కబడ్డీ చాంపియన్లు సూర్యాపేట, హైదరాబాద్–2
మహిళల రన్నర్గా రంగారెడ్డి జిల్లా జట్టు
మహిళల చాంపియన్షిప్ కై వసం చేసుకున్న హైదరాబాద్–2 జట్టు
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో 4 రోజలపాటు జరిగిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో సూర్యాపేట జిల్లా జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకోగా.. మహిళల విభాగంలో హైదరాబాద్–2 జట్టు విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో రన్నర్గా జోగులాంబ గద్వాల్ జట్టు, తృతీయ స్థానాల్లో నిజామాబాద్, నాగర్ కర్నూల్ నిలిచాయి. మహిళల విభాగంలో రన్నర్గా రంగారెడ్డి జిల్లా జట్టు, తృతీయ స్థానాల్లో వరంగల్, ఖమ్మం జట్లు నిలిచాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు రెండు ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు ఇచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పోటీలతో కబ్డడీకి మరింత క్రేజ్ వచ్చిందన్నారు. మహిళల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు హైదరాబాద్లోని పటాన్చెరులో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగుతాయని రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్రెడ్డి తెలిపారు, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్ సంపత్రావు, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, జిల్లా కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అమిత్కుమార్, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు.
రన్నర్గా నిలిచిన జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి జిల్లాలు
ముగిసిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీలు
ట్రోఫీలు ప్రదానం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
కబడ్డీ చాంపియన్లు సూర్యాపేట, హైదరాబాద్–2


