జేఏసీ పోరుబాటలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

జేఏసీ పోరుబాటలో భాగస్వాములు కావాలి

May 24 2025 12:13 AM | Updated on May 24 2025 12:13 AM

జేఏసీ పోరుబాటలో భాగస్వాములు కావాలి

జేఏసీ పోరుబాటలో భాగస్వాములు కావాలి

మధిర/బోనకల్‌: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాల్లో ఉపాధ్యాయులంతా భాగస్వాములు కావాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు సూచించారు. మధిరలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని పరిశీలించడంతో పాటు బోనకల్‌ మండలం రావినూతల పాఠశాలలో శుక్రవారం జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కుల కోసం పోరాడుతూనే బడిబాటలో భాగంగా విద్యార్థుల సమోదు పెంచడానికి ఉపాధాయులు కృషి చేయాలని తెలిపారు. కాగా, పీఆర్‌సీ అమలు, పెండింగ్‌ డీఏల సాధన కోసం యూనియన్‌ తరఫున కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే, విద్యారంగ సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచేలా ఉండొద్దనేది తమ విధానమని తెలిపారు. కార్యక్రమాల్లో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.రంగారావు, జిల్లా మాజీ అధ్యక్షుడు మోత్కూరి మధుతో పాటు ఆర్‌.బ్రహ్మారెడ్డి, తుమాటి కృష్ణారెడ్డి, రత్నకుమార్‌, చంద్రశేఖర్‌, సీహెచ్‌వీ రవికుమార్‌, శ్రీనివాసరావు, మల్లెల శ్రీనివాస్‌, శ్యామలరావు, స్వామి, మద్దినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement