కొనసాగుతున్న శిబిరం
పెద్దపల్లిరూరల్: స్థానిక శ్రీసరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో శనివారం మొదలైన త్రితీయ సోఫాన్ టెస్టింగ్ క్యాంపు ఈనెల 29వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా కార్యదర్శి జ్యోతి తెలిపారు. ఆదివారం నాటి కార్యక్రమంలో గాయత్రీ విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ స్కౌట్ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని పలు విద్యాసంస్థలకు చెందిన 76 మంది గైడ్స్, 11 మంది గైడ్ కెప్టెన్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధానాచార్యులు శ్రీధర్ రాజు, రఘు సింగ్ తదితరులు పాల్గొన్నారు.


