
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలి
తల్లాడ: వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కచ్చితంగా పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖా ధికారి సామినేని సత్యనారాయణ సూచించారు. తల్లాడలో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణను శుక్రవారం పరిశీలించిన ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైన విద్య, యూనిఫాం, మధ్యాహ భోజనం అమలవుతుండడమే కాక సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్న విషయాన్ని వివరిస్తూ విద్యార్థులను చేర్పించాలని తెలిపారు. ఎంఈఓ ఎన్.దామోదరప్రసాద్, ఎంఎన్ఓ పి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఏన్కూరులో..
ఏన్కూరు: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలబాలికల కోసం పాఠశాలలు తెరిచేనాటికి యూనిఫాం సిద్ధం చేయాలని డీఈఓ సామినేని సత్యనారాయణ సూచించారు. ఏన్కూరులో యూనిఫాం కుడుతున్న కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. అనంతరం ఏన్కూరు హరిజనవాడ, గంగులనాచారం, ఎస్టీ కాలనీ, నాచారం ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలకు యూనిఫాంలు అందజేశారు. ఎంఈఓ రహీమ్, కాంప్లెక్స్ హెచ్ఎం సైదయ్య తదితరులు పాల్గొన్నారు.