను భద్రపరిచే సామర్థ్యం కలిగిన బాక్స్.. నెలరోజులుగా పనిచేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పలు కుటుంబాలు ఎంతోస్ఫూర్తితో తమ ఆత్మీయుల పార్థీవదేహాలను మెడికల్ కళాశాలకు దానం చేస్తుండగా.. సౌకర్యాలలేమి వారి మనోభావాలను దెబ్బతీస్తోంది. గోదావరిఖనిలోని న్యాయవాది గోసిక ప్రకాశ్ గుండెపోటుతో మృతి చెందగా.. ఆయన పార్థివదేహాన్ని బుధవారం కుటుంబ సభ్యులు సిమ్స్కు దానం చేశారు. వైద్య విద్యార్థుల పరిశోధన కోసం వారు దానంచేస్తే.. మెడికల్ కాలేజీకి కాకుండా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని మార్చురీకి తరలించాలని సూచించారు. దీంతో గత్యంతరం లేక స్వచ్ఛంద సంఘాలు కుటుంబ సభ్యులను జీజీహెచ్లోని మార్చురీలో భద్రపర్చడానికి ఒప్పించారు. మార్చురీకి తరలించడమా..? మెడికల్ కాలేజీకి దానం చేయడానికని పార్థివదేహాన్ని తీసుకొస్తే.. ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరుస్తామని చెప్పడంపై దేహదాత కుటుంబాలు, న్యాయవాదులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చురీ ఎదుట వైద్యులను ఇదేఅంశంపై నిలదీయడంతో తీవ్రఆందోళనకు దారితీసింది. పార్థీవదేహ దానాలకు తగిన గౌరవం, భద్రత కల్పించాల్సిన వైద్యకళాశాలలో ఇలాంటి పరిస్థితులు ఉండడం శోచనీయమని మండిపడ్డారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు దేహదాత కుటుంబాల పక్షాన స్పందించి, వెంటనే సిమ్స్ ప్రిన్సిపాల్, అనాటమీ హెచ్వోడీలతో చర్చించి సమస్య పరిష్కారాని చొరవ తీసుకున్నారు. దీంతో పార్థివదేహాన్ని మార్చురీ నుంచి మెడికల్ కాలేజీకి తీరలించారు. లయన్స్క్లబ్ ఫ్రీజర్లోనే.. రామగుండం లయన్స్ క్లబ్ మంగళవారం పార్థివదేహాన్ని భద్రపర్చడానికి ఫ్రీజర్బాక్స్ ఇచ్చింది. అందులోనే ప్రకాశ్ పార్థివదేహాన్ని గురువారం ఉదయం వరకు అనాటమీ డి –సెక్షన్ హాల్లో ఉంచాలని అధికారులు సూచించారు. ఇటీవల కూడా ఓ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు దానం చేయగా, ఆ పార్థివ దేహాన్ని కూడా సుమారు మూడురోజులపాటు జీజీహెచ్ మార్చురీలో భద్రపర్చడంపై కుటుంబ సభ్యులు ఆవేదనకు లోనయ్యారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అత్యవసరమైన ఫ్రీజర్ పనిచేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు విమర్శించారు. అధికారులు వెంటనే స్పందించి కూలింగ్ స్టోర్ను పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మెడికల్ కాలేజీలో దుస్థితి అనాటమీ డీ – సెక్షన్ ఫ్రీజర్ బాక్స్లో సాంకేతిక సమస్య మనోభావాలను దెబ్బతీస్తున్నారని దాతల ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పార్థీవదేహదాత కుటుంబాలు -
‘టీ పోల్’లో ఓటరు వివరాలు
కోల్సిటీ(రామగుండం): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అడుగులు పడడంతో రామగుండం బల్దియా అధికారులు, ఉద్యోగులు మూడురోజులుగా విధు ల్లో బిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఉద యం నుంచి బుధవారం వేకువజాము వరకు తె లంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్కు చెందిన టీ పోల్ సాఫ్ట్వేర్లో 60 డివిజన్లలో వార్డుల వారీగా ఓటర్ల వివరాలను అప్లోడ్ చేశారు. నగరపాలక కమిషన ర్ అరుణశ్రీ స్వయంగా ఉద్యోగులోపాటు పర్యవేక్షిస్తూ ఉండడం గమనార్హం. అయితే సుమారు లక్షా 85 వేలపైచిలుకు మంది ఓటర్లు ఉండడంతో ఈ ప్రక్రియ సకాలంలో పూర్తికాలేదు. దీంతో బుధవారం రాత్రి వరకు ఓటర్ల వివరాలను అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను విభజించిన అధికారులు.. వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు రూపకల్పన చేపట్టారు. గురువారం ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ప్రచురణ చేయనున్నారు. 60 డివిజన్లలో 260 లోపు పోలింగ్ స్టేషన్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఒక్కో పోలింగ్ బూత్లో 800 మంది ఓటర్ల కన్నా ఎక్కువ కాకుండా విభజిస్తున్నారని సమాచారం. -
పొలిటికల్ జోష్
సాక్షి పెద్దపల్లి: అనేక రాజకీయ మార్పులు, పదవులు, వివాదాలు, సవాళ్లకు ఈ ఏడాది వేదికగా నిలిచింది. కొన్ని పార్టీలకు కలిసోస్తే.. మరికొన్నింటికి చేదు అనుభవాలను మిగిల్చింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటగా, కాంగ్రెస్ రెండోస్థానంతో సరిపెట్టుకుంది, చివరలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు కై వసం చేసుకోగా, బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలిచింది. ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీలో జోష్ నింపగా, పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఊపునిచ్చాయి. గులాబీ పార్టీకి నిరాశ మిగిల్చియి. కారు పార్టీ సతమతం గత పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కై వసం చేసుకుని సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ.. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ద్వితీయ స్థానంతోనే సరిపెట్టుకుంది. ఏడాది మొదట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వడంలోనూ చతికలబడింది. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉన్నా.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ నేతలు వెనుకబడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో మానేరుపై నిర్మించిన రెండు చెక్డ్యాంలు కూలిపోయిన విషయాన్ని పూర్తిస్థాయిలోకి ప్రజల్లోకి తీసుకు వెళ్లలేదని గులాబీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చెక్ డ్యాంల సందర్శనకు నీటిపారుదల శాఖ మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లాకు వచ్చి కూలిపోయిన చెక్డ్యాంలను పరిశీలించారు. -
బీజేపీలో కొంతమోదం.. మరికొంత ఖేదం
పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ మంచి మెజార్టీతో గెలుచుకుంది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్క కొమరయ్య బీజేపీ నుంచిటీచర్స్ ఎమ్మెల్సీ పదవిని కై వసం చేసుకున్నారు. అదే ఊపును స్థానిక ఎన్నికల్లో ప్రదర్శించలేకపోయారు. కేవలం నాలుగు సీట్లతోనే సరిపెట్టుకోవడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరశ్యం నింపింది. జిల్లా అధ్యక్షుడి నాయకత్వ లోపం, పార్టీలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలతో ప్రజల్లో బీజేపీపై సానుకూల దృక్పథం నెలకొని ఉన్నా.. దాన్ని ఓట్లరూపంలోకి మార్చుకోవడంలేదనే విమర్శ సొంతపార్టీ నేతల్లోనే నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ జిల్లాలో పర్యటించారు. -
కాంగ్రెస్లో ఉత్సాహం
జిల్లాలోని 262 పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరగ్గా అందులో 181 స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందారు. స్వతంత్రులుగా గెలిచిన 13మంది సైతం మూడు రంగుల జెండా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన పరాభావాన్ని పంచాయతీ ఎన్నికలతో పూడ్చుకున్నారు. అలాగే ఈఏడాది డీసీసీ అధ్యక్షుడి కోసం పీసీసీ దరఖాస్తులు స్వీకరించినా.. మరోసారి డీసీసీ అధ్యక్ష స్థానం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్నే వరించింది. వర్షాకాలంలో కురిసిన భారీవర్షాలతో చాలాప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 28న సీఎం రేవంత్రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. -
గుండెపోటుతో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడి మృతి
● చదువు చెప్పిన పాఠశాలలోనే ఘటన ● వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడిలోకి.. రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఏనుగు రాజిరెడ్డి (65) తాను చదువు చెప్పిన పాఠశాలలోనే వాకింగ్ చేస్తుండగా గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజిరెడ్డి పాఠశాల ఆవరణలో వాకింగ్ చేసేందుకు మంగళవారం వెళ్లాడు. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పి కుప్పకూలడంతో తోటి వాకర్స్ వెంటనే సీపీఆర్ చేశారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజిరెడ్డికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆయన మృతిపై వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు, పూర్వ విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో జర్నలిస్టు.. సిరిసిల్లటౌన్: సీనియర్ జర్నలిస్టు అనారోగ్యంతో మృతిచెందిన ఘటన మంగళవారం సిరిసిల్లలో జరి గింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్నగర్కు చెందిన గడ్డం నాగరాజు(44) దశాబ్దంన్నర కాలంగా జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఆర్నెళ్లక్రితం అనారోగ్యానికి గురికాగా చికిత్స పొందాడు. వారం క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అవగా.. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మృతుడికి భా ర్య స్వరూప, ఇద్దరు కుమారులు హరిహరణ్, హర్షవర్దన్ ఉన్నారు. నాగరాజు మృతిపై సిరిసిల్ల ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్కుమార్, ప్రధాన కార్యదర్శి ఆడెపు మహేందర్, ఉపాధ్యక్షుడు బొడ్డు పర్శరాములు, సీనియర్ జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు. ఉరేసుకొని రైతు ఆత్మహత్యమానకొండూర్: మానకొండూర్ మండలం గట్టు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన గొర్రెంకల చిన్న ఎల్లయ్య (55) అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మానకొండూర్ సీఐ బి.సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మానికి చెందిన చిన్న ఎల్లయ్య సాగునీటి కోసం గతేడాది వ్యవసాయ పొలం వద్ద బావిని తవ్వించాడు. అందులో బండ రావడం, బోరువేసినా నీరు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య ఈనెల 29న పొలం పనులకు వెళ్తున్నానని చెప్పి, తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలించగా పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. కాలు కొట్టెస్తారనే భయంతో వ్యక్తి.. ముస్తాబాద్(సిరిసిల్ల ): డయాబెటిస్తో కాలుకు ఇన్ఫెక్షన్ సోకగా, ఆందోళనకు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్తాబాద్ ఏఎస్సై అబ్దుల్ఘనీ కథనం మేరకు.. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లికి చెందిన పారిపెల్లి సాయిలు(62) మంగళవారం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిలు కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. కాలుకు పుండు కావడంతో అది పొందుతున్నాడు. కాలు ఇన్ఫెక్షన్తో గాయం తీవ్రమైంది. దీంతో కాలు తీసేస్తారనే భయంతో సాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. నలుగురు దొంగల పట్టివేతమేడిపల్లి: కొన్ని రోజులుగా గ్రామాలు, పట్టణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని మంగళవారం పట్టుకున్నట్లు మేడిపల్లి ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలో అనుమానాస్పదంగా కొందరు తిరుగుతున్నట్లు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో వారిని పట్టుకున్నారు. వారిని విచారణ చేపట్టగా ఇటీవల మండలకేంద్రంలోని మహాలక్ష్మి మొబైల్ షాప్లో తొమ్మిది సెల్ఫోన్లు, కోరుట్లలో మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్లు అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేశామని ఎస్సై తెలిపారు. మేడిపల్లి, భీమారం మండలాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లకు గాయాలు
పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై మంగళవారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నుంచి సిమెంట్ లోడుతో గోదావరిఖని వైపు వెళ్తున్న లారీ మార్గమధ్యంలోని కన్నాల బస్టాండ్ సమీపంలో గల భారత్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగా బైక్పై వెళ్తున్న దంపతులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అడ్డుగా వచ్చారు. వారిని తప్పించబోయిన డ్రైవర్.. లారీని రహదారికి అవతలికి మళ్లించాడు. అదే సమయంలో బూడిదలోడుతో పెద్దపల్లి వైపు వెళ్త్ను టిప్పర్.. సిమెంట్ లారీని ఢీకొట్టి సమీపంలోని బస్టాండ్తో పాటు ఓ షాన్షాపును ఢీకొట్టింది. దీంతో లారీల ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. లారీ డ్రైవర్లు తీగల మహేశ్, దాసరి కిష్టయ్యకు గాయాలు కాగా బసంత్నగర్ ఎస్సై శ్రీధర్ వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు. ప్రమాదంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. హెచ్కేఆర్ టోల్ప్లాజా క్రేన్, జేసీబీల సాయంతో లారీలను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈఘటనలో కన్నాల బొడగుట్టపల్లిలోని బొడ్డుపల్లి నర్సయ్యకు చెందిన షాపు ధ్వంసమైంది. ప్రమాద సమయంలో స్థానిక బస్టాండ్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం, షాపు కూడా మూసి ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
వలపు వల పన్ని..!
కోరుట్ల: అమ్మాయిని ఎర వేసి..ఊరించి వలపు వల పన్ని కాసులు రాబట్టాలని చూసిన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. మూడురోజుల క్రితం జరిగిన ఈ ఘటన మెట్పల్లిలో కలకలం రేపింది. వివరాలు.. మెట్పల్లి మండలం బండలింగాపూర్కు చెందిన రియల్టర్ కొంతకాలంగా మెట్పల్లి పట్టణంలోని గోల్హనుమాన్ సమీపంలో నివాసముంటున్నాడు. మూడు నెలల క్రితం ఓ మహిళ ఇతడిని ఫోన్ ద్వారా పరిచయం చేసుకుంది. సదరు అమ్మాయి తరచూ ఫోన్ కాల్ చేస్తూ వలపు వల వేసి ఊరించేది. గత ఆదివారం మనం కలుద్దామని చెప్పి మెట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లోని ఇంటికి రమ్మంది. వలపన్నారు.. హానీ ట్రాప్ను గుర్తించలేకపోయిన రియల్టర్ ఆ మహిళ చెప్పిన ఇంటికి వెళ్లి ఆమె అపార్ట్మెంట్ రూంలోకి వెళ్లగానే సదరు రియల్టర్ ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోను హానీ ట్రాప్ ముఠా సభ్యలు గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరించారు. అనంతరం నలుగురు వ్యక్తులు ఆ గదిలోకి వెళ్లి ఎవరు మీరు, ఏలా వచ్చారు, మహిళతో ఇక్కడ ఏం చేస్తున్నారని రియల్టర్ను బెదిరించారు. దీంతో బిత్తరపోయిన రియల్టర్ ఆ మహిళ పిలిస్తేనే వచ్చానని చెప్పినా వినకుండా తాము తీసిన వీడియోలు బయటపెడతామంటూ కాసుల బేరం పెట్టారు. దీంతో రియల్టర్ గత్యంతరం లేక రూ.7 లక్షలు చెల్లిస్తానని చెప్పి బతిమిలాడుకుని బయటపడ్డాడు. తర్వాత తనను వలపువల వేసి హానీ ట్రాప్లో ఇరికించారని గుర్తించిన రియల్టర్ మెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరుగురిపై కేసు.. రియల్టర్ను హానీ ట్రాప్లో ఇరికించి బ్లాక్మెయిల్కు దిగిన ముఠా సభ్యులు బల్మూరి స్వప్న, కోరుట్ల రాజ్కుమార్, విలేకరిగా చెప్పుకున్న పులి అరుణ్, బట్టు రాజశేఖర్, సుంకెటి వినోద్, మాగిని దేవనర్సయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నిందితుల్లో రాజ్కుమార్ అనే వ్యక్తి ఓ జాతీయ పార్టీకి చెందిన నేతకు అనుచరుడన్న అంశం ప్రచారంలోకి వచ్చింది. -
పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని..
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పుట్టెడు దుఃఖంలో ఉన్న జర్నలిస్టులు మామిడి కుమారస్వామి, సత్యనారాయణ తన తండ్రి రాయలింగు(72) నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకున్నారు. గోదావరిఖని శాలపల్లికి చెందిన కుమారస్వామి నివాసంలో సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు ద్వారా నేత్రాలు సేకరించారు. దీనిద్వారా మరో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. ఇందుకు సహకరించిన మృతుడి భార్య లక్ష్మి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. ప్రతినిధులు బాబర్ సలీం పాషా, గడ్డం శ్యామ్కుమార్, రాజ్కుమార్, పందిళ్ల శ్యామ్సుందర్, పెద్దపల్లి సత్యం, దుబ్బల శేఖర్, సాగర్, బైరం సతీశ్, జక్కం సత్యనారాయణ, సంపత్కుమార్, ఎండీ రహీం, వెంగళ బాపుపద్మ, కృష్ణవేణి, భూమళ్ల చందర్, ఈదునూరి రవి తదితరులు పాల్గొన్నారు. విషాదంలోనూ తండ్రి నేత్రాలు దానం మానవత్వం చాటుకున్నన జర్నలిస్ట్లు -
అమలులోకి లేబర్ కోడ్స్
రామగుండం: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త లేబర్స్ కోడ్స్ గత నవంబరు 21వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. పాత కార్మిక చట్టాలను ఏకీకృతం, సరళీకృతం చేస్తూ.. కార్మిక సంక్షేమం, భద్రత, వేతనాలు, సామాజిక భద్రత మెరుగుపరచడం లక్ష్యంగా నాలుగు లేబర్ కోడ్స్ రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వీటిని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అందులోని ప్రధానాంశాలను పరిశీలిస్తే.. వేజెస్ కోడ్(వేతన కోడ్ చట్టం–2019) : అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం చట్టబద్ధమైన హక్కు. ప్రతీనెల 7వ తేదీలోగా చెల్లించాలి. ఓవర్ టైమ్కు రెండింతల వేతనం చెల్లించాలి. అలవెన్స్లు 50శాతం మించకూడదు. సామాజిక భద్రత((చట్టం–2020) ప్రకారం.. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫాం వర్కర్లకు తొలిసారి సామాజిక భద్రత (పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ), ఫిక్స్డ్–టర్మ్ ఉద్యోగులకు ఏడాది తర్వాత గ్రాట్యుటటీ చెల్లింపు, ప్లాట్ఫాం కంపెనీలు తమ వార్షిక టర్నోవర్లో గరిష్టంగా 2శాతం సామాజిక భద్రత నిధికి జమచేయాలి. పారిశ్రామిక సంబంధాలు(కోడ్ నెం.2020) ప్రకారం.. కనీసం 300 మంది కార్మికులు పనిచేసే సంస్థకు కార్మికుల తాత్కాలిక తొలగింపు, శాశ్వత తొలగింపు, కంపెనీ మూసివేతకు అనుమతి తప్పనిసరి చేశారు. సమ్మెలకూ ముందస్తు నోటీసు తప్పనిసరి చేశారు. వృత్తిపర భద్రత, ఆరోగ్యం, పని స్థితిగతులు ఇలా.. మహిళలు రాత్రి షిఫ్టులు, అండర్గ్రౌండ్ మైనింగ్ తదితర స్థలాల్లో సేఫ్టీ జాగ్రత్తలతో విధులు నిర్వర్తించవచ్చు. పనిగంటలు, ఓవర్టైం నియమాలు వర్తిస్తాయి. వర్క్ ఫ్రమ్ హోం అనుమతి, వలస కార్మికులకు మెరుగైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తోంది. హక్కులు హరించేవే పాత కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ను అమలు చేయడం సరికాదు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వీటిని రూపొందించారు. ఇవి కార్మిక హక్కులను హరించేవే. – అడారి నర్సింగరావు, కార్యదర్శి, సీపీఎం, అంతర్గాం -
వణుకుతూ.. చన్నీటి స్నానం చేస్తూ..
నాలుగు రోజులుగా చలితీవ్రత పెరుగుతోంది. హాస్టళ్లలో వసతి పొందుతున్న విద్యార్థులు చన్నీటి స్నానాలు చేస్తున్నారు. గురుకులాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఉదయం పది గంటలు దాటినా చలివీడడంలేదు. భానుడి కిరణాలు కూడా చలిగాలుల మాటునే ఉంటున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ జ్యోతిభాపూలే గురుకులంలో ఉదయమే స్నానాలు ఆచరిస్తూ.. గజగజ వణుకుతూ విద్యార్థులు శ్రీసాక్షిశ్రీకి ఇలా కనిపించారు. పెద్దపల్లి ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో కిటికీలు విరిగిపోవడంతో పరదాలు అడ్డు పెట్టుకొని విద్యార్థులు తిప్పలుపడుతున్నారు. అయినా, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
వర్మికంపోస్ట్ తయారు చేయాలి
సుల్తానాబాద్రూరల్: గ్రామాల్లోని సెగ్రిగేషన్ షెడ్లలోనే చెత్త వేసి వర్మికంపోస్టు తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య సూచించారు. దుబ్బపల్లి గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. వీధులు, ఇళ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించి ఎరువు తయారు చేయాలని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ ఉమ్మెంతల శోభ, ఉపసర్పంచ్ తిప్పారపు రాజయ్య, ఎంపీవో సమ్మిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రత్యూష, సిబ్బంది ఉన్నారు. ఎన్పీడీసీఎల్ కార్యాలయం తరలింపు పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని చీకురాయి క్రాస్రోడ్డులో గల టీజీ ఎన్పీడీసీఎల్ ఆఫీస్ను రాఘవపూర్ సర్కిల్ కార్యాలయానికి తరలిస్తున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ గంగాధర్ మంగళవారం తెలిపారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు ఈప్రక్రియ చేపట్టామని పేర్కొన్నారు. అంతర్గాం సెక్షన్ ఆఫీస్, సుల్తానాబాద్ ఈఆర్వో కార్యాలయాన్ని కూడా సంబంధిత శాఖల భవనాల్లోకి మార్చినట్లు వివరించారు. నాణ్యమైన విద్యుత్ లక్ష్యం మంథనిరూరల్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గంగాధర్ అన్నారు. నాగారం సబ్స్టేషన్లో 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో డీఈ ప్రభాకర్, ఏడీ ఈ వెంకటనారాయణ, ఏఈ రాజేశ్ పాల్గొన్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలి గోదావరిఖని: సింగరేణి ఆర్థిక స్థితిగతులపై శ్వేతప త్రం విడుదల చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రూ.29వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, ప్ర స్తుతం రూ.47వేల కోట్లకు చేరాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు వంతపాడుతున్నాయని విమర్శించారు. నా యకులు మాదాసి రాంమూర్తి, చల్లా రవీందర్రెడ్డి, పర్లపల్లి రవి, నూనె కొమురయ్య, శ్రీనివాస్రావు, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చట్ట పరిధిలోనే వేడుకలు
గోదావరిఖని: జిల్లావాసులు చట్టపరిధిలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఇ బ్బందులు కలుగకుండా, ప్రమాదాలకు దూ రంగా, అర్ధరాత్రి 12.30 గంటల్లోపు వేడుకలు ముగించుకోవాలని ఆయన సూచించారు. మ ద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు ప్రభు త్వం అనుమతించిన సమయపాలన పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. జెడ్పీ హైస్కూల్కు చేయూత పెద్దపల్లిరూరల్: అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మినరల్ వాటర్ అందించేందుకు ‘మాట’ (మిన్నెసోటా తెలంగాణ అసోసియేష న్) డైరెక్టర్ సమీనారెడ్డి ముందుకొచ్చారు. మా జీ సర్పంచ్ మందల రమాదేవి కూతురైన సమీనారెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. విద్యార్థులకు మినరల్ వాటర్ అందించేందుకు రూ.1.50 ల క్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు మందల రమాదేవి, సత్యనారాయణరెడ్డి ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. ఇటుకబట్టీల్లోంచి బడిలోకి.. ధర్మారం(ధర్మపురి): బొమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు ఎంఈవో ప్రభాకర్ తెలిపారు. మంగళవారం బడిబయట పిల్లల సర్వే చేయగా.. గ్రామ శివారులోని ఇటుకబట్టీల్లో 15 మంది పిల్లలను గుర్తించి స్కూల్లో చేర్పించామన్నారు. పిల్లల బాల్యం ఇటుకబట్టీల్లో బందీకా వొద్దని ఆయన సూచించారు. ప్రధానోపాద్యాయుడు మల్లారెడ్డి, క్లస్టర్స్ రిసోర్సు పర్సన్ కొండ కవిత, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ పోరుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో పురపాలక ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించడంతో ఆదిశగా అధికారులు సర్వం సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి. గందరగోళం లేకుండా.. గతఎన్నికలకు ముందు వార్డుల విభజన గందరగోళంగా జరిగింది. కాలనీలకు సంబంధం లేనివారిని వార్డు ఓటరు జాబితాలో చేర్చారు. తమకు అనుకూలంగా ఉన్నవారి పేర్లను ఇలా చేర్చానే ఆరోపణలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. ఈసారి అలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓటరు జాబితా పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు.. పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో పట్టణాల్లో ఓట్లు నమోదు చేయించుకునేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరోవైపు.. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఆశావాహులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు. తీరా వారిఆశలు నెరవేరలేదు. ప్రస్తుతం జరిగే మున్సిపల్ పోరులో వార్డులతోపాటు చైర్మన్, వైస్ చైర్మన్ రిజర్వేషన్లు మారనున్నాయని, గతంలో తమకు అనుకూలంగా ఉన్న వార్డులు/డివిజన్లు ఈసారి తమకు అనుకూలిస్తాయో లేదోనని ఆశావాహుల్లో అప్పుడే బెంగ మొదలైంది. రిజిస్ట్రేషన్ల జోరు రామగుండం: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం క్రయ, విక్రయదారులతో రద్దీగా మారింది. ఇటీవల వరుస సెలవులు రావడంతో సోమ, మంగళవారాల్లో క్రయ, విక్రయదారులు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం భారీగా తరలివచ్చారు. రెండు రోజుల్లో సుమారు 45 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశామని ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ తిరుపతినాయక్ తెలిపారు. -
సమాజానికి ఏం చేస్తున్నారు?
మంథని: తన తండ్రి ఆశయ సాధన కోసమే పనిచేస్తున్నానని చెబుతున్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు.. ఆ ఆశయం ఏమి టో సమాజానికి తెలియజెప్పాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సవాల్ చేశారు. స్థానిక అంబేడ్కర్ చౌక్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు, చిన్నకాళేశ్వరం పూర్తిచేస్తానని చెప్పి ఇప్పటివరకూ పూర్తిచేయలేదన్నారు. గెలిచిన రెండ్రోజులకే ఇసుక బంద్ చేస్తామన్నా.. ఇంకా ఆచరణలో చూపలేదని విమర్శించారు. ఇప్పటివరకు నలుగురికి కూడా ఉద్యోగాలు పెట్టించకపోవడమేనా తన తండ్రి ఆశయ సాధనా? అని ప్రశ్నించారు. సమాజాన్ని మేల్కొల్పాలని తాను తపన పడుతుంటే.. తనవాళ్లతో కొట్టిస్తానని బెదిరిస్తున్నారని మధు ఆరోపించారు. తాను బెదిరింపులకు భయపడనన్నారు. త నకు అన్నివిషయాలపై అవగాహన ఉందని, వాటి ని త్వరలోనే బయటపెడుతానని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీరాకేశ్, నాయకులు ఏగోళపు శంకర్గౌడ్, తరగం శంకర్లాల్, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, పుప్పాల తిరుపతి, పెగడ శ్రీనివాస్, మాచిడి రాజూగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కూనారం ఆర్వోబీ పూర్తిచేయాలి
పెద్దపల్లి: కూనారం – పెద్దపల్లి మధ్య జిల్లాకేంద్రంలో చేపట్టిన ఆర్వోబీ పనులను వచ్చే ఏడాది జూలై వరకు పూర్తిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక రైల్వే ఫ్లైఓవర్, ఆర్ అండ్ బీ అతిథి గృహం ప్రహరీ, జెడ్పీ కార్యాలయ భవన నిర్మాణాలను ఆయన మంగళవారం పరిశీలించారు. రూ. 119.50 కోట్ల వ్యయంతో ఆర్వోబీ నిర్మాణం చేపట్టారని కలెక్టర్ అన్నారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం ప్రహరీ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో గంగయ్య, అధికారులు భావ్సింగ్, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో బోనస్ జమ సన్నరకం వడ్లు విక్రయించిన రైతుల బ్యాంకు ఖా తాల్లో ఇప్పటివరకు రూ.96.85 కోట్లు జమచేశామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లాలో 333 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈనెల 29వ తేదీవరకు 272 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తిచేశామని ఆయన పేర్కొన్నారు. జూలై వరకు అందుబాటులోకి తేవాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష -
11న ‘చలో వరంగల్’
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఈడబ్ల్యూఎస్ రిజర్వేష న్లు పటిష్టంగా అమలు చేయాలని, జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో వచ్చే ఏడాది జనవరి 11న వరంగల్ నగరంలో సింహగర్జన సమరభేరి నిర్వహిస్తామని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీ య అధ్యక్షుడు పొలాడి రామారావు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ప్రచార పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. ఓసీల్లోనూ అనేకమంది పేద లు ఉన్నారని, ప్రభుత్వ ప్రోత్సాహాకాలు అందడంలేదని తెలిపారు. ఉమ్మడి ఏపీలో సీఎం వైఎస్ రాజ శేఖరెడ్డి.. ఆర్థికంగా, విద్య, వైద్యం పరంగా కొంత ప్రయోజనం చేశారని అన్నారు. నాయకులు వంగళ తిరుపతిరెడ్డి, సతీశ్శర్మ, రాఘవులు, కరుణాకర్రా వు, రాజేశ్వర్రావు, అశోక్, భూమయ్య, వీరారెడ్డి, మాధవరెడ్డి, రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
అక్షరమే ఆయుధమై..
సాక్షి పెద్దపల్లి: అక్షరమే ఆయుధమైంది. ప్రజా సమస్యలపై గళమెత్తింది. అధికారులు, పాలకులను పరుగులు పెట్టించేలా 2025లో ‘సాక్షి’ కథనాలు ప్రచురించి, చెరగని ముద్ర వేసింది. సామాన్యుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం చూపింది. అవినీతి, అక్రమాలపై ఎక్కుపెట్టిన పాలకుల పనితీరును ప్రశ్నించింది. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ.. పథకాల అమలులో అలసత్వాన్ని ఎండగడుతూ అధికార యంత్రాంగాన్ని ఆలోచింపజేసింది. మరోఏడాది కాలగర్భంలో కలిసిపోతున్న వేళ ప్రజాక్షేత్రంలో ‘సాక్షి’ కథనాలు పాఠకుల హృదయాల్లో మనస్సాక్షికి సంతకంలా నిలిచాయి. వసూళ్లకు బ్రేక్నాణ్యత పాటించకుండా, కంపెనీ పేరు, తయారీ తేదీ, ఎక్పైరీ డేట్ లేకుండా కేక్లు, బ్రెడ్డు తయారు చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుగుతున్న బేకరీలపై ‘తింటే బేజారే’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన అధికార యంత్రాంగం బేకరీల్లో తనిఖీలు చేసి నిర్వాహకులకు జరిమానా విధించింది.ప్రభుత్వ ఆస్పత్రిలో కిందిస్థాయి సిబ్బంది పేషెంట్ల వద్ద పైసలు వసూలు చేస్తున్న వైనంపై ‘సేవకో రేటు’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన కలెక్టర్.. వసూళ్ల పర్వాన్ని నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు, ఫిర్యాదు బాక్స్లు ఏర్పాటు చేశారు. ప్రజల పక్షాన నిలిచిన ‘సాక్షి’ అభాగ్యులకు ఆర్థికంగా తోడ్పాటు అందేలా కృషి అధికారులు, పాలకులను కదిలించిన కథనాలు పేదింటికి పెద్దకష్టం రామగుండం నగరంలో తండ్రి అనారోగ్యంతో మంచం పట్టగా, స్వీపర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి సాయం చేసేందుకు రాగిజావ విక్రేతగా మారిన బీటెక్ చదివే కూతురు, పేపర్లు వేస్తున్న కుమారిడి దయనీయ పరిస్థితిపై ‘పేదింటికి పెద్దకష్టం’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన దాతలు తలాకొంత ఆర్థిక సాయం అందించారు. -
అంతర్గాంలో ఎయిర్పోర్టుపై..
పాలకుర్తి మండలం బసంత్నగర్లో ఎయిర్పోర్టు ఏర్పాటు దశాబ్దాల కల. వివిధ సాంకేతిక కారణాలతో అక్కడ ముందుకు సాగలేదు. కానీ, బసంత్నగర్కు బదులు అంతర్గాం ప్రాంతంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సముఖత చూపింది. దీంతో ఈనెల 4న ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) అధికారులు అంతర్గాం ప్రాంతంలో పర్యటించారు. అందుబాటులోని ప్రభుత్వ భూములు పరిశీలించారు. ఏఏఐ సూచించిన అభ్యంతరాలు పరి ష్కరించి, భూసేకరణ చేపడితే విమానాశ్రయం కల నెరవేరుతుంది. పెద్దపల్లిలో బస్సుడిపో పనులు ప్రారంభం పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల ఆర్టీసీ బస్సుడిపో. నవంబర్ 19న ఎమ్మెల్యే విజయరమణారావు డిపో పను లు ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ను ఆ నుకుని ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు తొలగించి ఆ స్థలంలో డిపో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 45 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి పట్టణాభివృద్ధి కోసం బైపాస్ రోడ్డు మంజూరు చేసింది. భూమి సేకరణ కోసం అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే చేస్తున్నారు. ఈప్రక్రియ పూర్తయితే డిపో పనులు వేగవంతం కానున్నాయి. -
ఎన్నికలతో ముగిసి..
ఆటలతో మొదలై..పోలీస్ స్పోర్ట్స్ మీట్తో మొదలైన 2025.. ఎమ్మెల్సీ ఎన్నికలతో వేగం అందుకుని, పంచాయతీ ఎన్నికలతో ప్రశాంతంగా ముగిసింది. దక్షిణకాశీగా పిలిచే వేములవాడలో దర్శనాలు నిలిపివేయడం భక్తులకు తీవ్ర అసౌకర్యం కల్పించినా.. ఆలయాభివృద్ధి కోసం తప్పలేదు. సీబీఐ వామనరావు దంపతుల కేసు.. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై విచారణ ప్రారంభించింది. క్రిప్టో కరెన్సీ పేరిట వెలుగుచూసిన రెండు కుంభకోణాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేశాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ను ‘సిట్’ విచారించింది. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
వైద్యులను సంప్రదించండి
పెద్దపల్లి: జిల్లాలో చలితీవ్రత పెరిగింది. రెండుమూడ్రోజులుగా రాత్రివేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కొందరు జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నిమోనియా, ఆస్తమా తదితర దీర్ఘకాలిక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి అందించే వైద్యసేవలు, పాటించే జాగ్రత్తల కోసం ‘సాక్షి’ సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ప్రమోద్కుమార్తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. జిల్లావ్యాప్తంగా పలువురు బాధితులు ఆయనను ఫోన్ద్వారా సంప్రదించారు. వారి ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. వివరాలు.. దగ్గుతో ఇబ్బంది పడుతున్నాం. ఏం చేయాలి? – మేచినేని గోపాల్రావు, ధూళికట్ట డీఎంహెచ్వో: సమీపంలోని వైద్యులను సంప్ర దించి చికిత్స తీసుకోండి. చలితీవ్రత దృష్ట్యా బయటకు వెళ్లకపోవడమే మంచిది. జిల్లాలో జ్వరబాధితులు ఉన్నారు. నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటి? – తాండ్ర సదానందం, జిల్లా కార్యదర్శి, సీపీఐ డీఎంహెచ్వో: మా సిబ్బందితో నిత్యం సర్వే చేస్తున్నాం. జ్వరబాధితులను గుర్తించి ఉచితంగా మందులు అందిస్తున్నాం. అయినా తగ్గని వారిని పీహెచ్సీలకు తరలించి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. సుల్తానాబాద్ ఆస్పత్రిలో ఆక్సిజన్లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు? – అబ్దుల్ హకీం, సుల్తానాబాద్ డీఎంహెచ్వో: కలెక్టర్, డీసీహెచ్ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తాం. వైద్యసేవలను విస్తరించాలి – నరేశ్, పాలకుర్తి డీఎంహెచ్వో: గ్రామాల్లో మూడురోజులపాటు యూనాని, ఇతర వైద్యసేవలు అందించేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయా? – ఆంజనేయులు, జూలపల్లి డీఎంహెచ్వో: జ్వరం, దగ్గు, జలుబు తదితర వ్యాధులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. చలిలో వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – రాంరెడ్డి, జూలపల్లి డీఎంహెచ్వో: ఉదయం ఏడు గంటల తర్వాతే బయటకు వెళ్లాలి. ముక్కు, చెవులకు ఈదురుగాలులు తగలకుండా తప్పకుండా ఉన్నిదుస్తులు ధరించాలి. మా ఇద్దరు చిన్నపిల్లలకు శ్వాస సమస్య ఉంది? – ప్రీతి, ధర్మారం డీఎంహెచ్వో: ఐస్క్రీమ్స్, కూల్డ్రింక్స్ తాగొద్దు. చలిలో ప్రయాణం చేయొద్దు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – కుమార్, సుల్తానాబాద్ డీఎంహెచ్వో: దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉదయం ఏడు గంటలకు ముందు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. ప్రతీఒక్కరు ఉన్నిదుస్తులు ధరించాలి. ఆస్తమా బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? – భిక్షపతి, పెద్దపల్లి డీఎంహెచ్వో: ఇన్హేలర్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. డాక్టర్ సూచనలు, సలహా లు తప్పకుండా పాటించాలి. నిమోనియా బాధితులు ఏంచేయాలి? – సతీశ్, పెద్దపల్లి డీఎంహెచ్వో: రక్తహీనతతో బాధపడుతున్న వా రు డాక్టర్ల సూచనలు, సలహాల మేరకే బ యటకు వెళ్లాలి. వీరికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు, మందులు ఉచితంగా అందిస్తున్నాం. -
ప్రాణం తీసిన భూపంచాయితీ
● కనగర్తిలో ఒకరు మృతి ఓదెల(పెద్దపల్లి): భూ పంచా యితీ ఓ రైతు ప్రాణం తీసింది. ఈఘటన పెద్దపల్లి జిల్లా ఓ దె ల మండలం కనగర్తి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కనగర్తి గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య)ను ఇదే గ్రామా నికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పొ లం వద్ద పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో తన్ని బురద లో తొక్కి చంపేశాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్, మృతుడి కూతురు వొడ్నాల లావణ్య కథనం ప్రకారం.. కనగర్తిలో ఒంటరిగా ఉంటున్న రాజయ్య వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాడు. ఇదే గ్రా మానికి చెందిన ఆది రాజయ్య భూమి ఆయన పొ లాన్ని ఆనుకొని ఉంది. ఇద్దరి భూముల మధ్య గె ట్టు(ఒడ్డు) విషయంలో పలుమార్లు గొడవలు, కు లపెద్ద మనుషుల సమక్షంలోనూ పంచాయితీలు జరిగాయి. సోమవారం ఉదయం ఆది రాజయ్య (సన్నాఫ్ మల్లయ్య) కూలీలతో పొలంలో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో ఒడ్డు వద్దగల హద్దు రాయిని రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పీకేశాడు. ఎందుకు పీకేశావని ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్ల య్య) అడిగాడు. దీంతో ఆదిరాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) చేతులతో పిడిగుద్దులు గుద్దాడు. కాళ్లతో తన్ని బురదలో తొక్కాడు. దీంతో బురదలో బొర్లపడి ముక్కు మూసుకుపోయి ఊపిరి ఆడక ఆది రా జయ్య(సన్నాఫ్ మల్లయ్య) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కూతురు వొడ్నాల లావణ్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశామని పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ, ఎస్సైలు రమేశ్, చంద్రకుమార్ పరిశీలించారు. పాత గొడవలను దృష్టి లో పెట్టుకుని తన తండ్రిని చంపేశారని మృతుడి కుతుళ్లు విలపించారు. వరినాట్ల సమయంలో రైతు మృతి చెందడంతో విషాదం అలముకుంది. -
బ్లాక్స్పాట్ల వద్దే ప్రమాదాలు
● బ్లాక్స్పాట్ల వద్ద పెరుగుతున్న ప్రమాదాలు ● నామమాత్రంగా సూచిక బోర్డులు ● అతివేగంతో దూసుకెళ్తున్న వాహనాలు గోదావరిఖని: గతేడాదితో పోల్చితే ఈఏడాది రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయి. ఆర్ అండ్ బీ, ఎకై ్సజ్, హైవే ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలిసి గ్రామ రోడ్డు భద్రత కమిటీ సభ్యులు తనిఖీలు చేశారు. మంచిర్యాల జోన్లోని వెంపల్లి – ముల్కల వంతెన, గుడిపేట వంతెన, పెద్దపల్లి జోన్లోని గోదావరిఖని బీ –గెస్ట్ హౌస్ పరిసరాల్లోనూ తనిఖీలు చేసి ప్రమాదా ప్రాంతాలు గుర్తించారు. బ్లాక్స్పాట్ల వద్దే అధికం.. గతేడాది జరిగిన ప్రమాదాల్లో 131 మంది మృతి చెందగా, 221మందికి తీవ్ర, 301 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈఏడాది 334 రోడ్డు ప్రమాదా లు జరగ్గా 126 సంఘటనల్లో 137మంది మృతి చెందారు. 338 మందికి గాయాలయ్యాయి. రాజీవ్రహ దారి వెంట బ్లాక్స్పాట్లను గుర్తించినా ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. దీంతోనే బ్లాక్ స్పాట్ల వద్దే ప్రమాదాలు పెరిగాయి. ప్రధానంగా భారీవాహనాలు ఢీకొట్టడడంతో ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు. ప్రమాదాల నియంత్రణకు రోడ్డు సేఫ్టీ విభాగాన్ని ట్రాఫిక్కు అప్పగించగా.. బ్లాక్స్పాట్ల వద్ద సూచికల బోర్డులు ఏర్పాటు చేశారు. పలు చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రమాదాలు కొంతతగ్గినా.. ఇప్పుడు సూచిక బోర్డులు లేక ప్రమాదాలు మళ్లీ పెరిగాయి. డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక దృష్టి డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మద్యం తాగి వాహనం నడుపుతూ తొలిసారి దొరికిన వారికి జరిమానా విధించి వదిలేశారు. రెండోసారి పట్టుబడ్డవారికి భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించారు. ఇలా గతేడాది 6,725 పట్టుపడగా, అందులో 3,352 మంది నుంచి రూ.44.14లక్షల జరిమానా వసూలు చేశారు. ఈఏడాది 9,678 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా.. రూ.96.45లక్షలు జరిమానా విధించారు. నాలుగేళ్లలో రోడ్డు ప్రమాదాలు, మృతులు, గాయపడినవారు ఏడాది మృతులు తీవ్రగాయాలు గాయాలు 2022 128 44 296 2023 112 64 303 2024 131 221 301 2025 137 170 338 రోడ్డు నిబంధనల అతిక్రమణ, నిర్లక్ష్యపు డ్రైవింగ్తోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సేఫ్టీ డ్రైవ్ కోసం అవగాహన కల్పిస్తున్నాం. – శ్రీనివాస్, ఏసీపీ, ట్రాఫిక్, రామగుండం -
అభివృద్ధి వైపు అడుగులు
డెవలప్మెంట్ వాచ్ 2025సాక్షి పెద్దపల్లి: జిల్లాలో ఈ ఏడాది అభివృద్ధి, సంక్షేమం అంతంతంగానే నమోదు అయ్యాయి. పంచాయతీలు, బల్దియాల్లో నిధులు కొరత అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఆరు గ్యారంటీల్లో సంక్షేమం కొంత ఊరట ఇచ్చినా కొత్త పథకాలు రాలేదు. కొత్త పింఛన్ల కోసం నిరీక్షణ తప్పలేదు. కానీ, కొన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి అడుగులుపడ్డాయి. మూడు విడతల్లో రైతురుణమాఫీ కావడంతో అన్నదాతలకు ఊరట లభించింది. రైతుభరోసా, సన్నధాన్యం బోనస్ డబ్బులు రాక నిరాశనే మిగిల్చింది. పెద్దపల్లి బస్టాండ్ ఎత్తిపోతల ప్రారంభం థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు -
పాఠశాలలకు స్వచ్ఛ అవార్డులు
పెద్దపల్లి: జిల్లాలోని 8 సర్కారు బడులకు స్వచ్ఛ పాఠశాలల అవార్డులు ప్రదానం చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. స్వచ్ఛత అంశంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు జిల్లాస్థాయిలో అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశామన్నారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణ, చేతులు శుభ్రం చేసేందుకు సౌకర్యాలు, పాఠశాలలు, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థుల ప్రవర్తన, అవగాహన, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిర్మూలన తదితర అంశాలపై ప్రతిభ చూపినందుకు పురస్కారాలు అందించామన్నారు. డీఈవో శారద, ఏఎంవో షేక్, సీఎంవో కవిత తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా 38 వేల మెట్రిక్ టన్నులు అవసరమని ప్రణాళిక రూపొందించగా.. ఇప్పటివరకు 15,162 మెట్రిక్ టన్నులు వచ్చిందన్నారు. రోడ్లపై కేజీవీల్స్ ట్రాక్టర్లు నిషేధం రోడ్లపై కేజీవీల్స్ ట్రాక్టర్ల ప్రయాణం నిషేధించామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే తొలిసారి రూ.5,000, రెండోసారి రూ.10,000 వరకు జరిమానా విధిస్తామని, మూడోసారి దొరికితే కేసులు నమోదు చేసి వాహనం సీజ్ చేస్తామన్నారు. ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకోవాలి స్వయం ఉపాధి కోసం ట్రాన్స్జెండర్లు వచ్చేఏడాది జనవరి 10లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. వివరాలకు 94408 52495 నంబరులో సంప్రదించాలని కోరారు. -
ఇక.. పుర వేఢీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాలకవర్గాల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న బల్దియాల్లో ఎన్నికల నగరా మోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణకు కార్యాచరణ చేపట్టింది. మంగళవారం నుంచి వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి, జనవరి 1న పట్టణ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. 5న ఆయా మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ కమిషనర్లు రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జనవరి 10న వార్డుల వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ చేపట్టనున్నట్లు ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. -
‘నూతన’ వేడుకలపై ఆంక్షలు
సమన్వయంతో నేరాల నియంత్రణ గోదావరిఖని: ఒకరి సంతోషం మరొకరికి కారాదు విషాదం.. సామాన్య జనానికి ఇబ్బందులు కలుగకుండా వేడుకలు నిర్వహించుకోవాలి. ఆర్భాటాలకు వెళ్లి హల్చల్ చేస్తే ఊచలు లెక్కించాల్సిందే అంటున్నారు పోలీసులు. న్యూఇయర్ వేడుకల్లో హద్దుమీరితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. వైన్స్షాపులు, బార్లు, రెస్టారెంట్లు ప్రభుత్వం నిర్దేశించిన సమయాలు పాటించాలంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. డీజేలు, లౌడ్స్పీకర్లు, అధిక డెసిబుల్ సౌండ్ సిస్టం, బాణాసంచా వినియోగాన్ని తగ్గించుకోవాలంటున్నారు. మద్యం మత్తులో బైక్ రేసింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్సైడ్ డ్రైవింగ్ చేస్తే జైలుకు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. ఈనెల 31 రాత్రి 10గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4గంటల వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. మద్యం తాగి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు లైసెన్స్ రద్దు చేస్తారు. పోలీసుల అనుమతి తప్పనిసరి నూతన సంవత్సర వేడుకలు సమష్టిగా నిర్వహించేందుకు పోలీసుశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. సాంస్కృతిక కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలకు తావులేకుండా నిఘా ఉంటుంది. వేడుకలను రాత్రి 12.30 గంటలలోపు ముగించేలా సూచిస్తున్నారు. ప్రజాశాంతికి విఘాతం కలిగించకుండా వేడుకలు జరుపుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే సీజ్ రాత్రి 12గంటలల్లోగా వైన్స్షాప్లు, ఒంటిగంటలోగా బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేయాలి. మద్యం తాగి వాహనాలు నడిపితే ఊరుకునేదిలేదు. అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా డ్రంక్అండ్డ్రైవ్ నిర్వహించనున్నారు. మద్యం తాగి పట్టుబడితే లైసెన్స్ రద్దుతోపాటు వాహనాన్ని సీజ్ చేయనున్నారు. దీంతో పాటు కేసునమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నారు. రెండోసారి మద్యం తాగి వాహనం నడిపినట్లు తేలితే జైలు శిక్షకు సిద్ధంగా ఉండాలి. మహిళల రక్షణ కోసం షీటీంలు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యూఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలి. న్యూఇయర్పేరుతో అతిగా మద్యం తాగి మహిళలపై వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మహిళల రక్షణ కోసం షీంటీంలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తనిఖీలు చేస్తారు. పోలీసు నిఘాలో వేడుకలు.. న్యూఇయర్ వేడుకల్లో హద్దుమీరకుండా స్థానిక పోలీసులతో పాటు ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, క్రైం, షీటీం, మఫ్టీ టీంలు, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు డ్రంక్అండ్డ్రైవ్ నిర్వహించనున్నారు. అక్రమ సిట్టింగులు, ఆరుబయట మద్యం తాగడం, గుంపులుగా తిరగడం చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. గోదావరిఖని: నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా సూచించారు. తన కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ అధికారులతో సోమవారం నేరసమీక్ష జరిపారు. కేసుల పరిష్కార శాతం పెంచాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికతో త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. మహిళల కేసుల్లో సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పోక్సో కేసుల్లో బాధితులకు పరిహారం త్వరగా అందేలా చూడాలని అన్నారు. రోడ్డు సేఫ్టీ విభాగంతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాలు నియంత్రించాలని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, ఎస్బీ ఏసీపీలు రమేశ్, ప్రకాశ్, కృష్ణ, రవికుమార్, నాగేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంధకారం చేసుకోవద్దు హద్దులకు లోబడి వేడుకలను నిర్ణీత సమయాల్లోగా నిర్వహించుకోవాలి. తాత్కాలిక ఆనందం కోసం యువత కేసుల్లో ఇరుక్కోవద్దు. ఒక్కసారి కేసు నమోదైతే భవిషత్లో ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర దేశాలకు వెళ్లేందుకు వీసాలు రావడం కష్టం. తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
మారుపేర్ల సమస్య పరిష్కరించాలి
గోదావరిఖని: సింగరేణి మారుపేర్ల బాధితుల సమ స్య పరిష్కరించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ కోరారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మారుపేర్ల బాధితులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని, రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంటును వెంటనే ఏర్పాటు చేయాలని, పారిశ్రామికీకరణతో ఉపాధి కోల్పోయిన గౌడకులస్తుల కోసం సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల సమీపంలోని ఖాళీస్థలాలు అప్పగిస్తే తాటి, ఈతవనాలను ఏర్పాటు చేసుకుంటారని, 50ఏళ్ల వయసు నిండిన విశ్వబ్రాహ్మణులకు పింఛన్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. ముగిసిన ఎస్జీఎఫ్ కరాటే టోర్నీ కోల్సిటీ(రామగుండం): నగరంలోని ఆర్సీవోఏ క్లబ్లో అండర్–17 చేపట్టిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కరాటే టోర్నీ, ఎంపిక పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 240 మంది బాలబాలికలు హాజరయ్యారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ నేతృత్వంలో పోటీలు నిర్వహించారు. దాసరి మల్లేశ్ పర్యవేక్షించారు. ఇన్చార్జి డీఈవో హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతినిధులు కరాటే శ్రీనివాస్, వడ్డేపల్లి సురేశ్, పసునూటి శంకర్, మంధని నాగరాజు, పసునూటి చందు, శ్రావణ్ కుమార్, సుంకే రాజు, బండి పరమేశ్, పవన్, బోయపోతు రాము, అన్వేశ్ రిఫరీలుగా వ్యవహరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోచ్, మేనేజర్లుగా ముక్తిశ్రీ, సునేహ సుల్తానా తదితనేలే పాల్గొన్నారు. 13 బంగారు పతకాలు.. జాతీయ పోటీలకు 13 మంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 13 మంది క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో పుణెలో జరగనున్న జాతీయస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలకు 13 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. బంగారు పతకాలు సాధించినవారిలో సృష్టి టుమానే, శ్రీహర్ష, శ్రీవల్లి, పి.శ్రీజ, బి.సహస్త్ర, పి.సహస్త్ర, శ్రీరాజ్ విఘ్నేశ్, టి.జయసాయిచరణ్, ఆకాశ్, డి.శివహర్షవర్ధన్, డి.దేవాన్ష్ ఉన్నారు. ముగింపు కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్క్లబ్ అధ్యక్షుడు డి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్కుమార్, కోశాధికారి రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు కేఎస్ వాసు, రాష్ట్ర పేట అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొమురోజు శ్రీనివాస్, శోభారాణి, జావిద్, విజయ్, ఖాజాభీ రమేశ్, కనకేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆశ వర్కర్ల ధర్నా పెద్దపల్లి: ఆశ వర్కర్లకు నెలకు రూ.18వేల వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జ్యోతి కోరారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించలేదన్నారు. యూనియన్ నాయకులు రూపారాణి, శారద, బి.రమాదేవి బి.శారద, మల్లేశ్వరి, సునీత, స్వప్న స్వరూప తదితరులు పాల్గొన్నారు. పెళ్లయిన రెండు నెలలకే..● రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన కండ్లి లోకేశ్ (23) బైక్ అదుపుతప్పి కింద పడి మృతిచెందాడు. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. లోకేశ్కు కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన శ్వేతతో రెండు నెలల క్రితం వివాహమైంది. ఆదివారం రాత్రి బైక్పై భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్తున్నాడు. తక్కళ్లపెల్లి శివారులో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో లోకేశ్, శ్వేత తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో లోకేశ్ మృతిచెందాడు. వివాహమైన రెండు నెలలకే లోకేశ్ మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వాహనం అదుపు తప్పి యువకుడి మృతిరాయికల్: భూపతిపూర్లో జరిగిన రోడ్డు ప్ర మాదంలో చింతలూరుకు చెందిన జటోతు భూమేశ్(19) మృతిచెందాడు. భూమేశ్ స్నే హితుడైన దినేశ్తో కలిసి ద్విచక్ర వాహనంపై రాయికల్ నుంచి చింతలూరు వైపు వెళ్తున్నా రు. భూపతిపూర్ శివారులో వాహనం అదుపుతప్పి రేలింగ్కు ఢీకొనడంతో భూమేశ్ తలకు తీవ్రగాయాలై మృతిచెందాడు. గాయపడిన దినేశ్ను ఆస్పత్రికి తరలించారు. -
ఒకటా.. రెండా.. మానేరు దాటిందా?
మంథనిరూరల్: పెద్దపులి సంచారంపై రెండు జిల్లా ల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన పెద్దపులి.. 20 రోజులుగా అటవీశాఖ అధికారులను ముప్పు తిప్ప లు పెడుతోంది. ఈనెల 15న పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పులి.. 28వ తేదీ వరకు వివిధ అ టవీ ప్రాంతాల్లో సంచరించింది. మానేరు దాటి భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నా రు. ఇప్పటివరకు మానేరు దాటినట్లు ఆనవాళ్లు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. రెండు జిల్లాల్లో సంచరిస్తున్నది ఒక్కటేనా? లేక మరొకటి కూడా ఉందా? అనే సందిగ్ధం నెలకొంది. శ్రీరాంపూర్ ప్రాంతం నుంచి.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతం నుంచి ఈనెల 15న పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పులి రామగుండంలోని మేడిపల్లి శివారు ఓసీపీ డంప్ ప్రాంతంలో సంచరించినట్లు డీఎఫ్ఓ శివయ్య ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు గుర్తించి అప్రమత్తమయ్యారు. సుమారు నాలుగు రోజుల పాటు ఆ ప్రాంతంలోనే మకాం వేసిన పెద్దపులి.. ఈనెల 23న గోదావరినది దాటి అవతలివైపు వెళ్లినట్లు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండురోజులకే మళ్లీ.. పదిరోజులపాటు రామగుండం ఓసీపీల్లోనే మకాం వేసిన పెద్దపులి.. ఈనెల 23న మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద గోదావరినది దాటిన ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. నది దాటి వెళ్లిపోయిందని భావించిన నేపథ్యంలో మళ్లీ రెండురోజులకే జైపూర్, పౌనూరు, శివ్వారం మీదుగా ఎల్.మడుగు వద్ద ఖాన్సాయిపేట–ఆరెంద ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అధికారులు అడుగులను గుర్తించారు. పులి అడుగులను అనుసరిస్తూ సుమారు 15 కిలోమీటర్లు వెళ్లిన అధికారులు.. భట్టుపల్లి ప్రాంతంలో ఉన్నట్లు నిర్ధారించి సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరుసటి రోజున పులిజాడ కోసం అన్వేషించినా ఇప్పటివరకు ఫలితం లభించలేదు. మానేరు తీరంలో గాలింపు.. భట్టుపల్లి అడవుల నుంచి ఎటువైపు వెళ్లిందోనని గాలిస్తున్న క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఓ ఎద్దుపై పెద్దపులి దాడి చేసిన సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఆరెంద, వెంకటాపూర్, అడవిసోమన్పల్లి మానేరు తీరం వెంట పులి అడుగులను గుర్తించేందుకు ఎఫ్ఎస్వోలు నర్సయ్య, రహ్మతుల్లా హుస్సేన్, సోనికిరణ్, ఎండీ అఫ్జల్ అలీ, ఎఫ్బీవోలు ప్రదీప్, శ్రీకాంత్, రాంసింగ్, ప్రవీణ్తో పాటు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మానేరు ఎక్కడి నుంచి దాటిందని గుర్తించేందుకు అడుగుల జాడల కోసం సోమవారం సైతం అన్వేషణ చేశారు. ఒక్కటేనా.. మరొకటి వచ్చిందా? పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి.. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఎద్దుపై దాడిచేసిన పులి ఒక్కటేనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా నుంచి భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించాలంటే మానేరు దాటాల్సి ఉంటుంది. అయితే పెద్దపులి ఎక్కడి నుంచి మానేరు దాటి ఉంటుందని అటవీ అధికారులు అడుగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మంథనితో పాటు ముత్తారం మండలాల్లోని మానేరు పరీవాహక ప్రాంతాల్లో అధికారులు పులి అడుగుల అన్వేషణ కొనసాగుతోంది. -
ఆ ఒక్కటి అడగొద్దు..!
మంథని: అవుట్ సోర్సింగ్.. పార్ట్ టైం ఉద్యోగం పేరిట వివిధ శాఖల్లో వేలాది మంది బోగస్ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ప్రభుత్వం వారిని తొలగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఆర్ఖిక శాఖ విధుల నుంచి తొలగించింది. కానీ, వారంతా ఇప్పటికీ అనధికారికంగా విధుల్లోనే కొనసాగుతున్నట్లు సమాచారం. విధుల్లోనే కంప్యూటర్ ఆపరేటర్లు.. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసే సుమారు 300 మంది ఉద్యోగుల్లో 190 మందిని అక్టోబర్ 10న తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 300 మందిలో 190 మంది కంప్యూటర్ ఆపరేటర్లు కాగా మిగతా వారు అటెండర్లు, షరాప్లు ఉన్నారు. అటెండర్లు, షరాప్లను కొనసాగిస్తూ 190 సిస్టం ఆపరేటర్లను విధుల్లోంచి తొలగించారు. ఈశాఖలో పనిచేసే షరాప్, అటెండర్లు నెలకు రూ.16,500 వేతనంపైనే నెట్టుకు వస్తున్నారు. వీరికి చాలీచాలని వేతనాలు వస్తున్నాయని ఆందోళన ఉన్నారు. తక్కువ వేతనాలు ఉండడంతో అందరినీ కొనసాగించాలని ఉద్యోగులు విన్నవించారు. ఈమేరకు ఏటా వారి విధులను పొడిగిస్తున్నారు. కానీ, సిస్టం ఆపరేటర్ల విషయంలో ప్రభుత్వం కనికరం చూపలేదు. మరోవైపు.. ప్రభుత్వం వారిని విధుల్లోంచి తొలగించినా ఆయా కార్యాలయాల్లో అనధికారికంగా కొనసాగుతున్నట్లు సమాచారం,. వేతనాల చెల్లింపుపై అనుమానాలు ఆర్థికభారం తగ్గించుకునేందుకు రిజస్ట్రేషన్ల శాఖలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న సిస్టం ఆపరేటర్లను తొలగించి అదే శాఖలో రెగ్యులర్ ఉద్యోగులను ఆ విధులను చూసుకోవాలని ప్రభు త్వం సూచించింది. కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చాలాచోట్ల సిస్టం ఆపరేటర్లు యథావిధిగా పనులు చేస్తూనే ఉన్నారని సమాచారం. వీరికి అవుట్ సోర్సింగ్ పద్ధతిన ప్రతినెలా రూ.19.500 చొప్పున చెల్లించేవారు. ప్రభుత్వం వారిని తొలగించడంతో వీరికి వేతనాలు ఎవరు చెల్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై జిల్లాలోని ఓ అధికారిని వివరణ అడిగేందుకు యత్నించగా ‘ఆ ఒక్కటి అడక్కు’ అని సమాధానమిచ్చారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రైవేటు పర్సన్ హవా? రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం ఉంది. కీలకమైన విభాగాలు వారే చూస్తూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నడిపిస్తున్నారు. చాలాకార్యాలయాల్లో రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ల కొరత ఉండడం, దీనికితోడు ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం అధికంగా కొనసాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దస్తావేజు లేఖరులు సైతం తమ పరిధిని మించిన పనులు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తొలగించినా.. విధుల్లోనే కొనసాగింపు సబ్రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతీనెల వేతనాల చెల్లింపుపై అనేక అనుమానాలు -
పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు
గోదావరిఖనిటౌన్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో 1999–2000 బ్యాచ్కు చెందిన పదోతరగతి విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. ఇందుకు స్థానిక ఒక ఫంక్షన్ హాల్ వేదికై ంది. చిన్ననాటి తరగతి గది జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చదువు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. స్కూల్ కరస్పాండెంట్ పొరండ్ల మధు, పూర్వ ఉపాధ్యాయులు మల్లికార్జున్రెడ్డి, కల్వల నాగరాజు, రమేశ్, తిరుపతి, రాజన్న, సునీల్, సత్యనారాయణ, పూర్వ విద్యార్థులు సుకాంత్, రవి, సతీశ్, రషీద్, రాజేశ్, శ్రీలతరెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు. -
బోధన్ రైలుకు బోర్డేది..!
రామగుండం: రైలు నంబర్ 67771 సిర్పూర్టౌన్–కరీంనగర్ వెళ్లే మెమూ ప్యాసింజర్ రైలు కొద్ది క్షణాల్లో రెండో నంబర్ ప్లాట్ఫారంపై రానున్నదంటూ.. రామగుండం రైల్వే స్టేషన్లో ఉదయం 11.05 గంటలకు రానున్న సమయంలో ముందస్తుగా రైల్వే అనౌన్స్మెంట్ చేయనున్నారు. కానీ మెమూ(మెయిన్లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైలు మాత్రం బోధన్ వరకు వెళ్లనుందనే విషయం అసలు ప్రయాణికులకు తెలియకపోవడం గమనార్హం. రైలు నం.67771 సిర్పూర్టౌన్–కరీంనగర్, రైలు నం.67773 కరీంనగర్–బోధన్ వరకు రెండు నంబర్లతో రైలు నడుస్తుంది. అదే రైలు తిరుగు ప్రయాణంలో రైలు నం.67774 బోధన్–కరీంనగర్, రైలు నం.67772 కరీంనగర్ నుంచి సిర్పూర్టౌన్ వరకు. కాగా రైల్వే యాప్లో సిర్పూర్టౌన్ నుంచి బోధన్ వరకు రైళ్లను పరిశీలిస్తే స్పష్టమైన సమాచారం రాకపోవడం గమనార్హం. నంబర్తో పని లేకుండా.. రైలు నంబర్తో పని లేకుండా నేరుగా సదరు రైలు గమ్యస్థానానికి వెళ్లే ప్రాంతాన్ని అనౌన్స్మెంట్ చేయడంతో కొత్తగా వెళ్లే ప్రయాణికులకు అర్థమవుతుంది. ఒకవేళ కరీంనగర్ వరకు వెళ్లే రైలు నంబర్తో అనౌన్స్మెంట్ చేసినా.. గమ్యస్థానాన్ని సైతం అనౌన్స్ చేస్తే ప్రయాణికుల నుంచి విశేష స్పందన ఉంటుంది. సమయం ఆదా.. సిర్పూర్టౌన్ నుంచి నేరుగా బోధన్కు వెళ్లే ప్రయాణికులు అతి తక్కువ చార్జీలతో.. తక్కువ సమయంలో.. సుఖమయమైన ప్రయాణం చేసే అవకాశమున్నా.. రైల్వే శాఖ వైఫల్యంతోనే ప్రయాణికుల నుంచి ఆదరణ కరువైంది. కరీంనగర్ వరకు ఒక నంబర్, అక్కడి నుంచి బోధన్కు మరో రైలు నంబర్ ఉండడంతో.. సమాచారంపై అస్పష్టతతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. చార్జీలు అతి స్వల్పం సిర్పూర్టౌన్(కొమురంభీం జిల్లా) నుంచి బోధన్(నిజామాబాద్ జిల్లా) వరకు మెమూ ప్యాసింజర్ రైలు రాకపోకలు సాగిస్తోంది. సిర్పూర్టౌన్–కరీంనగర్ వరకు 143 కిలోమీటర్లు. కరీంనగర్ నుంచి బోధన్కు 169 కిలోమీటర్లు. మొత్తంగా 312 కిలోమీటర్ల దూరం. ఈ మెమూ రైలులో సిర్పూర్టౌన్ నుంచి బోధన్ వెళ్లేవారికి గరిష్టంగా ఆరు గంటల సమయం పడుతుండగా.. చార్జీ మాత్రం రూ.100 లోపే ఉండడం విశేషం. -
కొనసాగుతున్న శిబిరం
పెద్దపల్లిరూరల్: స్థానిక శ్రీసరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శనివారం మొదలైన త్రితీయ సోఫాన్ టెస్టింగ్ క్యాంపు ఈనెల 29వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా కార్యదర్శి జ్యోతి తెలిపారు. ఆదివారం నాటి కార్యక్రమంలో గాయత్రీ విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ స్కౌట్ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని పలు విద్యాసంస్థలకు చెందిన 76 మంది గైడ్స్, 11 మంది గైడ్ కెప్టెన్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు శ్రీధర్ రాజు, రఘు సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈకేవైసీపై అధికారుల ప్రత్యేక దృష్టి
పెద్దపల్లి: జిల్లాలో ఇంకా ఈకేవైసీ నమోదు ను పూర్తిచేయని రేషన్కార్డుదారులపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈమేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్దేశిత లక్ష్య సాధన కోసం ప్రత్యేక ప్రణాళిక రచించారు. మరణించిన వారి పేర్లు, నకిలీ కార్డులు తొలగించడానికి వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్కార్డుదారులు అందరూ రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ నమోదు చేయించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇప్పటికే పలుమార్లు జిల్లావాసులకు సూచించారు. వాస్తవానికి రెండేళ్ల క్రితమే ఈప్రక్రియ పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కా నీ జిల్లావ్యాప్తంగా ఆ ప్రక్రియ నత్తనడకన సా గుతోంది. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 76శాతం మాత్రమే ఈకేవైసీ నమోదు పూర్తయిందని డీసీఎస్వో శ్రీనాథ్ తెలిపారు. -
వలసకూలీల సహపంక్తి భోజనం
పెద్దపల్లిరూరల్: యాసంగి వరి నాట్లు ఊపందుకుంటున్నాయి. రైతులు వరినారు పోసుకుని నాటేందుకు సిద్ధంగా ఉన్నా.. కూలీలు లభించడంలేదు. దీంతో పొరుగు గ్రామాల నుంచి రప్పించి నాట్లు వేయిస్తున్నారు. ఎకరాకు 12 మంది నాటు వేసేందుకు అవసరమైతే.. రవాణాతోపాటు వారికి మొత్తంగా రూ.4,800 చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. పెద్దపల్లి పట్టణ శివారు పెద్దమ్మనగర్కు చెందిన కూలీలు వరినాట్లు వేస్తూ ఆదివారం మధ్యాహ్నం వేళ తుర్కలమద్దికుంట శివారులోని ప్రధాన రహదారిపై ఒకేవరుసలో కూర్చుని భోజనం చేస్తూ ఇలా కనిపించారు. -
బైక్ను నడుముకు కట్టుకొని.. బావిలో దూకి..
● పెగడపల్లిలో వ్యక్తి బలవన్మరణం పెగడపల్లి(ధర్మపురి): మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన బైక్ను తాడుతో నడముకు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కిరణ్కుమార్ వివరాల ప్రకారం.. బండారు వెంకటేశం(50) కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. శనివారం మధ్యాహ్నం తన బైకుపై బయటకు వెళ్లిన వెంకటేశం.. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆదివారం కుంటుంబ సభ్యులు వెతికారు. గ్రామ శివారులోని దాసరి పాపయ్య అనే రైతు వ్యవసాయ బావి వద్ద చెప్పులు, ఇతర వస్తువులు కనిపించాయి. బావిలో చూడగా.. బైక్తో సహా వెంకటేశం మృతదేహం లభించింది. మృతుడి భార్య గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. వేములవాడ: భీమన్నను ఆదివారం 20వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఈనెల 30న ఉదయం 3 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాల అనంతరం భీమేశ్వరాలయంలో 4 నుంచి 4.30 గంటల వరకు ఆలయ శుద్ధి, 4.30 నుంచి 5 గంటల వరకు ప్రాతఃకాల పూజ, 5.45 గంటలకు పల్లకీసేవలపై ఉత్తరద్వార ప్రవేశం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. -
మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ మేడ్చల్
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో 2 రోజులుగా కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న 12వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర ఓవరాల్ చాంపియన్షిప్ను మేడ్చల్ జిల్లా జట్టు కై వసం చేసుకోగా.. రన్నరప్ను రంగారెడ్డి జిల్లా జట్టు గెలుచుకుంది. సాయంత్రం విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్గౌడ్ ట్రోఫీలను ప్రదానం చేశారు. 18 జిల్లాల నుంచి సుమారు 900 మందికి పైగా 30 నుంచి 90 సంవత్సరాల వయస్సు వారు పోటీలకు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్ర పోటీల్లో రాణించిన అథ్లెట్లను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. వివేకానంద విద్యాసంస్థల అధినేత సౌగాని కొంరయ్య, కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ చాట్ల శ్రీధర్, నీలం లక్ష్మణ్, డి.లక్ష్మి, కిషన్రావు, శిరీష, శాట్స్ రిటైర్డ్ ఏడీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జోరు.. రన్నింగ్, త్రోస్, జంప్స్ విభాగాల్లో రాణించి ఎక్కువ పతకాలు కై వసం చేసుకున్న మేడ్చల్ జిల్లా జట్టు 581 పాయింట్లతో చాంపియన్గా నిలిచింది. రంగారెడ్డి జిల్లా జట్టు 252 పాయింట్లతో ద్వితీయ చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. మేడ్చల్ పురుషుల విభాగంలో 250, మహిళల విభాగంలో 331 పాయింట్లు సాధించింది. పతకాలు ప్రదానం చేసిన ఎమ్మెల్యే గంగుల ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించారు. పలువురు విజేతలకు బంగారు, రజత, కాంస్య పతకాలను ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వయస్సు తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. మాస్టర్ల స్టెప్పులు.. పోటీలు ముగియడంతో.. వివిధ జిల్లాలకు చెందిన అథ్లెట్లు ఆడుతూ పాడుతూ అదిరేటి స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. గెలిచిన, ఓడినవారు అనే తేడా లేకుండా ఆరోగ్యానికి వ్యాయామం అవసరమన్న సంకేతంతో జానపద పాటలపై నృత్యాలు చేసిన తీరు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. ద్వితీయ స్థానంలో రంగారెడ్డి ముగిసిన 12వ రాష్ట్రస్థాయి పోటీలు -
సుల్తానాబాద్ చేరిన ఎస్సారెస్పీ నీరు
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: యాసంగి పంటల సాగు కోసం ఎస్సారెస్పీ ద్వారా వారబందీ పద్ధతిన ఈనెల 24వ తేదీన విడుదల చేసిన సాగునీరు ఆదివారం స్థానిక పూసాల సమీప ఎస్సారెస్పీ కాలువలోకి వచ్చిచేరింది. జూలపల్లి, ఎలిగేడు నుంచి సుల్తానాబాద్ వరకు కాలువద్వారా నీరుచేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జగిత్యాల జిల్లాకు కేటా యించిన నీటిలో అదనపు నీటిని వృథా చేయ కుండా పెద్దపల్లి జిల్లాకు తరలిస్తున్నారని, ఇది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదని అధికారు లు చెబుతున్నారు. వాస్తవంగా ఎస్సారెస్పీ నీ రు వచ్చే ఏడాది జనవరి 2న జిల్లాకు చేరాలి.కళాకారులను ఆదుకోవాలి పెద్దపల్లి: జానపద కళాకారులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని తెలంగాణ జానపద సకలవృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్యగౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక నందన గార్డెన్స్లో ఆదివారం జరిగిన కళాకారుల సమావేశంలో మాట్లాడారు. గుర్తింపుకార్డులు ఇవ్వాలని, వృద్ధులకు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, జానపద కళలను భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్ర బోస్ మాట్లాడారు. నాయకులు, కళాకారులు సారయ్యగౌడ్, ఎద్దు మమత, కేశవేణి రమాదేవి, బూడిద అనసూయ, కొమురయ్య, నాంపల్లి, సింధుజ, కందుకూరి లలిత, మల్లమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. విద్యారంగానికి పెద్దపీట ● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఎలిగేడు(పెద్దపల్లి): ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శివపల్లిలోని తన నివాసంలో తెలంగాణ టీచర్స్ షెడరేషన్(టీఆర్టీఎఫ్) రూపొందించిన 2026 క్యాలెండర్, డైరీని ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను సమీప హ్యాబీటేషన్లకు అనుసంధానం చేసి పునరుద్ధరించాలని అన్నారు. టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, జిల్లా ప్రఽఽధాన కార్యదర్శి సంతోష్కుమార్, నాయకులు లక్ష్మీనారాయణ, రవికుమార్, మహేందర్రెడ్డి, అశోక్కుమార్, శ్రీనివాస్, రవీందర్రావు, విఠల్, ప్రేమ్సాగర్, మహేశ్కుమార్, రమేశ్, కరుణాకర్రెడ్డి, నాగరు, లక్ష్మీనారాయణ, రమేశ్, మహేందర్, దస్తగిరి పాల్గొన్నారు. కాగా, సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల సర్పంచ్(స్వతంత్ర) కంపెల్లి సతీశ్కుమార్, వార్డుసభ్యులు ముత్యం జ్యోశీల, దుగ్యాల భూంరావు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘పరిషత్’లో సత్తా చాటుతాం పెద్దపల్లిరూరల్: పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని బీజేపీ జిల్లా పరిశీలకుడు నాగపురి రాజమౌళి అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. పెద్దపల్లి, మంథని, రామగుండం సెగ్మెంట్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతోపాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారనే ధీమా వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు మీస అర్జున్రావు, గొట్టిముక్కుల సురేశ్రెడ్డి, హనుమంతుగౌడ్, రావుల రాజేందర్, మహేశ్, పల్లె సదానందం, కడారి అశోక్రావు, కందుల సంధ్యారాణి, నల్ల మనోహర్రెడ్డి, మహేందర్, నిర్మల, రాము, అమరగాని ప్రదీప్, భాస్కర్రెడ్డి, శివంగారి సతీశ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, క్రాంతి, రాజేందర్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
గొల్లపల్లి(ధర్మపురి): అబ్బాపూర్లో రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రెడపాక లింగయ్య(57), లచ్చవ్వ(49) గ్రామంలో మేసీ్త్ర పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం లచ్చవ్వ బంధువుల ఇంటికి హైదరాబాద్ వెళ్లేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంపై దంపతులిద్దరూ కలిసి జగిత్యాల వెళ్తుండగా.. జగిత్యాల నుంచి గొల్లపల్లి వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన తవేరా వాహనం గొల్లపల్లి శివారులో బలంగా ఢీకొంది. లచ్చవ్వ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలపాలైన లింగయ్యను చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ రాంనర్సింహారెడ్డి వివరాలు సేకరించారు. వీరికి వివాహమైన కొడుకు, కూతురున్నారు. కోడలు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. మంథనిరూరల్: రెండు రోజులుగా పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో సంచరించిన పెద్ద పులి.. ఆదివారం మానేరు నది దాటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం సాయంత్రం మంథని మండలం భట్టుపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. ఆదివారం తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. భట్టుపల్లి అటవీ ప్రాంతం నుంచి అడవిసోమన్పల్లి మానేరు నదిలో పులి అడుగుల కోసం అన్వేషణ చేపట్టారు. అయితే మానేరు తీర ప్రాంతంలో అడుగులు కన్పించకపోవడంతో అధికారులు అడవిలోనే మకాం వేసినట్లు భావించారు. కానీ ఆదివారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఓ ఎద్దుపై దాడి చేసినట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంథని, ముత్తారం మండలాల్లోని మానేరు తీర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లభించలేదు. అయితే ముత్తారం మండలం ఓడేడ్, అడవిశ్రీరాంపూర్ మానేరు నది మీదుగా చిట్యాల వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఎఫ్ఎస్వోలు నర్సయ్య, రహ్మతుల్లా హుస్సేన్, సోని కిరణ్, ఎండీ అఫ్జల్ అలీ, ఎఫ్బీవోలు ప్రదీప్, శ్రీకాంత్, రాంసింగ్, ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
జాతరకు ముందస్తు చర్యలేవి..?
సుల్తానాబాద్రూరల్: మినీ మేడారంగా ప్రసిద్ధి గాంచిన నీరుకుల్ల–వేగురుపల్లి గ్రామాల మధ్య ఉన్న శ్రీరంగానాయకస్వామి ఆలయం సమీపంలో ఉన్న సమ్మక్క–సారలమ్మ జాతర అత్యంత వైభోవంగా జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో రెండేళ్లకోసారి జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వన దేవతకు ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ మేడారం కోయ పూజారులు వచ్చి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాతరకు దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు వస్తుంటారు. జాతర సమీపిస్తున్నా ముందస్తు చర్యలేమి ఎండోమెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు చేపట్టకోవడంతో.. జాతరలో తిప్పలు తప్పేట్లు లేవని భక్తులు వాపోతున్నారు. ఇబ్బందులు తప్పేనా? రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే సమ్మక్క–సారలమ్మ జాతర 2026 జనవరి చివరి వారంలో జరగనుంది. భక్తులు బస చేసేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. ధ్వంసమైన రోడ్డును మరమ్మతు చేసి భక్తులు బస చేసేందుకు, వంటలు చేసుకునేందుకు వీలుగా జాతర సమీపంలోని పంట పొలాల్లో పంటలు సాగు చేయకుండా ఆయా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని చర్యలు తీసుకునేవారు. ప్రస్తుతం రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో మానేరు వాగులో భక్తులు బస చేసేవారు. చెక్ డ్యాం నిర్మాణంతో నీటితో నిండి ఉండడంతో జాతర సమీపంలో ఉన్న పంట పొలాలే దిక్కయ్యే పరిస్థితి ఉంది. రంగనాయకస్వామి దేవాలయం ఎండోమెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి జాతర నిర్వహిస్తారు. రోడ్లు ఇలా.. వెళ్లేదెలా.. నీరుకుల్ల నుంచి జాతర ప్రాంతానికి దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు పూర్తిగా చెడిపోవడంతో ప్రయాణం నరకంగా ఉంది. గద్దెల వద్దకు వెళ్లే రోడ్డు మానేరు వాగు నీటి ఉధృతికి కొట్టుకుపోగా.. తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. ఈ రోడ్లతో వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులతోపాటు ట్రాఫిక్కు అంతరాయం కల్గనుంది. కమిటీ జాడ ఎక్కడ? శ్రీరంగనాయకస్వామి ఆలయం ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఎన్నుకొని జాతర సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. జాతర జరిగేందుకు నెల రోజులే ఉన్నా.. కమిటీ ఎన్నిక జరగలేదు. జనవరిలో జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర నీరుకుల్లకు దాదాపు 3 లక్షలకు పైగా భక్తుల రాక ప్రతిసారీ ట్రాఫిక్తో తిప్పలు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న భక్తులు -
కబడ్డీ చాంపియన్లు సూర్యాపేట, హైదరాబాద్–2
మహిళల రన్నర్గా రంగారెడ్డి జిల్లా జట్టు మహిళల చాంపియన్షిప్ కై వసం చేసుకున్న హైదరాబాద్–2 జట్టు కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో 4 రోజలపాటు జరిగిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో సూర్యాపేట జిల్లా జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకోగా.. మహిళల విభాగంలో హైదరాబాద్–2 జట్టు విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో రన్నర్గా జోగులాంబ గద్వాల్ జట్టు, తృతీయ స్థానాల్లో నిజామాబాద్, నాగర్ కర్నూల్ నిలిచాయి. మహిళల విభాగంలో రన్నర్గా రంగారెడ్డి జిల్లా జట్టు, తృతీయ స్థానాల్లో వరంగల్, ఖమ్మం జట్లు నిలిచాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు రెండు ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు ఇచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పోటీలతో కబ్డడీకి మరింత క్రేజ్ వచ్చిందన్నారు. మహిళల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు హైదరాబాద్లోని పటాన్చెరులో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగుతాయని రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్రెడ్డి తెలిపారు, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్ సంపత్రావు, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, జిల్లా కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అమిత్కుమార్, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు. రన్నర్గా నిలిచిన జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి జిల్లాలు ముగిసిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీలు ట్రోఫీలు ప్రదానం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
సంప్రదించాల్సిన ఫోన్నంబరు : 98490 22772 సమయం : ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
మల్లన్నకు బోనం మొక్కులు ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధి ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారికి బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆకట్టుకున్న శోభాయాత్ర యైటింక్లయిన్కాలనీ: యాదవ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం మల్లన్నస్వామి బోనాల శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. షిర్కే బస్స్టాప్ చౌరస్తా నుంచి న్యూమారేడుపాక శ్రీనాగుల మల్లికార్జునస్వామి ఆలయం వరకు యాత్ర కొనసాగింది. దారిపొడవునా ఒగ్గు కళాకారులు విన్యాసా లు, కళాకారులు కోలాటాలతో ఆకట్టుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారికి బోనాలతో నైవే ద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కా ర్యక్రమంలో నాయకులు గడ్డం తిరుపతి, కేశవులు, సాంబమూర్తి, మల్లేశ్యాదవ్ పాల్గొన్నారు. ఎన్టీపీసీలో ఉల్లాస్ మేళా జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పర్మినెంట్ టౌ న్షిప్లో ఆదివారం ఉల్లాస్ మేళా ఘనంగా ని ర్వ హించారు. ఎన్టీపీసీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్విందం సిన్హా కేక్ కట్ చేసి మేళా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, ఎన్టీపీసీలో అన్ని రాష్ట్రాల ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారన్నా రు. అందరి సహకారంతో విద్యుత్ ఉత్పత్తితో పాటు ఉద్యోగుల అభ్యున్నతికి సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈడీ చందన్ కుమార్ సామంత, ఏజీఎం బిజయ్కుమార్ సిగ్దర్, అధికారులు పాల్గొన్నారు. యాసంగి సాగు వివరాలు(ఎకరాల్లో) పప్పు దినుసులపై నిరాసక్తత పప్పుదినుసుల సాగుపై రైతులు ఆసక్తి చూపడంలేదు. కంది గెట్టు పంటగా మారగా, పెసర, మినుము, వేరుశనగ లాంటి పంటలు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. 2022లో 691 ఎకరాల్లో కంది సాగు చేసిన రైతులు.. 2023లో 159 ఎకరాలు, 2024లో 169 ఎకరాల్లో పండించారు. ఈఏడాది 110 ఎకరాలకే పరిమితం చేశారు. వేరుశనగ నాలుగెకరాల్లోనే సాగవడం గమనార్హం. దిగుబడిపై ప్రభావం వాతావరణ పరిస్థితులు ఈఏడాది దిగుబడిపై ప్రభావం చూపాయి. వానాకాలం వరి పంట చేతికి అందే దశలో కురిసిన అకాల వర్షాలకు జరిగిన నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. పత్తిపై ప్రభావం చూపడంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. – శ్రీనివాస్, డీఏవో -
అకాలం.. అన్నదాత ఆగం
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పెద్దపల్లిరూరల్: చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో రైతులు యాసంగి సాగులో నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది జనవరి 2న ఎస్సారెస్పీ నీరు జిల్లాకు చేరుకుంటుంది. దీనిఆధారంగా రైతులు వరి, మొక్కజొన్న వేయాలని చూస్తున్నారు. చలితీవ్రత అధికంగా ఉండడంతో కొన్నిచోట్ల నారుమడులు దెబ్బతింటున్నాయి. కూనారం వ్యవసాయ పరిశోధనాకేంద్రం శాస్త్రవేత్తలు మేలు రకం వంగడాలనే విత్తాలని సూచిస్తున్నారు. ధర ఉన్నా దిగుబడి రాలే ఈ సారి పత్తి సాగు చేసిన రైతులు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించలేదు. దిగుబడి తగ్గాక ప్రస్తుతం క్వింటాల్ ధర రూ.7,400కుపైగా పలుకుతోంది. దీంతో తెల్లబంగారం సిరులు కురిపిస్తుందని ఆశపడ్డ రైతులు దిగాలు చెందుతున్నారు. సీసీఐ ఆంక్షలతో అవస్థలు.. పత్తి విక్రయాలపై కాటన్కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా(సీసీఐ) విధించిన ఆంక్షలు ఇటు రైతులు, అ టు మిల్లర్లు, అడ్తివ్యాపారులను ఇబ్బందులకు గురిచేశాయి. కపాస్ యాప్ ద్వారా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవడంపై అవగాహన లేనిరైతులు ఆందోళన చెందారు. ఎకరాకి గతంలో 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసిన సీసీఐ.. ఈ ఏడాది 7 క్వింటాళ్లకే పరిమితం చేయడం వివాదానికి దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగడంతో కొనుగోళ్లు సాధారణంగానే సాగాయి. ధాన్యం తేమశాతం రాక.. ధాన్యం దిగుబడి కూడా ఆశించిన మేర రాలేదు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే తేమశాతం లేదని నిర్వాహకులు కొర్రీలు పెట్టారు. రైతులు రోజుల త రబడి నిరీక్షించారు. ఒక్కోటి రూ.15 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ధాన్యం ఆరబెట్టే యంత్రాల(డయ్యర్)ను జిల్లాకు ఐదు చొప్పున కేటాయించారు. ఇవి ఇప్పటివరకు ఒక్కగింజను కూడా ఆరబెట్టలేదు. రైతులకు రోడ్లే దిక్కయ్యాయి. కొందరు రైతులకు ఇంకా బోనస్ డబ్బులు జమకాలేదు. రైతుబీమా వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు రైతుబీమా వర్తింపజేశారు. జిల్లాలో 94,473 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఆరేళ్లలో 2,208 మంది రైతులు మరణించారు. అందులో 2,190 మంది కుటుంబాలకు బీమా సొమ్ము జమచేశారు. రైతుభరోసా ద్వారా ఈఏడాది 1,51,507 మంది రైతులకు రూ.1,61,02,63,368 అందజేశారు. పీఎం కిసాన్ సమ్మాణ్నిధి రైతుల సంఖ్య ఐదేళ్లక్రితం 83,419 ఉండగా.. 31 జూలై 2025 నాటికి వారి సంఖ్య 61,048కే పరిమితమైంది. పండ్లు, కూరగాయలకు ప్రోత్సాహం పండ్లతోటలు, కూరగాయల సాగునుప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. ధ ర్మారం, జూలపల్లి మండలాల్లోని మామిడితోటల్లో నాణ్యమైన దిగుబడికి బంచ్కవర్ పద్ధతి పాటించేలా రైతులకు ఉద్యానవన అధికారులు సూచనలిస్తున్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన నరేశ్ డ్రాగన్ ప్రూట్ సాగుచేసి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఆయిల్పాంపై ప్రత్యేక దృష్టి.. ఆయిల్పాం సాగుచేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది. 2,500 ఎకరాల సాగు లక్ష్యంగా నిర్దేశించగా.. ఇప్పటివరకు 500 ఎకరాల్లో పంట సాగుచేశారు. మరో 350 ఎకరాల్లో సాగుకానుంది. అంతరపంటగా చాకొలేట్ తయారీకి అవసరమయ్యే కొకొవా రకం పంట సాగును ఈఏడాది నుంచే అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యాడ్బరీ అనే చాకొలేట్ కంపెనీ ప్రతినిధులు ఇటీవలే రైతులకు అవగాహన కల్పించారు.ఈ ఏడాది వ్యవసాయ రంగంపై వాతావరణ ప్రతికూల పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపాయి. అన్నదాతలు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించలేక పోయారు. గతేడాది వానాకాలంలో ధాన్యం దిగుబడి మెరుగ్గా ఉండగా.. ఈసారి పంట చేతికందే దశలో వాతావరణంలో మార్పులు, అకాల వర్షాలు ఆగం చేశాయి. జిల్లాలో వరి 2,12,000 ఎకరాలు, పత్తి 49,482 ఎకరాల్లో సాగు చేశారు. ఆదిలోనే అన్నదాతకు అనేక కష్టాలు పంట చేతికొచ్చే దశలో ఆగని వానలు ధరలు పెరిగినా బాగా తగ్గిన పత్తి దిగుబడి గతేడాది దిగుబడి ఘనం.. ఈసారి అంతంతే నల్లరేగడి నేలలు(ఎకరాల్లో) 1,10,504 ఎర్ర నేలలు(ఎకరాల్లో) 1,79,330 ఇసుక నేలలు(ఎకరాల్లో) 5,360 రైతుల సంఖ్య 1,61,032 వానాకాలం సాగు వివరాలు(ఎకరాల్లో) జిల్లా సమాచారం -
బుధవారంపేట శివారులో ఉద్రిక్తత
రామగిరి(మంథని): బుధవారంపేట గ్రామ శివారులోని ఎనిమిదో వార్డులో మిళ్లకు నంబర్లు వేసేందుకు శనివారం వచ్చిన సింగరేణి, రెవెన్యూ అధికారుల చర్యలతో తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. మూడు, నాలుగు రోజులుగా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్లకు నంబర్లు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారంపేట శివారులో ఇళ్లకు నంబర్లు వేసేప్రక్రియను సింగరేణి అధికారు లు కొందరి స్వార్థపరుల సహకారంతో చేపట్టారని గ్రామస్తులు ఆరోపించారు. అధికారులను అడ్డుకు నే క్రమంలో ప్రజలను మభ్యపెట్టి విభజించే ప్రయ త్నం జరిగిందని, పోలీసు బందోబస్తు మధ్య దౌర్జ న్యంగా నంబర్లు వేశారని పేర్కొన్నారు. నడిరోడ్డు పైకి వచ్చి స్వచ్ఛందంగా నిరసనకు దిగారు. తమ ప్రాణాలైనా అర్పిస్తామని, కానీ తమ ఇళ్లు, తమ హక్కులు వదులుకోబోమని నినాదాలు చేశారు. కొంతమంది నాయకులు తమ స్వార్థ ప్రయోజనా ల కోసం సింగరేణికి తొత్తులుగా మారి గ్రామ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమ్మతి లేకుండా చేపట్టే ఎలాంటి చర్యలనైనా తీవ్రంగా వ్యతిరేకి స్తామని వారు స్పష్టం చేశారు. ఇళ్ల నంబర్ల అంశంపై అధికారుల తీరును వెంటనే మార్చుకోవాలని, ప్రజలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సై శ్రీనివాస్ గ్రామస్తులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. -
ఘనంగా గణపతి హోమం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అయ్యప్ప ఆలయంలో శనివారం గణపతి హోమం ఘ నంగా నిర్వహించారు. రాంపల్లి వామనశర్మ ఆ ధ్వర్యంలో హోమం నిర్వహించగా, అఖిల భా రతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ సభ్యుడు జనగామ తిరుపతి, సభ్యులు సంపత్రావు, న డిపెల్లి రామ్మోహన్రావు, నడిపెల్లి ప్రవీణ్రా వు, శ్రీధర్స్వామి, కృష్ణస్వామి, నారాయణస్వా మి, దీక్షిత్స్వామి, స్వాములు పాల్గొన్నారు. హ్యాండ్బాల్ పోటీలకు ఎంపిక సుల్తానాబాద్రూరల్: గర్రెపల్లి సాంఘిక సంక్షేమ గు రుకుల బాలికల పాఠశాల కు చెందిన శ్రీనిజ రాష్ట్రస్థా యి హ్యాండ్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మంజుల తెలిపారు. శనివారం సిరిసిల్లలో జరిగిన ఉమ్మడి జిల్లా పోటీల్లో ఆమె ప్రతిభ కనబర్చిందన్నారు. విద్యార్థినిని ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. శిక్షణ తర్వాతే విధులు సుల్తానాబాద్రూరల్: శిక్షణ ఇచ్చాకే సర్పంచు లు, ఉప సర్పంచులకు ప్రభుత్వం పాలన బా ధ్యతలు అప్పగిస్తుందని జిల్లా పంచాయతీ అ ధికారి వీరబూచ్చయ్య తెలిపారు. బొంతకుంటపల్లిని శనివారం డీపీవో సందర్శించారు. వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు పరిశీలించారు. కొ త్త సర్పంచులు, ఉప సర్పంచులకు సంక్రాంతి తర్వాత శిక్షణ ఇస్తామని తెలిపారు. సర్పంచ్ శ్రీరంగారావు, ఉపసర్పంచ్ సుమలత, ఎంపీవో సమ్మిరెడ్డి, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. కల్వర్టులపై ఎమ్మెల్యే నిర్లక్ష్యంమంథనిరూరల్: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమి టీ చైర్మన్, మంత్రి అయిన మంథని ఎమ్మెల్యేకు ఇరుకై న కల్వర్టులను బాగుచేయాలనే ఆలోచన లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. అడవిసోమన్పల్లి సమీపంలో ని ఇరుకై న కల్వర్టును శనివారం ఆయన పరిశీలించిన మాట్లాడారు. సీఎంతోపాటు రాహుల్గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉండే మంథ ని ఎమ్మెల్యే.. ఈ ప్రాంత అభివృద్ధికి ఎందుకు ఆలోచన చేయడంలేదో ప్రశ్నించాలన్నారు. నా యకులు శంకర్గౌడ్, కనవేన శ్రీనివాస్, పు ప్పాల తిరుపతి, కొండ రవీందర్, ప్రసాదరా వు, పెగడ శ్రీనివాస్, రాజుగౌడ్, నరేందర్, సంపత్, జంజర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న కూల్చివేతలుజ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అన్నపూ ర్ణకాలనీలోని అక్రమ కట్టడాల కూల్చివేతలు శ నివారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా మేడిపల్లి రోడ్డులోని ఓ ఇంటి ప్రహరీ అక్రమం కట్టడమని గుర్తించిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు.. జేసీబీతో దానిని కూల్చి వేశారు. కొద్దిరోజులు క్రితం అన్నపూర్ణకాలనీ లో కూల్చివేతలు చేపట్టి, కొన్నిఅక్రమ కట్టడాలను గుర్తించిన అధికారులు.. వాటిని తొలగించుకోవాలని ఆదేశాలు జారీచేశారు. కొందరు కూల్చివేయక పోవడంతో శనివారం కూల్చివేతలను కొనసాగించినట్లు సమాచారం. తమ ప్రహరీని కూల్చివేస్తున్న క్రమంలో బాధితురాలు రోదిస్తున్నప్పటికీ కూల్చి వేత ఆగలేదు. హైవే పనులు అడ్డగింత రామగిరి(మంథని): బేగంపేట పరిధిలో చేపట్టిన నేషనల్ హైవే పనులను సర్పంచ్ మంథని చంటి, వార్డు సభ్యులు శనివారం అడ్డుకున్నారు. కొత్త అండర్పాస్లను తక్కువ ఎత్తు, పొడవుతో నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఇలా నిర్మిస్తే భారీవాహనాలు వెళ్లవని తెలిపారు. ప్రజాభద్రత, రవాణా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అండర్పాస్లు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్ సందెల రేణుక, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే శిబిరానికి ఎంపిక ఎలిగేడు(పెద్దపల్లి): సు ల్తాన్పూర్ గ్రామానికి చెందిన అక్కినపల్లి నాగరాజు–శివజ్యోతి దంపతుల కుమారుడు అక్కినపల్లి అభిరామ్ 2026 జనవరి 26న న్యూఢిల్లీలో నిర్వహించనున్న రిపబ్లిక్ డే క్యాంపు(ఆర్డీసీ)కి ఎంపికయ్యాడు. ప్రధాని మోదీ సమక్షంలో క్రమశిక్షణ, ఐక్యత, దేశభక్తి ప్రదర్శించనున్నాడు. అభిరామ్ ఎంపిక అంకితాభావం ,క్రమశిక్షణ, కఠోర శ్రమకు నిదర్శనమని గ్రామస్తులు ప్రశంసించారు. -
సంతోషంగా ఉంది
మా ఊరు పెద్దగుట్ట ప్రాంతంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క – సారలమ్మ జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారు. ఎస్సారెస్పీ కాలువ రోడ్డు పైనుంచి భక్తులు వచ్చేవాహనాలతో దుమ్ము లేచి తరచూ ఇబ్బందులు పడాల్సివస్తున్నది. ఇప్పుడు బీటీరోడ్డు పనులు ప్రారంభించడంతో ఆ బాధలు ఉండవు. రోడ్డు నిర్మించడం చాలాసంతోషంగా ఉంది. – ముత్యాల నరేశ్, తుర్కలమద్దికుంట మాట నిలబెట్టుకున్న ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంతానికి బీటీ రోడ్లు వేయిస్తున్నా. ఈ ప్రాంత ప్రజల ఆరాధ్యదైవాలైన సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు ఇంటిల్లీపాదిగా తరలివస్తుంటారు. వారంతా మట్టిరోడ్లపై ప్రయాణించి పడుతున్న ఇ బ్బందులను దూరం చేసేందుకే ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు కేటాయించి పనులు ప్రారంభించా.– విజయరమణారావు, ఎమ్మెల్యే పెద్దపల్లి -
మాస్టర్ అథ్లెటిక్స్ షురూ
కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి 12వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 60ఏళ్లలోనూ 20 ఏళ్ల యువలా పోటీల్లో పలువరు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ 800 మీటర్ల రన్నింగ్కు జెండా ఊపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్ అథ్లెట్ల మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. పలువరు ఆటల్లో రాణించి.. పతకాలు గెలుచుకున్నారు. -
పెరిగిన నేరాలు
సాక్షి పెద్దపల్లి: ఏటా గుబులు పుట్టిస్తున్న నేరాలు, ఘోరాల సంఖ్య ఈసారి కూడా తగ్గుముఖం పట్టలేదు. అలాగరి గతేడాదితో పోల్చితే తీవ్రమైన నే రాలు, హత్యలు చోటు చేసుకోలేదు. ప్రధానంగా హత్యలు, అత్యాచారాలు, దోపిడీ కేసులు తగ్గినా.. సైబర్ నేరగాళ్ల బారినపడినవారి సంఖ్య భారీగా పె రిగింది. పలు ప్రాంతాల్లో చోరీలు, కిడ్నాప్లు తదిత ర కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహిళలపై వేధింపులు ఆగడం లేదు. వీటితోపాటు రోడ్డుప్రమాదాలు, ఆత్మహత్యలు, మిస్సింగ్ కేసులు కూ డా బాగానే నమోదయ్యాయి. పోలీసుల పటిష్ట చ ర్యలతో జిల్లాలో ఈఏడాది ఎమ్మెల్సీ, గ్రామ పంచా యతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ట్రాఫిక్ జరిమానాలు రూ.13కోట్లు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన కేసలు 4,12,553 నమోదవగా. రూ.13, 67,91,645 జరిమానా విధించారు. డ్రంక్ డండ్ డ్రైవ్ కేసులు 9,678 నమోదు కా గా, 6,772 మందికి రూ.96,45,100 జరిమానా విధించారు. 28 కేసుల్లో చిత్తుగా మద్యం తాగిన వారికి జైలు శిక్ష విధించారు. నెత్తురోడిన రహదారులు.. జిల్లాలో ఈఏడాది 334 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా.. అందులో 126 ఘోరరోడ్డు ప్రమాదాలు, 170 సాధారణ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 137 మంది మరణించారు. 388 మందికి గాయాలపాలయ్యారు. బ్లాక్స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం, వాహనాదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కొరవడడంతో ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈవ్టీజింగ్లో 41మంది మైనర్లు జిల్లాలోని 1,285 హాట్స్పాట్స్ వద్ద షీటీంలు స్కూల్, కాలేజీ, బస్స్టాండ్ తదితర పబ్లిక్ ప్లేస్ల్లో 362మందిని రెడ్హ్యాండడ్గా పట్టుకున్నారు. అందులో 41మంది మైనర్లు ఉన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి 37మందిపై ఈ పెటీ కేసులు నమోదు చేశారు. ఆరుగురికి జీవితఖైదు జిల్లాలో ఈ ఏడాది 41 కేసుల్లో 59 మందికి వివిధ శిక్షలు పడగా, అందులో ఆరుగురికి యావజీవకారా గార శిక్ష పడింది. ఇందులో ముగ్గురికి పదేళ్లు, ఐదు గురికి ఏడేళ్లు, మరో ఐదుగురికి ఐదేళ్లు, ఒకఏడాది నలుగురికి, ఏడాదిలోపు శిక్షలు 12మందికి, కేవలం జరిమానా మాత్రమే విధించిన కేసులు 15.. ఇలా వివిధ రకాల శిక్షలను కోర్టులు విధించాయి. వీరినుంచి రూ.3,53,350 జరిమానా విధించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కేసులు మన వద్దే.. రికవరీ కొంతే జిల్లాలో గతేడాదితో పోల్చితే చోరీలు కొంత తగ్గినట్లుకనిపిస్తున్నా.. రికవరీ శాతం పెరిగినా.. ఆందోళనకరమైన స్థాయిలోనే చోరీలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. -
జీవో 252ను సవరించాలి
పెద్దపల్లిరూరల్: జర్నలిస్టుల హక్కుల ను హరించేలా ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 252ను వెంటనే సవరించాలని టీయూడబ్ల్యూజే హెచ్– 143 నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట శనివారం నిరసన తెలిపా రు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొట్టె సదానందం, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు అంకరి ప్రకాశ్, నా యకులు కాల్వ రమేశ్, ముద్దసాని సమ్మయ్య, ఎ ర్రోజు వేణు, తిర్రి తిరుపతి, కీర్తి రమేశ్, దొమ్మటి రాజేశ్ తదితరులతో కలిసి అడిషనల్ కలెక్టర్ వేణు కు వినతిపత్రం అందజేశారు. అక్రిడిటేషన్కార్డుల జారీవిషయంలో ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకా రం జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపత్రికల ఉనికిని ప్ర మాదంలో పడేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు ఎన్డీ తివారీ, అర్కుటి మల్లేశ్, చిలా రపు కిషన్, కొయ్యడ తిరుపతి, తూర్పటి శ్రీనివాస్, దుర్గం లక్ష్మణ్, తిర్రి సుధాకర్, మారుపాక అంజి, డీఎల్ఎన్ చారి తదితరులు పాల్గొన్నారు. -
తీరనున్న సమ్మక్క భక్తుల తిప్పలు
పెద్దపల్లిరూరల్: తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద గిరిజన దేవుళ్ల వేడుక సమ్మక్క–సారలమ్మ జాతర. ఉత్సవాలకు హాజరయ్యే వేలాది మంది భక్తుల ఇబ్బందులను దూరం చేసేందుకు ప్రధాన రహదారుల నుంచి జాతర ప్రాంతం వరకు బీటీ రోడ్లు ని ర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పె ద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. భక్తులరద్దీ అధికంగా ఉండే పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, కాల్వశ్రీరాంపూర్ మండ లం మీర్జంపేట, పెద్దరాతుపల్లి, ఓదెల మండలం కొలనూర్ గ్రామాల్లో వనదేవతల జాతర వరకూ బీటీ రోడ్డు నిర్మిస్తారు. ఇందుకోసం ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం పనులు ప్రారంభించారు. జాతర వరకు రహదారులు అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. రూ.5.61కోట్లతో పనులు.. పెద్దపల్లి నియోజకవర్గంలోని సమ్మక్క – సారలమ్మ జాతరలు జరిగే ఐదు ప్రధాన ప్రాంతాలకు బీటీ రోడ్డు వేసే పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5.61కోట్లు కేటాయించింది. ఆ నిధులతో పనులను శనివారం ప్రా రంభించారు. వచ్చే ఏడాది జనవరిలో మొదలయ్యే సమ్మక్క – సారలమ్మ జాతర ఉత్సవాల నాటికి రోడ్ల పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట, సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, ఓదెల మండలం కొలనూర్, కాల్వశ్రీరాంపూర్ మండలం మీర్జంపేట జాతర ప్రాంతం వరకు రూ.99లక్షల అంచనా వ్య యంతో బీటీ రోడ్డు పనులు చేపడతారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి వరకు రూ. 1.65కోట్లు వెచ్చిస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి నిర్వహించే జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తా రు. బీటీరోడ్లు అందుబాటులోకి వస్తే భక్తుల రవాణా కష్టాలు తీరుతాయి. కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్రూరల్/ఓదెల(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లి, మీర్జంపేట, ఓదెల మండలం కొలనూర్లో సమ్మక్క జాతర వరకు చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం శంకుస్థాపన చేశారు. ఆయా ప్రాంతా ల్లో జరిగిన కార్యక్రమాలో ఆయన మాట్లాడారు. ఓదెల మండలం కొలనూర్ సమ్మక్క – సారలమ్మ జాతరను మేడారం తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందిస్తామని తెలిపారు. సుల్తానాబాద్ మండలం కేజీబీవీలో అదనపు తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రమశిక్షణతో చదివితే విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు సారయ్యగౌడ్, లంక సదయ్య, రామిడి తిరుపతిరెడ్డి, లత, శైలజ, మనోహర్రావు, కొమురయ్య, రమే శ్, మోహన్, రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్, గాజన వేన సదయ్య, ఉయ్యాల వైకుంఠం, పల్లె కనుకయ్య, పిట్టల రవికుమార్, రంగు మల్లేశ్గౌడ్, మూల ప్రేంసాగర్రెడ్డి, బైరి రవిగౌడ్, చిన్నయ్య, రమేశ్గౌడ్, రాజిరెడ్డి, తిరుమల్రావు, ప్రకాశ్రా వు, కల్లెపల్లి జాని, సతీశ్, విజేందర్రెడ్డి పాల్గొన్నారు. మేడారం తరహాలో కొలనూర్ జాతర -
వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
పెద్దపల్లిరూరల్: నూతన సంవత్సర వేడుకలను ప్ర శాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ భూ క్యా రాంరెడ్డి సూచించారు. స్థానిక పోలీస్స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఫిర్యాదులు, కేసు లు, ఇతరత్రా వివరాలపై ఎస్సై లక్ష్మణ్రావు, సీఐ ప్రవీణ్కుమార్, రూరల్ ఎస్సై మల్లేశ్ను అడిగి తెలుసుకున్నారు. హ్యాపీ న్యూఈయర్ అంటూ యువత అర్ధరాత్రి వరకూ రోడ్లపై తిరిగినా, మద్యం మత్తు లో ఇతరుల హక్కులకు భంగం కలిగించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈనెల 31న పోలీసు అధికారులలు తనిఖీ చేస్తాయని అన్నారు. -
కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళన
కోల్సిటీ: రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న కూల్చివేతలకు నిరసనగా శుక్రవారం అఖిల పక్ష జేఏసీ ఆధ్వర్యంలో బల్దియా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మాజీ ఎ మ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు బీఆర్ఎస్ నా యకులు కౌశిక హరి, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ బల్దియా అధికారులు, కాంగ్రెస్ పాలకులు దుకాణాలను కూల్చివేసి చిరువ్యాపారుల జీవితాలను రోడ్డున పడేస్తున్నారని అన్నారు. గోదావరిఖని చౌరస్తా సమీపంలో తమలపాకులు విక్రయించుకునే సిరిశెట్టి మల్లేశ్కు చెందిన దుకాణాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ, న్యా యం కోసం బాధిత కుటుంబం ఆరురోజులుగా కూల్చిన శిథిలాల ఎదుట నిరసన దీక్ష చేస్తుంటే, బ ల్దియా అధికారులతోపాటు ఎమ్మెల్యే స్పందించకపోవడం బాధాకరమన్నారు. అనంతరం మున్సి పల్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. అఖిల పక్ష జేఏసీ నాయకులు కొండపర్తి సంజీవ్, కోమళ్ల మహేశ్, పిడుగు కృష్ణ, తోట వేణు, మూల విజయారెడ్డి, ఐ.కృష్ణ, గోపు అయులయ్యయాదవ్, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, జేవీ రాజు పాల్గొన్నారు. -
లాంగ్వాల్ పనులు త్వరగా పూర్తి చేయండి
రామగిరి: లాంగ్వాల్ పనులను నిర్దేశించిన సమయంలో త్వరితగతిన పూర్తి చేయాలని ఆపరేషన్స్ డైరెక్టర్ ఎల్వీ.సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం అడ్రియాల లాంగ్వాల్ గనిని సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లాంగ్పనులు పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను జీఎం కొలిపాక నాగేశ్వర్రావు డైరెక్టర్కు వివరించారు. 3వ ప్యానెల్ సాల్వేజింగ్ పనుల పురోగతి, 4వ ప్యానల్ తయారీ పనులపై చర్చించి భద్రతపై పలు సూచనలు చేశారు. అనంతరం గనిలోకి వెళ్లి పాత లాంగ్వాల్ పనులు, నూతన ప్యానల్ పనులను పరిశీలించారు. కార్పొరేట్ సేఫ్టీ, రామగుండం రీజీనల్ సేఫ్టీ జనరల్ మేనేజర్లు కె.సాయిబాబా, ఎస్.మధుసూదన్, ఏరియా ఇంజినీర్ కె.యాదయ్య, ఎస్వోటూ జీఎం బండి సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఇంజినీర్ టి.రఘురాం, సర్వే అధికారి హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్కు ఎంపికకమాన్పూర్: మండలంలోని గుండారం గ్రామ ప రిధిలోని రాజాపూర్కు చెందిన ముకుంద శ్రావణ్ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్కు ఎంపికయ్యాడు. విజన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గతనెల 23న హైదరాబాద్ సరూర్నగర్లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. హామీల అమలులో విఫలంగోదావరిఖని: గత గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యాయని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం వకీల్పల్లిగనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో మాట్లాడారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ 47 హా మీలు, ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ ఆరు గ్యారంటీలు, 39 హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. గతంలో ఉన్న హక్కులు కూడా పోయే పరిస్థితులు కల్పించినట్లు తెలిపారు. గ త గుర్తింపు కార్మిక సంఘంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం 70కి పైగా కార్మిక హక్కులను సాధించిందన్నారు. నాయకులు చెరుకు ప్రభాకర్రెడ్డి, బేతి చంద్రయ్య, వెంకటేశం, రవితేజ, మామిడి తిరుపతి, హరిప్రసాద్, దాసరి శ్రీనివాస్, నరేశ్, చౌడ శ్రీనివాస్, వెంకటస్వామి, రాజారాం, సురేందర్, మల్లేశ్నాయక్, రాజమౌళి, ఆవుల రాములు, సిరిశెట్టి రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు. -
చలి.. పులి
జ్యోతినగర్: జిల్లాలో చలిపులి వణికిస్తోంది. భానుడి భగభగలు మాయమై.. ఎముకలు కొరికే చలి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో పాటు జిల్లాలో సైతం చలి జ్వరాలు ఇంటింటినీ పలకరిస్తోంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పులతో వైరస్లు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా ప్రతీ ఇంటా జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల బాధితులు కనిపిస్తున్నారు. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉష్ణ నియంత్రణ వ్యవస్థపై ఒత్తిడి సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రతను మెదడులోని హైపోథాలమస్ గ్రంథి నియంత్రిస్తుంది. అయితే బయట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతే శరీరంలోని ఉష్ణ నియంత్రణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు 5 నుంచి 13 డిగ్రీల మధ్యే రికార్డవుతుండటంతో బాడీ మెకానిజం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి బీపీ పెరగడం, తద్వారా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోతే, అది హైపోథెర్మియా వంటి ప్రాణాంతక స్థితికి దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజంతా గోరువెచ్చని నీటినే తాగాలని, ఇది గొంతు సమస్యలను దూరం చేయడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుందని చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించాలి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్వెట్టర్లు, మఫ్లర్లు, గ్లౌజులు తప్పనిసరిగా ఉపయోగించాలని, ముఖ్యంగా ముక్కు, చెవుల ద్వారా చలి గాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. శ్వాసకోశ సమస్యలున్న వారు రోజుకు రెండుసార్లు ఆవిరి పడితే ఊపిరితిత్తులకు ఉపశమనం లభిస్తుందని తెలుపుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి తాజా ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వద్ధులు, చిన్నారులు, ఆస్తమా రోగులు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, తెల్లవారుజామున, అర్థరాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవడం ఉత్తమమని, చలి తీవ్రత పెరిగే కొద్దీ బ్యాక్టీరియా విజృంభణ కూడా పెరుగుతుంది కాబట్టి స్వల్ప లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. -
రూ.కోటితో బీటీ రోడ్డు నిర్మాణం
పెద్దపల్లిరూరల్: సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామశివారులో రూ.99 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఈ రోడ్డు పనులు జాతర వరకల్లా పూర్తి చేయిస్తానని తెలిపారు. సర్పంచ్ రాజయ్య, నాయకులు ముత్యాల నరేశ్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యతా ప్రమాణాలతో బీటీ రోడ్డు చేపట్టాలి సుల్తానాబాద్రూరల్: నాణ్యత ప్రమాణాలతో బీటి రోడ్డు పనులు చేపట్టాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్–కొదురుపాక గ్రామాల మధ్య సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు డీఎంఎఫ్టీ నిధులు రూ.95లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. సర్పంచులు సతీశ్, ఉత్తమకుమారి, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. పేదింటి ఆడబిడ్డలకు చేయూత జూలపల్లి: పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు రూ.24,02,784 విలువ గల కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మహిళా సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ఆధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. యాసంగిలో యూరియాపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎకరాకు 3బస్తాలను ప్రత్యేక యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. తహసీల్దార్ వనజ, సర్పంచులు వెంకటేశం, శ్రీనివాస్, అనూష, ప్రశాంతి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
‘అంజన్న’కు నోటీసులు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో దేవాదాయ– అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. కొండగట్టు మీది ప్రాంతం మాత్రమే గుడిదని, ఇటీవల తమ భూముల్లోకి చొచ్చుకువచ్చి దాదాపు ఆరున్నర ఎకరాల భూమిని దేవాదాయశాఖ ఆక్రమించిందని అటవీశాఖ ఆరోపిస్తోంది. ఆ ఆరున్నర ఎకరాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మార్కింగ్ చేయడంతో రెండుశాఖల మధ్య వివాదం మొదలైంది. ఈ ఆరున్నర ఎకరాల భూమి తమదంటే తమదని ఇరుశాఖలు పరస్పరం వాదించుకుంటున్నాయి. కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూములను ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుతో తాము తీసుకునే అవకాశం ఉందని దేవాదాయశాఖ అధికారులు చెబుతుండగా.. అనుమతి లేకుండా తమ భూములు ఎలా తీసుకుంటారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. మొత్తానికి అటవీశాఖ అధికారులు పెట్టిన కిరికికి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారేలా కనిపిస్తోంది. వివాదం ఇదీ.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేవాదాయశాఖ కొన్ని అభివృద్ధి పనులు చేపట్టింది. గుడి ఉన్న గట్టు ప్రాంతం మినహా కింద ఉన్న భూములు తమకే చెందుతాయని అటవీశాఖ వాదన. గట్టు కింద భక్తుల కోసం 20 గదుల వసతి భవనం, ఈవో కార్యాలయ భవనం, వాహన పూజా మండపం తదితర భవనాలు దశాబ్దకాలం క్రితం నిర్మించారు. అవన్నీ తమ పరిధిలోకి వస్తాయని అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, మార్కింగ్ చేయడంతో విషయం వివాదంగా రూపుదాల్చింది. ఇది క్రమంగా రాజకీయ రంగు పులుముకునేలా కనిపిస్తోంది. కొండగట్టు ఆలయ భూములు సంరక్షించాలని, భూములను ఆలయానికి అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. వైజంక్షన్ వద్ద గేటు ఏర్పాటు సన్నాహాలతో కొండగట్టు ఆలయానికి వెళ్లే దారిలో ఘాట్రోడ్డు, జేఎన్టీయూ రోడ్డు కలిసే వైజంక్షన్ వద్ద అటవీశాఖ అధికారుల గేటు ఏర్పాటు సన్నాహాలు రెండు శా ఖల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా చేశాయి. రెండున్నరేళ్ల క్రితం కొండగట్టు పరిసరాల్లోని అటవీభూముల్లో అర్బన్ పార్కు ప్రతిపాదనలో భాగంగా వైంజ క్షన్ వద్ద గేటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గేటు ఏర్పాటుతో వై జంక్షన్కు వాహనాల పార్కింగ్కు ఇబ్బందిగా మారుతుందని ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామం రెండుశాఖల మధ్య దూరం పెంచింది. కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులు తమ వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం కొరతతో ఇబ్బంది పడుతుండగా, వైజంక్షన్ సమీపంలో అటవీశాఖ గేటు ఏర్పా టు చేస్తే.. తాము వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల య ఈవో శ్రీకాంత్ రావు కూడా ఆ భూములు ఆలయానికే చెందుతాయని స్పష్టంచేస్తున్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎఫ్వో రవికుమార్ సమక్షంలో అటవీశాఖ, దేవాదాయశాఖ, రెవెన్యూశాఖ ముకుమ్మడిగా హద్దుల ఏర్పాటు కోసం సర్వే చేపట్టారు. గుడికి భూములిచ్చేందుకు సిద్ధం కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రెవెన్యూ భూములు బదిలీ చేశాం. ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ప్రత్యామ్నాయంగా భూముల కేటాయింపు చేసుకునే అవకాశముంది. కలెక్టర్ ఆదేశాలతో కొండగట్టులో అటవీశాఖ, దేవాదాయశాఖ సరిహద్దుల వివాదం పరిష్కరించేందుకు సర్వే చేపట్టాం. అటవీశాఖ హద్దులు గుర్తించాం. – పులి మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల -
మీ పైసలు తీస్కోండి..!
‘ఎన్నికల్లో గెలవాలని అందిన కాడికాల్లా అప్పు తెచ్చి పంచిన.. గుంపగుత్తగా ఓట్లు రాబట్టేందుకు కులసంఘాలకు ఇంత చొప్పున ఇచ్చా.. అయినా గెలవలేదు. సరికదా పోటీ ఇచ్చే స్థాయిలో ఓట్లూ రాలేదు. మీ సంఘం కోసం ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వండి.. అంటూ జిల్లాలో పలువురు ఓడిన సర్పంచ్ అభ్యర్థులు వేడుకుంటుండగా, మరికొన్ని చోట్ల ఓడిన అభ్యర్థుల తిట్లు, శాపనార్థాలు తట్టుకోలేక ఓటర్లే తమకు ఇచ్చిన పైసలను అభ్యర్థులకు వాపస్ ఇచ్చిపోతున్నారు. ఇలా జిల్లాలో పలు గ్రామాల్లో ఎన్నికల తర్వాత పైసలు వాపస్ ఇవ్వాలంటూ కొత్తపంచాయితీలు మొదలయ్యాయి.’’సాక్షి పెద్దపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో కొత్త తలనొప్పులను తీసుకొచ్చాయి. భారీగా ఖర్చు పెట్టి మందు, పైసలు పంచి సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థుల బాధలు, ఏడుపులు, శాపనార్థాలతో జిల్లాలోని పలు గ్రామాల్లో పైసలు తీసుకున్న ఓటర్లు తిరిగి వాపస్ ఇస్తున్నారు. ఎన్నికల్లో విజయం కోసం పోటీచేసిన అభ్యర్థులు భారీగా అప్పులు తీసుకొచ్చి, మరికొందరు ఉన్న భూములను తాకట్టు పెట్టి మరీ ఎన్నికల్లో ఖర్చు చేశారు. తీరా ఎన్నికల ఫలితాలు తేడా కొట్టడంతో వారంతా తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తెగ మదనపడుతున్నారు. కొందరైతే ఏకంగా ఏడుస్తూ శాపనార్థాలు పెడుతుండటం, మరికొందరు తమకు ఓటు వేయలేదని అనుమానం వచ్చిన వారితో ప్రమాణం చేయిస్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో ఓటర్లు గుట్టుచప్పుడు కాకుండా పోయి పైసలు వాపస్ ఇస్తున్నారు. కుల సంఘాలు, యువజన సంఘాలు ఎన్నికల్లో విజయం కోసం పలు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తమ ఊళ్లో ఉన్న కులసంఘాలు, యువజన సంఘాల ఓట్లను గుంపగుత్తగా వేయించుకునేందుకు భారీ మొత్తంలో సంఘం బాధ్యులకు అప్పజెప్పారు. ఆయా సంఘాల భవనాల నిర్మాణం, తదితర పనుల కోసం పెద్దమొత్తంలో ముట్టజెప్పారు. తీరా ఎన్నికల్లో సదరు అభ్యర్థులు ఓడిపోవడంతో ఆయా సంఘాలకు ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తుండటంతో ఆయా పైసలను కులసంఘాల నేతలు ఓడిన అభ్యర్థులకు అప్పజెప్పుతున్నారు. గెలిచినోళ్లలోనూ దిగులే.. ఎన్నికల్లో ఓడిన వాడు రోడ్డుపైన ఏడిస్తే, గెలిచినోడు ఇంట్లో ఏడుస్తున్నాడు.. అన్న విధంగా జిల్లాలో పలువురు సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల్లో కనిపిస్తోంది. ఓడినోడు బహిరంగంగా బాధపడుతుంటే, గెలిచి సర్పంచ్గా ప్రమాణస్వీకారం చేసిన నేతలు చేసిన ఖర్చు ఎట్లా తిరిగి రాబట్టుకోవాలో ఆర్థంకాక, ఇచ్చిన హమీలు ఎలా నెరవేర్చాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత ఆయా జీపీల్లో పెండింగ్ బిల్లులు, ఆదాయ వ్యయాలు చూసి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాకపోతే తమ పరిస్థితి అగమ్యగోచరమేనని లోలోపల వాపోతున్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
పెద్దపల్లి: వినియోగదారు కొనుగోలు చేసే ప్ర తీవస్తువుకు రసీదు తీసుతీసుకోవాలని అదన పు కలెక్టర్ వేణు సూచించారు. బుధవారం జా తీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో క లెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వే ణు మాట్లాడారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న వస్తుసామగ్రి ఎంపిక చేసుకోవాలని సూచించారు. మోసపోతే వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం పరిహారం పొందవచ్చని అన్నారు. డిజిటల్ న్యాయవ్యవస్థ ద్వారా ఈఏ డాది సమస్యలు త్వరితగతిన పరిష్కారం అ వుతున్నాయని తెలిపారు. వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు కె.ప్రకాశ్, రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి చేతన సోనీ, పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షురాలు వరలక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్ పాల్గొన్నారు. 28న బోనాల శోభాయాత్ర యైటింక్లయిన్కాలనీ(రామగుండం):యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28న మల్లన్నస్వామి బోనాల శోభాయాత్ర నిర్వహిస్తామని ఆ సంఘం అడక్ కమిటీ అధ్యక్షుడు గడ్డం తి రుపతి యాదవ్ తెలిపారు. ఉత్సవ సమితి క మిటీ సభ్యులతో కలిసి మల్లన్నస్వామి బోనా ల శోభాయాత్ర ప్రచార పోస్టర్ను బుధవారం పట్టణంలో ఆవిష్కరించి మాట్లాడారు. మా రం మల్లేశ్యాదవ్, చెప్ప మల్ల య్య యాదవ్, సాంబమూర్తి యాదవ్, పాశం ఓదెలు యాద వ్, కట్ల సత్యం యాదవ్, ఆవులు రాజేశ్ యాద వ్, రేశవేణి కేశవులు యాదవ్, గొ డుగు రమేశ్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, శంకర్ ఉన్నారు. కుష్ఠు నివారణకు చర్యలు పెద్దపల్లి/సుల్తానాబాద్రూరల్: కుష్ఠు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాల ని లెప్రసీ సర్వే రాష్ట్ర పరిశీలకురాలు సుజాత సూచించారు. 2027 మార్చి 31వ తేదీ వరకు నిర్దేశిత లక్ష్యం సాధించాలన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన లెప్రసీ సర్వేను బు ధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అ నంతరం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డీఎంహెచ్వో ప్రమోద్కుమార్తో కలిసి సమీక్షించారు. కుష్ఠును ప్రారంభదశలోనే గుర్తిస్తే నయం చేయొచ్చన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు వాణిశ్రీ, సుధాకర్రెడ్డి, శ్రీరాములు, కిరణ్కుమార్, ఉదయ్కుమార్, డీపీఎంవోలు దేవిసింగ్, రమేశ్, గర్రెపల్లి ఎంఎల్హెచ్పీ సంతోష్, ఏఎన్ఎంలు శోభన, తబాస పాల్గొన్నారు. 14రోడ్లు.. రూ.49.93కోట్లు మంథని/కమాన్పూర్: పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని 14 రోడ్ల నిర్మాణానికి రూ.43.93 కోట్లు మంజూరైనట్లు మంత్రి శ్రీధర్బాబు క్యాంపు కార్యాలయం ప్రకటించింది. మంథని మండలం చిన్నఓదాల నుంచి మానేరు వరకు రూ.కోటి, పీడబ్ల్యూడీ రోడ్డు– విలోచవరం – మంథనిలోని అయ్యగారి చెరువు వరకు రూ. 3.62 కోట్లు, కన్నాల నుంచి మల్లేపల్లి వరకు రూ.1.82 కోట్లు, గుమునూరు పీడబ్ల్యూడీ రో డ్డు నుంచి కాకర్లపల్లి – దంతలపల్లి వరకు రూ.3.75 కోట్లు మంజూరు చేశారు. ముత్తారం, కమాన్పూర్, కాటారం, మల్హర్, మహదేవపూర్ మండలాల్లో రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లించాలి పెద్దపల్లి: పింఛన్దారులందరికీ రిటైర్డ్ బెని ఫి ట్స్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వ పింఛన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి జిల్లా చైర్మ న్ లక్ష్మయ్య కోరారు. కలెక్టరేట్ ఎదుట బుధవారం చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షను టీపీటీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాదాసి సార య్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. లక్ష్మ య్య తదితరులు మాట్లాడారు. నాయకులు సత్యనారాయణ, మహేందర్రెడ్డి, సత్యనారాయణ, రవీందర్రావు, దామోదర్రెడ్డి, నంబయ్య, మొగిలి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. జాతర పనులు ప్రారంభం రామగుండం: గోలివాడ సమ్మక్క – సారలమ్మ జాతర అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ బుధవారం ప్రారంభించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని అన్నారు. నాయకులు పాల్గొన్నారు. -
పల్లెదరికి అత్యవసర సేవలు
● మంత్రి శ్రీధర్బాబు ముత్తారం(మంథని): గ్రామీణులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 108 అంబులెన్స్ ప్రారంభిస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. మచ్చుపేటలో బుధవారం రాత్రి 108 అంబులెన్స్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఆధునిక సాంకేతికత కలిగిన అంబులెన్స్లో శిక్షణ పొందిన సిబ్బందిని నియమించామని తెలిపారు. గ్రామీణ ప్రజలకు క్షణాల్లో వైద్యసేవలు అందించేందుకు ఈ అంబులెన్స్ దోహదపడుతుందన్నారు. అనంతరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుండె రాజేశం విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఎస్సీకాలనీలో తాగునీటి బోరు ప్రారం భించారు. ఇటీవల మృతి చెందిన పలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అడిషనల్ కలెక్టర్ వేణు, ఆర్డీవో సురేశ్, డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, తహసీల్దార్ మధూసూదన్రెడ్డి, వైద్యుడు అమరేందర్రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోవిందుల పద్మ, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు, సర్పంచ్ సిలివేరు జ్యోతి, ఉపసర్పంచ్ దొంతుల రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రకైస్తవుల సంక్షేమానికి పెద్దపీట
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి: క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్హాల్లో బుధవారం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందుకు ఆయన హాజరై మాట్లాడారు. చర్చిల అభివృద్ధికి రూ.30 వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సోదరభావం వంటి విలువలను తెలియజేస్తుందని అన్నారు. అనంతరం కేక్కట్చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, మైనారిటీ సంక్షేమ శాఖ సీనియర్ సహాయకుడు అప్షానా అబ్రార్, తహసీల్దార్లు, రాజయ్య, బషీరుద్దీన్ తదితరులు ఉన్నారు. క్రీడాస్పూర్తి చాటాలి పెద్దపల్లిరూరల్: క్రీడలు స్నేహ సంబంధాలను పెంపొందించేలా ఉండాలని, క్రీడాస్ఫూర్తితో ముందు కు సాగేలా ఆలోచన చేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో బుధవారం పెద్దపల్లి ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఆసక్తిఉన్న క్రికెట్ పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు. వచ్చే ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత మంత్రి అజహరుద్దీన్ను రప్పిస్తానని ఆయన అన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, నాయకులు మల్లన్న, జడల సురేందర్, మస్రత్, రాజగోపాల్, మంథని నర్సింగ్, బండి అనిల్, జగదీశ్, సంపత్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
తడి.. పొడి.. మొక్కుబడి!
ఇది రామగుండం నగరంలోని గోదావరి నదీతీరంలో ఉన్న డంపింగ్ యార్డు. మొత్తం 60 డివిజన్ల నుంచి రోజూ 59 స్వచ్ఛ ఆటోలు, 14 ట్రాక్టర్ల ద్వారా సుమారు 130 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి ఇక్కడకు తీసుకొచ్చి కుప్పగా పోస్తున్నారు. కొందరు నిప్పంటించడంతో ఇలా పొగ కమ్ముకుంటోంది. తడి, పొడి చెత్త వేసేందుకు రామగుండం నగరంలోని అన్నిడివిజన్లలో ట్రిపుల్, డబుల్డస్ట్ బిన్లు ఏర్పాటు చేశారు. రోడ్లపై వేయకుండా డస్ట్బిన్లలోనే వేసేలా అధికారులు ఇలా చేశారు. కానీ, గోదావరిఖని మార్కండేయకాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదుట ఏర్పాటు చేసిన డస్ట్బిన్లు చోరీకి గురవడం గమనార్హం. -
చర్యలు చేపడతాం
రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ బల్దియాల్లో పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇందుకు ప్లాన్ సిద్ధం చేస్తాం. స్వచ్ఛ సర్వేక్షణ్–2025 –26లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు మంచి ర్యాంక్ సాధించేలా కార్యక్రమాలు చేపడతాం. పెద్దపల్లి, సుల్తానాబాద్లో బయోమైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మంథనిలో కూడా డీఆర్సీసీ నిర్మాణ దశలో ఉంది. అన్ని మున్సిపాలిటీల్లో తడిచెత్తతో ఎరువులు తయారు చేయిస్తున్నాం. – అరుణశ్రీ, అదనపు కలెక్టర్ -
సుల్తానాబాద్
రామగుండం7.5చెత్త357957013080,000 61615,000 6,000(లక్షలు)2.10(రోజుకు)1712(నెలకు)2973పెద్దపల్లిమంథనిసాక్షి,పెద్దపల్లి/కోల్సిటీ(రామగుండం): జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలతోపాటు రామగుండం నగరంలో ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ ప్రక్రియ ప్రచారానికే పరిమతమవుతోంది. ప్రతినెలా రూ.లక్షలు వెచ్చిస్తున్నా క్షేత్రస్థాయిలో చెత్తసేకరణ సజావుగా సాగడం లేదు. ప్రధానంగా చెత్త సేకరణకు వాహనాల కొరత ఆటంకంగా మారుతోంది. ఒకేవాహనంలో తడి, పొడిచెత్త కలిపి తరలించడం విస్మయం కలిగిస్తోంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు లేక నిబంధనలు అమలు కావడం లేదని విమర్శలు ఉన్నాయి. ఆదాయంపై చిత్తశుద్ధి ఏది? బల్దియాల్లో తడిచెత్తతో కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియ నామమాత్రంగా సాగుతోంది. తడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారీ, పొడిచెత్త(ఘన)తో బయోమైనింగ్ చేస్తూ ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఉన్నా బల్దియాలకు చిత్తశుద్ధి కరువైంది. రామగుండంలో దశాబ్దాకాలం క్రితమే తడిచెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తున్నా.. ప్రయోజనం లేకుండాపోతోంది. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు, నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగానే మారాయి. రోజూ 179.5 మెట్రిక్ టన్నుల చెత్త జిల్లాలో రోజూ సుమారు 179.5 మెట్రిక్ టన్నుల తడి, పొడిచెత్త సేకరిస్తున్నారు. రామగుండం నగరంలో రోజూ సుమారు 130 మెట్రిక్ టన్నులు, పెద్దపల్లిలో 35 మెట్రిక్ టన్నులు, మంథనిలో 7 మెట్రిక్ టన్నులు, సుల్తానాబాద్లో 7.5 మెట్రిక్ టన్నులు వెలువడుతోందని అధికారులు తెలిపారు. మొక్కుబడిగా చెత్త సేకరణ.. తడి, పొడి చెత్త సేకరణ మొక్కుబడిగా సాగుతోందని విమర్శలు ఉన్నాయి. రామగుండంలో వెలువడే 130 మెట్రిక్ టన్నుల చెత్తలో 2 టన్నుల వరకు పొడి చెత్త సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆ లెక్కలకు పొంతన కుదరడం లేదు. మిగతా బల్దియాల్లోనూ మొక్కుబడిగా సాగుతోంది. డీఆర్సీసీలపై నిర్లక్ష్యం డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్ల(డీఆర్సీసీ) నిర్వహణపై బల్దియాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జిల్లాలోనే ఏకై క నగరం రామగుండం. ఇక్కడి గౌతమినగర్లోనే ఒక డీఆర్సీసీ వినియోగంలో ఉంది. నాలుగు నెలల క్రితం రూ.83లక్షల వ్యయంతో గోదావరి తీరంలోని డంపింగ్ యార్డులో డీఆర్సీసీకి ప్రత్యేక భవనం నిర్మించేందుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ భవనం ఫిల్లర్ల దశలోనే ఉంది. డీఆర్సీసీలు అందుబాటులోకి వస్తే.. ఇంటింటా చెత్త సేకరించే పారిశుధ్య కార్మికులకు ఆదాయం కూడా లభిచనుంది. కిలో ప్లాస్టిక్కు రూ.16, పేపర్కు రూ.8, గాజు సీసాకు రూ.3 చొప్పున డీఆర్సీసీ నిర్వాహకులు చెల్లిస్తున్నారు. రూ.లక్షల్లో ఖర్చు.. అయినా రాని మార్పు చెత్త సేకరణకు బల్దియాలు ప్రతీనెల రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నాయి. పారిశుధ్యం నిర్వహణలో మార్పు అయితేరావడం లేదు. రామగుండంలో పీహెచ్ వర్కర్లు 44 మంది, 448 మంది తాత్కాలిక పారిశుధ్య కార్మికులు, 124 మంది ర్యాగ్ పిక్కర్లు పని చేస్తున్నారు. చెత్త సేకరణకు 14 ట్రాక్టర్లు, 59 స్వచ్ఛ ఆటో ట్రాలీలు, ఒక కంపాక్టర్ వాహనం ఉపయోగిస్తున్నారు. వీటి వినియోగానికి రోజూ సుమారు రూ.80వేల విలువైన ఇంధనం వినియోగిస్తున్నారు. జాడలేని బయోమైనింగ్ బల్దియాల్లో తడిచెత్తతో మొక్కుబడిగా కంపోస్టు తయారు చేస్తున్నారు. రామగుండంలో ప్రతీరోజు మార్కెట్లో పడేసిన వ్యర్థాలతోపాటు పూలవ్యాపారులు, దేవాలయాల నుంచి వెలువడే వ్యర్థాలు సుమారు 2టన్నులను గౌతమినగర్ డీఆర్సీసీకి తరలించి కంపోస్టు తయారు చేస్తున్నారు. దీనిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించడానికి నిల్వ చేస్తున్నారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్నూ కంపోస్టును తయారు చేస్తున్నారు. కానీ ఈ ప్రక్రియ మొక్కుబడిగానే సాగుతోందని తెలుస్తోంది. ఎక్కడా బయోమైనింగ్పై దృష్టి సారించిన దాఖలాలే లేవు. పెద్దపల్లిలో ఓ ఏజెన్సీకి పనులు అప్పగించారు. -
సింగరేణిలో డ్రై వాషరీష్
గోదావరిఖని: సింగరేణిలో బొగ్గును శుద్ధి చేసే డ్రైవాషరీష్ ప్రారంభం అవుతాయా? గతంలో నీటిద్వారా వెట్ వాషరీష్ కొనసాగగా, ప్రస్తుతం వాటిని మూసివేశారు. వినియోగదారులకు నాణ్యమైన బొ గ్గు అందించాలనే లక్ష్యంతో ఉత్పత్తి అవుతున్న బొగ్గును డ్రైవాషరీష్లో శుభ్రం చేసి వినియోగదారులకు అందిస్తే వారిని కాపాడుకోవడం ద్వారా సంస్థకు లాభాలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదేవిషయంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి సూచించిన క్రమంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో డ్రైకోల్వాషరీష్ ఏర్పాటు చేసుకోవాలని, నాణ్యమైన బొగ్గును విద్యుత్ సంస్థలకు అందిస్తే ధర ఎక్కువగా పలకడంతో పాటు విద్యుత్ సంస్థలకు లాభాలు అధికంగా వచ్చే అవకాశాలుంటాయని సూచించారు. మట్టి, ఇతర పదార్థాలు, షేల్బొగ్గు వేరు చేసేందుకు డ్రైవాషరీష్ను ఎంతగానో ఉపయోగపడుతాయి. ఈవిధానం ప్రస్తుతం మనదేశంలో వినియోగం లేనట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. సింగరేణిలో గతంలో వెట్కోల్వాషరీస్ సింగరేణి సంస్థలో దశాబ్దం క్రితం వరకు వెట్కోల్వాషరీస్ కొనసాగాయి. బొగ్గు గనుల నుంచి వెలుబడిన బొగ్గును చిన్నముక్కలుగా కట్చేసి నీటితో శుభ్రం చేసి విద్యుత్ సంస్థలకు అందించే విధానం కొనసాగింది. అయితే ఈవిధానం వల్ల బొగ్గును కడిగిన మల్మ(బొగ్గుబురద) పంపించడం ద్వారా పర్యావరణానికి హాని కలుగింది. అంతేకాకుండా బొగ్గు బురదనీటిని శుద్ధిచేయడం కూడా కష్టసాధ్యంగా మారింది. పర్యావరణానికి ఎక్కువ గా హాని కలుగుతుండటంతో పర్యావరణ శాఖ అనుమతులు కఠినతరం చేసింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కోల్వాషరీష్ను మూసివేశారు. డ్రైవాషరీస్కు అనుమతి సులభతరం నీటితో బొగ్గును శుభ్రపర్చే విధానం కన్నా గాలితో బొగ్గును శుభ్రపర్చి నాణ్యమైన బొగ్గును వేరుచేసే విధానానికి పర్యావరణ శాఖ అనుమతులు సులభతరంగా ఉన్నాయి. దీంతో కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ దీనిపై దృష్టి సారించాలని సూచిస్తోంది. ప్రస్తుతానికి మనదేశంలో డ్రైవాషరీల్ ప్రస్తుతం లేవని, విదేశాల్లో మాత్రం కొనసాగుతున్నాయని అంటున్నారు. ఈక్రమంలో సింగరేణి ఈవిధానం పాటిస్తే బెటర్ అంటున్నారు. బొగ్గు డ్రైవాషరీష్ విధానం ఇలా నీళ్లు ఉపయోగించకుండా, గాలి, వైబ్రేషన్, గ్రావిటీ ఆధారంగా బొగ్గులోని మట్టి, రాళ్లు, పనికిరాని పదార్థాలను వేరు చేయడం. థర్మల్ పవర్ ప్లాంట్లకు సరఫరా కోసం ఈబొగ్గును ఎక్కువగా వాడుతారు. గనుల నుంచి వచ్చిన బొగ్గును ముందుగా క్రషర్లో వేసి చిన్నసైజ్లుగా చేస్తారు. సాధారణంగా 6 ఎం. ఎం. నుంచి 50ఎం.ఎం. మందంగా చేస్తారు. సరైన సైజ్లేకపోతే డ్రైవాషింగ్ పనిచేయదు. వైబ్రేటింగ్ స్క్రీన్లతో బొగ్గును వేర్వేరు సైజ్లుగా వడపోస్తారు. మూడు విభాగాలుగా తయారు చేస్తారు. ఫైన్కోల్, మీడియం కోల్, కోర్స్ కోల్ విభజిస్తారు. ఎయిర్ డెన్సిటీ సెపరేషన్.. ఎయిర్ డెన్సిటీ సెపరేషన్ డ్రైవాషరీలో ముఖ్యమైన దశ. బొగ్గును ఎయిర్టేబుల్, ఎయిర్ ఫ్లూయిడైజ్డ్ బెడ్మీద వేస్తారు. కింద నుంచి బలమైన గాలి ప్రవాహం వదులుతారు. బరువు తక్కువ బొగ్గుపైకి బరువు ఎక్కువ ఉన్నమట్టి, రాళ్లు కిందకు వెళ్తాయి. ఇలానే శుద్ధి(వాషింగ్) కొనసాగుతుంది. వైబ్రేషన్, గ్రావిటీ విధానం.. టేబుల్ కంపనం వల్ల శుద్ధమైన కోల్ ఒకవైపు, మలినాలు, మట్టి ఉన్న కోల్ మరోవైపు వెళ్తాయి. డ్రైప్రాసెస్ విధానం కావడంతో దుమ్ము ఎక్కువగా వస్తుంది. దీన్ని నివారించేందుకు డస్ట్ ఎక్స్ట్రాక్టర్లు, బ్యాగ్ ఫిల్టర్లు, సైక్లోన్ సెపరేటర్లు ఉపయోగిస్తారు. శుద్ధి చేసిన డ్రైకోల్ కన్వేయర్ బెల్ట్ ద్వారా స్టాక్ యార్డ్ లేదా రైల్వే సైడింగ్కు పంపిస్తారు. అనేక ఉపయోగాలు నీటి వినియోగం తక్కువ. ఆపరేటింగ్ ఖర్చుకూడా తక్కువే. పవర్ ప్లాంట్లకు సరైన గ్రావిటీబొగ్గు అందుతుంది. పర్యావరణానికి అనుకూలం ఉంటుంది. బొగ్గులో తేమశాతం పెరగదు. దీంతో సంస్థకు లా భాలు భారీగా రావడంతోపాటు పర్యావరణాకి ము ప్పు ఏర్పడకుండా ఉంటుంది. ఈక్రమంలో సింగరేణి యాజమాన్యం డ్రైకోల్వాషరీష్పై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. -
మంత్రి మాటలు హాస్యాస్పదం
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మంథని: చెక్డ్యాం నాణ్యతతో నిర్మించలేదని మంథని ఎమ్మెల్యే ధ్రువీకరిస్తూ విచారణకు ఆదేశించామని అంటున్నారని, మంత్రిస్థాయిలో నాణ్యత లేదని చెప్తుంటే.. అధికారులు మరోతీరు నివేదిక ఇస్తారా? అని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రశ్నించారు. పరోక్షంగా అధికారులను భయపెడుతూ తమకు అనుకూలంగా నివేదిక వచ్చేలా మట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక రాజగృహలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆదినుంచీ చెక్డ్యాంలు నిర్మించడం ఇష్టంలేదని పదేపదే చెప్పిన మంథని ఎమ్మెల్యే.. అడవిసోమన్పల్లి చెక్డ్యాంను తన అనుచరులతో కూల్చివేయించినట్లు వ్యవహరిస్తూ ఉంటే అనుమానం వస్తోందన్నారు. చెక్డ్యాంను సందర్శించిన ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడిన తీరు హాస్యాస్పదమన్నారు. సమావేశంలో నాయకులు తరగం శంకర్లాల్, ఏగోళపు శంకర్గౌడ్, ఆరెపల్లి కుమార్, కనవేన శ్రీనివాస్, బెల్లంకొండ ప్రకాశ్రెడ్డి, పుప్పాల తిరుపతి, కొండ రవీందర్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ను తలపించేలా అభివృద్ధి
● సుల్తానాబాద్ పట్టణంపై ప్రత్యేక దృష్టి ● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుపెద్దపల్లి: హైదరాబాద్ను తలపించేలా సుల్తానాబాద్ పట్టణంలో రహదారులు నిర్మిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సుల్తానాబాద్పై సవతి ప్రేమ చూపారని ధ్వజమెత్తారు. గత ఎమ్మెల్యేలు ముకుందరెడ్డి, బిరుదు రాజమల్లు ఈప్రాంతానికి అనేక ప్రభుత్వ కార్యాలయాలు తీసుకొస్తే.. మనోహర్రెడ్డి వాటిని తరలించుకుపోయారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ రమేశ్, అధికారులు రాజ్కుమార్, రవికుమార్, గుణశేఖర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పడాల అజయ్గౌడ్, సింగల్విండో మాజీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్సాయిరి మహేందర్ పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరిస్తాం.. సుల్తానాబాద్రూరల్: విద్యాలయాల్లోని సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గర్రెపల్లి, భూపతిపూర్ గురుకులాల్లో సొంతఖర్చులతో 17 గ్రీజర్లు ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్, గిరిజ, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, సర్పంచులు రమేశ్గౌడ్, చిన్నయ్య, నాయకులు అజయ్గౌడ్, జాని, సతీశ్, పన్నాల రాములు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.అనుమతులు వచ్చిన వెంటనే ప్రారంభం పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం డిజైన్ ఫైనల్ చేసిందని, అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. మున్సిపల్ అధికారులతో ఈమేరకు సమీక్షించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, ఏఈ సతీశ్, టౌన్ ప్లానింగ్ అధికారి వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
వేడుకలు.. నిరసనలు
సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఒకవైపు వేడుకలు ఘనంగా నిర్వహించగా.. మరోవైపు వివిధ కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఉత్సవాల కోసం కేటాయించే నిధుల్లో కోత విధించడం, తూతూమంత్రంగా వేడుకలు నిర్వహించడంపై గుర్తింపు కార్మిక సంఘంతోపాటు ఇతర యూనియన్లు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి.గోదావరిఖని: బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో అగ్రగామిగా నిలవాలని ఆర్జీ–వన్ జీఎం లలిత్కుమార్ కోరారు. జీఎం కార్యాలయంలో జరిగిన సంస్థ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని ఆయన కార్మికు లకు సూచించారు. రాష్ట్రంలో సింగరేణి సంస్థ అగ్రగామిగా నిలవడం చాలా సంతోషంగా ఉందని సంతో షం వ్యక్తం చేశారు. నీటిశుద్ధి కోసం 17 ఎంఎల్డీ ఎస్టీపీ త్వరలో పూర్తికానుందని తెలిపారు. ఈసందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలు, ఉత్త మ కార్మికులు, అధికారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆఈ కార్యక్రమంలో క్వాలిటీ రీజియన్ జీఎం సుజాయిముజందార్, అధికారుల సంఘం అధ్యక్షుడు బి.మల్లేశ్, ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, ఏసీఎంవో అంబిక, ఏజీఎం రాంమోహన్రావు, ప్రాజెక్టు అధికారి రమేశ్, ఏజెంట్లు శ్రీనివాస్, రమేశ్, పర్సనల్ మేనేజర్ రవీందర్రెడ్డి, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ నాయకుల నిరసన సింగరేణి డేను తూతూమంత్రంగా నిర్వహించడాన్ని ఏఐటీయూసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఆర్జీ–1 ఏరియాలోని అన్ని గనులపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, రంగు శ్రీను, మాదన మహేశ్, సిద్దమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు. యైటింక్లయిన్కాలనీలో.. యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఆర్జీ–2 ఏరియాలో సింగరేణి ఆవిర్భావ వేడుకలను మొక్కుబడిగా నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జిగురు రవీందర్, రాజారత్నం, అన్నారావు, శ్యాంసన్, సాంబశివరావు, బుర్ర తిరుపతి, మహేందర్, శ్రీనివాస్, శ్రీకాంత్, సత్యనారాయణగౌడ్, పుల్లయ్య, రాజేశ్, వెంకటేశ్, మనోహర్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల బహిష్కరణ రామగిరి(మంథని): ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్జీ–3, ఏపీఏ గనులపై సింగరేణి ఆవిర్భావ వేడుకలను బహిష్కరించారు. కార్యక్రమంలో ఆర్జీ–3 బ్రాంచ్ సెక్రటరీ ఎం.రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ సెక్రటరీ జూపాక రామచందర్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బండారి క్రాంతి, నాయకులు డీటీ రావు, గంగాధర్, సురేశ్, పోశం, ఎన్.రమేశ్ తదితరులు పాల్గొన్నారు.కేక్కట్ చేస్తున్న జీఎం లలిత్కుమార్ -
డ్రగ్స్ను నియంత్రించాలి
పెద్దపల్లి: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణకు చేపట్టిన చర్యలపై మంగళవారం తన చాంబర్లో పలువురు అధికారులతో సమీక్షించారు. మాదక ద్రవ్యాలకు అలవాపడితే ఆరో గ్యం దెబ్బ తింటుందని అన్నారు. ఆలోచనా విధానం నశిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి వాటి నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఆపరేషన్ విజయవంతం పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ అమరసింహారెడ్డి మంగళవారం ఓ మహిళకు అరుదైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేశారని డీసీహెచ్ శ్రీధర్ తెలిపారు. కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నెంపల్లి గ్రామానికి చెందిన మహిళ కడుపులో కుడివైపు నొప్పితో కొంతకాలంగా బాధపడుతూ ఇటీవల ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన డాక్టర్.. గ్లాడ్బ్లాడర్లో 14 ఎం. ఎం. మందంగల రాయిని గుర్తించారు. ఇప్పటి కే ఆమెకు నాలుగు ఆపరేషన్లు జరిగాయని, మరోఆపరేషన్ చేయడం క్లిష్టమైనా.. వైద్యులు సాయిప్రసాద్, విష్ణుచంద్రిక, స్వాతి, భవాని ఆధ్వర్యంలో ఆపరేషన్ను విజయవంతం చేశా రు. వారిని డాక్టర్ శ్రీధర్ అభినందించారు. ఎఫ్ఎల్ఎస్పై దృష్టి పెట్టాలి గోదావరిఖనిటౌన్: ఫౌండేషనల్ లర్నింగ్ స్టడీ (ఎఫ్ఎల్ఎస్)పై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ షేక్ సూచించారు. రామగుండం మండలంలోని జెడ్పీహైస్కూల్, గాంధీపార్క్, ఉ ర్దూ మీడియం పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్పై ప్రా థమిక పాఠశాలల ఉపాధ్యాయులకు రెండురోజులుగా సాగుతున్న జిల్లాస్థాయి సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. మూడో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కాంప్లెక్స్ హెచ్ఎం భవాని, ఆర్పీలు నీకత్ ఫాతిమ, అబ్దుల్ నిషాద్, అతిఫ, సీఆర్పీ వెంకటేశ్వర్లు, టీచర్లు ఉన్నారు. రేపు ఎన్టీపీసీ డైరెక్టర్ల రాక జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని తెలంగాణ ప్రాజెక్టు సందర్శనకు ఈనెల 25న ఐదుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు రానున్నా రు. ఇందులో అనిల్కుమార్ త్రిగునాయత్, అ నిల్ కుమార్ గుప్త, పంకజ్ గుప్త, గాయత్రిదేవి, సుశీల్ కుమార్చౌదరి ఉన్నారు. థర్మల్, సోలా ర్, ఫ్లోటింగ్ సోలార్, తెలంగాణ స్టేజ్–1 ప్రాజెక్టుల్లో వారు పర్యటించనున్నారు. ఇటీవల ప ర్యావరణ అనుమతి పొందిన థర్మల్ ప్రాజెక్టు స్థలంతోపాటు పలు విభాగాలను పరిశీలించి అధికారులతో విద్యుత్ ఉత్పత్తి, ఉత్పాదకతపై సమీక్షిస్తారు. ఈమేరకు రామగుండంలోని ఎన్టీ పీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సేంద్రియ ఎరువుతో మేలు పెద్దపల్లిరూరల్: భూసారం పెంపొందించేందు కు సేంద్రియ ఎరువుల వినియోగమే మేలని జి ల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ అన్నారు. బ్రా హ్మణపల్లి రైతువేదికలో మంగళవారం జాతీ య రైతుదినోత్సవం నిర్వహించారు. రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ వెంకటరమే శ్, శాస్త్రవేత్తలు వెంకన్న, భాస్కర్రావు, వినోద్కుమార్, కిరణ్, నవ్య, పూర్ణచందర్ నేల స్వ భావం కాపాడేందుకు పాటించాల్సిన పద్ధతుల గురించి వివరించారు. ప్రతీఒక్కరు ఇంటి ఆవ రణలో పెరటి తోటలను పెంచుకోవాలని, త ద్వారా రసాయనాలను లేనికూరగాయలు ల భించి ఆరోగ్యంగా ఉంటారని సర్పంచ్ మేకల రోజారాణి అన్నారు. ఏడీఏ శ్రీనాథ్, ఉపసర్పంచ్ జంగిలి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి దాటిన పులి
గోదావరిఖని/జ్యోతినగర్: సుమారు పదిరోజులుగా గోదావరినదీతీర ప్రాంత ప్రజల కంటిమీద కునుకులేకుండా చేసిన పులి ఎట్టకేలకు నది దాటి అవతలివైపు వెళ్లినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈనెల 14న మంచిర్యాల జిల్లా శ్రీరాపూర్ ప్రాంతం నుంచి గోదావరిఖని వైపు చొరబడిన పులి.. మూసివేసిన సింగరేణి మేడిపల్లి ఓసీపీ డంప్–1లో తలదాచుకుంది. అనంతరం మల్యాలపల్లె సమీప బీపీఎల్ ఖాళీ స్థలంలో సంచరించింది. పులి సంచారం.. ప్రజల్లో భయం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న సమాచారంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మల్కాపూర్, మేడిపల్లి, లింగాపూర్, మల్యాలపల్లె, గోలివాడ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలియడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజ లను హెచ్చరిస్తూ పులి కదలికలను నిపుణులతో ప ర్యవేక్షించారు. పదిరోజుల పాటు సంచరించినా.. ఒక్కప్రాణికి కూడా హాని చేయలేదు. దీంతో పులి ఎలాంటి ఆహారం తీసుకుందనేదానిపై అధికారులు ఆరాతీస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఇందారం ఫారె స్ట్ ప్రాంతానికి పులి వెళ్లిందని అటవీ అధికారులు నిర్ధారించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అధికారుల అప్రమత్తత.. పులి సంచారంతో జిల్లా అటవీ అధికారి శివయ్య నే తృత్వంలో ఎఫ్ఆర్వోలు సతీశ్కుమార్, కొముర య్య, రహమతుల్లా, మల్లేశ్ తదితరులు, నిపుణులు పులి సంచారంపై రోజూ తనిఖీలు చేశారు. అది ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుందనే దానిపై నిత్యం పర్యవేక్షణ చేశారు. గ్రామాల్లో డప్పు చాటింపుతోపాటు పోస్టర్లు అంటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. పులి సంచారం తెలిస్తే.. అధికారులకు సమాచారం అందించాలని, మొబైల్ నంబర్లను ప్రకటించి ప్రజలకు భరోసా కల్పించారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నర్సింహారావు
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ గోదావరిఖని: బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్పనేత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం పీవీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రపంచదేశాలకు దీటుగా భారత్ను నిలిపారని ఆయన ప్రశంసించారు. ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మక్కాన్సింగ్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేశ్, మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని హంగులతో భవన నిర్మాణం గోదావరిఖనిటౌన్: ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్ర కారం అన్ని హంగులతో క్రిష్టియన్ భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ హామీ ఇచ్చారు. మార్కండేయకాలనీ ఆర్కే గార్డెన్స్లో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఆయన మా ట్లాడారు. నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న 28 చర్చిలకు సీఎం రేవంత్రెడ్డి రూ.30వేల చొప్పు న అందించనున్నారని రాజ్ఠాకూర్ తెలిపారు. -
నాసిరకమని నాడే చెప్పా
● మంత్రి శ్రీధర్బాబు మంథని: గత ప్రభుత్వం చెక్డ్యాంలను అశాసీ్త్రయంగా, నాసిరకంగా నిర్మిస్తోందని తాను ఎమ్మెల్యేగా ఉన్నసమయంలోనే వెల్లడించానని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. శాసనసభలో ఈ విషయం గురించి సుదీర్ఘంగా తాను మాట్లాడానని గుర్తుచేశారు. దానిఫలితం ఇప్పుడు కనిపిస్తోందన్నారు. అడవిసోమన్పల్లి మానేరులో ఇటీవల కూలిన చెక్డ్యాంను మంగళవారం మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట మూడు బ్యారేజీలు, మానేరుపై రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన చెక్డ్యాంలు ని ష్ప్రయోజనంగా మారాయన్నారు. చెక్డ్యాంలు కూ లిన ఘటనపై నీటిపారుదల మంత్రి ఉత్తంకుమార్రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారనిమంత్రి తెలిపారు. నివేదికను కూడా త్వరగా బయట పె ట్టాలని ఆయన అన్నారు. తద్వారా బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ బలరామయ్య, డీఈఈ రమేశ్బాబు, నాయకులు సెగ్గెం రాజేశ్, గట్టు దామోదర్, శశిభూషణ్ కాచే, కుడుదుల వెంకన్న, తొట్ల తిరుపతి యాదవ్, ఐలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు ఆవిరి
పెద్దపల్లిరూరల్: తమ ఇంట తెల్లబంగారం సిరులు కురిపిస్తుందని ఆశిస్తే.. అందులో సగం కూడా దిగుబడి రాలేదని జిల్లాలో పత్తిసాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈఏడాది జిల్లావ్యాస్తంగా 48,215 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగుచేశారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. తద్వారా 5,78,580 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనాకు వచ్చారు. సీజన్ చివరి దశకు వచ్చినా ఇప్ప టివరకు కేవలం 1,15,000 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో సీసీఐ 61వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా, ప్రైవేట్ వ్యాపారులు 54వేల క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారవర్గాల లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇంకా దిగుబడులు వచ్చే పరిస్థితి కూడా కనిపించక పోవడంతో పత్తి రైతుల్లో నైరాశ్యం నెలకొంది. ఎకరాలో కనీసం మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి నష్టపోవాల్సి వచ్చిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ప్రైవేట్ వ్యాపారులు కూడా దాదాపుగా సీసీఐకి సమానంగా ధరలు చెల్లించినా.. దిగుబడి రాక నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దిగుబడులు చివరిదశకు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి ధరలు పెరుగుతుండడం అన్నదాతను నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అనేక కష్టనష్టాలకు ఓర్చిన రైతులు.. పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ, పలు తెగుళ్లతో దిగుబడి పడిపోవడం, ఇప్పుడు ధరలు పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లా సీసీఐ ప్రైవేట్ పెద్దపల్లి 61,000 54,000 కరీంనగర్ 1,53,000 62,000 సిరిసిల్ల 1,79,000 39,200 జగిత్యాల 9,400 11,000 క్వింటాల్ పత్తి రూ.7,418 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో మంగళవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,418 ధర పలికింది. కనిష్టం రూ.6,651, సగటు రూ.7,151గా ధర నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 162 మంది రైతులు తీసుకొచ్చిన 680 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. -
నీటి ప్రాజెక్టుల రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి
మంథనిరూరల్: నీటి ప్రాజెక్టుల రక్షణ బాధ్యత ప్ర భుత్వమే తీసుకోవాలని రామన్ మెగాసేసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ కోరారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లి మానేరులో కూలిపోయిన చెచెక్డ్యాంను సోమవారం జనవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, వివిధ ప్రయోజనాల కోసం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుందన్నా రు. అందుకు భిన్నంగా తెలంగాణలో ప్రాజెక్టులు, చెక్డ్యాంలు ధ్వంసం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరదలు వచ్చే సమయంలో డ్యాంలు, ప్రాజెక్టులు కూలిపోయే అవకాశం ఉంటుంద ని, కానీ, వరద ఉధృతి లేనిసమయంలో అడవిసోమన్పల్లి చెక్డ్యాం కూలిపోయే అవకాశాలు ఉండవని అభిప్రాయపడ్డారు. చెక్డ్యాం కూలిపోయిన తీరును పరిశీలిస్తే ధ్వంసం చేసినట్లే తాము భావిస్తున్నామని అన్నారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై ప్రభుత్వం స్పందించి విచారణ కమిషన్ వేయాలని డిమాండ్చేశారు. కార్యక్రమంలో ప్రజానిఘా వేదిక ప్రతినిధి వీవీ రావు, మానేరు పరిరక్షణ సమితి అధ్యక్షుడు నోముల శ్రీనివాసరెడ్డి, వాక్ ఫర్ వాటర్ సంస్థ నిర్వాహకుడు కరుణాకర్రెడ్డి, జర్నలిస్ట్ సలీం తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ ప్రమాణస్వీకారం.. ఉపసర్పంచ్ రాజీనామా
పెద్దపల్లిరూరల్: నిట్టూరు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సం సోమవారం జరగగా.. ఉపసర్పంచ్ నీలం లక్ష్మణ్, తొమ్మిదో వా ర్డు సభ్యుడు పల్లెర్ల ఆంజనేయులు గైర్హాజరయ్యా రు. వారిద్దరు మినహా సర్పంచ్ ఆకుల సువర్ణ, వార్డుసభ్యుల చేత ప్రత్యేకాధికారి అలివేణి పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్ సువర్ణకు బాధ్యతలు అప్పగించారు. ఇటు సర్పంచ్గా ఆకుల సువర్ణ పదవీ బాధ్యతలను స్వీకరిస్తుండగానే.. అటు ఉపసర్పంచ్ నీలం లక్ష్మణ్ తన పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాసిన రాజీనామా లేఖను అందించారని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. వార్డు సభ్యుడి గైర్హాజర్ ఎందుకో? నిట్టూరులోని 9వ వార్డు సభ్యుడు పల్లెర్ల ఆంజనేయులు కూడా రాజీనామా చేయనున్నారా? అందు కే గైర్హాజరయ్యారా? అనే చర్చ సాగుతోంది. సర్పంచ్ పదవి చేజారడంతో ఉపసర్పంచ్ పదవినైనా దక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్న ప్రత్యర్థుల ఎ త్తులు చిత్తవడంతోనే పాలకమండలిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. నిట్టూరులో మొదలైన రాజకీయ ఎత్తులో ఎవరి వ్యూహాలు ఫలిస్తాయో చూడాల్సిందే. ప్రశాంతంగా బాధ్యతలు స్వీకరణ పెద్దపల్లి: జిల్లాలోని 262 గ్రామ పంచాయతీల పా లవర్గాలు సోమవారం కొలువు దీరాయి. సర్పంచు లు, ఉప సర్పంచులతోపాటు వార్డుసభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారని డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. పలువురు అధికారులు పాలకవర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించారని ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం నిట్టూరు ఉపసర్పంచ్ పదవికి సతీశ్ రాజీనామా చేసి, మండల అధికారులకు లేఖ ఇచ్చారని, అయినా రాజీనామాకు ఆమోదం తెలుపలేదని ఆయన వివరించారు. అధికార పార్టీ ఒక నాయకుడు ప్రాబల్యంతోనే రాజీనామా చేసినట్లు ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నాయకులు కలగజేసుకొని రాజీనామాను ఉపసంహరించుకునేలా చేయాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు. -
పల్లెకు పాలకవర్గం
సాక్షి పెద్దపల్లి: జిల్లాలోని కొత్త పంచాయతీ పాలకవర్గాలు సోమవారం కొలువుదీరాయి. పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారుల నుంచి సర్పంచు లు బాధ్యతలు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 263 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా.. ఒకపంచాయతీ కేసు కోర్టుకు చేరింది. మిగిలిన 262 పంచాయతీల్లో ఎన్నికై న కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణం చేశారు. సుమారు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామ పంచాయతీలకు నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీ కారం చేపట్టిన వెంటనే కొందరు సర్పంచులు గ్రా మంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టా రు. పలువురు సర్పంచ్లు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఎల్లవేళాల అందుబాటులో ఉంటామన్నారు. ప్రజాసేవకే అంకితమవుతాని చెప్పారు. ఎన్నిక సందర్భంగా ఇ చ్చిన హామీలను నెరవేరుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం ఇలా.. జిల్లాలోని గత పంచాయతీ పాలకవర్గాల పదవీకా లం 2024 ఫిబ్రవరి ఒకటో తేదీన ముగిసింది. దీంతో ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ అధికారులను ఇన్చార్జిలుగా నియామించింది. దాదాపు 20 నెలల పాటు పల్లెపాలన కొనసాగించింది. అయితే, తమ శాఖలోని సమస్యలతో సతమతమయ్యే ప్రత్యే కాధికారులు.. పల్లెల్లోని సమస్యలను పట్టించుకోకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే నిలిచిపోయా యి. తాజాగా ఎన్నికలు నిర్వహించడంతో.. గెలుపొందిన పాలకవర్గాల వివరాలతో కూడిన ఫారం–15ను రిటర్నింగ్ అధికారి నుంచి అందుకుని పంచాయతీ కార్యదర్శలు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు స భ్యులతో ప్రత్యేకాధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రమాణప్రతంపై కొత్త సర్పంచులు సంతకం చేశారు. తొలిసమావేశంలో పలు తీర్మాణాలు పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో సర్పంచులు, పాలక వర్గాలు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి. పాలకవర్గాల సమక్షంలో పలు వివిధ తీర్మానాలు చేశాయి. ప్రధానంగా ఎన్నికై న 15రోజుల్లోగా తొలిగ్రామసభ నిర్వహించాలని నిర్ణయించాయి. చాలా పంచాయతీల్లో గ్రామసభ నిర్వహణ, బడ్జెట్ ఆమోదం, అభివృద్ధి పనులు, వీధిదీపాలు, పారిశుధ్యం పర్యేవేక్షణ, సీసీ రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై తొలిరోజు చర్చ కొనసాగించాయి. పార్టీలకతీతంగా అభివృద్ధి ధర్మారం(ధర్మపురి): కొత్త సర్పంచులు పార్టీలకతీతంగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరా రు. కొత్తూరు సర్పంచ్ భూక్య సంగీత, వార్డు సభ్యులు సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయగా.. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రతీగ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తోందన్నారు. వ్యక్తిగత విభేదాలు, రాజకీయ ద్వేషాలు పక్కనపెట్టి పల్లెప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో 149 గ్రామాలు ఉంటే.. 108 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులు విజ యం సాధించడం ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, మాజీ సర్పంచ్ మల్లేశం, నాయకులు చింతల ప్రదీప్రెడ్డి, తిరుపతిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఆర్ఐలు వరలక్ష్మి, నవీన్రావు, ఎంపీవో రమేశ్, ఏపీవో రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
పెద్దపల్లి: ప్రజావాణి ద్వారా అర్జీల రూపంలో అందిన సమస్యలను సత్వరమే పరిష్కరించా లని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టర్లో సోమవారం ప్రజావాణి ద్వారా ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పె ద్దపల్లికి చెందిన మౌనిక.. వారధి ద్వారా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న స్టోర్ కీపర్ ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన బండి దేవమ్మ.. తనకు గృహజ్యోతి పథకం వర్తింపజేయాలని, పాలకుర్తి మండ లం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుంపుల సతీశ్.. తాను దివ్యాంగుడనని, మూడు చక్రాల వాహనం అందించాలని, పెద్దపల్లికి చెందిన డి.స్వప్న డబుల్బెడ్రూమ్ ఇంటికోసం దర ఖాస్తు చేశారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆయన అన్నారు. బాధ్యతలు స్వీకరణ పెద్దపల్లి: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రత్యేక అధికారులు సోమవారం బాధ్యతలు స్వీకరించారని డీసీవో శ్రీమాల తెలిపారు. ఈనెల 20న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఇన్చార్జిల బాధ్యతలను రద్దు చేయడంతోపాటు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కాగా, సహకార సంఘాల ప్రక్షాళనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. విద్యార్థులకు కంటిపరీక్షలు సుల్తానాబాద్రూరల్: విద్యార్థులందరికీ కంటి పరీక్షలు చేయాలని జిల్లా వైద్యాధికారి ప్రమోదుకుమార్ సూచించారు. గర్రెపల్లి మోడల్ స్కూల్లో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా సోమవారం విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. డీఎంహెచ్వో పరీక్షల తీరు పరిశీలించి మాట్లాడారు. కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించి సమస్య పరిష్కరించాలన్నారు. ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, నిపుణు లు అజయ్కుమార్, రమాదేవి పాల్గొన్నారు. నియామకం రామగుండం: అంతర్గాం మండలం గోలివాడ స మ్మక్క – సారలమ్మ జాత ర కమిటీ చైర్మన్గా గీట్ల శంకర్రెడ్డిని నియమించా రు. రామగుండం ఎమ్మె ల్యే మక్కాన్సింగ్ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన నియామకం చేపట్టారు. ఆయనను పలువురు అభినందించారు. క్వింటాల్ పత్తి రూ.7,414 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో సోమవారం పత్తి క్వింటాల్కు గరిష్టంగా రూ.7,414 ధర పలికింది. కనిష్టంగా రూ.6,161, సగటు ధర రూ.7,112గా నమోదైందని మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి ప్ర వీణ్రెడ్డి తెలిపారు. మొత్తం 922 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. కబడ్డీ పోటీలకు ఎంపిక ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి హైస్కూల్లోని పదో తరగతి విద్యార్థిని శ్రీవల్లి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. పెద్దపల్లిలో ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఆమె ప్రతిభ చూపింది. ఆమెను ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య, డీటీఎఫ్ నేత అమృత కిశోర్, పీఈటీ హరికృష్ణ, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు. కూల్చిన స్థలంలోనే నిర్మించాలి గోదావరిఖని: కూల్చివేసిన స్థలంలోనే మళ్లీ షా పు నిర్మించి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రధాన చౌరస్తాలో సోమవారం ఆయన ధర్నా చేశారు. కూల్చి వేసిన షాప్ వద్ద నిరసన చేపట్టిన ఆ కుల మల్లేశ్ దంపతులను ఆయన కలిసి సంఘీభావం తెలిపారు. రెండేళ్లుగా కూల్చివేతల ప ర్వం సాగుతోందన్నారు. ఎమ్మెల్యే రాజ్ఠూకర్ కారణంగా రోడ్డున పడ్డ లలిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కా ర్యక్రమంలో కౌశిక హరి, గోపు అయులయ్య యాదవ్, కౌశిక లత, పాముకుంట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, జనగామ కవితసరోజిని, బాదే అంజలి, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
పెద్దపల్లి: మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు సూచించారు. మాజీకేంద్రమంతి జి.వెంకటస్వామి(కాకా) వర్ధంతి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాలవేసి నివాళ ఇర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అట్టడుగువర్గాల సంక్షేమం, అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రకాశ్, జిల్లా క్రీడల అధికారి సురేశ్, డీపీవో వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. కమిషనరేట్లో కాకా వర్ధంతి గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్లో వెంకటస్వామి(కాకా) వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అదనపు డీసీపీ శ్రీనివాస్ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, పీసీఆర్ సీఐ రవీందర్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్, మల్లేశం పాల్గొన్నారు. కార్మిక పక్షపాతి ‘కాకా’.. గోదావరిఖని : సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పింఛ న్ ఇప్పించి కార్మిక పక్షపాతిగా వెంకటస్వామి(కా కా) నిలిచాడని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక జీఎం ఆఫీస్ సమీపంలోని కాకా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వివిధ ప్రాంతాల్లో వర్ధంతి నిర్వహించారు. నాయకులు బొంతల రాజేశ్, పి.మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, పెంచాల తిరుపతి, రాజేందర్, సారయ్య, కామ విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
చర్చిల మరమ్మతుకు నిధులు
పెద్దపల్లి: క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని చర్చిల మరమ్మతు, క్రైస్తవులకు విందు ఏర్పాటు చేసేందు కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ఈనెల 25న జరగనున్న క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గంలోని రెండు ప్రధాన పట్టణాల్లో విందులు ఏర్పాటు చేయనున్నారు. పెద్దపల్లి, రామ గుండం, మంథని నియోజకవర్గానికి 50 చర్చిలకు నిధులను మంజూరు చేసింది. నిధుల కేటాయింపు జిల్లాలోని చర్చిల మరమ్మతుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా.. ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున కేటాయించింది. భవనాలకు రంగులు వేయడం(పెయింటింగ్), డిజిటల్ లైటింగ్ ఏర్పాటు, అలంకరణ తదితర పనులు చేపడతారు. గత ప్రభుత్వం క్రైస్తవులకు పండుగ సందర్భంగా కొత్త దుస్తులు అందించగా.. ప్రస్తుత ప్రభుత్వం నిధులు మంజూ రు చేయడం గమనార్హం. విందుకు రూ.6 లక్షలు జిల్లావ్యాప్తంగా ఎంపికచేసిన పట్టణాల్లో క్రైస్తవులకు విందు ఏర్పాటు చేసేందుకు రూ.6 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నియోజకవర్గంలోని ప్రధాన పట్టణాల్లో ఈ నిధులు వెచ్చించి విందులు ఏర్పాటు చేస్తారు. ఇవీ నిబంధనలు.. నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం నిబంధనలు అమలు చేస్తోంది. కచ్చితంగా చర్చి సొసైటీ రిజిస్ట్రే షన్ ఉండాలి. బైలా, ప్రెసిడెంట్, సెక్రటరీలేదా కో శాధికారికి జాయింట్ అకౌంట్ సొసైటీ పేరున ఉండాలి. నిధుల కోసం పెద్దపల్లి నుంచి 30, మంథని నుంచి 14, రామగుండం నుంచి 18 దరఖాస్తులు వచ్చినట్లు మైనార్టీ కార్పొరేషన్ జిల్లా ఇన్చార్జి అధికారి నరేశ్కుమార్ నాయుడు తెలిపారు. -
కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్
పెద్దపల్లి: విద్యార్థులు కష్టపడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళా శాల విద్యార్థుల కోసం తనసొంత నిధులు వెచ్చించి 45 రోజులపాటు మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు లక్ష్య సాధనతోపాటు తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేయాలని ఎమ్మె ల్యే విదార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్, ప్రిన్సిపాల్ రామచంద్రరెడ్డి, హెచ్ఎం రత్నాకర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, వా లీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, నాయకులు గాజుల రాజమల్లు, బిరుదు కృష్ణ, గణేశ్, లెక్చరర్లు దేవేందర్, ప్రభాకర్, హరికృష్ణ, సునీల్, మాధవిలత, నిర్మల తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి అభివృద్ధికి నిరంతర కృషి జిల్లా కేంద్రం అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. రంగంపల్లితోపాటు వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆ యన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పట్టణాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని అన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, అధికారులు, సిబ్బంది, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మేడిపల్లి ఓబీ డంప్యార్డుపై పులి గోదావరిఖని: మూసివేసిన సింగరేణి మేడిపల్లి ఓసీపీ ఓబీ డంప్యార్డుపైనే పులి మకాం వేసింది. నాలుగురోజులుగా మేడిపల్లి ఓసీపీని కేంద్రంగా చేసుకుని పరిసర ప్రాంతాల్లో తిరుగుతోంది. ఓబీ డంప్యార్డుపై చెట్లపొదలు పెద్దఎత్తున ఉన్నాయి. ఇది పులి ఆవాసానికి అనువుగా ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే వన్యప్రాణులు కూడా ఉండడంతో పులికూడా అదే ప్రాంతంలో నివాసంగా మార్చుకున్నట్లు చెబుతున్నారు. వేటకోసం చుట్టు పక్కల ఉన్న పంటపొలాలు, ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈక్రమంలో సోమవారం ప్రాసెస్ ఓబీ, టెంపుల్ ఏరియా ప్రాంతంలో పులిఅడుగు జాడలు కనిపించినట్లు గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు, వైల్డ్లైఫ్ సిబ్బంది, సింగరేణి అధికారులు కలిసి చాలాసేపు ఆప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, ఫారెస్ట్ అధికారి రహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
నాన్నా... నాకూ ఆడుకోవాలనుంది
కరీంనగర్: తన తోటి పిల్లలు ఆడుకుంటుంటే ‘నాన్నా.. నాకు కూడా ఆడుకోవాలని ఉంది’.. అన్న ఓ చిన్నారి మాటలు.. ఆ తండ్రి గుండెను పిండేశాయి. ఆ మాటలకు మౌనంగా రోదించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఇది ఒక్క రోజు వేదన కాదు.. ఆ బిడ్డను చూస్తున్న ప్రతిసారి ‘నేనేమీ చేయలేకపోతున్నానే’ అని ఆ తండ్రి ఆవేదన. పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో బాధపడుతున్న బాలికకు ఆపరేషన్ కోసం రూ.6 లక్షలు అవసరం ఉంది. హమాలీ కార్మికుడైన తండ్రి తన శక్తి మేర చికిత్స చేయిస్తున్నా, దాతల సాయం కోసం ఎదురుచూడడం తప్ప తను అంత ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి. వివరాలు.. కరీంనగర్లోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన హమాలీ కార్మికుడు మోతె హరీశ్, శ్రీలత దంపతుల జీవితం నిత్య పోరాటం. రోజూ కష్టపడితే తప్ప కడుపునిండని దుస్థితి. ఈ పేదరికానికి తోడు పుట్టుకతోనే వెన్నెముక సమస్యతో జన్మించిన తమ పెద్ద కుమార్తె సిరిచందన (14)ను కంటికి రెప్పలా పెంచుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, 12 ఏళ్లు వచ్చే వరకు శస్త్రచికిత్స సాధ్యం కాదని వైద్యులు చెప్పారు. అయితే తోటి పిల్లలలాగే తాను లేననే బాధతో ఆ చిన్నారి పాఠశాలకు సైతం సరిగా వెళ్లలేకపోతుంది. 12 ఏళ్ల వయసు పూర్తయినా ఆపరేషన్కు కావాల్సిన లక్షల రూపాయల ఖర్చు వారికి అడ్డంకిగా మారింది. ఆపరేషన్కు వైద్యులు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. పేదరికంలో జీవిస్తున్న ఆ కుటుంబానికి అది తలకు మించిన భారమే. అయినా తండ్రి వెనకడుగు వేయలేదు. చిన్నారి చికిత్స కోసం అప్పులు చేస్తూ, సాయం కోసం తలుపు తడుతూ ముందుకు సాగుతున్నాడు. ప్రజాప్రతినిధుల వద్దకూ వెళ్లినా ఇప్పటివరకు ఆశించిన స్పందన ఎక్కడా రాలేదు. రెండేళ్లుగా ‘ఎవరైనా దయగల హృదయులు స్పందిస్తారా?’ అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. తన కూతురు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే చూడాలన్న తండ్రి కల ఇంకా కలగానే ఉంది. చిన్నారి భవిష్యత్తు ఒక శస్త్రచికిత్సపై ఆధారపడి ఉంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి స్పందన ఆమెకు కొత్త జీవితం ఇవ్వగలదు. దాతలు చేసే సాయం బాలిక జీవితాన్ని నిలబెట్టగలదు. స్పందించే దాతలు 99480 55713 నంబర్కు ఫోన్పే/గూగుల్ పే ద్వారా లేదా ఫోన్లోనైన తమను సంప్రదించాలని హరీశ్ వేడుకుంటున్నాడు. బాలికకు పుట్టుకతో వెన్నెముక సమస్య శస్త్ర చికిత్స కోసం చిన్నారి ఎదురుచూపు -
అంధత్వ నివారణ లక్ష్యం
‘సైట్ ఫస్ట్’ అనేది మా మొదటి నినాదం. అంధత్వ నివారణ మా లక్ష్యం. దీనికోసం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 20 మంది నేత్రవైద్య సహాయకులతో ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలు చేస్తున్నాం. – పూదరి దత్తాగౌడ్, వ్యవస్థాపక అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ విజన్ కేర్ ఉచితంగా ఆపరేషన్లు వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలం స్టెరాయిడ్ మందులు వినియోగించడం, పొగతాగడం వంటి అలవాట్లు కంటిచూపుపై ప్రభావం చూపుతాయి. సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా కంటి వైద్యుని సంప్రదిస్తే మంచి ఫలితాలు వస్తాయి. – వెల్దండి రఘు, నేత్రవైద్య నిపుణుడు -
అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా
ఇబ్రహీంపట్నం: కేశాపూర్ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో పోటీ చేశా. బీఎస్సీ, ఎంపీఎస్ చదివా. ఉద్యోగం రాకపోవడంతో ఇంట్లోనే బీడీలు చేస్తున్న. మా అత్త రాజుబాయ్ ఎంపీటీసీగా గ్రామానికి సేవలందించారు. నాకు సర్పంచ్గా అవకాశం వచ్చినందున గ్రామంలో అవినితీ పాలన లేకుండా, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా. తీరిక సమయంలో బీడీలు చేస్తా. ఓదెల: మండలంలోని శానగొండ సర్పంచ్గా ఎన్నికై న జీల రాజుయాదవ్కు 23ఏళ్లు. శానగొండ అనుబంధ గొల్లపల్లి స్వగ్రామం. డిగ్రీ పూర్తిచేశాడు. గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నాడు. గ్రామస్తులకు నాణ్యమైన వైద్యం, విద్య అందించేలా చూస్తానన్నారు. ప్రజల సహకారంతో సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. -
అదృష్టంగా భావిస్తున్నా
రామగుండం: అంతర్గాం మండలం విసంపేట సర్పంచ్ దారవేణి సాయికుమార్ వయసు 24ఏళ్లు. తను పుట్టిన ఏడాదిలోపే తల్లి, ఐదేళ్ల క్రితం తండ్రిని కోల్పోయాడు. సోదరుడి పెంపకంతో ప్రయోజకులయ్యారు. ఎంబీఏ (హెచ్ఆర్) పూర్తిచేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం సర్పంచ్గా గెలిచాడు. తల్లిదండ్రుల ఆప్యాయతలకు నోచుకోలేదని, అయినా వందలాది మంది గ్రామస్తులు తనపై ప్రేమాభిమానాలు చూపి సర్పంచ్గా ఎన్నుకున్నారని తెలిపారు. చిన్న ఉద్యోగం చేసుకుంటున్న తనకు ఊహించని విధంగా సర్పంచ్ పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. -
వ్యక్తి మృతిపై అనుమానాలు
● అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా పోలీసులకు ఫిర్యాదు ● పోస్టుమార్టంకు తరలించిన అధికారులు ● అనుమానాస్పద మృతిగా కేసుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58) గల్ఫ్లో ఉంటున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి తన కుమారుని వివాహం చేశాడు. శుక్రవారం పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన నర్సయ్య రాత్రి మృత్యువాత పడ్డాడు. హార్ట్స్ట్రోక్(గుండెపోటు)తో తన భర్త చనిపోయినట్లు భార్య వజ్రవ్వ గ్రామస్తులను నమ్మించి శనివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసింది. డప్పుచప్పుల మధ్య అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మృతదేహం మెడపై గాయంతో నల్లటి గాటు ఉండడంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పాడేపై నుంచి కిందికి దించి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు వజ్రవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది. మృతుడు నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మధు, యోగేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాహుల్రెడ్డిని వివరణ కోరగా.. నర్సయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని భార్యను విచారిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
పేదల జీవితాల్లో వెలుగులు
● ఉచితంగా నేత్రశస్త్రచికిత్సలు ● ఉమ్మడి జిల్లాలో రోజూ శిబిరాలు పెద్దపల్లి: పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు లయన్స్ క్లబ్ సంస్థవారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అభాగ్యులకు అండగా ఉంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు పథకం ద్వారా ప్రత్యేక వైద్య నిపుణుల సాయంతో వేలాదిమందికి కంటి పరీక్షలు చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిని గుర్తించి అందులో 23,485 మందికి ఉచితంగా శస్త్రచికిత్స చేసి వెలుగులు నింపారు. దాతల సాయంతో 63,743 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. మంథనిలో రోజూ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారు. దీంతోపాటు లక్సెట్టిపేట, పరకాలలో ప్రతీ మంగళవారం, బుధవారం కోరుట్ల, నిర్మల్ జిల్లా ఖానాపూర్లో, గురువారం పెద్దపల్లిలో, శనివారం కాటారం, ఆసిఫాబాద్లో, ఆదివారం కొత్తపల్లి హవేలి, బె ల్లంపల్లిలో ఉచిత సేవలు అందిస్తున్నారు. -
మానేరుపై మరో వంతెన
మంథని: మంథని నియోజకవర్గంలోని గో దావరి నదిపై ఇప్పటికే పలు వంతెనల నిర్మాణానికి నిధులు కేటాయింయిన ప్రభుత్వం.. తాజాగా ఆరెంద వద్ద మానేరుపై రూ.203 కోట్లతో మరోవంతెన నిర్మించనుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఆరెంద నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా దామెరకుంట వరకు 1.120 కిలో మీటర్ల పొడవున, 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ వంతెన, 9.530 కి.మీ. పొడవున అప్రోచ్ రోడ్డు నిర్మిస్తామని పేర్కొన్నారు. వంతెన అందుబాటులోకి వస్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర–ముక్తీశ్వర స్వామి దేవాలయం అంతర్ రాష్ట్ర వంతెన వరకు, అక్కడి నుంచి మహారాష్ట్రకు మార్గం సుగమం కానుందని ఆయన తెలిపారు. జిల్లావాసులు కాళేశ్వరం వెళ్లడానికి 25 కి.మీ. దూరభారం తగ్గుతుందన్నారు. కా ళేశ్వరం టూరిజంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు కనెక్టివిటీ పెరుగుతుందని మంత్రి శ్రీధర్బాబు వివరించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి పెద్దపల్లి/మంథని : భూపాలపల్లి – పెద్దపల్లి జి ల్లాల సరిహద్దుల్లోని మానేరుపై అడవిసోమన్పల్లి వద్ద నిర్మించిన చెక్డ్యాం కూలిపోవడానికి బాధ్యులైన వారిన వారిని గుర్తించి చర్య లు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రతినిధులు కోరా రు. ఈమేరకు కలెక్టర్కు శనివారం వినతి ప త్రం అందించారు. అనంతరం వారు మాట్లా డుతూ, గత ప్రభుత్వం మానేరుపై చెక్డ్యాంలు నిర్మించిందన్నారు. ఇవి కూలిపోవడంపై అధికారులు, కాంట్రాక్టర్లు పరస్పర విరుద్ధమై న ప్రకటనలు చేస్తున్నారని, ఇది ప్రజలను త ప్పుదారి పట్టించడమేనని, రాజకీయ కోణంలో ప్రజాప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉంటుందన్నారు. ప్రతినిధులు ప్రసాద్, వెంకన్న, సత్యం, శశి భూషణ్ కాచే, ప్రవీణ్కుమార్, శంకర్, కిరణ్, సమ్మయ్య పాల్గొన్నారు. నేటినుంచి రైల్వేగేట్ మూసివేత ఓదెల(పెద్దపల్లి): ఓదెల రైల్వేస్టేషన్ సమీపంలోని తారక రామకాలనీ లెవల్ క్రాసింగ్ రై ల్వేగేట్ను ఆదివారం నుంచి మూసిఉంచనున్నారు. రైళ్లవేగం మరింత పెంచేందుకు ఆధునికీకరణ చేపడతారు. వారం రోజుల పాటు మరమ్మతులు కొనసాగనున్న దృష్ట్యా రైల్వే గేట్ మూసివేసి ఉంచుతామని, ప్రయాణికులు, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచించారు. జిల్లాస్థాయి క్రాస్కంట్రీ పోటీలు ధర్మారం(ధర్మపురి): నందిమేడారం గురుకు ల విద్యాలయంలో క్రాస్కంట్రీ జిల్లాస్థాయి పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కొమ్ము గట్టయ్య శనివారం ప్రారంభించా రు. బాల,బాలికలకు అండర్–16లో 2 కి.మీ., అండర్–18లో 6కి.మీ. అండర్– 20లో 8 కి.మీ., మహిళలు, పురుషులకు 10 కి.మీ. విభాగాల్లో క్రాస్కంట్రీ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను వచ్చే నెల 2న రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పెద్దపల్లి జిల్లా తరఫున పంపించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. వ్యా యామ ఉపాధ్యాయులు బైకనీ కొమురయ్య, అంజయ్, మహేశ్, సురేశ్ పాల్గొన్నారు. అరుణాచలానికి ఆర్టీసీ బస్సు గోదావరిఖనిటౌన్: అరుణాచలం పుణ్యక్షేత్రానికి ఈనెల 23న గోదావరిఖని నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు నడపనున్నట్టు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. గోదావరిఖని లో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలు దేరే ఈ బస్సు.. పెద్దపల్లి, కరీంనగర్ నుంచి కాణి పాకం, అరుణాచలం, శ్రీరంగం, పళని, పాతా ళశంభు, మధురై, రామేశ్వరం, విష్ణుకంచి, శివకంచి, జోగులాంబకు వెళ్తుందన్నారు. భక్తుల కు దర్శన అవకాశం కల్పించాక ఈనెల 29న గోదావరిఖని చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.8వేలు, పిల్లలకు రూ.6వేలు చా ర్జీ నిర్ణయించామని టికెట్లను www.tgsrtc bus.in వెబ్సైట్లో బుక్ చేసుకో వాలని, వి వరాలకు 73828 47596, 70135 04982 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
చెక్డ్యాం పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు
మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లి చెక్డ్యాంను ఫోరెన్సిక్ నిపుణులు శనివారం సాయంత్రం పరిశీలించారు. మూడురోజుల క్రితం చెక్డ్యాం కూలిపోగా ఇరిగేషన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ నిపుణులు చెక్డ్యాం సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మానేరులో పడిపోయిన గోడ బండరాళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. శాంపిళ్లు సేకరించారు. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి వాటిని పరీక్షిస్తామని, నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని డీఎస్పీ తెలిపారు. -
పైడిపెల్లిలో రీపోలింగ్ నిర్వహించండి
వెల్గటూర్: తాము 50 ఏళ్ల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఆ పోరాటంలో తాము విజయం సాధించినా.. అధికారులు అడ్డుకున్నారని పేర్కొంటూ మండలంలోని పైడిపెల్లి గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఈనెల 17న నిర్వహించిన మూడో విడత ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు జరిగాయని, మరోసారి పోలింగ్ నిర్వహించాలని సుమారు మూడు వందల మంది ట్రాక్టర్లలో తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నెల 22న జరగనున్న సర్పంచ్ ప్రమాణస్వీకారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ రోజు గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎంపీవో కృపాకర్కు వినతిపత్రం అందించారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మమత మాట్లాడుతూ గ్రామంలో ఒకే కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోందని, నియంతృత్వాన్ని సహించలేక ప్రజలంతా ఏకతాటిపై నిలబడినా కౌంటింగ్లో గోల్మాల్ చేసి తనను ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ పూర్తి కాకముందే తాను ఓడిపోయినట్లు ధృవీకరించి, బెదిరించి, బలవంతంగా తనతో సంతకం తీసుకున్నారని, తమకు న్యాయం చేయాలని, రీకౌంటింగ్ చేయాలని శాంతియుతంగా తాము నిరసన తెలిపితే పోలీసులు లాఠీచార్జ్ చేశారని కన్నీరుపెట్టుకున్నారు. ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కాల్పులు జరిపిన తర్వాతనే తాము ప్రాణ రక్షణకు రాళ్లు విసిరామని తెలిపారు. తమను కౌంటింగ్ కేంద్రానికి వందమీటర్ల దూరం ఉంచిన అధికారులు.. ప్రముఖ రాజకీయ నాయకుడి సోదరుడిని కౌంటింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారని, ఆయనకు కనీసం గ్రామంలో ఓటు కూడా లేదని తెలిపారు. తమకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ఎలుక రాజు, గాలి హరీశ్, మహిళలు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చిన గ్రామస్తులు ప్రమాణ స్వీకారం ఆపాలని వినతిపత్రం అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్ -
● కళాకారులుగా.. ఉద్యోగులుగా.. వివిధ రంగాల్లో రాణించి ● సర్పంచ్లుగా ఎన్నికై న యువత
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి... పాలనలో ప్రత్యేకత చూపాలని భావిస్తున్నారు. మరో వైపు ఓటర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి యువతకు పట్టం కట్టారు. అభిమానం, సామాజిక సేవ, గౌరవం, తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో అవకాశం కల్పించారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు సర్పంచ్ల ప్రత్యేకతపై ఈ వారం సండే స్పెషల్..!! -
మోడల్ విలేజ్గా..
మా ఆయన విజయ్కుమార్ సైన్యంలో చేరి దేశరక్షణ కోసం సేవలందించారు. ఆయన స్ఫూ ర్తి, ప్రోత్సాహంతో ప్రజా సేవ చేయాలన్న తపనతో సర్పంచ్గా పోటీచేశా. గ్రామస్తులంతా తనకే అండగా నిలవడంతో 1,124 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కట్టబెట్టారు. ఎ మ్మెస్సీ కంప్యూటర్స్ చదివిన. గ్రామాభివృద్ధికి పాటుపడతా. గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుతా. పెద్దపల్లి: భోజన్నపేట గ్రా మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఎంకాం, డీఈడీ, బీఈడీ చదువుకున్న. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ వర్తింప జేసేలా అధికారులను కోరుతా. గ్రామంలోని సమస్యలపై అవగాహన పెంచుకుని పరిష్కరిస్తా. ప్రజలకు మెరుగైన సేవలందిస్తా. -
జాతీయ నాయకుల ఫొటోలకు రక్తాభిషేకం
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గొస్కె రాజేశం ఆ పార్టీ జాతీయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చిత్రపటాలకు శనివారం రక్తాభిషేకం చేశారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్లో కార్యకర్త నుంచి జిల్లా అధికార ప్రతినిధిస్థాయికి ఎదిగానని, అయినా, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తనకు మద్దతు ఇవ్వకుండా మరోవ్యక్తికి మద్దతు ఇచ్చి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిపించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మడక పంచాయతీ ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ చేశారని, 300 కుటుంబాలు కలిగిన తమకు అన్యాయం చేశారని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తిని సర్పంచ్ చేశారని రాజేశం పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేశారని, వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే పెద్దలు కాపాడరని ఆరోపించారు. అనంతరం రోడ్డుపై కాలనీవాసులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో కరెంట్ షార్ట్సర్క్యూట్తో ఇల్లు కాలిపోయింది. భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాలు. ఇందారపు విజయ్ ఇంటిలో రాచమల్ల శివకుమార్ అద్దెకు ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లిన క్రమంలో షార్ట్సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో సర్పంచ్ దండవేన సంధ్యబానేశ్ వెంటనే మంథని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వస్తువులు, బంగారం, నగదు, బట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇంటి యజమానికి రూ.15లక్షలు, అద్దెకు ఉండే శివకుమార్కు రూ.5లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. సర్వం కోల్పోయిన శివకుమార్తోపాటు ఓనర్ విజయ్ను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ కోరారు. ప్రయాగ్రాజ్కు మరిన్ని ప్రత్యేక రైళ్లు రామగుండం: ధనుర్మాసం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరిన్ని రైళ్లను నడిపిస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 23, 24, 25, 26వ తేదీల్లో 07402/03/04/05 రైళ్లు ప్రయాగ్రాజ్కు నడుస్తాయన్నారు. ఇవి చర్లపల్లిలో రాత్రి 7.45గంటలకు బయలుదేరి కాజీపేటకు రాత్రి 9.42 గంటలకు, పెద్దపల్లికి రాత్రి 11.50గంటలకు, మంచిర్యాలకు అర్ధరాత్రి 12.35గంటలకు చేరుకుంటాయన్నారు. రెండోరోజు వేకువజామున 4.30గంటలకు ప్రయాగ్రాజ్ చేరుకుంటాయని వివరించారు. -
రాజన్న ఎన్కౌంటర్కు 40 ఏళ్లు
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి ప్రాంతంలోని రెబ్బల్దేవులపల్లి గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన అ ప్పటి పీపుల్స్వార్, ప్రస్తు త మావోయిస్టు పార్టీకి చెందిన దళనేత తుంగాని రాజన్న ఉరఫ్ గోపన్న చనిపోయిన ఆదివారం నాటికి 40 ఏళ్లు. పీడిత, తాడిన ప్రజల పక్షాన పెద్దపల్లి గడ్డపై గళమెత్తిన ధీరుడు రాజన్న. దొరలను గడగడలాడించిన వీరుడు. సుల్తానాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని రెబ్బల్దేవులపల్లిలోని ఓ ఇంట్లో తుంగాని రాజన్న ఉరఫ్ గోపన్నతోపాటు ధర్మారం మండలం ఖానంపల్లికి చెందిన చంద్రయ్య ఉరఫ్ శీనన్న షెల్టర్ తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు బలగాలు రాజన్న, శీనన్న షెల్టర్ తీసుకున్న గుడిసెను చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ ప్రారంభం కావటంతో తొలు కానిస్టేబుల్ నర్సయ్య మృతిచెందారు. ఆగ్రహం చెందినపోలీసులు.. గుడిసైపె పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆనాటి జ్ఞాపకాలు జిల్లా ప్రజల మదిలో ఇంకా మెదలుతూనే ఉన్నాయి. రాజన్న చనిపోయిన 40 ఏళ్లు కావడంతో భార్య తుంగాని రాధక్క, కూతురు క్రాంతి, కుటుంబసభ్యులు ఆయనను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యున్ని కోల్పోయి కన్నీటిపర్యంతమయ్యారు. స్మరించుకున్న కుటుంబసభ్యులు -
పకడ్బందీ ప్రణాళిక.. అప్రమత్తం
● పంచాయతీ ఎన్నికల్లో భారీగా నగదు, లిక్కర్ స్వాధీనం గోదావరిఖని: పకడ్బందీ ప్రణాళిక, సమయస్ఫూర్తి, వ్యూహాత్మకంగా వ్యవహరించిన రామగుండం పో లీస్ కమిషనరేట్ పోలీసులు.. పంచాయతీ ఎన్నిక ల్లో అక్రమంగా తరలించే నగదు, మద్యం, విలువైన బహుమతులను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి మూడు దశల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అనుక్షణం అప్రమత్తంగా విధులు నిర్వర్తించారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు.. ఓటర్లను మభ్యపెట్టేందుకు నగదు, మద్యం ప్రవాహం ఈసారి భారీగా పెరిగింది. ఒక్కో సర్పంచ్ అభ్యర్థి కనీసం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేశారనే ప్రచారం ఉంది. ఈక్రమంలో గ్రామాల్లో ఉద్రిక్తత కూడా పెరిగింది. అయినా.. పరిస్థితులపై సమాచారం సేకరిస్తూ అక్రమ మద్యం, ధన ప్రవాహాన్ని నిలువరింపజేశా రు. సున్నిత, అతిసున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. మొబైల్ పెట్రోలింగ్ పార్టీ లు, క్విక్ రెస్పాన్స్టీంలతోపాటు ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. 1,700 మందితో బందోబస్తు.. పంచాయతీ ఎన్నికలు ఈసారి అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. మంచి ఆదాయం ఉన్న గ్రామపంచాయతీల్లో ఒక్కో ఓటుకు రూ.5వేల వరకు పంచిపెట్టారు. చిన్న పంచాయతీల్లో రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు ముట్టజెప్పారు. ఈక్రమంలో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. తనిఖీల్లో రూ.13.73లక్షలు నగదు, రూ.9.84లక్షల విలువైన లిక్కర్, రూ.1.58 లక్షల విలువైన బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కోదశలో 1,700 మందికిపైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం -
సమస్యలపై అవగాహనతో..
బోయినపల్లి: మండలంలోని దుండ్రపల్లి గ్రామానికి చెందిన జంగం అంజయ్య లాయర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచుగా ఎన్నికయ్యాడు. బీఏ ఎల్ఎల్బీ చేసి 2014 నుంచి లాయర్గా రాణిస్తున్నాడు. వేములవాడ కోర్టులో చురుకై న న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వకీల్గా సమస్యలపై ఉన్న అవగాహనతో రాజకీయాల్లో రాణిస్తానని చెప్పారు. కోనరావుపేట: మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన సింగం శ్రీహరి ఐదేళ్లుగా లాయర్గా కొనసాగుతున్నారు. రోజూ సిరిసిల్లకు వెళ్లి న్యాయవాద వృత్తినే కొనసాగిస్తున్న అతడు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచారు. గ్రామ సమస్యలు పరిష్కరించి, అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. రామగుండం: అంతర్గాం టీటీఎస్ గ్రామ సర్పంచ్గా గెలిచిన అంబోతు రవికుమార్ రాయ్పూర్ ఎన్ఐటీలో ఎంటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగంతో నెలకు రూ.రెండున్నర లక్షల వేతనం పొందాడు. తనతో పాటు కొంతమందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ఉద్యోగం వదిలేశాడు. మండల పరిధిలోని పేద కుటుంబాలకు చెందిన యువతకు తన సొంత ఖర్చుతో గ్రూప్స్, సివిల్స్లో శిక్షణ ఇప్పించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ నిర్మించాడు. ప్రస్తుతం డైయిరీ ఫామ్ ఏర్పాటు చేసి అందులో పాడి రైతులకు ఉపాధి కల్పిస్తున్నాడు. -
చలితీవ్రతకు వ్యక్తి మృతి
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని ఏ–పవర్హౌస్ చమన్ పరిసరాల్లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి కనిపించాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి చలితీవ్రతకు మృతిచెంది ఉంటాడని భాస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ నాయకుడు సలీంబేగ్ తెలిపారు. ఈమేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంధ్యారాణి శనివారం ఆ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఉంటే 87126 56525 నంబరుకు ఫోన్చేసి సమాచారం అందించాలని ఎస్సై కోరారు. పరిశుభ్రతపై దృష్టి పెద్దపల్లిరూరల్: గ్రామాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని డీపీవో వీరబుచ్చయ్య అన్నారు. హన్మంతునిపేట పంచాయతీని ఆయన శనివారం సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. ముందస్తు క్రిస్మస్ వేడుకలు పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో శనివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. సూపరింటెండెంట్ శ్రీధర్ కేక్కట్ చేశారు. ఆర్ఎంవో విజయ్కుమార్, నర్సింగ్ సూపరింటెంటెండెంట్ అనిత ప్రియదర్శిని, పద్మ, హెడ్నర్స్ బేబీరాణి, భవాని ఉన్నారు. హత్యాయత్నం కేసులో జైలు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన మర్రి కుమార్పై హత్యాయత్నం చేసిన అల్లంల మధునయ్యకు 10నెలల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి సునీత శనివారం తీర్పు ఇచ్చారని ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గౌడ రాజమ్మ 11వ రోజు కర్మకు వెళ్లిన మర్రి కుమార్.. అల్లంల మధునయ్య మధ్య గొడవ జరిగింది. గొడవను మనసులో పెట్టుకున్న అల్లంల మధునయ్య.. గత ఫిబ్రవరి 3వ తేదీన మర్రి కుమార్పై వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్తో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బీరుసీసాతో కొట్టాడు. గాయపడిన కుమార్ను స్థానికు ఆస్పత్రికి తరించారు. బాధితుడి మేనల్లుడు ఒజ్జె శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై.. విచారణ అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వరువర్గాల వాదనలు విన్న జడ్జి.. జైలుశిక్షతోపాటు జరిమానా విధించారు. -
పుట్టిన ఊరుకు సేవ చేయాలని..
బుగ్గారం: మండలంలోని సిరికొండకు చెందిన పంచిత ధర్మరాజుయాదవ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యత మీదపడింది. ఈ క్రమంలో ఉపాధి కోసం గల్ఫ్బాట పట్టాడు. 15 ఏళ్లుగా దుబాయ్, ఖతార్ దేశాల్లో వివిధ కంపెనీల్లో పనిచేశాడు. ఖతార్ కంపెనీలో మంచి స్థాయిలో కుదురుకున్నాక తెలంగాణా ప్రజాసమితి స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ మరణించిన వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపించడం, జైళ్లలో ఉన్నవారికి న్యాయసహాయం అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టాడు. గ్రామంలోని యువకులకు వీసాలు పంపి గల్ఫ్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. తాను పుట్టిన ఊరుకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో బరిలో నిలిచాడు. గ్రామంలోని యువత, మహిళలు, రైతులు పూర్తి మద్దతు తెలుపడంతో సర్పంచ్గా విజయం సాధించాడు. -
వడివడిగా ఎస్ఐఆర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లాలోని ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/ఎన్నికల జాబితా విస్తృత జాబితా సవరణ) ప్రక్రియ వడివడిగా ముందుకు సాగుతోంది. దేశంలో నిజమైన పౌరులను గుర్తింపే లక్ష్యంగా మొదలైన ఈ ప్రక్రియపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొన్ని వర్గాలు ఈ సర్వేను స్వాగతిస్తుండగా.. మరికొన్ని వర్గాలు సర్వేపై ఆందోళన, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తర భారతదేశంలోని పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన కేంద్రం.. తెలంగాణలోనూ ఈ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందుకు బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్వో) క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పలు ప్రాంతాల్లో సర్వేపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు నిజమైన ఓటరు.. ఎవరు కాదు? ఎవరు కొత్త ఓటరు.. ఎంతకాలం నుంచి నివసిస్తున్నారు అన్న అంశాలపై బీఎల్వోలు వివరాలు సేకరిస్తున్నారు. ఏమిటీ సర్వే? భారత పౌరుల ఓటరు నిర్ధరణకు ప్రారంభించిన సర్వే ఇది. ఇందులో 2002 ఓటరు జాబితా 2025 ఓటరు జాబితాను పక్కపక్కన పెట్టుకుని వివరాలు సరిపోలుస్తూ.. స్థానికంగా ఓటర్లు నివసిస్తున్నారా? లేదా.. ప్రస్తుత డేటాతో పాత డేటా మ్యాచ్అవుతుందా లేదా చూస్తున్నారు. దీన్ని మ్యాపింగ్ అని పిలుస్తున్నారు. 2002, 2025 ఓటర్ల జాబితాలో (రెండింటిలో) పేర్లు ఉన్నవారు మొదటి కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేకుండా 1987కు ముందు జన్మించిన వారు రెండో కేటగిరీగా, 2002 ఓటరు జాబితాలో లేని , 1987 నుంచి 2004కు మధ్యలో పుట్టిన వారు మూడో కేటగిరీగా, 2004 తరువాత జన్మించిన వారు నాలుగో కేటగిరీగా విభజించారు. ఉదాహరణకు 2002లో దంపతులకు ఓటు ఉందనుకోండి. వారికి పుట్టిన పిల్లలకు, వారి మనవలకు ఓటుపై ఎలాంటి వివాదం ఉండదు. ఇలాంటి ఓట్లను వివాదం లేని గ్రీన్ కేటగిరీలో వేస్తున్నారు. ఇందుకోసం పాత పోలింగ్ స్టేషన్, ఓటు నంబర్లను పోల్చి చూస్తున్నారు. వాటి ఆధారంగా పురుషులు, సీ్త్రలు, ట్రాన్స్జెండర్ల వివరాలను అప్డేట్ చేస్తున్నారు. ఆందోళన ఏమిటి? ఓటర్ల తనిఖీలో భాగంగా 2002లో ఉన్న ఇంటి పెద్దలు 2025లో ఉన్నారా? వారి పిల్లలు, మనవల పేర్లు చూస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ, నేటి గ్లోబలైజేషన్ కాలంలో స్థిర నివాసాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలీ పనులు, జీవనోపాధి, వలసలు, వివాహాలు తదితరతో పలు కుటుంబాలు రెండు, మూడు దశాబ్దాల్లో పలు చిరునామాలు మార్చాల్సి వస్తోంది. స్థానచలనంతో ఇళ్లు మారిన వారిలో ఆందోళన మొదలైంది. ఇలాంటి వారి ఓట్ల విషయంలో ఓటర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహాలు అయి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి పేర్లు 2002 జాబితాలో సరిపోల్చే సమయంలో తమ ఓటర్లు మిస్సవుతాయని ఆందోళన చెందుతున్నారు. చాలామంది కూలీలు తమ పాత పోలింగ్ స్టేషన్, ఇంటి నంబరు వివరాలు చెప్పలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాకు ఉన్న మరో ప్రత్యేకత సింగరేణి గనులు. ఇక్కడ పదవీ విరమణ పొందిన వేలాదిమంది కార్మికులు ఉన్నారు. వీరిలో పావు వంతు రెండు పేర్లు కలిగి ఉన్నారు. వీరి ఓట్ల విషయంలోనూ ఇపుడు గందరగోళం నెలకొంది. ఈ వివరాలపై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నిచంగా అందుబాటులోకి రాలేదు. ఎస్ఐఆర్ సర్వే అనుకున్నంత వేగంగా కాకుండా వడివడిగానే సాగుతోంది. ఇప్పటివరకూ కరీంనగర్లో 20 శాతం, పెద్దపల్లిలో 18 శాతం, జగిత్యాలలో 19 శాతం, సిరిసిల్లలో 16శాతం మేర పూర్తయింది.ఉమ్మడి జిల్లా ఓటర్ల వివరాలు -
దరఖాస్తుల పరిష్కారంలో అగ్రస్థానం
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ జగదీశ్వర్రావును తన కార్యాలయంలో శనివారం కలెక్టర్ అభినందించారు. ప్ర జావాణి దరఖాస్తులను పరిష్కరించడంలో తహసీల్దార్ జగదీశ్వర్రావు విశేష కృషి చేశారని, దీంతో ఆయనను ప్రణాళిక కమిషన్ వైస్చైర్మన్ చిన్నారెడ్డి హైదరాబాద్లో ప్రశంసించారని అన్నారు. కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ భవిష్యత్లోనూ ఇలాంటి పనితీరు కనబర్చాలని కలెక్టర్ ఆకాంక్షించారు. యాప్లో బుక్చేస్తేనే యూరియా పెద్దపల్లిరూరల్: యూరియా అవసరమైన రైతులు.. యాప్లో బుక్చేస్తే కొనుగోలు సులభం అవుతుందని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. జెండా కూడలిలో ఎరువుల దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంటలు వేసిన ప్రతీరైతు అవసరాలకు అనుగుణంగా యూరియా అందించేందుకే యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారని కలెక్టర్ అన్నారు. ఇంటివద్ద బుక్ చేసుకుని ఎరువుల షాప్ నుంచి వివరాలు, ఓటీపీ చెప్పి పొందొచ్చని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్, ఏవో అలివేణి తదితరులు పాల్గొన్నారు. -
ఆ కుటుంబానిదే ఆధిపత్యం
పెద్దపల్లిరూరల్: కనగర్తి గ్రామ పంచాయతీలో యెడెల్లి శంకర్ కుటుంబానిదే ఆధిపత్యం నడుస్తోంది. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లపాటు సేవలు అందించిన ఆ కుటుంబానికి చెందిన ఎడెల్లి శ్రీదేవి ఇటీవలి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పంచాయతీ సర్పంచ్గా గెలుపొందారు. జనరల్ మహిళకు కేటాయించడంతో (రెండోసారి) సర్పంచ్గా ఎన్నికయ్యారు. గతంలో ఎడెల్లి శంకర్ రెండుసార్లు సర్పంచ్గా, ఓసారి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికై గ్రామానికి సేవలు అందించారు. యెడెల్లి శంకర్.. ‘కనగర్తి శంకర్’గా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు. -
సిరిసిల్ల: ఏర్పుల నర్సయ్య అనుమానాస్పదంగా మృతి
సిరిసిల్ల: గల్ఫ్ నుంచి నెల రోజుల క్రితం ఇంటికొచ్చిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నపేటకు చెందిన ఏర్పుల నర్సయ్య(58) గల్ఫ్లో ఉంటున్నాడు. నెల క్రితం స్వగ్రామానికి వచ్చి తన కుమారుని వివాహం చేశాడు. శుక్రవారం పొలం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన నర్సయ్య రాత్రి మృత్యువాత పడ్డాడు. హార్ట్స్ట్రోక్(గుండెపోటు)తో తన భర్త చనిపోయినట్లు భార్య వజ్రవ్వ గ్రామస్తులను నమ్మించి శనివారం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేసింది. డప్పుచప్పుల మధ్య అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా మృతదేహం మెడపై గాయంతో నల్లటి గాటు ఉండడంతో అక్కడ ఉన్నవారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పాడేపై నుంచి కిందికి దించి పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు వజ్రవ్వను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం తేలనుంది. మృతుడు నర్సయ్యకు ఇద్దరు కొడుకులు మధు, యోగేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఈ సంఘటనపై ఎస్సై రాహుల్రెడ్డిని వివరణ కోరగా.. నర్సయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. మృతుని భార్యను విచారిస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
నాగులమ్మ పాటల నర్తకి.. నేడు బోటు మీద పల్లె సర్పంచ్
వారు వివిధ వృతులు, ఆయా రంగాల్లో రాణిస్తున్నారు. ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఊరికి సేవ చేయాలని భావించారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీచేసి గెలుపొందారు. గ్రామానికి ప్రథమ పౌరులయ్యారు. ప్రజాసేవలో తరించాలి... పాలనలో ప్రత్యేకత చూపాలని భావిస్తున్నారు. మరో వైపు ఓటర్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి యువతకు పట్టం కట్టారు. అభిమానం, సామాజిక సేవ, గౌరవం, తమ గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారనే నమ్మకంతో అవకాశం కల్పించారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పలువురు సర్పంచ్ల ప్రత్యేకతపై ఈ వారం సండే స్పెషల్..!! జానపద కళాకారిణి.. సర్పంచ్ఇల్లంతకుంట: నాగులమ్మ.. నాగులమ్మ.. నల్ల నాగులమ్మ.. చిన్న దొర బంగ్లా మీద సీటీలెయ్యకురా.. తెల్లచీర కట్టుకొని టేకుళ్లకు కలువబోతే.. వంటి జానపదపాటలకు నృత్యంతో అలరించిన యూట్యూబ్ ఆర్టిస్ట్ గౌరవేణి శివాని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం బోటు మీద పల్లె గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. శివాని 300కు పైగా జానపద పాటలకు డాన్సర్గా అభినయించారు. చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. ఆమె సోదరుడు బాబు వద్ద డ్యాన్స్ నేర్చుకున్నారు. తర్వాత క్లాసికల్ డాన్స్ మాస్టర్ సత్యం వద్ద మెలకువలు నేర్చుకున్నారు. ఆర్ఎన్ఎస్ పేరుతో డ్యాన్స్సూ్కల్ ఏర్పాటు చేశారు. జానపద గేయాల డాన్సర్గా, కొరియోగ్రాఫర్ కొనసాగారు. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన శివానికి బోటు మీద పల్లెకు చెందిన గౌరవేణి సుమన్తో వివాహమైంది. దాచారం అనుబంధ గ్రామంగా ఉన్న బోటు మీద పల్లె నూతన గ్రామపంచాయతీగా ఏర్పడడంతో రిజర్వేషన్ కలిసొచ్చి సర్పంచ్గా ఎన్నికయ్యారు. సర్పంచ్గా గ్రామ అభివృద్ధికి పాటుపడడంతో పాటు, అవకాశం వచ్చినప్పుడు జానపద గేయాల్లో రాణిస్తానని శివాని పేర్కొన్నారు.సైనికుడు.. సేవకుడుఫెర్టిలైజర్ సిటీ: మొన్నటి వరకు దేశ సరిహద్దుల్లో సైనికుడిగా విధులు నిర్వహించి.. నేడు గ్రామ సర్పంచ్గా సేవలందించేందుకు సిద్ధమయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గుంటూరుపల్లి సర్పంచ్ యర్రం హరినాథ్రెడ్డి 2003లో దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీలో చేరారు. 17ఏళ్లు సరిహద్దుల్లో విధులు నిర్వహించి 2020లో ఉద్యోగ విరమణ చేశారు. ఊరిపై ఉన్న మమకారంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2023లో రామగుండం మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్ని కలు రావడంతో పదవికి రాజీ నామా చేసి, గుంటూరుపల్లి సర్పంచ్గా పోటీ చేశారు. 303 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఏ చదివిన హరినాథ్రెడ్డి గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని వెల్లడించారు. -
జీజీహెచ్లో యువకుడి హల్చల్
● ఓపీ కౌంటర్ అద్దాలు ధ్వంసం ● అదుపులోకి తీసుకున్న పోలీసులు కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో శుక్రవారం ఓ యువకుడు వైద్య సిబ్బందిపై ఆగ్రహంతో హల్చల్ సృష్టించాడు. ఫర్నీచర్, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. వైద్యాధికారులు, సిబ్బంది కథనం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన ఓ యువకుడు ఈనెల 11న వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు గ్యాస్ట్రో సమస్యగా గుర్తించి ఆరోగ్యశ్రీ కింద ఇన్పేషెంట్గా అడ్మిట్ చేసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడడంతో ఈనెల 17న డిచ్చార్చి చేస్తున్నట్లు చెప్పి ఆరోగ్యశ్రీలో వివరాలు అప్డేట్ చేయడానికి ఆన్లైన్లో సమస్య ఉందని, ఫోన్చేసి సమాచారం ఇచ్చినప్పుడు ఓటీపీ చెప్పాలని పేషెంట్ను ఇంటికి పంపించారు. శుక్రవారం ఆస్పత్రికి వచ్చిన ఆ యువకుడు.. తనకు మెరుగైన వైద్యం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆరోగ్యశ్రీ సిబ్బందిని బెదిరిస్తూ ఓపీ అద్దాలను పగులగొట్టాడు. దాడిలో కంప్యూటర్, కీబోర్డు, స్కానర్ ధ్వంసమయ్యాయి. ఒక సిబ్బంది కాలుకు గ్లాసు తగిలి స్వల్ప గాయమయ్యింది. యువకుడు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే యువకుడుని అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిసింది. ఘటనపై ఆస్పత్రి ఆర్ఎంవోలు కృపాబాయి, రాజును వివరణ కోరగా.. దాడికి పాల్పడిన వ్యక్తిపై వన్టౌన్లో ఫిర్యాదు చేశామన్నారు. దాడులకు పాల్పడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
విచారణకే పరిమితమా..!
మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలతో నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశాను. తొందరలోనే విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటాం..ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రారంభంలో నియోజకవర్గానికి చెందిన ఆ పార్టీ ముఖ్య నేత తరచూ ఈ వ్యాఖలు చేశారు. అతను అన్నట్లే..ఆ తర్వాత విజిలెన్స్ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వెళ్లిపోయారు. ఇది జరిగి ఐదు నెలలు గడిచినా ఇంతవరకు ఈ వ్యవహారంలో ఎలాంటి పురోగతి లేదు. మొదట ఎంతో హడావుడి చేసిన ఆ నేత కూడా ప్రస్తుతం ఖాదీ పేరు తీయడం లేదని కాంగ్రెస్లో చర్చ నడుస్తుండడం గమనార్హం.మెట్పల్లి(కోరుట్ల): మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై ఇంకా నిజాలు నిగ్గు తేలడం లేదు. ప్రతిష్టాన్ పాలకవర్గ సభ్యులు పలు వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై గతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆందోళనలు సైతం నిర్వహించారు. అంతేగాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ ముఖ్య నేత ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయగా, వారు విజిలెన్స్ విచారణకు అదేశించారు. దీంతో ఆ విభాగం అధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదికను అందజేసినట్లు తెలిసింది. ఇవే ఆరోపణలు విజిలెన్స్తో విచారణ కనిపించని పురోగతి -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
మల్యాల(చొప్పదండి): చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు వలలో చిక్కుకొని మృతి చెందిన ఘటన మల్యాల మండలం నూకపల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. నూకపల్లి గ్రామానికి చెందిన దువ్వాక నర్సయ్య(62) గురువారం మధ్యాహ్నం గ్రామ శివారులోని వరదకాలువలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఎస్సై నరేశ్కుమార్ వరదకాలువలో వెతకగా నర్సయ్య వలలో చిక్కుకొని మృతిచెంది ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోక్సో కేసులో ఏడేళ్ల శిక్ష ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన అదే గ్రామానికి చెందిన బొడిగె రాజయ్య(69)కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష రూ.10వేల జరిమానా విధిస్తూ, బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని పెద్దపల్లి జడ్జి స్వప్నరాణి తీర్పు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి ప్రవేశించిన రాజయ్య తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. అప్పటి ఎస్సై అశ్విని కేసు నమోదు చేయగా ఏసీపీ కృష్ణ విచారణ జరిపారు. ఫాస్ట్ట్రాక్ అండ్ పోక్సో కోర్టులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో జడ్జి తీర్పు వెలువరించారు. రోడ్డు వెంట షాపుల కూల్చివేత కోల్సిటీ: గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో రోడ్డు వెంట ఉన్న దుకాణాలను బల్దియా అధికారులు కూల్చివేశారు. షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీరబుచ్చయ్యకు సన్మానం పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో సఫలీకృతమైన డీపీవో, జిల్లా అదనపు ఎన్నికల అధికారి వీరబుచ్చయ్యను ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈమేరకు కలెక్టరేట్లో ఆయనను కలుసుకున్నారు. -
బీటెక్ చేసి.. గ్రూప్–3 సాధించి
రామడుగు: మండలంలోని గోపాల్రావుపేటకు చెందిన పైండ్ల శ్రీకాంత్ గ్రూప్–3 ఉద్యోగం సాధించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. గతంలో గ్రూప్–4 ఉద్యోగం సాధించిన శ్రీకాంత్ గ్రూప్–3లోనూ ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు పైండ్ల అంజయ్య–శాంత. బీటెక్ పూర్తి చేశారు. వల్లంపట్ల యువకుడి ప్రతిభ ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వల్లంపట్లకు చెందిన ఎర్రం రఘు గ్రూపు–3 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మారుమూల గ్రామం వల్లంపట్లకు చెందిన యువకుడు కార్మిక ఉపాధి కల్పన శాఖలో ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు. నిరుపేద కుటుంబమైనప్పటికీ కష్టపడి తల్లి చదివించింది. తల్లి కష్టానికి రఘు ఫలితం దక్కించారు. -
రాణించిన రాయికల్ యువకులు
రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన యువకులు సురతాని అరవింద్రెడ్డి, భూపతిపూర్కు చెందిన బొడ్డుపల్లి విజయ్కుమార్ గ్రూప్–3 ఉద్యోగాలు సాధించారు. అరవింద్రెడ్డి రాష్ట్రస్థాయిలో 103వ ర్యాంక్ సాధించారు. ట్రెజరీ అండ్ అకౌంట్స్ హెచ్వోడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా ఎంపికయ్యారు. రాయికల్కు చెందిన సురతాని మల్లారెడ్డి, భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు. మరో యువకుడు భూపతిపూర్కు చెందిన బొడ్డుపల్లి విజయ్కుమార్ వస్తాపూర్ కార్యదర్శిగా పనిచేస్తూనే గ్రూప్–3లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సీనియర్ అకౌంటెంట్గా ఎంపికయ్యారు. బొడ్డుపల్లి విజయ్కుమార్ చిన్నతనంలోనే తన తండ్రి చనిపోగా తల్లి గంగరాజు బీడీలు చుడుతూ చదివించింది. విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ సంస్థల్లోనే పూర్తి చేశారు. ఆర్ఆర్బీ, గ్రూప్–4 ఉద్యోగాలు సైతం వచ్చాయి. సురతాని అరవింద్రెడ్డిబొడ్డుపల్లి విజయ్కుమార్ -
పాత పాలకవర్గాలకు చెల్లు
కరీంనగర్ అర్బన్: ప్రాథమిక సహకార సంఘాల పరిపాలన అధికారుల హస్తగతమైంది. పాత పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కేడీసీసీబీతో పాటు ఉమ్మడి జిల్లాలో కేడీసీసీబీ పరిధిలో గల 131 ప్యాక్స్ పాలకవర్గాలు రద్దయ్యాయి. కేడీసీసీబీ పర్సన్ ఇన్చార్జీగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని నియమించారు. ఎన్నికలు జరిగే వరకు ఇదే విధానం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ ఆలస్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీంతో పర్సన్ ఇన్చార్జీగా ఐఏఎస్ను నియమించారన్న వాదన వినిపిస్తోంది. 4 నెలల క్రితం పొడగింపు.. అంతలోనే రద్దు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తారా.. మళ్లీ పాలకవర్గాల గడువు పొడిగిస్తారా అన్న మీమాంస క్రమంలో నాలుగు నెలల క్రితం ఆగస్టు 14న పాలకవర్గాల గడువు పొడిగించింది. ఎన్నికలుంటాయా.. నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తారా అన్న ఊహగానాలకు తెరదించుతూ గడువు పొడిగించింది. నాలుగు నెలల వ్యవఽధిలోనే పాలకవర్గాలను రద్దు చేయడం చర్చనీయాంశఽమైంది. 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగగా వాస్తవానికి 2025 ఫిబ్రవరితో గడువు ముగిసింది. సదరు సమయంలో 6 నెలల గడువు పెంచగా ఆగస్టు 14తో ముగియగా మళ్లీ పెంచిన విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికల తరువాతే స్థానిక సంస్థల ఎన్నికల క్రమంలో ఇటీవలే సర్పంచి ఎన్నికలను పూర్తి చేసిన విషయం తెలిసిందే. 42శాతం బీసీ రిజర్వేషన్ తెరపైకి రావడం, హైకోర్టు పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించడం తెలిసిందే. సర్పంచ్ ఎన్నికలు పూర్తవగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండటంతో పర్సన్ ఇన్ఛార్జీని నియమించారని సమాచారం. సదరు ప్రక్రియ ఆలస్యమవుతుండగా సహకార సంఘాల ఎన్నికలు ఇప్పట్లో ఉండే అవకాశఽం లేదు. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తదుపరి సర్పంచి, మునిసిపాలిటీ ఎన్నికలు జరగాల్సి ఉండగా తొలుత సర్పంచి ఎన్నికలను నిర్వహించారు. మిగతా ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం 3–4నెలలు పట్టనుంది. అన్ని ఎన్నికలు వరుసగా వస్తాయన్న ప్రచారం నడుస్తోంది. స్థానిక సంస్థల పోరు అనంతరం సొసైటీ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నామినేట్ చేసే అవకాశం ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో వ్యవహారం కావడంతో నామినేట్ చేసేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేడీసీసీబీ పరిధి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉండగా కరీంనగర్,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో సహకార సంఘాలున్నాయి. నామినేటేడ్ చేసే అవకాశాలే ఎక్కువని ఉన్నతాధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. సదరు విధానంతో పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తికి పదవి కట్టబెట్టినట్లవుతుందన్న వాదన వినిపిస్తోంది. -
మెరిసిన పారిశుధ్య కార్మికుని కొడుకు
వీర్నపల్లి: మండలం గర్జనపల్లికి చెందిన పారిశుధ్య కార్మికుడు గుడిసె చంద్రయ్య–ఎల్లవ్వ దంపతుల రెండో కొడుకు గుడిసె రంజిత్కుమార్ గ్రూప్–3లో ప్రతిభ చాటారు. ట్రెజరీలో సీనియర్ అకౌంటెంట్గా ఎంపికయ్యాడు. రంజిత్కుమార్ 10వ తరగతి వరకు గర్జనపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్, బీటెక్ ట్రిపుల్ ఐటీ బాసరలో చదివారు. కరీంనగర్, హైదరాబాద్లోని ఎస్సీ స్టడీసర్కిల్లో కోచింగ్ తీసుకొని గ్రూప్–3కి ఎంపికయ్యారు. తండ్రి గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికుడు కాగా, తల్లి కూలి పనులు చేస్తుంటుంది. -
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యం
● పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ప్రజాసమస్యల పరిష్కారంలో సర్పంచులదే ప్రధాన భూమిక కా వాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మీర్జంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ పోచాల శైలజ– సదానందంలను ఎమ్మెల్యే స్వగృహంలో శుక్రవారం సన్మానించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి అధికారుల సమన్వయంతో గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, వార్డు సభ్యులు బండ మల్లారెడ్డి, పుల్లూరి అన్విత, సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుకు ఓకే.. ప్రయోజనం లేకే..
రామగిరి(మంథని): రామగుండం కోల్మైన్స్(బాహుబలి) ప్రాజెక్టు ఏర్పాటుపై శుక్రవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసింది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో అధికారి భిక్షపతి అధ్యక్షతన పన్నూర్ జేఎన్టీయూలో సభ నిర్వహించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సింగరేణి రామగుండం–3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. అనంతరం కలెక్టర్, మాట్లాడుతూ, ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. రామగిరి మండలం పన్నూరు, నాగేపల్లి, లద్నాపూర్, రత్నాపూర్, బుధవారంపేట, కమాన్పూర్ మండలం జూలపల్లి, ములకలపల్లి, వకీల్పల్లి గ్రామాల సమీపంలో 4,326 హెక్టార్ల విస్తీర్ణంలో బాహుబలి ఓపెన్కాస్ట్ మైనింగ్ కోసం రూ పొందించిన డీపీఆర్పై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. వచ్చే 40ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందులు కలుగకుండా రామగుండంలో ఏర్పాటయ్యే తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేలా ఓపెన్కాస్ట్ మైనింగ్ పనిచేస్తుందని కలెక్టర్ చెప్పారు. ఆర్డీవో సురేశ్, ఏపీఏ, ఆర్జీ–1, 2, ఎన్విరాన్మెంట్ జీఎంలు నాగేశ్వరరావు, లలిత్కుమార్, వెంకట య్య, సైదులు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నా యకులు వాసిరెడ్డి సీతారామయ్య, బి.జనక్ ప్రసా ద్, పర్యావరణ అధికారి రాజారెడ్డి, పర్సనల్ మేనేజర్ సుదర్శనం, తహసీల్దార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. -
రోజూ చేపలు పట్టుకునే వాళ్లం
చెక్డ్యాం నిర్మించాక చేపలు పట్టుకోవడం మొదలు పెట్టాం. మూడేళ్లుగా పదిహేను మందిమి కలిసి క్వింటాల్ వరకు చేపలు పట్టేవాళ్లం. రోజూ సుమారు రూ.800 నుంచి రూ.1,000 వరకు సంపాదించుకునేటోన్ని. చెక్డ్యాం కూలిపోవడంతో ఉపాధి పోయింది. – కొటారి సమ్మయ్య, మత్స్యకారుడు సాయంత్రం పోయే సరికే.. పొద్దుగాల చేపలు పట్టుకుని ఇంటికి పోయా. సాయంత్రం మళ్లా చెక్డ్యాం వద్దకు వచ్చేసరికి కూలిపోయి ఉంది. చెక్డ్యాంతో ఎంతోమందికి ఉపాధి దొరికింది. ఉదయం, సాయంత్రం వేళలో చేపలు పట్టుకునేవాళ్లం. ఇప్పుడు కూలిపోయి నీళ్లన్నీ వృథాగా పోతున్నయ్. మేము సైతం ఉపాధి కోల్పోయాం. – అనపర్తి శంకర్, మత్స్యకారుడు -
కూలిపోయిన ఉపాధి
మంథనిరూరల్: చేపల వేటతో తమ కుటుంబాలను పోషించుకుంటున్న వందలాది మంది మత్స్యకారులకు ఇప్పుడు ఉపాధి లేకుండాపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అడవిసోమన్పల్లి మానేరుపై చెక్డ్యాం నిర్మించింది. దీని నిర్మాణంతో సుమారు లక్ష క్యూసెక్కుల నీరునిల్వ ఉంటుండటంతోపాటు.. మూడేళ్లుగా వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. రెండు రోజుల క్రితం అది కూలిపోవడంతో తాము ఉపాధి కోల్పోయామని పలువురు మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానేరుపై 16 చెక్డ్యాంలు.. భూగర్భజలాల పెంపు, మత్స్య సంపదను పెంపొందించి, మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో జి ల్లాలోని మానేరుపై వివిధ చోట్ల 16 వంతెనల నిర్మాణానికి రూ.128కోట్లు వెచ్చించింది. శరవేగంగా వాటి నిర్మాణాలు పూర్తిచేసింది. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం అడవిసోమన్పల్లి, చిన్నఓదాల, గోపాల్పూర్ గ్రామాల మధ్య మానేరుపై సుమారు రూ.16 కోట్ల వ్యయంతో మూడు చెక్డ్యాంలు ని ర్మించింది. ఇందులో అడవిసోమన్పల్లి చెక్డ్యాం రెండు రోజుల క్రితం కుప్పకూలిపోయింది. చేపలు పట్టుకుని జీవనోపాధి.. చెక్డ్యాం నిర్మాణంతో నీటినిల్వలు వృద్ధి చెందాయి. తద్వారా చేపలకు ఆవాసం ఏర్పడింది. అనేకమంది చేపలు పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. లక్ష క్యూసెక్కల మేర నీటి నిల్వ ఉండటంతో మూడేళ్లపాటు పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లోని మత్స్యకారులు చేపలు పట్టుకునేవారు. నిత్యం వంద నుంచి దాదాపు 150 క్వింటాళ్ల వరకు చేపలు పట్టుకుని విక్రయించే వారని, తద్వారా ఈ ప్రాంతంలోని దాదాపు 200 కుటుంబాలు ఉపాధి పొందుతుండేవని స్థానికులు చెబుతున్నారు. అనేక అనుమానాలు.. అడవిసోమన్పల్లి చెక్డ్యాం కూలిపోవడంపై స్థానికులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప టికే ఇరిగేషన్ అధికారులు చెక్డ్యాం కూలడంపై విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు కావాలనే కూల్చివేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తాము ఉపాధి కోల్పోయా మని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చెక్డ్యాం పరిశీలన
మంథనిరూరల్: రెండ్రోజుల క్రితం కూలిపోయిన అడవిసోమన్పల్లి మానేరు చెక్డ్యాంను ఇరిగేషన్ అధికారులు శుక్రవారం పరిశీలించారు. దీనిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరావు గుప్త, ఎస్ఈ శ్రీనివాసచారితో కలిసి పరిశీలించారు. చెక్డ్యాం గోడలు కూలిపోయిన తీరుపై అనుమానం వ్యక్తం చేశారు. గతంలో వరద ఉధృతితోపాటు రెండురోజుల క్రితం వరకు ఎంతమేర నీరు నిలిచి ఉందనే విషయంపైనా వారు ఆరా తీశారు. ప్రస్తుత వరద తాకిడికి కూలిపోయే అవకాశం ఏ మాత్రం లేదని అధికారులు వివరించారు. ఈఈ బలరామయ్య, డీఈ రమేశ్బాబు, ఏఈఈ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
24న ఎస్సారెస్పీ నీటి విడుదల
పెద్దపల్లిరూరల్: యాసంగి పంటలకు ఎస్సారెస్పీ ద్వారా ‘వారబందీ’ పద్ధతిన ఈనెల 24 న సాగునీటిని విడుదల చేయనున్నారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ ప్రాజెక్టులో గేట్లు ఎత్తడంతో సరఫరా అయ్యే నీటిని తొలుత జ గిత్యాలకు సరఫరా చేస్తారని తెలిసింది. ఆ త ర్వాత పెద్దపల్లి జిల్లాకు చేరే అవకాశం ఉంది. వరి సాగుచేసే రైతులు ఇప్పటికే నారు పోసినా.. చలితీవ్రతతో తెగుళ్లు ఆశించి నారు పా డైందని రైతులు వాపోయారు. కొన్ని ప్రాంతా ల్లో మళ్లీ నారుపోయాల్సి వస్తోందని అంటు న్నారు. ఈసందర్భంగా నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈనెల 24 పో చంపాడ్ వద్ద గేట్లు ఎత్తినా పెద్దపల్లి జిల్లాకు జ నవరి 2వ తేదీ వరకు సాగునీరు చేరే అవకా శం ఉందన్నారు. వారబందీ పద్ధతిన వచ్చే నీ టిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వడ్ల కల్లాలపై వానరాలు మంథనిరూరల్: గ్రామాల్లో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులుగా స్వైరవిహారం చే స్తున్నాయి. కూరగాయాల తోటలను ధ్వంసం చేస్తున్న వానరాలు.. ఆఖరుకు వడ్ల కల్లాల్లో ఆ రబోసిన ధాన్యంపై దాడులు చేస్తున్నాయి. క ల్లాల్లో తిరుగుతూ వడ్లను తింటూ చిందరవందర చేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు కొంత ఆలస్యం కావడంతో అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలపై ఇలా కోతుల గుంపులు దాడులు చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయడంతోపాటు కోతులను తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు. పోరు ముగిసె.. పోస్టర్ తొలగే పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికల సంగ్రా మం ముగిసింది. ఈసారి పంచాయతీ పోరు అసెంబ్లీ ఎన్నికలను తలపించింది. సర్పంచ్ స్థానాలకు పోటీపడ్డవారు తమ గుర్తు ఓటర్లకు తెలిసేలా ప్రచార పోస్టర్లను ముద్రించి ప్రధా న కూడళ్లు, గోడలపై అంటించారు. ఎన్నికలు ముగియడంతో ఆ పోస్టర్లను తొలగించే పను ల్లో పంచాయతీ సిబ్బంది నిమగ్నమయ్యారు. మల్యాలపల్లికి చేరిన పులి!రామగుండం: సుమా రు ఆరురోజుల క్రితం మేడిపల్లి ఓసీపీ పరిసరాలు, గోదావరి తీరంలో సంచరించిన పెద్ద పులి.. శుక్రవారం మ ల్యాలపల్లి గ్రామ శివారులో ప్రత్యక్షమైనట్లు గ్రామస్తురాలు కత్తెరమ ల్ల కుమారి తెలియజేసింది. మేతకోసం తన మేకలను సమీపంలోని బీపీఎల్ స్థలంలోని అడవిలోకి తీసుకెళ్లింది. పులి అరుపులతో మే కలు బెదిరి వెనక్కి పరిగెత్తి వచ్చాయి. అటుగా వెళ్లిన మహిళకు కూడా పులి కనిపించింది. భ యాంళోనలకు గురైన ఆమె ప్రాణభయంతో కేకలు వేస్తూ గ్రామంలోకి పరుగులు పెట్టింది. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా.. పులి అడుగులు కనిపించాయి. రెండ్రోజుల క్రితం లింగాపూర్ గోదావరి శివారు, మేడిపల్లి, పాములపేటలో సంచరించిన పులి.. రామగుండం నడిబొడ్డులోని బీపీఎల్ ప్రాంతంలోకి రావ డం ఆందోళన, ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘సింగరేణి వేడుకలపై వివక్ష’యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రాష్ట్రప్ర భుత్వం కోల్బెల్ట్ ఏరియాల్లో చేపట్టే ప్రతీ కార్యక్రమానికి అవసరమైన నిధులు సమకూర్చుతున్న సింగరేణి.. తన ఆవిర్భావ వేడుకలపై వివక్ష చూపడం సరికాదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఈనెల 23న చేపట్టే ఆవిర్బావ వేడుకలను గ తంలో మాదిరిగానే వైభవంగా నిర్వహించాలన్నారు. స్థానిక ప్రెస్భవన్లో శుక్రవారం ఆ యన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేడుకలకు గతంలో రూ. 41లక్షలు ఖర్చుచేసి న సింగరేణి.. ప్రస్తుతం రూ.8లక్షలకు కుదించడం శోచనీయమన్నారు. నాయకులు రా మ్ముర్తి, రవి, కొమురయ్య, ప్రభాకర్రెడ్డి, సతీశ్, శశాంక్, శ్రీనివాస్రెడ్డి, అనిల్రెడ్డి, హరిప్రసాద్, రమేశ్ తదితరులు పాల్గొ న్నారు. -
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బీసీలవిజయబావుటా56986974120156126224648257సిరిసిల్లకరీంనగర్పెద్దపల్లిజగిత్యాలగెలిచినవి మొత్తంజనరల్లో బీసీలుబీసీరిజర్వ్ -
మేడారం జాతరకు 700 బస్సులు
● ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాజుకరీంనగర్టౌన్: వచ్చే ఏడాది జనవరిలో జరగను న్న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర కోసం క రీంనగర్ రీజియన్ పరిధిలోని డిపోల నుంచి 700 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు తెలిపారు. శుక్రవారం బస్స్టేషన్ స మావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీజియన్ పరిధిలో గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంథని డిపోల నుంచి జాతర బస్సులు ఉంటాయని తెలిపారు. ఆరు ఆపరేటింగ్ పాయింట్ల వద్ద అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు, ఎంపిక చేసిన బస్సులకు అవసరమైన మరమ్మతులు, జాతర విధులు నిర్వర్తించే సిబ్బంది ఎంపిక, భక్తుల సురక్షిత ప్రయాణం తదితర అంశాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కరీంనగర్ డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్.భూపతి, పి.మల్లేశం, డిపో మేనేజర్లు నాగభూషణం, వెంకన్న, రవీంద్రనాథ్, విజయమాధురి, ఎం.శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, కె. కల్పన, ఎస్.మనోహర్, దేవరాజు, ప్రకాశ్రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యాన్ని కాపాడాలి
సింగరేణి ఓసీపీలతో దుమ్ము, ధూళి వస్తున్నది. ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గాలిలో నాణ్యత మెరుగుకు ఎస్జీడీ యూనిట్లు నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అవి అమలు కావడం లేదు. ఏక్యూఐలో తప్పుడు సంఖ్య నమోదు చేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించి, ప్రజారోగ్యానికి పెద్దపీట వేయాలి. నిరుద్యోగులకు అన్యాయం సింగరేణి ప్రభావిత ప్రాంతా ల నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో అన్యాయమే జరుగుతోంది. గత ప్రజాభిప్రా య సేకరణ సందర్భంగా ఇదేవిషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. అయినా ఉపయోగం లేకుండా పోతోంది. ఇప్పుడు జరుగుతున్న కాంట్రాక్టు నియా మకాల్లో ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులు లేరు. అందరూ ఇతర ప్రాంతాల వారే. – మబ్బు శంకర్, అక్కెపల్లి అభివృద్ది సంగతేమిటి? రామగుండం కోల్మైన్స్ ప్రాజెక్టు ఏర్పాటు మాకు అంగీకారమే కానీ.. భూములను కోల్పోతున్న మా సంగతేమిటి? ఓసీపీలతో నష్టం జరుగుతున్నా.. మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మద్దతిస్తున్నాం. పరిసర ప్రాంతాలు, ఆర్అండ్ఆర్ కాలనీల్లో మౌలికవసతులు కల్పించాలి. సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకోవాలి. – కె.అభిలాష్, బుధవారంపేట ప్రమాణాలు మెరుగుపర్చాలి ఓసీపీలతో ప్రజల సగటు జీ వన ప్రమాణాలు పడిపోతున్నాయి. గాలి, నీరు, ధ్వని కాలుష్యం పెరిగిపోతోంది. విపరీతమైన కాలుష్యంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. బొ గ్గు రవాణా చేసే లారీలు నిబంధనలు పాటించడంలేదు. అధికారులూ పట్టించుకోవడం లేదు. జీవన ప్రమాణాలు మెరుపర్చాలి. – సీహెచ్ లింగమూర్తి, జాతీయ కార్యదర్శి, సదాశయ ఫౌండేషన్ -
ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు
పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న మాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా వేడినీటిని కూడా అందుబాటులో ఉంచారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయ్యేలోపే అల్పాహారం తిన్నాం. – మాధవి, ఉపాధ్యాయురాలు ఏర్పాట్లు బాగున్నాయ్ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించేందుకు ఎలిగేడు మండలం నర్సాపూర్ వచ్చా. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని భద్రపర్చినం. మాకు రాత్రిబస చేసేందుకు అవసరమైన అన్నిఏర్పాట్లు చేశారు. ఇబ్బందులు కలుగకుండా స్థానిక అధికారులు, సిబ్బంది సహకారం అందించారు. – భాగ్యలక్ష్మి, జూనియర్ లెక్చరర్ సంతృప్తిగా ఉంది పంచాయతీ ఎన్నికల విధులను నిర్వహించడం సంతృప్తినిచ్చింది. పోలింగ్ సమయానికల్లా సిద్ధంగా ఉండేంలా సామాగ్రితో ముందురోజు మధ్యాహ్నం వరకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాం. ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బందులు కలెగకుండా స్థానిక అధికారులు తీసుకున్న చర్యలు ఎంతో సంతృప్తినిచ్చాయి. – సామ శిరీష, ఉప్పట్ల, మంథని -
పైసలు పాయే..
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీపడిన ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చుచేశారు. ఫలితాలు వెలువడే వరకూ విజయం తనదేననే ధీమా తో అందినకాడికి అప్పు తీసుకొచ్చి మరీ ఎన్నికల ప్రచారం చేశారు. తీరా ఓటమి పాలవడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. పైసలు పోయే, పదవి రాకపాయేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మానేరు తీరం, ఇటుకబట్టీలు, రైస్ మిల్లులు, కంకర క్వారీలు విస్తరించి ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు డబ్బులు ధారపోసినా ఫలితం తేడా కొట్టడంతో తలలు పట్టుకున్నారు. పదవీ రాకపాయే.. ఓటమితో డీలాపడిన పంచాయతీ అభ్యర్థులు ప్రచారం కోసం చేసినఅప్పులు తీర్పడం ఎట్లా? పోల్ పోస్టుమార్టంలో రాజకీయ పార్టీల నాయకులు పరిషత్ ఎన్నికల వైపు ఓటమిపాలైన అభ్యర్థుల చూపు -
వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం
కరీంనగర్రూరల్: బొమ్మకల్లోని బిర్లా ఓపెన్మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యా అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో వాక్సెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) చేసుకుంది. ఈమేరకు గురువారం స్కూల్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, యూనివర్సిటీ ప్రతినిధి వినోద్లు ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, నైపుణ్యాధారిత విద్యతో పాటు భవిష్యత్ను సిద్ధం చేయాలనే లక్ష్యంతో వాక్సెన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ద్వారా రెండు సంస్థలు కలిసి విద్యార్థులకు గ్లోబల్ స్థాయిలో విద్యాబోధన అందుబాటులోకి వస్తుందన్నారు. వాక్సెన్ యూనివర్సిటీ ప్రతినిధి వినోద్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. బిర్లా స్కూల్ అమలు చేస్తున్న విద్యాప్రమాణాలు, వినూత్న కార్యక్రమాలను అభినందించారు. -
26న ‘గోపా’ స్వర్ణోత్సవాలు
పెద్దపల్లి: గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్(గోపా) స్వర్ణోత్సవాలు ఈనెల 26న హైదరాబాద్లో నిర్వహిస్తామని ఆ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి బుర్ర జగదీశ్వర్గౌడ్ తెలిపారు. స్వర్ణోత్సవాల ప్రచార పోస్టర్ను గురువారం సుల్తానాబాద్లో ఆవిష్కరించి మాట్లాడారు. గౌడల సమస్యలు, యువతకు విద్య, ఉపాధి అవకాశాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం తదితర అంశాలపై ఇందులో చర్చిస్తామన్నారు. ప్రతినిధులు అడ్డగుంట రాజేందర్గౌడ్, బైరగోని రవీందర్గౌడ్, అంతటి చిరంజీవిగౌడ్, ఏరుకొండ తిరుపతిగౌడ్, వేముల కిరణ్గౌడ్, పోడేటి వెంకటేశ్గౌడ్, పొన్నం శ్రీనివాస్గౌడ్, ముత్యం నరేశ్గౌడ్, కొయ్యడ రమాకాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.‘మీ డబ్బు.. మీ హక్కు’పై అవగాహన పెద్దపల్లి: ‘మీ డబ్బు.. మీ హక్కు’పై ఈనెల 20న క లెక్టరేట్లో అవగాహన కల్పిస్తామని లీడ్ బ్యాంక్ మే నేజర్ వెంకటేశ్ తెలిపారు. బ్యాంకుల్లో పొదుపులు, షేర్లు, డివిడెంట్లు, మ్యూచువల్ ఫండ్స్, బీమా తది తరాల్లో డబ్బు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని, దీనికోసం శిబిరాలు నిర్వహిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
వేడినీళ్లు.. నోరూరించే టిఫిన్లు
పెద్దపల్లిరూరల్: గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల సిబ్బంది వసతి, సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నారు. పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో విధులను నిర్వహించేందుకు వచ్చిన పోలింగ్ అధికారులు, ఓపీవోలు, మెడికల్, పోలీసు, తదితర సిబ్బందికి అవసరమైన వసతీసౌకర్యాలు మెరుగ్గా కల్పించారు. 85 పంచాయతీల్లో ఎన్నికలు.. జిల్లాలో ఆఖరువిడత పంచాయతీ ఎన్నికల్లో 85 సర్పంచ్, 636 వార్డు స్థానాల కోసం నిర్వహించిన ఎన్నికల్లో సిబ్బందికి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో 128 మంది పోలింగ్ అధికారులు, 166 మంది ఓపీవో తదితర సిబ్బందికి అవసరమైన సౌకర్యాలను ఆయా కేంద్రాల సమీపంలో కల్పించారు. వణికిస్తున్న చలిలో ఉదయమే స్నానం చేసేందుకు వీలుగా వేడినీటిని కూడా అందించారు. నోరూరించే అల్పాహారం, రుచికరమైన భోజనం అందించినట్లు పలువురు ఎన్నికల సిబ్బంది చెప్పారు. ఏర్పాట్లపై కొందరిని పలుకరించగా.. కడుపునిండా రుచికరమైన భోజనం ఎన్నికల విధుల నిర్వహణ తృప్తినిచ్చింది పోలింగ్, లెక్కింపు కేంద్రాల్లో సౌకర్యాలు భేష్ స్థానిక అధికారుల సహకారంతో సమస్యలు దూరం ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల మనోగతం -
వకీల్పల్లి
తంగళ్లపల్లి నుంచి అనేక మంది న్యాయవాదులుగా రాణిస్తున్నారు. దోర్నాల లక్ష్మారెడ్డి న్యాయవాద వృత్తిలో ఉంటూనే టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల్లో క్రియాశీల రాజకీయ నాయకుడిగా కొనసాగారు. పాతికేళ్ల క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా సేవలందించారు. ప్రస్తుతం సబ్బని రవీందర్, కోడం సత్యనారాయణ, కోడం సురేశ్, దోర్నాల సంజీవ్రెడ్డి, దోర్నాల జనార్దన్రెడ్డి, కోడి లక్ష్మణ్, సబ్బని రమేశ్ (కరీంనగర్), బండి చైతన్యగౌడ్, ిసీనియర్ న్యాయవాదులుగా కొనసాగుతున్నారు. ఇటీవల పలువురు జూనియర్ న్యాయవాదులు తక్కళ్ల సారిక, సుహాసిని, వినీత, ఆకుల శ్రీనివాస్, బొల్లారం ప్రదీప్, గజభీంకార్ సృజన, పసుల వంశీ ఇటీవలనే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాణించిన న్యాయవాదులు -
ఎన్నికలు విజయవంతం
పెద్దపల్లి: జిల్లాలో మూడుదశల్లో పంచాయతీ ఎన్నికలను విజవంతంగా నిర్వహించామని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య తెలిపా రు. ఈమేరకు గురువారం కలెక్టర్ శ్రీహర్షను కలిసి పుష్ఫగుచ్చం అందించి కృతజ్ఞతలు తలిపారు. 24న రిటైర్డ్ ఉద్యోగులకు దీపావళి బోనస్ గోదావరిఖని: రిటైర్డ్ ఉద్యోగులకు లాభాల వాటా చెల్లిస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఈనెల 18న ఖాతాల్లో జమ చేశారు. అలాగే దీపావళి లాభాల బోనస్ను కూడా ఈనెల 24న చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోగా ఉద్యోగ విరమణ చేసిన వారికి వాటా వర్తించనున్నట్లు తెలిపింది. -
ఈకేవైసీ పూర్తిచేయాలి
పెద్దపల్లి: జిల్లాలోని రేషన్కార్డుదారులు ఈకేవై సీ పూర్తిచేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఇప్పటివరకు 76.29శాతమే ఈ కేవైసీ పూర్తయ్యిందని, మిగతా వారు పూర్తిచేయాలన్నారు. జిల్లాలో ఇంకా 1,68,272 మంది సమీపంలోని రేషన్ దుకాణాల్లో ఈకేవైసీ పూర్తిచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. దరఖాస్తులు ఆహ్వానం పెద్దపల్లి: క్రీడా సామగ్రి అవసరమైన యువజన సంఘాలు ఈనెల 30వ తేదీలోగా దర ఖాస్తు చేయాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకట్ రాంబాబు తెలిపారు. సూచించారు. రిజిస్ట్రేషన్ ఉన్న, 18ఏళ్ల నుంచి 29ఏళ్ల వయసులోపు కలిగిన సభ్యులు కలిగి ఉన్న సంఘాలు అర్హులన్నారు. ఐదేళ్లలో ఆ సంఘాలు చేసిన సేవా కార్యక్రమాల ప్రతులను దరఖాస్తు తో జతచేయాలని సూచించారు. దరఖాస్తుల ను మేరా యువభారత్, కరీంనగర్ జిల్లా(బస్టాండ్ ఎదురుగా) కార్యాలయం నుంచి పొందాలని, వివరాలకు 91773 29258 నంబరు లో సంప్రదించాలని సూచించారు. సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని పెద్దపల్లి, మంచిర్యా ల జిల్లాల్లో పంచాయతీ ఎ న్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. క్రమశిక్షణ, అప్రమత్తత, పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో ఎన్నికల ప్రశాంత వాతావరణంలో ముగిశాయన్నారు. డీసీపీలు భూక్యా రాంరెడ్డి, భాస్కర్ పర్యవేక్షణలో అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్, పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, జైపూర్, బెల్లంప ల్లి, ఏఆర్ ఏసీపీలు నాగేందర్, కృష్ణ, రమేశ్, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్, ప్రతాప్ పక డ్బందీ పర్యవేక్షణ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో, దూరదృష్టి ఇందుకు తోడైందని ఆ యన వివరించారు. అన్ని విభాగాల్లోని పోలీస్ సిబ్బంది విధుల్లో అంకితభావం, అప్రమత్తతో వ్యవహరించారని సీపీ ప్రశంసించారు. జిల్లా వైద్యాధికారిగా ప్రమోద్కుమార్ పెద్దపల్లి: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా ప్రమోద్కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన జగిత్యాల జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. కలెక్టర్ శ్రీకోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటివరకు ఇన్చార్జి జిల్లా వై ద్య, ఆరోగ్యశాఖ అధికారిగా విధులు నిర్వర్తించిన వాణిశ్రీ యథావిధిగా ప్రోగ్రాం అధికారిగా పెద్దపల్లిలోనే కొనసాగుతారు. కాగా, ఆర్బీఎస్కే సిబ్బందితో నిర్వహించిన సమీక్షలో డీఎంహెచ్వో పాల్గొని పలు సూచనలు చేశారు. చిరువ్యాపారికి సన్మానం యైటింక్లయిన్కాలనీ(రామగుండం): వ్యాపారంలో వినూత్న పద్ధతులు అవలంబిస్తూ ఢి ల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కేంద్రపభు త్వం నుంచి ఆహ్వానం అందుకున్న చిరువ్యా పారి అల్లూరులోని బాలసాని నిర్మలను గ్రామస్తులు సన్మానించారు. పీఎం స్వనిధి ద్వారా రు ణాలు తీసుకుని వ్యాపార రంగంలో రాణిస్తూ, సకాలంలో రుణవాయిదాలు చెల్లించడంలో ఆమె అగ్రస్థానంలో నిలిచారని బీజేపీ నాయకులు ప్రశంసించారు. ఈమేరకు గ్రామంలో గురువారం ఆమెను సన్మానించారు. నాయకులు ఆకుల శశికుమార్, మూకిరి రాజు, లింగం నాయక్, శంకర్, అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు, ప్రవీణ్, రమాదేవి, నర్మద, స్వరూప, రజిత తదితరులు పాల్గొన్నారు. ఆదివరాహస్వామికి పూజలు కమాన్పూర్(మంథని): దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ సుప్రియ గురువారం శ్రీఆదివరాహస్వామిని దర్శిచుకున్నారు. ఆలయ ఈవో కాంతారెడ్డి ఆమెకు శాలువా కప్పి ఘనంగా స న్మానించారు. కార్యక్రమంలో పలువురు నాయ కులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. -
బాహుబలిపై మీరేమంటారు?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రామగుండం కోల్మైన్ ఏర్పాటులో ముందడుగు పడింది. సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు లేదా బాహుబలి ఓపెన్కాస్ట్గా పిలుస్తోన్న రామగుండం కోల్మైన్ కోసం గురువారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మంథని జేఎన్టీయూ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. ప్రాజెక్టు కోసం మొత్తం 4,326.08 హెక్టార్ల భూమి అవసరం అవనుంది. ప్రస్తుతం సింగరేణి వద్ద 3,266.88 హెక్టార్ల వరకు భూమి అందుబాటులో ఉంది. (అందులో 397.9 హెక్టార్ల అటవీ భూమి, 2,868 అటవీయేతర భూమి) అదనంగా 1,059.2 హెక్టార్ల భూమి (అందులో 305 హెక్టార్ల అటవీ భూమి, 753 హెక్టార్లు అటవీయేతర భూమి) అవసరం అవుతుంది. ఈ భూమి కూడా ఇప్పటికే సింగరేణి పరిధిలోనే ఉంది. రామగుండం కోల్మైన్ అనేది భారీ ప్రాజెక్టు. ఇందులో నాలుగు ఆపరేటివ్ మైన్స్ విలీనమవుతున్నాయి. అందులో రామగుండం ఓపెన్కాస్ట్ –1, ఎక్స్టెన్షన్ ఫేజ్–2, రామగుండం ఓపెన్కాస్ట్–2, అడ్రియాల షాప్ట్ అండర్గ్రౌండ్ కోల్మైనింగ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు, వకీల్పల్లి మైన్తోపాటు మూసివేసిన 10వ ఇంక్లైన్ గనులను కలిపి భారీ ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుగా ఆవిర్భవించనుంది. ఇలాంటి ప్రాజెక్టు సింగరేణి చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా సరికొత్త రికార్డు సృష్టించనుంది. పర్యావరణ సమస్యలపైనే ప్రజాభిప్రాయం.. బాహుబలి గనినుంచి దాదాపు 600 మిలియన్ టన్నుల వరకు బొగ్గు నిక్షేపాలను తీయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు ఏటా 21 మిలియన్ టన్నులపాటు బొగ్గును ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో భాగంగా మూసివేసిన 10 ఇంక్లైన్ భూగర్భ గనిని ఓపెన్కాస్ట్గా మార్చనున్నారు. అనంతరం ప్రస్తుతం భూగర్భగనిగా పనిచేస్తున్న వకీల్పల్లి మైన్ను కూడా ఓపెన్కాస్ట్గా మారుస్తారు. ఇంతటి భారీ గని కారణంగా చుట్టుపక్కల పల్లెల్లో ప్రజలు దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడతారని, వ్యవసాయం, పాడిపంటలు, సంప్రదాయల కులవృత్తులు, జీవనోపాధులు దెబ్బతింటాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లక్రితం ఈ ప్రాజెక్టు కోసం తమ గ్రామాల్లో భూసేకరణ చేసేటప్పుడు పునరావాసంతోపాటు, సింగరేణిలో కొలువులు కల్పిస్తామన్న అధికారులు ఇంతవరకూ మాట నిలబెట్టుకోలేదని ఆయా గ్రామాల ప్రజలు గుర్తుచేస్తున్నారు. పర్యారవణం మాట అటుంచితే.. తమకు బతుకుదెరువు కరువైందని వాపోతున్నారు. అదే సమయంలో సాధారణంగా విద్యుదుత్పత్తి కోసం టన్ను బొగ్గును కాల్చినప్పుడు దానిలోని కార్బన్, ఆక్సిజన్తో కలిసి సుమారు 2.2 నుంచి 2.9 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ను విడుదల చేస్తుంది. ఇదీకాక ఆమ్లవర్షాలకు కారణమైన సల్ఫర్ డైయాకై ్సడ్, నైట్రోజన్ ఆకై ్సడ్ ఉద్గారాలకు కూడా కారణమవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ప్రభావిత గ్రామాల ప్రజల ప్రధానమైన డిమాండ్లు ● దుమ్ముతో వస్తున్న శ్వాసకోశ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి ● ఓపెన్కాస్టు ప్రాజెక్టులో బ్లాస్టింగ్ల వల్ల ప్రభావిత గ్రామమైన జూలపల్లి, ముల్కలపల్లి గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు ● కిడ్నీల సమస్యలతోపాటు వివిధ రకాలుగా రోగాలకు గురవుతూ అనారోగ్యాల బారిన ప్రజలు పడుతున్నారు ● సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ముల్కలపల్లి గ్రామాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ రేడియేషన్ వల్ల కూడా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు ● భూసేకరణ వల్ల నిర్వాసితులైన గీత కార్మికులు, ఇతర నిరుద్యోగులకు జీవనోపాధి, వైద్యసదుపాయాలను కల్పించలేదు ● సింగరేణి విడుదల చేసే డీఎంఎఫ్టీ నిధులను కేవలం ప్రభావిత గ్రామాల అభివృద్ధికి మాత్రమే దోహదపడేలా చర్యలు తీసుకోవాలి. నేడు మంథని జేఎన్టీయూలో పీసీబీ ప్రజాభిప్రాయసేకరణ హాజరవుతున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తొమ్మిది గ్రామాల్లో భూమి.. వెయ్యి హెక్టార్లలో ప్రాజెక్టు ఏటా 21 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు, స్థానికుల ఆందోళన -
60 ఏళ్ల ప్రాక్టీస్
వైద్య ఉమాశంకర్ ఊరిలో తొలి న్యాయవాది. 1965 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మక్తల్ తహసీల్దార్గా వ్యవహరించిన తండ్రి వీరప్ప తన ఆరేళ్ల వయసులో కన్నుమూశారు. ఆ వారసత్వాన్ని కొనసాగించేందుకు, పురిటిగడ్డను వీడకుండా న్యాయవాద వృత్తిని ఎంచుకుని సివిల్ కేసుల్లో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. నిరంతర శ్రమతో సామాన్యులకు న్యాయం చేయాలన్న సదుద్దేశంతో సాధన చేస్తే మంచి అడ్వకేట్గా మారొచ్చు అనేది ఈ తరానికి ఆయన ఇచ్చే సందేశం. – వైద్య ఉమాశంకర్ ఉద్యమస్ఫూర్తితో.. 1988లో న్యాయవాదిగా నమోదై.. ఆరేళ్లు ప్రాక్టీస్ చేశారు. 1994 మేలో పీపీగా, జ్యుడీషియల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. నంద్యాలలో తొలి పోస్టింగ్. రాష్ట్రం విడిపోకముందే తెలంగాణ న్యాయమూర్తుల సంఘాన్ని స్థాపించి తొలి ప్రధాన కార్యదర్శిగా ఉద్యమాలకు నేతృత్వం వహించారు. పదేళ్లపాటు హైకోర్టు ఉమ్మడిగా ఉండాలన్న నిర్ణయంపై.. న్యాయవ్యవస్థ కూడా వేరుపడాలని 2015లో సుప్రీంకోర్టులో రిట్వేశాం. 2016లో 250 మంది న్యాయమూర్తులు కలిసి మహాధర్నా నిర్వహించారు. దీంతో సస్పెన్షన్కు గురయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు, అప్పటి గవర్నర్ చొరవతో నెల రోజుల తరువాత సస్పెన్షన్ ఎత్తేశారు. తీవ్రమైన న్యాయ సంక్షోభాన్ని సృష్టించడంతో రెండు నెలల్లో న్యాయవ్యవస్థను విభజించాలంటూ 2018 అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 2019లో అమలులోకి వచ్చింది. 2024 జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. – వైద్య వరప్రసాద్, విశ్రాంత న్యాయమూర్తి -
చోరీల నియంత్రణకు చర్యలు
గోదావరిఖని: సింగరేణి ఆస్తుల పరిరక్షణ, చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాలరాజు సూచించారు. బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఆ యన గురువారం ఆర్జీ–2 ఏరియాలో పర్యటించారు. జీఎం వెంకటయ్య ఆయనను ఘనంగా స న్మానించారు. అనంతరం ఏరియాలో పర్యటించి భ ద్రతపై ఆరా తీశారు. సెక్యూరిటీ అధికారులతో సమావేశమయ్యారు. భద్రతా సిబ్బంది పనితీరు, విధుల నిర్వహణలో ఎదురవుతున్న ఆటంకాలు, అవసరమైన సౌకర్యాలు తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రతా సిబ్బంది విధుల్లో అప్రమత్తత, క్రమశిక్షణ, అత్యంత కీలకమని, సంస్థ ఆస్తుల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. ఎస్వోటూ జీఎం రాముడు, పర్సనల్ డీజీఎం అరవిందరావు, ఐఈడీ డీజీఎం చంద్రశేఖర్, సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్ మహమ్మద్ తదితరులు ఉన్నారు. ఓసీపీల జీఎంకు సన్మానం రామగుండం డివిజన్–2 పరిధిలోని ఓసీపీ–3ని కార్పొరేట్ ఓసీపీల జీఎం ఎలీషా సందర్శించారు. యంత్రాలను తనిఖీ చేసి పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో జీఎం వెంకటయ్య ఎలీషాను శాలువాతో ఘనంగా సన్మానించారు. సింగరేణి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ బాలరాజు ఆర్జీ–2 ఏరియాలో విస్తృత పర్యటన -
సింగరేణి ‘పొదుపు మంత్రం’
ఏరియాల వారీగా కేటాయించిన బడ్జెట్(రూ.లక్షల్లో) గోదావరిఖని: సింగరేణి బొగ్గు గనుల సంస్థ ఆవిర్భావ వేడుకలను సాదాసీదాగా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఎంతోహంగూ ఆర్భాటాలతో ఉత్సవాలు నిర్వహించగా.. ఈసారి జీఎం కార్యాలయాలకే పరిమితం చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఒక్కో ఏరియాకు గతంలో కేటాయించిన బడ్జెట్లో 70శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.3.38లక్షల నుంచి రూ.60వేలకు.. ఆర్జీ–1 ఏరియాకు గతంలో రూ.3.38లక్షలు కేటాయించగా తాజాగా రూ.60వేలు కేటాయిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొనసాగిన సీఎండీ ఎన్.బలరాం స్థానంలో కొత్త సీఎండీగా ఐఏఎస్ అధికారి దేవరరకొండ కృష్ణభాస్కర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో సింగరేణి ఆర్థిక వనరులను పొదుపుగా వినియోగించుకోవాలనే ఆలోచనతో ఈనిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజా సర్క్యులర్ ప్రకారం సింగరేణి మొత్తమ్మీద 15ప్రాంతాలకు రూ.8లక్షలు మాత్రమే కేటాయిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేయడం గమనార్హం. గతంలో ఒక్కో ఏరియాకు రూ. 3.50లక్షల వరకు కేటాయించే పద్దతి కొనసాగిది. ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినా.. వాస్తవానికి సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించి గతనెల 29న ఏరియాల వారీగా బడ్జెట్ కేటాయిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం.. సింగరేణిలోని అన్ని ఏరియాల్లో ఆటలు, వెల్బేబీ షో, ఉత్తమ గృహాలు, దీపాలంకరణ తదితర పోటీలను ఏరియాల వారీగా నిర్వహించారు. ఇంకాకొన్ని పోటీలు నిర్వహించాల్సి ఉంది. ఈలోగా తాజా జీవోతో ఉత్కంఠ నెలకొంది. తలలు పట్టుకుంటున్న అధికారులు.. పాత ఉత్తర్వుల ప్రకారం.. ఏరియాల వారీగా ఇప్పటికే వివిధ పోటీలు నిర్వహించారు. ఇందులో వెల్బేబీ షో, ఉత్తమ గృహాలంకరణ, ఎన్విరాన్మెంట్ క్వార్టర్లు, బెస్ట్సేవా సభ్యులు తదితర పోటీల్లో విజేతలను కూడా ఎంపిక చేశారు. గత బడ్జెట్ పూర్తిగా తగ్గించడంతో ఇప్పటివరకు నిర్వహించిన పోటీలకు బడ్జెట్ ఎలా సరిపెట్టాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. నిధుల్లో కోత విధించడంతో వేడుకలపై ప్రభావం ఉంటుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సంబంధం లేని ఆటలకు రూ.10కోట్లు? సింగరేణికి సంబంధం లేని ఆటలకు సింగరేణి యాజమాన్యం రూ.10కోట్లు కేటాయించిందని, సింగరేణి ఆవిర్భావ వేడుకల కేటాయించే నిధుల్లో భారీగా కోత పెట్టిందని కార్మిక సంఘాలు తప్పు పడుతున్నాయి. గతంలో మాదిరిగానే సింగరేణి డే ఘనంగా నిర్వహించాలని గుర్తింపు యూనియన్ నాయకులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఏరియా గతం ప్రస్తుతం కార్పొరేట్ – 1.00 కొత్తగూడెం 3.38 0.60 ఇల్లెందు 2.25 0.50 మణుగూరు 3.38 0.60 భూపాలపల్లి 3.38 060 ఆర్జీ–1 3.38 0.60 ఆర్జీ–2 2.82 0.55 ఆర్జీ–3, ఏఎల్పీ 2.82 0.55 బెల్లంపల్లి 2.25 0.50 మందమర్రి 3.38 0.60 శ్రీరాంపూర్ 3.38 0.60 హైదరాబాద్ 0.56 0.20 సత్తుపల్లి – 0.50 నైనీ – 0.35 ఎస్టీపీపీ 0.67 0.25 మొత్తం 31.65 8.00 సాదాసీదాగానే సింగరేణి ఆవిర్భావ వేడుకలు జీఎం కార్యాలయ ఆవరణల్లోనే ఉత్సవాల నిర్వహణకు ఆదేశాలు బడ్జెట్ కేటాయింపులు తగ్గించిన యాజమాన్యం -
ఇసుక దందా కోసమే చెక్డ్యాంల పేల్చివేత
మంథనిరూరల్: కాంగ్రెస్ నాయకులు ఇసుక దందా కోసమే మానేరులోని చెక్డ్యాం పేల్చివేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. బుధవారం కొట్టుకుపోయిన అడవిసోమన్పల్లి మానేరు చెక్డ్యాంను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ చెక్డ్యాం కట్టొద్దని మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు ప్రెస్మీట్లలో చెప్పారని గుర్తుచేశారు. ఈక్రమంలో.. చెక్డ్యాం ఉంటే ఇసుక తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని భావించి కాంగ్రెస్ నాయకులు పేల్చివేసినట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కూడా తట్టుకుని నిలబడిన చెక్డ్యాం.. లక్ష్య క్యూసెక్కుల నీటి నిల్వకు ఎలా కొట్టుకుపోతుందో కాంగ్రెస్ నాయకులే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంథని ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపి దోషులను శిక్షించాలని, చెక్డ్యాం పునర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు ఏగోళపు శంకర్గౌడ్, తగరం శంకర్లాల్, కనవేన శ్రీనివాస్, మాచిడి రాజుగౌడ్, సంపత్, నాగరాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో పరిశీలిస్తా.. మాజీ మంత్రి హరీశ్రావు అడవిసోమన్పల్లి చెక్డ్యాంను త్వరలో పరిశీలిస్తా నని మాజీమంత్రి హరీశ్రావు తెలిపారు. చెక్డ్యాం క్షేత్రస్థాయి పరిస్థితిని మధూకర్ వీడియో కాల్ ద్వారా ఆయనకు సూపించడంతో స్పందించారు. బీఆర్ఎస్ను అభాసుపాలు చేసేందుకు కుట్ర మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్


