ప్రాణం తీసిన భూపంచాయితీ
● కనగర్తిలో ఒకరు మృతి
ఓదెల(పెద్దపల్లి): భూ పంచా యితీ ఓ రైతు ప్రాణం తీసింది. ఈఘటన పెద్దపల్లి జిల్లా ఓ దె ల మండలం కనగర్తి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కనగర్తి గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య)ను ఇదే గ్రామా నికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పొ లం వద్ద పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో తన్ని బురద లో తొక్కి చంపేశాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్, మృతుడి కూతురు వొడ్నాల లావణ్య కథనం ప్రకారం.. కనగర్తిలో ఒంటరిగా ఉంటున్న రాజయ్య వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాడు. ఇదే గ్రా మానికి చెందిన ఆది రాజయ్య భూమి ఆయన పొ లాన్ని ఆనుకొని ఉంది. ఇద్దరి భూముల మధ్య గె ట్టు(ఒడ్డు) విషయంలో పలుమార్లు గొడవలు, కు లపెద్ద మనుషుల సమక్షంలోనూ పంచాయితీలు జరిగాయి. సోమవారం ఉదయం ఆది రాజయ్య (సన్నాఫ్ మల్లయ్య) కూలీలతో పొలంలో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో ఒడ్డు వద్దగల హద్దు రాయిని రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పీకేశాడు. ఎందుకు పీకేశావని ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్ల య్య) అడిగాడు. దీంతో ఆదిరాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) చేతులతో పిడిగుద్దులు గుద్దాడు. కాళ్లతో తన్ని బురదలో తొక్కాడు. దీంతో బురదలో బొర్లపడి ముక్కు మూసుకుపోయి ఊపిరి ఆడక ఆది రా జయ్య(సన్నాఫ్ మల్లయ్య) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కూతురు వొడ్నాల లావణ్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశామని పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ, ఎస్సైలు రమేశ్, చంద్రకుమార్ పరిశీలించారు. పాత గొడవలను దృష్టి లో పెట్టుకుని తన తండ్రిని చంపేశారని మృతుడి కుతుళ్లు విలపించారు. వరినాట్ల సమయంలో రైతు మృతి చెందడంతో విషాదం అలముకుంది.


