Khammam
-
రెజొనెన్స్ విద్యార్థికి ఆల్ ఇండియా 2వ ర్యాంక్
బీఆర్క్ అండ్ బీప్లానింగ్లో తమ విద్యార్థులు ఆలిండియాస్థాయి ర్యాంక్లతో ప్రభంజనం సృష్టించారని రెజొనెన్స్ కళాశాల డైరెక్టర్లు ఆర్వీ నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్రావు తెలిపారు. పలువురు వివిధ కేటగిరీల్లో జాతీయస్థాయి ర్యాంక్లు సాధించగా.. కార్తికేయ ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడని వెల్లడించారు. అలాగే, భవగ్న్య 829, బి.రాకేశ్ 997, దివ్యతేజ 1,163, ధృవ 1,173, మణికుమార్ 1,400, వేదాంశ్ 1,500, శివాణి 1,740, ధాన్యదీప్ 2,170, భగవతి 2,586, నిహారిక 3,080, వీరవెంకటకృష్ణప్రసాద్నాయక్ 3,261, డి.గణేశ్ 3,496, ప్రవళిక 3,663, సాయి సుమన 3,690వ ర్యాంక్లు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సతీశ్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
జేఏసీ పోరుబాటలో భాగస్వాములు కావాలి
మధిర/బోనకల్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాల్లో ఉపాధ్యాయులంతా భాగస్వాములు కావాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు సూచించారు. మధిరలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని పరిశీలించడంతో పాటు బోనకల్ మండలం రావినూతల పాఠశాలలో శుక్రవారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కుల కోసం పోరాడుతూనే బడిబాటలో భాగంగా విద్యార్థుల సమోదు పెంచడానికి ఉపాధాయులు కృషి చేయాలని తెలిపారు. కాగా, పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల సాధన కోసం యూనియన్ తరఫున కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే, విద్యారంగ సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచేలా ఉండొద్దనేది తమ విధానమని తెలిపారు. కార్యక్రమాల్లో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు, జిల్లా మాజీ అధ్యక్షుడు మోత్కూరి మధుతో పాటు ఆర్.బ్రహ్మారెడ్డి, తుమాటి కృష్ణారెడ్డి, రత్నకుమార్, చంద్రశేఖర్, సీహెచ్వీ రవికుమార్, శ్రీనివాసరావు, మల్లెల శ్రీనివాస్, శ్యామలరావు, స్వామి, మద్దినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణవేణి విద్యార్థులకు ర్యాంక్లు
బీఆర్క్ అండ్ ప్లానింగ్ ఫలితాల్లో తమ విద్యార్థు లు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపూడి జగదీశ్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. పి.మణిచంద్రసాయి 95వ ర్యాంక్, టి.తరుణ్ 242, ఎస్కే సమద్ 369, ఎల్.అభిజిత్ 676, డి.నిఖిల్ 681, టి.దినేశ్ 830, జి.దివ్య 833 సాధించారని వెల్లడించారు. అంతేకాక ఎస్.దినేశ్ 1,027, బి.చక్రవర్తి 1,059, ఆర్.గుప్తాశ్రీ 1,137, జె.జశ్వంత్ 1,202, జి.వినీత 1,266, డి.మహేశ్వర్ 1,308, కె.అభిషేక్ 1,420, బి.రాహుల్ 1,521, బి.రోహిత్గనీ 1,884, టి.గణేశ్ 2,189, టి.డిన్నీ 2,190, వి.సాత్విక 2,230, డి.రాజేశ్వరి 2,410, ఎన్.నేహిత 2,583, పి.యశస్వి 2,664, డి.సింధు 3,081, జి.సాహిత్ 3,259, కె.మహేశ్బాబు 3,301, కె.మౌనిక 3396, ఇ.శ్రీ సిరి 3,406, పి.తేజకుమార్ 3,530, కె.వెంకటసాయి నిఖిలేశ్ 3,542, డి.గీతశ్రీ 4,617,ఎం.వైష్ణవిరెడ్డి 4,847, ఎస్కే నౌరీస్ 4,925 వ ర్యాంక్ సాధించారన్నారు. కార్య క్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్రయ్య, అకడమిక్ డీన్ ఏలూరివంశీకృష్ణ, ఏఓనిరంజన్కుమార్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
తల్లాడ: మండలంలోని మల్లవరంలో శుక్రవారం విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంభగిరి బలరాం (45) దళితకాలనీ సమీపాన ఉన్న చికెన్ షాపు వెనకాల మూత్ర విసర్జనకు వెళ్లాడు. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ వైర్ను తాకిన ఆయన షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడ ఎవరూ లేక పోవడంతో విషయం బయటకు రాలేదు. మధ్యాహ్నం తర్వాత ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కాగా, బలరామ్కు భార్య సుశీల, ఇద్దరు పిల్లలు ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారు ఆభరణాల చోరీ తిరుమలాయపాలెం: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి పట్టపగలే బంగారు, వెండి వస్తువులు చోరీ చేసిన ఘటనపై శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన పగిళ్ల రామకృష్ణ తన భార్యతో కలిసి ఈ నెల 20న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో బీరువా తెరిచి ఉండడంతో వెతికి చూడగా అందులోని సుమారు రూ.85 వేల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో బాధితుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మల్లారంలో.. ముదిగొండ: మండలంలోని మల్లారంలో జరిగిన చోరీపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు... మల్లారం గ్రామానికి చెందిన బొగ్గారపు హనుమంతరావు గురువారం రాత్రి భోజనం అనంతరం ఆరు బయట పడుకోగా, ఆయన భార్య సుజాత దవరండాలో నిద్రించింది. అర్ధరాత్రి గాలివాన వస్తుండడంతో ఇరువురు ఇంట్లోకి వెళ్లగా ఇంటి మధ్య గది తలుపులు తెరిచి ఉండడమే కాక బీరువాలో భద్రపరిచిన బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. సుజాత తలదిండు కింద పెట్టిన తాళాలను గుర్తించిన దుండగులు వాటి సాయంతో బీరువా తెరిచి ఆభరణాలు దొంగిలించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ముదిగొండ సీఐ ఓ.మురళి తెలిపారు. గ్యాస్ లీకేజీతో మంటలు ఖమ్మంఅర్బన్: ఖమ్మం రోటరీనగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం గ్యాస్ లీకేజీతో మంటలు చెలరేగాయి. ఇంట్లో నివాసముంటున్న వారు వంట చేసే క్రమాన స్టవ్ వెలిగించగా అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉండడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమతమైన వారు సిలిండర్ను బయటకు తీసుకొచ్చి నీళ్లు చల్లినా మంటలు అదుపులోకి రాలేదు. ఈక్రమాన ఏం జరుగుతోందనని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, అప్పటికే అందిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. -
వల పన్ని.. పట్టుకున్నారు!
● స్టేషన్లో ఎఫ్ఓబీ పైనుంచి దూకేందుకు ఛత్తీస్గఢ్ యువకుడి యత్నం ● కింద వల అమర్చి కాపాడిన పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఖమ్మంక్రైం: ఛత్తీస్గఢ్కు చెందిన ఓ యువకుడు మద్యం మత్తులో ఖమ్మం రైల్వేస్టేషన్లో శుక్రవారం హల్చల్ చేశాడు. ఫుట్ఓవర్ బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నించడం కలకలం రేపింది. ఈ ఘటనతో సుమారు గంటపాటు గందరగోళం నెలకొనగా, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చివరకు ఆర్పీఎఫ్, జీఆర్పీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది చొరవతో కింద వలలు ఏర్పాటుచేసి.. ఆ యువకుడిని తోసేయడంతో వలపై పడగా అంతా ఊపిరిపీల్చుకున్నారు. మద్యం మత్తు.. కుటుంబ కలహాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడు లలిత్ బరిహ ఖమ్మం సమీపాన గ్రానైట్ ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాలతో మద్యం సేవించిన ఆయన ఆత్మహత్య చేసుకుంటానంటూ శుక్రవారం రైల్వేస్టేషన్కు వచ్చాడు. రెండో నంబర్ ప్లాట్పాం మీదుగా ఫుట్ఓవర్ బిడ్జిపైకి ఎక్కి దూకడానికి యత్నించాడు. బ్రిడ్జి కింద హైపర్ టెన్షన్ విద్యుత్ వైరు ఉండడం, అదే సమయానికి సికింద్రాబాద్కు వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ రానుండడంతో వేచి ఉన్న ప్రయాణికులు లలిత్ను గమనించి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ సురేశ్గౌడ్ ఆధ్వర్యాన సిబ్బంది చేరుకుని ఎంత నచ్చజెప్పినా వినకపోగా, పైకి ఎవరైనా వస్తే దూకుతానని బెదిరించాడు. ఆపై ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి, బ్రిడ్జిపైకి ప్రయాణికులు వెళ్లకుండా ఆపివేశారు. ఇంతలో కోణార్క్ ఎక్స్ప్రెస్ వస్తుడడంతో ఖమ్మం ఔటర్లోనే నిలిపివేశారు. ఆ తర్వాత అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని బ్రిడ్జి కింద వలలతో సిద్ధమయ్యారు. ఇదంతా సుమారు గంట దాటడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది ఒకరు పైకి వెళ్లి లలిత్ తీగలపై పడకుండా వలలో పడేలా కిందకు తోశాడు. దీంతో ఆయన నేరుగా వలలో సురక్షితంగా పడటంతో ఆర్పీఎఫ్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ అనంతరం కుటుంబీకులకు సమాచారం అందించారు. కాగా, లలిత్ తీరుతో రైళ్లు నిలిచిపోవటంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కాగా, ఆయన ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఫైర్ సిబ్బందిని పలువురు అభినందించారు. -
వేతనాలు వచ్చేదెప్పుడో..?
● కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఎదురుచూపులు ● నాలుగు నెలలుగా జీతం అందక ఇక్కట్లు ● సర్వీస్ పునరుద్ధరణపైనా నీలినీడలు ఖమ్మంసహకారనగర్: 2008లో వారంతా డీఎస్సీ అర్హత సాధించారు. రకరకాల కారణాలతో పోస్టింగ్ ఇవ్వడం ఆలస్యం జరగగా, సుమారు 16 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కానీ, కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియామకాలు చేపట్టారు. అయినా సరే, ప్రభుత్వం నుంచి అందే వేతనాలు కావడంతో జీవనానికి భరోసా ఉంటుందని భావించారు. దీంతో అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాలు మాని ఉపాధ్యాయులుగా చేరారు. కానీ, ఒకటి కాదు రెండు కాదు.. నాలుగు నెలలైనా వచ్చే అరకొర వేతనం కూడా చెల్లించకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అన్నింటికీ సర్దుకుపోతున్నా తమకు అందాల్సిన వేతనాల్లో జాప్యం చేయడంపై కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. 34 మంది జిల్లాలో 2008 డీఎస్సీ అభ్యర్థులు 34 మందిని ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన విధుల్లోకి తీసుకున్నారు. వీరిని జిల్లాలోని వివిధ పాఠశాలలకు కేటాయించగా పాఠాలు బోధిస్తున్నారు. నాలుగు నెలల పాటు ఉంటున్న ప్రాంతం నుంచి పాఠశాలలకు వెళ్లి వచ్చినా నెలనెలా వేతనాలు మాత్రం రావడం లేదు. ఇదంతా పక్కన పెడితే విద్యాసంవత్సరం చివరిలో ఆయా ఉపాధ్యాయులను టెర్మినేట్ చేసిన విద్యాశాఖ.. వేతనాల జారీలో మాత్రం జాప్యం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అయితే, వేతనాల విషయమై స్పష్టత ఇవ్వలేకపోతున్నప్పటికీ.. మళ్లీ పాఠశాలలు తెరవగానే వారిని విధుల్లోకి తీసుకునే అవకాశముందని చెబుతుండడంతో కొంత మేర ఊరట కలిగిస్తోంది. -
కొండరెడ్లకు గృహ నిర్మాణాలు
సూపర్బజార్(కొత్తగూడెం): అటవీప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్ల గిరిజన కుటుంబాలకు పీఎం జన్ధన్ పథకం కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎంపీడీఓలు ప్రతిపాదనలు అందజేయాలని భద్రా చలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లో శుక్రవారం దమ్మపేట, అశ్వారావుపేట మండలాల ఎంపీడీఓలు, కొండరెడ్ల గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అశ్వారావుపేట మండలంలోని ఏడు హ్యాబిటేషన్లు, దమ్మపేట మండలంలోని పూసుకుంటలోని కొండరెడ్ల గిరిజన కుటుంబాల ఇంటింటికీ తిరిగి మొబైల్యాప్ ద్వారా శనివా రం నుంచి సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలి
తల్లాడ: వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కచ్చితంగా పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖా ధికారి సామినేని సత్యనారాయణ సూచించారు. తల్లాడలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణను శుక్రవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్య, యూనిఫాం, మధ్యాహ భోజనం అమలవుతుండడమే కాక సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్న విషయాన్ని వివరిస్తూ విద్యార్థులను చేర్పించాలని తెలిపారు. ఎంఈఓ ఎన్.దామోదరప్రసాద్, ఎంఎన్ఓ పి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఏన్కూరులో.. ఏన్కూరు: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలబాలికల కోసం పాఠశాలలు తెరిచేనాటికి యూనిఫాం సిద్ధం చేయాలని డీఈఓ సామినేని సత్యనారాయణ సూచించారు. ఏన్కూరులో యూనిఫాం కుడుతున్న కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. అనంతరం ఏన్కూరు హరిజనవాడ, గంగులనాచారం, ఎస్టీ కాలనీ, నాచారం ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలకు యూనిఫాంలు అందజేశారు. ఎంఈఓ రహీమ్, కాంప్లెక్స్ హెచ్ఎం సైదయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే..
బోనకల్/నేలకొండపల్లి: పశువుల అక్రమ రవాణాను నియంత్రించేలా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని అడిషనల్ డీసీపీ ప్రసాదరావు ఆదేశించారు. బోనకల్ మండలం పాలడుగుతో పాటు జిల్లాలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన చెక్పోస్ట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ చెక్పోస్ట్ల వాహనాలను తనిఖీ చేస్తూ అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా, లేదా అని పరిశీలించాలని, అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలితే వాహనాలను సీజ్ చేయాలని తెలిపారు. అలాగే, నేలకొండపల్లి పోలీసుస్టేషన్కు వచ్చిన అదనపు డీసీపీ ప్రసాదరావు రికార్డులను పరిశీలించాక శాంతిభద్రతల పరిరక్షణ, కేసుల విచారణపై ఉద్యోగులకు సూచనలు చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా వేయాలని ఆదేశించారు. శారీరక శిక్షణ, ఆయుధ విజ్ఞానం వైరా: వైరాలోని న్యూలిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో ఏర్పాటుచేసిన 11(బీ) బెటాలియన్ ఎన్సీసీ వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతోంది. ఈ శిబిరాన్ని వీరచక్ర అవార్డు గ్రహీత, వీఆర్సీ గ్రూప్ కమాండర్ కల్నల్ సచిన్ అన్నారావు సెంబాల్కర్ శుక్రవారం సందర్శించారు. కల్నల్ ఎస్కే.భద్ర, కల్నల్ నవీన్యాదవ్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న శిబిరంలో భాగంగా కేడెట్లకు శారీరక శిక్షణ, ఆయుధాల పనితీరుపై అవగాహన కల్పిస్తూనే నాయకత్వ లక్షణాలపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రూప్ కమాండర్ మాట్లాడుతూ ఎన్సీసీ శిక్షణతో సంఘ జీవనం, ప్రభుత్వ కార్యకలాపాలపై అవగాహన పెరగడమే కాక దేశభక్తి పెరుగుతుందని తెలిపారు. పాఠశాల కరస్పాడెంట్ పి.భూమేఽష్రావు, డైరెక్టర్ కుర్రా సుమన్, అపురూపాదేవి తదితరులు పాల్గొన్నారు. కోచ్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై ఏడాది కాలానికి కోచ్లను నియమించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కిన్నెరసానిలో మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో ఆర్చరీ కోచ్, కాచనపల్లిలోని మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో కబడ్డీ కోచ్ ఎంపికకు ఎన్ఎస్, ఎన్ఐఎస్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్ములని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ధ్రువపత్రాలతో ఈనెల 26నుంచి జూన్ 3వ తేదీ వరకు ఐటీడీఏలోని స్పోర్ట్స్ ఆఫీసర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా కానీ dtdo.bhadradri@gmail.com మెయిల్ ద్వారా కానీ దరఖాస్తులు పంపించాలని సూచించారు. వివరాలకు 98489 88205, 99123 62053 నంబర్లకు సంప్రదించాలని పీఓ తెలిపారు. -
అంతులేని చెత్త సమస్య
వైరా: వైరా మున్సిపాలిటీ ఏర్పడి ఏడేళ్లు అవుతోంది. అయినా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. కొన్నాళ్ల క్రితం వరకు రహదారులు, సైడ్ డ్రెయిన్లు సరిగ్గా లేక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కోగా అందుకు నిధులు విడుదల కావడంతో కొంత మేర ఇక్కట్లు తీరాయి. ఇక చెత్త సేకరణ, డంపింగ్ యార్డుల ఏర్పాటు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. దీంతో ఇంటింటా వెలువడే చెత్త సేకరిస్తున్నా డంపింగ్కు సరైన ప్రదేశాలు గుర్తించక, గుర్తించినా వాహనాలు వెళ్లే మార్గం లేక సమస్య ఎటూ తేలడం లేదు. అయితే, ఇది కేవలం వైరాలో మాత్రమే కాదు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలనూ వేధిస్తోంది. కలెక్టర్లే పరిశీలించినా... వైరాలో 20 వార్డులకు గాను సుమారు 40వేల జనాభా ఉండగా, ప్రతీరోజు 8 – 10 టన్నుల చెత్త విడుదలవుతోంది. ఈ చెత్త సేకరణకు ఎనిమిది ఆటో రిక్షాలు, ఎనిమిది ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. కానీ సేకరించిన చెత్తను ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగేళ్లలో ఇద్దరు, ముగ్గురు కలెక్టర్లు ఈ సమస్యపై దృష్టి సారించినా, ఏడాదిన్నర క్రితం స్థలం కేటాయించినా ఉపయోగం లేకపోయింది. సదరు స్థలానికి చెత్త తీసుకెళ్లేలా సరైన మార్గం లేకున్నా, ఇది పట్టణానికి ఐదు కి.మీ. దూరంలో ఉన్నా అష్టకష్టాలకోర్చి చెత్త తరలిస్తుండడంతో డీజిల్ ఖర్చులు పెరిగాయి. వర్షాకాలం వస్తే ఇక్కట్లే రెండేళ్లుగా వైరా సమీపంలోని స్టేజీ పినపాక హైలెవల్ వంతెన కింద చెత్త వేస్తూ నిప్పుపెడుతున్నారు. దీంతో ప్రయాణికులు, స్థానికులకు అసౌకర్యంగా మారింది. ఈమేరకు ఏడాదిన్నర క్రితం రిజర్వాయర్ అలుగుల సమీపాన తల్లాడ మండలం కొడవటిమెట్ట రెవెన్యూలో మూడెకరాల స్థలాన్ని డంపింగ్ యార్డుకు కేటాయించారు. కానీ ఇక్కడకు చెత్త తరలించాలంటే క్రాస్ రోడ్డు నుండి రిజర్వాయర్ ఆనకట్ట కింది భాగం మీదుగా వెళ్లాలి. ఈ మార్గంలో మూడు అలుగు వాగులు ఉండడంతో వర్షాకాలంలో రిజర్వాయర్ నీటిమట్టం 18.4 అడుగులు చేరిందంటే వరద ప్రవహిస్తుంది. ఫలితంగా రెండు నెలలు ప్రత్యామ్నాయం వెతకాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాగా, రహదారి మెరుగుపరిచేలా పలు ప్రతిపాదనలు రూపొందించారు. మూడు వాగులపై కల్వ ర్టులు లేదా బ్రిడ్జి నిర్మించడంతో పాటు మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ.1.7 కోట్లు, అవసరమైన చోట సీసీ రోడ్డు వేస్తూ చప్టాలు నిర్మించాలంటే రూ.2 కోట్లు, కల్వర్టులతో పాటు బీటి రోడ్డు వేయాలంటే రూ.2.5 కోట్లకు పైగా అవసరమని ప్రతిపాదించారు. దీనికి అనుమతులు వచ్చినా వానాకాలంలో చెత్త తరలించాలంటే ప్రహసనంగానే మారనుంది. మరోచోట 2–3 ఎకరాల స్థలం కొనాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కాక రిజర్వాయర్ను ఆనుకుని ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకుంటే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నందున అధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలని పలువురు కోరుతున్నారు.జిల్లాలోని మున్సిపాలిటీల వివరాలు మున్సిపాలిటీ వార్డులు జనాభా రోజువారీ వాహనాలు చెత్త (టన్నుల్లో) వైరా 20 40,000 10 16సత్తుపల్లి 23 38,000 11 15మధిర 22 35,000 20 17ఏదులాపురం 32 60,000 10 20సమస్యను అధిగమిస్తాం.. వైరాలో డంప్ యార్డుకు గుర్తించిన స్థలం పట్టణానికి దూరంగా ఉంది. అక్కడే చెత్త డంప్ చేస్తుండగా, సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టర్ ఆదేశాలతో తుది నిర్ణయం ఉంటుంది. ఈ మార్గంలో కల్వర్టుల నిర్మాణానికి అంచనాలు రూపొంచినందున త్వరలోనే సమస్యను అధిగమిస్తాం. – చింతల వేణు, మున్సిపల్ కమిషనర్, వైరావైరా మున్సిపాలిటీలో డంప్ యార్డు ఇక్కట్లు మిగతా మూడుచోట్ల సేకరణ, తరలింపులో నిర్లక్ష్యం వర్షాకాలం వస్తే మరింత ఇబ్బందులు -
ఎల్ఆర్ఎస్కు తిప్పలెన్నో..
● అధికారుల చుట్టూ ప్లాట్లదారుల ప్రదక్షిణలు ● నిషేధిత స్థలం కాకున్నా జాబితాల్లోకి.. ● యజ్ఞంలా మారిన పరిశీలన, అనుమతులుఖమ్మం అర్బన్: స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం)ను ప్రవేశపెట్టగా దరఖాస్తులదారుల వెసులుబాటు కోసం ఇటీవల ఫీజులో 25శాతం రాయితీ ప్రకటించింది. దీంతో తమ స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చని, తద్వారా నిర్మాణానికి ఇక్కట్లు తీరతాయని భావించిన దరఖాస్తుదారులకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. గతంలో రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారిని ప్రస్తుతం నిర్దేశిత ఫీజులో 25 శాతం రాయితీకి అర్హులుగా ప్రకటించారు. కానీ ప్రభుత్వం రూపొందించిన యాప్లో సాంకేతిక సమస్యలో లేక ఇతర కారణాలో తెలియదు కానీ యజమానులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫీజు చెల్లింపునకు అనుమతి జారీ కావడం లేదు. దశల వారీగా... ఎల్–1 దరఖాస్తులకు సంబంధించి కార్పొరేషన్ లేదా గ్రామపంచాయతీ అధికారులతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంతా సవ్యంగా ఉంటే యాప్లో అప్ లోడ్ చేసి అనుమతి ఇస్తున్నారు. కానీ నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మూడు శాఖల అధికారులకు ఒకేసారి సమయం లభించి క్షేత్రస్థాయికి వస్తేనే ప్లాట్ ప్రభుత్వ భూమిలో ఉందా, ఎఫ్టీఎఫ్ పరిధిలో ఉందా అనేది నిర్ధారించే అవకాశముంటుంది. ఇందుకోసం దరఖాస్తుదారులు అధికా రుల చుట్టూ తిరిగి యాప్లో నమోదు చేయించుకున్నా... తిరిగి మరోమారు అనుమతి కోసం క్షేత్రస్థాయికి రావాల్సి ఉండడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదంతా పూర్తయ్యాక ఎల్–2(టౌన్ ప్లానింగ్), ఎల్–3(ముఖ్య అధికారి జారీ చేసే పత్రం) దశల్లోనూ విపరీతమైన జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ఇదంతా భరించలేక కొందరు తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అధికారులను నిలదీస్తున్నట్లు సమాచారం. ఇదే అదనుగా కొందరు అంత దూరం రావాలంటే ఖర్చులు అవుతాయని డబ్బు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రెండేసి సార్లు కొన్ని ప్లాట్లకు సమీపాన ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూములు లేదా వాగులు, వర్రెలు ఉంటే ఈ భూమిని కూడా నిషేధిత(ప్రొహిబిటెడ్) జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చడం ఏమిటని ప్లాట్ల యజమానులు వాపోతున్నారు. ఇలాంటి ప్లాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాకే రాయితీతో ఫీజు చెల్లింపునకు అనుమతి ఇస్తుండడం గమనార్హం. అంతా పూర్తయి ఫీజు చెల్లించినా అనుమతి పత్రం కోసం మరోమారు ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుండడం గమనార్హం. మీ సేవ కేంద్రాలకు పరుగులు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలోనే యజమానులు అన్ని పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. కానీ ఇప్పుడు మరోమారు అప్లోడ్ చేయాలని ప్లాట్లదారులకు సమాచారం వస్తోంది. దీంతో నెట్ సెంటర్లు, మీ సేవ సేవా కేంద్రాలకు పరుగుల తీయక తప్పడం లేదు. ఇప్పటి కైనా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ ఫీజు చెల్లింపునకు అవకాశం ఇవ్వాలని, ఆ వెంటనే అనుమతులు జారీచేయాలని పలువురు కోరుతున్నారు. -
రండీ.. త్వరపడండి!
● టీఎంఆర్ఈఐఎస్ల్లో శరవేగంగా ప్రవేశాలు ● జిల్లాలో ఏడు పాఠశాలలు, ఒక కాలేజీ ● గత ఏడాది ఉత్తమ ఫలితాలు రావడంతో విద్యార్థుల ఆసక్తి ఖమ్మంమయూరిసెంటర్: మైనార్టీల కోసం ప్రత్యేకంగా స్థాపించిన రెసిడెన్షియల్ పాఠశాలల్లో తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) ద్వారా 2025–26 విద్యాసంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈనెల 31వ తేదీ వరకు ప్రవేశాలకు అవకాశముంది. అన్ని పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తుండగా, 6నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్లు మాత్రమే భర్తీ చేస్తారు. ఇక జూనియర్ కళాశాలలో ఇంటర్కు సంబంధించి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, సీట్ల వరకే దరఖాస్తులు వస్తే నేరుగా ప్రవేశాలు కల్పించనుండగా, అంతకు మించి దరఖాస్తులు అందితే మాత్రం డ్రా విధానాన్ని పాటించనున్నారు. మైనార్టీలకు ఉచిత విద్య టీఎంఆర్ఈఐఎస్ల ద్వారా వేలాది మంది మైనార్టీ పిల్లలకు ఉచిత విద్య, హాస్టల్ వసతితో పాటు ఆధునిక కంప్యూటర్ విద్య, క్రీడలు, నైపుణ్య శిక్షణ అందుతున్నాయి. గత విద్యాసంవత్సరం ఈ పాఠశాలల్లో ఎస్సెస్సీ విద్యార్థులు 95.37 శాతం, ఇంటర్ విద్యార్థులు 85.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇతర ప్రభుత్వ గురుకులాలతో సమానంగా ఫలితాలు సాధించడంతో పాటు పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా తీర్చుతుండడంతో నీట్, ఐఐటీ–జేఈఈ, ఒలింపియాడ్, క్రీడాపోటీల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. ప్రవేశాలకు ఆహ్వానం.. విద్య, సమానత్వం, సామాజిక న్యాయాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుంటూ మైనార్టీల కోసం టీఎంఆర్ఈఐఎస్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రఘునాథపాలెంలో ఖమ్మం గర్ల్స్–1(శారద ఇంజనీరింగ్ కళాశాల), ఖమ్మంలోని అల్లిపురం రోడ్డులో ఖమ్మం గర్ల్స్–2, కొణిజర్లలో ఖమ్మం బాయ్స్–1(పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజీ), సత్తుపల్లి గుడిపాడు రోడ్డులో సత్తుపల్లి బాయ్స్–1, జలగంనగర్లో నేలకొండపల్లి బాయ్స్–1, సింగరేణిలోని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని వైరా గర్ల్స్–1, మధిర మండలం జీలుగుమాడులోని మధిర బాయ్స్–1 పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇక ఖమ్మం రాపర్తినగర్లోని జూనియర్ కళాశాల(ఖమ్మం గర్ల్స్–1) ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సద్వినియోగం చేసుకోవాలి.. టీఎంఆర్ఈఐఎస్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు వేగంగా సాగుతున్నాయి. ఐదో తరగతికి అన్ని పాఠశాలల్లో సీట్లు అందుబాటులో ఉండగా, 6 – 9వ తరగతికి మాత్రం ఖాళీల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాం. ఈనెల 31లోగా సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ బి.పురంధర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి -
స్వర్ణకవచాలంకరణలో రామయ్య దర్శనం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి శుక్రవారం స్వర్ణకవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అర్చకులు గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
దళారులకు నయాపైసా ఇవ్వొద్దు..
● ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ● ఎమ్మెల్యే రాగమయితో కలిసి ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ సత్తుపల్లిటౌన్/వేంసూరు: ఇళ్లు మంజూరు చేయిస్తాని ఎవరైనా నమ్మబలికినా నయాపైసా ఇవ్వొద్దని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసేవన్నీ తప్పుడు విమర్శలేనని.. తమ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని ఆయన తెలిపారు. సత్తుపల్లిలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మున్సిపాలిటీ, మండలానికి సంబంధించి 574 మందికి, వేంసూరులో జరిగిన కార్యక్రమంలో 570మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుండడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత పదేళ్లలో రైతుబంధు తప్ప ఏ పథకాన్ని సక్రమంగా అమలుచేయలేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, సన్న ధాన్యం రైతులకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి తర్వాత మళ్లీ ఇప్పుడే పేదలకు ఇళ్లు మంజూరవుతున్నాయని చెప్పారు. ప్రతీ పథకంలో అర్హుల ఎంపిక పారదర్శకంగా చేపడుతున్నందున, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహ, ఆర్డీఓ రాజేంద్రగౌడ్, హౌసింగ్ డీఈఈ విక్రమం, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ నాగేశ్వరరావు, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, దోమ ఆనంద్బాబు, భాగం నీరజ, గాదె చెన్నారావు, చల్లగుళ్ల నర్సింహారావు, ఎం.డీ.కమల్పాషా, మందపాటి ముత్తారెడ్డి, తోట సుజలరాణి, ఉడతనేని అప్పారావు, చల్లగుండ్ల కృష్ణయ్య, చల్లారి వెంకటేశ్వరరావు, నారాయణవరపు శ్రీనివాస్, కాసరి చంద్రశేఖర్రెడ్డి, పుచ్చకాయల సోమిరెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, మందపాటి రాఘవరెడ్డి, ఎం.డీ.పైజుద్దీన్, ఎం.డీ.ఫకృద్దీన్, బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.పేదలందరికీ ఇళ్లే లక్ష్యం పెనుబల్లి : పేదల సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తెలిపారు. పెనుబల్లిలో మండల పరిధిలోని 599 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశాక ఆమె మాట్లాడారు. ఐదేళ్లలో సత్తుపల్లి నియోజకవర్గంలో 20 – 25 వేల ఇళ్ల మంజూరుకు ప్రణాళికాయుతంగా పనిచేస్తున్నామని తెలిపారు. కల్లూరు ఆర్డీఓ రాజేంద్రగౌడ్, ఎంపీడీఓ అన్నపూర్ణ, కల్లూరు, సత్తుపల్లి మార్కెట్ చైర్మన్లు భాగం నీరజాచౌదరి, దోమ ఆనందబాబుతో పాటు మట్టా దయానంద్, రాజబోయిన కోటేశ్వరరావు, పి.వెంకటేశ్వరరావు, కీసర శ్రీనివాసరెడ్డి, బుక్కా కృష్ణవేణి, గోదా రాములు, మేకతొట్టి కాంతయ్య, మాలోతు రాధాకృష్ణ పాల్గొన్నారు. -
భూసేకరణ పూర్తి చేయాలి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి పెండింగ్ భూసేకరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్నేటి తీరాన నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్, సీతారామ ఎత్తిపోతల పథకం, జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణ సకాలంలో పూర్తిచేస్తేనే పనులకు ఆటంకాలు రావని తెలిపారు. ఈ విషయంలో రైతులు, నిర్వాసితులతో నేరుగా చర్చించి వారికి నచ్చచెప్పాలని సూచించారు. అలాగే, సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా యాతాలకుంట టన్నెల్, పాలేరు రిజర్వాయర్ లింక్, డిస్ట్రిబ్యూషన్ కెనాళ్లకు అవసరమైన భూసేకరణపైనా సూచనలు చేశారు. కాగా, భూసేకరణ, రైతులకు పరిహారం అందించే అంశంలో మానవీయ కోణంలో వ్యవహరిస్తూ ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని తెలిపారు. ఈసమావేశంలో ఇరిగేషన్ ఎస్ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు జి.నర్సింహారావు, ఎల్.రాజేంద్రగౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి -
ఎందుకింత నిర్లక్ష్యం?
ఎయిడ్స్, లెప్రసీ విభాగాలపై అధికారుల చిన్నచూపు ● సుదీర్ఘ కాలంగా కొరవడిన పర్యవేక్షణ ● 2019 నుంచి ‘అదనపు’ విధులు నామమాత్రమే ● స్పెషలిస్టులు లేక పెరుగుతున్న కేసులుఖమ్మంవైద్యవిభాగం: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఎయిడ్స్, లెప్రసీ నియంత్రణపై నిర్లక్ష్యం చోటుచేసుకుంటోంది. ఈ వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా అదనపు జిల్లా వైద్యాధికారి(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) విభాగం ఉంటుంది. ఆ పోస్టుకు డిప్లొమా ఇన్ డెర్మటో వెనెరియోలజీ అండ్ లెప్రసీ(డీడీవీఎల్) స్పెషల్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. అయితే చాలా ఏళ్లుగా ఈ పోస్టుపై నీలినీడలు అలముకున్నాయి. ఎయిడ్స్ అండ్ లెప్రసీ అదనపు జిల్లా వైద్యాధికారి పోస్టులో పనిచేస్తున్న అధికారి దీర్ఘకాలంగా సెలవు పెట్టడంతో ఆ విభాగంపై పర్యవేక్షణ కొరవడుతోంది. 2019 నుంచి సదరు అధికారి డిప్యుటేషన్పై పొరుగు జిల్లాలో పనిచేయడం, ఆ తర్వాత వచ్చి మళ్లీ తన పోస్టులో జాయిన్ కావడం, ఆ తర్వాత తరచూ దీర్ఘకాలిక సెలవుపై వెళ్తుండడంతో ఆ విభాగాన్ని పట్టించుకునే వారు లేరు. కీలకమైన వ్యాధుల కట్టడికి అర్హులైన స్పెషలిస్ట్ వైద్యాధికారి లేకపోవడంతో కేసుల నియంత్రణ సాధ్యం కావడం లేదు. ఎయిడ్స్ కేసులు ౖపైపెకి.. ఎయిడ్స్ అండ్ లెప్రసీ జిల్లా అదనపు వైద్యాధికారి సాధారణంగా ఎయిడ్స్ కేసులపై నిత్యం పర్యవేక్షించాలి. వ్యాధి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం కింది స్ధాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తుండాలి. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు కేసులు పెరగకుండా చూడాలి. కానీ జిల్లాలో గత కొన్నేళ్లుగా ఎయిడ్స్ నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కేసుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అవగాహన లేమితో యువత హెచ్ఐవీ బారిన పడుతున్నారు. జిల్లాలో ప్రతీ నెల 50 నుంచి 60 పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే కాగా అనధికారికంగా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు 17,350 మందికి ఈ వ్యాధి సోకినట్లు ఏఆర్టీ సెంటర్ల ద్వారా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఎంతమంది వ్యాధి గ్రస్తులు ఉన్నారు, ఎంత మంది చనిపోయారు అనే సమగ్ర రికార్డులు లేకపోవడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఏఆర్టీ ద్వారా 6,842 మంది మందులు వాడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని ఏఆర్టీ సెంటర్లలో నిత్యం పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సర్వే ద్వారానే కుష్ఠు బాధితుల గుర్తింపు.. కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు అదనపు జిల్లా వైద్యాధికారి(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) ఆధ్వర్యంలో నిరంతరం లెప్రసీ కాలనీల్లో పర్యటించాలి. ఎక్కడ అనుమానిత కేసులు ఉన్నాయో సిబ్బందితో కలిసి గుర్తించాలి. అయితే 2019 నుంచి ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. జాతీయ లెప్రసీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రతీ సంవత్సరం ప్రభుత్వం రెండు వారాల పాటు సర్వే చేస్తుంది. ఆ సమయంలో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఎవరికై నా మచ్చలు ఉన్నాయా, అవి ఎలాంటివి అని పరీక్షిస్తారు. వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తారు. ఆ సమయంలోనే తప్పితే ఆ తర్వాత కుష్ఠు వ్యాధి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో 2027 నాటికి కుష్ఠు రహిత దేశంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం ఎయిడ్స్, లెప్రసీ నియంత్రణ అధికారి సెలవులో ఉన్నది వాస్తవమే. అయినా ఆ రెండు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఓ అధికారికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాం. అర్హత గల అధికారి ఉండాల్సి ఉన్నా, కొరతతో ఉన్న వారితోనే వ్యాధి నియంత్రణకు పాటుపడుతున్నాం. ఎయిడ్స్ అండ్ లెప్రసీ అదనపు జిల్లా అధికారి పోస్టులో మరొకరిని శాశ్వతంగా నియమించాలంటే డీహెచ్ నిర్ణయం తీసుకోవాలి. – బి.కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
సరస్వతీ నమస్తుభ్యం..
● పుష్కరాలకు జిల్లా నుంచి తరలివెళ్తున్న భక్తులు ● నదీస్నానం పుణ్యఫలమని నమ్మకం ● ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనంఖమ్మంగాంధీచౌక్: సరస్వతీ పురష్కరాలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఈనెల 15న ప్రారంభమైన పుష్కరాలు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తోంది. ఈ త్రివేణీ సంగమంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తుండగా.. ఇక్కడ స్నానమాచరించిన భక్తులు పక్కనే ఉన్న ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. నదీ స్నానాలకు ప్రాముఖ్యం సరస్వతీ పుష్కరాల్లో నదీ స్నానాలకు భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు. పుష్కరస్నానం పుణ్యఫలమని, చదవుల తల్లిగా విరాజిల్లుతున్న సరస్వతీ నదిలో స్నానమాచరిస్తే సకల విద్యలు ప్రాప్తిస్తాయని వారి నమ్మకం. కాళేశ్వరంలో స్నాన ఘట్టాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్నానానంతరం భక్తులు నదీ తీరంలో సైకత లింగాలను ఏర్పాటు చేసి పూజలు చేయడంతో పాటు పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేస్తున్నారు. వివిధ మార్గాల్లో పయనం.. జిల్లాలోని అన్ని ప్రాంతాల భక్తులు నిత్యం పుష్కరాలకు వెళ్తున్నారు. ఖమ్మం నుంచి రోడ్డు మార్గంలో వరంగల్, పరకాల, భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం వరకు 225 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఖమ్మం నుంచి మహబూబాబాద్, నర్సంపేట, మల్లంపల్లి, రేగొండ, భూపాలపల్లి, మహదేవ్పూర్ మీదుగా వెళితే 221 కి.మీ. ఉంటుంది. లేదంటే రైలులో ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాళేశ్వరం వెళ్లొచ్చు. ట్రావెల్స్ చార్జీల మోత.. జిల్లా నుంచి కాళేశ్వరానికి నేరుగా బస్సుల సౌకర్యం అంతగా లేకపోవడంతో భక్తులు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. కొందరు భక్తులు పుష్కరాలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, లక్నవరం, రామప్ప, వరంగల్ వేయి స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి దేవాలయం వంటి క్షేత్రాలను సందర్శిస్తున్నారు. దీంతో ఒక్కొక్కరికి రవాణా చార్జీలు రూ.1,200 నుంచి రూ. 2,000 వరకు ఖర్చవుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు, సెలవులు కావడం, ఇప్పుడే పుష్కరాలు రావడంతో ప్రైవేట్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో ధరల మోత మోగుతోంది. -
రామా.. కనవేమిరా!
● అరకొర వసతులతో అంజన్న మాలధారుల ఇక్కట్లు ● తరలివచ్చిన భక్తులతో భద్రాచలంలో హనుమజ్జయంతి సందడి ● కనీస ఏర్పాట్లు చేయని ప్రభుత్వం.. దాతల స్పందన కూడా కరువే.. భద్రాచలం: మాల విరమించేందుకు భద్రగిరి వచ్చిన అంజన్న భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. హనుమాన్ మాలధారులు ఇక్కట్ల నడుమే గురువారం శ్రీసీతారామ చంద్రస్వామివారిని దర్శించుకున్నారు. హనుమజ్జయంతికి ప్రభుత్వం, దేవస్థానం ఏర్పాట్లు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలతోపాటు పలు ప్రాంతాల్లో భక్తులు అధిక సంఖ్యలో హనుమాన్ మాల ధరిస్తారు. అయ్యప్ప మాలధారణ తర్వాత హనుమాన్ మాలధారణకే ఎక్కువ ఆదరణ ఉంటుంది. మాలధారులు కొండగట్టు అంజన్న వద్ద, భద్రాచలం శ్రీ సీతారాముల చెంతన ఇరుముడి విరమణ చేసేందుకు ఆసక్తి చూపుతారు. మూడు రోజుల్లో సుమారు 40 వేల మంది భక్తులు భద్రాచలాన్ని సందర్శిస్తారు. భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి తర్వాత హనుమాన్ జయంతికే ఎక్కువ మంది భక్తులు వస్తారని చెప్పవచ్చు. ఈసారి కూడా అధిక సంఖ్యలో అంజన్న మాలధారులు భద్రగిరి వచ్చారు. కానీ ప్రభుత్వం కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. దేవస్థానం ఆధ్వర్యంలో కేవలం అధికంగా లడ్డూల తయారీ, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాట్లు తప్ప ఇతరత్రా ప్రత్యేక ఏర్పాట్లు ఏర్పాటు చేయలేదు. క్యూలైన్లు కిటకిట తరలివచ్చిన హనుమాన్ మాలధారులతో భద్రగిరి కాషాయవర్ణంగా మారింది. రోడ్లన్నీ సందడిగా మారాయి. శ్రీసీతారామ చంద్రస్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. బుధవారం అర్ధరాత్రి వరకు, మళ్లీ గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారి దర్శనానికి అవకాశం కల్పించారు. ఆంజనేయ స్వామి ఆలయంలో మాలధారణ విరమణను అర్చకులు పూర్తి చేశారు. అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా అభయాంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకం, తమలపాకులతో అర్చన, తదితర పూజలను గావించారు. ప్రసాదాల కోసం శాశ్వత ఆరుకౌంటర్లు, స్టేడియంలో బ్యాంకర్ల ద్వారా నాలుగు, పడమర మెట్ల వైపు మరో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈఓ రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి 10.30 గంటలకు వెంకటగిరి క్రాస్రోడ్డులో, 10.45 గంటలకు గాంధీచౌక్లో ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11 గంటలకు 2వ డివిజన్ పాండురంగాపురంలో స్ట్రోమ్ వాటర్ డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. శనివారం రఘునాథపాలెం మండలం కోటపాడులో కోయచలక – పాపటపల్లి దారిలో బ్రిడ్జి నిర్మాణానికి, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. చట్టానికి లోబడి వ్యాపారం చేయాలిజిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య బోనకల్: ఎరువులు, పురుగు మందులు, విత్తన డీలర్లు చట్టానికి లోబడి వ్యాపారం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య సూచించారు. బోనకల్లో గురువారం మధిర డివిజన్ డీలర్ల సమావేశం నిర్వహించగా డీఏఓ మాట్లాడారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలకు తప్పకుండా బిల్లులు ఇవ్వాలని, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని చెప్పారు. క్రమం తప్పకుండా లైసెన్సులు రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు అమ్మితే లైసెన్స్ రద్దు చేయడమే కాక పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీలర్లకు ఈపాస్ మిషన్లను అందించారు. కార్యక్రమంలో మధిర ఏడీఏ ఎస్.విజయచంద్ర, ఏఓలు వినయ్కుమార్, సాయిదీక్షత్, మానస, సాయిశివ, ఎస్ఐలు వెంకన్న, నాగుల్మీరా, లక్ష్మీ బార్గవి పాల్గొన్నారు. స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాలకు తేదీల ఖరారుఖమ్మం స్పోర్ట్స్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వార్యాన కొనసాగుతున్న స్పోర్ట్స్ అకాడమీలు, రీజినల్ స్పోర్ట్స్ హాస్టళ్లలో ప్రవేశాలకు తేదీలను ఖరారు చేసినట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి టి.సునీల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1న సిద్దిపేటలో వాలీబాల్ అకాడమీలో ప్రవేశాలకు, 10, 11 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో సైక్లింగ్, రెజ్లింగ్ ఎంపికలు, హన్మకొండలోని జేఎన్ స్టేడియంలో రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్కు ఎంపికలు జరుగుతాయని వివరించారు. ఇక 10వ తేదీన సరూర్నగర్ స్టేడియంలో వాలీబాల్ అకాడమీకి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వాలీబాల్ అకాడమీకి, 12న వనపర్తిలో హాకీ అకాడమీకి, ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీకి ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. జూన్ 12, 13 తేదీల్లో మహబూబ్నగర్లో వాలీబాల్ అకాడమీకి ఎంపికలు జరుగుతాయని, ఆసక్తి గల క్రీడాకారులు ఆయా క్రీడాంశాల్లో జరిగే ఎంపికలకు నిర్ణీత తేదీల్లో వెళ్లాలని సూచించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంఖమ్మం సహకారనగర్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షకు 3,483 మంది విద్యార్థులకు గాను 3,268 మంది, మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షకు 890 మందికి గాను 829 మంది హాజరయ్యారని డీఐఈఓ రవిబాబు తెలిపారు. డీఈసీ, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 20 పరీక్ష కేంద్రాలను సందర్శించాయని, తొలిరోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని వివరించారు. వృత్యంతర శిక్షణతో ఉపాధ్యాయులకు మేలుఖమ్మం సహకారనగర్ : వృత్యంతర శిక్షణతో ఉపాధ్యాయులకు మేలు జరుగుతుందని స్టేట్ రిసోర్స్ పర్సన్, తెలుగు పర్యవేక్షకులు మడతా భాస్కర్ అన్నారు. నగరంలోని న్యూ ఇరా పాఠశాలలో జరుగుతున్న శిక్షణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల విద్యా లక్ష్యాల సాధనకు ఈ శిక్షణ సరైందని అన్నారు. శిక్షణ కేంద్రం కో ఆర్డినేటర్ సీహెచ్.రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్పీలు పొత్తూరి సీతారామారావు, దేవయ్య, జంగం నాగేశ్వరరావు, జక్కంపూడి కృష్ణ, రామానుజాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
● జూన్ 3 నుంచి గ్రామాలకు రెవెన్యూ అధికారులు ● ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి ● అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటిఖమ్మం సహకారనగర్ : ధరణి చట్టాన్ని రద్దు చేసి ప్రజలు మెచ్చే భూ భారతిని తీసుకొచ్చామని, ఈ చట్టంతో సమస్యలు పరిష్కారం కానున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. భూభారతి చట్టం విధి విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 29 జిల్లాల్లో తాను పర్యటించానని, అన్ని ప్రాంతాల ప్రజలు, రైతులు ఈ చట్టంపై సంతోషంగా ఉన్నారని తెలిపారు. జూన్ 3 నుంచి 20 వరకు రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు గ్రామాలకు వెళ్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇస్తున్నామని, అందులో 1.95 లక్షల మంది లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేశామని తెలిపారు. మిగతా 2.55 లక్షల మంది లబ్ధిదారులను ఈ నెలాఖరుకు ఫైనల్ చేస్తామన్నారు. రాష్ట్రంలోని 9,800 చెంచు, చెంచు ఉపకులాల కుటుంబాలన్నింటికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజనులకు అదనంగా మరో 10వేల ఇళ్లు ఇస్తామన్నారు. జూన్ 2 నాటికి కనీసం 1000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి ఎవరైనా సిద్ధంగా లేకుంటే వారి నుంచి అంగీకారం తీసుకుని అర్హులైన మరొకరికి మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రెండో విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించగా, జిల్లాకు 17,983 ఇస్తున్నామని ప్రకటించారు. ఇందులో 12,276 ఇళ్లకు ఆయా నియోజకవర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, ఇప్పటివరకు 7,212 ఇళ్లకు ఇన్చార్జ్ మంత్రి ఆమోదం లభించిందని వివరించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల జాబితా వచ్చే నెల మొదటి వారంలో పూర్తి చేయాలని చెప్పారు.మండలాల్లో అవగాహన సదస్సులు.. భూ భారతి చట్టంపై పైలట్ మండలంగా నేలకొండపల్లిని ఎంపిక చేసి అన్ని గ్రామాల్లో రెవె న్యూ సదస్సులు నిర్వహించామని, భూ సమస్యలపై 3,264 దరఖాస్తులు స్వీకరించగా, అందులో 1,786 సాదాబైనామా దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. రెండో విడతగా బోనకల్ మండలంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు. ఎర్రుపాలెం మండలం మూలుగుమాడును రీ సర్వేకు పైల ట్ గ్రామంగా ఎంపిక చేశామని చెప్పారు. జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో సర్వే కోసం రెండు టీమ్ల చొప్పున సిద్ధం చేయాలని సూచించా రు. ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ ముజమ్మి ల్ ఖాన్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల వేగవంతానికి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, భూ భారతి పైలట్ మండలాల్లో భూ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించామని వివరించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, ఆర్డీఓలు నర్సింహారా వు, రాజేందర్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల యాత్ర విజయవంతం కావాలి
ఖమ్మం మామిళ్లగూడెం: కాళేశ్వరం శ్రీ సరస్వతి పుష్కరాలకు వెళ్తున్న బస్సు యాత్ర విజయవంతం కావాలని ఖమ్మం వన్టౌన్ సీఐ తాటిపాముల కరుణాకర్ కోరారు. గురువారం ఖమ్మం జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్తో పాటు జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు పుష్కరాలకు వెళ్తుండగా.. ఖమ్మం గాంధీ పార్క్ నుంచి వెళ్లే బస్సును సీఐ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ మాట్లాడాక..సీఐను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెలిగేటి విజయలక్ష్మి, జయ, సభ్యులు అనాసి రాధాకృష్ణ, సాదినేని జనార్ధన్రావు, రాయల వెంకటేశ్వర్లు, వేగినాటి లక్ష్మయ్య, కేదాసు నరసయ్య, కె.సత్యనారాయణరెడ్డి, శ్రీహరి, జల్లా వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, లక్ష్మి, రమాదేవి, నాగమణి, లలిత, పద్మ, శ్రీలక్ష్మి, నాగమణి, తదితరులు పాల్గొన్నారు. -
ముక్తిని కలిగించేది పుణ్య స్నానం
సరస్వతీ పుష్కరాలకు కుటుంబమంతా వెళ్లొచ్చాం. త్రివేణీ సంగమంలో స్నానమాచరించి సరస్వతీ అమ్మవారిని, ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నాం. అయితే సౌకర్యాలు ఆశించినంతా లేవు. తినుబండారాల ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. – వల్లాల స్వప్న, రిక్కాబజార్, ఖమ్మం సమూహంగా వెళ్లేందుకు ఏర్పాట్లు కాలనీ వాసులం, కుటుంబ సభ్యులం కలిసి పుష్కరాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. నేరుగా బస్సులు లేకపోవడంతో ట్రావెల్స్ వాహనం మాట్లాడుకున్నాం. ట్రావెల్స్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. – కొండపల్లి మనోహరి, శ్రీనివాసనగర్, ఖమ్మం వాహనాలకు డిమాండ్ పెరిగింది పుష్కరాలకు కాళేశ్వరం వెళ్లేందుకు వాహనాల బుకింగ్లు పెరిగాయి. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్, మరో వైపు వేసవి సెలవుల సమయంలో పుష్కరాలు రావడంతో వాహనాలకు డిమాండ్ పెరిగింది. దూరం, వాహనాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నాం. – ఆర్ ప్రకాష్, ట్రావెల్స్ యజమాని, ఖమ్మం● -
జిల్లా వ్యాప్తంగా వర్షం
● సగటు వర్షపాతం 24 మి.మీ. ● పలుచోట్ల 45 మి.మీ.కుపైగానే.. ● మూడు రోజుల పాటు వర్ష సూచనమండలం వర్షపాతం వైరా 47.4 చింతకాని 46.6 పెనుబల్లి 45.2 నేలకొండపల్లి 43.6 సత్తుపల్లి 42.0 తల్లాడ 33.4 కూసుమంచి 33.8 మధిర 32.8 కామేపల్లి 26.6 సింగరేణి 19.4 ఖమ్మం అర్బన్ 19.2 ఖమ్మం రూరల్ 16.2 ఎర్రుపాలెం 15.6 కొణిజర్ల 12.6 వేంసూరు 10.6 ముదిగొండ, బోనకల్ 10.4 తిరుమలాయపాలెం 10.2 రఘునాథపాలెం, ఏన్కూరు 9.8 కల్లూరు 8.4 ఖమ్మంవ్యవసాయం: జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం కురిసింది. మొత్తంగా 504.0 మి.మీ. వర్షపాతనం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 24 మి.మీ. కాగా అత్యధికంగా వైరాలో 47.4 మి.మీ. చింతకాని, పెనుబల్లి, నేలకొండపల్లి, సత్తుపల్లి మండలాల్లో 40 మి.మీ.కు పైగా నమోదైంది. కల్లూరులో అత్యల్పంగా 8.4 మి.మీ. వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. గురువారం 33.4 నుంచి 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పమ్మిలో 38.2 డిగ్రీలు, అత్యల్పంగా గౌరారంలో 33.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రైతులు పంటల సాగుపై దృష్టి పెడుతున్నారు. అయితే ఈ వానలు మరో మూడు, నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
బావిలో పడి ఆవు, రెండు దూడలు మృతి
చింతకాని: మేత కోసం అడవికి వెళ్లిన ఆవు, రెండు దూడలు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన ఘటన చింతకానిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. చింతకాని గ్రామానికి చెందిన బండి సతీష్కు చెందిన ఆవు, ఉసికల తుమ్మలయ్యకు చెందిన పెయ్య దూడ, గడ్డం రాఘవులకు చెందిన కోడె దూడలను మూడు రోజుల క్రితం మేత కోసం అడవికి పంపించారు. చింతకాని నుంచి రేపల్లెవాడ వెళ్లే రహదారి పక్కన ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన ఆవు, రెండు దూడలు అందులో పడి మృతి చెందాయి. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో మూడు రోజుల నుంచి వాటి కోసం వెతుకుతుండగా.. గురువారం సాయంత్రం స్థానిక రైతులు చూసి సమాచారం ఇవ్వడంతో వాటిని జేసీబీ సాయంతో బయటకు తీశారు. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి రఘునాథపాలెం: మండలంలోని చిమ్మపుడి గ్రామంలో బుధవారం రాత్రి ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగిపడగా.. పాడి గేదె మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తెల్ల బోయిన శ్రీనుకు చెందిన గేదె గురువారం ఉదయం మేతకు వెళ్లగా.. అప్పటికే తెగి పడిన తీగలకు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందిందని తెలిపారు. దీని విలువ సుమారు రూ.70 వేలు ఉంటుందని బాధిత రైతుల వాపోయాడు. కాగా, ఘటనా స్థలాన్ని మండల మాజీ వైస్ ఎంపీపీ గుత్తా రవి పరిశీలించి బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలి
ఖమ్మంమయూరిసెంటర్: దండకారణ్యం నారాయణపూర్, బస్తర్లో బుధవారం జరిగిన బూటకపు ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఖమ్మంలోని మంచికంటి హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మందుల రాజేంద్రప్రసాద్, ప్రజా సంఘాల నేతలు కాకి భాస్కర్, డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్ మాట్లాడారు. మూడు నెలలుగా మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటించినా.. కేంద్ర ప్రభుత్వం కాల్పులు జరుపుతూనే ఉందన్నారు. శాంతి చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపినా 2026 మావోయిస్టు రహిత దేశంగా మార్చుతామని కేంద్రం అమాయకులను పొట్టనబెట్టుకుంటుందన్నారు. తాజాగా జరిపిన ఎన్కౌంటర్ మధ్య భారతదేశంలో ఉన్న ఖనిజ సంపదను గుజరాత్ మార్వాడీలకు దోచిపెట్టే కుట్రలో భాగమే ఈ ఎన్కౌంటర్లు అన్నారు. ఈ ఎన్కౌంటర్ను నిరసిస్తూ 23న సాయంత్రం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు వై.విక్రమ్, సింగు నర్సింహారావు, సీ.వై.పుల్లయ్య, రవి మారుత్, దేవిరెడ్డి విజయ్, చిర్ర రవి, విప్లవ కుమార్, రమణాల లక్ష్మయ్య, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం కమిటీ ఎన్నిక
నేలకొండపల్లి: ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మారగాని లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన అసోసియేషన్ జిల్లా కమిటీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోగా ఆయన నియమితులయ్యారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కె.శ్రావణినాయుడు, కోశాధికారిగా వై.సూరయ్య, ఉపాధ్యక్షుడిగా వి.వీరన్న, సంయుక్త కార్యదర్శిగా పి.నరేష్, గౌరవ సలహాదారులుగా నరేష్, కృష్ణయ్య, మహేష్, చంద్రావతి, రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎం.శివకుమార్, రవికుమార్ ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రత్యేక ఉపాధ్యాయలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు, హక్కుల సాధన కోసం కృషి చేస్తామన్నారు. బస్తీ దవాఖానా ఆకస్మిక తనిఖీ ఖమ్మంవైద్యవిభాగం: నగరంలోని రంగనాయకుల గుట్ట బస్తీ దవాఖానాను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతిబాయి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, వైద్యులు పేషంట్లతో వ్యవహారిస్తున్న తీరు, అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. సిబ్బంది అందిస్తున్న సేవలు అడిగి తెలుసుకున్నాక సమయపాలన విధిగా పాటించాలన్నారు. అలాగే పేషంట్లతో మర్యాదగా వ్యవహారించాలని, లాబ్ పరీక్షలు నిర్వహించాలని, మందులు సరిపడా అందించాలని, అసంక్రమిత వ్యాధులపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. మలేరియ, డెంగీ, కేన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, టీబీ వ్యాధిగ్రస్తులకు మంచి సేవలతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించి ఆరోగ్యవిద్యను అందించాలని సూచించారు. విద్యుత్ అభివృద్ధి పనుల పరిశీలన ఖమ్మంవ్యవసాయం: దానవాయిగూడెం సబ్ స్టేషన్ పరిధిలో, రైల్వే అండర్ గ్రౌండ్ కేబుల్ పనులను గురువారం ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ అధికారుల బృందం పరిశీలించింది. మేకల భిక్షమయ్య ఫంక్షన్ హాల్ నుంచి కామంచికల్ వరకు జరుగుతున్న రహదార్ల అభివృద్ధి పనులకు సంబంధించి విద్యుత్ లైన్ షిఫ్టింగ్ పనులతో పాటు కామంచికల్లో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ సర్కిల్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఖమ్మం టౌన్ డీఈ నంబూరి రామారావు, రఘునాథపాలెం ఏడీఈ సంజీవ్ పాల్గొన్నారు. అడిషనల్ డీసీపీ బదిలీ ఖమ్మంక్రైం: ఖమ్మం అడిషనల్ డీసీపీ(అడ్మిన్) ఎ.నరేష్కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఏఎస్పీ(అడ్మిన్)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాదిన్నర క్రితం ఖమ్మం అడిషనల్ డీసీపీగా బదిలీపై రాగా.. ప్రస్తుతం ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. కాగా, మున్నేరు వరదల సమయాన ప్రజలకు సేవలు అందించి గుర్తింపు పొందారు. రామయ్య సేవలో మాజీ స్పీకర్ భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానాన్ని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి గురువారం సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే బీఆర్ఎస్ నేత ఎనుగుల రాకేష్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మానె రామకృష్ణ, మండల కన్వీనర్ సునీల్ పాల్గొన్నారు. -
బావమరిదిని దించేందుకు వెళ్లి అనంతలోకాలకు..
తల్లాడ: తల్లాడ ఎన్టీఆర్నగర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన కొత్తపల్లి రాంబాబు(28) అతడి కుమారుడు క్రిశాంత్(6) మోటార్ సైకిల్పై తల్లాడ వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈక్రమంలో ఎన్టీఆర్నగర్ వద్ద జాతీయ రహదారిలో ఎదురుగా సత్తుపల్లి నుంచి తల్లాడ వైపు వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రిశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా రాంబాబును 108లో ఖమ్మం ప్రభుత్వ్రాస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. బావమరిదిని బస్టాండ్లో దించేందుకు వెళ్లి.. కొత్తపల్లి రాంబాబు తన భార్య గోపరాణి పిల్లలతో పాటు అత్తగారు ఊరైన రామచంద్రాపురం గ్రామానికి బుధవారం రాత్రి వచ్చారు. రాత్రి అక్కడే బస చేసి గురువారం మధ్యాహ్నం తన బావమరిది తిరుపతిరావును తల్లాడ బస్టాండ్లో దించేందుకు మోటార్ సైకిల్పై వచ్చారు. బావమరిదిని దించేందుకు వస్తుండగా తన కుమారుడు క్రిశాంత్ నేను కూడా వస్తానని అనడంతో కుమారుడితో పాటు బావమరిదిని తీసుకొని బస్టాండ్లో దించి తిరిగి రామచంద్రాపురం బయలు దేరాడు. ఈక్రమంలో డీసీఎం వ్యాన్ ఢీకొట్టగా తండ్రీకుమారుడు మృతి చెందగా.. గ్రామంలో విషాదం అలుముకుంది. డీసీఎం వ్యాన్ ఢీకొని తండ్రీకొడుకులు మృతి -
స్లాట్ బుక్ చేసుకుని పడిగాపులు
నేలకొండపల్లి: స్లాట్ బుక్ చేసుకున్న రైతులు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాశారు. వివరాలిలా ఉన్నాయి. ఇటీవల స్లాట్ బుక్ రైతులకు గురువారం మండల తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం అవకాశం కల్పించారు. దీంతో వారు తమ చంటి పిల్లలతో సహా ఉదయం 10 గంటలకు కార్యాలయానికి చేరుకోగా.. తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో రాత్రి 9 గంటల వరకు కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. తిండి తిప్పలు లేకుండా కార్యాలయంలో వేచి ఉన్న రైతులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై తహసీల్దర్ వి.వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. ఖమ్మంలో జిల్లా అధికారులతో సమావేశం ఉన్నందున్న ఆలస్యమైందని వెల్ల డించారు. డీఎస్పీ సేవలకు గుర్తింపు కొత్తగూడెంఅర్బన్: పొక్సో కేసులో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి కేసుల పరిష్కారానికి కృషి చేసిన కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్కు గుర్తింపు లభించింది. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇందులో భాగంగా కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్కు ప్రశంసాపత్రం లభించగా.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో గురువారం డీఎస్పీని అభినందించారు. -
ఫలరాజు ఫలించేలా..
యాజమాన్య పద్ధతితో అధిక లాభాలు ● నేల సారవంతానికి దుక్కులు అవసరం ● కొమ్మ కత్తిరింపులతో తెగుళ్ల నివారణ ● వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ వైరా: దేశంలో పండించే పండ్ల తోటల్లో ప్రధానమైనది, ఫలరాజుగా పేరుగాంచినది మామిడి. అయితే దీని సాగు విస్తీర్ణం దేశంలో మొత్తం 35శాతం ఉండగా.. 22,58,130 హెక్టార్లలో విస్తరించి ఉంది. రాష్ట్రంలో 1,15,990 హెక్టార్లు, జిల్లాలో 13,674 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. సాధారణంగా మామిడి రైతులు పూత, కాత దశలో మాత్రమే మామిడి తోటలపై దృష్టి సారించి చెట్టుకు కావాల్సిన ఎరువులు అందిస్తుంటారు. దీని వలన సరైన పోషకాలు అందక పూత సకాలంలో రాకపోవడం, వచ్చిన పూత, పిందె సరిగా నిలవక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యాన అధిక దిగుబడులు సాధించేందుకు కోత అనంతరం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ సూచిస్తున్నారు. కొమ్మ కత్తిరింపులు.. ● మామిడి కాయ కోత అనంతరం కాయ తొడిమలున్న కొమ్మలు, ఎండిన కొమ్మలు, తెగులు సోకిన, విరిగిన కొమ్మలు, చెట్ల లోపల గాలి, వెలుతురు ప్రవేశానికి అడ్డుగా ఉన్న కొమ్మలను కత్తిరించాలి. ● పూత కాడల నుంచి వెనుకకు 15 సెంటీ మీటర్లు వరకు కత్తిరిస్తే నవంబర్, డిసెంబర్లలో కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి, అవే వచ్చే రుతువులో పుష్పిస్తాయి. ● ప్రతీ రెమ్మ చివరి నుంచి 3–5 చిగుర్లు వస్తే ఆరోగ్యంగా ఉన్న రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి. ● కత్తిరింపులతో కొంత మేర తెగుళ్లు తగ్గే అవకాశం ఉండగా.. కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డ్ఫేస్ట్ పూయాలి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటికి కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి. దుక్కి దున్నడం.. తొలకరిలో అనగా జూన్, జూలై మాసాలలో రైతాంగం చెట్ల మధ్యన దున్నాలి. దీని వలన కోశస్థ దశలో ఉన్న పురుగులు, కలుపు నివారించబడడడంతో పాటు నేల గుల్లబారి, వేర్లకు గాలి బాగా చేరి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా నేలకు వర్షపు నీటిని పట్టి ఉంటే గుణం పెరిగి నేల సారవంతమవుతంది. మూడవ దుక్కి అక్టోబర్లో చేపడినట్లయితే నేలలో తేమ ఆరిపోయి సకాలంలో పూత రావడానికి దోహదపడుతుంది. దున్నేటప్పుడు చెట్టు నుంచి 1–5 మీటర్ల దూరంలో దున్నడం ఉత్తమం. ఎరువుల యాజమాన్యం.. కాసే తోటలో చెట్లకు సరిఝైన మోతాదులో ఎరువులు అందించాలి. ఒక సంవత్సరం వయసున్న చెట్లకు 10 కిలోల పశువుల ఎరువు, 200 గ్రాములు యూరియా, 600 గ్రాములు సింగిల్ సూపర్ పాస్పేట్, 150 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేయాలి. అదే ఐదేళ్ల వయసున్న చెట్లకు 50 కిలోల పశువుల ఎరువు, కిలో యూరియా, 3 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 730 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. పదేళ్లు, ఆపై వయసు గల చెట్లకు 100 కిలోల పశువులు ఎరువు, 2.2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 1.75 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. మామిడి కోత అయ్యాక సిపార్సు చేసిన 2/3 వంతు ఎరువులను వేయాలి. మిగతా 1/3 భాగం ఎరువులను కాయ ఎదుగుదల దశలో ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో వేయాలి. సూక్ష్మధాత లోపాలు ఎక్కువుగా ఉన్న తోటల్లో చెట్టుకు 150 గ్రాములు జింక్ సల్ఫేట్, 75 గ్రాములు బోరాక్స్, 100 గ్రాములు ఫెర్రస్ సల్ఫేట్ 125 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ పశువుల ఎరువుతో కలిపి జూన్, జూలై మాసాలలో మొక్కల పాదుల్లో వేయాలి. ఈ విధంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మామిడి చెట్లు సెప్టెంబర్, అక్టోబర్లో కొత్త చిగుర్లు వేసి సకాలంలో పూత రావడమే గాక మంచి దిగుబడులు పొందవచ్చు. -
జాతీయవాదాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమే..
ఖమ్మంవన్టౌన్: జాతీయవాదాన్ని వ్యతిరేకించడం దేశద్రోహమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇటీవల నగరంలో జాతీయవాదుల నేతృత్వాన నిర్వహించిన తిరంగా యాత్రను కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఘటనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు నేతృత్వాన జిల్లా నేతలు కరీంనగర్లోని బండి సంజయ్ క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించగా.. ఆయన స్పందించారు.ఇలాంటి దేశద్రోహకర చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని, దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. బండి సంజయ్ను కలిసిన వారిలో పార్టీ రాష్ట్ర నాయకులు సన్నే ఉదయప్రతాప్, రమేష్, నున్నా రవికుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
సుకినీతండాలో మూగ గోస..
రఘునాథపాలెం: మండలంలోని సుకినీతండాలో అనుమానాస్పద స్థితిలో పలువురు రైతులకు చెందిన నాలుగు ఆవులు గురువారం మృతి చెందాయి. బుధవారం మేతకు వెళ్లిన పశువులు రాత్రి నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. గమనించిన రైతులు వెంటనే చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా మాలోతు బద్యా, జగ్యా, రవి, సీతులకు చెందిన నాలుగు ఆవులు మృతి చెందాయి. అదేవిధంగా గ్రామానికి చెందిన వీరా, శంకర్, రవిలకు చెందిన మరో మూడు ఆవులు తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతుండగా.. పాపటపల్లి పశువైద్యాధికారి గంగాధర్ ఆధ్వర్యాన వైద్యసిబ్బంది చికిత్స అందిస్తున్నారు. మేతకు వెళ్లిన సమయాన పొలాల్లో పురుగుమందుల డబ్బాలు, గాబుల్లో వర్షపు నీరు నిలిచి ఉండగా, అవి తాగిన కారణంగానే పశువులకు ఇలా ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ప్రారంభమైన వేళ పశువుల మృతితో రైతు కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయి. బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు. నాలుగు ఆవుల మృతి -
ప్రతిభావంతులకు ప్రశంసా పత్రాలు
దమ్మపేట: పదోతరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరి చిన దమ్మపేట మండలానికి చెందిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ధనసరి సీతక్క, శాఖ కార్యదర్శి శరత్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. బుధవారం హైదరాబాద్లోని కొమురం భీమ్ భవన్లో గిరి జన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అకాడమిక్ సక్సెస్ మీట్(2024–25)ను ఘనంగా నిర్వహించారు. 575, 569 మార్కులతో గిరిజన ఆశ్రమ పాఠశాల పరిధిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన అంకంపాలెం బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వాడే మౌనిక, స్రవంతిలకు గోల్డ్ మెడళ్లను అందజేశారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలను కూడా మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. ఏటీడీఓ చంద్రమోహన్, హెచ్ఎంలు శారద, చంద్రకళ, వార్డెన్ నాగమణి పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన అంకంపాలెం విద్యార్థినులు -
సంస్కరణలకు ఆద్యుడు.. రాజీవ్గాంధీ
ఖమ్మంవన్టౌన్: దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన దివంగత ప్రధాని రాజీవ్గాంధీ సేవలు మరువలేనివని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రధానిగా రాజీవ్గాంధీ అనేక సంస్కరణలకు నాంది పలికారని, భారత్ను అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన నిలిపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజనీకుమార్, కుమార్, కొత్తా సీతారాములు, సయ్యద్ గౌస్, ముజాహిద్ హుస్సేన్, సంతోష్, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు, రాపర్తి శరత్, మడూరి ప్రసాద్, కన్నం వైష్ణవి, ప్రసన్నక్రిష్ణ, రమేష్, నాగరాజు, నరేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సదస్సులు లేవు.. చైతన్యం లేదు..
● ఊసే లేని ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ ● రెండేళ్ల క్రితం వరకు ఏప్రిల్, మే నెలల్లో అవగాహన సదస్సులు ● ఈసారి మండలానికొక సదస్సుతో సరివైరారూరల్: పంటల సాగులో అవలంబించాల్సిన విధానాలు, విత్తనాల ఎంపిక జాగ్రత్తలు, సాగుకు ముందు చేయించాల్సిన భూపరీక్షలు ఇలా పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఉమ్మడి ఆంధ్రపదేశ్గా ఉన్నప్పడు రైతు చైతన్య యాత్రలు నిర్వహించేవారు. తెలంగాణ ఏర్పడాక బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ పేరుతో రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఏటా వానాకాలం సాగుకు ముందు ఏప్రిల్, మే నెలల్లో అవగాహన సదస్సులను నిర్వహించేది. కానీ గత రెండేళ్ల నుండి ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ ఏటా సదస్సుల ఊసెత్తడం లేదు. దీంతోఆధునిక విధానాలపై అవగాహన లేక, ఏళ్లుగా ఒకే పంట సాగు చేస్తూ, అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతూ రైతులు నష్టపోవడం అనవాయితీగా మారింది. అవగాహనలేమితో నష్టాలు గ్రామాల వారీగా రైతుల వద్దకు వెళ్లి సాగులో మెళకువలపై అవగాహన కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాక నష్టాలు తగ్గే అవకాశముంది. గతంలో సదస్సులు నిర్వహించినప్పుడు వ్యవసాయ అధికారుల బృందం ఉదయం 7గంటలకల్లా గ్రామాలకు వెళ్లి వివిధ అంశాలపై అవగాహన కల్పించడమే కాక రైతుల నుంచి సంతకాలు సేకరించేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు సమన్వయ సమితిల జాడ లేకపోగా, అవగాహన సదస్సుల విషయాన్నే మరిచిపోయారు. ఈ ఏడాది ‘రైతుల ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ పేరిట ససదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ నిర్దేశిత ప్రాంతాల్లోనే ఏర్పాటుచేస్తుండడంతో రైతులకు సలహాలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అవగాహన కల్పించాలి.. రైతు చైతన్య యాత్రలు నిర్వహించకపోవడంతో అన్నదాతలకు అవగాహన లేక నష్టపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చైతన్య సదస్సులు ఏర్పాటుచేయాలి. సేంద్రియ వ్యవసాయంపైనా అవగాహన కల్పిస్తే రైతులకు సౌకర్యవంతంగా ఉంటుంది. – యమాల గోపాలరావు, సీపీఐ నాయకుడుఅమలు చేయాలి.. సాగుకు ముందు పంటలు, విత్తనాల రకాలపై అవగాహన లేకుండా పోయింది. ప్రభుత్వం, అధికారులు స్పందించి గతంలో మాదిరి చైతన్యయాత్రలు నిర్వహించి భూసార పరీక్షలు, ఇతర అంశాలపై వివరిం చాలి. దీంతో రైతులకు మేలు జరుగుతుంది. – అయినాల కనకరత్నం, రైతు, కేజీ సిరిపురం -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 5గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ముత్తగూడెంలో రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత రూరల్ మండలం ఎం.వెంకటాయపాలెం ఎంపీపీఎస్లో అదనపు తరగతిగదుల నిర్మాణానికి, పొన్నెకల్ నుండి పిట్టలవారిగూడెం వయా ఆరెంపుల రోడ్డుకు, కాచిరాజుగూడెంలో చింతపల్లి – కాచిరాజుగూడెం రోడ్డు మరమ్మత్తులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. జాబ్ మేళా స్థల పరిశీలనవైరా: ఈనెల 24న వైరాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సింగరేణి సంస్థ ఆధ్వర్యాన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈమేరకు కళాశాల మైదానాన్ని బుధవారం వైరా ఏసీపీ ఎం.ఏ.రెహమాన్ పరిశీలించారు. జాబ్మేళాకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరుకానుండగా, పెద్దసంఖ్యలో నిరుద్యోగులు పాల్గొనే అవకాశమున్నందున పార్కింగ్, ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సీఐ సాగర్, ఎస్ఐ రామారావు, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి, నాయకులు ఏదునూరి సీతారాములు పాల్గొన్నారు. ఇకనైనా నరమేథాన్ని ఆపాలిమాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు ఖమ్మంమయూరిసెంటర్: ఛత్తీస్గఢ్లో కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక బలగాలు మావోయిస్టు పార్టీ నేతలు, గెరిల్లా దళ సభ్యులు 80 మందిని ఎన్కౌంటర్ చేశాయని.. ఇకనైనా ఈ నరమేథాన్ని ఆపాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఏడాది కాలంలో 500 మందిని హతమార్చగా, ఇందులో అమాయకులు, సాధారణ ఆదీవాసీలు కూడా ఉన్నారని తెలిపారు. దేశ పౌరులు, ప్రజల తరఫునర నిలబడే వారిపై అంతర్గత యుద్ధం చేయడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఒక విధానంగా చేస్తోందని ఆరోపించారు. కాగా, ఎన్కౌంటర్ హత్యలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని న్యాయవిచారణ చేయాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. 108 అంబులెన్స్లో ప్రసవం మధిర: నిండు గర్భిణిని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే స్రసవించింది. మధిర మండలం మహాదేవపురానికి చెందిన పి.స్రవంతి(23)కి బుధవారం ఉద యం పురిటి నొప్పులు వస్తుండడంతో మధిర ఆస్పత్రికి తీసుకెళ్లగా ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో 108 ద్వారా ఖమ్మం తీసుకెళ్తుండగా బోనకల్ సమీపాన నొప్పులు ఎక్కవవడంతో ఆశ వర్కర్ సాయంతో ఈఎంటీ రామయ్య ఆమెకు ప్రసవం చేశారు. ఈక్రమంలో స్రవంతి ఆడపిల్లకు జన్మనివ్వగా, తల్లీబిడ్డలను మధిర ఆస్పత్రిలో చేర్చారు. ‘యంగ్ ఇండియా’ స్కూల్ స్థల పరిశీలనకల్లూరురూరల్: కల్లూరు మండలంలోని చెన్నూరులో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు సేకరించారు. సత్తుపల్లి నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను చెన్నూరులో నిర్మించేందుకు స్థలాన్ని గుర్తించారు. ఈ భూమిని కల్లూరు ఆర్డీఓ రాజేందర్గౌడ్ బుధవారం పరిశీలించారు. ప్రభుత్వ భూమికి ఇప్పటికే హద్దులు నిర్ధారించగా, మ్యాప్లను పరిశీలించి పూర్తి వివరాలు ఆరా తీశారు. తహసీల్దార్ పులి సాంబశివుడు, ఆర్ఐలు సుజాత, ఉమామహేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటకలో చోరీ.. వైరాలో రికవరీ
వైరా: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన చోరీకి సంబంధించి నిందితుడు వైరాలో పట్టుబడగా సొత్తు రికవరీ చేసి అక్కడి పోలీసులకు అప్పగించారు. ఈఏడాది ఫిబ్రవరి 12వ తేదీన వైరా లీలా సుందరయ్యనగర్లోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇక్కడ దొంగతనం చేసిన వారే అదే నెల 22 తేదీన కర్ణాటక రాష్ట్రంలోని చల్లెకిరే పోలీస్ స్టేషన్ పరిధిలోనూ చోరీకి పాల్పడ్డారు. ఈమేరకు వైరా సీఐ నూనావత్ సాగర్నాయక్ ఆధ్వర్యాన చేపట్టిన విచారణలో నిందితులు పట్టుబడగా వారి నుంచి బంగారాన్ని రికవరీ చేశారు. అందులో కర్ణాటకలో నమోదైన కేసుకు సంబంధించి 12తులాల బంగారు ఆభరణాలు, కారును చొల్ల కిలే ఏఎస్ఐ రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ వసంత్కుమార్కు వైరాలో సీఐ సాగర్ బుధవారం అందజేశారు. విద్యుదాఘాతంతో చిన్నారి మృతిఖమ్మం సిద్ధార్థనగర్లో విషాదం ఖమ్మంఅర్బన్: ఖమ్మం అల్లీపురం రోడ్డులోని సిద్ధార్థనగర్లో విద్యుత్ షాక్తో బాలిక మృతి చెందింది. కొణిజర్ల మండలానికి చెందిన రాచుమళ్ల రాజు – మేరీ దంపతులు అల్లీపురం రోడ్డులోని సిద్ధార్థనగర్ ప్రాంతంలోని ఓ భవనంలో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె టి.జాస్మిన్(11) బుధవారం ఉదయం ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు స్విచ్ బోర్డును తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరిన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఘటనపై మృతురాలి తల్లి మేరీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాశ్ తెలిపారు. కాగా, అంతసేపు కళ్ల ముందు ఆడుతూ తిరిగి కుమార్తె కన్నుమూయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ఆటో ఢీకొట్టడంతో మహిళ మృతి
తల్లాడ: తల్లాడ–కొత్తగూడెం రోడ్డులో తల్లాడ మండలం నరసింహరావుపేట వద్ద మోటార్ సైకిల్పై వెళ్తున్న మహిళను వెనక నుంచి ఆటో ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందింది. మధిర మండలం జాలిముడికి చెందిన జీడిమెట్ల సత్యవతి(67) అదే గ్రామానికి చెందిన సంగెపు రాములు మోటార్ సైకిల్పై జులూరుపాడు మండలం కాకర్లలోని తన కుమార్తె ఇంటికి బుధవారం వెళ్తోంది. ఈశ్రీక్రమాన నరసింహరావుపేట వద్ద ఆటో వెనుక నుంచి ఢీకొట్టగా సత్యవతి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే, రాములుకు గాయాలయ్యాయి. సత్యవతి కుమార్తె రాధ ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతున్న మహిళ..చింతకాని: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన కిలారి వెంకట్రావమ్మ(38) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈనేపథ్యాన 19వ తేదీన పురుగుల మందు తాగిన ఆమె కాసేపటికి విషయాన్ని భర్త వెంకటేశ్వరరెడ్డికి చెప్పింది. దీంతో చికిత్స నిమిత్తం ఖమ్మం, అక్కడి నుంచి హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఘటనపై ఆమె భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగుల్మీరా తెలిపారు. రైలు నుంచి జారి పడిన వ్యక్తి.. ఖమ్మంక్రైం: కదులుతున్న రైలు నుంచి జారిపడడంతో గుర్తు తెలియని వ్యక్తి(25) మృతి చెందాడు. పాపటిపల్లి స్టేషన్ సమీపాన బుధవారం ఆయన మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. అనంతరం అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు సహకారంతో మృతదేహన్ని మార్చురీకి తరలించగా, ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. చికిత్స పొందుతున్న హోంగార్డు.. ఖమ్మంక్రైం: పురుగుల మందు తాగిన హోంగార్డు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సత్తూరి అశోక్(37) ఖమ్మంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం సారథినగర్ వెళ్లే మార్గంలోని వంతెన వద్ద పురుగుల మందు తాగడంతో గమనించిన స్థానికులు ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి బంధువులు హైదరాబాద్కు తరతలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కాగా, అశోక్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని ఖమ్మం త్రీటౌన్ సీఐ మోహన్బాబు తెలిపారు. గాయపడిన వ్యక్తి.. తల్లాడ మండలం వెంకటగిరికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు వేల్పుల చిన్నప్ప(60) కుటుంబంతో సహా ఖమ్మం సంభానీ నగర్లో నివసిస్తున్నాడు. నగరంలోని రంగనాయకుల వద్ద కొద్దిరోజుల క్రితం సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడడంతో తీవ్రగాయాలయ్యాయి. అప్పటినుంచి చికిత్స చేయిస్తుండగా ఆయన బుధవారం మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ మోహన్బాబు తెలిపారు. -
ఆర్టిజన్లకు బదిలీల భయం
● కేటీపీఎస్లో అరకొర వేతనాలతో పనిచేస్తున్న కార్మికులు ● పర్మనెంట్ చేశాకే బదిలీ చేయాలని డిమాండ్ పాల్వంచ: కేటీపీఎస్ కర్మాగారంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు బదిలీల భయం పట్టుకుంది. ఇప్పటికే టీజీ జెన్కో పరిధిలోని పలు కర్మాగారాల్లో పనిచేస్తున్న అన్ని విభాగాలతోపాటు, ఏఈ నుంచి ఎస్ఈ వరకు బదిలీలు జరిగాయి. కొత్తగా ఏర్పాటైన వైటీపీఎస్, బీటీపీఎస్లలో ఉద్యోగ, కార్మికులు అవసరం ఉండటంతో అక్కడికే ఎక్కువ మందిని బదిలీలు చేశారు. ఈ క్రమంలో కేటీపీఎస్లో అదనంగా ఉన్న ఆర్టిజన్లకు సైతం స్థానచలనం కలిగించాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీలు సరికాదంటున్న కార్మికులు ఆర్టిజన్ కార్మికులు గ్రేడ్–1, 2 ,3, 4లుగా ఉన్నారు. స్కిల్ ఆధారంగా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. వీరు గతంలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేసిన క్రమంలో స్కిల్ను బట్టి ఆయా కంపెనీలు పనికి తగిన వేతనం ఇచ్చేవి. గత ప్రభుత్వం వీరిని ఆర్టిజన్లుగా తీసుకోవడం, కాంట్రాక్ట్ వ్యవస్థను తొలగించడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. తర్వాత కాలంలో పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకుంటారనే ఆశలో ఆర్టిజన్లు ఉన్నారు. కానీ పదేళ్లు గడుస్తున్నా ఉద్యోగుల మాదిరిగా వీరికి జెన్కో యాజమాన్యం సౌకర్యాలు కల్పించడంలేదు. పైగా అదనంగా ఉన్నారనే నెపంతో యాజమాన్యం ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలనే యోచన సరికాదనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నామని ఆర్టిజన్లు వాపోతున్నారు. ఉద్యోగులుగా తీసుకోవాలి ఇప్పటివరకు ఇతర కేడర్లలో అత్యధికంగా పదోన్నతులతోనే బదిలీలు చేపట్టారు. ఆర్టిజన్లు కేటీపీఎస్ 7వ దశలో 600 మంది, కేటీపీఎస్ 5,6 దశల్లో సుమారు 1,400 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. విద్యుత్ సంస్థలన్నింటిలో కలిపి సుమారు 24 వేల మంది ఉన్నారు. బదిలీ చేసే ముందు తమను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగులకు కల్పి స్తున్న సౌకర్యాలన్నీ తమకు కల్పించాలని ఆర్టిజన్లు కోరుతున్నారు. లేనిపక్షంలో బదిలీ యోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
చట్టాన్ని అతిక్రమిస్తే డీలర్లపై పీడీ యాక్ట్
కొణిజర్ల/కూసుమంచి: పత్తి సహా అన్ని పంటల విత్తనాలను అమ్మే డీలర్లు చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని, ఏ మాత్రం పొరపాట్లకు తావిచ్చినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య హెచ్చరించారు. కొణిజర్ల మండలం తనికెళ్ల రైతు వేదికలో వైరా డివిజన్ పరిధి డీలర్లకు, కూసుమంచి రైతు వేదికలో పాలేరు డివిజన్ డీలర్లకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన పీఓఎస్ మిషన్లు అందజేశాక మాట్లాడారు. వానాకాలం సీజన్కు సరిపడా పత్తి విత్తనాలు సిద్ధంగా ఉన్నందున, అమ్మే సమయాన బిల్లుపై అన్ని వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలాగే, ఏరోజుకా రోజు స్టాకు వివరాలను బోర్డులో ప్రదర్శించాలని తెలిపారు. ధరల్లో వ్యత్యాసం వచ్చినా, రైతులు కోరినవి కాకుండా ఇతర కంపెనీల విత్తనాలు అమ్మాలని యత్నించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏడీఏలు వాసవీరాణి, టి.కరుణశ్రీ, సరిత, ఎస్సైలు జగదీష్, దివ్య, ఏఓలు బాలాజీ, నరసింహారావు, అశోక్, మంజుఖాన్, అనిల్కుమార్, పవన్, వాణి, సీతారాంరెడ్డి, రాధా, ఉమానగేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య -
తొలకరి పలకరింపు
● రుతుపవనాల ముందస్తు ప్రభావం ● దుక్కులు, పచ్చిరొట్ట సాగుకు అనువైన వాతావరణం ● సన్నాహాల్లో నిమగ్నమైన అన్నదాతలు ఖమ్మంవ్యవసాయం: తొలకరికి వేళయింది. సాధారణంగా జూన్ 1నాటికి కేరళను తాకే నైరుతి రుతుపవనాలు 6, 7వ తేదీకల్లా తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తాయి. కానీ ఈసారి ముందుగానే రుతుపవనాలు రానున్నాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యాన.. ఆ ప్రభావం అప్పుడే మొదలైంది. దీంతో బుధవారం వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల రెండో వారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మూడో వారం నుంచి తగ్గుముఖం పట్టాయి. 40–45 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 32–37 డిగ్రీలకే పరిమితమవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా, మధ్యాహ్నం 12గంటల తర్వాత నుంచి జిల్లావ్యాప్తంగా జల్లులు మొదలయ్యాయి. బాణాపురంలో 20.3 మి.మీ.ల వరపాతం నమోదు కాగా, ఖమ్మం ఖానాపురంలో 16.3, కూసుమంచిలో 15.3, వైరా ఏఆర్ఎస్ వద్ద 8.8, ముదిగొండ, మధిరలలో 7.5, నాగులవంచలో 6.8, చింతకానిలో 6.3, మధిర ఏఆర్ఎస్ వద్ద 5.5, బచ్చోడు, తిరుమలాయపాలెంలో 5 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. సాగుకు అన్నదాతలు సమాయత్తం గత నెల, ఈనెల కురిసిన అకాల వర్షాలతో రైతులు దుక్కలు సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. యాసంగిలో సాగు చేసిన పత్తి, మిరప వ్యర్థాలను తొలగించి వర్షాలు అదునుగా ఉన్న చోట దుక్కులు దున్నుతున్నారు. ఇక జిల్లాలో ప్రధాన పంటలైన వరి 2.95 లక్షల ఎకరాలు, పత్తి 2.13 లక్షల ఎకరాలు, మిరప 71 వేల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు సమకూర్చడంపై దృష్టి సారించారు. ముందుగా పత్తి విత్తనాలు అందుబాటులోకి తీసుకొస్తుండగా, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ సైతం పెసర, మినుము, కంది వంటి విత్తనాలను సిద్ధం చేయడంలో నిమగ్నమైంది. ఇదే అదును ప్రస్తుత వాతావరణం దుక్కులు చేసుకోవడంతో పాటు పచ్చిరొట్ట విత్తనాలు వేసేందుకు అనుకూలిస్తుందని అధికారులు చెబుతున్నారు. మాగాణి భూముల్లో పిల్లి పెసర, జీలుగు వేసుకుని భూసారా న్ని పెంచుకోవచ్చు. విత్తనాభివృద్ధి సంస్థ 50 శాతం సబ్సిడీపై జీలుగు, జనుము పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే, మిరప సాగు భూముల్లో పెసర పంట సాగుకు ప్రస్తుతం అనువుగా ఉందని చెబుతున్నారు. దీంతో రైతులు విత్తనాలు సమకూర్చుకోవడంపై దృష్టిసారించారు.వ్యవసాయ పనులకు అనువుగా.. నైరుతి రుతుపవనాల ముందస్తు ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పుడు పంటల సాగుకు అనుకూలంగా దుక్కులు చేసుకోవచ్చు. పచ్చి రొట్ట విత్తనాలను వేసుకోవచ్చు. 60 – 70 మి.మీ.ల వర్షపాతం నమోదైతేనే విత్తనాలు వేసేందుకు అనువుగా ఉంటుంది. – డాక్టర్ రవికుమార్, కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా -
బడ్డీ.. బుడిబుడిగానే
యాప్ల్లో కానరాని మున్సిపాలిటీల వివరాలు ● పాతవి అప్డేట్ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం ● అప్డేట్, అవగాహనలో వెనుకబాటు ● కేఎంసీ మినహా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి అందరి చేతిలో ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన సెల్ఫోన్లు ఉన్నాయి. దీంతో మున్సిపాలిటీల పరిధిలో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సమాచారం చేరవేసేందుకు గాను ప్రభుత్వం సిటిజన్ బడ్డీ యాప్ను ప్రవేశపెట్టింది. ఏ సమస్యపై అయినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశముండగా, అనుమతుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాక ఫిర్యాదుల స్థితిగతులను ఎప్పటికప్పుడు చూడొచ్చు. కానీ ఈ యాప్ నిర్వహణ, వివరాల అప్డేట్తో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంలో జిల్లాలోని మున్సిపాలిటీల అధికారులు నిర్లిప్తత కనబరుస్తున్నారు. – సత్తుపల్లికమిషనర్తో పాటు సీడీఎంఏకు... సిటిజన్ బడ్డీ యాప్ ద్వారా మున్సిపాలిటీల పరిధిలో అనుమతి కోసం దరఖాస్తులు, సమస్యలపై ఫిర్యాదు చేయగానే సమాచారం సంబంధిత కమిషనర్తో పాటు సీడీఎంఏ(హైదరాబాద్)కు వెళ్తుంది. తద్వారా సమస్యల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 2019లో ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా అన్ని వివరాలను ఉన్నతాధికారులు పర్యవేక్షించే వీలుండడంతో మున్సిపాలిటీల అధికారులు పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తారనే నమ్మకం కలిగేది. కానీ జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మినహాయిస్తే పాత మున్సిపాలిటీలైన సత్తుపల్లి, మధిర, వైరాతో పాటు కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ వివరాల కోసం ఆరా తీస్తే పాత వివరాలే దర్శనమిస్తుండడం గమనార్హం. యాప్లో అప్డేట్ చేయడం, ఉపయోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం అధికారుల బాధ్యత అయినా నిర్లక్ష్యం కనబరుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో యాప్ ఉన్న విషయం చాలా మందికి తెలియకపోగా... చిన్నాపెద్ద సమస్య ఏదైనా మున్సిపల్ కార్యాలయాలకు వ్యయప్రయాసలకోర్చి రావాల్సి వస్తోంది. అక్కడ లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు, దరఖాస్తులు ఇచ్చినా ఎప్పటికి పరిష్కరిస్తారో స్పష్టత ఉండడం లేదు. ఇదే సమయాన పౌరసేవ పత్రం ఆధారంగా సమయం ప్రకారం సమస్యలు పరిష్కరించకపోగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఉద్యోగిపైనా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. పాలకవర్గాలు లేకున్నా.. కమిషనర్లు మారినా... జిల్లాలోని మున్సిపాలిటీ సమాచారం ఏ మేరకు అప్డేట్ చేశారోనని సిటిజన్ బడ్డీ యాప్లో పరిశీలిస్తే అన్నీ పాత వివరాలే కనిపిస్తున్నాయి. ఏడాది క్రితం వరకు అప్పుడప్పుడు కొందరు పలు విభాగాలపై ఫిర్యాదులు చేశారు. వీటిలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినా కొన్ని పరిష్కరించినట్లు, మరికొన్ని తిరస్కరించినట్లు అందులో పేర్కొన్నారు. ఇక సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసి నెలలు గడిచినా యాప్లో ఇంకా చైర్మన్, వైస్ చైర్మన్ల పేర్లు అలాగే ఉన్నాయి. ఇది పక్కన పెడితే సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ కె.నర్సింహా విధుల్లోకి చేరి రెండు నెలలు కావొస్తున్నా గతంలో పనిచేసిన రవిబాబు పేరు ఫొటో సహా ఉంది. వైరా కమిషనర్గా చింతా వేణు విధులు నిర్వర్తిస్తుండగా గతంలో పనిచేసిన ఎన్.వెంకటపతి రాజు పేరు, ఫొటో తొలగించలేదు. మధిర మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ ఎవరు పనిచేస్తున్నారో అసలు అప్డేటే చేయలేదు. కొత్తగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ వివరాలు ఏవీ కూడా యాప్లో పొందుపర్చలేదు. కేవలం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వివరాలు అన్నీ సక్రమంగా ఉండడం విశేషం.సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్గా ఎం.రవిబాబు విధులు నిర్వర్తిస్తున్నట్లుగా ఫొటోతో సహా సిటిజన్ బడ్డీ యాప్లో కనిపిస్తోంది. కానీ ఇక్కడ కమిషనర్గా కె.నర్సింహ విధుల్లో చేరి రెండు నెలలు దాటింది. ఇదొక్కటే కాక మిగతా మున్సిపాలిటీల వివరాలూ అప్డేట్ కాకపోగా.. నెలల క్రితమే గడువు ముగిసిన పాలకవర్గాల వివరాలు కూడా తొలగించకపోవడం గమనార్హం.వాట్సాప్కు పంపిస్తున్నారు.. చాలా మంది సమస్యలను వాట్సాప్కు పంపిస్తుండడంతో వెంటనే పరిష్కరిస్తున్నాం. సిటిజన్ బడ్డీ యాప్పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఫిర్యాదులు, దరఖాస్తులు నమోదు చేసేలా చూస్తాం. మా ఉద్యోగుల ఫోన్లలోనూ యాప్ డౌన్లోడ్ చేయించి ఫిర్యాదుల పరిశీలనకు ఆదేశాలు ఇస్తాం. అలాగే, యాప్లో వివరాలు కూడా అప్డేట్ చేస్తాం. – కె.నర్సింహ, మున్సిపల్ కమిషనర్, సత్తుపల్లి -
భూసర్వేతో సమస్యలకు శాశ్వత పరిష్కారం
● రైతులంతా సహకరిస్తే త్వరగా ప్రక్రియ పూర్తి ● ములుగుమాడు సదస్సులో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఎర్రుపాలెం: భూముల సమగ్ర సర్వే ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఎర్రుపాలెం మండలం ములుగుమాడు రెవెన్యూ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున రైతులు సహకరించాలని సూచించారు. గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వేను బుధవారం కలెక్టర్ తనిఖీ చేయడంతో పాటు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సదస్సులో మాట్లాడారు. 1930లో భూ సర్వే జరగగా, ఇప్పుడు భూభారతి చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు సర్వే మ్యాప్ జత చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా సర్వే చేయిస్తున్నామని తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే చేశాక, నివేదికలను గ్రామంలో ప్రదర్శిస్తామని.. ఆపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించాక శాశ్వత గ్రామ భూరికార్డు రూపొందిస్తామని కలెక్టర్ వివరించారు. తద్వారా నక్షా సిద్ధమవుతుందని, భూములు కుంటల్లోకి మారి కచ్చితమైన సరిహద్దులు వెల్లడవుతాయని తెలిపారు. ఈసమావేశంలో తహసీల్దార్ ఎం.ఉషాశారద, ఏడీ సర్వే శ్రీనివాసులు, ఆర్ఐ రవికుమార్, సర్వేయర్ రాజశేఖర్ తదితరులున్నారు. ఆడపిల్లే ఇంటికి మహాలక్ష్మి వైరారూరల్: ఆడపిల్ల పుడితే భారంగా కాకుండా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లు భావించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. వైరా మండలం రెబ్బవరంలో గుత్తా ఉషారాణి – సాయిప్రణీత్ దంపతులు ఇటీవల ఆడపిల్లకు జన్మనివ్వగా ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ కార్యక్రమంలో భాగంగా వారిని కలెక్టర్ సన్మానించి సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మాయిలు అన్నిరంగాల్లో అబ్బాయిలతో సమానంగా ఎదుగుతున్న నేపథ్యాన సమాన అవకాశాలు కల్పించాలని తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.రాంగోపాల్రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కస్తాల సత్యనారాయణ, వైరా తహసీల్దార్ కే.వీ.శ్రీనివాసరావు, ఎంపీడీఓ పి.సరస్వతి, ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఈనెల 31లోగా ఉపకార వేతనాలకు దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ కులాల్లో అర్హత కలిగిన విద్యార్థులు ఉపకార వేతనాల(ఫ్రెష్, రెన్యువల్) కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ సూచించారు. బ్యాంక్ అకౌంట్ను బ్రాంచ్లో ఆధార్ సీడింగ్ చేసుకున్నాక ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కాగా, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజి ప్రిన్సిపాళ్లు డిజిటల్ కీతో పాటు ఈ–పాస్ లాగిన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఆతర్వాత విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తులను ధ్రువీకరించి ఈ–పాస్ లాగిన్లోనే జిల్లా అధికారికి ఫార్వర్డ్ చేయాలని సూచించారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు ఖమ్మంక్రైం: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి 29వ తేదీ వరకు జరగనుండగా, పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని 38కేంద్రాల వద్ద ఉదయం 8నుంచి సాయంత్రం 6–30 గంటల వరకు సెక్షన్ 163 అమల్లో ఉంటుందని, ఈనేపథ్యాన కేంద్రాలకు 200మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు. అలాగే, సభలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఉరేగింపులకు అనుమతి ఉండదని తెలిపారు. కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సీపీ సూచించారు. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెంచాలి ఖమ్మంరూరల్: త్వరలో మొదలుకానున్న విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ ఎస్.సత్యనారాయణ సూచించారు. రూరల్ మండలం ఏదులాపురం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన శిక్షణను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల చేరిక శాతాన్ని నిలకడగా కొనసాగేలా ఉపాధ్యాయులు ఇప్పటినుంచే ప్రవేశాలపై దృష్టి సారించాలని తెలిపారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం పెరిగేలా బోధనలో మార్పులను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎంఈఓ శ్రీనివాస్, కోర్సు డైరెక్టర్లు పాల్గొన్నారు. పోలీసు ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ఖమ్మంక్రైం: గత ఏడాది డిసెంబర్లో నేలకొండపల్లి మండలంలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును ఛేదించడంలో కీలంగా వ్యవహరించిన పోలీసులకు ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా కూసుమంచి సీఐ టి.సంజీవ్, నేలకొండపల్లి కానిస్టేబుల్ ఎం.నాగరాజును డీజీపీ జితేందర్ అభినందించారు. హైదరాబాద్లో బుధవారం జరిగిన కార్యాలయంలో వారికి డీజీపీ ప్రశంసాపత్రాలు అందించగా, పోలీస్ కమిషనర్ సునీల్దత్ వారిని అభినందించారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఖమ్మం లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో డిఫెన్స్ కౌన్సిల్ ఉద్యోగాలకు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు అర్హులైన న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ ఒక ప్రకటనలో సూచించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా స్పీడ్ పోస్ట్ లేదా వ్యక్తిగతంగానైనా న్యాయ సేవాధికార సంస్థలో తమ దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. -
ఆ సొమ్ము రికవరీ ఎలా?
● మెప్మాలో పలువురు ఆర్పీల చేతివాటం ● సంఘాలు లేకుండానే రుణాల డ్రా ● పత్రాలు చూడకుండానే మంజూరుపై అనుమానాలుఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాలను అడ్డుపెట్టుకుని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మెప్మాలోని కొందరు రిసోర్స్ పర్సన్లు(ఆర్పీలు) బ్యాంకుల నుండి రుణాల పేరిట రూ.లక్షల్లో కొల్లగొట్టారు. మెప్మా అధికారుల అలసత్వం.. బ్యాంకర్ల నిర్లక్ష్యంతో లింకేజీ రుణాలను ఆర్పీలు సులువుగా తీసుకుని వెనకేసుకున్నారు. మహిళలకు తెలియకుండానే సదరు ఆర్పీలు సంఘాలను ఏర్పాటు చేసి, రుణాలు తీసుకోవడంతో వాటి రికవరీ బ్యాంకర్లకు తలనొప్పిగా మారింది. మూడేళ్ల నుంచి మహిళలకు నోటీసులు జారీ చేస్తున్నా తిరుగు సమాధానం లేకపోవడం, నోటీసులు అందుకున్న కొందరు అసలు తాము రుణాలే తీసుకోలేదని ఎదురుతిరగడంతో ఆర్పీల మోసం బయటపడింది. అయితే, రుణాలు కాజేసిన ఆర్పీలను మెప్మా అధికారులు తొలగించినప్పటికీ వారు తీసుకున్న సొమ్ము ఎలా రికవరీ చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. రెండు బ్యాంకుల నుండే.. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మహిళా సంఘాలకు పలు బ్యాంకుల నుండి లింకేజీ రుణాలు ఇస్తుంటారు. అయితే ఇద్దరు ఆర్పీలు అటు మహిళలు, ఇటు బ్యాంకర్లను మోసం చేసి కేవలం రెండు ప్రైవేట్ బ్యాంకుల నుంచే రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది. ఓ బ్యాంక్లో ఎనిమిది, మరో బ్యాంకులో ఆరు సంఘాల పేరిట ఒక్కో సంఘం తరఫున రూ.15 లక్షల వరకు రుణాలు డ్రా చేసినట్లు తెలిసింది. ఈ సమయంలో బ్యాంకర్లు డాక్యుమెంట్లు సక్రమంగా చూడకుండానే రుణాలు మంజూరు చేయడం గమనార్హం. కోవిడ్ కాలం 2021లో ఈ రుణాలను బ్యాంకర్లు మంజూరు చేయగా.. నాటి నుండి రికవరీ కోసం మహిళలకు నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ రుణాలతో సంబంధం లేని తమకు నోటీసులు రావడంతో పలువురు మహిళలు మెప్మా అధికారులు, బ్యాంకర్లను కలవగా గతేడాది ఆర్పీలను తొలగించినప్పటికీ రికవరీ మాత్రం మొదలుకాలేదు. మరోసారి నోటీసులు పలువురు మహిళలకు తీసుకున్న రుణాలు చెల్లించాలని ఇటీవల బ్యాంకర్లు మరోసారి నోటీసులు ఇవ్వడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై మెప్మా అధికారులు పట్టించుకోకపోడవంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తమ ప్రమేయం లేకుండా తప్పుడు పత్రాలతో రుణాలు కాజేసిన ఆర్పీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ఓ ఆర్పీని తీసుకురావడంతో పెద్దల మధ్య పంచాయితీ పెట్టారని కేఎంసీలో చర్చ జరుగుతోంది. అసలు ఎలా సాధ్యమైంది? మహిళా సంఘాల సభ్యులను చూడకుండా, వారితో సంతకాలు చేయించకుండా ఏ బ్యాంకు రుణాలను మంజూరు చేయదు. అలాంటిది రెండు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా ఆర్పీలు ఎలా రుణాలు తీసుకున్నారనే ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు. రెండేళ్లుగా ఈ మోసంపై చర్చ జరుగుతున్నా సమస్య మూలాలపై బ్యాంకర్లు, మెప్మా అధికారులు వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. ఆర్పీలు, బ్యాంకర్లకు ఉన్న సత్సంబంధాలతోనే రుణాలను కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం రెండు బ్యాంకుల్లోనే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికవరీ అయ్యేనా.. రుణం చెల్లించాలని బ్యాంకర్లు 140మంది మహిళలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇందులో కొందరికి పంపిన నోటీసులు తిరిగి వస్తుండగా.. మరికొందరు మాత్రం తీసుకుని తమకేం సంబంధం లేదని అధికారుల ఎదుట వాపోతున్నారు. ఇంకొందరికి జారీ చేసే నోటీసులు తిరిగి వస్తుండడంతో తప్పుడు చిరునామాలు పొందుపర్చినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు కారణాలు, బాధ్యులు ఎవరైనప్పటికీ రుణ నగదును రికవరీ ఎలా చేస్తారన్న ప్రశ్నకు సమాధానం మాత్రం ఏళ్లు గడుస్తున్నా లభించడం లేదు. -
భద్రాచలం.. కాషాయవర్ణం
● నేడు హనుమజ్జయంతి.. భద్రగిరికి బారులుదీరిన మాలధారులు ● శ్రీరామనవమి తరహాలో భక్తులు వస్తున్నా అరకొర ఏర్పాట్లతోనే సరిసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జై శ్రీరామ్ నామస్మరణలతో మార్మోగే భద్రగిరి వీధుల్లో ఇప్పు డు ‘రామభక్త హనుమాన్కీ జై’ నినాదాలు వినిపిస్తున్నాయి. హనుమాన్ జయంతిని గురువారం జరు పుకోనుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయస్వామి మాల ధరించిన భక్తులు భద్రాచలం చేరుతున్నారు. దీంతో పట్టణం, ఆలయ ప్రాంగణం, గోదావరి తీరం కాషాయవర్ణాన్ని సంతరించుకున్నాయి. దశాబ్ద కాలంగా.. భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం వందల ఏళ్లుగా అంగరంగ వైభవంగా సాగుతోంది. అలాగే ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, ఆ ముందురోజు తెప్పోత్సవం సైతం కనులపండువగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు భద్రాచలం వస్తుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అయితే దశాబ్ద కాలంగా హనుమాన్ జయంతి సందర్భంగా కూడా భక్తుల తాకిడి పెరుగుతోంది. అంజన్న భక్తులకు సవాలే.. శ్రీరామనవమి, ముక్కోటి పండుగల తరహాలోనే హనుమాన్ జయంతికి కూడా వేలాదిగా భక్తులు వస్తున్నా ఆ స్థాయిలో ఏర్పాట్లులేక ఇబ్బంది పడుతున్నారు. మాల ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా వచ్చే భక్తులకు సవాల్ ఎదురవుతోంది. ప్రణాళిక అవసరం.. వేలాదిగా భక్తులు వచ్చే హనుమాన్ జయంతి పర్వదినం రోజున ప్రత్యేక ఏర్పాట్లపై అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. అదనపు క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లతోనే సరిపెడుతుండగా ఇక్కట్లు ఎదురవుతున్నాయి. మాల విరమణ కోసం భద్రా చలం వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్నందున శబరిమల తరహాలో ఏర్పాట్లు చేయాల్సిన అవసరముంది. ఆలయంతో పాటు జిల్లా అధికా రులు ఈ విషయమై దృష్టి సారించి భక్తులు ఇబ్బంది పడకుండా డార్మిటరీలు, తాగునీరు వంటి అదనపు సౌకర్యాలు, మాల విరమణకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, భజన మందిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే, శ్రీరామ నవమి తరహాలోనే ఈ ఏర్పాట్లపై మంత్రుల స్థాయిలో సమీక్ష జరపాలనే సూచనలు వస్తున్నాయి. -
జల రవాణాపై దృష్టి!
గతంలో రాజమండ్రి, భద్రాచలం మీదుగా.. కాకినాడ పోర్టు నుంచి బొగ్గును రైలు మార్గంలో తెలంగాణకు తీసుకొస్తుండగా తెలంగాణ బియ్యాన్ని రోడ్డు మార్గంలో భద్రాద్రి జిల్లా మీదుగానే కాకినాడకు తరలిస్తున్నారు. గోదావరిలో జలరవాణా అందుబాటులోకి వస్తే కాకినాడ పోర్టు నుంచి రాజమండ్రి మీదుగా తెలంగాణలోని భద్రాచలం వరకు సరుకు రవాణాకు అవకాశం ఉంది. గతంలో కాకినాడ – రాజమండ్రి – భద్రాచలం – చర్ల – కాళేశ్వరం (సిరోంచ, మహారాష్ట్ర)ల మధ్య బ్రిటీష్ / నిజాం జమానాలో జల రవాణా నిర్విరామంగా జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత రోడ్డు మార్గాలు విరివిగా అందుబాటులోకి రావడంతో క్రమంగా జలరవాణా కనుమరుగైంది. బరాజ్ల అండతో గోదావరిలో ఏడాది పొడవునా ఏపీలోని వీఆర్పురం మండలం పోచవరం నుంచి రాజమండ్రి వరకు పడవలు తిరిగేంత నీటి మట్టం ఉంటుంది. ఈ స్ట్రెచ్లో పర్యాటకప్రాంతమైన పాపికొండలకు బోట్లు నిత్యం నడుస్తూనే ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయి తే, రాజమండ్రి–భద్రాచలం–దుమ్ముగూడెం ఆనకట్ట వరకు జల రవాణాకు అనుకూలమైన నీటిమట్టం ఉండే అవకాశముంది. ఆ పైన సీతమ్మ సాగర్ (నిర్మాణంలో ఉంది), సమ్మక్క సాగర్ బరాజ్లతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా లక్ష్మి, పార్వతి, సరస్వతి బరాజ్లు ఉన్నాయి. వీటికిపైన మంచిర్యా ల–గోదావరిఖని వంటి పారిశ్రామిక ప్రాంతాల నడుమ శ్రీపాదసాగర్ బరాజ్ ఉంది. దీంతో జలరవాణాకు కావాల్సినంత నీటి మట్టం గోదావరిలో అందుబాటులో ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాటర్ వేస్ జలరవాణా అభివృద్ధిపై కేంద్రం నుంచి గతంలో అనేక ప్రకటనలు వచ్చాయి. 2008లో యూపీఏ హయాంలో నేషనల్ వాటర్ వేస్ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో వాటర్ వేస్–4లో భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు 171కి.మీ జల రవా ణా మార్గాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం రోడ్, రైల్, రివర్(ఆర్ఆర్ఆర్) ట్రాన్స్పోర్ట్ పేరుతో ఇదే పథకానికి కొత్తరూపు ఇచ్చింది. ఇందులో మహారాష్ట్రలో నాసిక్ నుంచి బంగాళాఖా తం వరకు గోదావరిలో జలరవాణాకు గల అవకాశాలు పరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేర కు వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీస్ సర్వీసెస్ (వాప్కోస్) ఆధ్వర్యంలో పలుమార్లు సర్వేలు కూడా జరిగాయి. ప్రతికూలతలు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్ల భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సీతమ్మసాగర్ బరాజ్కు ఇంకా అనుమతులు రాలేదు. వీటిపై స్పష్టత వచ్చాకే జల రవాణాపై అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది. లేదంటే యూపీఏ, ఎన్డీఏ సర్కార్ల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటనలు, సర్వేలతో సరిపెట్టే అవకాశముంది. ఒక వేళ ఎగువ ప్రాంతాలను మినహాయించి కాకినాడ – రాజమండ్రి – భద్రాచలం వరకే జలరవాణాకు గల అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటే కొంతమేరకు అడుగులు ముందుకు పడే అవకాశముంది. అయినా భద్రాచలంలో స్థల లభ్యతతోపాటు భద్రాచలం – మల్కన్గిరి రైల్వేలైనులో పాండురంగాపురం – సారపాక సెక్షన్ల మధ్య రైలు మార్గాన్ని త్వరితగతిన నిర్మించాల్సి ఉంటుంది. గోదావరిలో జలరవాణా మొదలైతే తెలంగాణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరింత కీలకంగా మారే అవకాశముంది. స్థానికులకు వ్యాపార, ఉపాధి రంగాల్లో అవకాశాలు మరింతగా మెరుగవుతాయి. చవక రవాణా రోడ్డు, రైలు మార్గాలతో పోల్చితే జలరవాణా చవక. అందువల్లే సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో దూసుకుపోతుంటాయి. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం లోటుగా ఉంది. దీంతో రాష్ట్ర విభజన తర్వాత డ్రైపోర్టులు అభివృద్ధి చేయాలని నిర్ణయించినా.. ఆశించిన పురోగతి రాలేదు. దీంతో జలరవాణాకు గల అవకాశాలను పరిశీలించే పనిలో ప్రభుత్వం ఉంది. ఇతర దేశాల నుంచి చౌకగా లభించే బొగ్గును కాకినాడ నుంచి తెలంగాణలో ఉన్న విద్యుత్ సంస్థలకు సరఫరా చేయడం, తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి జలరవాణా ఉపయోగపడుతుందని అంచనా వేశారు. కృష్ణా నదిలో జలరవాణా అందుబాటులోకి వస్తే దాని తీర ప్రాంతంలో ఉన్న సిమెంట్ పరిశ్రమలకు మేలు జరుగుతుందనే అంచనాలున్నాయి.గోదావరి నదిలో జల రవాణాకు గల అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇటీవల ప్రకటించారు. ఇది కార్యరూపం దాల్చితే జిల్లాలో ఉపాధి, వాణిజ్య రంగాలు మెరుగుపడే అవకాశం ఉంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం జలమార్గంపై అధ్యయనం చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటన గతంలో గోదావరిలో రాజమండ్రి– భద్రాచలం– సిరోంచల మధ్య రవాణా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనూ రాజమండ్రి–భద్రాచలం స్ట్రెచ్ -
అత్యవసర సర్వీసులపై అవగాహన
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం సీహెచ్సీకి ఇటీవల 108, 102 నియోనేటల్ అంబులెన్స్ సేవలు మంజూరయ్యాయి. ఆయా వాహనాల్లో ఉన్న అత్యాధునిక పరికరాల వినియోగంపై అత్యవసర సేవల జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. సీహెచ్సీకి మంగళవారం వచ్చిన ఆయన అంబులెన్స్ల్లోని సౌకర్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృపా ఉషశ్రీ ఉద్యోగులు దుర్గాప్రసాద్, శ్రీనివాస్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు చికిత్స దైవసేవతో సమానం ఖమ్మంవైద్యవిభాగం: వయోవృద్ధులకు చికిత్స అందించడాన్ని దైవానికే సేవ చేసినట్లుగా భావించాలని డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి తెలిపారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని వయో వృద్ధుల కేర్ సెంటర్(పాలియేటివ్ కేర్ సెంటర్), కేన్సర్ వార్డులను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల కేంద్రంలో ఉన్న వారి వివరాలు తెలుసుకున్నాక వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. జీవిత చరమాంకంలో ఉన్న వయోవృద్ధుల కోసం ఏర్పాటుచేసిన పాలియేటివ్ కేర్ సెంటర్తో మెరుగైన సేవలందించాలని సూచించారు. ఆతర్వాత డాక్టర్ ప్రేమలత, ఉద్యోగులతో మాట్లాడిన డీఎంహెచ్ఓ రికార్డులు పరిశీలించారు. అనంతరం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్లో పరీక్షల వివరాలు ఆరా తీశారు. 8,976 మందికి రూ.39.95కోట్ల బోనస్ 1,60,853.040 మె.టన్నుల ధాన్యం కొనుగోళ్లు ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఈ ఏడాది(2024–25) రబీ సీజన్లో ఇప్పటి వరకు రైతుల నుంచి 1,60,853.040 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 21,505 రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించారు. ఇందులో రూ.371.70కోట్లకు గాను రూ.309.82 కోట్ల బిల్లులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. గతేడాది రబీ సీజన్లో 21,884.360 మె.టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా... ఈ ఏడాది ఇప్పటి వరకు 1,60,853.040 మె.టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ వెల్లడించారు. అలాగే, సన్నధాన్యానికి ప్రభుత్వం ప్రకటించినట్లుగా క్వింటాకు రూ.500 చొప్పున 8,976మంది రైతులకు రూ.39.95కోట్ల బోనస్ జమ అయిందని తెలిపారు. మొత్తంగా సన్నధాన్యం 84,601.240 మె. టన్నులు సేకరించగా, 69,893.520 మె.టన్నుల ధాన్యానికి బోనస్ అందని వెల్లడించారు. ఇక కామన్ గ్రేడ్ ధాన్యం 71,706.040 మె. టన్నులు కొనుగోలు చేశామని డీసీఎస్ఓ వివరించారు. కాగా, జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు, మిల్లులను ఆయన మంగళవారం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. మూడు నెలల బియ్యం ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం వచ్చే నెలలో ఒకేసారి లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు డీసీఎస్ఓ చందన్కుమార్ తెలిపారు. జిల్లాలో 748 రేషన్ షాప్లు, 4,11,202 కార్డులు ఉండగా, 11,30,169మంది లబ్ధిదారులు ఉన్నారని పేర్కొన్నారు. వీరికి ప్రతీనెల 7,618.457 మె.టన్నుల బియ్యం అవసరం ఉండగా, సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీఎస్ఓ తెలిపారు. -
నిర్మాణరంగంలో కుదుపులు
మధిర: భారీగా పెరిగిన ఇనుము, సిమెంట్, ఇసుక ధరలతో భవన నిర్మాణ రంగం కుదేలవుతోంది. సొంతింటి కల నెరవేర్చుకోవాలని పేద, మధ్యతరగతి ప్రజలు రూపాయి, రూపాయి కూడబెట్టేలోగా ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వారి కల నెరవేరే పరిస్థితి కానరావడం లేదు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తాయని ఆశించినా నిరాశే ఎదురైంది. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నప్పటికీ వివిధ దశల్లో బిల్లులు మంజూరు చేయనుండడంతో ఆ పెట్టుబడి ఎలా సమకూర్చుకోవాలో తెలియక పేదలు సతమతమవుతున్నారు. ఫలితంగా నిర్మాణ రంగం నత్తనడకన సాగుతుండడంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సీజన్లోనే ౖపైపెకి... సాధారణంగా సన్న, చిన్నకారు రైతులు, పేద ప్రజలు వ్యవసాయ పనులు పూర్తయ్యాక వేసవికాలంలో ఇళ్ల నిర్మాణం మొదలుపెడతారు. కానీ జనవరి నుంచి మార్చి వరకు తగ్గుతూ వచ్చిన సిమెంట్ ధర ఏప్రిల్కల్లా అమాంతం పెరిగింది. ఒక్కో సిమెంట్ బస్తా ధర కంపెనీల వారీగా రూ.350 నుంచి రూ.370.. కొన్నిసార్లు అంతకు మించి పలుకుతోంది. అలాగే, ఇనుము కూడా గత మూడు నెలలుగా తగ్గుతూ వచ్చి ఏప్రిల్ మొదటివారంలో భారీగా పెరిగింది. ఇక ట్రాక్టర్ ట్రక్కు ఇసుక ధర రూ.5 వేలకు పైగానే పలుకుతోంది. ఈనేపథ్యాన ఎక్కువ మంది ఇళ్ల నిర్మాణానికి వెనుకడుగు వేస్తుండగా, ఇంకొందరు మధ్యలోనే వదిలేస్తున్నారు. ఈ ప్రభావం మేసీ్త్రలు, కూలీలతో పాటు రాడ్ బెండింగ్, విద్యుత్, మార్బుల్, ప్లంబర్, పెయింటర్లు, కార్పెంటర్లు.. ఇలా అన్ని రంగాల కార్మికులపై పడుతోంది. ఇప్పటికే పెరిగిన సుతారీ మేసీ్త్రలు, కూలీల రేట్లు, ఇసుక ధరలతో పలువురు అపార్ట్మెంట్లు, ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదు. గత ఏడాది చదరపు అడుగు నిర్మాణానికి రూ.3వేల వ్యయం కాగా, ఇప్పుడు అది రూ.3,500కు చేరడంతో అపార్ట్మెంట్లలో ప్లాట్ల అమ్మకం కూడా ముందుకు సాగడం లేదని బిల్డర్లు చెబుతున్నారు. పని లేక ఇక్కట్లు పెరిగిన ఇనుము, సిమెంట్ ధరలతో నిర్మాణరంగం నత్తనడకన సాగుతోంది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన వ్యాపారాలు సైతం పడిపోయాయి. ఒక్కో అద్దె చెల్లింపు, హమాలీలకు సరిపడా వ్యాపారం కూడా సాగడం లేదని చెబుతున్నారు. అలాగే, కార్మికులకు ప్రతిరోజు పనులు దొరకక పస్తులు ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. భారీగా పెరిగిన ఇనుము, సిమెంట్ ధరలు పేద, మధ్య తరగతికి దూరమవుతున్న సొంతింటి కల ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకూ అవే ఇక్కట్లు మరోపక్క ఉపాధి కోల్పోతున్న నిర్మాణరంగ కార్మికులు ధరల్లో పెరుగుదల ఇలా.. నెల సిమెంట్ ధర ఇనుము ఒక్కో బస్తా టన్ను (రూ.ల్లో) (రూ.ల్లో) జనవరి 290 58,000 ఫిబ్రవరి 280 57,000 మార్చి 260 56,000 ఏప్రిల్ 350 69,000 మే 370 69,000నిర్మాణాలు తగ్గిపోయాయి ఇనుము, సిమెంట్ ధరలు పెరగడంతో నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. గతంలో చేతినిండా పని ఉండేది. తాపీ మేసీ్త్రల కింద పని చేసేందుకు ఎందరు కూలీలు వచ్చినా సరిపోయేది కాదు. కానీ ఇప్పుడు అందరికీ పని కల్పించలేక తరచుగా కొందరు కూలీలను వెనక్కి పంపాల్సి వస్తోంది. – కత్తి జానయ్య, పెద్ద తాపీ మేసీ్త్రల సంఘం అధ్యక్షులు, మధిర -
ఎయిడ్స్ నియంత్రణకు పటిష్ట కార్యాచరణ
● సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలి ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ఖమ్మంవైద్యవిభాగం: హెచ్ఐవీ ఎయిడ్స్ను రూపుమాపేలా తీసుకోవాల్సిన చర్యలపై పటిష్ట కార్యాచరణ అమలుచేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాప్తి, తద్వారా నష్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. హైరిస్క్ ఉన్న వర్గాల్లో పెళ్లికి ముందు పరీక్షలు చేసుకునేలా పర్యవేక్షించాలని చెప్పారు. ఆసక్తి ఉన్న వారితో వీడియోలు రూపొందించి గ్రామాల వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం చేయాలని తెలిపారు. అలాగే, హెల్ప్లైన్ 1097 నంబర్పై విస్తృత ప్రాచుర్యం కల్పించాలని సూచించారు. అంతేకాక బాధితులు తప్పనిసరి చికిత్స తీసుకునేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ బి.కళావతిబాయి, అడిషనల్ డీఎంహెచ్ఓ పి.వెంకటరమణ, ఏఆర్టీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పి.మోహన్రావు, డేటా మేనేజర్ పి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకు విత్తనాల విక్రయం ఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సీజన్ సమీపిస్తున్నందున డీలర్లు విత్తన విక్రయాల్లో నింబధనలు తప్పక పాటించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో విత్తన విక్రయాలు, ఈ–పాస్ యంత్రాల వినియోగంపై నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యాన వ్యవసాయాధికారులు, డీలర్లకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రాంతాల వారీగా డిమాండ్ మేరకు విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలని, రైతులకు పూర్తి వివరాలతో రశీదు ఇవ్వడమే కాక నిల్వలపై రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. లైసెన్సు లేకుండా విక్రయించినా, రికార్డులు సరిగ్గా లేకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత సీజన్లో జిల్లాలో 100 మంది రైతులు నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయినందున ఆ పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాభివృద్ధి అధికారి ఎం.వీ..మధుసూదన్, అధికారులు వాసవీరాణి, కొంగర వెంకటేశ్వరరావు, విజయచంద్ర, సరిత తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎరువుల విక్రయాల్లో వినియోగానికి ఎన్ఎఫ్ఎల్ కంపెనీ సమకూర్చిన ఈ–పాస్(ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లను కలెక్టర్ డీలర్లకు అందించారు. ఒక్కో యంత్రం విలువ రూ.20 వేల వరకు ఉండగా, జిల్లాలోని 700 మంది రిటైల్ డీలర్లకు అందించనున్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంపై దృష్టి
ఖమ్మం మయూరిసెంటర్: జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంపై అధికా రులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 735 నమోదు కాగా, 562 కేసుల్లో తీర్పు వెలువడిందని తెలిపారు. అలాగే, కేసుల్లో బాధితులకు రూ. 11.16 కోట్లకు పైగా పరిహారం మంజూరైందని వెల్లడించారు. మిగతా కేసుల విచారణ, పరిష్కారంలో అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులను సమీక్షిస్తూ త్వరగా పరిష్కరించాలని తెలిపారు. అలాగే, చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, బాధితులకు పరి హారం పెంపుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈసమావేశంలో అదనపు డీసీపీ నరేష్కుమార్, వివిధశాఖల అధికారులు కె.సత్యనారాయణ, ఎన్. విజయలక్ష్మి, ఏ.శ్రీనివాస్, జి.నర్సింహారావు, ఎల్. రాజేందర్ గౌడ్, రెహమాన్, ఏ.రఘు, తిరుపతిరెడ్డి, కమిటీ సభ్యులు గుంతేటి వీరభద్రయ్య, జె.దాస్ మహరాజ్, తూరుగంటి అంజయ్య, కీసర రాంబాబు, అన్నం శ్రీనివాసరావు, మనికంటి వెంకట్, కలెక్టరేట్ ఉద్యోగి సీహెచ్.స్వామి పాల్గొన్నారు. -
ఉత్పత్తుల విక్రయానికి వేదికగా మహిళా మార్ట్
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా స్వయం సంఘాల్లోని సభ్యులు రూపొందించిన వస్తువులను అమ్ముకునేలా మహిళా మార్ట్ వేదిక కానుందని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. పలు వురు సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను మంగళవారం కేఎంసీ కార్యాలయంలో మెప్మా అధికారుల సమక్షాన ప్రదర్శించారు. ఆయా సామగ్రిని పరిశీలించిన మేయర్ మాట్లాడుతున్న నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేస్తున్న మహిళలకు మార్ట్ ప్రారంభంతో మెరుగైన ధర లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ ఎస్.సుజాత, టీఎంసీ జి.సుజాత, సీఓలు పాల్గొన్నారు. రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు కల్లూరురూరల్: కల్లూరు మండలంలోని 33రేషన్ షాపుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు మంగళవారం మూడు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంతో పాటు గతంలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం నిల్వలకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. ఈ మేరకు నివేదికలను జిల్లా అధికారులకు పంపించి నట్లు తెలిపారు. తనిఖీల్లో సివిల్ సప్లయీస్ డీటీలు సత్యనారాయణ, నాగలక్ష్మి, వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్ పాల్గొన్నారు. అండర్పాస్ వద్ద రైతుల ధర్నావైరారూరల్: ఖమ్మం – దేవరపల్లి హైవేలో భాగంగా వైరా మండలం కేజీ సిరిపురం సమీపాన అండర్పాస్ను తక్కువ ఎత్తుతో నిర్మించడంపై రైతులు నిరసన తెలిపారు. ఎత్తు తక్కువగా ఉండడంతో ధాన్యం, గడ్డి ట్రాక్టర్లు, వరి కోత మిషన్ల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతుందని వాపోయారు. ఈమేరకు మంగళవారం పలువురు రైతులు అండర్పాస్ వద్ద ధర్నా చేశారు. వంతెన నిర్మాణ సమయంలోనే కాంట్రాక్టర్, మేనేజర్కు సమస్యను వివరించి నా ఫలితం కానరాలేదని పేర్కొన్నారు. కాగా, రైతుల ధర్నా సమాచారం అందుకున్న హైవే మేనేజర్ గుత్తి శివశంకర్ చేరుకుని ఈనెల 25వ తేదీ నాటికి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో అయినాల కనకరత్నం, నారపోగు వెంకటి, ఇనపనూరి జయరావు, పింగళి లక్ష్మ య్య, పైడిపల్లి శేషగిరి, నారపోగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలినేలకొండపల్లి: గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులు సత్తా చాటుతూ జాతీయ స్థాయికి ఎదగాలని నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు ఆకాంక్షించారు. మండలంలోని మంగాపురంతండాలో ఇంటి ముత్యాలమ్మ తల్లి పండుగ సందర్భంగా ఏపీ–తెలంగాణలోని మూడు జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోటీలతో యువతలో పోటీతత్వం, స్నేహసంబంధాలు పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, రాయపూడి నవీన్, హనుమంతరావు, నల్లాని మల్లికార్జున్రావు, ఎం.వెంకన్న, కడియాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. క్రిమినల్ కేసు కొట్టివేతఖమ్మంలీగల్: జిల్లాలోని చింతకానికి చెందిన సింగారపు కార్తీక్ ఆత్మహత్య ఘటనలో ఇసారం సిద్ధార్థ, వెల్లంకి సుప్రియపై నమోదైన అభియోగాన్ని కొట్టివేస్తూ ఖమ్మం మొదటి అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి వి.శివరంజని మంగళవారం తీర్పు చెప్పారు. 2021 ఆగస్ట్ 20న కార్తీక్ ఆత్మహత్య చేసుకోగా, అందుకు సిద్ధార్థ, సుప్రియ కారణమని ఆయన తల్లి స్వరూపరాణి ఫిర్యాదు చేసింది. దీంతోఆత్మహత్య ప్రేరేపిత కేసు నమోదు చేసినపోలీసులు కోర్టులో అభియోగపత్రం దాఖలుచేశారు. సాక్ష్యాధారాలు, ఇరుపక్షాల వాదనలను పరిశీలించాక నిందితులపై అభియోగం రుజువు కాకపోవడంతో కేసు కొట్టివేస్తూ చిన న్యాయాధికారి తీర్పు చెప్పారు. కాగా, నిందితుల తరఫున న్యాయవాది కొండపల్లి శ్రీనివాస్చౌదరి వాదించారు. -
సర్వే సమస్యకు చెక్ పెట్టేలా..
● నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వ చర్యలు ● భూభారతి చట్టం అమలుతో పెరగనున్న అవసరాలు ● లైసెన్స్డ్ సర్వేయర్లుగా గుర్తింపుతో యవతకు ఉపాధి ● ఉమ్మడి జిల్లాలో 1,073 మంది నుంచి దరఖాస్తులు చుంచుపల్లి: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో సర్వే మ్యాప్ను తప్పనిసరి చేసింది. ప్రతీ వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూ నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టంలో ప్రత్యేక క్లాజ్ను పొందుపర్చింది. ఈ నేపథ్యంలో సర్వేయర్ల అవసరం పెరగనుండగా, శిక్షణ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు కొంత మేర ఉపాధి లభించే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి 17 వరకు మీ సేవా కేంద్రాల దరఖాస్తులు స్వీకరించగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,073 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో 647 దరఖాస్తులు రాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 426 మంది దరఖాస్తులు వచ్చాయి. వీరందరికీ భూ సర్వేపై శిక్షణ ఇచ్చి, లైసెన్స్డ్ సర్వేయర్లుగా గుర్తించనున్నారు. వీరు భూమి రిజిస్ట్రేషన్కు ముందు స్కెచ్ తయారు చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం ప్రభుత్వ సర్వేయర్లు పూర్తిస్థాయిలో పరిశీలించాక సంబంధిత జిల్లా అధికారి ఆమోదముద్ర వేస్తారు. ఉమ్మడి జిల్లాలోని 44 మండలాల్లో ప్రస్తుతం 37 మంది సర్వేయర్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీనివల్ల భూముల సర్వేకు నెలల తరబడి రైతులు కార్యాలయాల చుట్టు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేయనుండటంతో సర్వేల్లో జాప్యం తగ్గే అవకాశం ఉంటుంది. 50 రోజులపాటు శిక్షణ దరఖాస్తులను పరిశీలించాక అభ్యర్థులను ఎంపిక చేసి, ఈ నెల 26 నుంచి 50 రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా నిజాం పాలనలో మాత్రమే సెత్వార్ పేరిట సర్వే నిర్వహించారు. ఆ సమయంలో రెవెన్యూ గ్రామాల వారీగా పట్టాదారుల సమాచారంతో ఖాస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. రెవెన్యూశాఖ దానినే ప్రామాణికంగా పరిగణిస్తూ వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాస్రా పహాణీ ఆధారంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. వీటి శాశ్వత పరిష్కారానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 26 నుంచి శిక్షణ.. లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,073 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 50 రోజులపాటు మూడు దశల్లో అవగాహన కల్పిస్తాం. – శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఉమ్మడి జిల్లాలో వచ్చిన దరఖాస్తులు కేటగిరీ ఖమ్మం భద్రాద్రి మొత్తం ఓసీ 26 05 31బీసీ 232 69 301ఎస్సీ 182 73 255ఎస్టీ 207 279 486మొత్తం 647 426 1,073 -
దాడులకు పాల్పడడం హేయమైన చర్య
ఖమ్మం మామిళ్లగూడెం: ఆపరేషన్ సిందూర్ విజ యవంతం సందర్భంగా సైనికుల త్యాగాలు, కేంద్రప్రభుత్వ ఘనతను కీర్తిస్తూ ఖమ్మంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తుంటే విచ్ఛిన్నం చేసేలా కొందరు దాడులకు పాల్పడటం గర్హనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిష్టను పెంచిన జవాన్ల వీరోచిత పోరాటాన్ని కొనియాడుతూ చేపట్టిన ర్యాలీకి మద్దతు తెలపాల్సింది పోయి మత విద్వేషాలను రెచ్చగొట్టడం బాధాకరమని తెలి పారు. ఈమేరకు జాతీయవాదులపై దాడి చేసిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈసమావేశంలో నాయకులు నున్నా రవికుమార్, ఈ.వీ.రమేష్, సన్నే ఉదయ్ప్రతాప్, అల్లిక అంజయ్య, నంబూరి రామలింగేశ్వరరావు, రవిరాథోడ్, బెనర్జీ, నల్లగట్టు ప్రవీణ్కుమార్, ధనియాకుల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. మద్దతుగా నిలవాలి ఎవరు కూడా భావోద్వేగాలకు లోనుకాకుండా దేశ భద్రతకు మద్దతుగా నిలబడాలని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ ర్యాలీలను దేశభక్తికి నిదర్శనంగా చూడాలని కోరారు. ఖమ్మంలో ర్యాలీ సందర్భంగా జరిగిన చిన్నపాటి ఘటనలను రాజకీయం చేయకుండా, బాధ్యతగా పరిశీలించి తప్పులను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. -
ఇద్దరు ఆపరేటర్లపై వేటు..
శిక్షణకు ఉపాధ్యాయుల హాజరు తప్పనిసరి● కేఎంసీలో డిజిటల్ కీ దుర్వినియోగంతో చర్యలు ● రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులునేలకొండపల్లి/ముదిగొండ: ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా విద్యాశాఖాధికారి సామినేని సత్యనారాయణ స్పష్టం చేశారు. నేలకొండపల్లి, ముదిగొండ మండల కేంద్రాల్లో ఏర్పాటుచేసిన శిక్షణణా తరగతులను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణకు ఉపాధ్యాయులు కచ్చితంగా రావాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందేలా జిల్లాలో 2,500 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పా రు. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచేలా బోధిస్తూ, బడిబాటలో ఎక్కువ మందిని చేర్పించేందుకు కృషి చేయాలని డీఈఓ సూచించారు. ఉపాధ్యాయ వృత్తి సమాజంలో గౌరవాన్ని పెంచుతుందని తెలిపారు. కాగా, పాఠశాల ప్రారంభం రోజే నోట్ బుక్స్, టెక్స్ బుక్స్, యూనిఫాం అందించనున్నట్లు డీఈఓ వెల్లడించారు. ఈకార్యక్రమాల్లో ఎంఈఓలు బి.చలపతిరావు, రమణయ్యతో పాటు ఇటిక్యాల సురేష్, టి.వెంగళరావు, టి.గురవయ్య, కె.గోవిందరావు, మేరే వీరబాబు, కల్పన తదితరులు పాల్గొన్నారు.ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థలో కీలక విభాగమైన రెవెన్యూ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ల అక్రమాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల అందిన ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యాన విచారణ అనంతరం ఇద్దరు కంప్యూటర్ అపరేటర్లను అధికారులు తొలగించినట్లు తెలిసింది. ఇంటి నంబర్ల కేటాయింపులో అధికారులు తిరస్కరించిన ఫైళ్లకు ఆన్లైన్లో అనుమతులు జారీ చేయడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. రెవెన్యూ విభాగం అధికారులతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లపై అనేక ఆరోపణలు ఉన్నా ఇన్నాళ్లు చర్యలు తీసుకోలేదు. ఎట్టకేలకు అధికారులు కొరడా ఝుళిపిస్తూనే, రెవెన్యూ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పలు అక్రమాలు గుర్తింపు రెవెన్యూ విభాగం అధికారులు, ఆపరేటర్లపై వస్తున్న ఆరోపణల నేపథ్యాన అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా కొన్ని రోజులుగా విచారణ చేశారు. ఇంటి నంబర్ల కేటాయింపు, వీఎల్టీ ట్యాక్సులు, కోర్టు కేసులో ఉన్న ఫైళ్లకు మ్యుటేషన్లు చేయడం తదితర అక్రమాలు నిజమేనని తేలడమే కాక డిజిటల్ కీ దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఆపరేటర్లు సందీప్, సునీతను సర్వీస్ తొలగించేలా అసిస్టెంట్ కమిషన్ సిపారసు చేశారు. అనంతరం మదర్ థెరిస్సా కంప్యూటర్ ఆపరేటర్ల గ్రూప్ లీడర్లు, సభ్యులు మంగళవారం తీర్మానం చేసి సమర్పించడంతో వీరిద్దరిని తొలగించారు. షోకాజ్ నోటీసులు డిజిటల్ కీలు దుర్వినియోగం, విభాగంలో అక్రమాలు జరుగుతున్నా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నిర్లక్ష్యంగా ఉండడంపై కమిషనర్ సీరియస్ అయినట్లు తెలిసింది. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఇద్దరు ఆర్ఐలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అంతేకాక అక్రమాలపై మరింత లోతుగా విచారణ జరిపించడమే కాక డిజిటల్ కీ దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణఆర్ఓ రిలీవ్ ఇటీవల మహబూబాబాద్కు డిప్యూటేషన్పై బదిలీ అయిన ఆర్ఓ జి.శ్రీనివాసరావును కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య రిలీవ్ చేశారు. ఆర్ఓ డిప్యూటేషన్ను రద్దు చేయించి ఇక్కడే కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ ఆయనను రిలీవ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయాన మేనేజర్ బుచ్చిబాబుకు ఇన్చార్జి ఆర్ఓగా బాధ్యతలు కేటాయించారు. -
ఇంతింతై.. ఎదిగేలా...
● ఎస్హెచ్జీల సభ్యులకు సీ్త్ర టీ స్టాళ్లు, ఇతర యూనిట్లు ● ఇందిరా మహిళా శక్తి ద్వారా రుణసౌకర్యం ● లాభాల బాట పట్టడంతో సభ్యుల్లో ఆనందం కారేపల్లి: మహిళా సంఘా(ఎస్హెచ్జీ)ల్లోని సభ్యుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలుచేస్తోంది. ‘మహిళల ఉన్నతి–తెలంగాణ ప్రగతి’ అనే నినాదంతో మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా చెబుతున్నారు. ఇందులో భాగంగా సీ్త్ర నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం ద్వారా గ్రామ సమాఖ్య సభ్యులకు రుణ సౌకర్యం కల్పించడమే కాక సభ్యులకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆపై వ్యాపారాలు ఏర్పాటుచేయిస్తుండగా మహిళల శ్రద్ధతో అవి లాభాల పడుతున్నాయి. కారేపల్లి మండలంలో ఐకేపీ, సింగరేణి విజేత మండల సమాఖ్య ఆధ్వర్యాన రూ.1.35లక్షల చొప్పున రెండు సీ్త్ర టీ స్టాల్ యూనిట్లు, రూ. 1.39లక్షలతో నాటు కోడిపిల్లల యూనిట్ మంజూరు చేసింది. కారేపల్లిలోని మండల పరిషత్ కార్యాలయాల ప్రాంగణంలో మొగరంపల్లి శ్రీలత, పోలీసు స్టేషన్ సర్కిల్లో కంచి నాగలక్ష్మి టీ స్టాళ్లు ఏర్పాటుచేయగా, తొడితలగూడెంలో బండారి రత్తమ్మకు నాటు కోడిపిల్లల పెంపకం యూనిట్ మంజూరైంది. ఇవి కాక జిల్లాలోని పలుచోట్ల ఏర్పాటైన సీ్త్ర టీ స్టాళ్లు విజయవంతంగా కొనసాగుతుండడం విశేషం. ఎస్హెచ్జీ సభ్యుల్లో ఆనందం కారేపల్లి మండలంలో ఏర్పాటుచేసిన టీ స్టాళ్లు, నాటు కోళ్ల యూనిట్తో వ్యాపారం బాగుండడం, లాభాలు రావటంతో మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొడితలగూడెంలో నాటుకోడి పిల్లల యూనిట్ ఏర్పాటుచేసిన రత్తమ్మ.. 2వేల నాటు కోడిపిల్లలతో పాటు, 20 రోజులకు సరిపడా దాణా మండల సమాఖ్య ద్వారా అందుకుంది. కోడిపిల్లలను సహజసిద్ధమైన వాతావరణంలో పెరగుతుండడంతో డిమాండ్ ఉందని. తద్వారా లాభాలు వస్తున్నాయని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. -
‘పది’లో అంతా ఉత్తీర్ణులయ్యేలా...
నేలకొండపల్లి: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. జూన్ 3వ తేదీ నుంచి జరగనున్న సప్లిమెంటరీ పరీక్షల్లో వీరంతా ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఫెయిల్ అయిన 1,048 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా పర్యవేక్షించడంతో పాటు ఒక్క విద్యార్థి ఉన్నా కూడా సబ్జెక్టు టీచర్లతో బోధన చేయిస్తున్నారు. ఒకరు ఉన్నా తప్పనిసరి విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సెస్సీ చదివి ఫెయిల్ అయిన 1,048 మంది విద్యార్థులకు లబ్ధి జరగనుంది. నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 352 మంది పరీక్షలు రాయగా, 35 మంది ఫెయిల్ అయ్యారు. వీరి కోసం ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చెన్నారం, నేలకొండపల్లి, అప్పలనరసింహాపురం పాఠశాలల్లో ఒక్కొక్కరే ఫెయిల్ అయినప్పటికీ వారి కోసం తరగతులు నిర్వహిస్తుండడం విశేషం. అయితే, కొన్ని చోట్ల మొక్కుబడిగా బోధిస్తున్నారని, అలాకాకుండా శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు జిల్లాలో 1,048 మందికి బోధన -
ఉన్న వారిపైనే భారం !
● కేఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో వేధిస్తోన్న సిబ్బంది కొరత ● కార్పొరేషన్కు కొత్తగా మంజూరు కాని పోస్టులు ● మున్సిపాలిటీ నాటి పోస్టులతో ఇక్కట్లుఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రధాన విభాగమే కాదు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. నగర విస్తరణ, అభివృద్ధి పనుల ప్రణాళికలు, పరిశీలన ఈ విభాగం ద్వారానే జరుగుతాయి. నిర్మాణాలకు అనుమతుల జారీ, నిర్మాణాల పర్యవేక్షణ, కార్పొరేషన్లో రోడ్లు, డ్రెయినేజీలపై ఆక్రమణలను గుర్తింపు, తొలగింపు బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఈ విభాగంలో ఉద్యోగులు, సిబ్బంది కొరత వేధిస్తుండగా.. ఉన్న వారిపై పనిభారం పడుతోంది. పోస్టులు ఏవీ? ఖమ్మం పురపాలక సంఘంగా ఉన్న నాటి పోస్టులతోనే ప్రస్తుతం పరిపాలన నెట్టుకొస్తున్నారు. ఖమ్మం మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ విభాగానికి తొమ్మిది పోస్టులను మంజూరు చేశారు. ఇందులో ఏసీపీ, టీపీఓ ఒక్కొక్కరితో పాటు టీపీఎస్ మూడు, టీపీబీఓ పోస్టులు నాలుగు ఉన్నాయి. ప్రస్తుతం ఏసీపీ, టీపీఓ ఒక్కొక్కరు, టీపీఎస్లు ఇద్దరు, టీపీబీఓలు నలుగురు విధుల్లో ఉన్నారు. టీపీబీలు ఇటీవలే బాధ్యతలు చేపట్టగా శిక్షణ పొందుతున్నారు. ఖమ్మం నగరం విస్తరణ దృష్ట్యా టౌన్ప్లానింగ్ విభాగానికి పోస్టుల సంఖ్య పెంచాల్సి ఉంది. అసలే ఉద్యోగులు తక్కువగా ఉండడంతో కార్యకలాపాలపై ప్రభావం పడుతుండగా.. ఇటీవల ఈ విభాగం ఉద్యోగులకు ఇతర మున్సిపాలిటీల్లో అదనపు విధులు కేటాయిస్తున్నారు. దీంతో రెండు చోట్ల సరైన న్యాయం చేయలేకపోతున్నారు. పనులన్నీ అక్కడే.. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లింపునకు రాయితీ ప్రకటించడంతో కేఎంసీ టౌన్ప్లానింగ్ విభాగం ప్రత్యేక దృష్టి సారించారు. 40 వేల దరఖాస్తులు రాగా.. అత్యధిక ఫీజులు వసూలు చేసిన కార్పొరేషన్గా ఖమ్మం నిలిచింది. ఈ పనులతో పాటు నగరంలో ఆక్రమణల తొలగింపుకు కృషి చేస్తున్నారు. మరోపక్క రోడ్ల విస్తరణ ప్రణాళికల రూపకల్పన, మార్కింగ్ పెట్టడం, విస్తరణ పనులను పర్యవేక్షించడం బాధ్యతలు నిర్వర్తించాలి. అదనంగా రోజువారీగా నిర్మాణాలకు అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించడం, క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాల్సి ఉండడంతో పనుల్లో ఆలస్యమవుతోందనే చర్చ కేఎంసీలో జరుగుతోంది. కాగా, ఉద్యోగులు పనిభారం కారణంగా కొన్ని చోట్ల పర్యవేక్షించకపోవడంతో అక్రమార్కులు ఇదే అదునుగా అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని చెబుతున్నారు.వేధిస్తున్న సిబ్బంది కొరత పురపాలక సంఘం నుండి నగర పాలక సంస్థగా రూపాంతరం చెందిన ఖమ్మం కార్పొరేషన్కు ఆ స్థాయిలో ఉద్యోగులను కేటాయించలేదు. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న ఖమ్మంను 2012 అక్టోబర్లో ప్రభుత్వం నగర పాలక సంస్థగా ప్రకటించింది. విలీన గ్రామాలను కలుపుకుని 60డివిజన్లతో ఖమ్మం కార్పొరేషన్ రోజురోజుకు విస్తరిస్తోంది. కానీ మున్సిపాలిటిగా ఉన్నప్పుడు టౌన్ప్లానింగ్ విభాగానికి కేటాయించిన పోస్టులతోనే నేటికీ ఇప్పటికీ నెట్టుకొస్తుండడంతో ప్రజా సేవలతో పాటు అభివృద్ధి పనుల పర్యవేక్షణపై ప్రభావం పడుతోంది. -
ఉపాధ్యాయుల బకాయిలు విడుదల చేయాలి
ఖమ్మం సహకారనగర్: సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకే కాక పదో తరగతి మూల్యాంకనలో పాల్గొన్న ఉపాధ్యాయుల రెమ్యూనరేషన్ బకాయిలు మంజూరు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగులు 2024 నవంబర్లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనగా ఇప్పటివరకు రెమ్యునరేషన్ ఇవ్వలేదన్నారు. ఈ–కుబేర్లో పెండింగ్ పెట్టారని తెలిపారు. అంతేకాక 2022లో పదో తరగతి స్పాట్ విధులు నిర్వర్తించిన ఆంగ్లం, గణితం ఉపాధ్యాయులకు బకాయిలు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్రి వెంకన్న, వల్లంకొండరాంబాబు, నాగేశ్వరరావు, ఉద్దండు షరీఫ్,విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించండి
● తిరస్కరిస్తే అందుకు కారణాలు వెల్లడించాలి ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించే ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. ఏవైనా తిరస్కరిస్తే అందుకు కారణాలను ఫిర్యాదుదారులకు తెలియచేయాలని చెప్పారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం ఆయన అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై పరిశీలన, పరిష్కారంపై సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని... ● ఖమ్మంకు చెందిన సింగాల నాగమణి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే, బీ.కే.బజార్కు చెందిన ఏ.శ్రీలక్ష్మి ఒంటరినైనా తనకు ఉపాధి కల్పించచడంతో పాటు ఇల్లు ఇప్పించాలని విన్నవించారు. ● పెనుబల్లి మండలం తాళ్లపెంటకు చెందిన షేక్ ఉద్దండు సాహెబ్ తమ ఇంటి నుండి ఊరిలోకి వెళ్లకుండా కంచె ఏర్పాటుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ● ఇందిరమ్మ ఇళ్లలో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని టీడీజేఏసీ చైర్మన్ పీ.వీ.చలమయ్య ఆధ్వర్యాన వినతిపత్రం అందజేశారు. నాయకులు రామకృష్ణ, బ్రహ్మయ్య, వెంకట్, గోపిరాజ్, రేణుక పాల్గొన్నారు. ● రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్నగర్ కాలనీలో బీ.ఆర్ అంబేద్కర్ పేరుతో కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేయాలని వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి ఆధ్వర్యాన వినతిపత్రం అందజేశారు. ● కేఎంసీ పరిధిలోని సమస్యల పరిష్కారం, అర్హులకు సంక్షేమ పథకాల మంజూరుపై సీపీఐ నాయకులు విన్నవించారు. సీపీఐ నగర కార్యదర్శి ఎస్.కే.జానీమియా, నాయకులు పాల్గొన్నారు. ● చింతకాని మండలం రైల్వే కాలనీలో ఇందిరమ్మ కమిటీ బాధ్యులు అర్హులకు కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని ఆరోపిస్తూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు చెరుకుపల్లి నాగేశ్వరావు ఆధ్వర్యాన నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
వడదెబ్బతో ముగ్గురు మృతి
రఘునాథపాలెం: ఎండల కారణంగా వడదెబ్బ బారిన వ్యక్తి డంపింగ్ యార్డులో మృతి చెందగా సోమవారం గుర్తించారు. ఖమ్మం ప్రకాష్నగర్కు దాసు తన రెండో భార్యతో కలిసి బొప్పాయికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్యతో ఘర్షణ పడి రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలోని డంప్ యార్డుకు వచ్చినట్లు తెలుస్తుండగా, అక్కడే నిద్రించిన ఆయన మృతి చెందాడు. వడదెబ్బతో దాసు మృతి చెంది ఉండొచ్చని భావిస్తూ ఆయన కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. కాగా, ఉదయమే డంప్ యార్డులో మృతదేహాన్ని గుర్తించిన పంచాయతీ ఆందోళనతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు, సిబ్బంది సదరు వ్యక్తిమృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు విడుదల చేయడంతో దాసు కుటుంబీకులు గుర్తించారు. సుందరయ్యనగర్లో మహిళ... వైరా: వైరా మున్సిపాలిటీ లీలా సుందరయ్యనగర్కు చెందిన రేకుల ముత్తమ్మ(49) వడదెబ్బతో మృతి చెందింది. ఈనెల 15న ఆమె బంధువుల ఇంటికి వెళ్లి 17న తిరిగి వచ్చినప్పటి నుంచి వాంతులు, విరోచనాలతో బాధ పడుతంది. స్థానికంగా చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. ముత్తమ్మ భర్త శఽంకరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశామిన ఎస్ఐ రామారావు తెలిపారు. చింతకాని ఐఈఆర్పీ... చింతకాని: మండల ఐఈఆర్పీ (ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్) కేఎస్.కృష్ణారావు(57) సోమవారం మృతి చెందాడు. రెండు రోజుల వడదెబ్బ తాకడంతో ఖమ్మం ఆస్పత్రిల చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కృష్ణారావుపై మృతిపై ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ కూరపాటి అనంతరాజు, ఎంఈఓ సలాది రామారావు తదితరులు సంతాపం తెలిపారు. -
బైక్ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మంకు చెందిన ఈగలపాటి శంకర్రావు(60) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు... కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన శంకర్రావు ఖమ్మంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసముంటున్నా డు. జక్కేపల్లిలో ఉండే తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో చూసి బైక్పై ఖమ్మం వస్తుండగా వెనుక నుండి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైనశంకర్రావు అక్కడికకక్కడే మృతి చెందాడు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. కుక్కల దాడిలో పలువురికి గాయాలు మధిర: మధిర మున్సిపాలిటీ పరిధి మడుపల్లిలో ఆదివారం వీధికుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో మేడికొండ రమణమ్మ, మేడికొండ మురళీధర్, ఎస్.కే.మస్తాన్తో పాటు మరో ముగ్గురికి గయాలయ్యాయి. గతంలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈనేపథ్యాన అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పిడుగుపాటుతో దంపతులకు గాయాలు● పెంపుడు కుక్క సహా 22 మూగజీవాలు మృతి కారేపల్లి: పిడుగుపాటుతో ఇద్దరు జీవాల కాపరులకు తీవ్రగాయాలయయ్యాయి. ఈ ఘటనలో వీరు మేతకు తీసుకొచ్చిన 21 గొర్రెలు, ఒక కుక్క మృత్యువాత పడింది. మండలంలోని బాజుమల్లాయిగూడెంకు గొర్రెల కాపరులు మద్దెల లక్ష్మయ్య–లక్ష్మి 100జీవాలను సోమవారం సమీపంలోని పాటిమీదిగుంపు గ్రామంలో మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలు కావడంతో సమీపంలోని చెట్టు కిందకు చేరగా వేపచెట్టుపై పిడుగు పడింది. దీంతో లక్ష్మ య్య–లక్ష్మి దంపతులు తీవ్రగాయాలతో స్పృహ కోల్పోగా, 17 గొర్రెలు, వారి పెంపుడు కుక్క మృతి చెందింది. అలాగే, పిడుగుపాటుతో చెట్టు సగం మేర కాలిపోయింది. అరగంట తర్వాత స్పృహలోకి వచ్చిన లక్ష్మయ్య ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు చేరుకుని వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
పంటల మార్పిడితోనే ఫలితం
ఏన్కూరు: రైతులు పంటల మార్పిడి పాటిస్తూ మార్కెట్లో అధికధరలు పలికే పంటలు సాగు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ సూచించారు. ఏన్కూరు మండలం నాచారంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవసరం మేరకే ఎరువులు వినియోగిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడాలని తెలిపారు. వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ మాట్లాడుతూ వానాకాలంలో ఎంచుకోవాల్సిన పంటలు, విత్తనాల కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో వెటర్న టీ డాక్టర్ సుబ్బారావు, ఏఓ నరసింహారావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అధికారి తేజ శ్రీ, ఏఈఓలు కమలాకర్, భాగ్యలహరి, నవ్య, భవ్య, మాజీ ఎంపీపీ వరలక్ష్మి, నల్లమల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పీహెచ్సీకి రూ.80వేల విలువైన ఇన్వర్టర్లుఎర్రుపాలెం: మండలంలోని బనిగండ్లపాడు పీహెచ్సీకి కాంగ్రెస్ నాయకుడు యరమల పూర్ణచంద్రారెడ్డి రూ.80వేల విలువైన ఇన్వర్టుర్లు, బ్యాటరీలు వితరణ చేశారు. ఆస్పత్రిలో సోమవారం ఆయన సామగ్రిని పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్కు అందచేశారు. అనంతరం డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, వైద్యాధికారి ప్రశాంత్ మాట్లాడుతూ పూర్ణచంద్రారెడ్డి అందించిన ఇన్వర్టర్లతో విద్యు త్ అంతరాయం ఏర్పడినప్పుడు సమస్యలు ఉండవని తెలిపారు. అనంతరం దాతను సత్కరించారు. వైద్యులు రంజిత్, కార్తీక్, లక్ష్మీలోహిత, అశ్విని, ఉద్యోగులు పాల్గొన్నారు. పోరాటమే సుందరయ్యకు నివాళి ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడడమే పుచ్చలపల్లి సుందరయ్యకు ఇచ్చే నివాళి అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపా రు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో సోమవారం ఆయన ఆయన 40వ వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా సుందరయ్య విగ్రహం వద్ద నివాళులర్పించాక నాగేశ్వరరావు మాట్లాడారు. భారత్ – పాకిస్తాన్ నడుమ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రెండు దేశాల కంటే ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం ద్వారా ఆయనకు మోదీ దాసోహమైనట్లు తేలుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.సోమయ్య, పొన్నం వెంకటేశ్వరరావు, ఎం.సుబ్బారావు, మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి రెండో విడత శిక్షణ ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ఉపాధ్యాయులకు మంగళవారం నుంచి రెండో విడత శిక్షణ ప్రా రంభం కానుందని, ఎంపిక చేసిన వారంతా హాజరుకావాలని డీఈఓ సామినేని సత్యనారాయణ పేర్కొన్నారు. ఖమ్మంలోని హార్వెస్ట్ పాఠశాల, న్యూ ఇరా పాఠశాల, న్యూవిజన్ పాఠశాలల్లో ఐదు రోజుల శిక్షణ ఉంటుందని తెలిపారు. మండలాల వారీగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, ఎస్జీటీలు సబ్జెక్ట్ పుస్తకాలు, కరదీపికలతో హాజరుకావాలని సూచించారు. 23న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలుఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ జట్ల ఎంపికకు ఈనెల 23న కల్లూరు మినీ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షషీక్ అహ్మద్ తెలిపారు. అండర్–8, 10, 12 బాలబాలికల విభాగాల్లో పోటీలుజరుగుతాయని వెల్లడించారు. అండర్–8 బాలబాలికలకు 60, 200 మీ టర్లు, స్టాండింగ్ బ్రాడ్జంప్, పరుగుపందెం, అండర్–10 బాలబాలికలకు 60, 300 మీటర్లు, లాంగ్జంప్, అండర్–12 బాలబాలికలకు60, 600 మీటర్లు, షాట్ఫుట్, లాంగ్జంప్ అంశాల్లో ఎంపికలు ఉంటాయని తెలిపారు. క్రీడాకారులు ఉద యం 8గంటలకల్లా స్టేడియం ఇన్చార్జ్ పి.వీర రాఘవయ్యకు రిపోర్ట్ చేయాలని సూచించారు. -
పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్షలు
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ● విద్యాశాఖ అధికారులతో సమీక్షలో సూచనలుఖమ్మం సహకారనగర్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాటుచేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడమే కాక ఇతర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అంతకుముందే నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ డిపార్ట్మెంటల్ అధికారి, డిపార్ట్మెంటల్ అధికారులతో డీఐఈఓ రవి బాబు సమావేశమయ్యారు. కేంద్రాల వద్ద నిబంధనలు, ఏర్పాట్లపై సూచనలు చేశారు. డీఈసీ మెంబర్లు కె.శ్రీనివాసరావు, వీరభద్రరావు పాల్గొన్నారు. 22నుంచి పరీక్షలు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు ఈనెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జిల్లాలో 15,461మంది విద్యార్థుల కోసం 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో ప్రథమ సంవత్సరం 11,780మంది, ద్వితీయ సంవత్సరం 3,681మంది ఉన్నారు. కాగా, జిల్లాను నాలు గు రూట్లుగా విభజించి, 17స్టోరేజ్ పాయింట్లు ఏర్పా టు చేశారు. ఇద్దరు చొప్పున అధికారులతో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటుచేసి ఇప్పటికే విధులపై అవగాహన కల్పించారు. కాగా, ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9నుంచి 12గంటల వర కు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2–30 నుంచి 5–30గంటల వరకు నిర్వహిస్తారు. కాగా, ఈ నెల 25న ఆదివారం కూడా పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేయగా, అక్కడి నుంచి సామగ్రి సరఫరా చేస్తారు. -
అలా వచ్చి... ఇలా వెళ్లారు!
నేలకొండపల్లి: ఫ్యాక్టరీ కారణంగా పంటలు నష్టపోతున్నామని, మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని ఫిర్యాదు చేస్తే పంట కోతలు పూర్తయ్యాక వచ్చిన కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఉద్యోగులు కొద్దిసేపటికే వెళ్లిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని అప్పలనరసింహాపురంలో ఉన్న ఐరన్ ఓర్, కెమికల్ ఫ్యాక్టరీల కారణంగా పంటలుపై దుమ్ము, దూళి చేరుతోందని, నీరు కలుషితమవుతోందని రైతులు ఈ ఏడాది ఫిబవరి 3న చెన్నె, హైదరాబాద్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో రాకుండా పంట కోతలు పూర్తయ్యాక టాస్క్ఫోర్స్ సభ్యులు శ్రీధర్, గోపాల్, కొత్తగూడెం ఏఈ అజయ్ సోమవారం వచ్చారు. దీంతో వారి ఎదుట రైతులు ఆవేదన వెలిబుచ్చారు. పంటలు ఉన్న సమయాన వస్తే తమ ఇబ్బందులు తెలిసేవని పేర్కొన్నారు. ఇకనైనా ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోకపోతే పీసీబీ కార్యాలయం వద్ద ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అయితే, ఎలాంటి హామీ ఇవ్వకుండా ఉద్యోగులు కాసేపటికే వెళ్లిపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు ఎలగాల మీరయ్య, జిడుగు లక్ష్మీనారాయణ, బి.భాస్కర్, వెనికె రామారావు, వై.పిచ్చయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పీసీబీ ఉద్యోగుల తీరుపై రైతుల ఆగ్రహం -
కేర్ టేకర్గా చేరి రూ.11.49లక్షలు స్వాహా
ఖమ్మంక్రైం: ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడిన ఓ వ్యక్తి రిటైర్డ్ ఉద్యోగి వద్ద కేర్ టేకర్గా చేరి ఆయనకు తెలియకుండా ఖాతా నుంచి రూ.11.49 లక్షలు స్వాహా చేశాడు. ఈమేరకు నిందితుడిని సోమవారం ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. మధిర మండలం నిదానపురానికి చెందిన గుండా వెంకటేశ్వరరెడ్డి ఖమ్మం హోమ్ కేర్ సర్వీస్లో కేర్ టేకర్గా ఉద్యోగం చేస్తున్నాడు. గత నాలుగైదేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఆయన గత మార్చిలో ఖమ్మంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి గాదె కేశవరావు వద్ద కేర్ టేకర్గా చేరాడు. యజమానిని నమ్మిస్తూ ఆయన ఫోన్లోని గూగుల్ పే ద్వారా బెట్టింగ్ యాప్ల్లోకి డబ్బు డిపాజిట్ చేయడం మొదలుపెట్టాడు. రెండు వారాల పాటు వరుసగా రూ.11.49 లక్షల డిపాజిట్ చేయగా, లాభాలు రాకపోవడంతో ఉద్యోగం మానేశాడు. కొన్నాళ్ల తర్వాత గుర్తించిన కేశవరావు ఈ విషయమై చేసిన ఫిర్యాదుతో వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో కోర్టులో హాజరుపర్చగా, సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ను, ఎస్సైలు రంజిత్కుమార్,విజయ్కుమార్, సిబ్బందిని సీపీ అభినందించారు. -
‘పనిముట్టు’కుంటే ఒట్టు..
● వ్యవసాయ యాంత్రికీకరణకు ఏళ్లుగా వీడని గ్రహణం ● నిధుల కేటాయింపుతోనే సరిపెట్టిన ప్రభుత్వం ● సమగ్ర మార్గదర్శకాలు రాక అధికారులు, రైతుల ఎదురుచూపులు ● 2016 తర్వాత అన్నదాతలకు అందని యంత్ర పరికరాలు ఖమ్మంవ్యవసాయం: అన్నదాతలకు చేయూతనిచ్చేలా రూపొందించిన యాంత్రికీకరణ(పనిముట్ల) పథకానికి గ్రహణం పట్టింది. ఏళ్ల తరబడి నిధుల కేటాయింపుతోనే సరిపెడుతూ.. పరికరాలు మాత్రం కేటాయించకపోవడంతో రైతులు ఎక్కువ ఖర్చుతో కొనలేక ఆధునికతకు చేరువ కాలేకపోతున్నారు. సాగులో ఆధునిక పరికరాల వాడకంపై ఆసక్తి ఉన్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీపై మంజూరు కాకపోవడం వారిని నిరాశకు గురిచేస్తోంది. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా.. అధునాతన వ్యవసాయ విధానాలకు అవసరమైన యంత్ర పరికరాలను రైతులకు అందించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేలా యాంత్రికీకరణ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. ట్రాక్టర్లు, రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు, డ్రోన్లు, డ్రోన్లు, సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రమ్ములు, డిస్క్లు, నాగండ్లు, పవర్ వీడర్లు, బ్రష్ కట్టర్లు, మొక్కజొన్న, వరి నూర్పిడి యంత్రాలే కాక గడ్డి కట్టలు కట్టేవి, పంట కోసే యంత్రాలను 50 – 90 శాతం వరకు రాయితీపై అందించాల్సి ఉంటుంది. ఇందులో 60 శాతం నిధులను కేంద్రం, 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. జనరల్, బీసీ కేటగిరీల వారికి 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం వరకు రాయితీ అందుతుంది. అయితే, 2016–17 వరకు పడుతూ లేస్తూ అమలైన పథకం ఆరేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. గత ప్రభుత్వం రైతుబంధు పథకం పేరిట ఎకరాకు రూ.5 వేల చొప్పున సాగుసాయం అందించినా యాంత్రికీరణకు పూర్తిగా పక్కన పెట్టేసింది. అమలులో మీనమేషాలు యాంత్రికీకరణ పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన ప్రస్తుత ప్రభుత్వం అమలులో మీన మేషాలు లెక్కిస్తోంది. 2024–25 సంవత్సరానికి నిధుల కేటాయించి, దరఖాస్తుల స్వీకరించాలని వ్యవసాయ శాఖను ఆదేశించినా సమగ్ర మార్గదర్శకాలను మాత్రం విడుదల చేయలేదు. యాంత్రికీకరణ పథకాన్ని 50 శాతం మహిళా రైతులకు వర్తింపచేస్తామని చెబుతూ జిల్లాకు రూ. 1.12 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో అర్హులైన 428 మందికి యంత్ర పరికరాలను అందించొచ్చని భావించారు. ఆతర్వాత దరఖాస్తుల స్వీకరణ, అర్హుల ఎంపికపై ముందడుగు పడకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. సమగ్ర మార్గదర్శకాలు లేక... ప్రభుత్వం ఆర్దిక సంవత్సం ముగుస్తున్న వేళ హడావిడిగా మార్చిలో ఈ పథకానికి నిధులు కేటాయించారు. నిర్దేశించిన యంత్ర పరికరాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే, ఆ ఆదేశాల్లోని యంత్ర పరికరాలు పరిశీలిస్తే ప్రతీ జిల్లాలో వందల సంఖ్యలో రైతులకే ప్రయోజనం చేకూరుతుందని భావించగా.. మార్పులకు సూచనలు చేసింది. దీంతో పథకం అమలు అయోమయంలో పడింది. ఇంతలోనే గత ఏడాది కేటాయించిన నిధులకు తోడు 2025–26 ఆర్థిక సంవత్సరం నిధులు కూడా కలిపి ఎక్కువ మంది రైతులకు పథకాన్ని వర్తింపజేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వానాకాలం సీజన్ సమీపిస్తున్నా ఈ విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయ యాంత్రికీకరణ పథకం అమలు జరగడం లేదు. ఆరేళ్లకు పైగా పరికరాలను అందించకపోవటంతో రైతులు బ్యాంకులను ఆశ్రయించి రుణాలపై కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పథకాన్ని తెరపైకి తీసుకొచ్చినా ఆచరణలో జాప్యం చేస్తుండడంతో రైతులకు పాత పరిస్థితే ఎదురుకానుంది. ఆదేశాలు రాగానే అమలు యాంత్రికీకరణ పథకంపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తాం. 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిధుల కేటాయింపు జరిగింది. అయితే ఎక్కువ మందికి లబ్ధి జరగాలనే ఆలోచన చేయడంతో ప్రక్రియ నిలిచింది. ప్రభుత్వం నుంచి సమగ్ర మార్గదర్శకాలు అందితే అమలు ప్రారంభిస్తాం. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
సమానత్వం కోసం పోరాడేది ఎర్రజెండానే..
● సుందరయ్య వర్ధంతి సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతల్లాడ: సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాడేది ఎర్ర జెండా మాత్రమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టం చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా తల్లాడ మండలం కుర్నవల్లిలో సోమవారం రాత్రి సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. దేశంలో కుల, మత విద్వేషాలు పెరుగుతుండగా, ఇందుకు పాలకులు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. పాలకుల విధానాలతో విద్య, వైద్యం కూడా ఖరీదు కాగా, పేదలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యాయని తెలిపారు. అసమానతను నిర్మూలించేలా ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య వేసిన బాట నేటికీ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఆయన చూపిన బాటలో కమ్యూనిస్టులు నడుస్తూ పాలకపక్షాల ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని జాన్వెస్లీ సూచించారు. తొలుత కుర్నవల్లిలో ర్యాలీ నిర్వహించగా, సీపీఎం నాయకులు మాచర్ల భారతి, శీలం సత్యనారాయణరెడ్డి, కల్యా ణం వెంకటేశ్వరరావు, తాతా భాస్కర్రావు, చలమాల విఠల్, శీలం ఫకీరమ్మ, అయినాల రామలింగేశ్వరరావు, కట్టా దర్గయ్య తదితరులు పాల్గొన్నారు. -
వార్షిక ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాల్సిందే..
ఖమ్మంక్రైం: ప్రభుత్వ సూచనల మేరకు రవాణా శాఖ ఉద్యోగులు వార్షిక ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలని ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం స్పష్టం చేశారు. ఖమ్మం రవాణా శాఖ కార్యాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఇన్చార్జ్ డీటీఓ వెంకటరమణ స్వాగతం పలకగా, ఉద్యోగులతో సమావేశమై సూచనలు చేశారు. పన్నులు చెల్లించని వాహనాలను గుర్తించి జరిమానా విధించాలని సూచించారు. అలాగే, సీజ్ చేసిన వాహనాలు ఏళ్లుగా తీసుకెళ్లకపోతే స్క్రాప్కు తరలించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏఓ సుధాకర్, ఏఎంవీఐ స్వర్ణలత, ఉద్యోగులు పాల్గొన్నారు. నెట్బాల్ టోర్నీలో జైత్రయాత్ర ఖమ్మం స్పోర్ట్స్: ఇటీవల జనగామలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్జూనియర్ నెట్బాల్ పోటీల్లో ఖమ్మం క్రీడాకారులు ప్రతిభ చాటారు. సంప్రదాయ నెట్బాల్ విభాగంలో బాలుర జట్టు తృతీయస్థానం సాధించింది. అలాగే, సబ్ జూనియర్ విభాగంలో జిల్లా బాలబాలికల జట్లు ద్వితీయస్థానంలో నిలిచాయి. అంతేకాక ఈనెల 25నుంచి మధ్యప్రదేశ్లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న రాష్ట్ర జట్టులో జిల్లా బాలబాలికలు పది మంది స్థానం దక్కించుకున్నారు. బాలురలో సాన్హిత్, హసిత్, సాకేత్, సంజయ్, నేహాల్, సూర్య ఎంపిక కాగా, బాలికల జట్టుకు అవంతిక, హరిణి, రిత్వికసహస్ర, సింధు ఎంపికయ్యారు. ఈసందర్భంగా క్రీడాకారులను నెట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు దీప్తి, కార్యదర్శి ఎన్.ఫణికుమార్, కోచ్ పీ.వీ.రమణ తదితరులు అభినందించారు. రేపటితో ముగియనున్న ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ ఖమ్మం సహకారనగర్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ) ద్వారా మొదటి విడత రిజిస్ట్రేషన్ గడువు బుధవారంతో ముగియనుందని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. రిజిస్ట్రేషన్కు బుధవారం చివరి రోజుకు కాగా... గురువారం వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. అలాగే, రెండో విడత రిజిస్ట్రేషన్లు ఈనెల 30 నుంచి జూన్ 9వరకు ఉంటాయని తెలిపారు. వివరాల కోసం దోస్త్ కోఆర్డినేటర్ సలీం పాషా(98498 41555), టెక్నికల్ అసిస్టెంట్ వేలాద్రి(96188 96949)ని సంప్రదించాలని సూచించారు. -
మండలాల వారీగా రుణ లక్ష్యం ఇలా..
మండలం ఎస్ఎస్జీలు రుణ లక్ష్యం(రూ.లలో) ఖమ్మం రూరల్ 1,497 83,07,41,000 కల్లూరు 1,362 75,42,84,000 తిరుమలాయపాలెం 1,240 67,64,56,000 ముదిగొండ 1,152 64,55,29,000 చింతకాని 1,117 62,90,74,000 నేలకొండపల్లి 1,113 61,70,90,000 కొణిజర్ల 1,036 57,66,78,000 రఘునాథపాలెం 1,034 56,38,86,000 కూసుమంచి 1,016 56,21,55,000 బోనకల్ 979 53,58,67,000 మండలం ఎస్ఎస్జీలు రుణ లక్ష్యం(రూ.లలో) సింగరేణి (కారేపల్లి) 978 53,74,46,000 ఎర్రుపాలెం 959 53,07,90,000 వేంసూరు 951 52,08,21,000 తల్లాడ 920 50,83,47,000 పేనుబల్లి 919 50,57,33,000 సత్తుపల్లి 889 49,58,11,000 కామేపల్లి 774 42,72,46,000 మధిర 759 42,93,94,000 ఏన్కూరు 718 40,25,20,000 వైరా 679 37,72,25,000 -
బాలికలు ఆదర్శంగా నిలవాలి
● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ● కొణిజర్ల కేజీబీవీలో వేసవి శిబిరం పరిశీలనకొణిజర్ల: బాలికల్లో సహజసిద్ధంగా ఉండే నైపుణ్యాలకు కృషి తోడైతే అద్భుత విజయాలు సాధించవచ్చని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కస్తూర్బాగాంధీ విద్యాలయాల(కేజీబీవీ) బాలికలు ఉన్నత స్థాయికి చేరుకుని రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కొణిజర్ల మండలం బస్వాపురంలోని కేజీబీవీలో కొనసాగుతున్న వేసవి శిక్షణా శిబిరాన్ని సోమవారం సందర్శించిన ఆయన బాలికలు వేసిన చిత్రాలు, తయారుచేసిన బొకేలు, వస్తువులు పరిశీలించి ఆభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఏ పనైనా మనస్సు, శరీరం ఏకీకృతంగా చేస్తే విజయం తథ్యమన్నారు. సమాజంలో ఆడపిల్లలపై వివక్ష తొలగిపోయేలా బాలికలు జీవితంలో రాణించాలని సూచించారు. అనంతరం ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన బాలికలను కలెక్టర్ సత్కరించారు. డీఈఓ సామినేని సత్యనారాయణ, కేజీబీవీ జిల్లా కోఆర్డినేటర్ తులసి, ఇన్చార్జ్ తహసీల్దార్ రాము తదితరులు పొల్గొన్నారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి పైలట్ ప్రాజెక్ట్గా ఎంపికై న గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో ఇళ్ల నిర్మాణాన్ని తనిఖీ చేసిన ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం కావాలా, ఇసుక, మట్టి అందుతోందని అని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిమెంట్, స్టీలు వంటివి గ్రూపుగా కలిసి ఒకేచోట కొంటే ధర తగ్గుతుందని తెలిపారు. జిల్లాలోని 20మండలాల్లో ఒక్కో గ్రామాన్ని పైలట్గా తీసుకుని 875మందిని ఎంపిక చేశామన్నారు. దఫాలుగా బిల్లు మంజూరు చేస్తుండడమే కాక స్థోమత లేని మహిళా సంఘాల సభ్యులకు రుణం ఇప్పిస్తున్నామని తెలిపారు. అధికారులు శ్రద్ధ వహించి ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, డీఎల్పీఓ రాంబాబు, ఇన్చార్జి తహసీల్దార్ రాము, డీఈ సాయిరాంరెడ్డి, ఏఈ ఉమామహేశ్వరరావు, జేపీఎస్ జ్యోతి పాల్గొన్నారు. -
విద్యుత్ ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరిస్తున్నాం
ఖమ్మంవ్యవసాయం: ప్రతీ సోమవారం నిర్వహించే విద్యుత్ ప్రజావాణిలో అందుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఖమ్మంలోని సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆయన దరఖాస్తులు స్వీకరించాక మాట్లాడారు. ఇప్పటివరకు 201 ఫిర్యాదులు అందగా, 195 సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు. బిల్లుల్లో హెచ్చుతగ్గులు, మీటర్ల సమస్యలు, సరఫరాలో అవాంతరాలు, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, లైన్లపై ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. సర్కిల్ కార్యాలయంతో పాటు డివిజన్, ఈఆర్వో, సెక్షన్ కార్యాలయాల్లోనూ ఫిర్యాదులు ఇవ్వొచ్చని ఎస్ఈ వివరించారు. -
పాఠ్య పుస్తకాల సరఫరా ప్రారంభం
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి. ఈమేరకు ఖమ్మంలోని గోదాంకు పుస్తకాలు చేరగా, మండలాల వారీగా పంపిణీని జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. సీఎంఓ యలగందుల రాజశేఖర్తో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రం నుంచి మండలాలకు, అక్కడి నుంచి పాఠశాలలకు ఈ నెలాఖరులోగా అన్ని పాఠ్యపుస్తకాలను చేరవేస్తామని తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 4,92,970 పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటివరకు 3,76,380పుస్తకాలు వచ్చాయని వెల్లడించారు. మిగిలిన పుస్తకాలు, వర్క్ బుక్లు వారంలోగా వస్తాయని, ఇక నోటుపుస్తకాలు హైదరాబాద్ నుంచి నేరుగా పాఠశాలలకు చేరతాయని తెలిపారు. గోదాం మేనేజర్ రఫీతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
పాత స్టాక్కు కొత్త ధర!
● అమల్లోకి పెరిగిన మద్యం ధరలు ● ఇదే అదునుగా పాత స్టాక్కూ పెంచిన వ్యాపారులువైరా: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మద్యం ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, వైన్స్, బార్లలో ఇప్పటికే స్టాక్ ఉన్న మద్యాన్ని నిబంధనల ప్రకారం పాత ధరలకే అమ్మాలి. కానీ అధికారులెవరూ ఈ దిశగా దృష్టి సారించకపోవడంతో పాత స్టాక్ను సైతం వ్యాపారులు కొత్త ధరతో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని మద్యం దుకాణాల్లో ఇదే తంతు కొనసాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచడంతో మద్యం వ్యాపారులకు కాసులు పంట పండినట్లయింది. క్వార్టర్పై రూ.10, ఫుల్ బాటిల్పై రూ.40 మేర ధర పెంచగా, ఆ ప్రకారమే పాత స్టాక్ను సైతం విక్రయించారు. ఉమ్మడి జిల్లాలోని వైన్స్, బార్లకు మద్యం సరఫరా చేసే వైరాలోని ఐఎంఎల్ డిపోలోనే సుమారు లక్ష కేసుల మద్యం పాత స్టాక్ ఉందని అధికారులే చెబుతున్నారు. కొన్నింటికి మినహాయింపు ప్రభుత్వం మద్యం ధరలు పెంచినప్పటికీ చీప్ లిక్కర్ జాబితాలో ఉన్న కొన్నింటిని మినహాయించింది. డైమండ్ విస్కీ, కేకే, డౌన్డౌన్, గుడ్వన్, డెక్కన్బ్లూ, యునైటెడ్ గోల్డు, బీకే, సన్హార్ట్స్, మెగాసిటీ బ్రాండ్ల మద్యానికి పాత ధరలే అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, బ్రీజర్ కంపెనీలో కాన్బెర్రీ ధరలోనూ మార్పు చేయలేదు. బ్రాండెడ్ మద్యం ధరలే పెంచడంతో ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మే నెలలో 17వ తేదీ వరకు రూ.237 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగితే ఈ ఏడాది రూ.95 కోట్ల మద్యమే అమ్ముడైంది. మరో పది రోజుల్లో గత ఏడాది కంటే ఎక్కువ అమ్మకాలు చేపట్టాలని ఎకై ్సజ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆలస్యంగా అమ్మకాలు ప్రభుత్వం పెంచిన మద్యం ధరలు సోమవారం అమల్లోకి రాగా వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి మధ్యాహ్నం వరకు లారీలు బయటకు కదల్లేదు. కొత్త ధరలతో బిల్లింగ్ చేసేలా స్టాఫ్వేర్లో మార్పులు చేయడంతో ఆలస్యమైందని తెలిసింది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత డిపోలో అమ్మకాలు మొదలుకాగా, ఒకేరోజు రూ.12 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లారని సమాచారం.మందుబాబులకు ముందే కిక్కు పాల్వంచరూరల్: మద్యంపై పెంచిన ధరలు అమల్లోకి రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని భావించిన మందుబాబులకు ఆ ఆనందం దక్కలేదు. పాల్వంచ మండలం పెద్దమ్మగుడి ఆలయం సమీపంలోని వైన్స్లో పాత స్టాక్నే కొత్త ధరకు అమ్మడంతో వాగ్వాదం జరిగింది. ఈ విషయమై పలువురు ఎకై ్సజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓ బ్రాండ్ మద్యం క్వార్టర్ ధర రూ.180 ఉంటే పెరిగిన ధరతో కలిపి రూ.190కు, హాఫ్, పుల్ బాటిళ్లు కూడా అలాగే అమ్మారని తెలిసింది. ఈవిషయమై ఎకై ్సజ్ సీఐ ప్రసాద్గౌడ్ను వివరణ కోరగా షాపుల్లో ఉన్న పాత స్టాక్ను ధర పెంచి అమ్మితే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
నిబద్ధత గల కమ్యూనిస్టు ప్రసాద్
ఖమ్మంమయూరిసెంటర్: తుదిశ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా నీడలో పోరాటం సాగించిన పోటు ప్రసాద్ నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు అని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఆదివారం బోనకల్ రోడ్డులోని ఆదిత్య థియేటర్ సమీపంలో సీపీఐ జిల్లా కార్యదర్శి, దివంగత కార్మిక నేత పోటు ప్రసాద్ స్మారక స్తూపాన్ని హేమంతరావు ఆవిష్కరించారు. అంతకు ముందు స్థానిక జెడ్పి సెంటర్ నుంచి స్తూపం వరకు ప్రదర్శన నిర్వహించారు. హేమంతరావు మాట్లాడుతూ పోటు ప్రసాద్ విద్యార్థి దశ నుంచి లౌకిక, వామపక్ష భావజాలంతో పని చేశారన్నారు. ప్రసాద్ తన చివరి కార్యక్రమాన్ని 40వ డివిజన్లో నిర్వహించారని, ఇక్కడి ప్రజలు స్తూపాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. కాగా, స్తూపం వద్ద సీపీఐ పతాకాన్ని రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బీజీ క్లెమెంట్, నాయకులు జానీమియా, పోటు కళావతి, మహ్మద్ సలాం, మేకల శ్రీనివాసరావు, పోటు రాజాసాత్విక్, పగడాల మల్లేశ్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. అసత్య ప్రచారంనమ్మొద్దు.. ఖమ్మంవ్యవసాయం: అయిల్పామ్ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న టీజీ ఆయిల్ ఫెడ్ (తెలంగాణ రాష్ట్ర సహకార నూనె గింజల రైతుల సమాఖ్య)పై పలు ప్రైవేట్ కంపెనీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సంస్థ మేనేజ్మెంట్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రైతులను ప్రోత్సహించి, నాణ్యమైన మొక్కలు అందించి, తాజా పండ్ల గుత్తులకు మార్కెట్ లింకేజీ కల్పించి, ఆయిల్పాం పంటను విస్తరిస్తున్నామని పేర్కొంది. ఇందుకు వ్యతిరేకంగా కొన్ని ప్రైవేట్ కంపెనీలు అసత్య ప్రచారం చేస్తూ సంస్థ ఖ్యాతిని దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నాయని, దీనిని ఎవరూ నమ్మొద్దని సూచించింది. అగ్ని ప్రమాద మృతులకు సంతాపం ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్ పాత నగరంలోని చార్మినార్ గుల్జార్ హౌస్ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం బాధాకరమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అగ్ని ప్రమాదం బాధాకరమని, బాధితులను ఆదుకోవాలని కోరారు. 9 ఇసుక లారీల పట్టివేత ఖమ్మంక్రైం: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 9 ట్రాక్టర్లను ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. గంధసిరి నుంచి నగరంలోకి తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్ల్ను రాపర్తివంతెన వద్ద, ఐదు ట్రాక్టర్లను ప్రకాష్నగర్ వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి టూటౌన్, త్రీటౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిసింది. పెళ్లికి వినూత్న ఆహ్వానం పాల్వంచ: పట్టణంలోని గోవర్దనగిరికాలనీకి చెందిన ఏనుగు రవీందర్రెడ్డి, జ్యోతి దంపతులు వారి కూతురు గౌతమిని సుజాతనగర్ వేపలగడ్డకు చెందిన తాళ్ల శ్రీనివాస్రెడ్డికి ఇచ్చి ఆదివారం వివాహం చేశారు. అయితే, ఈ పెళ్లిపత్రికను గుడ్డసంచిపై ముద్రించి అందులో కార్డు పెట్టి పంచారు. ‘ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం’ అందులో ప్రింట్ చేయించారు. వివాహం ఆద్యంతం ప్లాస్టిక్ వాడకుండా ఉండటంతో అందరూ అభినందించారు. శ్రీకనకదుర్గమ్మకు విశేష పూజలుపాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మ అమ్మవారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేషపూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈఓ ఎన్.రజనీకుమారి పాల్గొన్నారు. -
సేంద్రియ సాగుపై దృష్టి
జీవాల ఎరువు దుక్కికి బలం ● ఇతర జిల్లాల నుంచి వలసవచ్చి ఎరువు చేర్చి సంపాదిస్తున్న కురములు ● జీవాల ఎరువు కోసం పోటీ పడుతున్న రైతులు ● ఆధిక దిగుబడులు వస్తాయంటున్న అన్నదాతలు బోనకల్: పెరిగిన పెట్టుబడులు.. తగ్గుతున్న దిగుబడులు.. భూసార లోపాన్ని ఆధిగమించేందుకు అన్నదాతలు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారిస్తున్నారు. గతంలో పాడి పశువుల ఎరువును పొలాలకు ఎరువుగా ఉపయోగించుకునేవారు. తగ్గిన పశు సంపద వల్ల రైతులు తమ పొలాలకు ఎరువును వేయలేకపోవడంతో భూసారం తగ్గి దిగుబడులు పడిపోతున్నాయి. దీంతో రైతులు జీవాల ఎరువుపై దృష్టి సారించారు. కొందరు యాదవులకు ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేయడంతో వాటిని పొలాల్లో ఎరువుల కోసం ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు మహబూబ్నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో కురుమ, యాదవులు మేత కోసం గొర్రెలను బోనకల్ మండలం తీసుకొచ్చారు. ఉదయం మేతమేపుతూ రాత్రి సమయాల్లో వాటిని ఎరువు కోసం ఉంచుతున్నారు. 2000 జీవాలు ఒక రోజు ఉంచితే ఎకరం పొలానికి ఎరువు సరిపోతుంది. ఇందుకు గాను రైతుకు రూ.1500 నుంచి రూ.2000 ఖర్చవుతుంది. తక్కువ ఖర్చుతో పొలం సారవంతంగా తయారవుతుందని అన్నదాతలు వాటి కోసం పోటీ పడుతున్నారు. పొలంలో గొర్రెలు, మేకల మంద వదిలితే పేడ, మూత్రం, వెంట్రుకల వల్ల భూమికి సేంద్రియ పదార్థం లభిస్తుంది. గొర్రె పేడలో పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మెక్కల వేర్లు భూమిలోపలికి సులువుగా వెళ్లి తొందరగా మొక్క ఎదుగుతుందని రైతులు చెబుతున్నారు. వాటి మూత్రం పీహెచ్ 7.7 ఉండడం వల్ల భూమిలో ఉన్న చౌడు కూడా పోయి సారవంతంగా తయారవుతుంది. భూమి గుల్లబారడంతో పాటు ఒక లీటరు మూత్రంలో 3 నుంచి 13 గ్రాముల నత్రజని, 18 నుంచి 20 గ్రాముల పొటాషియం, పాస్పరస్ ఉంటాయి. గొర్రె లేదా మేక ఒక రాత్రికి లీటరు మూత్రం విసర్జిస్తుంది. ఈ ఎరువు వల్ల భూమిలో తేమశాతం నిల్వ ఉండి తడులు తక్కువగా పడతాయి. ఒక్క ఏడాది ఎరువు వస్తే మూడేళ్ల వరకు ఎరువు అవసరం ఉండదని రైతులు అంటున్నారు. -
ఆదివాసీ సమాజంపై రాజకీయ కుట్రలు
ఇల్లెందు: రాజకీయ కుట్రలకు ఆదివాసీ సమాజం బలవుతోందని తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు మైపతి అరుణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాగర్జన సభలో మాట్లాడారు. లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల గొంతు కోసిందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీలు కూడా లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తామని చెప్పడంలేదన్నారు. రాజకీయ పార్టీల కుట్రలను ఛేదించేందుకు ఆదివాసీలు అందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పొదెం వీరయ్య, తాటి వెంకటేశ్వర్లు వంటివారు ఒక్కసారి కూడా శాసనసభలో ప్రశ్నించలేదని ఆరోపించారు. ఆధార్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు జేజే రాంబాబు మాట్లాడుతూ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించామని, కేసు పెండింగ్లో ఉందని తెలిపారు. అంతకుముందు కొత్త బస్టాండ్ సెంటర్లో కొమరం భీం, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పట్టణంలో ఆదివాసీ వేషధారణలతో కళా ప్రదర్శన నిర్వహించారు. సభలో కళాకారులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈసం సుధాకర్, నాయకులు కల్తీ సత్యనారాయణ, మెట్ల పాపయ్య, తెల్లం వెంకటేశ్వర్లు, జనార్దన్, పోలెబోయిన వెంకటేశ్వర్లు, చుంచు రామకృష్ణ, పొడియం బాలరాజు, బుగ్గ రామనాధం, జోగ రాంబ్రహ్మం పాల్గొన్నారు.తుడుందెబ్బ నేత మైపతి అరుణ్కుమార్ -
● ప్రకృతి ఒడిలో వేసవి సంబురం
వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లల ఆనందానికి అవధుల్లేవు. ముఖ్యంగా వలస ఆదివాసీ పిల్లలు ప్రకృతి ఒడిలో ఎంతో సంతోషంగా గడుపుతారు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పచ్చని చెట్లు, కొండలు, కోనలు వారి ఆట స్థలాలు. పట్టణాల్లో సెల్ఫోన్లు, టీవీలకు పరిమితమయ్యే పిల్లలకు భిన్నంగా ఆదివాసీ పిల్లలు ప్రకృతితో మమేకమై స్వేచ్ఛగా ఆడుకుంటూ... పాడుకుంటూ తమ సెలవులను ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం కరకగూడెం మండలంలోని పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేట వలస ఆదివాసీ గ్రామంలో ఓ చెట్టుకు పాత చీరలను కట్టుకొని ఉయ్యాలా ఊగుతూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. ఆ దృష్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – కరకగూడెం -
గిరిజన గురుకులాల్లో సీట్లు భర్తీ
ఇల్లెందు: ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకుల జూనియర్ బాలుర, బాలికల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సెలింగ్కు విద్యార్థులు బారులుదీరారు. 15, 16 తేదీల్లో నిర్వహించిన కౌన్సెలింగ్లో 737 సీట్లు ఉండగా అన్నీ భర్తీ అయ్యాయి. బాలుర కోసం ఆర్జేసీ, యూఆర్జేసీ దమ్మపేట, ఆర్జేపీ, యూఆర్జేసీ కిన్నెరసాని డ్యామ్ సైట్, ఆర్జేసీ, యూఆర్జేసీ గుండాల, యూఆర్జేపీ సింగరేణి, తిరుమలాయపాలెం, ఆర్జేసీ కృష్ణసాగర్ జూనియర్ కళాశాలు ఉన్నాయి. ఇక బాలికల కోసం ఆర్జేసీ భద్రాచలం, సుదిమళ్ల, అంకంపాలెం, యూఆర్జేసీ భద్రాచలం, సుదిమళ్ల, మణుగూరు, కొత్తగూడెం, వైరా, అన్నపురెడ్డిపల్లి ఉన్నాయి. ఒక్క భద్రాచలం బాలికల గురుకులంలో పీఎస్టీటీ–20 సీట్లు, ఐఎం–20 సీట్లు, సీఎస్–20 సీట్లు, ఏటీ–20 సీట్లు, కిన్నెరసాని డ్యామ్ సైట్లో ఏటీ–20 సీట్లు, ఈటీ–20 సీట్లు తప్ప మిగిలిన అన్నీ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపులు ఉన్నాయి. పెరుగుతున్న విద్యార్థులు.. గతంలో టెన్త్ విద్యార్థుల ఉత్తీర్ణత తక్కువ ఉండటం వల్ల సీట్లు భర్తీ కావటం కష్టంగా ఉండేది. కొంతకాలంగా టెన్త్ ఉత్తీర్ణత పెరిగింది. విద్యార్థులు ఇంటర్లో చేరడం వస్తున్నారు. ఈ దఫా తొలి కౌన్సెలింగ్లోనే 12 గురుకులాలు 18 కళాశాలల్లో చేరికలు పెరిగాయి. సీట్లన్నీ భర్తీ అయ్యాయి ఐటీడీఏ పీఓ ఆదేశానుసారం ఈ నెల 15, 16 తేదీల్లో జరిగిన గురుకుల బాలుర బాలికల జూనియర్ కళాశాలల ప్రవేశానికి పదో తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్లో సీట్లు భర్తీ చేశాం. అన్ని కళాశాలల్లో ఉన్న 737 సీట్లు భర్తీ అయ్యాయి. –బి.అరుణకుమారి, ఆర్సీఓ, భద్రాచలం -
ఆకట్టుకున్న ‘తితిక్ష’
ఖమ్మంగాంధీచౌక్: గంజాయి మత్తులో తూగుతూ రాక్షసుడిగా వ్యవహరిస్తున్న కొడుకును తల్లి హత్య చేసిన ఇతివృత్తంగా రూపొందించిన ‘తితిక్ష’ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్ కళాకారులు ఈ నాటికను ప్రదర్శించారు. ముందుగా హైదరాబాద్ దాశరథి థియేటర్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం సహకారంతో నాన్న ఉత్తరం, నా ఆడపిల్ల లఘు చిత్రాలను ప్రదర్శించారు. ముళ్లపూడి ఈశ్వరి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నెలనెలా వెన్నెల నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన సభలో నాటిక ప్రదర్శకులకు పారితోషికం అందించారు. ఈ సందర్భంగా దాతలు న్యాయవాది జాబిశెట్టి పాపారావు, కొండపల్లి జగన్మోహన్ రావు, వంగవీటి నవీన్ మాట్లాడుతూ.. రంగస్థల కళాకారులను ప్రోత్సహిస్తూ నెల నెలా వెన్నెల కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మంలో ఇలాంటి నాటికలు ప్రదర్శించటం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, మోటమర్రి జగన్మోహన్ రావు, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, వేముల సదానందం, నామా లక్ష్మీనారాయణ, మార్తి కొండల్రావు, నందిగామ కృష్ణ, శానం వీరబాబు, జి.రవీందర్ పాల్గొన్నారు. -
ఫార్మర్ ఐడీలో ఫస్ట్..
ఖమ్మంవ్యవసాయం : ఫార్మర్ ఐడీ(రైతు గుర్తింపు) రిజిస్ట్రేషన్ల నమోదు ప్రక్రియలో జిలా అగ్రగామిగా నిలిచింది. వ్యవసాయ రంగాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఫార్మర్ ఐడీ ప్రాజెక్ట్ ఈనెల 5న ప్రారంభం కాగా, ఇప్పటి వరకు నమోదులో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం ఉన్న 32 జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పథకం నిబంధనల ఆధారంగా జిల్లాలో 3,40,072 మంది రైతులు అర్హులు ఉన్నారు. వీరిలో మే 17 నాటికి 45,450 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 35,017 మంది రైతులకు ఫార్మర్ ఐడీ జనరేట్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రెండో స్థానంలో రాజన్న సిరిసిల్ల, మూడో స్థానంలో కరీంగనర్, నాలుగో స్థానంలో కామారెడ్డి, ఐదో స్థానంలో నిజామాబాద్ జిల్లాలు నిలవగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 17వ స్థానానికి పరిమితమైంది. చివరి స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉంది. అవగాహనతోనే వేగవంతం.. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫార్మర్ ఐడీపై రైతులకు అవగాహన కల్పించడంతో ఈ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. కేంద్రం రూపొందించిన పథకాల అమలుకు ఈ ప్రాజెక్ట్ను రూపొందించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, భారత ఆహార భద్రత మిషన్, రాష్ట్రీయ కృషి వికాస యోజన వంటి పథకాల అమలులో ఈ ఐడీ కార్డు కీలకం కానుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను పారదర్శకంగా రైతుల దరి చేర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో వానాకాలం పంట సాగు అంశాలను వివరించడంతో పాటు ఫార్మర్ ఐడీతో ప్రయోజనాలు, రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యతను కూడా వివరిస్తుండగా ప్రక్రియ వేగవంతానికి ఇవి దోహదం చేస్తున్నాయి. భూమి, పంటల సాగు వివరాలు నమోదు.. ఫార్మర్ ఐడీ ప్రక్రియలో రైతులకు ఉన్న భూమి వివరాలు సర్వే నంబర్ల వారీగా నమోదవుతాయి. భూమి రకం, ఆయా భూముల్లో సాగు చేసే పంటలను కూడా పొందుపరుస్తారు. డిజిటల్ విధానంలో వ్యవసాయ విస్తరణాధికారులు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 129 క్లస్టర్లలో ఈ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. రైతు వేదికల్లో నిర్వహించే ఈ ప్రక్రియకు రైతులు తరలివస్తూ ఫార్మర్ ఐడీ కోసం తమ భూములు, పటల సాగు వివరాలు చెబుతూ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అందుబాటులో లేని కొందరు రైతులు మీ సేవా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు.రైతు గుర్తింపు నమోదులో జిల్లా ముందంజ పది రోజల్లో 45 వేల మంది రిజిస్ట్రేషన్ 35 వేల మందికి గుర్తింపు కార్డులు సిద్ధం జూన్ 5 వరకు పూర్తి స్థాయిలో అర్హుల రిజిస్ట్రేషన్, ఐడీ కార్డుల జారీఫార్మర్ ఐడీకి ఎంతో ప్రాధాన్యం ఫార్మర్ ఐడీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ కార్డు ఆధారంగానే కేంద్ర పథకాలు అందుతాయి. కార్డు లేనివారు ఆ పథకాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. రైతులు తప్పనిసరిగా నిర్దేశిత గడువు లోగా ఏఈఓలను సంప్రదించి భూములు, పంటల సాగు వివరాలను తెలిపి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. – ధనసరి పుల్లయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
ముందస్తు ‘కోటా’
● ఒకేసారి మూడు నెలల బియ్యం సరఫరా ● పంపిణీకి అధికార యంత్రాంగం సన్నద్ధం ● ఇప్పటికే డీలర్లతో సమావేశం ఖమ్మం సహకారనగర్: పేదలకు రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తుండగా.. జూన్లో మాత్రం ఒకేసారి మూడు నెలల కోటా అందించనున్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం ముందుగానే లబ్ధిదారులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు ప్రతి నెల మాదిరిగానే బియ్యం సరఫరా చేసి.. ప్రజలకు పంపిణీ ప్రారంభించే సమయానికి మిగతా రెండు నెలల బియ్యం నిల్వలు కూడా ఆయా రేషన్ దుకాణాలకు ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నెలకు 6,500 మెట్రిక్ టన్నులు.. జిల్లాలోని 21 మండలాల పరిధిలో 748 రేషన్ దుకాణాలుండగా.. వీటి పరిధిలో 4,10,988 కార్డులు ఉన్నాయి. 11,48,031 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుండగా 73,75,868 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతున్నాయి. సరాసరిన 90 శాతం వరకు లబ్ధిదారులు తీసుకెళ్తున్న క్రమంలో సుమారు 6,500 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు అవసరం అవుతుండగా.. మూడు నెలలకు సంబంధించి సుమారు 20వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. పంపిణీపై సమాలోచనలు.. ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేయాల్సిన క్రమంలో అధికారులు, డీలర్లు సమాలోచనలు చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో నెలకు సరిపోయే అన్ని సరుకులు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉన్న క్రమంలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఎలా పంపిణీ చేయాలి.. ఎక్కడ నిల్వ ఉంచాలి.. పంపిణీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే అంశాలపై అధికారులు ఆలోచిస్తున్నారు. గత మూడు రోజుల క్రితం రేషన్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలోనూ మూడు నెలల బియ్యం పంపిణీపై అధికారులు పలు సూచనలు చేశారు.సన్నద్ధమవుతున్నాం ఇటీవల రాష్ట్రస్థాయి అధికారులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం రేషన్ లబ్ధిదారులకు ఇవ్వాలనే అంశంపై పలు సూచనలు చేశారు. వారి సూచనల ప్రకారం జిల్లాలో మూడు నెలలకు సంబంధించిన బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వచ్చిన వెంటనే వాటిని అమలు చేయనున్నాం. – చందన్కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి -
తహసీల్దార్లకు పోస్టింగ్లు
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలోని పలువురు తహసీల్దార్లకు ఇటీవల బదిలీలు జరగగా.. వారి స్థానంలో జిల్లాకు కేటాయించిన తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇస్తూ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఆయా స్థానాల్లో వెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చిన డి.సైదులును ఖమ్మం అర్బన్ తహసీల్దార్గా, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ వి.రవికుమార్ను కూసుమంచి మండలానికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన ఎం.రమాదేవిని బోనకల్ తహసీల్దార్గా, మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఎస్.శ్వేతను రఘునాథపాలెం మండలానికి, అక్కడి తహసీల్దార్ లూథర్ విల్సన్ను తిరుమలాయపాలెం మండలానికి బదిలీ చేశారు. ఎస్.వి.నారాయణమూర్తిని కల్లూరు ఆర్డీఓ కార్యాలయ డీఏఓగా నియమించారు. హెచ్ఐవీ రహిత జిల్లాగా మార్చాలిడీఎంహెచ్ఓ కళావతిబాయి ఖమ్మంవైద్యవిభాగం : జిల్లాను హెచ్ఐవీ రహితంగా మార్చాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతిబాయి అన్నారు. అంతర్జాతీయ కొవ్వొత్తుల స్మారక దినం సందర్భంగా ఆదివారం రాత్రి స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కళావతిబాయి మాట్లాడుతూ.. హెచ్ఐవీతో జీవిస్తున్న వారి పట్ల ప్రేమ, అనురాగాలు చూపించాలని, వారిని కూడా సమాజంలో అందరిలాగే గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ డాక్టర్లు లక్ష్మణరావు, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ఖమ్మం సహకారనగర్ : జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో మొత్తం ఏడు ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఖమ్మం, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఆరు కేంద్రాలు ఉండగా.. సత్తుపల్లిలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 : 30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు కొనసాగగా.. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. రామయ్యకు సువర్ణ పుష్పార్చనభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారికి ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కిన్నెరసానిలో జలవిహారంపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు కిన్నెరసాని ప్రాజెక్ట్కు తరలివచ్చారు. డ్యామ్పై నుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 560 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.30,820 ఆదాయం లభించింది. 250 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.13,300 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
బాల్య వివాహాల నివారణ అందరి బాధ్యత
ఐసీడీఎస్ సీడీపీఓ దయామణి కారేపల్లి: బాల్యవివాహాలు నివారించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని సీడీపీఓ దయామణి అన్నారు. ఆదివారం కారేపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బాల్యవివాహాలు సమాజానికి ప్రతిబంధకాలని, ఎన్నో అనర్థాలకు దారితీస్తాయని తెలిపారు. 18 ఏళ్లు నిండని బాలికల్లో శరీర, మానసిక పెరుగుదల, లైంగిక పరిపక్వత సరిగా ఉండదని అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రామ కార్యదర్శి, ఐసీడీఎస్ సూపవర్వైజర్, తహసీల్దార్, సీడీపీఓ, ఆర్డీఓ, కలెక్టర్లకు బాల్య వివాహాలు నిరోధించే అధికారం ఉందని వివరించారు. బాల్య వివాహం జరుగుతోందని తెలిస్తే 1098కి సమాచారం ఇస్తే హెల్ప్లైన్ సిబ్బంది, కార్యదర్శి, పోలీస్, ఐసీడీఎస్ అధికారులు ఆ ఇంటిని సందర్శించి విచారణ చేపడతారని చెప్పారు. -
మద్యం ధరలకు రెక్కలు
● క్వార్టర్పై రూ. 10, ఫుల్ బాటిల్కు రూ.40 పెంపు ● నేటి నుంచి అమలుకు రంగం సిద్ధంవైరా: మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గత నవంబర్లో బీరు ధరలు పెంచిన సర్కార్.. ఆరు నెలలకే లిక్కర్ ధరలు కూడా పెంచడంతో మద్యం ప్రియుల జేబులకు చిల్లు పెట్టినట్టయింది. పెరిగిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. చీప్ లిక్కర్ నుంచి అన్ని రకా ల మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. క్వార్టర్ (180 ఎంఎల్) సీసాపై రూ.10 పెంచగా, హాఫ్ బాటిల్కు రూ. 20, ఫుల్ బాటిల్పై రూ.40 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లో మద్యం కూడా ఒకటి. గతంలో బీర్ల ధర రూ. 20 నుంచి రూ. 40 వరకు పెంచడంతో ఈ ఏడాది గతంలో ఏన్నాడూ లేనంతగా బీర్ల అమ్మకాలు సగానికి పైగా తగ్గాయి. మళ్లీ అన్ని బ్రాండ్ల లిక్కర్ రేట్లు పెంచడంతో అమ్మకాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. నేడు మద్యం డిపోలో బిల్లింగ్ ఆలస్యం.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మద్యం సరఫరా అయ్యే వైరాలోని మద్యం డిపోలో వ్యాపారులు బిల్లింగ్ కోసం వస్తుంటారు. పెరిగిన ధరల జాబితా ఆన్లైన్లో ఆప్డేట్ అయ్యేందుకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, మధ్యాహ్నం తర్వాత సర్వర్లో మార్పులు చేసి పూర్తి స్థాయిలో ధరల జాబి తాను వ్యాపారులకు అందించే అవకాశం ఉంటుందని డిపో అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో పెంచిన ధరల జాబితా చక్కర్లు కొడుతోంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయంతో మద్యం ప్రియులపై ధరల పిడుగు పడిందని చెప్పొచ్చు. మద్యం ప్రియుల ‘బారు’లు ఖమ్మంక్రైం : పెరిగిన మద్యం ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని పలు వైన్స్, బార్ షాపుల ఎదుట మద్యం ప్రియులు బారులుదీరారు. క్వార్టర్కు రూ.10, హాఫ్ రూ.20, ఫుల్ బాటిల్కు రూ.40 చొప్పున పెరుడుతుండడంతో పలువురు మద్యం కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నారు. -
నిరీక్షణకు ఇక తెర..
● నేర పరిశోధనలో కీలకంగా ఫోరెన్సిక్.. ● వేగవంతమవుతున్న పోస్ట్మార్టం ● 15 నెలల్లో 1,218 శవ పరీక్షలు ● అందులో 20 శాతం అనాథ శవాలేసకాలంలో నివేదికలు అందజేస్తున్నాం శవ పరీక్షలు ఏరోజుకారోజు నిర్వహిస్తున్నాం. రాత్రి పూట కూడా పోస్టుమార్టం చేస్తున్నాం. పోలీసు కేసుల విచారణకు అవసరమైన రిపోర్టులు సకాలంలో అందజేస్తున్నాం. మార్చురీ వద్దే కార్యాలయం ఏర్పాటు చేసి నిత్యం అందుబాటులో ఉంటున్నాం. సాధ్యమైనంత వరకు ఇక్కడే శవ పరీక్షలు నిర్వహిస్తున్నాం. అత్యవసరమైన వాటికి హైదరాబాద్కు శాంపిళ్లు పంపిస్తున్నాము. భవిష్యత్లో అన్ని పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తాం. – రాథోడ్ వినాయక్, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కొంతకాలంగా శవ పరీక్షలు వేగంగా జరుగుతున్నాయి. ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చాక పోస్టుమార్టం నిర్వహణ, రిపోర్టులు వేగవంతంగా రావడం పోలీసుల నేరపరిశోధనకు ఉపయుక్తంగా మారాయి. సంబంధిత వ్యక్తి ఎలా, ఎప్పుడు మరణించాడనేది తేల్చేందుకు పోస్ట్మార్టం నిర్వహిస్తారు. పోలీసులు పంచనామా నిర్వహించి ఫోరెన్సిక్ వైద్యునికి రిక్వెస్ట్ లెటర్ పెట్టిన తర్వాత శవ పరీక్ష చేస్తారు. ఆ తర్వాత వైద్యుడు ఇచ్చే రిపోర్ట్ను బట్టి పోలీసులు విచారణ చేపడతారు. గతంలో శవ పరీక్షకు చాలా ఇబ్బందులు ఉండేవి. పోలీసులు పంచనామా సిద్ధం చేసి మార్చురీకి వచ్చినా పోస్టుమార్టానికి వైద్యుడు రావడం ఆలస్యమయ్యేది. దీంతో పోలీసులు, మృతుల బంధువులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. అంతేకాక క్రిటికల్ కేసుల్లో మృతికి కారణాలను గుర్తిస్తూ రూపొందించే రిపోర్టులు ఆలస్యంగా వచ్చేవి. కొన్ని వరంగల్, మరికొన్ని హైదరాబాద్ పంపించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్ధితి లేదు. కీలకమైన శవ పరీక్షలే హైదరాబాద్లో చేయిస్తున్నారు తప్ప మిగితావి ఖమ్మంలోనే నిర్వహిస్తున్నారు. ఘోషిస్తున్న అనాథ శవాల ఆత్మలు ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీలో గత 15 నెలల్లో 1,218 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. 2024లో 995, ఈ మూడు నెలల కాలంలో 223 శవపరీక్షలు జరిగాయి. జిల్లాలో హత్యలు, ఆత్మహత్యలు, రైలు, రోడ్డు ప్రమాదాలు, అనుమానిత మరణాలకు సంబంధించిన బాడీలకు ఇక్కడే పోస్టుమార్టం నిర్వహిస్తారు. అలా వచ్చే మృతదేహాల్లో 20 శాతానికి పైగా అనాథ శవాలే ఉంటున్నాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడి నుంచో వచ్చి జిల్లాలో మృతి చెందే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యాచకులు, పనుల కోసం వచ్చే వారు, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందేవారు, ట్రైన్ నుంచి పడి మృతి చెందే వారు ఎక్కువగా ఉంటున్నారు. వారిని గుర్తు పట్టడం కష్టం అవుతుండగా కొద్ది రోజులు వేచి చూసి పోలీసులు, ఆస్పత్రి అధికారుల నిర్ణయంతో అనాథ శవాలుగా దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఈ శవాల దహనానికి జిల్లాలో ప్రభుత్వ పరంగా ఎలాంటి వ్యవస్థ లేదు. దీంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.శవ పరీక్ష కీలకం.. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి డీఎంఈ పరిధిలోకి వెళ్లిన తర్వాత ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు దీనిపై సబ్జెక్ట్ ఉంటుంది. ఫోరెన్సిక్ విభాగంలో ప్రత్యేకంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్లను నియమించారు. దీంతో పోస్టుమార్టం నిర్వహణలో ఇబ్బందులు తొలగిపోయాయి. బాధిత కుటంబాలకు సకాలంలో సేవలు అందుతుండగా, పోలీసులకు సైతం రిపోస్టులు సమయానికి వస్తున్నాయి. కాగా నేరపరిశోధనలో పోస్టుమార్టం రిపోర్టు కీలకం. మృతికి దారి తీసిన ఘటనలను నిర్ధారించాల్సిన అవసరం ఉంటుంది. సాదారణంగా హత్య, ఆత్మహత్య, హత్యాచారం, ప్రమాదం, అనుమానాస్పద మరణాలు సంభవించినప్పుడు క్రిమినల్ కేసుల పరిష్కారానికి శవ పరీక్షలు కీలకంగా నిలుస్తాయి. గతంలో పోస్ట్మార్టం ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగగా ఫోరెన్సిక్ వైద్యుడి రాకతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. మార్చురీ వద్ద ఫోరెన్సిక్ విభాగం ఏర్పాటుతో వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటుండగా నిరీక్షణకు తెరపడింది. -
టీచర్ పెళ్లిలో ట్విస్ట్.. నేను ప్రేమిస్తున్నా అంటూ ఉపాధ్యాయుడు..
సాక్షి, పాల్వంచ: వారిద్దరూ టీచర్లుగా పనిచేస్తున్నారు.. ఆమె భర్తకు దూరమైంది. అతడికి భార్య లేదు. దీంతో, రెండు కుటుంబాల పెద్దలు వారిద్దిరికీ పెళ్లి కుదిర్చారు. జీవితంలో రెండో అధ్యాయాన్ని ప్రారంభించాలనుకున్న ఈ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. పెళ్లి వేడుకకు వచ్చిన మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ‘ఆపండి... నేను ఆమెను ఇష్టపడ్డాను.. నేనే పెళ్లి చేసుకుంటాను’ అంటూ గందరగోళం సృష్టించడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ వింత ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. పాల్వంచకు చెందిన 29 ఏళ్ల మహిళ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆమెకు వివాహం జరిగింది. ఆమెకు ఓ పాప కూడా ఉంది. అయితే, కొన్నాళ్లకు భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం స్థానిక ప్రైవేటు స్కూల్లో పనిచేస్తోంది. మరోవైపు, ఖమ్మంలో పనిచేస్తున్న 33 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ఆమెకు రెండో వివాహం నిశ్చయించారు. పెళ్లయిన కొన్నాళ్లకే అతని భార్య చనిపోయింది. ఆయనకు కూడా ఇది రెండో వివాహం. ఇరు కుటుంబాల పెద్దలు వీరిద్దరికీ వివాహం జరిపించాలని నిశ్చయించారు. శనివారం సాయంత్రం పాల్వంచలోని ఓ ప్రార్థనా మందిరంలో పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు.కాసేపట్లో పెళ్లి అయిపోతుందన్న సమయంలో మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారిగా.. నాకు వధువు అంటే ఇష్టం. ప్రైవేటు స్కూల్లో పనిచేసేటప్పుడు వధువుతో పరిచయం ఏర్పడింది. నాకు పెళ్లయినా పిల్లలు పుట్టలేదు. నా భార్యకు విడాకులిచ్చి ఈమెను పెళ్లాడతా అంటూ రచ్చ చేశాడు. ఈ సందర్భంగా వధువు మాట్లాడుతూ.. అతడు గతంలో బతిమిలాడగా తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని చెప్పాను. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. అలాగే, ఆమెతో వివాహేతర సంబంధమున్నట్లు వరుడికి సైతం ఒకసారి ఫోన్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో అతడిని పట్టుకునేలోపే అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. ఈ రచ్చ కారణంగా వరుడితోపాటు అతడి బంధువులు వెళ్లిపోవడంతో వివాహం ఆగిపోయింది. అనంతరం, యువతి, ఆమె కుటుంబ పోలీసులను ఆశ్రయించారు. అతడితో ఫిర్యాదు చేశారు. -
ఎస్సెస్సీ ప్రతిభావంతులకు నగదు ప్రోత్సాహకాలు
ఖమ్మంగాంధీచౌక్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి ప్రతిభ చాటిన విద్యార్థినీ, విద్యార్థులకు మిత్రా ఫౌండేషన్ ఆధ్వర్యాన రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ బహుమతులు అందజేసి అభినందించారు. మొదటి బహుమతి రూ.25 వేలతో పాటు ల్యాప్టాప్ను పచావ వెన్నెల, మాఘం యశ్వంత్ రూ.25 వేలు, చింతోజు సాయి రూ.15 వేలు అందుకోగా, తిరుమలదాసు మాధురి, రామిశెట్టి ఉమ, ఆవుల శ్రీమన్య, గోడ లక్ష్మి, పుచ్చకాయల భవ్య, చందా భావనకు రూ.10 వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించటం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. తొలి ఐదు స్థానాల్లో నిలిచిన ఐదుగురు విద్యార్థులను ఢిల్లీకి విమానంలో మూడు రోజుల యాత్రకు తీసుకెళ్తామని తెలిపారు. మిత్ర ఫౌండేషన్ డైరెక్టర్లు రంగా శ్రీనివాస్, పోలవరపు శ్రీనివాస్, చారుగుండ్ల రవికుమార్, చెరుకూరి యుగంధర్, నాగసాయి నగేశ్, ప్రసేన్, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ బాధ్యులు, వైరా ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు దొడ్డా వరప్రసాద్, కిరణ్కుమార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మొదటి ఐదుగురికి విమానయానం కూడా.. -
ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేపట్టాలి
ఖమ్మంసహకారనగర్: రానున్న విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని టీపీటీఎఫ్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా శనివారం డీఈఓ సామినేని సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏవీ నాగేశ్వరరావు, వెంగళరావు మాట్లాడుతూ.. గతేడాది ఖాళీగా ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారని, ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలను పదోన్నతులు, డీఎస్సీ నియామకాలతో భర్తీ చేశారని తెలిపారు. కానీ నేటికీ కూడా డిప్యూటేషన్పై వెళ్లిన ఉపాధ్యాయులు వారి మాతృస్థానానికి వెళ్లలేదని, తద్వారా ఒకే పాఠశాలలో ఒకే సబ్జెక్టుకు ఇద్దరు ఉపాధ్యాయులు పని చేయాల్సి వస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా ప్రక్రియ చేపట్టాలని కోరారు. -
మధిరకు మాస్టర్ ప్లాన్
● జోన్ల వారీగా కన్సల్టెన్సీతో రూపకల్పన ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కమధిర: మధిర మున్సిపాలిటీ కేంద్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నందున భవిష్యత్ అవసరాల దృష్ట్యా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శనివారం మధిర వచ్చిన ఆయన స్థానిక వైఎస్సార్ విగ్రహం నుండి క్యాంపు కార్యాలయం వరకు నడిచి వెళ్తూ ఇరుపక్కలా పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, అధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పరిశ్రమలు, గృహ, వాణిజ్య జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలను అనుభవం కలిగిన కన్సల్టెన్సీకి అప్పగించాలని తెలిపారు. అలాగే, రహదారుల వెంట చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ నిర్మూలనపైనా దృష్టి సారించాలని తెలిపారు. కాగా, రోడ్లపై అక్రమ కట్టడాలు లేకుండా చూస్తూ, ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని, చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని చెప్పారు. అంతేకాక మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణానికి రూ.3.50 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అండర్ గ్రౌండ్ కేబుల్ పనులపై ఆరా మధిరలో విద్యుత్ సరఫరా కోసం అండర్ గ్రౌండ్ కేబుల్ వేయనుండగా ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డితో కలిసి పరిశీలించారు. మధిరలోని ఆత్కూరు క్రాస్ నుంచి నందిగామ బైపాస్ రోడ్డు వరకు, ఆర్ఈ కాంప్లెక్స్ నుండి బస్టాండ్ వరకు భూగర్భంలో కేబుల్ వేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సుమారు రూ.40 కోట్ల వ్యయంతో 18 కి.మీ. 11 కేవీ కేబుల్, 12 కి.మీ. పరిధిలో ఎల్టీ కేబుల్ వేసేలా సిద్ధం కావాలని తెలిపారు. ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్ రెడ్డి, మధిర మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, విద్యుత్ శాఖ డీఈలు శ్రీనివాసరావు, హీరాలాల్, ఏడీఈలు అనురాధ, కిరణ్ చక్రవర్తి, నాగమల్లేశ్వరరావు, ఏఈలు అనిల్ కుమార్, అనూష, మైథిలి, గణేష్ పాల్గొన్నారు. కాగా, విద్యుత్ లైన్ పనులపై చర్చిస్తున్న సమయాన అక్కడ ఉన్న మహిళలను డిప్యూటీ సీఎం పలకరించారు. దీంతో వారు తమది దెందుకూరు అని, ఖమ్మం నుంచి వస్తున్నట్లు చెప్పడంతో ఉచిత బస్సు ప్రయాణంపై ఆరా తీశారు. -
కార్పొరేట్ కళాశాల పిలుస్తోంది..
● ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● నాలుగు జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి అవకాశం ● 107 సీట్ల కోసం ఈనెల 31 వరకు గడువు ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్య కోసం కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలోని శ్రీచైతన్య, కృష్ణవేణి, రెజొనెన్స్, సీవీ రామన్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 107 సీట్లలో ఈ అభ్యర్థులు చేరవచ్చు. రిజర్వేషన్ ప్రాతిపదికన అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. వీరికి అవకాశం.. పదో తరగతిలో 7 జీపీఏ లేదా 400 మార్కులకు పైన సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ఆశ్రమ, ప్రభుత్వ వసతిగృహాలు, ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కేజీబీవీ, నవోదయ, కేంద్రియ విద్యాలయాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే ఈ కళాశాలల్లో చేరేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థినీ విద్యార్థులు తప్పని సరిగా గడిచిన ఏడేళ్ల స్టడీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, సీబీఎస్ఈ ప్రభుత్వ పాఠశాలలు అంటే కేంద్రియ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు వారి ఎస్ఎస్సీ వివరాలు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలోని ఈ–పాస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లు ఈ కళాశాలల్లో విద్యను అభ్యసించేందుకు రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్లను కేటాయించారు. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ ఉండగా.. అందులో 9 శాతం మాదిగ, అనుబంధ కులాలకు, 5 శాతం మాల అనుబంధ కులాలకు, ఒక శాతం షెడ్యూల్ కులాల్లోని ఇతర కులాలకు కేటాయించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తదితర వాటిల్లో కూడా ఈ రిజర్వేషన్ విధానమే అమలు కానుంది. మొత్తం 107 సీట్లలో ఎస్సీలకు 46 సీట్లు కేటాయించారు. అలాగే మైనార్టీలకు 5, ఎస్టీలకు 26, బీసీలకు 17, బీసీ–సీలకు 8, ఈబీసీలకు 5 కేటాయించారు. మొత్తం సీట్లలో 3 శాతం వరకు అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు కేటాయిస్తారు. రిజర్వేషన్ల మేరకు అభ్యర్థులు లేనిపక్షంలో ఇతర కేటగిరిలోని విద్యార్థులకు ఆ సీట్లు కేటాయిస్తారు. కావాల్సిన పత్రాలు అర్హత కలిగిన అభ్యర్థులు ఆయా ధ్రువీకరణ పత్రాలతో ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం పదో తరగతి ధ్రువీకరణ పత్రం, మీసేవ నుంచి పొందిన కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, వసతి గృహ విద్యార్థి అయితే సంక్షేమ అధికారి ధ్రువీకరణపత్రం, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్ బుక్, ఫిజికల్లీ చాలెంజ్డ్ పత్రాలు ఉండాలి.అభ్యర్థులు సద్వినియోగం చేసుకోండి.. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కళాశాలల్లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ–పాస్ వెబ్సైట్లో ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలి. వివరాలు తెలుసుకునేందుకు ఐడీఓసీలోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించవచ్చు. కస్తాల సత్యనారాయణ, ఎస్సీ డీడీ, ఖమ్మం -
విద్యావ్యవస్థ సమర్థవంతంగా కొనసాగాలి
ఖమ్మంసహకారనగర్: విద్యావ్యవస్థను సమర్థవంతంగా కొనసాగేలా అందరూ కృషి చేయాలని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ (సైట్) డైరెక్టర్ విజయలక్ష్మీబాయి సూచించారు. ఖమ్మంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఎంఈఓలు వారి పరిధి పాఠశాలల్లో బోధన నాణ్యత పెంచేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతీనెల ఉపాధ్యాయుల సమీక్షలు నిర్వహించి, ప్రణాళికపై సూచనలు చేయాలని తెలిపారు. ఆ తర్వాత బడిబాట, పాఠ్యపుస్తకాల సరఫరా, ఏకరూప దుస్తులు సిద్ధం చేయడంపై సూచనలు చేసిన ఆమె శిక్షణలో ప్రతభ కబబర్చిన ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ, ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, అకడమిక్ మానిటరింగ్ అధికారి రవికుమార్, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ రాజశేఖర్, ఎంఈఓలు పాల్గొన్నారు. కాగా, పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి చేయడమే కాక విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సమకూర్చాలని, అన్ని పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పించాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైదులు సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయికి వినతిపత్రం అందజేశారు. ఎస్టీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండు యాదగిరి, ఎస్కే మన్సూర్, నాయకులు పోతగాని వెంకన్న, పాశం శ్రీనివాస్, రామకృష్ణ, రాజు, పెనుగొండ ఉపేందర్రావు పాల్గొన్నారు. సైట్ డైరెక్టర్ విజయలక్ష్మీబాయి -
జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామి మూలవిరాట్తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి తెలంగాణ, ఏపీ నుంచి భారీగా హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ చేశారు. పెళ్లిళ్ల సీజన్కు తోడు పాఠశాలలకు సెలవులు కావడంతో స్వామి దర్శనానికి భక్తులు బారులుదీరారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్శర్మ, మురళీమోహన్శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. పశువుల అక్రమ రవాణాపై సమాచారం ఇవ్వండి ఖమ్మంక్రైం: పశువుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ సూచించారు. అంతేతప్ప సంస్థల బాధ్యులు చట్టాన్ని అతిక్రమించి వాహనాలను అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. పశువుల రవాణా విషయంలో వివాదాలు తలెత్తకుండా ఇప్పటికే ఏడు చెక్ పోస్టులు ఏర్పాటుచేశామని వెల్లడించారు. చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పండుగ జరుపుకునేలా అవసరమైన చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ వివరించారు. వర్షాలు వచ్చేలోగా మరమ్మతులు పూర్తి కూసుమంచి: పాలేరులోని మినీ హైడల్ ప్రాజెక్టు(జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం)లో మరమ్మతులను వర్షాలు మొదలయ్యేలోగా పూర్తిచేయాలని జెన్కో నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఈ(ఓఅండ్ఎం) మంగేష్ కుమార్ ఆదేశించారు. ప్రాజెక్టు పనులను శనివారం పరిశీలించిన ఆయన ఉద్యోగులకు సూచనలు చేశారు. షెడ్యూల్డ్ ప్రకారం పనులు చేపట్టి వర్షాలు మొదలుకాగానే విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేసే కాలువ కట్ట కొట్టుకుపోయిన చోట మరమ్మతులను కూడా సీఈ పరిశీలించారు. ప్రజలకు సౌకర్యంగా వీధివ్యాపారుల ప్రాంగణం ఖమ్మంమయూరిసెంటర్: మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా ప్రజలకు అసౌకర్యం లేకుండా వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని తీర్చిదిద్దలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. ఖమ్మం పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణాన్ని శనివారం తనిఖీ చేసిన ఆయన వ్యాపారులతో మాట్లాడారు. మార్చి 12న కలెక్టర్ తనిఖీ చేసినప్పుడు వెల్లడైన సమస్యల పరిష్కారంపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సూచనలు చేశారు. ఇందులో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు, నిర్మిస్తున్న షెడ్లను పరిశీలించి నాణ్యత ప్రమాణాల ప్రకారం గడువులోగాపనులు పూర్తిచేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, అధికారులు ఉన్నారు. -
ఊరంతా.. ఖాతా!
నీటి కుంట.. పంటకు లాభమంట ఫాంపాండ్ల తవ్వకంతో లాభాలు ఉన్నందున తవ్వకంపై రైతుల ఆసక్తి మేరకు వివిధ శాఖల అధికారులు ప్రోత్సహిస్తున్నారు.వాతావరణ ం జిల్లాలో ఆదివారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. సాయంత్రం తర్వాత కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశముంది.ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 20258లోసంపాదించిన సొమ్మంతా ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తే ఆపద, అవసరాలకు ఇతరుల వద్ద చేయి చాచాల్సి వస్తుంది. ఒకవేళ ప్రైవేట్ సంస్థల్లో చీటీలు వేయాలన్నా, పొదుపు చేయాలన్నా భయం వెంటాడుతుంటుంది. అందుకే పోస్టాఫీస్, బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు, డిపాజిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రజలకు సరైన అవగాహన లేక పోస్టాఫీసు సేవలను సద్వినియోగం చేసుకోవడం లేదు. కానీ ముదిగొండ మండలంలోని వల్లభి గ్రామస్తులు మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగుతూ పొదుపులో మేటిగా నిలుస్తుండడం విశేషం. – ముదిగొండలెక్కకు మిక్కిలిగా.. వల్లభి పోస్టాఫీస్లో రికరింగ్ డిపాజిట్లు(ఆర్డీ) 1,420 ఉన్నాయి. అలాగే, నిర్ణీత కాల పరిమితితో టైమ్ డిపాజిట్లు(టీడీ) 275, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఖాతాలు(ఐపీపీబీ) వెయ్యి కొనసాగుతున్నాయి. ఇంకా జనరల్ పాలసీలు(జీఏపీ) 650, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(పీఎల్ఐ) 25, గ్రామీణ తపాల బీమా(ఆర్పీఎల్ఐ) 700, సుకన్య సమృద్ధి యోజన 250తో పాటు ఎస్బీలు 300 ఉండడం విశేషం.వల్లభి గ్రామ వాసులు 90శాతం మందికి చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు ఉన్నాయి. పైసాపైసా కూడబెట్టుకున్న డబ్బును గ్రామ పోస్టాఫీస్లో వివిధ పథకాల ద్వారా పొదుపు చేస్తూ అవసరాలకు వాడుకుంటున్నారు. క్రమం తప్పకుండా ఖాతాదారులు చిన్న మొత్తాలు జమ వేసుకుంటుండగా.. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుండడంతో ఒకరిని చూసి ఇంకొకరు అన్నట్లుగా ఖాతాదారులు పెరిగారు. వల్లభిలోని పోస్టాఫీస్లో ప్రతీనెలా రూ.100 మొదలు రూ.2వేలు, రూ.5వేలు వరకు జమ చేస్తున్న వారు ఉన్నారు. పింఛన్దారులు, వ్యవసాయదారులు, ఉద్యోగులు, పేద, మధ్య తరగతి ప్రజలు ఇలా అన్ని వర్గాల వారు పొదుపు ఖాతాల్లో నగదు జమ చేసుకుంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక స్థోమత పెంచుకోవడమే లక్ష్యంగా కష్టార్జితంగా సంపాదించిన సొమ్ములో కొంత మేర పొదుపు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏడు వేల జనాభా గ్రామంలో 7వేల జనాభా ఉండగా 1,500 గృహాలు, ఓటర్లు దాదాపు 4,700మంది ఉంటారు. జనాభాలో 90శాతం మందికి పోస్టాపీస్లో ఖాతాలు ఉండడం విశేషం. జిల్లాలోనే అత్యధిక ఖాతాలు కలిగిన పోస్టాఫీస్గా వల్లభి నిలుస్తోంది. ఇక ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సేవలను వెయ్యి మంది సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో పాటు టైమ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్(ఆర్డీ) ఖాతాదారులు ఉండగా.. తపాలా శాఖ ద్వారా వివిధ రకాల బీమా కూడా చేయించుకుంటున్నారు. పోస్టల్ ఉద్యోగులు ఖాతాదారులను ప్రోత్సహిస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త పథకాలపై అవగాహన కల్పిస్తుండడంతో కొత్త ఖాతాలు పెరుగుతున్నాయి. బ్యాంకులతో పోలిస్తే నగదు జమ, విత్డ్రా సులువుగా ఉండడం, దూరం వెళ్లకుండా గ్రామంలోనే సేవలు అందుబాటులో ఉండడంతో జనం ఆసక్తి కనబరుస్తున్నారు.పొదుపుపై ఆసక్తి... గ్రామంలో ఒకరిని చూసి ఒకరు పొదుపునకు ముందుకొస్తున్నారు. దాదాపు అందరూ ఏదో ఖాతా తెరిచి డబ్బు జమ చేసుకుంటున్నారు. గ్రామస్తులకు పోస్టల్ పథకాలపై అవగాహన కల్పిస్తుండడంతో ఆసక్తి కనబరుస్తున్నారు. – ఎస్.కే.జరీనా, బ్రాంచ్ పోస్ట్మాస్టర్నలుగురం పొదుపు చేస్తాం.. మా కుటుంబంలో నలుగురి పేరిట ఆర్డీలు కడుతున్నాం. చాలా కాలం నుంచి పొదుపు అలవాటుగా మారింది. అత్యవసర పరిస్థితిలో వాడుకుంటూ.. మళ్లీ డబ్బు ఉన్నప్పుడు జమ చేస్తాం. పొదుపుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. – చేకూరి రామారావునెలకు రూ.2వేల జమ పోస్టాఫీస్లో ప్రతీనెల రూ.2వేలు జమ చేస్తా. పిల్లల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతా తెరిచాను. పిల్లలు పెద్దయ్యే లోగా వారి చదువు, ఇతర ఖర్చులకు ఉపయోగపడతాయనే నమ్మకంఉంది. – సూరపల్లి ఎల్లమ్మపదేళ్ల నుంచి దాచుకుంటున్నా.. ప్రతీనెల ఆర్డీ కడుతున్నా. పింఛన్ సొమ్ములో కొంత మొత్తం పోస్టాఫీలో జమ చేస్తున్నా. ఎప్పుడు అవసరం వచ్చినా తీసుకోవడం పోస్టాఫీస్లోనైతేనే వీలుగా ఉంటుంది. అన్ని అవసరాలకు డబ్బే ప్రధానమని పదేళ్లు నుంచి జమ చేసుకుంటున్నా. – ఎనిక భద్రమ్మన్యూస్రీల్ పోస్టల్ అకౌంట్లలో వల్లభి ముందంజ పొదుపు బాటలో 90శాతం గ్రామస్తులు అత్యధిక ఖాతాలతో జిల్లాలో అగ్రస్థానం -
పక్కాగా లెక్క తేల్చేలా...
● పైలట్ ప్రాజెక్టుగా ములుగుమాడులో భూముల రీసర్వే ● గ్రామంలోని 103 సర్వే నంబర్లు, 845 ఎకరాల్లో సర్వేకు నిర్ణయం ● రేపటి నుంచి ఆరంభించనున్న సర్వేయర్లుఎర్రుపాలెం: కొన్ని గ్రామాల్లో లెక్కాపత్రం లేకుండా ఉన్న భూముల వివరాలను సర్వేనంబర్ల ఆధారంగా తేల్చాలని ప్రభుత్వం నిర్ణయింది. ఇందులో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఐదు జిల్లాలను ఎంపిక చేసింది. జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో భూములకు సంబంధించి లెక్కల నిర్ధారణకు సర్వే చేయనున్నారు. ఈక్రమాన జిల్లాలోని ఎర్రుపాలెం మండలం ములుగుమాడు కూడా ఎంపికైంది. ఈమేరకు ఉత్తర్వులు అందడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే గ్రామానికి తూర్పున కట్లేరు, ఉత్తరాన ఇనగాలి, పడమర దిక్కున మధిర మండలం మాటూరు, దక్షిణాన సఖినవీడు రెవెన్యూ గ్రామాలను సరిహద్దులుగా గుర్తించారు. ఇప్పుడు ఎందుకు.. గత ప్రభుత్వం అమలుచేసిన ధరణి చట్టం ద్వారా భూసమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రస్తుత ప్రభుత్వం భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా సాగు భూముల రిజిస్ట్రేషన్కు సర్వే మ్యాప్లు కావాల్సి ఉంది. దీంతో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో సర్వేకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం ఎంపిౖకైన ములుగుమాడులో 845ఎకరాల భూమి, 103 సర్వే నంబర్లు ఉన్నాయి. బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించిన నేపథ్యాన సర్వేయర్లు సోమవారం నుంచి రీ సర్వే చేయనున్నారు. అన్ని రకాల భూములను సర్వే చేసి ప్రతీ కమతానికి నంబర్ కేటాయిస్తారు. అనంతరం పహాణీల్లో నంబర్లు, విస్తీర్ణంతో సరిపోల్చాక కలెక్టర్కు, అక్కడి నుంచి ప్రభుత్వానికి నివేదిస్తారు. కాగా, డ్రోన్లు, అత్యాధునిక పరికరాలతో సర్వే ద్వారా భూముల వివరాలు కచ్చితంగా నిర్ధారణ జరుగుతుందని భావిస్తున్నారు.క్షేత్రస్థాయిలో సర్వే భూముల రీ సర్వేకు పైలట్ ప్రాజెక్టుగా ములుగుమాడు ఎంపికై ంది. సోమవారం నుండి గ్రామంలో భూముల సర్వే మొదలుకానుంది. క్షేత్రస్థాయిసర్వే ద్వారా ఏమైనా సరిహద్దు సమస్యలు ఉంటే తెలుస్తాయి. ఆపై భూముల చిత్రపటం రూపొందిస్తారు. – ఎం.ఉషాశారద, తహసీల్దార్ -
ఇప్పుడైతేనే పని సులువు
● రోడ్ల మరమ్మతులపై దృష్టి సారిస్తే మేలు ● జిల్లాలో గ్రామీణ లింక్రోడ్ల పనులపై అనిశ్చితి ● బిల్లుల పెండింగ్తో పనులకు కాంట్రాక్టర్ల నిర్లిప్తత ఖమ్మంఅర్బన్: వర్షాకాలం సమీపిస్తోంది. వర్షాలు జోరందుకుంటే రహదారుల మరమ్మతు పనులు చేపట్టడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నెలారంభం నుంచే మరమ్మతులు చేయించాల్సి ఉన్నా అధికారుల వైపు నుంచి చొరవ కానరవడం లేదు. జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల గ్రామీణ లింక్ రోడ్లుగా ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రహదారులపై గుంతలు తేలగా.. చెట్టుకొమ్మలు రహదారిపైకి పెరగడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు ప్రమాదకరంగా మారాయి. వీటి స్థానంలో కొత్త రోడ్లు వేయకున్నా, ఉన్న రోడ్లనైనా మరమ్మతు చేయాలని కోరుతున్నారు. ప్రతిపాదనలైతే సిద్ధం ప్రతీ ఏడాది వర్షాకాలానికి ముందు రహదారులపై గుంతలు పూడ్చడం, రోడ్లకిరువైపులా మట్టి చదును చేయడం, చెట్ల కొమ్మలు తొలగించడం వంటి పనులను వార్షిక నిర్వహణలో భాగంగా చేపట్టాల్సి ఉంటుంది. కానీ రెండేళ్లుగా ఆర్అండ్బీలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండగా, వారు ఈసారి పనులపై ఆసక్తి చూపడం లేదని సమాచారం. అయినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు మాత్రం వార్షిక నిర్వహణ పనుల కోసం టెండర్లకు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ఆర్అండ్బీ శాఖ పరిధిలో సుమారు 1,200 కి.మీ. మేర రహదారులు ఉండగా, కిలోమీటర్కు సగటున రూ.20లక్షల చొప్పున రూ.20 కోట్లతో అంచనాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. కానీ గతంలో పని చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఈ ఏడాది పనులపై స్పష్టత రావడం లేదు. పీఆర్ రోడ్ల పరిస్థితీ అదే వర్షాకాలానికి ముందు రహదారి పనులు పూర్తిచేస్తే బాగుండని వాహనదారులు భావిస్తున్నారు. జిల్లాలో ఆర్అండ్బీ పరిధిలోని రహదారులే కాక పంచాయతీ రాజ్ రహదారులు సైతం దెబ్బతిన్నాయి. రహదారి పై కనిపించేది చిన్న గుంతలే అయినా అవి ప్రమాదా లకు కారణమవుతున్నాయి. దెబ్బతిన్న రోడ్లకు తోడు రహదారులపైకి చొచ్చుకొచ్చిన కంపచెట్లు, రోడ్డు అంచుల వెంట మట్టి దిగపడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యాన త్వరగా స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.తుపాన్తో దెబ్బతిన్నవి.. గత ఏడాది తుపాన్ కారణంగా అనేక చోట్ల రహదారులు, వంతెనలు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు అవసరమైన నిధులతో అంచనాలు పంపినా విడుదల కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. మళ్లీ వర్షాకాలం వస్తున్నందున మరమ్మతులు చేయకపోతే వరదలతో ఉన్న కొద్దిపాటి రోడ్లు కూడా దెబ్బతింటే అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే ప్రమాదముంది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు పరిగణనలోకి తీసుకుని రోడ్లు, వంతెనల మరమ్మతులకు తక్షణమే నిధులు కేటాయించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి. -
పోడు భూములిక పచ్చగా..
గిరిజన రైతుల కోసం ‘ఇందిర గిరి జల వికాసం’ ● రాష్ట్రంలోనే భద్రాచలం ఐటీడీఏకు ఎక్కువగా.. ● ఐదేళ్లలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 27,488 ఎకరాలు లక్ష్యం ● పైలట్ ప్రాజెక్ట్గా చండ్రుగొండ మండలం ఎంపిక భద్రాచలం: గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సారవంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. పోడు భూములకు విద్యుత్ సరఫరా లేక, అటవీ శాఖ అనుమతులు రాక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న గిరిజనులకు ‘సౌర నీరు’ అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. రాష్ట్రంలో పట్టాలు కలిగిన పోడు భూముల హక్కుదారులకు ‘ఇందిర గిరి జల వికాసం’ పేరిట కొత్త పథకాన్ని చేపట్టగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలో అధికారికంగా ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని చండ్రుగొండ మండలంలోని పలు గ్రామాలను ఎంపిక చేశారు. అయితే రాష్ట్రం మొత్తం మీద ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న భద్రాచలం ఐటీడీఏకే అత్యధిక నిధులు కేటాయించడంతో జిల్లాలోని అనేక మంది గిరిజనులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. పోడు భూములు సాగులోకి తెచ్చేందుకే.. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అనేక ఏళ్లుగా పోడు భూముల ఆధారంగానే ఎంతోమంది గిరిజనులు జీవిస్తున్నారు. వీరికి దివంగత నేత వైఎస్సార్ హయాంలో హక్కు పత్రాలు అందజేశారు. ఆ తర్వాత కూడా కొంతమందికి హక్కు పత్రాలు అందాయి. అయితే ఈ భూములకు సాగు నీరు లేక గిరిజన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ఉచిత విద్యుత్ అందజేయాలంటే ఆర్థిక భారంతో పాటు అటవీ శాఖ క్లియరెన్స్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సోలార్ విద్యుత్ ద్వారా పంప్సెట్లను అందించాలని నిర్ణయించింది. తద్వారా వచ్చే ఐదేళ్లలో పోడు సాగుదారులందరికీ సోలార్ పంప్ సెట్లకు రూ.6 లక్షల చొప్పున నిధులు విడుదల చేయనుంది. పథకం అమలు ఇలా.. ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించింది. రెండున్నర ఎకరాల పొలం ఉన్న రైతును సింగిల్ యూనిట్గా గుర్తించింది. అంతకంటే తక్కువగా ఉన్న రైతులను గ్రూప్గా ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించి రైతులను గుర్తించాలి. జిల్లా స్థాయిలో ఈనెల 30 నాటికి సర్వే, ఇతర పనుల టెండర్లు ఖరారు చేసి, జూన్ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు ప్రారంభించేలా షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 26 నుంచి మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరు బావుల తవ్వకం, సోలార్ పంపుసెట్ల ఏర్పాటు, ఇతర పనులు పూర్తి చేయాలి. జిల్లా స్థాయిలో పథకం అమలుకు కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. భద్రాచలం ఐటీడీఏకు భారీగా.. రాష్ట్రంలో 2025–26 నుంచి 2029–30 వరకు ఆరు లక్షల ఎకరాలను జల వికాసం పథకంలోకి తీసుకురానున్నారు. అందులో జిల్లాలోనే అత్యధికంగా 1.96 లక్షల ఎకరాల భూమి సాగులోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించడం విశేషం. కాగా, ఈ పథకానికి భద్రాచలం ఐటీడీఏ పరిఽధిలోని చండ్రుగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఇప్పటికే బెండాలపాడు, రాయికంపాడు తదితర గ్రామాల్లో సోలార్ పంప్సెట్లు అమర్చి ట్రయల్ రన్ నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఈ పథకం ప్రారంభమయ్యాక జిల్లాలో మొదలు పెట్టనున్నారు.గిరిజన పోడు రైతులకు పూర్తి సబ్సిడీ పోడు హక్కు పత్రాలున్న భూముల్లో సాగు చేస్తున్న గిరిజన రైతులకు పూర్తి సబ్సిడీతో ఈ పథకం అమలు జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే విధి విధానాలు ప్రకటించింది. ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టుగా చండ్రుగొండ మండలంలో ట్రయల్ రన్ నిర్వహించాం. – డేవిడ్ రాజ్, ఐటీడీఏ ఏపీఓ జనరల్ రానున్న ఐదేళ్లలో జిల్లాకు కేటాయింపులు ఇలా.. సంవత్సరం రైతులు పోడు ఎకరాలు 2025 – 26 550 1,516 2026 – 27 2,809 6,483 2027 – 28 2,809 6,483 2028 – 29 2,809 6,483 2029 – 30 2,809 6,483మొత్తం 11,786 27,448 -
మత్స్యకారులకు ముగిసిన శిక్షణ
కూసుమంచి: పాలేరులోని పీవీ నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో పది జిల్లాల మత్స్యకారులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ శనివారం ముగిసింది. ‘జలాశయాల్లో మత్స్య అభివృద్ధి – యాజమాన్య పద్ధతులు’ అనే అంశంపై ఇచ్చిన శిక్షణకు ఖమ్మం, నిజామాబాద్, హనుమకొండ, సూర్యాపేట, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిరిసిల్ల జిల్లాల మత్స్యకారులు పాల్గొన్నారు. కాగా, ముగింపు సమావేశంలో సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి బి.నాగులునాయక్ మాట్లాడుతూ.. శిక్షణను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని మత్స్య అభివృద్ధి సాధించాలని, తద్వారా రాష్ట్రాన్ని ఆక్వా హబ్గా మార్చాలని సూచించారు. చేపల పెంపకంతో పాటు మార్కెటింగ్ కూడా కీలకమైనందున మెళకువలు నేర్చుకోవాలని పేర్కొన్నారు. మత్స్యపరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్తో పాటు శాస్త్రవేత్తలు శాంతన్న, రవీందర్, నాగరాజు మాట్లాడగా శిక్షణలో పాల్గొన్న వారికి నైపుణ్య సర్టిఫికెట్లు అందజేశారు. కాంటాల జాప్యంపై రైతు ఆగ్రహం నేలకొండపల్లి: ధాన్యం కాంటాల్లో జాప్యం జరుగుతుండడంతో ఓ రైతు రోడ్డుపై ధాన్యం పోసి నిప్పంటించేందుకు యత్నించాడు. మండల కేంద్రంలోని మార్కెట్లో ఏర్పాటు చేసిన డీసీఎంఎస్ కేంద్రానికి 50 రోజుల కిందట తాతా హనుమంతరావు ధాన్యం తీసుకొచ్చాడు. ఇప్పటివరకు కాంటా వేయకపోగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండడంతో శనివారం ఆయన బోదులబండ – నేలకొండపల్లి రహదారిపై ధాన్యం బస్తాలను వేసి నిప్పంటించేందుకు యత్నించాడు. దీంతో సహచర రైతులు అడ్డుకోగా, తహసీల్దార్ వెంకటేశ్వర్లు చేరుకుని నచ్చజెప్పారు. త్వరగా కాంటా వేయిస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. హోరాహోరీగా నెట్బాల్ పోటీలు జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి 8వ సబ్ జూనియర్ అండర్–16 నెట్బాల్ చాంపియన్ షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి 620 మంది బాలబాలికలు పోటీలకు హాజరయ్యారు. ట్రెడిషనల్, ఫాస్ట్–5, మిక్స్డ్ కేటగీరీల్లో క్రీడాకారులు తలపడుతున్నారు. ట్రెడిషనల్, ఫాస్ట్–5 కేటగిరీలకు సంబంధించి బాలుర, బాలికల పోటీలు శనివారం ముగియగా, మిక్స్డ్ డబుల్ నెట్బాల్ పోటీలు శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. కాగా, ట్రెడిషనల్, ఫాస్ట్–5 కేటగిరీల బాలుర, బాలికల విభాగంలో నారాయణపేట, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. ట్రెడిషనల్ కేటగిరీలో నారాయణపేట, కరీంనగర్ మొదటి రెండు స్థానాల్లో నిలవగా హైదరాబాద్, ఖమ్మం సంయుక్తంగా మూడో స్థానం దక్కించుకున్నాయి. ఇక బాలికల విభాగంలో మేడ్చల్, నల్లగొండ మొదటి రెండు స్థానాలు చేజిక్కించుకోగా, మూడో స్థానాన్ని జనగామ, ఖమ్మం పంచుకున్నాయి. ఫాస్ట్–5 కేటగిరీ బాలుర విభాగంలో నారాయణపేట, ఖమ్మం జట్లు మొదటి రెండు స్థానాలు సాధించాయి. అలాగే, మహబూబ్నగర్, కుమురం భీం ఆసిఫాబాద్ మూడో స్థానం సంయుక్తంగా దక్కించుకున్నాయి. ఇక బాలికల విభాగంలో మేడ్చల్, ఖమ్మం జట్లు విజేతగా నిలవగా జనగామ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల జట్లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. కాగా, మిక్స్డ్ డబుల్స్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగియనున్నాయి. చోరీ కేసులో నిందితుడి ఆత్మహత్యాయత్నం తిరుమలాయపాలెం: చోరీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి బంగారు ఆభరణాలు అప్పగించే విషయమై పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఎర్రగడ్డ గ్రామానికి చెందిన నల్లమల్ల ప్రతాప్ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఈ క్రమాన విచారణ చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన సందీప్ను అదుపులోకి తీసుకోగా చెవిదిద్దులు తిరిగి ఇచ్చి, నెక్లెస్ మరో వ్యక్తి వద్ద ఉందని చెప్పాడు. పోలీసులు శనివారం సందీప్తో పాటు ఇంకో వ్యక్తిని విచారించి ఆభరణాలు ఇచ్చేయాలని సూచించి పంపించారు. దీంతో సందీప్ ఇంటికి వెళ్లాక, అక్కడి నుంచి తిరుమలాయపాలెం సొసైటీ గోదాం వెనకాలకు చేరుకుని పురుగులమందు తాగాడు. విషయం కుటుంబీకులకు తెలియడంతో ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా, సందీప్పై గతంలో పోక్సో కేసు కూడా ఉందని తెలిసింది. -
సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం
ఖమ్మంమయూరిసెంటర్: అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులతోపాటు ఇతర సంక్షేమ పథకాలు అమలయ్యే వరకూ పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు తెలిపారు. సీపీఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కేఎంసీ కార్యాలయం ఎదుట శనివారం ప్రజలతో కలిసి ధర్నా చేశారు. పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పదేళ్లు సాగదీస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల విషయంలో అదే ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్న ప్రస్తుత పాలకులు.. మూసీ సుందరీకరణ, అందాల పోటీలకు ఉన్న నిధులు ఆరు గ్యారంటీల అమలుకు ఎందుకు వెచ్చించడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా కాంగ్రెస్ శ్రేణులకు కాకుండా అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వడంతో పాటు పింఛన్ల కోసం అందిన దరఖాస్తులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాగా, మున్నేరు రిటైనింగ్ వాల్, తీగల వంతెన నిర్మాణాలతో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావు డిమాండ్ చేశారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ అహ్మద్ షఫీఉల్లాకు వినతిపత్రం అందజేశారు. పార్టీ నాయకులు కళ్యాణం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, మాదినేని రమేశ్, పొన్నం వెంకటేశ్వర్లు, తుమ్మా విష్ణువర్ధన్రెడ్డి, బండారు రమేశ్, ఎంఏ జబ్బార్, ఎస్.నవీన్రెడ్డి, తిరుపతిరావు, మీరా సాహెబ్, కార్పొరేటర్ యర్రా గోపి తదితరులు పాల్గొన్నారు. కేఎంసీ ఎదుట ధర్నాలో సీపీఎం నాయకులు పోతినేని, నాగేశ్వరరావు -
పటేల్ స్టేడియం కళకళ
● కొనసాగుతున్న వేసవి క్రీడా శిబిరాలు ● ఈత, ఇతర క్రీడల్లో శిక్షణకు ఔత్సాహికుల బారులు ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియం ఉదయం, సాయంత్రం ఔత్సాహిక క్రీడాకారులతో కళకళలాడుతోంది. స్విమ్మింగ్ సహా పలు క్రీడల్లో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుండగా పిల్లలు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. దీంతో శిక్షణ సమయాల్లో మార్పులు చేసి బ్యాచ్ల వారీగా విభజించారు. గతంతో పోలిస్తే ఎక్కువగా క్రీడాకారులు వస్తుండడంతో కోచ్లు కూడా ఉత్సాహంగా తర్ఫీదు ఇస్తున్నారు. స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, స్కేటింగ్, బ్యాడ్మింటన్ అంశాల్లో ఎక్కువ మంది హాజరవుతున్నారు. ఇందులో స్విమ్మింగ్కై తే మరింత మంది వస్తుండడంతో బ్యాచ్లుగా విభజించినా అందరికీ శిక్షణ ఇవ్వడం సాధ్యం కావడం లేదని కోచ్లు చెబుతున్నారు. అయితే, వేసవి సెలవులకే పరిమితం కాకుండా ఏడాది పొడవునా హాజరైతేనే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటడం వీలవుతుందని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇబ్బంది లేకుండా శిక్షణ స్టేడియంలో వేసవి శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అన్ని క్రీడాంశాల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశాం. ఔత్సాహికులు ఎక్కువగా వస్తుండడంతో రద్దీ నెలకొంటోంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాం. – టి.సునీల్రెడ్డి, డీవైఎస్ఓ -
కాస్త శాంతించిన భానుడు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా వాతావరణంలో శుక్రవారం మార్పులు చోటు చేసుకున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈనెల 27 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని చెబుతుండగా.. అంతకు ముందుగానే వాతావరణంలో మార్పులతో జిల్లాలోని పలుచోట్ల గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వర్షాలు కురిసాయి. ఈనెల రెండో వారం వరకు 40–45 డిగ్రీల మధ్య నమోదైన ఉష్ణోగ్రతలు రెండు రోజులుగా 35–40 డిగ్రీలకు తగ్గాయి. శుక్రవారం గరిష్టంగా బాణాపరంలో 39.7 డిగ్రీలు, కనిష్టంగా గంగారంలో 35.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం రాత్రి 11గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ వాన శుక్రవారం ఉదయం వరకు కూడా పలు ప్రాంతాల్లో కొనసాగగా అత్యధికంగా మధిరలో 31.6 మి.మీ.లు, ఏన్కూరులో 28.6, వేంసూరులో 26.8, ఖమ్మం రూరల్లో 25.8, కూసుమంచిలో 22.6, తల్లాడలో 22.2, బోనకల్లో 16.4, సింగరేణిలో 13.8, కొణిజర్లలో 11.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు కురుస్తుండగా రైతులు భూమిలో తేమ ఆధారంగా అక్కడక్కడా దుక్కులు చేస్తున్నారు. అయితే యాసంగి పంటలకు మాత్రం నష్టం జరుగుతోంది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అవస్త పడుతుండగా, కోత దశలో ఉన్న మామిడి పంటకు తీరని నష్టం వాటిల్లింది. చల్లబడిన వాతవరణం వర్షాలు కురుస్తుండడం, ఉష్ణోగ్రతలు తగ్గడంతో జిల్లాలో వాతావరణం కొంత మేర చల్లబడింది. దాదాపుగా రెండు నెలలుగా ఉదయం 9గంటలకు మొదలవుతున్న ఎండ ప్రభావం ప్రభావం రాత్రి వరకు కొనసాగుతోంది. కానీ గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షంతో చల్ల బడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. పలుచోట్ల వాన, చల్లబడిన వాతావరణం -
ఈనెల 21నుంచి ఎన్సీసీ క్యాంప్
వైరా: వైరా శాంతినగర్లోని న్యూ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో ఎన్సీసీ 11(టీ)వ బెటాలియన్ ఆధ్వర్యాన కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపు నిర్వహించనున్నారు. ఈనెల 21 నుంచి 30 వ తేదీ వరకు క్యాంపు జరగనుండగా, ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్.కే.భద్ర, ఏఓ కల్నల్ నవీన్ యాదవ్ శుక్రవారం పాఠశాల ఆవరణలో పరిశీలించారు. క్యాంప్నకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల నుంచి 700మంది కేడెట్లు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు ఎన్సీసీలో చేరడం ద్వారా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో పాటు దేశభక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాడెంట్ డాక్టర్ పి.భూమేశ్వరరావు, డైరక్టర్ కుర్రా సుమన్, ప్రిన్సిపాల్ షాజీ మాథ్యూ, ఏఓ నరసింహారావు పాల్గొన్నారు. కాంటా వేయడం లేదని రైతుల ధర్నా నేలకొండపల్లి: రోజులు గడుస్తున్నా ధాన్యం కాంటా వేయకపోవడంతో ఎన్నాళ్లు పడిగాపులు కాయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. నేలకొండపల్లి మండలం అనాసాగారంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి నెల క్రితం రైతులు దాదాపు 10 వేల బస్తాల ధాన్యం తీసుకొచ్చారు. ఈ ధాన్యానికి ఇప్పటివరకు కాంటా వేయకపోవడంతో తహసీల్ వరకు ర్యాలీగా చేరుకుని ధర్నా చేశారు. దీంతో తహసీల్దార్ వెంకటేశ్వర్లు వెంటనే కాంటాలు వేయిస్తామని హామీ ఇవ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం బోనకల్: ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులు ఉన్నందున మెరుగైన చికిత్స అందుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కళావతిబాయి వెల్లడించారు. బోనకల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వైద్యసేవలు, మందుల నిల్వలపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అలాగే, పంచాయతీరాజ్ ఉద్యోగుల సమన్వయంతో డ్రై డే – ఫ్రై డే నిర్వహిస్తూ దోమలను అరికట్టాలని తెలిపారు. అనంతరం జాతీయ డెంగీ నివారణా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో డీఎంహెచ్ఓ పాల్గొన్నారు. వైద్యాధికారి స్రవంతి, ఉద్యోగులు దానయ్య, స్వర్ణమార్తమ్మ తదితరులు పాల్గొన్నారు. వాహనం ఢీకొని వ్యక్తి మృతి తల్లాడ: మండలంలోని మిట్టపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని రామానుజవరానికి చెందిన దర్శనాల వెంకటేశ్వర్లు(60) మూడు రోజులుగా మధ్యం సేవిస్తూ తిరుగుతున్నాడు. మిట్టపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన ఓ షాపులో మద్యం తాగి నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన అల్లుడు బీరెల్లి రవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి.. వేంసూరు: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని లింగపాలెంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాంపల్లి ఈశ్వరాచారి(42) ఇంటి మందు ఉన్న కార్పెంటర్ షెడ్లో పడి ఉన్న విద్యుత్ వైర్ను సరిచేస్తున్నాడు. ఈక్రమంలో షాక్కు గురి కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈశ్వరాచారి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు. వడదెబ్బతో బాలిక.. రఘునాథపాలె: వడదెబ్బ బారిన పడిన విద్యార్థిని మృతి చెందింది. రఘునాథపాలెం మండలం పాపటపల్లికి చెందిన గ్రామీణ వైద్యుడు కస్తాల రాంబాబు – రాణి దంపతుల చిన్న కుమార్తె శరణ్య(14) ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవుల నేపథ్యాన కొత్తగూడెంలోని బంధువులు ఇంటికి వెళ్లగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటర్లో చేర్చేందుకు సిద్ధమవుతుండగా వడదెబ్బతో కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. -
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: రైతులు పండించిన ధాన్యమంతా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని.. ఈక్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆయన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీ.ఎస్.చౌహాన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్ ఎంట్రీ పూర్తిచేసిన 48 గంటల్లోనే రైతులకు ఖాతాలో డబ్బు జమ చేస్తున్నామని తెలిపారు. కాగా, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగ్లు, టార్పాలిన్ కవర్లు సమకూర్చాలని సూచించారు. రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తిచేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. జిల్లా నుంచి వీసీకి హాజరైన కలెక్టర్, ఆతర్వాత అధికారులతో సమావేశమై సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, డీఎం శ్రీలత, వివిధ శాఖల అధికారులు గంగాధర్, సన్యాసయ్య, పుల్లయ్య, ఎం.ఏ.అలీమ్ పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో మూడు ఆవులు మృతి
రఘునాథపాలెం: మండలంలోని పుటాని తండాలో విద్యుదాఘాతంతో శుక్రవారం మూడు ఆవులు మృతి చెందాయి. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన వశ్య, శంకర్, గుగలోతు రాంజ్యాకు చెందిన ఆవులను మేతకు విడిచారు. ఓ రైతు పొలంలోని 11 కేవీ ట్రాన్స్ఫార్మర్ వద్దకు చేరుకున్న ఆవులు అక్కడి ఎర్త్ పైపును తాకడంతో షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో ఏఈ సతీష్, లైన్ ఇన్స్పెక్టర్ దేవీలాల్, లైన్మెన్ ఎల్లయ్య చేరుకుని పరిశీలించగా, పశువైద్యాధికారి పోస్టుమార్టం చేశారు. ఈవిషయమై ఏడీ సంజయ్కుమార్ను వివరణ కోరగా.. గురువారం రాత్రి ట్రాన్స్ఫార్మర్ సమీపాన పిడుగు పడడంతో ఎర్త్ దెబ్బతిని ఉంటుందన్నారు. తెల్లవారుజామున 4నుండి 8గంటల మధ్య విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో మరమ్మతులు చేశామని, ఆతర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య సత్తుపల్లిరూరల్: బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సత్తుపల్లి మండలం నారాయణపురానికి చెందిన చీకటి దీప్తి(28) గంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. ఈ నెల 14న ఆమెను తల్లిదండ్రులు మందలించారనే మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయాన కలుపు మందు తాగింది. కాసేపటికి గుర్తించిన కుటుంబీకులు సత్తుపల్లికి, అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొబ్బరి చెట్లపై పిడుగులు చింతకాని/కామేపల్లి: చింతకాని మండలంలోని జగన్నాధపురంలోని ఆలస్యం వెంకయ్య ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుపై శుక్రవారం తెల్లవారుజామున పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో పిడుగు పడడంతో చెట్టుపై 20 నిమిషాల పాటు మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో వెంకయ్య ఇంట్లో అద్దెకు ఉంటున్న కోలేటి రాంచందర్రావు గృహంలోని ఎలక్ట్రానిక్స్ సామగ్రి, వైరింగ్ పూర్తిగా కాలిపోయింది. అలాగే, కామేపల్లి మండలం తాళ్లగూడెంలోని బండారి రామయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపైనా పిడుగు పడింది. అయితే, అంతసేపు రామయ్య ఆరు బయటే నిద్రించగా, వర్షం వస్తుండడంతో లోపలకు వెళ్లాడు. అదే సమయాన పిడుగు పడడంతో ప్రమాదం తప్పినట్లయింది. -
30ఏళ్లకు కలిసిన పూర్వవిద్యార్థులు
రఘునాథపాలెం: ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ డిగ్రీ కళాశాల 1993–96 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం రఘునాథపాలెం మండలంలోని వి.వెంకటపాలెంలో నిర్వహించారు. ఈసందర్భంగా ముప్పై ఏళ్లకు కలుసుకున్న స్నేహితులు ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడిగా గడిపారు. అంతేకాక అప్పటి లెక్చరర్లు రామచంద్రరావు, విద్యాసాగర్, వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ బ్యాచ్ విద్యార్థి, నటుడు ప్రభాకర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘానికి గది నిర్మాణం కోసం ముందుకొచ్చాడు.ఈకార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, కామేపల్లి సొసైటీ చైర్మన్ పుచ్చకాయల వీరభద్రంతో పాటు ఎం.వెంకట్, శేఖర్, సిరాజ్, కవిరాజు, వీరస్వామి పాల్గొన్నారు. -
వృద్ధురాలు అదృశ్యం
చింతకాని/కొణిజర్ల: ఆస్పత్రికి బయలుదేరిన వృద్ధురాలు కానరాకుండా పోయిన ఘటన ఇది. చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన బొగ్గుల కాశమ్మ(65) గురువారం ఉదయం ఆటోలో కొణిజర్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ వైద్యుడు లేకపోవడంతో బయటకు వచ్చింది. తొలుత ఆమె పెద్దగోపతి గ్రామీణ వికాస బ్యాంకులో రూ.5వేలు విత్డ్రా చేసినట్లు తెలియగా, ఆతర్వాత ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆమె కుమారుడు సీతారాంరెడ్డి శుక్రవారం కొణిజర్ల, చింతకాని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. చెరువులో విషం కలపడంతో చేపలు మృతి నేలకొండపల్లి: మండలంలోని ఆరెగూడెం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో శుక్రవారం చేపలు మృతువాత పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు రెండు టన్నుల మేర చేపలు చనిపోయి తేలిపోయాయి. ఈమేరకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బోయిన వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బస్సు, లారీ ఢీ : ఐదుగురికి గాయాలు
సత్తుపల్లి: ప్రైవేట్ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు డ్రైవర్తో పాటు నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు 20 మంది ప్రయాణికులతో శుక్రవారం ఉదయం ప్రైవేట్ బస్సు వెళ్తోంది. ఈక్రమాన కిష్టారం ఓసీ సమీపంలో ఎదురుగా వచ్చిన లారీని ఢీకొనగా రాజమండ్రికి చెందిన ప్రయాణికులు రమేష్, అమ్మాజి, వినాయకుడు, సూర్యారావుకు స్వల్ప గాయాలయ్యాయి. అంతేకాక బస్సు డ్రైవర్ సోమరాజు క్యాబిన్లో ఇరుక్కుపోవటంతో ట్రెయినీ ఎస్సై అశోక్కుమార్, సిబ్బంది రవీంద్రనాధ్, నాగుల శ్రీనివాసరావు చేరకుని అతికష్టంగా ఆయనను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం 5–30గంటలకు జరగగా, ఉదయం 10 గంటల వరకు సత్తుపల్లి–ఖమ్మం రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సత్తుపల్లి పోలీసులు సింగరేణి నుంచి క్రేన్లను రప్పించి బస్సు, లారీని విడదీసి పక్కకు పెట్టాక రాకపోకలను పునరుద్ధరించారు. వైరా హైలెవల్ వంతెనపై... వైరారూరల్: వైరా మండలం స్టేజీ పినపాక హైలెవల్ వంతెనపై శుక్రవారం ఆర్టీసీ బస్సు–లారీ ఢీకొన్నాయి. భద్రాచలం నుండి వస్తున్న డీలక్స్ బస్సు, వైరా నుండి తల్లాడ వైపు వెళ్తున్న లారీ వంతెనపై ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోగా పోలీసులు చేరుకుని రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
అకాల వర్షంతో రైతుల్లో ఆందోళన
చింతకాని: చింతకాని మండలంలో శుక్రవారం తెల్ల వారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవగా రైతులు ఆందోళనకు గురయ్యారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యంపై పట్టాలు కప్పినా ఈదురుగాలులకు పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యం బస్తాలు తడిశాయి. కాంటా వేసి పది రోజులు దాటనా మిల్లులకు తరలించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని రైతులు ఆరోపించారు. కూసుమంచిలో... కూసుమంచి: మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఒక్కసారిగా వర్షం రావడంతో రైతులు అప్రమత్తమయ్యేలోగా ధాన్యం తడవగా నష్టం ఎదురైంది. కాంటా వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసిపోగా, సకాలంలో మిల్లులకు తరలించకపోవటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. తల్లాడ మండలంలో.. తల్లాడ: తల్లాడ మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలగా, వైర్లు తెగిపడ్డాయి. ఫలితంగా అన్నారుగూడెం, గోపాలపేట, నరసింహారావుపేట, కుర్నవల్లిల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక రైతులు ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవస్థ పడ్డారు. కాగా, మండలంలోని అన్నారుగూడెం దళితకాలనీలో సైడ్ డ్రెయిన్లు లేక వరద నీరు నిలవడంతో రాకపోకలకు దీంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నేడు హెచ్టీ విద్యుత్ వినియోగదారుల సదస్సు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని హెచ్టీ విద్యుత్ వినియోగదారుల నెలవారీ సదస్సు శనివారం ఏర్పాటుచేసినట్లు ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఖమ్మంలోని ఎస్ఈ కార్యాలయంలో ఉదయం 11గంటలకు సద స్సు మొదలవుతుందని, హెచ్టీ వినియోగదారులు పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఈ సదస్సులో విద్యుత్ అకౌంట్స్, ఇంజనీరింగ్ తదితర విభాగాల ఉద్యోగులు పాల్గొంటారని తెలిపారు. ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు నిధులు ఖమ్మంఅర్బన్: జిల్లాలోని మూడు ఎత్తిపోతల పథకాల మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయి. జలవనరుల శాఖ ఈఎన్సీ అనిల్కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి సమర్పించిన మూడు పనులకు నిధుల మంజూరు అనుమతి ఇచ్చారు. భక్తరామదాసు ప్రాజెక్టుకు విద్యుత్ యంత్రాల మరమ్మతులకు రూ.10 లక్షలు, ముఠాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరమ్మతులకు రూ.25.50 లక్షలు, మోటాపురం లిఫ్ట్ బోర్ మరమ్మతుకు రూ.7.70 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. వీసీలో జిల్లా నుంచి ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వరరావు, డీఈలు మన్మధరావు, అయోష, శోభారాణి, పృధ్వీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఏఎస్కు స్కూళ్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(బీఏఎస్) పథకానికి ప్రైవేట్ పాఠశాలల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో కొత్త పాఠశాలలు ఎంపిక చేయనుండగా.. స్టేట్, సెంట్రల్ బోర్డు ద్వారా గుర్తింపు కలిగిన స్కూళ్ల బాధ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. గత ఐదేళ్లలో ఏడు నుంచి 10వ తరగతిలో 90శాతం కంటే ఎక్కువ ఫలితాలు, 50 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు మొదటి తరగతి ఉత్తీర్ణత సాధించడమే కాక విశాలమైన తరగతి గదులు, వసతి, క్రీడా మైదానం, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ఉండాలని తెలి పారు. ఈమేరకు ఆసక్తి కలిగిన పాఠశాలల యాజమాన్యాలు పూర్తి వివరాలతో ఈనెల 25వ తేదీలోగా తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని డీడీ సూచించారు. గిరిజన గురుకుల కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం సీట్ల్లు భర్తీ అయ్యాయని పీఓ బి.రాహు ల్ తెలిపారు. గురుకులాల్లో బాలికలకు 737 సీట్లు ఉండగా, భద్రాచలంలోని గురుకుల కాలేజీలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన విద్యార్థినుల్లో 737 మందికి మెరిట్ ఆధారంగా వారు కోరుకున్న కాలేజీల్లో సీట్లు కేటాయించామని పీఓ తెలిపా రు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓలు అరుణకుమారి, పద్మావతి, ప్రిన్సిపాళ్లు చైతన్య, నాగేంద్రమ్మ, రాణి, ఓ.మాధవి, సంధ్యరాణి, మాధవీలత, ఓ.పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులను తీర్చిదిద్దాలి కొణిజర్ల: వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న శిబిరాల ద్వారా విద్యార్థినులను ఎంచుకున్న రంగాల్లో తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కొణిజర్ల సమీపాన కేజీబీవీలోని సమ్మర్ క్యాంపును శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ బోధన, ఇతర అంశాలపై ఆరా తీశాక విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడేలా శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. జీసీడీఓ తులసి, ఎంఈఓ అబ్రహం, ఎంపీడీఓ రోజా, ఎంపీఓ రాజేశ్వరి, క్యాంపు కోఆర్డినేటర్ లావణ్య, అసిస్టెంట్ కోఆర్డినేటర్ సునీత తదితరులు పాల్గొన్నారు. -
మీటర్లు గిరగిరా...
ఖమ్మంవ్యవసాయం: ఎండలు మండుతున్న వేళ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో డిస్కం కేటాయింపునకు మించి విద్యుత్ వినియోగం జరుగుతుండడం గమనార్హం. ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ వినియోగం లేకున్నా, గృహ వినియోగం నానాటికీ పెరుగుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. సర్కిళ్ల పరిధిలో సర్వీసులు, వాటి సామర్ధ్యం, సీజన్ల వారీగా వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని డిస్కం నుంచి కోటా కేటాయిస్తారు. ఈ ఏడాది మార్చి నుంచి ఎండ తీవ్రత మొదలుకాగా, ఏప్రిల్ చివరి వారానికి తీవ్రరూపం దాల్చింది. గతనెల 26న జిల్లాలో గరిష్టంగా 43.1 డిగ్రీలు, ఈనెల 13న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మిగతా రోజుల్లోనూ 40–45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఆ ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతోంది. తగ్గిన కోటా.. పెరిగిన వినియోగం ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలో వివిధ కేటగిరీల కింద మొత్తం 6,96,179 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఇందులో గృహ సర్వీసులు 4,96,114 కాగా, వ్యవసాయ సర్వీసులు 1,19,345.. మిగిలినవి ఇతర కేటగిరీల్లో ఉన్నాయి. మార్చి ఏప్రిల్ వరకు గృహ, పరిశ్రమల వినియోగంతో పాటు యాసంగి పంటల సాగులో భాగంగా మోటార్లు వినియోగించారు. దీంతో సర్కిల్కు నిత్యం 5.97 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సరఫరా చేశారు. మే ఆరంభం నాటికి యాసంగి పంటల కోతలు పూర్తవడంతో విద్యుత్ కోటాను 4.93 మిలియన్ యూనిట్లను తగ్గించారు. అంటే మార్చి, ఏప్రిల్ నెలలతో పోలిస్తే మే నెల కోటా 1.04 మినియన్ యూనిట్లు తగ్గింది. వ్యవసాయ వినియోగం లేదని ఈ నిర్ణయం తీసుకోగా.. ఎండల కారణంగా గృహ వినియోగం పెరగడంతో పలుచోట్ల అంతరాయాలు, లోఓల్టేజీ సమస్యలు ఎదురవుతున్నాయి. ఉష్ణోగ్రతలతో పాటే పెరుగుతున్న విద్యుత్ వినియోగం జిల్లాలో డిస్కం కోటాకు మించి వాడకం వ్యవసాయ ఉపయోగం లేకున్నా గృహాల్లో ౖపైపెకి...ఉపశమనం కోసం.. ఎండ తాపం నుంచి ఉపశమనం కోసం దాదాపు అందరూ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగిస్తున్నారు. పగలు, రాత్రీ లేకుండా కూలర్లు, ఏసీలు నడుస్తుండడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఈనెలలో ఉష్ణోగ్రతలు పెరగగా... విద్యుత్ వినియోగం కోటాకు మించి నమోదవుతోంది. ఖమ్మం సర్కిల్కు నిత్యం 4.93 మిలియన్ల యూనిట్ల విద్యుత్ కోటా కేటాయిస్తే.. గరిష్టంగా 5.82 యూనిట్ల మేర వినియోగం జరుగుతుండడం గమనార్హం. ఈ లెక్కన సర్కిల్లో కోటాకు మించి అదనంగా 18 శాతం విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు.వినియోగానికి అనుగుణంగా సరఫరా ఉష్ణోగ్రతల కారణంగా కొద్ది రోజులుగా విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో కోటాతో ప్రమేయం లేకుండా జిల్లాకు అవసమైన సరఫరా ఇస్తున్నారు. జిల్లాలో ఎక్కడా సమస్య ఎదురుకాకుండా వినియోగదారుల అవసరాల మేరకు సరఫరా జరిగేలా పర్యవేక్షిస్తున్నాం. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ -
పశువుల అక్రమ రవాణా జరగకుండా కట్టడి
● జిల్లా సరిహద్దుల్లో ఏడు చెక్పోస్ట్ల ఏర్పాటు ఖమ్మంక్రైం: పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గాను పోలీసులు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో పోలీసు కమిషనర్ సునీల్దత్ శుక్రవారం జిల్లాలోని అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు చర్యల్లో భాగంగా పశువుల రవాణా విషయమై వివాదాలు తలెత్తకుండా చెక్ పోస్టులు ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. సరైన వాహనాలు లేకుండా, చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, పండుగల వేళ మత సామరస్యానికి భంగం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు ప్రత్యేక సెల్ ద్వారా పర్యవేక్షించాలని తెలిపారు. కాగా, వైరా(పాలడుగు), బస్వాపురం క్రాస్(కొణిజర్ల), హనుమాన్ తండా(కల్లూరు), వెంకటగిరి క్రాస్ (ఖమ్మం రూరల్), సుబ్లేడ్ క్రాస్(తిరుమలాయపాలెం), సింగరేణి టోల్ప్లాజా(కూసుమంచి), వల్లభి(ముదిగొండ)ల్లో చెక్ పోస్టులు ఏర్పాటుచేయగా నిరంతరం గస్తీ కాయాలని సీపీ సూచించారు. -
అంబేద్కర్ ఆశయసాధనే లక్ష్యం
తిరుమలాయపాలెం: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సూచించారు. మండలంలోని హస్నాబాద్లో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యంగంతోనే అందరికీ విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు దక్కుతున్నాయని తెలిపారు. అనేక ఆటుపోట్లను తట్టుకుని ప్రపంచ మేధావిగా ఎదిగిన ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ మాగి వెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ కాశీం, రిటైర్డ్ ఫ్రొఫెసర్ ముత్తయ్య, పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్యతో పాటు వెన్నెబోయిన రమేష్, కీసర సంకీర్త్రెడ్డి, రాజేంద్రప్రసాద్, చింతరాల నాగభూషణం, సుదర్శన్, మాగి వెంకన్న, యాతాకు ల నగేష్, మాగి లక్ష్మయ్య, మాగి బాలకృష్ణ, సత్తిరెడ్డి, శ్రీనివాస్, పల్లి నాగయ్య, మాగి ఉపేందర్, మాగి రాకేష్, సంతోష్, ఉప్పలయ్య పాల్గొన్నారు.విగ్రహావిష్కరణలో ఎమ్మెల్సీ కోదండరామ్ -
మాస్టర్ ప్లాన్లో కదలిక..
● తుది ముసాయిదాపై కసరత్తు ● ఈనెలాఖరుకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించేలా వేగం ● పాత సుడా పరిధిలోనే ప్లాన్ రూపకల్పనఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ను కలుపుకుని రూపొందించే ‘సుడా’ మాస్టర్ ప్లాన్లో కదలిక వస్తోంది. ఐదేళ్లుగా యంత్రాంగం తర్జనభర్జన పడుతుండగా, రకరకాల కారణాలతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా పబ్లికేషన్ వాయిదా పడుతోంది. దీంతో అటు సుడా పరిధి, ఇటు కేఎంసీలో అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యాన మాస్టర్ ప్లాన్ను త్వరగా సిద్ధం చేసి ఆమోదంలోకి తీసుకురావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించగా సుడా, కేఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పాత ‘సుడా’ పరిధిలో.. రాష్ట్ర ప్రభుత్వం సుడా పరిధిని విస్తరిస్తూ గతేడాది నవంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మాస్టర్ ప్లాన్ కూడా మళ్లీ మొదటి నుంచి తయారు చేస్తారని అంతా భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం పాత స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) పరిధిలోనే మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని సూచించింది. ఈమేరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేన్తో పాటు ఏడు మండలాలకు చెందిన 46 గ్రామపంచాయతీల పరిధిలో ప్లాన్ రూపకల్పనపై దృష్టి సారించారు. అయితే, మాస్టర్ ప్లాన్లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్న ఆంక్షలు తొలగించే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. సమావేశాలు ముగిసినా.. సుడా మాస్టర్ ప్లాన్పై రెండేళ్లుగా కసరత్తు చేస్తున్నారు. తొలుత 2021లోనే మాస్టర్ ప్లాన్ అమలుచేయాలని నిర్ణయించినా సాధ్యం కాలేదు. ఆతర్వాత ఓ ప్రైవేట్ సంస్థతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయించి 2022 ఫిబ్రవరి 11న తొలి స్టేక్ హోల్డర్ల సమావేశం నిర్వహించారు. అందులో వచ్చిన సూచనల ఆధారంగా మార్పులు చేసి అదే ఏడాది జూలై 1న రెండో సమావేశం నిర్వహించి మళ్లీ సలహాలు స్వీకరించారు. అనంతరం వాటిని కూడా ప్లాన్లో పొందుపరిచారు. అయితే, 2022 అక్టోబర్ – నవంబర్లో ముసాయిదా ప్లాన్ పబ్లిష్ చేయాల్సి ఉన్నా సవరణల కోసం అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. బఫర్ జోన్లో మార్పులు గతేడాది సెప్టెంబర్లో వచ్చిన వరదలతో మున్నేరు పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో మున్నేరు బఫర్ జోన్ పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తద్వారా మాస్టర్ప్లాన్లో స్వల్ప సవరణలు చేసేలా ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. అలాగే, స్టేక్ హోల్డర్ల నుండి కొన్ని ప్రాతిపాదనలు రాగా అవి కూడా పొందుపర్చే అవకాశముంది. మున్నేరు, చెరువులు, నాలాలు, కాల్వల బఫర్ జోన్లకు సంబంధించి కొద్ది మార్పులు జరగనుండగా.. ఈనెలాఖరులోగా ముసాయిదాను విడుదల చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపనున్నట్లు తెలిసింది. సుడా పరిధి తెలియచేసే మ్యాప్ప్లాన్ ఉంటేనే అభివృద్ధి.. రాష్ట్రంలో ప్రధాన నగరంగా ఖమ్మం విస్తరిస్తుండడమే కాక అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. ఈ నేపథ్యాన మాస్టర్ ప్లాన్ ఉంటే పద్ధతి ప్రకారం అభివృద్ధికి ఆస్కారం ఏర్పడుతుంది. అలా లేకపోవంతో నిర్మాణాలు అడ్డగోలుగా జరుగుతుండగా.. రోడ్లు వెడల్పుగా లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యాన మాస్టర్ ప్లాన్ను అమలు చేస్తేనే నగర అభివృద్ధి ప్రణాళికాయుతంగా జరుగుతుందని.. తద్వారా భవిష్యత్లో సమస్యలు ఉండవని భావిస్తున్నారు.త్వరలోనే తుదిరూపం సుడా మాస్టర్ ప్లాన్ తుది ముసాయిదాను ఏజెన్సీ నిర్వాహకులు వారం రోజుల్లో సిద్ధం చేయన్నారు. ఈ ముసాయిదాను పబ్లిష్ చేశాక ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపిస్తాం. కేఎంసీతో పాటు పాత సుడా పరిధిని పరిగణనలోకి తీసుకుని ఈ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. – అభిషేక్ అగస్త్య, కేఎంసీ కమిషనర్, సుడా వైస్ చైర్మన్ -
ఇప్పుడు ప్రారంభిస్తేనే మేలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి తీరం వెంబడి కాళేశ్వరంలో కనుల పండువగా సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి పుష్కరాల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వీటితో కాళేశ్వరంలో కొత్తగా సరస్వతి మాత విగ్రహం, స్నానఘట్టాలు, నదీ తీరం వెంబడి కొత్త రోడ్లు, టెంట్ సిటీలు వెలిశాయి. ఇదే తరహాలో గోదావరి పుష్కరాలకు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంలో నెలకొన్న స్థల సమస్య, రోజురోజుకూ పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని గోదావరి పుష్కరాలకు యాక్షన్ ప్లాన్ ముందుగానే సిద్ధం చేయాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే 2015 పరిస్థితే పునరావృతం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. వన్నె తెచ్చిన పుష్కరాల పనులు ఈ శతాబ్దంలో 2003, 2015లలో గోదావరికి పుష్కరాలు వచ్చాయి. ముఖ్యంగా 2003 పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించిన కరకట్ట, స్నానఘట్టాలు భద్రాచలం రూపురేఖలను మార్చాయి. కరకట్ట నిర్మాణంతో భద్రాచలం పట్టణానికి గతంలో పోల్చితే వరదల నుంచి భద్రత కలిగింది. విశాలమైన స్నానఘట్టాలు వచ్చాయి. మహిళలు బట్టలు మార్చుకునే గదులు, కల్యాణకట్టలు అందుబాటులోకి వచ్చాయి. గోదావరి మాతకు విగ్రహం, రామాయణ ఇతివృత్తం తెలిపేలా శిల్పాలను ఏర్పాటు చేశారు. దీంతో భద్రాచలానికి కొత్త శోభ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో జరిగిన పుష్కరాలకు చెప్పుకోతగ్గ పనులేవీ భద్రాచలంలో జరగలేదు. గతంలో ఉన్న వాటినే మరికొంత మెరుగు పరిచారు. కొత్త రాష్ట్రంగా ఏర్పాటుకావడం, ఇక్కడ స్థల సమస్యలు వంటి అంశాలు అప్పుడు పుష్కర పనులకు అడ్డం పడ్డాయి. కీలక అంశాలు రాష్ట్ర విభజన కారణంగా భద్రాచలం క్షేత్రంలో స్థల సమస్య ఏర్పడింది. దీంతోపాటు ఏటా జూలైలో వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకుని నేటి ట్రెండ్కు తగ్గట్టుగా టెంట్ సిటీ, స్మార్ట్ సిటీలను ఎక్కడ నిర్మించాలనే అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రస్తుతం భద్రాచలంలో సామాన్య భక్తుల పుష్కర ఘాట్, బూర్గంపాడు మండలం మోతె దగ్గర వీఐపీ ఘాట్లు ఉన్నాయి. రాబోయే రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్య రాకుండా కొత్త ఘాట్లను నిర్మించాలి. వాహనాల పార్కింగ్, రాకపోకలపైనా అధ్యయనం చేయాల్సి ఉంది. వీటితో పాటు ఏడాది పొడవునా భద్రాచలం వచ్చే భక్తులకు ఉపయోగపడేలా డార్మిటరీలు, లాకర్లు, సామూహిక స్నానాల గదులు, టాయిలెట్ల నిర్మాణాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. నదీ తీరంలో సాంస్కృతి కార్యక్రమాలు జరిగేలా అంఫీ థియేటర్, కరకట్ట పైకి సులువుగా ఎక్కి దిగేలా లిఫ్టులు, అదనపు ర్యాంపులు, ఐకానిక్ వంతెన తదితర నిర్మాణాలు వంటివి రాబోయే పుష్కర పనుల్లో కీలకంగా మారనున్నాయి.కాళేశ్వరంలో వైభవంగా సరస్వతి పుష్కరాలు 2027 జూలైలో గోదావరికి పుష్కరాలు రాష్ట్ర విభజనతో భద్రగిరిలో మారిన పరిస్థితులు కార్యాచరణ సిద్ధం చేయాలని కోరుతున్న భక్తులుభద్రాచలమే కీలకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి గోదావరి పుష్కరాలంటే ఆంధ్రకు రాజమండ్రి, తెలంగాణకు భద్రాచలం కేంద్ర స్థానంగా ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయకున్నా భద్రాచలం ప్రధాన కేంద్రంగానే ఉంది. కొత్తగా ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలు గోదావరి పుష్కరాల్లో ప్రముఖంగా నిలిచా యి. తిరిగి గోదావరికి 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3వరకు పుష్కరాలు జరగనున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోవడమే కాక దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులు, భద్రాచలం పట్టణం, ఏడాది పొడవునా ఇక్కడ జరిగే కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ రెడీ చేయాల్సిన అవసరముంది. లేకపోతే 2015 తరహాలోనే ౖపైపె పనులు చేపడితే మరోసారి భద్రాద్రి నష్టపోక తప్పదు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో ‘నవోదయ’ విద్యార్థుల ప్రతిభ
కూసుమంచి: పాలేరు నవోదయ విద్యాలయ విద్యార్థులు ఇటీవల వెల్లడైన సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. వివరాలను ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. ప్లస్ టూ (12వ తరగతి) పరీక్షలకు 48 మంది విద్యార్థులు హాజరుకాగా వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని, ఇందులో 34 మంది డిస్టింక్షన్లో, 14 మంది మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. కాగా, 575 మార్కులతో రాఘవేంద్ర, 566 మార్కులతో నిఖిల్ టాపర్లుగా నిలిచారని తెలిపారు. అలాగే, పదో తరగతి ఫలితాల్లో 79 మందికి వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 65 మంది డిస్టింక్షన్లో, 12 మంది ప్రథమ శ్రేణిలో, ఇద్దరు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని, 583 మార్కులతో యోక్షిత్ టాపర్గా నిలిచాడని ప్రిన్సిపాల్ వివరించారు. చేయి లేకున్నా.. నవోదయ విద్యాలయకు చెందిన బాణోత్ పావని ప్లస్ టూ(బైపీసీ) చదువుతుండగా ఒక చేయి లేకున్నా షూటర్గా పలు పోటీల్లో పాల్గొని సత్తా చాటిందని ప్రిన్సిపాల్ తెలిపారు. అంతేకాక వార్షిక పరీక్షల్లో 79 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిందని వెల్లడించారు. -
ముగ్గురు కుమార్తెలు జన్మించారని ఆత్మహత్య
ఖమ్మంరూరల్: వరుసగా ముగ్గురు కుమార్తెలు జన్మించడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇది. రూరల్ మండలం వెంకటగిరికి చెందిన దగ్గుపాటి గోపి (26)కి ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇప్పటికే వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, ఈ నెల 14న మరో ఆడపిల్ల జన్మించింది. అయితే, కుమారుడు లేడనే మనస్తాపంతో మద్యం తాగొచ్చిన ఆయన గురువారం ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకున్నాడు. కాసేపటికి కుటుంబ సభ్యులు కిందకు దించే సరికి మృతి చెందాడు. గోపి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. కుటుంబ కలహాలతో వృద్ధుడు.. తిరుమలాయపాలెం: కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన వృద్ధుడు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని ఏలువారిగూడెంనకు చెందిన కన్నెబోయిన లింగయ్య (74) దంపతులు 15 రోజుల కిందట గొడవ పడ్డారు. దీంతో భార్య తల్లి గారింటికి వెళ్లగా ఆయన మనుమరాలి ఇంటి వద్ద భోజనం చేస్తున్నాడు. బుధవారం మనుమరాలి ఇంటికి వెళ్లిన లింగయ్య పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా, ఆయనను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందగా కుటుంబీకుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలపారు. ఆర్టీసీ బస్సులో ఘర్షణఅశ్వాపురం: ఆర్టీసీ మణుగూరు డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సులో ఇద్దరు మహిళలు ఘర్షణ పడిన పంచాయతీ పోలీస్స్టేషన్కు చేరింది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సులో ఇద్దరు మహిళలకు సీటు విషయంలో గొడవ జరిగింది. ఒకరు ఆపిన సీటులో మరొకరు కూర్చోవటంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. తోటి ప్రయాణికులు వారించిన గొడవ సద్దుమణగకపోవడంతో బస్సును అశ్వాపురం పోలీస్స్టేషన్ వద్ద ఆపి, విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సీఐ అశోక్రెడ్డి ఇద్దరు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వేర్వేరు బస్సుల్లో పంపించేశారు. -
సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్
కల్లూరురూరల్: ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారని ఆయన తనయుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. కల్లూరు మండలం యజ్ఞనారాయణపురంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని గురువారం ఆయన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇన్చార్జ్ టీడీ జనార్దన్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సంర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలు నేటికీ పేదలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో తెలుగు జాతికి గుర్తింపు తీసకొచ్చారని చెప్పారు. కాగా, ఎన్టీఆర్ విగ్రహం, అన్నదానాన్ని పోట్రు లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ పోట్రు ప్రవీణ్ ఏర్పాటు చేయగా శ్రేయస్ మీడియా అధినేత గండ్ర శ్రీనివాసరెడ్డి, రావి సూర్యనారాయణ, సామినేని నవీన్కుమార్, వాసిరెడ్డి రామనాథం, జాస్తి శ్రీనివాసరావు, కేతినేని హరీశ్, ఆళ్ల కమలాకర్రావు, పోట్రు శ్రీనివాసరావు, మండేపూడి సాయి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం విగ్రహావిష్కరణలో నందమూరి రామకృష్ణ -
మాడ వీధులకు వీడని మూఢం
● భూ సేకరణ పూర్తయితేనే పనులు ముందుకు ● స్థలం ఇచ్చేందుకు ఏడుగురి నిరాకరణ ● ఈ అడ్డంకి తొలగితేనే సాగనున్న విస్తరణ ● మాస్టర్ ప్లాన్ ప్రకటన కోసం ఎదురుచూపులుభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి తొలి అడుగు పడినా.. ముందుకు సాగడం లేదు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం రూ.60.20 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు భూసేకరణ, ఇళ్లు, దుకాణాల తొలగిస్తే నిర్వాసితులకు అందించే పరిహారం కోసం శ్రీరామనవమికి ముందు రూ.35 కోట్లు విడుదల కాగా, సుమారు 40 కుటుంబాలకు అందజేశారు. నవమి రోజే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, మాస్టర్ ప్లాన్ ప్రకటిస్తారని భావించినా అది జరగలేదు. దీనిపై ఆలయ అధికారులకు సీఎం స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. భూ సేకరణ పూర్తయితేనే పనులు ముందుకు సాగే పరిస్థితి నెలకొంది. ఈనెలలో సేకరణ పూర్తయితేనే.. నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయగానే రెవెన్యూ అధికారులు భూ సేకరణ పూర్తి చేసి దేవస్థానానికి అప్పగించాల్సి ఉంది. అయితే శ్రీరామనవమి సందర్భంగా తమ వ్యాపారం దెబ్బతింటుందని, ఆ తర్వాతే తాము ఖాళీ చేస్తామని ఆయా షాపుల వారు రెవెన్యూ అధికారులను, ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. దీంతో అప్పుడు సేకరణ పనులు ఆపేశారు. నవమి వేడుకలు పూర్తయ్యాక అధికారులు మళ్లీ భూ స్వాధీనానికి వెళ్లగా.. ఈనెల 22న హనుమాన్ జయంతి కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మాలధారులతో భద్రగిరి రద్దీగా ఉంటుందని, ఈ సమయంలోనే వ్యాపారాలు అధికంగా జరుగుతాయి కాబట్టి మరోమారు వాయిదా వేయాలని వారు వేడుకుంటున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు పునరాలోచనలో పడ్డారు. కాగా, భూమి ఇవ్వడానికి నిరాకరించిన వారిపై కోర్టును ఆశ్రయించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారికి అందజేయాల్సిన నష్టపరిహారాన్ని కోర్డుకు సరెండర్ చేసి, భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మాస్టర్ప్లాన్ అమలు చేయాలి.. మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం రూ.60.20 కోట్లు ప్రకటించగా, నిర్వాసితులకు పరిహారంగా రూ.35 కోట్లు విడుదల చేసింది. మరో రూ.25.20 కోట్లతో మాడ వీధుల విస్తరణ చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే ఆలయ అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. కాగా నవమి ముందు ప్రభుత్వం ఆలయ అభివృద్ది నమూనాలు విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మాస్టర్ ప్లాన్కు మరికొన్ని అదనపు వసతులను కల్పించేలా ఈ నమూనాలు రూపొందించారు. అయితే మాడ వీధుల విస్తరణకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. మాస్టర్ ప్లాన్ అమలుకూ తగిన నిధులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు. నిరాకరించిన వారితో చర్చిస్తాం.. ఏడు కుటుంబాల వరకు నష్టపరిహారం చెక్కులు తీసుకోలేదు. వారితో మళ్లీ చర్చలు జరిపి సానుకూలంగా భూ సేకరణకు కృషి చేస్తాం. అయినా వినకుంటే నిబంధనల ప్రకారం నష్టపరిహారాన్ని కోర్టుకు అందజేసి భూ సేకరణను పూర్తి చేస్తాం. వీలైనంత త్వరలో ఆలయానికి భూములు అందజేస్తాం. – కొల్లు దామోదర్ రావు, ఆర్డీఓ, భద్రాచలంకొన్ని కుటుంబాల నిరాకరణ.. భద్రాచలంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు ముందే 40 నిర్వాసిత కుటుంబాలకు రూ.34,45,86,000 అందించినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. అయితే ఇటీవల సస్పెన్షన్కు గురైన ఓ ప్రధానార్చకుడితో పాటు మరో ఆరు కుటుంబాల వారు స్థలాలు ఇచ్చేందుకు, నష్టపరిహారం స్వీకరణకు నిరాకరించారని చెబుతున్నారు. వీరు గతంలో కూడా మాడ వీధుల విస్తరణలో పరిహారం స్వీకరణకు నిరాకరించారు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కంటే అధికంగా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూ, ఆలయ అధికారులు తీసుకునే చర్యలపైనే పనులు ఆధారపడి ఉంటాయి. -
జాతీయ కార్మిక సంఘాల సమ్మె జూలై 9కి వాయిదా
సింగరేణి(కొత్తగూడెం): కార్మిక రంగ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 20న సమ్మె చేపట్టనున్నట్లు జాతీయ కార్మిక సంఘాలు ప్రకటించగా, దీన్ని జూలై 9కి వాయిదా వేసినట్లు సంఘాల జేఏసీ నాయకులు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ నెల 20న పని ప్రదేశాల్లో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సింగరేణి ఆస్పత్రిలో సీఎండీ తనిఖీ సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రిని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అత్యవసర వార్డు సహా అన్ని వార్డుల్లో పరిశీలించి చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. ఆ తర్వాత ఫార్మసీని పరిశీలించి మందుల లభ్యతపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ కార్మికుల ఆరోగ్యం, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నందున వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలందించాలని సూచించారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఎంఓ కిరణ్రాజ్కుమార్, ఏసీఎంఓలు ఎం.ఉష, సునీల, సీనియర్ పీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతతోనే మామిడికి ధర
● పిందె మొదలు కాయ వరకు జాగ్రత్తలు తప్పనిసరి ● రవాణా, ఎగుమతుల్లో గ్రేడింగ్, ప్యాకింగ్ ప్రధానం ఖమ్మంవ్యవసాయం: మామిడి పంట కోతలు జోరుగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి జూన్ రెండో వారం వరకు కోతలు మరింత కొనసాగే అవకాశముంది. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 44,864 ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇందులో బంగినపల్లి, తోతాపురి, రసాలు, హిమాయత్, దసేరి, మల్లికా, మంజీర, సువర్ణరేఖ, జహంగీర్ రకాలను సాగు చేస్తుండగా.. ఈ మొత్తం విదేశీ ఎగుమతులకు అనుకూలమైన రకాలుగా ఉండడం విశేషం. మామిడికి ప్రస్తుతం రకాలు, నాణ్యత ఆధారంగా టన్నుకు రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతోంది. ఏమాత్రం నాణ్యత తక్కువగా ఉన్నా వ్యాపారులు ధర పెట్టడం లేదు. కేవలం చెట్టుపై నిలిచిన పంటకే డిమాండ్ ఉన్న నేపథ్యాన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఖమ్మం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఎం.వీ.మధుసూదన్ పలు సూచనలు చేశారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఎగుమతుల కోసమైనా, దేశీయంగా అమ్మకానికై నా రైతులు తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచి ధర లభిస్తుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని చెట్టుపై బాగా తయారైన లేత ఆకుపచ్చ రంగు కలిగిన పండ్లను ఎంపిక చేసుకోవాలి. ఈ క్రమాన కండ కలిగి లేత పసుపు పచ్చ రంగు ఉన్నవి గుర్తించాలి. కాయలను 6 – 7 సెంటీమీటర్ల తొడిమ, భూమికి దగ్గరగా ఉన్న కాయలైతే 2 – 3 సెం.మీ. తొడిమతో కోయాలి. కాయ కింద పడకుండా చిక్కం ఉపయోగించాలి. ఆపై రవాణా కోసం ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగాన కాగితాలను అమర్చాలి. ఆపై కాయలను జాగ్రత్తగా పేర్చడంతో పాటు ఈ సమయంలో తొడిమ వద్ద సొన కాయపై చర్మానికి అంటకుండా చూడాలి. అనంతరం ప్యాక్ హౌస్లోనే శుద్ధి చేస్తే విదేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఉమ్మడి జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం, దిగుబడులు జిల్లా సాగు విస్తీర్ణం సాధారణ దిగుబడి (ఎకరాల్లో) (టన్నుల్లో) ఖమ్మం 33,908 1,35,632 భధ్రాద్రి కొత్తగూడెం 10,956 43,824 మొత్తం 44,864 1,79,456 -
గిరిజన సంస్కృతిని పరిరక్షించాలి
ఐటీడీఏ పీఓ రాహుల్ ములకలపల్లి : గిరిజన సంస్కృతిని పరిరక్షించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. మండల పరిధిలోని రాజీవ్నగర్లో గురువారం నిర్వహించిన భూమి పండుగ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీలు ఏ కార్యం తలపెట్టినా గ్రామదేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం స్థానిక యువకులతో కలసి బాణం సంధించారు. ఆ తర్వాత పాత గుండాలపాడు గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. 35 ఏళ్ల క్రితం అప్పటి పీఓ జేసీ శర్మ తమ గ్రామాన్ని సందర్శించారని, మళ్లీ ఇప్పడు రాహుల్ రావడం ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్డును పూర్తి చేయాలని, ఐటీడీఏ ద్వారా వ్యవసాయ మోటార్లు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో భద్రాచలం గిరిజన మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి, గ్రామపెద్దలు తుర్రం శ్రీను, మాజీ ఎంపీటీసీ నూపా సరోజిని తదితరులు పాల్గొన్నారు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ పరిశీలన సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, గనుల్లో ఉపయోగిస్తున్న కంటిన్యూస్ మైనర్, ఎల్హెచ్డీ యంత్రాల పనితీరును అటవీ శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. కొత్తగూడెంలోని పీవీకే –5 ఇంక్లెయిన్ గనిని గురువారం వారు సందర్శించారు. ఏరియాకు వచ్చిన అధికారుల బృందానికి జీఎం ఎం.శాలేంరాజు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం గని అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బొగ్గు ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన వివరాలు, యంత్రాల పనితీరును తెలియజేశారు. ఆ తర్వాత అధికారులు మ్యాన్రైడింగ్ ద్వారా గనిలోకి దిగి పంపింగ్ స్టేషన్, సబ్స్టేషన్ ప్రాంతాలను వీక్షించారు. అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సెంట్రల్) డాక్టర్ వి.ఆర్.జెన్సర్ ఆధ్వర్యంలో డాక్టర్ త్రినాథ్కుమార్, సీసీఎఫ్ డి.భీమానాయక్, ఖమ్మం జిల్లా అటవీ శాఖ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, కొత్తగూడెం డివిజనల్ అటవీ అధికారి కోటేశ్వరరావు తదితరులు పర్యటించారు. -
ఖమ్మం జిల్లాలోని ఏడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో మద్యం అమ్మకాలు
ఏప్రిల్ 1నుంచి 30 వరకు మే 1నుంచి 13 వరకు సర్కిల్ లిక్కర్ కేసులు బీర్ కేసులు విలువ (రూ.కోట్లలో) లిక్కర్ కేసులు బీర్ కేసులు విలువ (రూ.కోట్లలో) ఖమ్మం–1 39,589 32,527 34.58 11,782 19,325 11.71 ఖమ్మం–2 22,536 18,526 19.16 8,087 12,096 7.67 మధిర 14,309 9,792 11.21 2,176 2,163 1.83 నేలకొండపల్లి 12,907 12,825 10.95 5,284 6,185 4.65 సత్తుపల్లి 18,849 11,618 14.12 8,168 4,331 5.83 సింగరేణి 8,415 5,257 6.34 4,442 4,514 3.78 వైరా 12,653 7,204 9.43 5,363 3,682 4.05మొత్తం 1,29,258 97,749 105.79 45,302 52,296 39.52 -
కిన్నెరసానిలో పుట్టి తిరిగేనా..?
పాల్వంచరూరల్ : కిన్నెరసానికి వచ్చే పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించడంతో పాటు ఒకరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కెనాల్లో పుట్టి ఏర్పాటు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీచేశారు. అయితే ఐదు నెలలు గడిచినా ఇప్పటివరకు అచరణలోకి రాలేదు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో రిజర్వాయర్ నుంచి కేటీపీఎస్ కర్మాగారానికి నీరు సరఫరా చేసే కాల్వలో పుట్టి(నాటు పడవ) తిప్పాలని గత డిసెంబర్లో కలెక్టర్ సూచించారు. ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారి ఎండీ ఇంతియాజ్ అహ్మద్ఖాన్కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయన నెల రోజుల క్రితం రూ.33 వేలతో పుట్టి కొనుగోలు చేసి పునుకుల గ్రామానికి చెందిన మత్స్యకారుడికి అప్పగించారు. కెనాల్లో పుట్టిని ఎలా తిప్పాలో శిక్షణ కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకూ ఆ పుట్టి కాలువలో తిరగడం లేదు. దీనిపై జిల్లా మత్స్యశాఖ అధికారిని వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు నెల రోజుల క్రితమే పుట్టిని కొనుగోలు చేసి మత్స్యకారుడికి అప్పగించామని, అతడు సొంత పనులు పూర్తి చేసుకున్నాక తిప్పుతామని చెప్పాడని తెలిపారు. పుట్టి విషయం పర్యాటకులకు తెలిసేలా ప్రధాన ద్వారం, పంపుహౌస్ వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించామని చెప్పారు. అయితే, కాలువ నీటిలో పుట్టిని తిప్పాలంటే మధ్యలో పంప్హౌస్ గేట్వాల్వ్ను తొలగించాల్సి ఉంటుంది. ఈ పని పూర్తి చేసి వచ్చే ఆదివారం నాటికై నా కెనాల్లో పుట్టిని తిప్పేలా చూడాలని పర్యాటకులు కోరుతున్నారు.కలెక్టర్ ఆదేశించి ఐదునెలలైనా ఆచరణ శూన్యం -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నృసింహస్వామికి చక్రస్నానం.. శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీయోగానంద లక్ష్మీ నృసింహ స్వామివారి బ్రహ్మహోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి పవిత్ర గౌతమీ నదిలో చక్ర స్నానం కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి మేళతాళాలు, మహిళా భక్తుల కోలాట నృత్యాల నడుమ గోదావరి తీరానికి తీసుకెళ్లి నదీ జలాలతో చక్ర స్నానం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హజరై ఈ వేడుకను తిలకించి పులకించారు. -
పొంగు చల్లారింది !
వైరా: ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. సాధారణ జనమంతా చల్లని నీళ్లు లేదంటే కొబ్బరి నీళ్లు, కూల్డ్రింక్లతో తమ దాహార్తి తీర్చుకుంటారు. అదే మందుబాబులైతే ఈ రెండు నెలలు మద్యాన్ని పక్కన పెట్టేసి బీర్ల వైపు మొగ్గు చూపుతారు. తద్వారా ఏటా వేసవిలో బీర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రెండేళ్ల క్రితమైతే బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదు కాగా.. కొన్ని వైన్స్ల ఎదుట ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. వైరాలోని డిపో నుంచి ఉమ్మడి జిల్లాలోని వైన్స్, బార్లకు మద్యం సరఫరా చేస్తుండగా ఏప్రిల్, మే నెలల్లో బీర్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవని ఎకై ్సజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 60వేల కేసులు డౌన్ వేసవిలో బీర్ల అమ్మకాలు పెరగాల్సింది పోయి లిక్కర్ విక్రయాలు విపరీతంగా పెరుగుతుండడం గమనార్హం. వైరాలోని డిపో నుంచి గతేడాది ఏప్రిల్లో రూ.181 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు సాగగా ఈ ఏడాది రూ.167 కోట్లకు అది పడిపోయింది. గతేడాది ఏప్రిల్లో డిపో నుంచి 2,25,739 బీరు కేసులు అమ్ముడవగా, లిక్కర్ 2,13,172 కేసులు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో మాత్రం బీర్లు 1,64,966 కేసులకే పరిమితం కాగా, లిక్కర్ కేసులు మాత్రం 2,00,507 అమ్ముడయ్యాయి. అంటే బీర్ల అమ్మకం 60,733 కేసుల మేర తగ్గింది. ధరలు పెరిగాయానా? ఉమ్మడి జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా వేసవిలో బీర్ల అమ్మకాలు పడిపోయాయి. గత నవంబర్లో ప్రభుత్వం ఒక్కో బీర్ ధరను రూ.20నుంచి రూ.40 మేర పెంచింది. మరోవైపు వాతావరణంలో తరచూ మార్పులు వస్తున్నాయి. రోజంతా ఎండ ఉన్నా సాయంత్రమయ్యే సరికి గాలిదుమారం, వాన ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగా కూడా బీర్ల అమ్మకాలు తగ్గాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఏప్రిల్తో పోలిస్తే ఈనెలలో కాస్త పరిస్థితి మెరుగవుతోందని.. రానున్న రోజుల్లో ఇది మరింత పుంజుకుంటుందని వైన్స్, బార్ల యజమానులే కాక ఎకై ్సజ్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మండువేసవిలో బీర్లకు తగ్గిన డిమాండ్ ఇదే సమయాన పెరిగిన లిక్కర్ అమ్మకాలు బీర్ల ధరలు పెరగడమే కారణమని అంచనా -
ఆదివాసీల అంగడి.. సందడి..
భద్రాచలంటౌన్: ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలు గతంలో తమ కుటుంబం వరకు కావాల్సిన కూరగాయలు, ఇతర పంటలే పండించేవారు. కానీ పెరుగుతున్న ఖర్చులు, కుటుంబ భారంతో పంటల సాగు కొద్దికొద్దిగా విస్తరిస్తున్నారు. ఈ క్రమాన ఆదివాసీలు రసాయన ఎరువులు వాడకపోవడంతో పంటలు నాణ్యంగా ఉంటుండడమే కాక ధరల్లోనూ బయటి మార్కెట్తో వ్యత్యాసం ఉండడంతో పట్టణవాసులు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కేవలం ఆకుకూరలు, కూరగాయలే కాక అటవీ ఫలాలు సైతం అమ్ముతున్న ఆదివాసీలు కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నారు. భద్రాచలంలో ప్రత్యేకం.. రాష్ట్ర విభజన సమయాన ఏపీలోకి వెళ్లిన పలు గ్రామాలు, మండలాల నుంచి ఆదివాసీలు తాము సాగు చేసిన పంటలను భద్రాచలంలో విక్రయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పాత కూరగాయల మార్కెట్లోని ఐటీడీఏ కాంప్లెక్స్ ముందు ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ ఆదివాసీ గిరిజనులు మాత్రమే కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తుండగా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆదివాసీ అంగడి 11 గంటలకు ముగుస్తుంది. ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు కొద్దిసేపటల్లో అమ్ముడవుతుండడం విశేషం. అన్నీ తాజాగా.. సాధారణ మార్కెట్ కంటే ఇక్కడ లభించే కూరగాయలు, ఆకుకూరలు తాజాగా ఉంటాయి. తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసే ఆదివాసీలు ఏరోజుకారోజు సేకరించి తీసుకొస్తుండడంతో తాజాగా ఉంటాయని చెబుతున్నారు. అందులోనూ పంటల సాగు రసాయన ఎరువులు వాడకపోవడంతో నాణ్యంగా ఉంటాయని స్థానికులు నమ్ముతున్నారు. అంతేకాక బయటి మార్కెట్తో ధరకూడా తక్కువగా ఉండడంతో కొనుగోలుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న అమ్మకాలు భద్రాచలంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ కంటే ఆదివాసీలు నిర్వహించే అంగడి పట్టణవాసులతో సందడిగా ఉంటోంది. భద్రాచలం పరిసర గ్రామాల్లో సాగు చేసే కూరగాయలను తీసుకొస్తుండగా రోజురోజుకూ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఏపీలోని సరిహద్దు మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక, కుక్కునూరు నుంచి భారీగా కూరగాయలను సైతం తీసుకొస్తున్నారు. ఇవి కాక సీజన్ ఆధారంగా సీతాఫలాలు, తునికిపండ్లతో పాటు చింతపండు, మినుములు, పెసళ్లు, బొబ్బర్లు, కందులు సైతం తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. నాణ్యమైన, తాజా కూరగాయల విక్రయం ధరలోనూ బయటి మార్కెట్తో పోలిస్తే తక్కువ కొనుగోలుకు పట్టణవాసుల ఆసక్తి మందులు లేని పంటలు ఇక్కడ మార్కెట్లో లభించే కూరగాయలు తాజాగానే కాక స్వచ్ఛంగా ఉంటాయి. గిరిజనులు ఎటువంటి రసాయన మందులు వాడకుండా పండిస్తుంటారు. దీంతో ఇవి ఆరోగ్యానికి మంచివని నాతోపాటు చాలా మంది ప్రతిరోజు ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. –శంకర్, భద్రాచలం -
వడదెబ్బతో ముగ్గురు మృతి
కామేపల్లి: కామేపల్లి ఇరిగేషన్ సబ్డివిజన్లో లష్కర్గా విధులు నిర్వర్తిస్తున్న బండి రాజమ్మ (60) వడదెబ్బతో మృతి చెందింది. ఇటీవల ఆమె అస్వస్థతకు గురి కాగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందిందని కుటుంబీకులు వెల్లడించారు. ఇరిగేషన్ డీఈఈ శంకర్, ఏఈఈ శ్యామ్, ఉద్యోగులు పలువురు ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఖమ్మంలో యాచకుడు.. ఖమ్మంక్రైం: ఖమ్మం మామిళ్లగూడెం ఓవర్బ్రిడ్జి సమీపాన ఓ యాచకుడు గురువారం వడదెబ్బతో మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకుని పరిశీలించారు. అనంతరం అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు నేతృత్వాన మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శుక్రవారిపేట వాసి... ఖమ్మంరూరల్: ఖమ్మం శుక్రవారిపేటకు చెందిన ఎస్కే రఫీబాబు (44) వడదెబ్బతో గురువారం మృతి చెందాడు. రూరల్ మండలం గుర్రాలపాడులో ఉంటున్న సోదరుడి వద్దకు బయలుదేరిన ఆయన వెంకటగిరిలోని ఇందిరమ్మ కాలనీ సమీపాన రహదారి పక్కన పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు ఆయన కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చేలోగా రఫీబాబు మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. -
మండుటెండలో సాధువు పాదయాత్ర
మధిర: నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కానీ, ఒక సాధువు మండుటెండలో పాదయాత్ర నిర్వహిస్తున్నాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన సాధువు కాశీ నుంచి రామేశ్వరానికి పాదయాత్రగా బయలుదేరగా, 54వ రోజైన గురువారం మధిర చేరుకున్నాడు. పరమశివుడిపై నమ్మకంతోనే 58 ఏళ్ల వయస్సులో ఈ యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏకలవ్య విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలు భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు, ఖమ్మం జిల్లాలో ఒక విద్యాలయం ఉండగా, 2024–25లో పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన విద్యార్థులు అర్హులని వెల్లడించారు. సీబీసీఎస్ సిలబస్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హ్యూమనిటిక్స్ గ్రూపుల్లో ప్రవేశానికి ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గండుగులపల్లి, గుండాలలో బాలికలకు ఎంపీసీ, సీఈసీ, పాల్వంచలో బాలికలకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులు, టేకులపల్లిలో బాలురకు బైపీసీ, సీఈసీ, దుమ్మగూడెంలో బాలురు, బాలికలకు ఎంపీసీ, బైపీసీ, హ్యూమనిటిక్స్ గ్రూపులు, చర్ల, ములకలపల్లి, సింగరేణిలో బాలురు, బాలికలకు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో బోధన ఉంటుందని, పదో తరగతి మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని పీఓ వెల్లడించారు. కాగా, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 26న ఉదయం చర్ల, భద్రాచలంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. మహిళా సంఘాలకు చెరువుల వన సంరక్షణ బాధ్యత ఖమ్మంమయూరిసెంటర్: మహిళా సంఘాల్లో సభ్యుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పలు పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చెరువుల గట్లపై వన సంరక్షణ బాధ్యతలను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో మెప్మా అధికారులు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీఎంసీ సుజాత మాట్లాడుతూ జూన్ 2న చెరువుల వన సంరక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుందని తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎంపిక చేసిన చెరువుల బాధ్యతలను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించనున్నట్లు చెప్పారు. చెరువు కట్టలపై మొక్కలు నాటడం, వాటి పెంపకం బాధ్యతలను సభ్యులు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా, ఖమ్మంలో ఖానాపురం ఊర చెరువు, ధంసలాపురం చెరువు, వైరాలో సోమవారం చెరువు, సత్తుపల్లిలో వేశ్వకాంతుల చెరువు, మధిరలో అంబారుపేట చెరువులను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిసింది. వివాదాస్పద భూముల్లో పంచనామా ఖమ్మంఅర్బన్: ఖమ్మం అర్బన్లోని మల్లెమడుగు రెవెన్యూ పరిధిలో వివాదాస్పద భూముల్లో తహసీల్దార్ రవికుమార్ గురువారం పంచనామా నిర్వహించారు. ఇక్కడి మూడు సర్వే నంబర్లలో సుమారు 30 ఎకరాల అసైన్డ్ భూముల విషయంలో కొన్నేళ్లుగా కొందరు వ్యక్తులు, ప్రభుత్వం, పేదల మధ్య వివాదం నడుస్తోంది. దీనిపై హైకోర్టులో కేసు దాఖలైంది. విచారణలో ఉండగా రైతులు ఈ ఏడాది పంటల సాగు చేపట్టారు. పంటకాలం పూర్తయిన తర్వాత వివాదాన్ని పరిష్కరించే వరకు ఎవరూ పనులు చేపట్టొద్దని, ప్రభుత్వం సైతం ఈ భూములను ఎవరికీ కేటాయించొద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తహసీల్దార్ రవికుమార్ పంటలు సాగు చేసిన రైతులతో మాట్లాడారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. కాగా, కోర్టు ఆదేశాల మేరకు పంచనామా చేసినట్లు తహసీల్దార్ రవికుమార్ వెల్లడించారు. గాయపడిన వ్యక్తి మృతి చింతకాని: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఖమ్మం అర్బన్ మండలం గోపాలపురానికి చెందిన కొర్రా లోకేశ్ (24) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ప్రైవేట్ బ్యాంక్లో పనిచేసే ఆయన ద్విచక్ర వాహనంపై ఈ నెల 7వ తేదీన చింతకాని మండలం ప్రొద్దుటూరు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లోకేశ్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. -
పాలేరు పొలాల్లో రాజుకున్న అగ్గి
భారీగా చెలరేగుతున్న మంటలుకూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్ కింద పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం వరి కొయ్యలకు నిప్పుపెట్టగా గాలికి మంటలు చెలరేగాయి. రిజర్వాయర్ కట్ట నుండి ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారి వరకు సుమారు రెండు కి.మీ. మేర మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో పలువురు రైతుల గడ్డి వాములు, కరెంటు మోటార్లు, స్టార్టర్లు కాలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. చర్యలు తీసుకోండి.. ఖమ్మం నుండి హైదరాబాద్కు గురువారం రాత్రి ఈ మార్గంలో వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంటలను గమనించారు. వ్యవసాయశాఖ అధికారులకు ఫోన్ చేసిన ఆయన కొయ్యలకు నిప్పు పెట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. -
ఎగ్జిట్లతో మెరుగైన రవాణా
జాతీయ రహదారి నిర్మాణాన్ని ఖమ్మం– సత్తుపల్లి(వేంసూరు ఎగ్జిట్) వరకు ఆగస్టు 15కల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మార్గంలో వేంసూరు ఎగ్జిట్ నుంచి ధంసలాపురం వరకు రహదారి పనులను గురువారం ఆయన సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు డాక్టర్ మట్టా రాగమయి, మాలోతు రాందాస్నాయక్, ఎన్హెచ్ఏఐ పీడీ కె.దివ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ రహదారి పనులు పూర్తయితే ఖమ్మం నుంచి సత్తుపల్లి మధ్య 80కిలోమీటర్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని తెలి పారు. కాగా, సత్తుపల్లి, వైరా, ఖమ్మం ప్రజల డిమాండ్ మేరకు ఎగ్జిట్లను పెంచి రహదారి సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటల ఎగుమతి కోసం జాతీయ రహదారికి అనుసంధానంగా సర్వీస్ రోడ్లను మంజూరు చేయాలని ఇప్పటికే కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఆలస్యమవుతున్నందున ఒక వైపు అయినా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, కొదుమూరు వద్ద విద్యుత్లైన్ సమస్య పరిష్కరిస్తున్నామని వెల్లడించిన మంత్రి... కల్లూరు సమీపాన సాగర్ కాల్వ వద్ద బ్రిడ్జి డిజైన్ మార్చడంతో పనుల్లో కొంత ఆలస్యమైందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఆర్డీఓ రాజేందర్గౌడ్, మార్కెట్ల చైర్మన్లు దోమ ఆనంద్బాబు, భాగం నీరజాదేవి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, సాధు రమేష్రెడ్డి, పసుమర్తి చందర్రావు, బుక్కా కృష్ణవేణి, బండి గురునాధ్రెడ్డి, పుచ్చకాయల సోమిరెడ్డి పాల్గొన్నారు. -
హైవేపై రయ్.. రయ్
● చివరి దశలో ‘గ్రీన్ ఫీల్డ్’ పనులు ● ఆగస్టు 15వ తేదీకల్లా సత్తుపల్లి వరకు నిర్మాణం పూర్తి ● తద్వారా ఖమ్మం – సత్తుపల్లి మధ్య తగ్గనున్న ప్రయాణ సమయంసత్తుపల్లి: జిల్లాలో కొత్త జాతీయ రహదారి త్వరలో నే అందుబాటులోకి రానుంది. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి(ఎన్హెచ్ 365 బీజీ)ని 165 కి.మీ. నిడివితో నిర్మిస్తుండగా.. ఈ హైవే జిల్లాలోనే 105 కి.మీ. ఉంటుంది. ఇందులో ఖమ్మం–సత్తుపల్లి మార్గంలో పనులు చివరి దశకు చేరుకోగా త్వరలోనే రహదారి అందుబాటులోకి రానుంది. జిల్లాలో భేష్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని ఐదు ప్యాకేజీలుగా విభజించారు. జిల్లాలోని పనులు 1నుంచి 3వరకు ప్యాకేజీల్లో ఉండగా చకచకా జరగడంతో పూర్తి కావొచ్చాయి. ఏపీలోని 4, 5 ప్యాకేజీల పనులే మందకొడిగా జరుగుతున్నాయి. దేవరపల్లి క్రాస్ వద్ద మూడు కి.మీ. భూసేకరణ వివాదం కోర్టులో ఉండడంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.డివైడర్లు సహా నిర్మాణం పూర్తయిన హైవేప్యాకేజీల వారీగా ఇలా.. ●ప్యాకేజీ–1 : తల్లంపాడు నుంచి సోమవరం వరకు 33 కి.మీ. మేర రూ.772 కోట్లతో చేపట్టే పనులను ప్యాకేజీ–1గా నిర్ధారించారు. ఇందులో 30 కి.మీ. రోడ్డు నిర్మాణం పూర్తవగా, ధంసలాపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు అనుమతి రాకపోవడంతో ఆటంకం ఎదురైంది. ఇక 32 బ్రిడ్జిల్లో 29 నిర్మాణాలు పూర్తయ్యాయి. ●ప్యాకేజీ–2 : రూ.637 కోట్లతో ఈ ప్యాకేజీ కింద సోమవరం(వైరా) నుంచి చింతగూడెం వరకు 29 కి.మీ. నిడివితో చేపట్టారు. ఇందులో 26 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఈ మార్గంలోని 39 బ్రిడ్జిల్లో 36 బ్రిడ్జిలు నిర్మాణాలు పూర్తయ్యాయి. ●ప్యాకేజీ–3 : రూ.804 కోట్లతో చింతగూడెం నుంచి రేచర్ల(చింతలపూడి మండలం) వరకు 42 కి.మీ. నిడివితో ఈ ప్యాకేజీ కింద పనులు చేపడుతున్నారు. ఇందులో 37 కి.మీ. మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అలాగే, 52 బ్రిడ్జి నిర్మాణ పనులన్నీ పూర్తి చేయడం విశేషం. -
సులభం.. సత్వరం
● స్లాట్ బుకింగ్తో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి ● పైలట్గా ఉమ్మడి జిల్లాలోని మూడుచోట్ల అమలు ● త్వరలోనే అన్ని కార్యాలయాల్లో ప్రారంభంఖమ్మంమయూరిసెంటర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్ తక్కువ సమయంలో పూర్తవుతోంది. స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి వెళ్తే 15 నిమిషాల్లో పని పూర్తవుతుండగా, మరో పది నిమిషాల్లో దస్తావేజులు ఇస్తున్నారు. దీంతో రోజంతా పడిగాపులు కాయాల్సిన ఇబ్బందులు తప్పాయి. ఈవిధానంతో క్రయ విక్రయదారుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఉద్యోగుల నుంచి సానుకూలత వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం ఆర్ఓ కార్యాలయం, కొత్తగూడెం, కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమలవుతుండగా.. త్వరలోనే అన్ని కార్యాలయాల్లోనూ అమలుకు సిద్ధమవుతున్నారు. గంటల కొద్దీ వేచి ఉండి.. గతంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం రోజంతా క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పడిగాపులు కాయాల్సి వచ్చేది. దీంతో ఇద్దరికీ సమయం కుదరక పలుమార్లు వాయిదా వేసుకునేవారు. మరోవైపు కార్యాలయాల్లోనూ రద్దీ ఉండేది. ఒకే సమయాన పెద్దసంఖ్యలో జనం వస్తుండడంతో కార్యాలయ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఒక్కోసారి డాక్యుమెంట్లన్నీ పూర్తిగా పరిశీలించేందుకు సమయం దొరికేది కాదు. కానీ ఇప్పుడు స్లాట్ బుకింగ్తో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. చిన్నచిన్న సమస్యలతో.. పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి జిల్లాలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలుచేస్తోంది. తొలిసారి కావడంతో చిన్నచిన్న సమస్యలు ఎదురవుతున్నా అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాత కంప్యూటర్లు, సర్వర్లను మార్చడంపై దృష్టి సారించిన నేపథ్యాన ఈ నెలాఖరు నాటికి సమస్యలన్నీ తీరతాయని చెబుతున్నారు. అన్ని కార్యాలయాల్లో.. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్తో మంచి మంచి ఫలితాలు వచ్చినందున ఈ విధానాన్ని త్వరలోనే అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25కార్యాలయాల్లో అమలు చేయగా.. ఇటీవల రెండో దశలో మరో 25 కార్యాలయాలు ఎంపిక చేశారు. ఈనెల 1వ తేదీ నుంచే అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని భావించినా సాంకేతిక కారణాలతో జూన్ 1వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏప్రిల్ 10 నుండి ఇప్పటివరకు స్లాట్ విధానంలో జరిగిన రిజిస్ట్రేషన్లు కార్యాలయం డాక్యుమెంట్లు ఆదాయం ఖమ్మం ఆర్ఓ 1,164 రూ.10.21 కోట్లు కొత్తగూడెం 698 రూ.2.41 కోట్లు కూసుమంచి 530 రూ.97 లక్షలుసులువుగా రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం విజయవంతంగా కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు త్వరగా పని ముగించుకుంటున్నారు. అంతేకాక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టి, దస్తావేజులు ఇస్తున్నాం. – రవీందర్రావు, జిల్లా రిజిస్ట్రార్, ఖమ్మంకొద్ది నిమిషాల్లోనే మెసేజ్ గతంతో పోలిస్తే పని సులువైంది. స్లాట్ సమయానికి వస్తే నిమిషాల్లో పని పూర్తయింది. ఆపై డాక్యుమెంట్లు తీసుకెళ్లాలని ఫోన్కు మెసేజ్ కూడా వచ్చింది. రిజిస్ట్రేషన్ అయిన రోజే డాక్యుమెంట్లు ఇవ్వడం బాగుంది. – పొదిల సత్యనారాయణ, టేకులపల్లి15నిమిషాల్లో ముగిసింది.. స్థలం రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని వస్తే 15 నిమిషాల్లోనే పూర్తి చేశారు. గతంలో రోజు మొత్తం ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు త్వరగా పూర్తయింది. ఇక ఇబ్బంది లేకుండా కొద్దిసేపట్లోనే దస్తావేజులు ఇచ్చేశారు.. – ఎల్.సురేష్కుమార్, సాయిగణేష్నగర్ -
గిరిజన కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధి లోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గురువారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. భద్రాచలం గిరిజన గురుకుల పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్ను గురుకులాల ఆర్సీఓ అరుణకుమారి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలల్లో వివిధ కోర్సులకు గాను 810 సీట్లు ఉండగా, 450 సీట్లలో బాలురకు ప్రవేశాలకు కల్పించామని తెలిపారు. మిగిలిన సీట్ల భర్తీకి త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. అలాగే, బాలికల ప్రవేశాల కోసం శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు దేవదాస్, సీతారాం, వీరస్వామి, సత్యనారాయణ, భాస్కర్, హరికృష్ణ, పద్మావతి, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. విధుల్లో చేరిన 108 ప్రోగ్రాం మేనేజర్ ఖమ్మంవైద్యవిభాగం: ఈఎంఆర్ఐ, గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్గా శివకుమార్ నియమి తులయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 108(అత్యవసర సేవలు), 102(అమ్మ ఒడి), 1962(పశు సంచార) సేవలను పర్యవేక్షించనుండగా, గతంలో ప్రోగ్రాం మేనేజర్గా ఉన్న భూమా నాగేందర్ హైదరాబాద్ క్లస్టర్కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వరంగల్ నుంచి వచ్చిన శివకుమార్ గురువారం విధుల్లో చేరారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై పలు సూచనలు చేశారు. పది జిల్లాల మత్స్యకారుల శిక్షణ కూసుమంచి: పాలేరులోని పీ.వీ.నర్సింహా రావు మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇవ్వనున్న శిక్షణ గురువారం ప్రారంభమైంది. ‘జలాశయాల్లో మత్స్య అభివృద్ధి – యాజమాన్య పద్ధతులు’ అంశంపై ఇస్తున్న ఈ శిక్షణకు ఖమ్మం, నిజామాబాద్, హనుమకొండ, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, నాగర్కర్నూల్, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, సిరిసిల్ల జిల్లాల మత్స్యకారులు పాల్గొన్నారు. తొలిరోజు మత్స్యశాఖ నేషనల్ ఫెసిలిటేటర్ బి.లవకుమార్ మాట్లాడుతూ శిక్షణను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా మత్స్య సంపదలో రాష్ట్రాన్ని ముందు నిలపాలని సూచించారు. చేపల పెంపకంలో ఆధునిక పద్ధతులు అవలంబిస్తే మంచి ఫలి తాలు వస్తాయని చెప్పారు. పరిశోధనా కేంద్రం పూర్వ, ప్రస్తుత ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ జి.విద్యాసాగర్రెడ్డి, డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడగా మత్స్య శాస్త్రవేత్తలు రవీందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్: పాల్వంచ మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో అర్చకులు అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదన, హారతి సమర్పించారు. అలాగే, మంత్రపుష్పం పఠించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్శర్మ పాల్గొన్నారు. -
సహజ సేద్యంపై రైతులకు ప్రోత్సాహం
ఖమ్మంవ్యవసాయం: రసాయన ఎరువుల వాడకం తగ్గిస్తూ సహజ సిద్ధమైన ఎరువులతో పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమావేశం ఏర్పాటుచేయగా, కలెక్టర్ మాట్లాడుతూ ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా వ్యవసాయం చేయడంతో పంటల్లో పోషక విలువలు ఉండేవని తెలిపారు. ఇప్పుడు ఎరువులు అధికంగా వాడుతుండడంతో రైతులకు పెట్టుబడి పెరగడంతో పాటు పంట దిగుబడిలో నాణ్యత ఉండటం లేదన్నారు. ఈనేపథ్యాన సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి, ముందుకొచ్చే రైతుల పొలాల వద్ద భూసార పరీక్షలు చేయించాలని సూచించారు. రైతులతో సంప్రదించేలా గ్రామానికి ఇద్దరు చొప్పున రైతు మిత్రలను ఎంపిక చేయాలన్నారు. కాగా, ఈ విధానంలో పండించిన పంటల అమ్మకానికి ప్రత్యేక మార్కెట్ ఏర్పాటుచేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంకు చెందిన సేంద్రియ రైతు అనుముల రామిరెడ్డి మాట్లాడుతూ తాను 25ఏళ్లుగా వర్మి కంపోస్ట్ తయారుచేసి ఉపయోగించడమే కాక ఇతరులకు ఇస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులు సహజ విదానాల్లో పంటలు సాగుకు ముందుకొస్తారన్నారు. అలాగే, ఇన్పుట్ యూనిట్ల పంపిణీపై దృష్టి సారించాలని కోరారు. సేంద్రియ పంటల అమ్మకానికి ప్రత్యేక మార్కెట్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ -
నెట్జీరో నెరవేరేనా..?
2023లో యాక్షన్ ప్లాన్ ప్రారంభించిన సింగరేణి ● 2024 కల్లా 532 మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం ● గడువు పూర్తయినా 300 మెగావాట్లు దాటని వైనం ● టెండర్ల దశలోనే మగ్గుతున్న కొత్త పవర్ ప్లాంట్లు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బహుముఖంగా విస్తరించిడంపై దృష్టి సారించిన సింగరేణి.. బొగ్గు ఉత్పత్తితో పాటు థర్మల్, సోలార్ విద్యుత్ రంగంలోకి వచ్చింది. త్వరలో రేర్ ఎర్త్ మినరల్స్ విభాగంలోనూ అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే నలుదిశలా విస్తరించే క్రమంలో ముందుగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో సంస్థ వెనకబడటం విమర్శలకు తావిస్తోంది. 2023లోనే టెండర్లకు పిలుపు.. కొత్తగా ఎనిమిది సోలార్ పవర్ ప్లాంట్లను వేర్వేరు ఏరియాల్లో నిర్మించాలని సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం స్థల సేకరణ కూడా పూర్తి చేయడంతో పాటు ప్లాంట్ల నిర్మాణానికి రూ.1,348 కోట్లు కేటాయించింది. ఈ మేరకు 2023 ఆగస్టులో టెండర్లు ఆహ్వానించింది. సెప్టెంబర్లో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించి, టెండర్లలో పాల్గొనే ఏజెన్సీల సందేహాలను నివృత్తి చేసింది. 2024 సెప్టెంబర్ నాటికి 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయి విద్యుదుత్పత్తి ప్రారంభించాలని అప్పటి సీఎండీ ఎన్.శ్రీధర్ టెండర్లలో పాల్గొన్న సంస్థలను కోరారు. అయితే నిర్దేశిత గడువు దాటి ఎనిమిది నెలలు పూర్తి కావొస్తున్నా పనులు ఒక కొలిక్కి రాలేదు. కేవలం మందమర్రిలో 67.50 మెగావాట్ల ప్లాంట్ పనులు ప్రారంభించడం గమనార్హం. లక్ష్యానికి దూరంగా.. దశదిశలా విస్తరించే క్రమంలో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో సింగరేణి వెనుకబడిపోతోందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత 72 మిలియన్ టన్నుల లక్ష్యానికి మూడు మిలియన్ టన్నులు తక్కువగా ఉత్పత్తి అయింది. నైనీ (ఒడిశా), ఇల్లెందు (రొంపేడు), కొత్తగూడెం (పీవీకే మెగా ఓసీ)లో కొత్త గనులు అందుబాటులోకి రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు సోలార్ పవర్ విషయంలోనూ అదే జరిగింది. నిర్దేశించిన గడువులోగా సెకండ్ ఫేస్ పనులు పూర్తయితే సింగరేణికి ప్రతీ ఏడాది విద్యుత్ బిల్లుల రూపంలో దాదాపుగా రూ. 290 కోట్లు ఆదా అయ్యేవి. అలాగే నెట్జీరో సాధించిన సంస్థగా దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కేది. కానీ ఈ రెండూ సాధ్యం కాలేదు. ఇవి ఇలా ఉండగానే రాజస్థాన్తో ఒప్పందం, జియోథర్మల్ పవర్ ప్లాంట్, పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్, రేర్ ఎర్త్ మినరల్స్, విండ్ పవర్ అంటూ కొత్త రాగాలను ఆలపించడంపై విమర్శలు వస్తున్నాయి. టార్గెట్ నెట్జీరో.. సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలో విస్తరించగా 18 ఓపెన్కాస్ట్, 22 భూగర్భ గనులు ఉన్నాయి. సుమారు 40 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. గనుల అవసరాలకు తోడు కార్మికుల సంక్షేమం కోసం సంస్థ భారీగా విద్యుత్ను వినియోగిస్తోంది. ప్రతీ ఏడాది వేర్వేరు అవసరాల నిమిత్తం 715 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వాడుతోంది. అయితే అంతే మొత్తంలో సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసి కాలుష్య నియంత్రణలో నెట్జీరో సంస్థగా నిలవాలని దశాబ్ద కాలంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తొలి విడతలో సంస్థ పరిఽధిలోని అన్ని ఏరియాల్లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను సిద్ధం చేసింది. తద్వారా 450 మిలియన్ యూనిట్ల విద్యుత్ను సంస్థ ఆదా చేసినట్టయింది. నెట్జీరో రికార్డు దిశగా అడుగులు వేస్తూ మరో 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల స్థాపనకు రెండేళ్ల కిందటే ప్లాన్ సిద్ధం చేసింది. -
రిక్తహస్తమే..!
● రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో మొండిచేయి ● అంచనాలు రూ.కోట్లలో.. కేటాయింపులు రూ.లక్షల్లో ● ‘పింక్ బుక్’లో జాడే లేని లైన్లుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వేబడ్జెట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొండిచేయే ఎదురైంది. గత మార్చిలో బడ్జెట్ ప్రకటించగా కేటాయింపులపై పింక్బుక్ వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. ప్రతీ ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.కోట్లలో ఉంటే కేటాయింపులు మాత్రం రూ.లక్షలకే పరిమితమయ్యాయి. నామ్కే వాస్తే నిధులు.. భద్రాచలంరోడ్–కొవ్వూరు రైల్వే లైన్ను 151 కి.మీ. నిడివితో నిర్మించాల్సి ఉండగా ప్రస్తుత బడ్జెట్లో ఆమోదం లభించినా నిధులు అంతంతే కేటాయించారు. ట్రాక్ నిర్మాణానికి రూ.1,444 కోట్లు అవసరమైతే కేవలం రూ.95 లక్షలే కేటాయించడం గమనార్హం. ఈ లైన్తో పాటు కొత్తగా భద్రాచలం(పాండురంగాపురం)–మల్కన్గిరి, కిరండోల్– కొత్తగూడెం, మణుగూరు–రామగుండం రైల్వే లైన్ల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన రైల్వే శాఖ.. ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మార్గాలకు కూడా ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించినా ఫలితం కానరాలేదు. మణుగూరుకు మొండిచేయి.. మణుగూరు–రామగుండం రైల్వే లైన్ నిడివి 200 కి.మీ. కాగా నిర్మాణ వ్యయం రూ.2,911 కోట్లుగా అంచనా వేశారు. ఈ లైన్కు ప్రస్తుత బడ్జెట్లో కంటి తుడుపు చర్యగా రూ.73లక్షలు కేటాయించారు. రామగుండం సమీపంలోని రాఘవాపురం వద్ద మొదలై మంథని– భూపాలపల్లి–మేడారం–తాడ్వాయి– రామానుజపురం మీదుగా మణుగూరు వరకు ఈ లైన్ నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూసేకరణ చివరి దశ కు చేరగా, బడ్జెట్లో రిక్తహస్తమే ఎదురైంది. ఆ లైన్ల ఊసేలేదు.. గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఒడిశాలోని మల్కన్గిరి నుంచి ఛత్తీస్గఢ్, ఏపీ మీదుగా భద్రాచలం (పాండురంగాపురం) రైల్వేలైన్ నిర్మాణానికి ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ మార్గానికి సంబంధించి భద్రాచలంరోడ్డు – మణుగూరు సెక్షన్లో పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు 15 కి.మీ. మార్గం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వస్తుంది. అయితే ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేకు చూపించిన కేటాయింపుల్లో ఈ మార్గం ఊసే లేదు. ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని మల్క న్గిరి సెక్షన్లో జరిగే పనులకే రైల్వేశాఖ నుంచి నిధులు మంజూరయ్యాయి. అలాగే కొత్తగూడెం నుంచి ఛత్తీస్గఢ్లోని కిరోండల్కు సంబంధించి కూడా ప్రస్తుత బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. పోచారం, గాంధీపురం స్టేషన్లకు నిధులు భద్రాచలం రోడ్ మీదుగా సర్వే నిర్వహించిన రైల్వే లైన్లలో ఒకటైన కొండపల్లి – కొత్తగూడెం(125 కి.మీ) రైల్వేలైన్ నిర్మాణ అంచనా వ్యయం రూ.997 కోట్లు కాగా ప్రస్తుత బడ్జెట్లో రూ.10 లక్షలే కేటాయించారు. డోర్నకల్ నుంచి భద్రాచలంరోడ్ వరకు ఉన్న సింగిల్ లైన్ను డబ్లింగ్ చేసేందుకు రూ.770 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో కేటాయింపులేమీ చూపలేదు. అయితే సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలో పోచారం, గాంధీపురం రైల్వే సేష్టన్ల అభివృద్ధికి దాదాపు రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. -
ఇటు దరఖాస్తులు
అటు సదస్సులు..పైలట్గా బోనకల్ మండలంలోనూ ‘భూభారతి’ ● ఈనెల 16వ తేదీ వరకు కొనసాగనున్న సదస్సులు ● ఇప్పటివరకు 1,255 దరఖాస్తులు.. చకచకా విచారణ ● మొదటి మండలం నేలకొండపల్లిలో కొనసాగుతున్న పరిశీలన, పరిష్కారంబోనకల్ సాక్షిప్రతినిధి, ఖమ్మం: భూభారతి చట్టానికి సంబంధించి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తొలి దఫాలో నేలకొండపల్లి మండలాన్ని ఎంపిక చేసి సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఇక రెండో దశలో బోనకల్ మండలాన్ని ప్రకటించిన నేపథ్యాన రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నారు. మరోపక్క తహసీల్దార్ కార్యాలయంలోనూ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. బోనకల్ మండలంలో ఈనెల 5న మొదలైన సదస్సులు 16వ తేదీ వరకు కొనసాగతున్నాయి. ఇప్పటివరకు రైతులు తమ సమస్యలపై 1,255 దరఖాస్తులు అందించగా, రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, మొదట పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న నేలకొండపల్లి మండలంలో కూడా దరఖాస్తుల పరిశీలన చేపడుతుండగా, ఇప్పటివరకు 146 దరఖాస్తులు పరిష్కరించారు. అత్యధికంగా మోటమర్రిలో... బోనకల్ మండలంలో రెవెన్యూ సదస్సుల ద్వారా ఇప్పటి వరకు1,255 దరఖాస్తులు అందాయి. అత్యధికంగా మోటమర్రి నుంచి 167 దరఖాస్తులు రాగా, పెద్దబీరవల్లిలో 156 వచ్చాయి. అలాగే, కలకోటలో 118, నారాయణపురంలో 99, తూటికుంటలో 91, లక్ష్మీపురంలో 89, చిరునోములలో 85, చొప్పకట్లపాలెంలో 79, గోవిందాపురం(ఎల్)లో 69, గార్లపాడులో 67, రాయన్నపేటలో 61, బోనకల్లో 58 దరఖాస్తులు అందాయి. అంతేకాక రామాపురంలో 45, జానకీపురంలో 42 దరఖాస్తులు అందగా.. సీతానగరంలో కేవలం 29దరఖాస్తులే సమర్పించారు. కాగా, సాగులో ఉన్న భూమి కన్నా పాస్ పుస్తకంలో తక్కువగా నమోదైందని, నిషేధిత జాబితాలో భూమి ఉందని, పట్టాదారు పేరు, విస్తీర్ణం, సర్వేనంబర్ సవరణ తదితర సమస్యలపై ఎక్కువ దరఖాస్తులు అందాయని తెలుస్తోంది. కాగా, సిబ్బంది తక్కువగా ఉండటంతో సకాలంలో దరఖాస్తులను పరిశీలించడం సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. ఈమేరకు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐలు, మండల సర్వేయర్లను అదనంగా కేటాయించాలని కోరుతూ ఇప్పటికే కలెక్టర్కు తహసీల్దార్ లేఖ రాశారు. అదనపు సిబ్బందిని కేటాయిస్తే దరఖాస్తుల నమోదుతోపాటు క్షేత్రస్థాయి పరిశీలన త్వరగా పూర్తయ్యే అవకాశముంది. నేలకొండపల్లి మండలంలో.. తొలిదఫా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న నేలకొండపల్లి మండలంలో 3,224 మంది రైతులు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,726 దరఖాస్తులు సాదాబైనామా కోసమే వచ్చాయి. అయితే, వివిధ కారణాలతో వీటి పరిశీలన ప్రారంభం కాలేదు. మిగతా సమస్యలపై అందిన 1,498 దరఖాస్తుల పరిశీలన మాత్రం కొనసాగుతోంది. సాగులో ఉన్న భూమి కన్నా పాస్ పుస్తకంలో తక్కువగా నమోదైందని, విస్తీర్ణం, సర్వేనంబర్ సవరించాలని, కొత్త పాస్ పుస్తకం ఇవ్వాలని కోరడమే కాక అసైన్డ్ భూమి సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో 581 దరఖాస్తులను ఇప్పటివరకు పరిశీలించిన బృందాలు 435 దరఖాస్తుల ను తిరస్కరించి, 146 దరఖాస్తులను పరిష్కరించా యి. జిల్లాలో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపికై న నేలకొండపల్లి, బోనకల్ మండలాల్లో భూసమస్యలు పరిష్కారమైతే మిగతా ప్రాంతాల్లోనూ అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. మరోపక్క సాదా బైనామా దరఖాస్తులపై ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంది. -
మోడల్ నియోజకవర్గంగా మధిర
ఎర్రుపాలెం/బోనకల్: ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పాలన చేపట్టిన బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈక్రమాన అప్పుల భారం ఉన్నా, ఆదాయం సరిపడా లేకున్నా తాము అధికారంలోకి రాగానే అభివృద్ధి పనులతో పాటే సంక్షేమ పథకాలను నిరంతరాయంగా చేడుతున్నామని తెలిపారు. ఎర్రుపాలెంలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించే 50 పడకల ఆస్పత్రికి కలెక్టర్ ముజ్మమిల్ఖాన్తో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, రూ.2.62 కోట్లతో నిర్మించే కండ్రిక – పెద్దగోపవరం బీటీ రోడ్డుకు, రూ.5.74 కోట్లతో బనిగండ్లపాడు – బంజర బీటీ రోడ్డు నిర్మాణాలు, బోనకల్ మండలంలో రూ. 20 కోట్లతో చేపట్టే కలకోట – మోటమర్రి రోడ్డు విస్తరణ, రూ.8కోట్లతో రావినూతల – ఆళ్లపాడు వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అంతేకాక కలకోటలో హరిజన మత్య్స సొసైటీ భవనం, అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. ఆదాయం పెరగకున్నా... ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోనే మధిరను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. ఇప్పటికే ఇందిరా డెయిరీ ఏర్పాటు పురోగతిలో ఉండగా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం మొదలైందని చెప్పారు. అలాగే, అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపడుతామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో కంటే నేడు ఆదాయం పెరగలేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ వ్యవసాయంతో పాటు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పథకాలు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు ప్రతీ గ్రామంలో వెచ్చించిన నిధులు, చేసిన అభివృద్ధి వివరాలను లెక్కలతో సహా వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా, యువత ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని భట్టి తెలిపారు. అనంతరం పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులు అందచేయగా, లక్ష్మీపురంలోని కాంగ్రెస్ నాయకుడు తల్లపురెడ్డి నాగిరెడ్డి ఏర్పాటు చేసిన గొర్రెల ఫామ్ను పరిశీలించి కాంగ్రెస్ శ్రేణులతో సమీక్షించారు. ఈకార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీఎంహెచ్ఓ కళావతిబాయి, డీసీహెచ్ఓ రాజశేఖర్, ఆర్డీఓ నర్సింహారావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాసాచారి, పీఆర్ ఈఈ వెంకటరెడ్డి, మధిర మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, ఏడీఈ విజయచంద్ర, తహసీల్దార్ పున్నంచందర్, కాంగ్రెస్ జిల్లా, మండలాల అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, గాలి దుర్గారావు పాల్గొన్నారు. అలాగే, నాయకులు దొబ్బల సౌజన్య, చావా రామకృష్ణ, శీలం శ్రీనివాసరెడ్డి, బొగ్గుల గోవర్దన్రెడ్డి, యరమల పూర్ణచంద్రారెడ్డి, అనుమోలు కృష్ణారావు, వేజండ్ల సాయి, కర్నాటి రామకోటేశ్వరరావు, మోదుగు సుధీర్బాబు, పైడిపల్లి కిషోర్కుమార్, పిల్లలమర్రి నాగేశ్వరరావు, చేబ్రోలు వెంకటేశ్వర్లు, వట్టికొండ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి సిద్ధంగా ప్రణాళికలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 38 కేంద్రాలు
నేలకొండపల్లి: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22నుంచి జరగనుండగా, జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి కె.రవిబాబు తెలిపారు. నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీని బుధవారం తనిఖీ చేసిన ఆయన ప్రవేశాల పెంపునకు చేయాల్సిన ప్రచారంపై అధ్యాపకులకు సూచనలు చేశారు. అనంతరం డీఐఈఓ మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షలకు 38కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, 11,780 మంది మొదటి, 3,681 మంది ద్వితీ య సంవత్సరం విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో 77.09 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, వచ్చే ఏడాది నూరు శాతం సాధించేలా కృషి చేస్తామని డీఐఈఓ వెల్లడించారు. నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ని గిరిజన నిరుద్యోగ యువతకు ఐటీసీ ప్రథమ్ ద్వారా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. కోర్సుల వారీగా పది రోజుల నుంచి 45 రోజులపాటు శిక్షణ ఉంటుందని, బ్యూటీషియన్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, టైలరింగ్ శిక్షణ కోసం పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పుట్టగొడుగుల పెంపకం శిక్షణకు ఏడో తరగతి, ఆపైన, జ్యూట్ బ్యాగ్ల తయారీకి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని వెల్లడించారు. భద్రాచలం, ఖమ్మం వైటీసీల్లో శిక్షణ ఇవ్వడమే కాక ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తామని పీఓ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ జిరాక్స్, ఆధార్, రేషన్ కార్డు/ఉపాధి హామీ బుక్, బ్యాంకు పాస్ బుక్, రెండు ఫొటోలతో ఈనెల 21న ఐటీడీఏలోని వైటీసీలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 63026 08905, 81438 40906 నంబర్లలో సంప్రదించాలని పీఓ తెలిపారు. ఇరుశాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు ఖమ్మంవ్యవసాయం: రహదారుల విస్తరణ సమయాన విద్యుత్ స్తంభాలు తొలగించడం, కొత్త స్తంభాలు వేయాల్సి వస్తే రోడ్డు తవ్వడం వంటి పనులతో అభివృద్ధి పనులకు ఫలితం ఉండడం లేదు. ఈ నేపథ్యాన విద్యుత్, రహదారులు, భవనాల శాఖ అధికారులు సంయుక్తంగా కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బుధవారం ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో ఇరు శాఖల అధికారులు సమావేశమయ్యారు. ముదిగొండ నుంచి వల్లభి వరకు రోడ్డు వెడల్పు చేస్తున్న క్రమాన పాత స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, దానవాయిగూడెం – కామంచికల్ రోడ్డు, బల్లేపల్లి – మంచుకొండ రహదారి, వైరా – మధిర రోడ్లలో చేపట్టాల్సిన పనులు, ఖమ్మం రూరల్ మండలంలోని తరుణి హాట్ వద్ద సబ్స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, డీఈలు ఎన్.రామారావు, డీఈ నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఈఈ యుగంధర్, డీఈలు భగవాన్, వెంకట్రామయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఉపాధ్యాయ శిక్షణను పరిశీలించిన ఆర్జేడీ ఖమ్మం సహకారనగర్: ఖమ్మంలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని పాఠశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ) సత్యనారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజ రు, శిక్షణపై ఆరా తీశారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ మార్పులకు అనుగుణంగా శిక్షణ లో నేర్చుకున్న అంశాల ద్వారా బోధించాల్సి ఉంటుందని తెలిపారు. డీఈఓ ఎస్.సత్యనారా యణ, ఏఎంఓ రవికుమార్, ప్లానింగ్ కోఆర్డినేటర్ సీహెచ్.రామకృష్ణ, కోర్సు కోఆర్డినేటర్ శైలజలక్ష్మి పాల్గొన్నారు. కాగా, ఖాళీగా ఉన్న గెజిటె డ్ ప్రధానోపాధ్యాయుల పోస్టుల్లో ఎఫ్ఏసీ హెచ్ఎంలుగా నియమించిన స్కూల్ అసిస్టెంట్లకు ర్యాటిఫికేషన్ ఆర్డర్లు ఇవ్వాలని ఆర్జేడీకి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు కట్టా శేఖర్రావు, పి.వెంకటేశ్వరరెడ్డి, తాళ్లూరి చంద్రశేఖర్, రత్నకుమార్, డి.రవికుమార్, లింగం సతీష్, టి.వెంకన్న, శాంతారెడ్డి, మహేష్, రవికిరణ్, సుబ్బారావు పాల్గొన్నారు. -
గురుకులం.. పురోగమనం
● బీసీ గురుకులాల్లో రాణిస్తున్న ఇంటర్ విద్యార్థులు ● ఇంటర్మీడియట్లో ఏడు శాతం పెరిగిన ఉత్తీర్ణత ● సీఓఈగా బోనకల్ గురుకులం అప్గ్రేడ్ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో కార్పొరేట్ స్థాయికి మించి వసతి, భోజన సౌకర్యాలు కల్పించడమే కాక ఉచిత విద్య అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాలల్లో ఏటేటా విద్యాప్రమాణాలు పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే గురుకులాల్లో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం భారీగా పెరగడడం... ఇంటర్, పదో తరగతి విద్యార్థులు పలువురు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం విశేషం. గత ఏడాది గురుకులాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 82శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ ఏడాది 89శాతానికి పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 22 కళాశాలలు ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 22 మహత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ,సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీతోపాటు వృత్తికోర్సులు నిర్వహిసస్తూ ఒక్కో కళాశాలలో కోర్సుకు 40 సీట్లే కేటాయించారు. ఇక కొన్ని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మాత్రమే బోధన సాగుతోంది. దీంతో ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ వహిస్తున్నందున ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. మెరుగైన విద్యతో ఉత్తమ ఫలితాలు బీసీ గురుకులాల్లో ఉత్తమ బోధన అందిస్తున్నాం. నిరంతరం విద్యార్థులపై అధ్యాపకుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాం. ఏటా ఉత్తీర్ణత పెరిగేలా ప్రణాళికాయుతంగా బోధిస్తుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ ఏడాది బోనకల్ గురుకులం సీఓఈగా అప్గ్రేడ్ అయింది. భవిష్యత్లో మరిన్ని కళాశాలలకు అవకాశం దక్కుతుంది. – సీహెచ్.రాంబాబు, ఆర్సీఓ, బీసీ గురుకులాలు సీఓఈగా బోనకల్ బీసీ గురుకులాల్లో ఇప్పటి వరకు సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ)గా హైదరాబాద్లోని ఒక్క గురుకులాన్నే అప్గ్రేడ్ చేశారు. ఇటీవల మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయ సంస్థ రాష్ట్రంలోని మరో తొమ్మిది గురుకులాలను సీఓఈలుగా అప్గ్రేడ్ చేయగా.. జాబితాలో ఖమ్మం జిల్లా బోనకల్ గురుకులానికి కూడా చోటు దక్కింది. దీంతో ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు ఎప్సెట్, జేఈఈ, ఐఐటీ శిక్షణ అందనుంది. ఇంటర్ విద్యతోపాటు ఉన్నత విద్యావకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ గురుకులాల్లోనే సీఓఈలు ఉండగా.. తాజాగా బీసీ గురుకులాలకు కూడా అప్గ్రేడ్ చేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
బోధన మరింత కొత్తగా!
● ఉపాధ్యాయులను సన్నద్ధం చేసేలా వివిధ అంశాల్లో శిక్షణ ● విడతల వారీగా ఐదు రోజుల పాటు నిర్వహణఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక కొన్నాళ్లకు దశల వారీగా పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ అందించేవారు. ఆపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బడి తెరిచిన మొదటిరోజే పుస్తకాలు, యూనిఫాం ఇస్తున్నారు. అంతేకాక పాఠశాల పనిదినాలు వృథా కాకుండా ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇస్తున్నారు. బోధనలో సరికొత్త మార్పులు తీసుకొచ్చే దిశగా ఏర్పాటుచేసిన ఈ శిక్షణ మొదటి విడత జిల్లాలో మొలైంది. ప్రారంభమైన శిక్షణ తరగతులు జిల్లాలోని ఉపాధ్యాయులకు మూడు విడతలుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి విడతగా ఈనెల 13న ఖమ్మంలో శిక్షణ తరగతులు మొదలయ్యాయి. ఐదు రోజుల పాటు కొనసాగే శిక్షణలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిష్ ఉపాధ్యాయులు 326 మంది, గణితం 453, సోషల్ 436 మంది ఉపాధ్యాయులతో పాటు మండల స్థాయి రిసోర్స్ పర్సన్లు 168 మంది, మండలానికి ఎనిమిది మంది చొప్పున స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఐఆర్పీలు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బోధనలో చేయాల్సిన మార్పులపై వివరిస్తూనే డిజిటల్ ఎడ్యుకేషన్, ఏఐ ఆధారిత బోధన, విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్పై అవగాహన కల్పించేలా నిపుణులు వివరిస్తున్నారు. కాగా, మూడు విడతల శిక్షణలో భాగంగా జిల్లాలోని ప్రతీ ఉపాధ్యాయుడు హాజరయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. ఈ శిక్షణ తరగతులను మంగళవారం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ప్రారంభించగా, బుధవారం ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి పరిశీలించారు.వృత్తి నైపుణ్యాల పెంపు ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ వృత్తి నైపుణ్యాల పెంపునకు దోహదపడుతుంది. బోధనా విధానాలు, వ్యూహాలు, ఫలితాల సాధన, సమగ్ర మూల్యాంకకానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల నమోదు పెంచేలా చేయాల్సిన కృషిని వివరించారు. – వి.రాజశేఖర్, జెడ్పీహెచ్ఎస్, తుమ్మలపల్లిబోధనకు ఉపయోగం ఇక్కడ ఇచ్చిన శిక్షణ డిజిటల్ బోధనను మరింత సులువు చేయనుంది. స్మార్ట్ టీవీల ఉపయోగం, వెబ్సైట్ల పరిశీలన తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. తద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందించే అవకాశముంటుంది. – ఎన్.సుధాకర్రావు, జెడ్పీహెచ్ఎస్, ప్రొద్దుటూరుమెరుగైన బోధన కోసం... కోర్సులో భాగంగా రూపొందించిన అంశాలన్నీ ఉపాధ్యాయులకు ఉపయోగపడేవే. తరగతి గదిలో విద్యార్థులు ఆసక్తిగా పాఠాలు వినేలా బోధించడానికి ఇవి కీలకంగా నిలుస్తాయి. డిజిటల్ బోధన కూడా మరింత మెరుగుపడనుంది. – కె.శైలజలక్ష్మి, కోర్సు కోఆర్డినేటర్, ఖమ్మం -
ఆటో బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు
తల్లాడ: తల్లాడ–సత్తుపల్లి జాతీ య రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యా యి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పలువురు ఆటోలో తల్లాడ మండలం మిట్టపల్లిలో బంధువుల ఇంట కర్మకు హాజరై తిరి గి వెళ్తున్నారు. తల్లాడ మండలం అంజనాపురం వద్ద గేదె అడ్డు రావడంతో ఆటో ముందు బైక్పై వెళ్తున్న వ్యక్తి ఒక్కసారి బ్రేక్ వేయగా కింద పడ్డాడు. ఆ వెంటనే ఆటో డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేయగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న గొర్రెముచ్చు అరుణ, మాలోచి ఆరోగ్యమ్మ, గొర్రెముచ్చు మౌనిక, మణెమ్మ, సిరి, జాన్సీ, గుత్తికొండ జ్ఞాన సుందరికి కాళ్లు, చేతులు, తలకు గాయాలయ్యాయి. అలాగే, బైక్పై వెళ్తున్న మట్టగాని గురుపాదం కూడా గాయపడగా క్షతగాత్రులను 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోతుల దాడిలో మహిళలకు గాయాలుకొణిజర్ల: గుంపుగా వచ్చిన కోతులు చేసిన దాడిలో ఐదుగురు మహిళలకు గాయాలయ్యాయి. వైరా మున్సిపాలిటీ పరిధిలోకి కొణిజర్ల మండలం దిద్దుపూడిలో కొందరు మహిళలు బుధవారంరోడ్డు పక్కన నిలుచుని మాట్లాడుతుండగా పెద్దసంఖ్యలో వచ్చిన కోతులు దాడి చేశాయి. దీంతో కొందరు తప్పించుకుపోగా, మరికొందరు గాయపడ్డా రు. గ్రామానికి చెందిన షేక్ లాల్బీ, షేక్ అమీనాబీ, షేక్ రజియాబేగం, షేక్ నిజాంబీ, అమర్లపూడి సైదమ్మకు గాయాలు కాగా, కోతుల బెడదపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన నిర్వహించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వేణు చేరుకుని వారికి నచ్చచెప్పగా, త్వరలోనే కోతులను అటవీ ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి మహిళలకు వైరా పీహెచ్సీలో చికిత్స చేయించారు. గంజాయితో పట్టుబడిన యువకులువైరా: గంజాయి తీసుకెళ్తున్న నలుగురు యువకులను వైరా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని స్టేజీ పినపాక సమీపాన బుధవారం వాహనాల తనిఖీ చేస్తుండగా వైరా, దిద్దుపూడికి చెందిన కోటేశ్వరరావు, అజయ్ కారులో 2.4 కేజీల గంజాయి తీసుకెళ్తూ పట్టుబడ్డారు. అలాగే, సాయి వంఽశీ, సందీప్ బైక్పై వెళ్తుండగా అనునానంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరికి గంజాయి సరఫరా చేసే ఎక్కిరాల రామకృష్ణ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సమ్మెలో సమైక్యంగా పాల్గొనాలి
ఖమ్మంమయూరిసెంటర్: జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈనెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో సామాజిక శక్తులు సమైక్యంగా పాల్గొనాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్బాబు కోరారు. తద్వారా మనువాద, కార్పొరేట్ విధానాలను అమలు చేస్తున్న కేంద్రంపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలోని మంచికంటి హాల్లో కేవీపీఎస్ ఆధ్వర్యాన బుధవారం రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులకు కూడా రక్షణ కరువైందన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను బీజేపీ సర్కార్ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని, తద్వారా సంఘం ఏర్పాటు, సమ్మె చేయడం, కనీస వేతనం పొందే హక్కులు దూరమవుతున్నాయని తెలిపారు. ఈనేపథ్యాన సమ్మెలో అందరూ భాగస్వాములై నిరసన తెలపాలని కోరారు. ఈసదస్సుకు నందిపాటి మనోహర్ అధ్యక్షత వహించగా, డాక్టర్ బీ.వీ.రాఘవులు, కోరిపల్లి శ్రీనివాస్, తుమ్మ విష్ణు, మెరుగు సత్యనారాయణ, ఎర్ర శ్రీనివాసరావు, టి.లింగయ్య, బోడపట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కనులపండువగా దొంగల దోపు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మహోత్సవాల్లో భాగంగా బుధవారం దొంగల దోపు వేడుక కనులపండువగా సాగింది. ముందుగా ఆలయంలో వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మహిళా భక్తుల కోలాటాల నడుమ ఆలయం నుంచి గోదావరి తీరానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ తర్వాత నదిలో తెప్పోత్సవం గావించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎల్.రమాదేవి, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారుల పెద్దమనసు
● కిడ్డీ బ్యాంక్ నగదుతో మజ్జిగ పంపిణీ సత్తుపల్లిటౌన్: పిల్లలంతా మూడు, నాలుగు తరగతులు చదువుతున్న వారే.. కానీ ఎండలతో బాటసారుల ఇబ్బందులను గుర్తించి పెద మనస్సు కనబరిచారు. సత్తుపల్లి గాంధీనగర్కు చెందిన మౌలిక్, ఇడుపులపాటి క్రితిక్, కొమ్ముగిరి వర్ధిని, హర్షిని, నందికోళ్ల సంజయ్, జి.సారిక, కన్నెపోగు జశ్వంత్ తమ కిడ్డీ బ్యాంక్లో దాచిన నగదుతో బుధవారం పెరుగు కొని మజ్జిగ చేయించారు. ఆపై ఇళ్ల ముందే చిన్నారులంతా కలిసి కర్రలతో పందిరి వేసి వీధిలో వెళ్తున్న మజ్జిగ పంపిణీ చేయగా పలువురు అభినందించారు. విద్యుత్ శాఖలో ఉత్తమ ఉద్యోగుల ఎంపికఏప్రిల్ నెల జాబితాలో ఐదుగురు ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ శాఖలో ఉత్తమ పనితీరును ప్రదర్శించే అధికారులు, ఉద్యోగులకు ప్రతినెలా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్పీడీసీఎల్ పునరుద్ధరించింది. ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి ప్రారంభించినా కొన్నాళ్ల తర్వాత నిలిచిపోయింది. తిరిగి విద్యుత్ సరఫరా, అంతరాయాల నిర్వహణ, సత్వర సేవ, వసూళ్లు తదితర అంశాల ఆధారంగా ఏప్రిల్ నెలకు గాను ఐదుగురు అధికారులను ఎంపిక చేసినట్లు ఖమ్మం ఎస్ఈ ఈ.శ్రీనివాసాచారి తెలిపారు. ఇందులో ముదిగొండ విద్యుత్ సబ్స్టేషన్ ఏఈ ఎం.శ్రీనివాసరావు, ఖమ్మం టౌన్–5 ఏఈ జిరుపయ్య, సత్తుపల్లి ఏడీఈ బి.ప్రసాద్బాబు, ఖమ్మం టౌన్–1 ఏడీఈ నాగార్జున, సత్తుపల్లి డీఈ(ఆపరేషన్స్) ఎల్.రాములు ఉన్నారని వెల్లడించారు. అవసరానికి మించి ఎరువులు వాడొద్దుసత్తుపల్లిరూరల్: సాగు చేసే పంటలు, భూసా రం ఆధారంగా అధికారులు, శాస్త్రవేత్తల సిఫా రసు మేరకు ఎరువులు ఉపయోగించాలని, అంతకు మించి వాడితే ఫలితం ఉండకపోగా ఖర్చు పెరుగుతుందని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్కుమార్ అన్నారు. ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గంగారం రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి చేయడంతో పాటు పంట అవశేషాలను కలియదున్నడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. ఆతర్వాత ఏఓ వై. శ్రీనివాసరావు పలు సూచను చేయగా, సొసైటీ చైర్మన్ ఎం.వెంకటరెడ్డి, శాస్త్రవేత్తలు ఎం.రాంప్రసాద్, డాక్టర్ ఆర్.రమేష్, ఉద్యానవన అధికారి శ్రావణి, పశుసంవర్ధక శాఖ వైద్యులు శశిదీప్, ఏఈఓ వాసంతి పాల్గొన్నారు. కాస్త నెమ్మదించిన సూరీడుఖమ్మంవ్యవసాయం: సూర్యుడి తన ప్రతాపాన్ని బుధవారం కాస్త తగ్గించాడు. జిల్లాలో మంగళవారం 40–45 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, బుధవారం అది 35–40 డిగ్రీలకు పడిపోయింది. కాగా, బుధవారం పమ్మిలో గరిష్టంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సత్తుపల్లి ఓసీ, బాణాపురంలో 39.6, గంగారం, వైరా ఏఆర్ఎస్ 39.3, వేంసూరులో 39.1 డిగ్రీలుగా నమోదైంది. అలాగే, బచ్చోడులో 38.9, చింతకానిలో 38.8, నేలకొండపల్లిలో 38.7, ముదిగొండ 38.5, ఎర్రుపాలెం, ఖమ్మం ప్రకాష్నగర్, కలెక్టరేట్ వద్ద 38.4, పెనుబల్లిలో 38.3, గౌరారం, మధిర, కూసుమంచిలో 38.2, సత్తుపల్లి, వైరా, తల్లాడ, పెద్దగోపతి, కుర్నవల్లిలో 38.1, ఖమ్మం ఖానాపురం, పల్లెగూడెంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో ఆ ప్రభావం కారణంగా ఆకాశం మేఘావృతమై ఉష్ణోగ్రత తగ్గిందని భావిస్తున్నారు. అయితే, ఉక్కపోత ఏ మాత్రం తగ్గకపోవడంతో జనం సతమతమయ్యారు. సీఐల బదిలీ, పోస్టింగ్ ఖమ్మం క్రైం: పోలీసు శాఖలోని మల్టీజోన్–1 పరిధిలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా కరీంనగర్ పీటీసీలో ఆన్ డ్యూటీపై ఉన్న జి.శ్రీకాంత్గౌడ్ను ఖమ్మం ట్రాఫిక్ సీఐగా కేటాయించారు. అలాగే, ఖమ్మం టాస్క్ఫోర్ సీఐగా వెయింటింగ్లో ఉన బి.బాలాజీని నియమించారు. అంతేకాకుండా కొత్తగూడెం టుటౌన్ సీఐగా వెయిటింగ్లో ఉన్న డి.ప్రతాప్ను నియమించారు. ఈ స్థానంలో ఉన్న టి.రమేష్కుమార్ను ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. -
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయండి
ఖమ్మంరూరల్/కూసుమంచి: వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడమే కాక వారిలోని సృజనాత్మకతను వెలికితీయాలని జిల్లా విద్యాశాఖాధికారి సామినేని సత్యనారాయణ సూచించారు. ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లోని జలగంగనర్, కూసుమంచి ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న శిబిరాలను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. చదరంగం, క్యారమ్స్, యోగా, కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ ఇవ్వడమేకాక అల్పాహారం, భోజనం సమకూరుస్తున్న విషయాన్ని వివరించి విద్యార్థులు ఎక్కువ మంది సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే, విద్యార్థులు గీసిన చిత్రాలను చూసి అభినందించారు. ఎంఈఓలు శ్రీనివాస్, రాయల వీరస్వామి, హెచ్ఎం శ్యాంసన్తో పాటు ఉపాధ్యాయులు మాధవరావు, రూబీ, షాబుద్దీన్, జుబేదా, వెంకటేశ్వర్లు, జాఫర్ పాల్గొన్నారు. -
ఆర్థిక స్వాతంత్య్రంతోనే మహిళల అస్థిత్వం
ఖమ్మంరూరల్: అన్ని వర్గాల మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రమే కీలకమని, తద్వారా వారికి సొంత అస్థిత్వం సొంతమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని తరుణి హాట్లో ఉన్న రైసెట్ శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు. సీఎస్సీ పాయింట్ల ఏర్పాటులో శిక్షణ తీసుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని సూచించారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా కొంత వివక్ష ఉందని, దీని నిర్మూలనకు అంతా కృషి చేయాలని తెలిపారు. ఇందులో భాగంగానే మహిళల ఆర్థికాభివృద్ధికి సిటిజన్ సర్వీస్ సెంటర్లు, షీ జిరాక్స్ సెంటర్లను తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఈకార్యక్రమంలో రైసెట్ డైరెక్టర్ సి.చంద్రశేఖర్, ఏపీఓ నూరొద్దీన్, సీఎస్సీ స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలతో ఇళ్లంతా సంతోషం ఎర్రుపాలెం: ఆడపిల్లలు ఉన్న ఇళ్లు సంతోషాలకు చిరునామాగా నిలుస్తాయని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ‘మా పాప – మా ఇంటి మణిదీపం’ కార్యక్రమంలో భాగంగా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరంలోని ఆడపిల్లకు జన్మనిచ్చిన గూడూరు కోటేశ్వరి– లక్ష్మీనారాయణరెడ్డితో పాటు వారి కుటుంబీకులను కలెక్టర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలు ప్రతీ రంగంలో రాణిస్తున్నందున సమాన అవకాశాలు కల్పించాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి కె.రాంగోపాల్రెడ్డి, డీఎంహెచ్ఓ క్టర్ బి.కళావతిబాయి, ఏసీడీపీఓ జి.కృష్ణశ్రీ, ఎంపీడీఓ బి.సురేందర్, సూపర్వైజర్లు సరిత, మధులత, సునీత పాల్గొన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: భార్యకు మరొకరితో సంబంధం ఉందనే అనుమానంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని సిద్ధారం గ్రామానికి చెందిన రాయిని రామారావు(39) తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానిస్తుండగా తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలోనే నాలుగు రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆతర్వాత గ్రామానికే చెందిన ఓ వ్యక్తితో రామారావు గొడవ పడగా, మంగళవారం రాత్రి తన ఇంటి ఆవరణలోని మామిడి చెట్టుకు చీరతో ఊరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం గమనించిన కుటుంబీకులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతిపెనుబల్లి: నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలైన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మండలంలోని లింగగూడెంకు చెందిన గరిక నాగయ్య(85) ఈనెల 6తేదీన బీడీ కాల్చుకునే క్రమంలో అగ్గిపుల్ల మంచంపై ఉన్న దిండుపై పడి నిప్పంటుకుంది. ఆపై మంటలు పెద్దవై నాగయ్య శరీరానికి అంటుకోగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబీకులు నాగయ్యను పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వీఎం బంజర్ ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు. గాయపడిన వ్యక్తి... పెనుబల్లి: రోడ్డుప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరు మండలం రఘునాథగూడెంకు చెందిన రామిశెట్టి రామారావు(45) గత నెల 24న పెనుబల్లి మండలం టేకులపల్లికి వచ్చివెళ్తూ ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కింద పడ్డాడు. దీంతో ఆయనకు గాయాలు కాగా, పెనుబల్లి ఆస్పత్రిలో చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ రామారావు మృతి చెందగా, ఆయన కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.వెంకటేష్ తెలిపారు. వడదెబ్బతో కూలీ..నేలకొండపల్లి: ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీ ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురై మృతి చెందాడు. మండలంలోని చెరువుమాధారానికి చెందిన ఎస్. దానయ్య(55) రోజులాగే బుధవారం ఉపాధిహామీ పనికి వెళ్లాడు. అక్కడ ఎండ కారణంగా అస్వస్థతకు గురైన ఆయన ఇంటికి వచ్చాక బంధువులతో మాట్లాడుతూనే కుప్పకూలాడు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దానయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కాగా, పని ప్రదేశాల వద్ద తగిన సౌకర్యాలు లేకపోవడమే ఆయన మృతికి కారణమని పలువురు పేర్కొన్నారు. -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
ఆర్టీసీ ఈడీ సొలొమన్ ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కరీంనగర్ జోన్ ఈడీ సొలొమన్ ఆదేశించారు. ఖమ్మంలోని రీజియన్ మేనేజర్ కార్యాలయం, పాత, కొత్త బస్టాండ్లను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కార్గో పాయింట్, డిస్పెన్సరీలో పరిశీలించాక రీజినల్ మేనేజర్ సరిరామ్తో కలిసి అధికారులతో సమావేశమయ్యారు. బస్సు సర్వీసుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దని, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా కొత్త రూట్లను గుర్తించాలని సూచించారు. ఖమ్మం డిపో మేనేజర్ దినేష్కుమార్, అసిస్టెంట్ మేనేజర్ రామయ్య, సూపర్వైజర్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ● మధిర: ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఈడీ సాలొమాన్ సూచించారు. మధిర డిపోను తనిఖీ చేసిన ఆయన సర్వీసుల నిర్వహణ, తదితర అంశాలపై ఉద్యోగులకు సూచనలు చేశారు. ఖమ్మం ఆర్ఎం సరిరామ్, మధిర డీఎం శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కార్యదర్శిగా ప్రవీణ్కుమార్ కొనసాగింపు ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి(ఆన్ డ్యూటీ)గా విధుల్లో ఉన్న పి.ప్రవీణ్కుమార్కు మరో ఏడాది పాటు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. పటాన్చెరువు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి అయిన ప్రవీణ్ను గత ఏడాది జనవరిలో ఖమ్మంకు కేటాయించారు. మరోమారు ఏడాది పొడించడంతో 2026 ఏప్రిల్ వరకు ఆయన ఇక్కడే విదులు నిర్వర్తించనున్నారు. గ్రేడ్–2 కార్యదర్శులకు పదోన్నతులు రాష్ట్రంలో నలుగురు కార్యదర్శులకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1గా పదోన్నతి కల్పించారు. ఇందులో భాగంగా సత్తుపల్లి మార్కెట్లో పనిచేస్తున్న జి.సత్యనారాయణకు పదోన్నతి కల్పించి కల్లూరుకు, ఖమ్మం మార్కెట్ నుంచి వి.సృజన్బాబుకు పదోన్నతి కల్పించి లక్సెట్పేట మార్కెట్కు బదిలీ చేశారు. అయితే, ఖమ్మం మార్కెట్ గ్రేడ్–2 కార్యదర్శిగా మాత్రం ఎవరినీ నియమించలేదు. క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. శిబిరాన్ని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీహెచ్.వెంకట్ ప్రారంభించి మాట్లాడుతూ ఔత్సాహికులకు మెరుగైన శిక్షణ ఇచ్చి హెచ్సీఏ టోర్నీలో ఆడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో కన్వీనర్ ఎం.డీ.మాసూద్తో పాటు ఫారూఖ్, తురాబ్ అలీ తదితరులు పాల్గొన్నారు. హైడల్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఈ కూసుమంచి: మండలంలోని పాలేరులో మినీ హైడల్ ప్రాజెక్టు(జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం)లో మరమ్మతు పనులను జెన్కో సీఈ(సివిల్) నారాయణ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పురోగతిపై ఆరా తీసిన ఆయన, వర్షాకాలంలోగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, గత ఏడాది సెప్టెంబర్లో వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసే కాల్వ కట్ట తెగిన నేపథ్యాన, అక్కడ చేపడుతున్న మరమ్మతులను కూడా సీఈ పరిశీలించారు. ఎస్ఈ దేశ్యా, డీఈ సింహాచలం పాల్గొన్నారు. వడదెబ్బతో ఇద్దరు మృతిమఽధిర/చింతకాని: మధిర మండలం నిదానపురానికి చెందిన కనపర్తి దానయ్య(49) వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందాడు. ఎండల కారణంగా అస్వస్థతకు గురైన ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. దానయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే, చింతకాని మండలం నాగులవంచలో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లిన గొడ్డుగొర్ల కేజీరాణి(55) వడదెబ్బకు గురై మంగళవారం మృతి చెందింది. గత శనివారం పనికి వెళ్లిన ఆమె ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురికాగా ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మామిడి పచ్చడికి ధరల సెగ
పచ్చడి పెట్టేందుకు జంకుతున్న సామాన్యులు ● తెగుళ్లు, అకాల వర్షాలతో దిగుబడి తగ్గి.. పెరిగిన కాయల ధరలు ● నూనె, కారం, ఇతర దినుసులదీ అదే పరిస్థితి మధిర: మాంసాహార ప్రియుల్లో సైతం కొందరు మామిడికాయ పచ్చడితోనే భోజనం ప్రారంభిస్తారు. ఇక శాకాహారులైతే తప్పక పచ్చడి ఉండాల్సిందే. వీరే కాక సన్న, చిన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు ఉదయాన్నే వెళ్లే వారు, కూరలు వండలేని వారికి ఈ పచ్చడే కడుపు నింపుతుంది. దీంతో ఏటా మాదిరి ఈసారి కూడా పచ్చడి పెట్టడానికి సిద్ధమవుతున్న ప్రజలకు ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆది నుంచి అవాంతరాలే... ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో మామిడి చెట్లకు పూత, పిందె సక్రమంగా రాలేదు. అంతేకాక వచ్చిన పూత కూడా చలికాలంలో మంచు కారణంగా తెగళ్లతో రాలిపోయింది. ఆపై అరకొరగా మిగిలిన పూత పిందగా మారగానే ఇటీవల అకాల వర్షాలకు మరో దెబ్బపడినట్లయింది. ఇలా రకరకాల కారణాలతో ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో సీజన్లో రోడ్ల వెంట, మార్కెట్లలో విరివిగా లభించే పచ్చడి మామిడికాయలు ఈసారి పెద్దగా అందుబాటులోకి రాలేదు. ప్రధానంగా పచ్చడి తయారీకి ఉపయోగించే చిన్న రసాలు, పెద్ద రసాలు, నాటు, జలాలు, తెల్ల గులాబీ వంటి రకాల కొరతతో డిమాండ్ నెలకొంది. ఏపీ నుంచి తీసుకొచ్చి... మార్కెట్లో చిన్న రసాలు రూ.30, తెల్ల గులాబీ, జలాలు వంటి రకాలు రూ.50 చొప్పు ధర పలుకుతున్నాయి. ఇక్కడ పెద్దగా దిగుబడి లేకపోవడంతో, జిల్లాకు సరిహద్దుగా ఉన్న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, ఏ కొండూరు, నూజివీడు తదితర మండలాల నుంచి వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. గతంలో ఒక్కో చిన్న రసం చెట్టుకు సుమారు వెయ్యి మామిడికాయలు కాసేవని.. ఈసారి తెగుళ్లు, అకాల వర్షాలతో ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక కొన్ని మామిడికాయలకు మంగు రావడంతో పచ్చడి తయారీకి పనికి రావని కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా మిగిలిన కాయలకు డిమాండ్తో పాటు ధర పెరుగుతోంది. అదే బాటలో దినుసులు ఏడాది పాటు మామిడి పచ్చడి నిల్వ ఉండాలంటే నాణ్యమైన కాయలు ఎంచుకోవడమే కాక మేలు రకం దినుసులు ఎంచుకుంటారు. అయితే, ఈసారి సామగ్రి ధరలు కూడా మండిపోతున్నాయి. దీంతో పచ్చడి పెట్టకముందే మంట పుడుతుందని సామాన్యులు వాపోతున్నారు. చట్నీ పెట్టేందుకు కావాల్సిన నూనె, కారం, ఉప్పు, ఎల్లిపాయలు, ఆవాలు, మెంతుల ధరలు పెరిగాయి. పలు రకాల మిర్చి ధర తక్కువగా ఉన్నా పచ్చడి పెట్టే లావు రకాల మిర్చి ఎక్కువగానే ఉంది. ఈ మిర్చి కేజీ రూ.300 నుంచి రూ.600 వరకు పలుకుతుండగా.. కారం పట్టించడానికి కేజీకి రూ.40 వెచ్చించాల్సి వస్తోంది. మహిళలు బిజీబిజీ.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బంధువులు, మిత్రులు ఒక చోటకు చేరి జాడీల కొద్ది పచ్చడి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇంకొందరు తమ బంధువులు, స్నేహితులు, ఇతర ప్రాంతాల్లో ఉండే పిల్ల లకు పంపించేందుకు మామిడికాయ పచ్చడి తయారుచేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా కారం మిల్లుల్లో రద్దీ ఉంటుండగా, పచ్చడి తయారీతో పలువురి ఇళ్లు కళకళలాడుతున్నాయి. పచ్చడి దినుసుల ధరలు సామగ్రి ధర (కేజీకి రూ.ల్లో) కారం 300 – 600 ఎల్లిపాయలు 200 శనగ నూనె 170 ఆవాలు 170 మెంతులు 180 నువ్వుల నూనె 410 అయినా తప్పడం లేదు.. ఏటా పచ్చడి పెట్టడం తప్పనిసరి. కూర చేయలేని రోజు, కూరగాయల ధరలు పెరిగినప్పుడు పచ్చడి తీసుకుని కూలీ పనులకు వెళ్తాం. ఈసారి పచ్చడికి ఉపయోగించే వస్తువుల ధరలు పెరిగినా తప్పడం లేదు. – కృష్ణవేణి, కూలీ, మధిర పిల్లలకు పంపించేందుకు... అమెరికా, హైదరాబాద్, ఖమ్మంలో ఉంటున్న పిల్లలకు ఏటా పచ్చడి పంపిస్తాం. కూరగాయలతో తినలేనప్పుడు పచ్చడి ఉయోగపడుతుంది. అందుకే ఏటా అందరికీ కలిపి మామిడికాయ పచ్చడి పెడతాం. – రమావత్ మారోనిబాయి, మధిర -
శ్రీచైతన్య ప్రభంజనం
సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రభంజనం సృష్టించారని శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఖమ్మం మమత రోడ్డులోని శ్రీచైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించగా వారిని అభినందించి మాట్లాడారు. కాసిన జస్వంత్ 500 మార్కులకు 489 మార్కులు, కవితాచౌదరి 485, యశస్విత 484, సూర్యతేజ 483, సంహితరెడ్డి 480 మార్కులు సాధించగా, వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏజీఎం చేతన్మాధూర్, కోఆర్డినేటర్ కృష్ణారావు, ప్రిన్సిపాళ్లు నాగప్రవీణ, టీ.ఎల్.ఎన్.శర్మ, సురేష్, డీన్ లక్ష్మీ నర్సింహ, ఇన్చార్జ్లు రాము, నరేష్ తదితరులు పాల్గొన్నారు.