breaking news
NTR
-
రాష్ట్ర జట్టుకు ‘సిద్ధార్థ’ విద్యార్థినులు
పెనమలూరు: కానూరు సిద్ధార్థ అకాడమీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ విద్యార్థినులు రాష్ట్ర ట్రాంపోలిన్ మహిళా వ్యక్తిగత విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఫిజికల్ డైరెక్టర్ రఘు తెలిపారు. ఆయన సోమవారం వివరాలు తెలుపుతూ తమ కాలేజీకి చెందిన క్రీడాకారిణిలు ఎస్.ప్రగ్న, వి.నీలవేణి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారన్నారు. జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఉత్తరా ఖండ్లో జరిగేజాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా వైస్చాన్సలర్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్ క్రీడాకారులను అభినందించారు. -
విజయవాడ నుంచి కాదు.. ఇక కాకినాడ నుంచి!
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): అధిక లాభాలు తెచ్చే బస్సు సర్వీసును వేరే డిపోకు బదలాయింపు చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారులపై ప్రయాణికులతోపాటు సంస్థ కార్మికులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. 15 ఏళ్లుగా విజయవాడ ఆటోనగర్ డిపో నుంచి చైన్నెకు రోజూ రెండు సర్వీసులు నడుపుతున్నారు. ఈ బస్సులకు మంచి ఆదాయమే వస్తోంది. వారం క్రితం కాకినాడలో జరిగిన ఓ సమావేశంలో అక్కడి ప్రజలు చైన్నెకు బస్సు సర్వీసు నడపాలని రవాణాశాఖ మంత్రిని కోరారు. దీనికి ఆ మంత్రి స్పందించి కాకినాడ నుంచి చైన్నెకి బస్సులు నడపాలని ఆర్టీసీ ఆర్ఎంతో పాటు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఆటోనగర్ డిపో నుంచి నడుస్తున్న చైన్నె బస్సు సర్వీసును ఇక్కడి నుంచి కాకినాడకు బదిలీ చేశారు. ఇది సరికాదు: ఎన్ఎంయూ ఈ నిర్ణయాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నాయకులు విమర్శిస్తున్నారు. అవసరమైతే కాకినాడ – చైన్నెకు అదే డిపో నుంచి ఇంకొక సర్వీస్ను నడపాలని సూచించారు. ఎన్ఎంయూ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆర్ఎం దానంకు ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. రోజు ఉదయం 6.30 గంటలకు 3727 సర్వీసు నంబరు బస్సు, సాయంత్రం 7.30 గంటలకు 4060 సర్వీసు నంబరు బస్సు చైన్నెకి రాకపోకలు సాగిస్తున్నాయి. సాయంత్రం వెళ్లే బస్ను కాకినాడ డిపోకు బదిలీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు చైన్నె సమీపంలోని గుమ్మడిపూడి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. వారు ఈ బస్సు సర్వీసుల్లోనే తరచూ ప్రయాణిస్తుంటారు. తమకు సౌకర్యవంతంగా ఉన్న బస్సును కాకినాడకు బదిలీ చేయడంపై ఆ విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.15 ఏళ్ల చైన్నె బస్సు సర్వీసు కాకినాడ తరలింపుపై కలకలం -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
తిరువూరు: మండలంలోని వావిలాలలో కుటుంబ సమస్యల నేపథ్యంలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువూరు మండలం వావిలాల శివా రు రాజుగూడెంకు చెందిన చాట్ల వెంకటేష్(50)కి ఇద్దరు కుమార్తెలు కాగా చిన్న కుమార్తె విజయవాడలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. కుమార్తెకు తోడుగా వెంకటేష్ భార్య లక్ష్మి కూడా విజయవాడలో నివసిస్తోంది. ఆమెను రాజుగూడెం రావలసిందిగా పలుమార్లు ఒత్తిడి చేసినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై వెంకటేష్ పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరిన వెంకటేష్ను సోమవారం ఉదయం గమనించిన స్థానికులు తిరువూరు ప్రైవేటు నర్సింగ్హోంకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గవర్నర్పేట ఓల్డ్ కంట్రోల్ రూం వద్ద జరిగింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓల్డ్ కంట్రోల్ రూం వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె కర్నాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లా తులగిరికి చెందిన మహిళగా గుర్తించారు. ఆమె వయసు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉంటుంది. మృతురాలు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెంది ఉండొచ్చని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు గవర్నర్పేట స్టేషన్(0866 2576023)లో సంప్రదించాలని కోరారు. -
డ్రెయినేజీ కార్యాలయంపై ఏసీబీ దాడి
● గుడివాడలో రూ.30 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన జూనియర్ అసిస్టెంట్ గరికిపాటి శ్రీనివాసరావు ● కాంట్రాక్టర్కు డిపాజిట్ సొమ్ము రిలీజ్ చేసే విషయంలో లంచం డిమాండ్ గుడివాడరూరల్: కృష్ణా జిల్లా గుడివాడలో డ్రెయినేజీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. జూనియర్ అసిస్టెంట్, ఆడిటర్గా విధులు నిర్వహిస్తున్న గరికపాటి శ్రీనివాసరావు ఓ కాంట్రాక్టర్ను రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడులు నిర్వహించి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు మీడియాకు వెల్లడించారు. గుడివాడ డ్రెయినేజీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు కాంట్రాక్టర్ తురక రాజాను రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఆ కాంట్రాక్టర్ డ్రెయినేజీలో కొన్ని వర్కులు చేయగా వాటి బిల్లులు రూ.33 లక్షలు మంజూరయ్యాయి. దానికి సంబంధించి ఒక్క శాతం సొమ్మును కాంట్రాక్టర్ ఇవ్వలేదు. అయితే కాంట్రాక్టర్కు మరొక వర్క్కు సంబంధించి రెండు డిపాజిట్ల సొమ్ము రూ.1.7 లక్షలను రిలీజ్ చేయాల్సి ఉంది. దానికి రూ.30 వేల లంచం ఇవ్వాలని జూనియర్ అసిస్టెంట్ గరికపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ తురక రాజా ఏసీబీ అధికారులను ఆశ్రయించారన్నారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజా డ్రెయినేజీ కార్యాలయానికి వెళ్లి జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకు రూ.30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు జి.వి.వి.సత్యనారాయణ, ఎం.వి.ఎస్.నాగరాజు, ఎస్ఐ పూర్ణిమ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు 84 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన గ్రీవెన్స్కు 84 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 45మంది ఫిర్యాదు చేయగా, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 7, కొట్లాటకు సంబంధించి 2, వివిధ మోసాలపై 3, మహిళా సంబంధిత నేరా లపై 5, దొంగతనాలకు సంబంధించి 5, ఇతర చిన్న వివాదాలకు సంబంధించి 17 కలిపి మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. -
రాష్ట్రాభివృద్ధిలో ఆప్కాబ్ కీలకపాత్ర
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆప్కాబ్ రాష్ట్రంలోని సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సేవలందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఏపీ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) 62వ స్థాపన దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సహకార ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా స్థాపించిన ఈ బ్యాంకు ఇప్పుడు ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ దేశంలో పెద్ద స్థాయిలో కంప్యూటరైజేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన కొద్ది సహకార బ్యాంకుల్లో ఆప్కాబ్ ఒకటన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడుతి రాజశేఖర్, కమిషనర్ ఆఫ్ కో ఆపరేషన్ అండ్ సహకార సంఘాల రిజిస్ట్రార్ ఎ.బాబు, ఆప్కాబ్ పర్సన్ ఇన్చార్జి వీరాంజనేయులు మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద సహకార డిజిటలైజేషన్ ప్రాజెక్ట్ అయిన పీఏసీఎస్ కంప్యూటరైజేషన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంలో ఆప్కాబ్ ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యానికిదే ‘సాక్ష్యం’!
జగ్గయ్యపేట: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అంగన్ వాడీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన పథకం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు దృశ్య రూపంలో ఆటపాటలు, ఇంగ్లిష్, తెలుగు పదాల వంటి విద్యాపరమైన విషయాలు.. పౌష్టికాహార విలువలు, ఆరోగ్య సూత్రాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించటమే కాకుండా అంగన్వాడీ కార్యకర్తల శిక్షణతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహించటానికి కేంద్ర ప్రభుత్వం ‘సాక్ష్యం’ అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసింది. ఈ కేంద్రాలకు స్మార్ట్ టీవీలను పంపిణీ చేసింది. అయితే వాటిని కేంద్రాలలో అమర్చకపోవటంతో నిరుపయోగంగా పడి ఉంటున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు కనీసం స్పందించటం లేదు. అంగన్వాడీ కేంద్రాలకు స్మార్ట్ టీవీలను కేటాయించిన విషయం కనీసం కేంద్రాలకు వచ్చే చిన్నారుల తల్లిదండ్రులకు కూడా తెలియకపోవటం గమనార్హం. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ రూరల్, అర్బన్ ప్రాంతాలలో 1,475 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో సొంత భవనం కలిగి ఉండి ప్రహరీ, మరుగుదొడ్లు, కిచెన్ నర్సరీలతో పాటు పూర్తి స్థాయిలో చిన్నారులకు ఆట వస్తువులున్న కేంద్రాలకు ‘సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ 2.0’ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 440 కేంద్రాలను ఎంపిక చేసింది. ఇందులో జగ్గయ్యపేట 61, నందిగామ 121, తిరువూరు 85, మైలవరం 115, విజయవాడ రూరల్, అర్బన్ ప్రాంతాలలో 37 చొప్పున అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసి స్మార్ట్ టీవీలను పంపిణీ చేసింది. అయితే కేంద్రాలకు టీవీలు వచ్చి పక్షం రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ కేంద్రాలలో వాటిని అమర్చకపోవటంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఒక్కో టీవీ రూ.30వేలకు కొనుగోలు చేసి మరీ సరఫరా చేసింది. కొన్ని కేంద్రాలలో టీవీలను అమర్చినా నెట్ సౌకర్యం లేక వినియోగించడం లేదు. నెట్ సౌకర్యం లేదు.. కేంద్రాలకు టీవీలను మంజూరు చేసినప్పటికీ నెట్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రస్తుతం కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో విద్యుత్ సౌకర్యం లేకపోవటంతో పాటు కొన్ని కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండటంతో పాటు విద్యుత్ సరఫరాకు అనుమతిస్తారో లేదోనని అంగన్వాడీలు సంశయిస్తున్నారు. ఇదిలా ఉండగా అంగన్వాడీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం పలు సర్వేలను కేటాయించటంతో అదే పనిలో ఉంటున్నారని పిల్లలను సరిగా పట్టించుకోకపోవటంతో పిల్లలను పంపేందుకు కూడా ఆందోళన చెందాల్సి వస్తోందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించినా అందిపుచ్చుకోని రాష్ట్ర ప్రభుత్వం నిరుపయోగంగా అంగన్వాడీ కేంద్రాలలో స్మార్ట్ టీవీలు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 440 కేంద్రాలకు మంజూరు ఒక్క టీవీనీ కేంద్రాల్లో ఉపయోగించని వైనం పట్టించుకోని అధికారులు టీవీలను అమర్చుతాం.. అంగన్వాడీ కేంద్రాలకు మంజూరైన స్మార్ట్ టీవీలను వీలైనంత త్వరగానే అమర్చుతాం. కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో వసతులు లేకపోవటంతో టీవీల ఏర్పాటులో జాప్యం జరిగింది. కేంద్రాల మరమ్మతులకు కూడా నిధులు మంజూరయ్యాయి. వాటిని కూడా చేపడతాం. – రుక్సానా, పీడీ, మహిళా శిశు సంక్షేమ శాఖ -
సుబ్బారాయుడి సేవలో డెప్యూటీ స్పీకర్
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని శాసనసభ డెప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు సోమవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ డీసీ దాసరి శ్రీరామవరప్రసాదరావు పట్టువస్త్రాలతో పాటు స్వామివారి చిత్రపటం, లడ్డూప్రసాదం అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయన వెంట చల్లపల్లి సీఐ ఈశ్వరావు, స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. -
● హర్ఘర్ తిరంగా.. ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
దేశభక్తి ఉప్పొంగేలా.. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. హర్ ఘర్ తిరంగా 2025 సందర్భంగా ప్రచార పోస్టర్ను సోమవారం కలెక్టర్ లక్ష్మీశ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు పాఠశాల, అన్ని విద్యా సంస్థల్లో హర్ ఘర్ తిరంగా నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ భవనాలను అలంకరించడం విద్యార్థులకు తిరంగా రంగోలి, తిరంగా రాఖీ మేకింగ్ వర్క్ షాప్స్ , తిరంగా వేవ్స్ అండ్ థ్రెడ్స్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 9 నుంచి 12వ తేదీ వరకు తిరంగా మహోత్సవ్ పేరుతో ప్రజాప్రతినిధులు, వీఐపీలు పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఇందులో డ్వాక్రా మహిళలతో తిరంగా కలర్ థీంతో ప్రత్యేక తిరంగా మేళా నిర్వహిస్తామని తెలిపారు. హర్ ఘర్ తిరంగా సెల్ఫీ బూత్లను ఏర్పాటు చేసి, ఫొటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. తిరంగా బైక్ ర్యాలీలు, సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని భవనాలు, డ్యామ్లను అలంకరించి జెండా ఎగరవేయడానికి సిద్ధం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, యువజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, డీఎంఅండ్హెచ్ఓ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. -
రైతులను నట్టేట ముంచుతున్నారు
● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ● అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో కలిసి రైతు సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డుపై పోసే పరిస్థితులు కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో కలిసి దేవినేని అవినాష్ రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎన్టీఆర్ కలెక్టర్ జి.లక్ష్మీశను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జిల్లాలో ఏడాదిగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలు తట్టుకోలేక పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను కలెక్టర్కు వివరిస్తే, అవి ఆయనకే తెలియక పోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టించిందని, దళారుల నుంచి బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతుల కోసం ఎక్కడికై నా వెళ్లి పోరాడతామని కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ చెప్పిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూరియా ఎంత ఉపయోగమో వివరించాం పంటకు యూరియా ఎంత ఉపయోగమో కలెక్టర్కు వివరించామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ అమలు కావడంలేదని తెలియజేశామన్నారు. ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చెప్పామన్నారు. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తామని మాట తప్పారని, ఏ రైతూ ఆనందంగా లేరన్నారు. ఎంత సప్లై చేస్తున్నారు, ఎండ డిమాండ్ ఉందో తెలియజేయాలన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రతి రైతుకూ న్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలన్నారు. పాలకులు తీరు మార్చకోపోతే రైతుల తరఫున పోరాడతామని హెచ్చరించారు. రైతుల నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాలేదని కలెక్టర్ చెప్పటం దారుణమన్నారు. ఆయనతో కూడా ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందని తెలిపారు. యూరియా దళారుల ద్వారా వెళ్తోందని, దమ్ముంటే చర్యలు తీసుకోండన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అటవీ భూములు, అసైన్ట్ భూములు సాగు చేసిన వారికి కూడా రైతు భరోసా ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. రైతుల తరఫున పోరాడతాం మొవ్వ: రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే వారి తరఫున పోరాడేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. మొవ్వలో తహసీల్దార్ కార్యాలయానికి కై లే అనిల్ కుమార్, నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి వెళ్లి సోమవారం తహసీల్దార్ మస్తాన్కు వినతి పత్రాన్ని అందజేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఎరువుల కొరతను, ప్రైవేటు ఎరువుల దుకాణదారులు చేస్తున్న దోపిడీని తహసీల్దార్కు వివరించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత పెద్ద ఎత్తున ఉన్నా సీఎం, డీసీఎం, మంత్రి లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రిగాని నోరు మెదపక పోవడాన్ని కై లే అనిల్ కుమార్ ఖండించారు. ఎంపీపీ కొండేటి ఇందిర, జెడ్పీటీసీ రాజులపాటి పార్వతి, పార్టీ మండలాధ్యక్షులు రాజులపాటి రాఘవరావు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మంద శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని యాచకురాలు మృతి
ఇబ్రహీంపట్నం: గుర్తుతెలియని వాహనం ఢీకొని యాచకురాలు మృతి చెందిన ఘటన మండలంలోని జూపూడి గ్రామంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జూపూడి, కిలేశపురం గ్రామాల మధ్య యాచక వృత్తితో జీవిస్తున్న సుమారు 40ఏళ్ల వయస్సు గల యాచకురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొని కొద్దిదూరం ఈడ్చుకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో యాచకురాలి మృతదేహం గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతురాలు ఎరుపు రంగు జాకెట్, ఎరుపు రంగు లంగా, బ్లూ, పింక్ రంగు డిజైన్ చీర ధరించి ఉంది. జూపూడి గ్రామ వీఆర్వో గుడిశ వెంకట శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గంజాయి తాగుతున్న నలుగురు యువకుల అరెస్ట్ ఇబ్రహీంపట్నం: గంజాయి కలిగి ఉన్న నలుగురు యువకులను ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. తుమ్మలపాలెం బస్టాప్ వెనుక గల డొంక రోడ్డులో నలుగురు యువకులు గంజాయి తాగుతున్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద లభించిన 1,200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నలుగురిని విచారించిన అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విజయవాడ కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తూ బావిలో పడి యువకుడి మృతి నందిగామ రూరల్: ప్రమాదవశాత్తూ పొలం వద్దనున్న బావిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని అడవిరావులపాడు గ్రామానికి చెందిన తోట వెంకట నారాయణకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు తిరుపతిరావు(24) ఉన్నారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకునే తిరుపతిరావు వ్యవసాయ పనుల నిమిత్తం సోమవారం గ్రామంలోని తమ పొలంలోని బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ దానిలో పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి హుటాహుటిన నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సామాన్యులకు దూరం
ఆర్జితం..సిఫారసులు ఉంటేనే ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవాభాగ్యం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ఆర్జితసేవాభాగ్యం సామాన్య భక్తులకు దూరమవుతోంది. రికమండేషన్లు ఉంటే చాలు ఆర్జిత సేవలు దరిచేరుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనంతో పాటు సేవల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తామని చెబుతున్న ఆలయ అధికారులు, కార్యాచరణలో కానరావడం లేదు. కొన్ని నెలలుగా ఆర్జిత సేవ టికెట్ల విక్రయాలపై ఈవో పేషీ అజమాయిషీ పెరిగిపోవడంతో టికెట్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈవో చాంబర్ లేదా ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసులు వస్తేనే తప్ప ఆర్జిత సేవా టికెట్లు పొందలేని పరిస్థితి ఎదురవుతోంది. నాడు ఎంతమందికై నా.. నేడు పరిమితం గతంలో ఎంతమంది వచ్చినా ఇచ్చిన ఆర్జిత సేవల టికెట్లను ఇప్పుడు పరిమితం చేశారు. రానున్న దసరా ఉత్సవాల్లో సైతం అమ్మవారికి నిర్వహించే విశేష కుంకుమార్చనను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నిర్వహించి, భక్తుల ఇళ్ల నుంచే సెల్ఫోన్, కంప్యూటర్ల ద్వారా వీక్షించేందుకు యత్నించారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తాయనే భావనతో దేవస్థానంతో పాటు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. ఖడ్గమాల టికెట్లు కావాలంటే ఈవో పేషీనే! దుర్గమ్మ ఆర్జిత సేవల్లో తెల్లవారుజామున జరిగే ఖడ్గమాలార్చనకు అధిక డిమాండ్ ఉంది. గతంలో ఈ సేవకు పరిమిత సంఖ్యలో టికెట్లను మాత్రమే అనుమతించేవారు. టికెట్ ఖరీదు రూ. 5 వేలు ఉన్నా, డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ఒక్కో రోజు 30కి పైగా టికెట్లు జారీ చేసి రెండు షిప్టుల్లో ఈ పూజ నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్లో పది టికెట్లు, ఆర్జిత సేవా కౌంటర్లో మరో పది టిక్కెట్లు విక్రయిస్తారు. ఇక మిగిలిన పది టికెట్లు ఈవో పేషీకే. ఈ పదితో పాటు మరి కొన్ని అదనంగా కావాలన్నా అక్కడి నుంచే సిఫారసు చేయించుకోవాలి. అయితే 30 టికెట్లు విక్రయిస్తున్నా సామాన్య భక్తుడు ఆన్లైన్లో కానీ, దేవస్థాన ఆర్జిత సేవా కేంద్రంలోగానీ టికెట్ పొందాలంటే సాధ్యం కాదు. దాదాపు నెల రోజుల ముందుగా టికెటు కొనుగోలు చేయాలన్నా అందుబాటులో ఉండవు. ప్రముఖుల నుంచి ఫోన్ చేయిస్తేనే టికెట్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారుల నుంచి ఫోన్ చేయించేవారు నిమిషాల్లోనే టికెట్ పొందడం విశేషం. దీనికి కేంద్రబిందువుగా ఈవో పేషీ ఉందని దుర్గగుడిలో ప్రచారం జరుగుతోంది. నెల రోజుల ముందు దొరకని టికెట్ ఈవో పేషీలో అడిగితే సేవ కోరిన ముందు రోజు రాత్రికి అందిస్తున్నారు. దుర్గగుడి అధికారుల తీరును ప్రశ్నించే భక్తులకు సీఎం పేషీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల మీద నెపాన్ని నెట్టేస్తున్నారు. సామాన్యులు అడిగితే.. నో భక్తుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు టికెట్లు విక్రయించి అందరికీ క్యూలైన్లో నిల్చునే అవకాశం ఉండేది. కొన్ని రోజులుగా ఆర్జిత సేవ టికెట్లకు కోత విధించారు. నిత్యం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత దేవస్థాన ఆర్జిత సేవా కౌంటర్తో పాటు సమాచార కేంద్రంలో టికెట్లను విక్రయిస్తారు. టికెట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో ప్రముఖులు, పోలీసు, ప్రజా ప్రతినిధులు సిఫారసులు ఉన్నవారు ముందుగానే ఈ టికెట్లను తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు వచ్చి అడిగితే ‘నో టికెట్స్’ అంటున్నారు. అదే ఆలయ ముఖ్య అధికారుల నుంచి ఫోన్ వస్తే పంచహారతుల టికెట్లు లేకున్నా రూ. 500 ఆశీర్వచన టికెట్ ఇచ్చి సేవలోకి అనుమతించడం విశేషం. విశేష పర్వదినాల్లో చండీహోమానికి పరిమితులు అమావాస్య, పౌర్ణమితో పాటు ఇతర విశేష పర్వదినాల్లో చండీహోమం టికెట్లకు ఆలయ అధికారులు పరిమితులు విధించారు. నిత్యం వంద చండీహోమానికి టికెట్లను విక్రయిస్తుండగా, పండుగలు, పర్వదినాల్లోనే దాదాపు ఇదే సంఖ్యలో టికెట్లను విక్రయిస్తున్నారు. ఆలయ కౌంటర్లో 60 టికెట్లు, ఆన్లైన్లో మరో 40 టికెట్లు విక్రయాలు జరుగుతున్నాయి. అమావాస్య, పౌర్ణమి, ఇతర పర్వదినాలలో టికెట్లు దొరికితే చాలు అనుకునే భక్తులు పదుల సంఖ్యలో ఉంటారు. యాగశాల బయట అరుగులపై కూర్చుని కూడా ఈ సేవలో గోత్రనామాలు చెబితే చాలనుకుంటారు. ఇప్పుడు అధికారుల తీరుతో కనీసం సేవ చేయించుకునే భాగ్యం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్, కౌంటర్లలో అరకొరగా టికెట్లు ఖడ్గమాలార్చన టికెట్లు పేషీ నుంచే...! పంచహారతుల టికెట్లకుతప్పని రికమండేషన్లు విశేష పర్వదినాల్లో చండీహోమానికి ఇదే తీరు పంచహారతుల టికెట్లలో కోత ఇక దుర్గమ్మకు నిర్వహించే నిత్య ఆర్జిత సేవల్లో పంచహారతుల సేవ మరొకటి. నిత్యం సాయం సమయంలో ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతులు, వేద స్వస్తి జరుగుతుంది. రూ. 500 టికెటు కొనుగోలు చేసిన భక్తులు సుమారు అరగంట క్యూలైన్లో నిల్చుని అమ్మవారి ముగ్ధమనోహరమైన రూపాన్ని తనివి తీరా వీక్షించే భాగ్యం కలుగుతుంది. దీంతో పంచహారతుల్లో పాల్గొనేందుకు భక్తులతో పాటు ప్రముఖులు నిత్యం ఇంద్రకీలాద్రికి తరలివస్తారు. ఇటీవల ఆలయ ఈవో ఈ పంచహారతుల టికెట్లను 20కే పరిమితం చేశారు. ఆలయ ప్రాంగణంలోని ఆర్జిత సేవా కౌంటర్లో పది, సమాచార కేంద్రంలో మరో పది టికెట్లు విక్రయిస్తారు. గతంలో ఈ పద్ధతి ఉండేది కాదు. అదిగో.. ఇదిగో.. దాతలు రూ. 5 కోట్లు వెచ్చించి రాతితో నూతన యాగశాల నిర్మాణం చేపట్టినా అందులో మిగిలి ఉన్న పనులను చేయించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. చైత్రమాసం నుంచి యాగశాలలో చండీహోమం నిర్వహణ అదిగో... ఇదిగో అంటూ వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సైతం ఆలయ ఇంజినీ రింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు మార్లు నూతన యాగశాలలో హోమాలు జరిపిస్తామని చెబుతున్న దేవస్థాన అధికారులు భక్తుల మనోభావాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. -
‘అమ్మా.. నాన్నా.. బతకాలని లేదు’
ఉయ్యూరు(పెనమలూరు): వరకట్న వేధింపులకు నవవధువు బలైంది. భర్త, అత్తమామల హింస, వేధింపులు తాళలేక తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఉయ్యూరు పట్టణ పోలీసుల కథనం మేరకు.. ఉయ్యూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో నివాసం ఉంటున్న జూనియర్ కళాశాల లెక్చరర్ వర్రె శ్రీ విద్య(24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివాహం అయినప్పటి నుంచీ.. మొవ్వ మండలం కొండవరానికి చెందిన శ్రీ విద్యకు కంకిపాడు మండలం కుందేరు గ్రామానికి చెందిన అరుణ్కుమార్తో ఐదునెలల క్రితం వివాహం జరిగింది. అరుణ్కుమార్ కలవపాముల సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్నారు. వీరు ఉయ్యూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. శ్రీ విద్య ఉయ్యూరు పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తోంది. వివాహం అయిన నాటి నుంచి కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. కట్నం తీసుకురమ్మంటూ, అందంగా లేవంటూ తన మాజీ ప్రియురాలి మాదిరిగా లేవంటూ అరుణ్కుమార్ హింసించటం మొదలుపెట్టాడు. భర్తతో పాటు అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. మరో మారు గొడవ.. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. అరుణ్కుమార్ హింసించటం, కొట్టడం చేయటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీవిద్య ఇంట్లో గొడవ జరుగుతున్న విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసి, ఉయ్యూరులోని సమీప బంధువును ఆ ఇంటికి పంపించారు. శ్రీవిద్య విగతజీవిగా కనిపించింది. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ రామారావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీవిద్య భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అల్లుడే చంపాడు.. శ్రీ విద్య ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు తమ అల్లుడు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ రోధించారు. ఈ మేరకు పోలీసులకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులకు శ్రీవిద్య బలైనట్లు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామారావు తెలిపారు. తమ్ముడూ.. రాఖీ కట్టలేనేమోరా!శ్రీవిద్య సూసైడ్ నోట్ కలకలం సృష్టిస్తోంది. భర్త, అత్తమామలు సాధించిన తీరును ఆ లేఖ తేటతెల్లం చేసింది. ‘అమ్మా.. నాన్నా.. నాకింక బతకాలని లేదు. తాగి వచ్చి.. నా భర్త చిత్రహింసలు పెడుతున్నాడు. తన ప్రియురాలిలా అందంగా లేనంటూ హింసిస్తూ, కొడుతున్నాడు. భరించలేకపోతున్నాను. మీరంటే ఇష్టం. తమ్ముడూ.. నీకు రాఖీ కట్టలేకపోవచ్చేమో? అమ్మా, నాన్నను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ శ్రీవిద్య రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో పనిచేసే సహచరులు, కుటుంబ సభ్యులు ఆ లేఖను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వరకట్న వేధింపులకు నవ వధువు బలి -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 20257సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటి మట్టం సోమవారం 586.50 అడుగులకు చేరింది. ఇది 302.9125 టీఎం సీలకు సమానం. నెమలిలో పవిత్రోత్సవాలు తిరువూరు: నెమలి శ్రీవేణుగోపాలస్వామి దేవ స్థానంలో సోమవారం స్వామివారి పవిత్రోత్సవాలను ప్రారంభించారు. వేణు గోపాలుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తికేయుడికి విరాళం మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరుడి నిత్యాన్నదానానికి పెనమలూరు మండలం పోరంకికి చెందిన దేవకీ నందనప్రసాద్, శివకుమారి దంపతులు సోమ వారం రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చారు. -
నిర్ణీత గడువులో అర్జీలకు పరిష్కారం
● కలెక్టర్ లక్ష్మీశ ● పీజీఆర్ఎస్కు 147 అర్జీలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలనుంచి అందే అర్జీలకు నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలుత పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదయ్యే అర్జీలు పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. అధికారులు ప్రతి రోజూ పీజీఆర్ఎస్ పోర్టల్ లాగిన్ అయి వారి శాఖ అర్జీలను పరిశీలించాలని, రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. అర్జీలను అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు అర్జీదారులతో మర్యాదగా మాట్లాడాలని, సవివరమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని, గడువు లోపలే అర్జీలకు పారదర్శకమైన సమాధానాలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. -
తల్లిపాల విశిష్టతను చాటి చెప్పండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పుట్టిన నాటి నుంచి తల్లి పాలు ఇవ్వడం బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని, చనుబాలకు మించిన ఔషధం మరొకటి లేదనే విషయాన్ని ప్రజలకు తెలిసేలా వారోత్సవాలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పుట్టిన నాటి నుంచే బిడ్డకు తల్లి చనుబాలును తప్పక అందించాలన్నారు. తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానమని, రోగనిరోధక శక్తి అధికంగా ఉండే తల్లి పాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమన్నారు. తల్లిపాలపై అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పాలు ఇవ్వడం వల్ల మహిళలలో సౌందర్యం తగ్గుతుందనే అపోహను తొలగించాలన్నారు. తల్లిపాలలో ఉండే పోషకాలు తల్లి బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ డీఆర్ఓ ఎం.లక్ష్మి నరసింహం, జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి ఎస్కే రుక్సానా, డీఎం అండ్హెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి రూ.2లక్షల విరాళం జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని పాలేటి తీరాన వేంచేసియున్న శివపంచాయతన క్షేత్రం మఠం శివాలయం పునర్ నిర్మాణానికి (సంపూర్ణ కృష్ణ శిలలతో) భక్తులు ఉదారంగా విరాళాలు ఇస్తున్నారు. సోమవారం భక్తులు జవ్వాజి ఆదిలక్ష్మి(బ్రహ్మానందం), వారి కుటుంబ సభ్యులు సంయుక్తంగా రూ. 2.116లక్షల విరాళాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. కారు ఢీకొనడంతో క్వారీ కార్మికుడు మృతి కంచికచర్ల: పొట్టకూటి కోసం రాతి క్వారీలో పనిచేసేందుకు వచ్చిన ఓ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఎస్ఐ పి. విశ్వనాథ్ కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా అలమంద కోడూరు మండలం పొడుగుపాడు గ్రామానికి చెందిన గొర్లి సన్నిబాబు(45) రాతి క్వారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. దొనబండ సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సన్నిబాబు మృతదేహాన్ని శవ పంచనామ కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా దోనేపూడి శంకర్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎన్టీఆర్ జిల్లా జిల్లా కార్యదర్శిగా వరుసగా రెండోసారి దోనేపూడి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 1, 2వ తేదీల్లో జగ్గయ్యపేటలో సీపీఐ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ జరిగింది. సోమవారం హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మహాసభ తీర్మానాలు దోనేపూడి శంకర్ మీడి యాకు వెల్లడించారు. ఈ మహాసభలో జిల్లా కార్యవర్గ సభ్యులుగా బుడ్డి రమేష్, జి.కోటేశ్వరరావు, తూము క్రిష్ణయ్య, చుండూరు వెంకట సుబ్బారావు, లంక దుర్గారావు, జూనేబోయిన శ్రీనివాసరావు, పరుచూరి రాజేంద్రబాబు, వై.యలమందరావు, బుట్టి రాయప్ప, చిలు కూరి వెంకటేశ్వరరావు, పంచదార్ల దుర్గాంబ, షేక్ నాగుల్ మీరా, ఎ.శివాజీ, నక్క వీరభద్రరావు, లంకా గోవిందరాజులు, మేకల డేవిడ్ ఎన్నికయ్యారు. శంకర్ మాట్లాడుతూ మహాసభ 10 తీర్మానాలను ఆమోదించిందన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ బుడమేరు తక్షణమే చేపట్టాలని, కట్టలేరుపై వంతెన నిర్మించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. -
రూ. 11 కోట్ల నగదు స్వాధీనం కేసు.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
విజయవాడ: సిట్ జప్తు చేసిన రూ. 11 కోట్లు అంశానికి సంబంధించి నేడు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాచవరం ఎస్బీఐలో ఆ నగదును ఎప్పుడు డిపాజిట్ చేశారో తేదీ, సమయం తెలిపాలని కోర్టు ఆదేశించింది. నగదు జమ రశీదులకు సంబంధించి వీడియో, ఫోటో క్లిప్పింగ్స్ అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి చర్యల కోసం బ్యాంకుకు ఈ నగదు పంపించేముందు తీసిన ఫోటోలు లేదా పంచనామాలు కోర్టుకు ఇవ్వాలని పేర్కొంది. కాగా, రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: బేతాళ కుట్రలో మరో అంకం -
లిక్కర్ కేసు.. వెంకటేష్ నాయుడు పచ్చదొంగే!
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో సీహెచ్ వెంకటేష్ నాయుడి గురించి ఎల్లో మీడియా, ఆ పార్టీల అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు జరుపుతున్న ప్రచారం గురించి తెలిసిందే. అయితే అది విషప్రచారమని, అతను టీడీపీ మనిషేనన్న విషయం ఇప్పుడు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా లిక్కర్ డ్రామా బెడిసి కొడుతూనే ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో ఆ కేసు నిందితుడు(A-34) వెంకటేష్ నాయుడికి సాన్నిహిత్యం ఉందన్న విషయం బట్టబయలైంది. చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు బావమరిది బాలకృష్ణతోనూ వెంకటేష్ నాయుడు సన్నిహితంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఆదివారం నుంచి.. ఈ కేసులో కీలక నిందితుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు గడిపిన విలాసవంత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు మరికొన్ని విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్తున్న ఫొటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. అదే సమయంలో వెంకటేశ్కు వైఎస్సార్సీపీ నేతలతోనూ సంబంధాలు అంటగట్టేందుకు ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా ఏపీలో లిక్కర్ కుంభకోణం డ్రామాను ఎంత రసవత్తరంగా సాగదీస్తున్నాయో తెలిసిందే. సిట్ ఏర్పాటు మొదలు.. నోట్ల కట్టలు వీడియో సృష్టించి వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లుతోంది చూస్తున్నదే. అయితే వెంకటేష్ నాయుడు పచ్చదొంగే అని నిరూపించే సాక్ష్యాలు బయటకు రావడంతో.. ఎల్లో మీడియా అడ్డంగా బుక్కైనట్లు స్పష్టం అవుతోంది.టీడీపీ నాయకులతోనే సంబంధాలువెంకటేశ్ నాయుడికి తొలి నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధం ఉంది. గతంలో పలుమార్లు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లతో కలిసి వెంకటేష్ ఫొటోలు దిగాడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతోనూ దగ్గరి సంబంధాలు నడిపించినట్లు తెలుస్తోంది. -
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో దందాల పర్వం
అంతా తానే అవుతూ.. ఫేక్ లెటర్ల వెనుకా ఇతనే! సాక్షి ప్రతినిధి, విజయవాడ: లాబీయింగ్లో లాలూచీ పర్వాల్లో మచిలీపట్నం పార్లమెంట్ ముఖ్యనేతది అందెవేసిన చెయ్యి! అయితే ఆయనకు రైట్ హ్యాండ్గా చెప్పుకొనే ఓ అనుచరుడు దందాల్లో ఆ ముఖ్యనేతనే మించిపోయారు. చిల్లర దొంగతనాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాల నుంచి, రేషన్ బియ్యం అక్రమ రవాణా వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దందాల్లో ఘనాపాటి వ్యవహార శైలిని చూసి టీడీపీ, జనసేన శ్రేణులే ‘శివ.. శివా..’ అంటూ నివ్వెరపోతున్నాయి. గ్యాంగ్తో సెటిల్మెంట్లు.. రౌడీలు, గంజాయి బ్యాచ్, మర్డర్ కేసుల్లో ముద్దాయిలు, నేరప్రవృత్తి గల వారితో నియోజకవర్గాల్లో ప్రత్యేక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని, సెటిల్మెంట్లు చేయడంలో సిద్ధహస్తుడిగా ఆ అనుచరుడికి పేరుంది. దొంగతనం కేసుల్లో పట్టుబడిన వారిని పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. ఆ కేసుల నుంచి తప్పించడం, ఫేక్ లెటర్లతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కరెంటు బిల్లు చెల్లించేందుకు అష్ట కష్టాలు పడిన ఇతను.. ఇప్పుడు అపర కుబేరుడిగా మారటం వెనుక అన్ని రకాల దందాలు ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న తాజా సంఘటనల్లోనూ ఇతని పేరు తెరపైకి వచ్చింది. తనకు కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు అందరితో సాన్నిహిత్యం ఉందని, తన మాటకు తిరుగే లేదని.. తాను ఎంత చెబితే, పార్లమెంటు మఖ్యనేత అంతే అంటాడని ప్రచారం చేసుకొంటూ, బరితెగించి దోపిడీకి పాల్పడుతున్నట్లు పార్టీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. మైనర్ల దొంగతనాల కేసులోనూ.. ఇటీవల మైనర్ల దొంగతనాల కేసులో సైతం ఓ జనసేన నాయకుడిని పట్టు పట్టి కేసు నుంచి తప్పించినట్లు బందరులో జోరుగా చర్చ సాగుతోంది. చల్లపలిల్లో ఆక్రమించుకొన్న భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, రికార్డులు సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. పార్లమెంటు పరిధిలో భూ వివాదాల్లో తలదూర్చడం, ప్రైవేటు సైన్యంతో భయోత్పాతం సృష్టించి సెటిల్మెంట్లు చేస్తూ, రూ. కోట్లు కాజేస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం మాఫియాలో ప్రధాన భూమిక.. ధాన్యం సేకరణలో రైతుల పేర్లతో ధాన్యాన్ని సేకరించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, వాటి స్థానంలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద ప్రభుత్వానికి ఇచ్చి కోట్ల రూపాయలు దండుకొన్నారు. ఈ మాఫియాలో మిల్లర్లను సిండికేట్ చేయడం, అధికారులను ఇబ్బందులు లేకుండా చూడటంలో ముఖ్యనేత అనుచరుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులకు ముడుపులు ఇవ్వడం కోసం మిల్లర్ల నుంచి వసూలు చేసిన మొత్తంలోనూ సగం కాజేస్తున్నారని సమాచారం. మిల్లర్లను రెండు వర్గాలుగా చీల్చి, ఆ రెండు వర్గాలను తన చెప్పు చేతల్లో పెట్టుకొని, ధాన్యం సేకరణలో భారీ ఎత్తున కొల్లగొడుతున్నట్లు వినికిడి. తనకు ఉన్న ట్రాక్టర్ల కంపెనీ నుంచి రైతుల పేరుతో రైస్మిల్లుల వారికి అక్రమంగా బిల్లులు క్రియేట్ చేసి ఇచ్చి దండుకొంటున్నట్లు సమాచారం. ఓ ధాన్యం వ్యాపారిపై ఇతను కత్తులతో దాడి చేయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గుడివాడ రైల్వే ఫ్లై ఓవర్ కాంట్రాక్టర్ వద్ద కోటికిపైగా లంచం తీసుకొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నంలో కేడీసీసీ బ్యాంకులో తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. పార్లమెంటు ముఖ్యనేత స్థాయిలో తన జన్మదిన వేడుకలు భారీ ఎత్తున చేయాలని గంజాయి బ్యాచ్, రౌడీలతో కూడిన ప్రైవేటు సైన్యానికి హుకుం జారీ చేయడంతో గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, ఉయ్యూరు, పెనమలూరు ఇలా జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్లెక్సీలతో హంగామా చేశారు. దీనిని చూసిన ఆ పార్లమెంట్ ముఖ్యనేత సైతం నివ్వెరపోయి, ‘ఏంటిరా నాకు పోటీ వచ్చేటట్టున్నావే’ అంటూ చురకలు వేసినట్లు జనసేన వర్గాలు చర్చించుకొంటున్నాయి. గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డల్లో ప్రత్యేక అనుచరగణం రౌడీలు, గంజాయి, నేర ప్రవృత్తి గల వారితో ముఠా ఏర్పాటు ఇటీవల ఫేక్ లెటర్లతో ఉద్యోగాల వెనుక అతడే ఉన్నట్లు అనుమానం రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు అంతా తాను చెప్పినట్లే వింటారని బిల్డప్ ధాన్యం సేకరణలో మిల్లర్లతో కలిసి అడ్డదారులుఇటీవల కృష్ణా జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరుద్యోగ యువత నుంచి, కోటి రూపాయలు వసూలు చేశారు. సంతకాలను ఫోర్జరీ చేసి, సిఫారసు లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ముఖ్యనేత అనుచరుడే చక్రం తిప్పినట్లు మోసపోయిన నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక లెటర్లో సంతకం ఫోర్జరీ చేయడానికి అవకాశం ఉంటుందని, 60మందికి పైగా లెటర్లలో ఫోర్జరీ చేయడం సాధ్యం కాదని, దీనిని బట్టి చూస్తే, ఆ ముఖ్య నేతకు కూడా దీనిలో సంబంధం ఉన్నట్లు నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. దీనికితోడు ముఖ్యనేత కార్యాలయంలో పని నుంచి తొలగించామని చెబుతున్న వ్యక్తిని పార్లమెంటు ముఖ్యనేత అనుచరుడు విజయవాడలోని తన వ్యాపార సముదాయాల్లో పనిలో ఉంచుకోవడంపైన ఈ దందాలో అనుచరుడి పాత్ర ఉందనే అనే దానికి బలం చేకూర్చుతోంది. ఆ ముఠాలో మొవ్వ మండలం మువ్వపాలెంకు చెందిన పార్లమెంటు ముఖ్యనేతకు తలలో నాలుకగా మెలిగిన ‘కాకా’లాంటి జనసేన నాయకుడు ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వా లని 8 మంది నిరుద్యోగులు ఇటీవల విజయవాడలోని ఆయన ఇంటి చుట్టుముట్టడం సంచలనం రేపింది. ఆ డబ్బుల్లో కూడా ముఖ్యనేత అనుచరుడికి వాటా ఉన్నట్లు చెబుతున్నారు. -
అందని నీళ్లు.. ఆగని కన్నీళ్లు
● కోడూరు మండలం పిట్టల్లంకలో వాటర్ ట్యాంకు నుంచి భావిశెట్టివారిపాలెం వరకూ వెళ్లే పంటబోదుని రూ.25వేలు చందాలు వేసుకుని రైతులు ఇటీవలే పూడిక తీయించుకున్నారు. అయినా ఈ బోదుకు నీరక్కెడం లేదు. ఈ పంటబోదు కింద పోసిన నారుమళ్లను బతికించుకునేందుకు ఇక్కడి రైతులు గుల్లపంపు, ఇంజిన్లతో ప్రతిరోజూ నీరు తోడుకుంటున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతుంటే పంటకాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరు వదలకుండా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదికి నీరు వదలడం పట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. అవనిగడ్డ: కృష్ణాజిల్లాలో ఈ ఖరీఫ్లో 1.62 లక్షల హెక్టార్లలో వరిసాగు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 92వేల హెక్టార్లలో వరినాట్లు పూర్తి అయినట్టు అధికారులు చెబుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో చాలాచోట్ల సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోడూరు మండలం పిట్టల్లంక, సాలెంపాలెం, నారేపాలెం, వేణుగోపాలపురం, నాగాయలంక మండలంలో బర్రంకుల, నాలి, గణపేశ్వరం, పర్రచివర, సొర్లగొంది. దీనదయాల్పురం, దిండి, గుల్లలమోద, ఏటిమొగలో నారుమళ్లకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటకాలువకు సరఫరా అవుతున్న అరకొర నీటిని గుల్లపంపు, ఆయిల్ ఇంజిన్ల ద్వారా నారుమళ్లను తడుపుకుంటున్నారు. మండే ఎండల వల్ల ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఆకుమడికి నీరు తోడాల్సి వస్తోందని రైతులు చెప్పారు. నారుమడి దగ్గర నుంచి దమ్ము చేసే వరకూ ఆయిల్ ఇంజిన్కు ఎకరాకు రూ.5వేల వరకూ ఖర్చులు అవుతున్నాయని కొంతమంది రైతులు తెలిపారు. ఎండిపోతున్న వరిదుబ్బులు.. కృత్తివెన్ను మండలం చినపాండ్రాక, నీలిమూడి, మునిపెడ, యండపల్లి, చెరుకుమిల్లి గ్రామాల్లో రైతులు తీవ్ర స్థాయిలో సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. నీలిపూడి, మునిపెడ, చినపాండ్రాకలో సాగునీరందక పలుచోట్ల నాట్లు వేయలేదు. నారుమళ్లు ముదిరిపోతున్నాయని, ఇంకో వారం పదిరోజులు సాగునీరందకపోతే నాట్లు వేసేందుకు నారు పనికిరాదని కొంత మంది రైతులు చెప్పారు. మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం, గోకవరం, మంగినపూడి, మొవ్వ మండలంలోని వేములమడ, కొండ వరంలో సాగునీరు అందక నాట్లు వేసిన వరిదుబ్బులు ఎండిపోతున్నాయి. కోడూరు మండలం పిట్టల్లంకలో నారుమడికి గుల్లపంపుతో నీరు తోడుతున్న రైతు బంటుమిల్లిలో రైతుల ధర్నా.. బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్లో సీపీఎం రైతు సంఘం, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు చెందిన రైతులు సాగునీటి కోసం శనివారం ధర్నా చేశారు. బంటుమిల్లి ప్రధాన పంటకాలువతో పాటు అనుబంధ కాలువలకు పదిరోజుల నుంచి సక్రమంగా సాగునీరు అందడం లేదని రైతులు చెప్పారు. కృష్ణానదికి వందలాది క్యూసెక్కులు సాగునీరు వృథాగా వదులుతున్నారని, పంటకాలువలకు పూర్తిస్థాయిలో ఎందుకు వదలడం లేదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణాజిల్లాలో చాలా ప్రాంతాలకు అందని సాగునీరు బంటుమిల్లిలో నీటి కోసం రైతుల ఆందోళన దివిసీమలో గుల్లపంపు, ఇంజిన్లతో నారుమళ్లకు నీటి తడులు కృత్తివెన్ను మండలంలో పలుచోట్ల ఎండుతున్న వరి మూడు రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి 3.18లక్షల క్యూసెక్కులు సముద్రం పాలు కాలువలకు నీరివ్వకుండా సముద్రంలోకి వదలడంపై రైతుల ఆందోళన వృథాగా సాగరంలోకి.. పంటకాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేని అధికారులు, కృష్ణా నది నీటిని వృథాగా సముద్రంలోకి వదలడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల పంటకాలువలకు పూర్తిస్థాయిలో పూడిక తీత పనులు చేయలేదు. దీంతో 20 నుంచి 30 శాతం తక్కువ సాగునీరు సరఫరా అవుతోందని రైతులు చెప్పారు. ప్రకాశం బ్యారేజీ నుంచి మూడు రోజులుగా 3.10లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో పంటకాలువలకు సాగునీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ రామస్వామి అన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్లో పెన్షనర్లతో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెన్షనర్ల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయటం లేదన్నారు. పెండింగ్ డీఏలతో పాటు పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి న్యాయం చేయాలన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు సకాలంలో చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వీవీ సుబ్బారావు, పెన్షనర్ల సంఘం నాయకులు ఏవీఎస్ ప్రసాద్, బి శంకర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. బులియన్ మర్చంట్స్ అధ్యక్షుడిగా కోనా శ్రీహరి వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కోనా శ్రీహరి సత్యనారాయణ ఎన్నికయ్యారు. అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం ఆ సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా 15 మందితో కూడిన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత సమావేశంలో వివిధ కారణాలతో మరణించిన సభ్యులకు సమావేశం నివాళులర్పించింది. అధ్యక్షుడిగా కోనా శ్రీహరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా పిన్నెంటి రామారావు, ప్రధాన కార్యదర్శిగా కేఎస్ఆర్ నాయుడు, కోశాధికారిగా రామానాథం కృష్ణబాబు, సహాయ కార్యదర్శిగా మిరియాల డూండేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా మండే పూడి ఆనందకుమార్, కిషోర్గెల్డా, ఎస్కే ఠాగూర్, వై. చలంబాబు, మహంతి సూర్యనారాయణ, ఎస్. అనీల్కుమార్, కె. ఉమాశంకర్, సీహెచ్ శ్రీనివాసరావు, వి. కేశవరావు, పి. సాంబశివరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడు జవ్వాది సూర్యనారాయణ (రుద్రయ్య) నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. హెచ్ఎంల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్ ఉయ్యూరు: కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నూతన అధ్యక్షుడిగా తాడంకి జెడ్పీ పాఠశాల హెచ్ఎం వైఎస్ఎన్ ప్రసాద్ ఎన్నికయ్యారు. ఉయ్యూరు జెడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల సంఘం కౌన్సిల్, జిల్లా కార్యవర్గ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆమోదించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కె.జగదీశ్వర్రావు, అధ్యక్షుడిగా వైఎస్ఎన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కొమ్మా విజయ్, కోశాధికారిగా కేబీఎన్ శర్మ, మహిళా కార్యదర్శులుగా కె.అనిత, ఎం. సుమలత, మునిసిపల్ ప్రతినిధిగా శోభారాణి, ఎయిడెడ్ స్కూల్స్ ప్రతినిధిగా సూర్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్లుగా డేవిడ్ రత్నరాజు, మోమిన్, సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. మచిలీపట్నం డివిజన్ అధ్యక్షుడిగా ఏవీ రమణ, ఉయ్యూరు డివిజన్ అధ్యక్షుడిగా టీవీ నాగేశ్వరరావు, గుడివాడ డివిజన్ అధ్యక్షుడిగా వి. సురేష్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి.వెంకటేశ్వరరావు, హెడ్క్లస్టర్ కార్యదర్శిగా ఎన్వీ శ్రీథర్ ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఎన్వీ రమణ, ఈఎల్సీ కేశవరావు వ్యవహరించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకుల సందడి కృష్ణమ్మ ఉరకలు పెడుతుండటంతో పర్యాటకులు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరద తగ్గుముఖం పట్టడంతో ఘాట్ల వద్ద కూర్చొని సేదదీరారు. కొండలమ్మకు వెండి కిరీటం గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మవారికి కాకినాడకు చెందిన పిల్లి శ్రీనివాసులు, సంధ్య, విహిత ఆదివారం రూ.1.40లక్షల విలువ గల వెండి కిరీటాన్ని సమర్పించారు. 7 -
ఎముకల పటుత్వం తగ్గుతోంది..
లబ్బీపేట(విజయవాడతూర్పు): మానవుల్లో ఎముకల పటుత్వం తగ్గుతోంది. ఎముకల గూడే మనిషి నిర్మాణంగా రూపుదిద్దుకుంటుంది. వడివడిగా అడుగులు పడాలన్నా, చకచకా పనులు సాగాలన్నా ఎముకలే కీలకం. మారుతున్న జీవన విధానం, ఆహార అలవాట్లు ఎముకల పటుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. ఎముకలు గుల్లబారడం, కీళ్లు అరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఆగస్టు 4 జాతీయ బోన్ అండ్ జాయింట్ డే సందర్భంగా ఎముకలు పటిష్టగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.. చిన్న దెబ్బకే ఎముకల ఫ్యాక్చర్ ఎముకల పటుత్వం తగ్గిన వారికి చిన్న దెబ్బకే బోన్స్ ఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాదు మోకీళ్లు, తుంటెకీళ్లు అరుగుతున్న వారు సైతం ఎక్కువగా ఉంటున్నారు. అందుకు ఎముకలు గుల్లబారడం, విటమిన్ డి లోపంతో పాటు, ఆర్థరైటిస్ కూడా కారణంగా చెబుతున్నారు. ఇవే నిదర్శనం ● పటమటకు చెందిన రమణయ్యకు 55 ఏళ్లు. ఒకరోజు ఇంటి గుమ్మం దాటుతూ ముందుకు పడ్డాడు. తుంటెకీలు విరగడంతో ఆస్పత్రిలో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఎముకలు పటుత్వం కోల్పోవడమే కారణంగా తేల్చారు. ● 42 ఏళ్ల భారతికి ఏడాదిగా మోకీలు వద్ద నొప్పి వస్తోంది. ఆస్పత్రికి వెళ్లగా, ఎముకల్లో అరుగుదల ప్రారంభమైందని వైద్యులు తేల్చారు. ఇప్పుడు ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయి. శారీరక శ్రమ లేకే.. ఒకప్పుడు మహిళలు పిండి రుబ్బడం, దుస్తులు ఉతకడం, బావినీళ్లు చేదడం వంటి ఇంటి పనులతో మహిళలకు వ్యాయామం లభించేది. ఇప్పుడా పరిస్థితి లేదు. మగ వారిలో సైతం వ్యా యామం ఉండటం లేదు. శరీరానికి సూర్యకిరణాలు తగలకపోవడం వంటి కారణాలతో ఎముకల్లో సాంధ్రత తగ్గిపోతుంది. చిన్నవయస్సు వారిలో పటుత్వం ఉండటం లేదు. పటుత్వం తగ్గడానికి కారణాలివే ● ఆహారంలో తగు పాళ్లలో కాల్షియం, విటమిన్ డి. ప్రొటీన్లు లోపించడం ● నిశ్చల జీవనశైలి (శారీరక శ్రమ లేక పోవడం), మద్యపానం, ధూమపానం ● అధికంగా కాఫీ, శీతలపానీయాలు తాగడం ● అధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడటం ● మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ లోపమే కారణం ఏమి చేయాలి ● ఎముకల నిర్మాణంలో కాల్షియం చాలా కీలకం. సాధారణ వ్యక్తులకు 650 మి.గ్రాల కాల్షియం అవసరం. దీనికి పాలు, మజ్జిగ, చీజ్ తగినంత తీసుకోవడం మంచిది. ● మనం తీసుకున్న ఆహారం వంటబట్టడానికి విటమిన్ డి అవసరం. అందుకు ప్రతి రోజూ కాస్త ఎండలో ఉండటం మంచిది. ● అన్నిటి కంటే ముఖ్యమైనది వ్యాయామం. నిశ్చల జీవనశైలిలో ఎముక కండరం మోతాదు చాలా వేగంగా తగ్గిపోతుంది. వ్యాయామం, శారీరక శ్రమతో కాపాడుకోవచ్చు. ● తగినంత ప్రొటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. గరిష్టంగా మన శరీర బరువులో కేజీకి ఒక గ్రాము ప్రొటీన్ తీసుకోవాలి. మన దేశంలో 0.5 గ్రాము ప్రొటీన్ మాత్రమే తీసుకుంటున్నారు. కాల్షియం, విటమిన్ డి లోపం వల్లే చాప కింద నీరులా ఆస్టియో ఫ్లోరోసిస్ మధ్య వయస్సులోనే కీళ్లు అరుగుతున్న వైనం రోగుల్లో మహిళలే ఎక్కువ నేడు జాతీయ బోన్ అండ్ జాయింట్ డే ఆరోగ్య వంతమైన జీవనశైలి అవసరం ఆరోగ్యవంతమైన జీవనశైలితోనే ఎముకలను పటిష్టంగా ఉంచుకోవచ్చు. కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు, పెరుగు, చేపలు, రాగులు, పండ్లు ఆహారంగా తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. ధూమ, మద్యపానం, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. మా వద్దకు చిన్న వయస్సులోనే కీళ్ల అరుగుదల ఉన్న వారు వస్తున్నారు. అలాంటి వారికి అత్యాధునిక విధానాలతో కీళ్ల మార్పిడి చేస్తున్నారు. రోబోటిక్ కీళ్ల మార్పిడిని అందుబాటులోకి తెచ్చాం. –డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు -
గల్లంతైన యువకుడు శవమై కనిపించాడు
ఇబ్రహీంపట్నం: పవిత్ర సంగమం వద్ద సరదాగా ఈత కొడదామని శనివారం కృష్ణానదిలో దిగి గల్లంతైన కలకంటి నవీన్(17) ఆదివారం అదే ప్రాంతంలో శవమై పోలీసులకు కనిపించాడు. కనిపించకుండా పోయిన ప్రాంతంలో ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టకుండా ఇతర ప్రాంతంలో గాలించడం విమ ర్శలకు తావిచ్చింది. కనిపించకుండా పోయిన ప్రాంతంలోనే వెంటనే వెదికితే కుమారుడు బతికేవాడని అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. యువకుడి గాలింపులో ఎస్డీఆర్ఎఫ్, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదం జి.కొండూరు: టిప్పర్.. కారుని ఢీకొట్టిన ఘటనలో త్రుటిలో ప్రమాదం తప్పింది. కారులో ఉన్న తండ్రి, కుమార్తెకు ఎటువంటి గాయాలు కాలేదు. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చర్చి పాస్టర్ విక్టర్బాబు ఆయన కూతురు రవి శిరీషని విజయవాడలో పరీక్ష రాయించేందుకు ఆదివారం ఉదయం తన కారులో బయలుదేరారు. ఈ క్రమంలో జి.కొండూరు మండల పరిఽ ది కట్టుబడిపాలెం వద్దకు రాగానే ఉదయం 8గంటల సమయంలో 30వ నంబరు జాతీయ రహదారిపై వెనక నుంచి వస్తున్న టిప్పర్.. కారుని క్రాస్ చేయబోయి ఢీకొట్టింది. ఘటనలో కారు పల్టీలు కొట్టుకుంటూ రహదారి డివైడర్పై ఉన్న ఇనుప రెయిలింగ్లో ఇరుక్కుపోయింది. ఘటనలో కారు ధ్వంసమైనా లోపల ఉన్న విక్టర్బాబు, రవి శిరీషకి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో పరీక్షకు హాజరయ్యేందుకు వెంటనే వేరే కారులో వారిద్దరూ విజయవాడ వెళ్లిపోయారు. రెండు బైక్లు ఢీ.. వ్యక్తి మృతి పెనమలూరు: కానూరు వద్ద రెండు బైక్లు ఢీ కొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బి.అబ్దుల్బారీ(43) పటమట మోడరన్ సూపర్మార్కెట్లో పని చేస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూపర్ మార్కెట్లో పని తర్వాత అబ్దుల్బారీ రాపిడో బైక్ నడుపుతుంటాడు. శనివారం అర్ధరాత్రి అతను బైక్పై వెళుతూ కానూరు అశోక్నగర్ వద్దకు రాగా కామయ్యతోపు వైపు నుంచి వచ్చిన బైక్ అతనిని ఢీ కొట్టింది. ఘటనలో అబ్దుల్బారీ తలకు బలమైన గాయమైంది. అతనిని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర చికిత్స కోసం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఎండీ జక్రియ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు ‘మండలి’ జయంతి అవనిగడ్డ: మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు(ఎంవీకేఆర్) శత జయంతి ఉత్సవాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాలుగుచోట్ల సోమవారం నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సమితి ఆధ్వర్యంలో విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, అవనిగడ్డలో ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జరుగుతాయని తెలిపారు. -
మాటల్లో కోటలు.. చేతల్లో కోతలు
కంకిపాడు: అన్నదాతల విషయంలో పాలకుల మాటలు కోటలు దాటితే.. చేతల్లో మాత్రం కోతలే అన్న విమర్శలు వస్తున్నాయి. అన్నదాత సుఖీభవ అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు క్షేమాన్ని విస్మరించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ రైతులందరికీ రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని నాడు కూటమి నేతలు గొప్పలు చెప్పారు. కానీ రూ.20 వేలు సొమ్ములో కేంద్రం వాటా రూ.6 వేలతో పాటుగా మొత్తం మూడు విడతలుగా ఇస్తామంటూ కూటమి మాట మార్చేసింది. పథకంలో అర్హుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గించడంతో దుఃఖమే మిగిలిందంటూ అన్న దాతలు వాపోతున్నారు. తగ్గిన అర్హుల సంఖ్య కూటమి ప్రభుత్వం రైతులను ఆది నుంచీ విస్మరిస్తూనే ఉంది. రైతులకు పెట్టుబడి సాయం విషయంలో మాట మార్చిన కూటమి పాలకులు ఇప్పుడు పథకానికి అర్హులైన రైతుల సంఖ్యలోనూ కోత విధించింది. కృష్ణా జిల్లాలో1.74 లక్షల హెక్టార్లలో సాగుకు అనువైన భూమి ఉంది. సుమారు 1.86 లక్షలు మందికి పైగా రైతులు ఉన్నారు. వివిధ కారణాలతో 1,484 మందికి సంబంధించిన ఈకేవైసీ తిరస్కరించారు. 2,300 మందికి పైగా రైతులు పెండింగ్లో ఉన్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్నుదారులు, ఇతరత్రా వారిని మినహాయించి జిల్లాలో 1,34,488 మంది రైతులు ఉన్నారని, 1,30,626 మందిని అర్హులుగా తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.66.93 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.22.73 కోట్లు వెరసి రూ.89.66 కోట్లు తొలివిడత రైతుల ఖాతాకు చేరాయి. అయితే ఆదాయ పన్ను చెల్లింపులు, ఇతరత్రా కారణాలను సాకుగా చూపి వడపోత ప్రక్రియ ద్వారా అర్హుల సంఖ్య భారీగా తగ్గించడం గమనార్హం. తొలి ఏడాది ఎగనామం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. జిల్లాలో రైతులు ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి వరదలు, అకాల వర్షాలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. పరిహారం విషయంలోనూ కోతలు విధించడంలో బాధిత రైతులకు పూర్తి న్యాయం జరగలేదు. ఆఖరికి ఎన్నికల్లో ఇచ్చిన మాటకు అనుగుణంగా అన్నదాత సుఖీభవను అమలుచేయలేదు. తొలి ఏడాదిలోనే జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం చూసినా సుఖీభవ సొమ్ము రూ.300 కోట్లు మేర రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఒకే విడతలో సాయం అందుతుందని రైతులు భావించారు. మూడు విడతలు అంటూ మాట మార్చడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీనికి తోడు చాలా మంది రైతులకు పీఎం కిసాన్ రూ.2 వేలు మాత్రమే జమైందిగానీ, రాష్ట్రం వాటా సొమ్ము రూ.5 వేలు జమకాకపోవటంతో ఇదెక్కడి సుఖీభవ అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యం రైతు సంక్షేమానికి ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే రైతు సంక్షేమంప్రచారంపై ఉన్న శ్రద్ధరైతులపై లేదు కూటమి ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ఒకటి, ఇప్పుడు చేస్తోంది మరొకటి. ఒకే పర్యాయం డబ్బులు విడుదల చేసినట్లయితే పెట్టుబడులకు ఉపయోగపడేది. విడతల వారీగా విడుదల చేయడంతో ప్రయోజనం ఏముంటుంది?. –జంపాన శ్రీనివాసగౌడ్, రైతు, గురజాడ కౌలురైతులకు మొండిచెయ్యి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలు మంది సంఖ్య తగ్గింది. ఆదాయ పన్ను చెల్లింపు, ఇంకేదో కారణాలతో అర్హుల సంఖ్య కుదించారు. కౌలు రైతులకు మొండిచెయ్యి చూపారు. ఎన్నికల హామీ మేరకు సాగుదారులందరికీ వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించాలి. కష్టపడి వ్యవసాయం చేస్తున్నందుకు ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉంది. అక్టోబరులో కౌలురైతులకు ఇవ్వడంతో ఉపయోగం ఏంటి?, కౌలురైతులు అప్పులు చేసి, వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది. కౌలురైతులకు ఒకేసారి రూ.20 వేలు ఇవ్వాలి. –మాగంటి హరిబాబు, ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నదాతకు దుఃఖం రైతు సంక్షేమంలో కూటమి విఫలం పేరుకేమో రూ.20వేలు పెట్టుబడి సాయం మూడు విడతలుగా సొమ్ము అందజేతకు ప్రణాళిక అర్హులైన రైతుల సంఖ్య కుదింపు వైఎస్సార్ సీపీ హయాంలో అన్నదాతకు భరోసా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి బాటలు పడ్డాయి. ఇచ్చినమాటకు అనుగుణంగా రైతులకు రైతు భరోసా సొమ్ము జమ చేసి అన్నదాతలకు అండగా నిలిచింది. జిల్లాలో 2019–20లో 1,31,595 మందికి రూ.108.09 కోట్లు, 2020–21లో 1,44,280 మందికి రూ.110.82 కోట్లు, 2021–22లో 1,50,099 మందికి రూ.115.00 కోట్లు, 2022–23లో 1,52,112 మందికి రూ.118.74 కోట్లు, 2023–24 సంవత్సరానికి అత్యధికంగా 1,56,827 మందికి రూ.122.55 కోట్లు రైతుభరోసా అందించి రైతుపక్షపాత ప్రభుత్వం అని నిరూపించింది. కౌలు రైతులకు కూడా ‘భరోసా’ ఇచ్చింది. -
కమ్యూనిటీ హాల్స్ పోలీసులకా..!
●క్యాన్సిల్ చేశాం.. ప్రత్యామ్నాయం చూసుకోండి అంటున్న అధికారులు ●విజయవాడ 17వ డివిజన్లో హాల్స్ బుక్ చేసుకున్న వారి ఆవేదన కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రజల సౌకర్యార్థం నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ను ప్రజావసరాలకు కాకుండా ఇతర కార్యక్రమాలకు వినియోగించడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల ముందు శుభకార్యాల కోసం బుక్ చేసుకుంటే ఇంకా మూడు రోజులే ఉండగా క్యాన్సిల్ చేస్తున్నాం ప్రత్యామ్నాయం చూసుకోండని చెప్పడంతో ఏమి చేయాలో అర్థంకాక ఆవేదన చెందుతున్నారు. రాణిగారితోట 17వ డివిజన్లోని సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఈ నెల 7,9,13 తేదీల్లో శుభకార్యాలు చేసుకునేందుకు స్థానికులు నెల క్రితమే నగదు చెల్లించి బుక్ చేసుకున్నారు. అయితే శనివారం అధికారులు వచ్చి ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇతర జిల్లాల నుంచి వస్తున్న పోలీస్ సిబ్బందికి షెల్టర్ కోసం కమ్యూనిటీ హాల్లను కేటాయించాలని కమిషనర్ ఆదేశించారని బుక్ చేసుకున్నవారు చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని ఆదివారం ఉదయం ఆయా కమ్యూనిటీ హాళ్లకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని తరలించి తమను ఇబ్బంది పెట్టొదని వారు కోరుతున్నారు. -
ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రూపాలలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. స్వచ్ఛ విజయవాడ సాధనలో భాగంగా ఆదివారం సాయంత్రం భవానీపురంలోని హరిత బెరంపార్క్లో సంప్రదాయ నృత్య పోటీలను ఆయన మునిసిపల్ కమిషనర్ ధ్యాన చంద్రతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నగరంలోని ఔత్సాహిక నృత్య కళాకారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయన్నారు. పర్యావరణ పరిరక్షణపై తరచూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజల్లో అవగాహన ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వివిధ కళారూపాల ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా వరుసగా ఐదు ఆదివారాల నృత్య పోటీలు ఇక్కడ జరుగుతాయని తెలిపారు. చివరి ఆదివారం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, మారిటైం బోర్డ్ సీఈఓ ప్రవీణ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ బెరంపార్క్లో నృత్య ప్రదర్శన పోటీలు ప్రారంభం -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. శ్రావణ మాస శుభ ముహూర్తాల వేళ ఒక్కటైన నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించే విశేష కుంకుమార్చనలోనూ ఉభయదాతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మహానివేదన అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో క్యూలైన్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. క్యూలైన్లలో కూలర్లు ఉన్నా వాటికి కేవలం ఫ్యాన్లుగానే వినియోగించడంతో ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. చంటి పిల్లలతో ఉన్న వారు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులకు గురయ్యారు. -
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సమాజ బాధ్యతగా మిగిలిందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు ఎం.డి. షౌకత్ హుస్సేన్ అధ్యక్షత నిర్వహించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృష్ణా జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తొలుత పి.రాందేవ్ జాతీయ పతాకాన్ని, ఎస్.పార్వతీశం ఎస్టీఎఫ్ఐ పతాకాన్ని, ఎం. ఆరోగ్య స్వామి యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు సమగ్ర శిక్ష పథకాన్ని సమర్థంగా అమలు చేసి బలమైన విద్యావ్యవస్థ నిర్మించాయని, కానీ ఆంధ్రలో మాత్రం చిన్న సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో నడుస్తున్న పాఠశాలలు పెరిగాయన్నారు. సమగ్ర శిక్ష పేరుతో విద్యాశాఖకు సమాంతరంగా వ్యవస్థను ఏర్పాటుచేసిన కూటమి ప్రభుత్వ విధానాలు పాఠశాల విద్యను నిర్వీర్యం చేశాయన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రభుత్వం బకాయి ఉన్న రూ.22 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, 12వ వేతన సంఘాన్ని నియమించాలని, డీఏలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ యాప్లను రద్దు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం కొత్తగా 14 అంశాలతో కూడిన యాప్లు తీసుకువచ్చారన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు కె.ఎ. ఉమామహేశ్వరరావు, ఎస్.పి. మనోహర్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి. కనకారావు, కోశాధికారి ఎమ్. వరప్రసాద్, కార్యదర్శి టి. సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు మహిళా కూలీ మృతి
●ఇద్దరికి తీవ్ర గాయాలు ●కోడూరు నరసింహపురంలో వరినాట్లు వేస్తుండగా ఘటన కోడూరు: పిడుగుపాటుకు ఓ మహిళా కూలీ పొలంలో మృతి చెందారు. మరో ఇద్దరు మహిళా కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన కోడూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని ఇరాలి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు రోజు మాదిరిగానే ఆటోలో వివిధ ప్రాంతాలకు వ్యవసాయ పనుల కోసం వెళ్లారు. వీరితో కొంతమంది మండల పరిధిలో నరసింహపురం గ్రామ సమీపంలోని పొలాల్లో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. కూలీలు వరినాట్లు వేస్తుండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అప్పుడు నరసింహపురం సమీపంలో కూలీలు వరినాట్లు వేస్తున్న ప్రాంతంలో భారీ శబ్దంతో పిడుగు పడింది. పిడుగుపాటుకు వరినాట్లు వేస్తున్న మహిళా కూలీ గంజాల కొండలమ్మ (30) పొ లంలోనే కుప్పకూలింది. కొండలమ్మ పక్కన ఉన్న మరో ఇద్దరు కూలీలు గంజాల జ్యోతి, గంజాల పార్వతి కూడా పడిపోయారు. మృతి చెందిన కొండలమ్మ.. పిడుగుపాటుకు గురైన ముగ్గురు మహిళా కూలీలను స్థానికులు హుటాహుటినా అవనిగడ్డలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే కొండలమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జ్యోతి, పార్వతిలకు తీవ్ర గాయాలు కావడంతో వీరికి చికిత్స చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామాలో విషాదఛాయలు అలము కున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కృత్తివెన్ను: కృత్తివెన్ను ప్రధాన సెంటర్లో 216 జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. సంగమూడి గ్రామానికి చెందిన కూనసాని వీరనారాయణస్వామి (55) ఆదివారం చర్చ్లో ప్రార్థనకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి ఇంటికి సైకిల్పై వస్తుండగా కృత్తివెన్ను ప్రధాన సెంటర్లో వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. ఘటనలో నారాయణస్వామి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కమృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం బందరు తరలించారు. మరో ఘటనలో తిరువూరు: చీమలపాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం చెందాడు. కృష్ణారావుపాలెం శివారు కేశ్యా తండాకు చెందిన బాణావత్ సంధ్యా నాయక్ కుమారుడు యశ్వంత్(6)తో ద్విచక్రవాహనంపై చీమలపాడు వచ్చారు. అక్కడ తినుబండారాలు తీసుకువచ్చే నిమిత్తం రోడ్డు దాటుతున్న యశ్వంత్ను తిరువూరు నుంచి విజయవాడ వెళ్లే కారు ఢీకొంది. తలకు బలమైన గాయం కాగా బాలుణ్ణి మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సంధ్యానాయక్కు ముగ్గురు కుమార్తెల తర్వాత జన్మించిన యశ్వంత్ మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎ.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూటమి పాలనలో రైతుకు భరోసా ఉండదు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతుల జీవితాలకు భరోసా ఉండదని సీఎం చంద్రబాబు రుజువు చేశారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులపై పగబట్టిందని విమర్శించారు. శనివారం జరిగిన దర్శి పర్యటనలో భాగంగా కూటమి అధికారంలో ఉంటే రైతులకు భరోసా ఉండదని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించడమే నిదర్శనమన్నారు. రైతుభరోసా కింద రైతులకు ఇవ్వాల్సిన లబ్ధిని కూటమి నేతలే దిగమింగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క రైతుకు రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన 7 లక్షల మంది రైతులకు కోట్లాది రూపాయలు నిలిపివేశారని పేర్కొన్నారు. రైతులకు యూరియా, కాంప్లెక్స్ ఎరువులను సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని వ్యవసాయ సంక్షోభంలోకి నెట్టే దిశగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల సంక్షేమానికి గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రైతుల కోసం మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సంస్కరణలు అమలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. రైతులకు చేయూతనందించేందుకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. -
కాకినాడ రీజియన్లో డీఆర్ఎం ప్రత్యేక తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా ఆదివారం కాకినాడ రీజియన్లో భద్రత, సరుకు రవాణా సామర్థ్యం, సిబ్బంది సంక్షేమంపై సమగ్ర తనిఖీలు చేశారు. కాకినాడ స్టేషన్, కాకినాడ పోర్టు, కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్లను సందర్శించి సరుకు రవాణా నిర్వహణ, భద్రత, సిబ్బంది మౌలిక సదుపాయాలపై తనిఖీలు నిర్వహించారు. ముందుగా కాకినాడ టౌన్లో జరుగుతున్న ఐఓహెచ్ (ఇంటర్మీడియెట్ ఓవర్హాల్) షేడ్ పనులపై అధికారులతో సమీక్షించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం కోచ్ సర్వీసింగ్ కార్యకలాపాను పరిశీలించారు. అనంతరం రన్నింగ్ రూమ్ను పరిశీలించారు. సిబ్బంది సంక్షేమానికి డివిజన్ అత్యంత ప్రాధాన్యమిస్తోందని, రన్నింగ్ రూమ్లో పరిశుభ్రత, పోషకాహారం, డిజిటల్ లాగ్బుక్ వ్యవస్థలను మరింత మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. అక్కడ నుంచి కాకినాడ పోర్టు చేరుకుని గూడ్స్ సైడింగ్, ప్రైవేటు టెర్మినల్స్లలో సరుకు రవాణా నిర్వహణ కార్యకలాపాలపై అక్కడి అధికారులతో మాట్లాడారు. కాకినాడ పోర్టు డివిజన్ నెట్వర్కులో కీలకమైన సరుకు రవాణా కేంద్రం అని, కేఎస్పీఎస్ సమన్వయంతో యార్డ్ లేఅవుట్, షంటింగ్ నమూనాలు, వేగవంతమైన వ్యాగన్ల నిర్వహణపై సమీక్షించి అధికారులు పలు మార్గదర్శకాలు చేశారు. విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక ఆధారిత పద్ధతులను అవలంభిస్తూ సురక్షిత రైళ్ల నిర్వహణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల్లో ఆపరేటింగ్, మెకానికల్, కమర్షియల్, భధ్రత విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
వృద్ధురాలిని బెదిరించి బంగారు గొలుసు అపహరణ
గన్నవరం: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తులతో బెదిరించి సుమారు మూడు కాసుల విలువైన బంగారు గొలుసును దొంగ అపహరించుకుపోయిన ఘటన ఉంగుటూరు మండలం వెన్నుతలలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. గ్రామంలోని ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఇంటిలో బొమ్మి సింహాచలంతో పాటు ఆమె కుమారుడు, కోడలు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు, కోడలు బంధువుల ఊరెళ్లగా శనివారం రాత్రి ఇంటి వెనుక గదిలో ఆమె నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంటి తలుపులు గట్టిగా కొట్టిన అలికిడి విని ఆమె భయపడుతూ తలుపులు తీసింది. అయితే ఎవరూ కనిపించకపోవడంతో తలుపులు తీసి ఉంచి మంచంపై కూర్చుంది. కొద్దిసేపటికి ముఖానికి మాస్కు ధరించి వచ్చిన దొంగ చేతిలోని రెండు కత్తులతో బెదిరించి ఆమె మెడలోని మూడు కాసుల విలువైన బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. జరిగిన విషయాన్ని కుమారుడు, కోడలికి ఫోన్లో తెలియజేయడంతో ఉదయం ఊరు నుంచి తిరిగివచ్చి ఉంగుటూరు పోలీసులను ఆశ్రయించారు. సీఐ బీవీ శివప్రసాద్, ఎస్ఐ యు. గోవిందు ఘటన స్థలాన్ని పరిశీలించి వృద్ధురాలి నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ను రంగంలోకి దింపి నిందితుడి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. బీరువా పగలకొట్టిన దొంగ అందులోని నగదు, ఇతర వస్తువులను మాత్రం అపహరించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోవిందు తెలిపారు. వీఎఫ్సీ ఫుడ్స్ షాపులో అగ్ని ప్రమాదం జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని జేఆర్సీ కాలేజీ రోడ్లోని వీఎఫ్సీ ఫుడ్స్ దుకాణంలో శనివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో నాన్వెజ్, వెజ్ ఆహార పదార్థాలు తయారుచేస్తుంటారు. విద్యుత్ పరికరాలతో వేడి చేసి వినియోగదారులకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, గ్రైండర్లు, తదితర ఎలక్ట్రికల్ పరికరాలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. విద్యుత్ సిబ్బంది కరెంట్ సరఫరాను నిలిపివేసి ప్రమాద నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. ఫైర్ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను సకాలంలో బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. -
‘ప్రపంచంలో ఎక్కడైనా రైల్వేస్టేషన్ 1500 ఎకరాల్లో ఉందా?’
విజయవాడ: చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఒక రకంగా ఉంటాడు.. అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోతాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అసలు చంద్రబాబుకి ఆర్టీసీ స్థలం లూలుకి ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చిందని ప్రశ్నించారాయన. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 3వ తేదీ) విజయవాడ నుంచి మాట్లాడిన రామకృష్ణ.. ‘వందల కోట్ల ఆర్టీసీ భూమి 99 ఏళ్లు లీజుకివ్వడమేంటి?, విశాఖలోనూ వందల కోట్ల భూమి లూలుకి కట్టబెట్టారు. విదేశాల్లో మూతబడిన లూలుకి ఇక్కడ ప్రభుత్వ భూములివ్వడం దేనికి?, కనీసం చర్చ కూడా లేకుండా చంద్రబాబు, నారాయణ లూలుకు ఆర్టీసి భూములిచ్చేశారు. గన్నవరంలో విమానాశ్రయం ఉంటే మళ్లీ అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పెట్టాల్సిన అవసరం ఏముంది?, విమానాశ్రయాలు కడితే సరిపోదు...విమానాలు నడవాలి కదా. అమరావతిలో 1500 ఎకరాల్లో రైల్వేస్టేషన్ పెడతాననడం హాస్యాస్పదం. ప్రపంచంలో ఎక్కడైనా రైల్వేస్టేషన్ 1500 ఎకరాల్లో ఉందా? అని ప్రశ్నించారు రామకృష్ణ. -
కాంట్రాక్టర్ల పాలిట కామధేనువు ఘాట్ రోడ్డు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి చేరుకునే ఘాట్రోడ్డు కాంట్రాక్టర్ల పాలిట కామధేనువుగా మారిందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. గడిచిన మూడేళ్లుగా దుర్గగుడి ఘాట్రోడ్డులో రాక్ బోల్టింగ్, మెస్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు మూడేళ్లుగా జరుగుతున్న పనులు ఇంకా కొలిక్కి రాలేదు. మూడేళ్లలో కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నా, చిన్నపాటి వర్షం వస్తే చాలు ఘాట్రోడ్డు మూసివేయడంపై భక్తులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2019కి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఘాట్రోడ్డులో రాక్ బోల్టింగ్ పనులు చేపట్టారు. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో దసరా ఉత్సవాలలో కొండ రాళ్లు విరిగి పడటంతో ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు రూ.70 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ఘాట్రోడ్డులో కొండ రాళ్లు విరిగినా నేరుగా రోడ్డుపైకి రాకుండా రాక్వాల్, ఓం టర్నింగ్ నుంచి రెండో మలుపు వరకు ఐరన్ మెస్ పనులు చేపట్టారు. అయితే గత ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి మళ్లీ ఐరన్ మెస్ పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు రూ.20 కోట్లు పైబడే ఘాట్రోడ్డు అభివృద్ధికి దేవస్థానం నిధులు ఖర్చు చేసింది. అయితే భక్తులు దేవస్థాన అభివృద్ధికి ఇచ్చిన విరాళాలు, కానుకల నుంచి చేపట్టిన పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా చిన్నపాటి వర్షం కురిస్తే వెంటనే ఘాట్రోడ్డును మూసివేయడం పరిపాటిగా మారింది. గత వారం నాలుగు రోజుల పాటు వర్షం కురవడంతో ఆ నాలుగు రోజులు ఘాట్రోడ్డును మూసివేశారు. కనీసం భక్తులను సైతం నడిచేందుకు వీలు లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. మరి ఇన్ని కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు నిరుపయోగమేనా అని భక్తులు ఆలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు. తరచూ విరిగి పడుతున్న కొండరాళ్లు దేవస్థానం కొండ రాళ్లు విరిగి పడకుండా ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. గత ఏడాది దసరా ఉత్సవాలకు ముందు సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు ఘాట్రోడ్డులోని డోనర్ సెల్ వద్ద భారీ కొండ రాయి, మట్టి జారిపడటంతో డోనర్ సెల్ దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అప్పటికే కొద్ది నెలల కిందట ఆ ప్రాంతంలో ఐరన్ మెస్ పనులు జరిగాయి. ప్రమాదం జరిగిన తర్వాత మళ్లీ ఐరన్ మెస్ను ఏర్పాటు చేయించింది. ఇప్పడు అదే ప్రాంతానికి కూతవేటు దూరంలో మళ్లీ కొండ చరియలు విరిగి పడటం గమనార్హం. రూ.కోట్లతో చేసిన పనులు నిరుపయోగమేనా? వర్షం వస్తే చాలు మూత వేయాల్సిందేనా? విరిగిపడుతున్న కొండచరియలను నియంత్రించలేరా? అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు -
ఎస్బీఐ శాలరీ అకౌంట్తో రూ.కోటి ప్రమాద బీమా
ఎస్బీఐ విజయవాడ వెస్ట్ ఆర్ఎం శ్రీనివాసరావు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కుటుంబ యజమాని అనుకోని సంఘటనలో మృతి చెందితే అతనిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబం రోడ్డున పడకుండా ఎస్బీఐ శాలరీ ఖాతాదారులకు ప్రమాద బీమా పథకంతో ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎస్బీఐ విజయవాడ వెస్ట్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్బీఐ డీఆర్ఎం కార్యాలయంలో శనివారం ఇటీవల రైల్వేలో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తికి ఎస్బీఐ బ్యాంకు మంజూరు చేసిన రూ.40లక్షల ప్రమాద బీమా చెక్కును ఆర్ఎం శ్రీనివాసరావు చేతుల మీదుగా మృతుని భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్బీఐలో శాలరీ అకౌంట్లు కలిగిన ఉద్యోగులకు గతంలో ఉన్న పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (పీఏఐ) కవరేజ్ను రూ.40 లక్షల నుంచి ఒక కోటి రూపాయలకు పెంచినట్లు తెలిపారు. ఈ బీమా కేవలం రైల్వే ఉద్యోగులకే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వేర్వేరు ప్యాకేజీలతో ప్రమాద బీమా కవరేజ్ వర్తించనున్నట్లు తెలిపారు. ఇందులో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోటి రూపాయలు, ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రూ.2.60 కోట్లు, సహజ మరణం సంభవిస్తే రూ.10 లక్షల కవరేజ్ అందుతుందన్నారు. ఇవే కాకుండా ఇతర ఖాతాదారులు కూడా సంవత్సరానికి రూ.2 వేలు చెల్లిస్తే వారికి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రూ.10 లక్షల కవరేజ్ ఉంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లోని ఉద్యోగులు ఎస్బీఐలో శాలరీ అకౌంట్ తీసుకుని ఉచిత బీమా పథకంతో వారి కుటుంబానికి భరోసా కల్పించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్బీఐ డీఆర్ఎం కార్యాలయ బ్రాంచ్ మేనేజర్ సుకుమార్, రీజనల్ కార్యాలయ చీఫ్ మేనేజర్ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. -
కలగా.. కల్పనగా..
పెడన: చంద్రబాబు ఎన్నికల వేళ కలంకారీ వ్యాపారులకు ఇచ్చిన హామీ నీటిమూటలా మారే పరిస్థితి ఎదురవుతోంది. పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటు కలగా మిగిలిపోతుందేమోననే సంశయం ఆ వ్యాపారులను కలవరపెడుతోంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఈ ఏడాది జనవరిలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు జిల్లా ఉన్నతాధికారులు పెడనలో పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ముందుకు అడుగులు పడని అధికారుల హడావుడి అధికారులు నానా హడావుడి చేశారు. దీంతో క్లస్టర్ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయని అంతా భావించారు. స్థానిక కలంకారీ పరిశ్రమల యాజమానులు, అనుభవజ్ఞులతో క్లస్టర్ ఏర్పాటుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో కొందరు ఇతర రాష్ట్రాలకు సొంత ఖర్చులతో వెళ్లి పరిశీలించి వచ్చారు. దీనిపై జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖాధికారులతో సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించారు. నెలలు గడుస్తున్నా ఊసే లేదు ఆ తర్వాత నెలలు గడుస్తున్నా దాని ఊసే లేదు. కారణం క్లస్టర్ ఏర్పాటుకు సుమారు రూ.వందల కోట్లు అవసరం. ప్రైవేటు స్థలం, యంత్రాల కొనుగోలుకు రూ.కోట్లు వెచ్చించాల్సి ఉండటంతో తాత్కాలికంగా బ్రేక్ పడిందని, నిధులు లభ్యత అవ్వగానే పనులు చేపడతామనే వాదనను అధికార పార్టీ వారు పేర్కొంటున్నారు. ఈ బ్రేక్ శాశ్వతమా లేక కలగానే మారుతుందా అనేది ప్రశ్న. అయితే గతంలో ‘కలంకారీ’ కోసం నిర్మించిన భవనాల పరిస్థితి ఏమిటనే దిశగా కొందరికి ఆలోచనలు వస్తున్నాయి. ఇది కూడా అలాగా మిగిలిపోతుందా అనేది పట్టణంలో చర్చనీయాంశమైంది. గతంలో నిర్మించిన భవనాల పరిస్థితిని పరిశీలిస్తే అవి నిరుపయోగంగా ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీతో.... ఆర్మీలో పనిచేస్తూ రిటైర్డ్ ఆర్మీ జవాను సువర్ణరాజు పెద్ద మనసుతో తన సొంత స్థలంలో సుమారు 15 ఏళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్ రుణంతో పెడన బైపాస్ రోడ్డులో మచిలీపట్నం వైపు కలంకారీ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. కొన్నాళ్లు శిక్షణ తరగతులు జరిగాయి. ఆ తర్వాత ఏమైందోగానీ దీన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. ఆ తర్వాత సువర్ణరాజు మరణించడం, ఆ భవనం శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఆ భవనం గొడవల్లో ఉండటంతో దాన్ని ఎవరూ పట్టించు కోవడం లేదని తెలుస్తోంది. టూరిజం ఆధ్వర్యంలో భవనం.. ఎస్టీల నివాసం పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే టూరిజం వారు పక్కా భవనాన్ని రూ. లక్షలు వెచ్చించి నిర్మించారు. కలంకారీకి సంబంధించి అన్నీ వివరించడానికి గైడ్ను ఏర్పాటుచేసి టూరిస్టులకు తెలియజేసేందుకు చర్యలు తీసుకున్నారు. భవనం నిర్మించారే తప్ప ఆచరణ సాధ్యం కాలేదు. రూ.లక్షలు పెట్టి కట్టిన భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. దీనిలో ఎస్టీ కుటుంబాలు నివసిస్తున్నాయి. నిరుపయోగంగా ఫెసిలిటీ సెంటర్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో కలంకారీ ఫెసిలిటీ సెంటరును ఏర్పాటు చేశారు. ఇది కూడా నిరుపయోగంగా ఉంది. మూసి ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఏడాదిలో ఒకసారి తెరుస్తూ అవకాశం ఉన్నప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మమ అనిపిస్తున్నారు. నిర్మించి వదిలేశారురూ.లక్షలు పెట్టి భవనాలు నిర్మించి ఖాళీగా వదిలేయడంపై కలంకారి వర్కర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2కోట్లు నిధులు విడుదలయ్యాయని, ఆ సందర్భంగా నాటి ఎంపీ కొనకళ్ల నారాయణరావును కలంకారీ వస్త్రా వ్యాపారులు ఘనంగా సత్కరించిన సందర్భాలను సైతం గుర్తు చేస్తున్నారు. ఆ నిధులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితులున్నాయి. ప్రభుత్వం వద్ద నిధులు లేని కారణంగా పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుపై నీలినీడలు ఎన్నికల హామీ నీటి మూటేనా! గతంలో కలంకారీ అభివృద్ధికి నిర్మించిన భవనాలు నిరుపయోగం -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025వరుసగా రెండో నెలలోనూ గురువులకు అందని జీతాలువన్టౌన్(విజయవాడపశ్చిమ): బదిలీలు అయిన గురువులను వేతన వెతలు వెంటాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇటీవల బదిలీ అయిన ఉపాధ్యాయులకు రెండో నెలా జీతాలు అందలేదు. జూన్లోనే ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసింది. అందులో పలువురికి ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి పొజిషన్ ఐడీలు రాకపోవడంతో ప్రభుత్వం వారికి జూలై మొదటి తేదీ ఇవ్వాల్సిన జూన్ జీతభత్యాలు నిలిపి వేసింది. తాజాగా ఆగస్టులో జీతాలు పడలేదు. ఇలా ఉమ్మడి జిల్లాలో సుమారు నాలుగు వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాంకేతిక సమస్యల పేరుతో ఎగనామం పాఠశాల మారిన గురువులకు, స్థాయి మారిన ఉపాధ్యాయులకు రెండు మాసాల నుంచి జీతాలు వేయకపోవడానికి సాంకేతిక సమస్యలను విద్యాశాఖ అధికారులు ఎత్తి చూపుతున్నారు. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నా వీరి స్థానం మారడంతో ఏ పాఠశాలకు, ఏ స్థానానికి బదిలీ అయ్యారో దానికి సంబంధిత ఉద్యోగికి పొజిషన్ ఐడీని ప్రభుత్వం కేటాయిస్తుంది. సీఎప్ఎంఎస్లో వారి వివరాలను ప్రభుత్వం పొందుపరుస్తుంది. అప్పుడే వేతనాలు ఇవ్వడానికి అవకాశముంటుంది. పొజిషన్ ఐడీ ఇవ్వడంలో ఆలస్యం కారణంగా రెండు నెలల జీతం బదిలీ అయిన ఉపాధ్యాయుల ఖాతాలకు ఇప్పటివరకు జమ కాలేదు. కావాలనే నిర్లక్ష్యం..? ఉపాధ్యాయులపై ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయా ఉపాధ్యాయ సంఘాలు మండి పడుతున్నాయి. యోగాంధ్ర, మెగా పేరెంట్స్ మీట్ వంటి కార్యక్రమాలకు ఎంతమంది హాజరయ్యారు, ఎన్ని ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయి, ఎలా జరిగిందనే అంశాలను క్షణంలో ప్రభుత్వ పెద్దలు తెలుసుకున్నారు. మరి ఉపాధ్యాయుల సమాచారం తెలుసుకోవడానికి, వారికి ఐడీలు కేటాయించడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో రెండు నెలలుగా ఐడీలు కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవటంతో అప్పులపాలువుతున్నామంటూ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. అప్పులు పుట్టే పరిస్థితి ఉండదంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఖర్చులకు, పిల్లల ఫీజులు ఇతర చెల్లింపులకు అప్పులు చేయాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం కావాలనే ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేస్తోందని వారు మండిపడుతున్నారు. సంఘాల ఆందోళన బాట ఉపాధ్యాయుల జీతాలు రాకపోవటంపై టీచర్ల సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. వారం రోజుల్లో ఐడీలు కేటాయించి, జీతాలు చెల్లించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయుల బదిలీలు, ఐడీల కేటాయింపు విషయంలో కావాలనే ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఆందోళన బాట పడితేనే ప్రభుత్వం స్పందిస్తుందని వారు చెబుతున్నారు. ఐదో తేదీ లోపు సమస్య పరిష్కారం కాకుంటే మరింత ఉధృతంగా ఉద్యమిస్తామంటూ ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఎయిర్పోర్ట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్వాగతం విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఘనస్వాగతం లభించింది. అమరావతిలో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్.గంగాధరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి గడ్కరీ రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు. హోంగార్డులకు అభినందన కోనేరుసెంటర్: కృష్ణా జిల్లాలో హోంగార్డులుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల విడుదలైన పోలీసు కానిస్టేబుల్స్ ఫలితాల్లో విజయం సాధించి సివిల్ పోలీస్ కానిస్టేబుల్స్గా ఉద్యోగ అర్హత సాధించిన సిబ్బందిని శనివారం కృష్ణా ఎస్పీ ఆర్.గంగాధరరావు అభినందించారు. జీవితంలో అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నారు. దానికి కృషి, పట్టుదల అవసరమన్నారు. ఒంటిపై యూనిఫామ్ పడిన రోజు నుంచి ఎలాంటి రిమార్క్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజా రక్షణే ధ్యేయంగా మరింత బాధ్యతగా ముందుకు సాగాలని సూచిస్తూ వారిని అభినందించారు. 7న్యూస్రీల్ బదిలీ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు కేటాయించని ఐడీలు వివరాలు లేక ఐడీలు జనరేట్ కాలేదంటున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో సుమారుగా 4 వేల మందికిపైగా జీతాలు ఏవీ! ఉపాధ్యాయ సంఘాల ఆందోళన 4 వేల మందికి అందని జీతాలు..? ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు బదిలీ అయిన ఉపాధ్యాయులు, ప్రమోషన్లు పొందిన గురువులు చాలా మందికి జీతాలు పడక ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యల కారణంతో జీతాలు ఆపడం హాస్యాస్పందంగా ఉంది. ప్రభుత్వం తలచుకుంటే నిమిషాల్లో జరిగే పనిని సాకుగా చూపి రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవటం దారుణం. తక్షణం ప్రభుత్వం స్పందించాలి. దీనిపై ఉపాధ్యాయ సంఘాల ఐక్య సమాఖ్య పక్షాన ఆందోళన చేయటానికి సమాయత్తమవుతున్నాం. – ఎ.సుందరయ్య, జిల్లా చైర్మన్, ఫ్యాప్టో, ఎన్టీఆర్జిల్లా ఉమ్మడి జిల్లాలో సుమారుగా 12,612 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఇతర సిబ్బంది వివిధ కేడర్లలో పని చేస్తున్నారు. వారిలో సుమారుగా నాలుగు నుంచి ఐదు వేల మందికిపైగా ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. అందులో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్, సమానస్థాయి కేడర్ ఉపాధ్యాయుల, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు, ఆర్ట్/ డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్ /ఉపాధ్యాయులు తదితర కేడర్లలో ఉన్న వారు బదిలీ అయి నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూల్సుకు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు కొత్తగా ఏర్పడడంతో ఇక్కడకు వచ్చిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. అయితే బదిలీలు జరిగి రెండు నెలలవుతున్నా పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. దీంతో సుమారుగా నాలుగు వేల మందికి పైగా రెండు నెలల జీతాలు అందలేదు. -
11 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలున్న 11 మంది చిన్నారులకు విజయవాడలోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆంధ్రా హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు చెప్పారు. విజయవాడ సూర్యారావుపేటలోని ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 28 నుంచి ఈ నెల 2 వరకూ నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో బెంగళూరుకు చెందిన పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బీఆర్ జగన్నాధ్, ఆంధ్రా హాస్పిటల్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావుతో కలిసి ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. పదేళ్లుగా తమ ఆస్పత్రిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్నామని, అందులో భాగంగా ప్రస్తుతం 35వ ఉచిత పిల్లల గుండె సర్జరీల క్యాంపు నిర్వహించి 11 మందికి సర్జరీలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ తమ ఆస్పత్రిలో 4800 వరకు సర్జరీలు ఇంటర్వెన్షన్స్ చేశామన్నారు. ఆంధ్రా హాస్పిటల్ పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో పిడియాట్రిక్ కార్డియాలజీ టీమ్ ఈ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సీటీ సర్జన్లు డాక్టర్ బీఆర్ జగన్నాధ్, డాక్టర్ నాగేశ్వరరావు, పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్, కార్డియాక్ ఎనస్థిస్ట్ డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. రాజమండ్రి–గోదావరి–కొవ్వూరు సెక్షన్లను తనిఖీ చేసిన డీఆర్ఎం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): 2027వ సంవత్సరంలో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా శనివారం రాజమండ్రి–గోదావరి–కొవ్వూరు సెక్షన్లను అధికారులతో కలసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పుష్కరాలకు సుమారు 40 లక్షలకు పైగా ప్రయాణికులు వస్తారనే అంచనాలతో రాజమండ్రి స్టేషన్లోని తూర్పు, పశ్చిమ ప్రవేశ ద్వారాలు, స్టేషన్ యార్డులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పరిశీలించారు. జరుగుతున్న స్టేషన్ పునరాభివృద్ధి పనులను పరిశీలించి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ ద్వారాలు, సర్క్యులేటింగ్ ప్రాంతాలు, ప్రజలకు అందించే సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రద్దీని నియంత్రించేందుకు రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు స్టేషన్లలో ప్రత్యక కార్యాచరణతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. స్టేషన్లో అదనపు లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, టికెట్ బుకింగ్ పాయింట్లు, పార్కింగ్ స్థలాల ఆధునికీకరణ, సెల్ఫోన్ చార్జింగ్ పాయింట్లు, సిట్టింగ్ ప్రదేశాలు, షెల్టర్లు, ప్రయాణికులకు మౌలిక సదుపాయాలతో అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులను అధికారులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. -
బెజవాడలో విస్తృతంగా తనిఖీలు
శక్తి, ఈగల్ బృందాలతో అవగాహన కార్యక్రమాలు లబ్బీపేట(విజయవాడతూర్పు): శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించేందుకు నగరంలో ఈగల్, శక్తి ప్రత్యేక బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కేజీవీ సరిత పర్యవేక్షణలో ఎన్టీఆర్ జిల్లాలో శక్తి బృందాలు, మహిళా పోలీస్స్టేషన్ అధికారులు, సిబ్బంది కళాశాలలు, పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులకు గుడ్టచ్, బ్యాడ్టచ్, ఆపద సమయంలో చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన కలిగిస్తున్నారు. శనివారం నగరంలోని పలు పాఠశాలల్లో సందర్శించారు. రాత్రి వేళ్లలో గస్తీ తిరుగుతూ బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నేర చరిత్ర ఉన్నవారిని గుర్తిస్తున్నారు. ఇంటర్ సెప్టర్, యాంటీ నార్కోటిక్ /ఈగల్ టీం బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాలలో తనిఖీలను నిర్వహించి 109 మంది వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిలో 48 మంది అనుమానిత వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ ద్వారా తనిఖీ చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగిన 16 మందిని అదుపులోనికి తీసుకుని తగు చర్య నిమిత్తం వారిని సంబంధిత పోలీసు స్టేషన్లకు అప్పగించారు. ఈ క్రమంలో వివిధ ప్రదేశాల్లోని 11 పాన్ షాప్ /బడ్డీ కొట్లను తనిఖీ చేశారు. లేడీస్ హాస్టళ్ల సమీపంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. -
బోధనేతర పనులు అప్పగించొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బోధనేతర పనులతో ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) డెప్యూటీ సెక్రటరీ జనరల్ నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా జరిగింది. ధర్నాలో పాల్గొన్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం యాప్ల పేరుతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతోందన్నారు. వీటిపై ఈనెల 5వ తేదీ లోపు ప్రభుత్వం గుర్తింపు పొందిన సంఘాలతో చర్చలు జరపాలని, లేని పక్షంలో యాప్లను బహిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తున్నా నాలుగు డీఏ బకాయిలు ఇవ్వలేదని, 12వ పీఆర్సీ కమిషన్ వేయలేదన్నారు. పీ–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయకూడదన్నారు. ధర్నాలో ఫ్యాప్టో కార్యదర్శి ఇమామ్ బాషా, ఖాసిం, రాధిక, కొమ్ము ప్రసాద్ పాండురంగ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ధర్నా -
ఎన్టీటీపీఎస్ 3వ యూనిట్లో 200 రోజుల వేడుక
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ 3వ యూనిట్ నిరంతరాయంగా విద్యుత్పత్తి చేసి విజయవంతంగా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డివిజన్ ఈఈ గోగినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజయోత్సవం శనివారం నిర్వహించారు. చీఫ్ ఇంజినీర్ శివ రామాంజనేయులు కేక్ కట్ చేసి ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. డీవైఈఈ కిరణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఈ మాట్లాడుతూ నిరంతరాయంగా 200 రోజులు విద్యుత్పత్తిని సాధించడం అరుదైన విషయమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి విజయోత్సవాలు మరిన్ని జరుపుకునేందుకు సమష్టిగా కృషి చేయాలన్నారు. విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ఎస్ఈ వెంకట్రావు అభినందించారు. ఎస్ఈ గోపాల్, ఈఈలు సురేష్బాబు, వెంకయ్య, గుప్తా, కిరణ్ పాల్గొన్నారు. ప్రైవేట్ వైద్య కాలేజీలపై విజిలెన్స్ దర్యాప్తు చేయండి లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉపకార వేతనాలు తిరస్కరణ, నియంత్రణ, ఉల్లంఘనలపై తెలంగాణ తరహాలో ఏపీలోనూ ప్రైవేటు వైద్య, దంత వైద్య కళాశాలలపై విజిలెన్స్ విచారణ చేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు శనివారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డికి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అంబటి నాగరాధాకృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శరత్బాబు, ఎస్సీ సెల్ ‘సెంట్రల్’ అధ్యక్షుడు శ్యామ్బాబు రిజిస్ట్రార్ను కలిసిన వారిలో ఉన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు వైద్య విద్యాసంస్థలపై కఠినమైన పర్యవేక్షణ అవసరమని వారు తెలిపారు. దేవస్థాన అభివృద్ధి పనులకు రూ. లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థాన అభివృద్ధి పనులకు వరంగల్కు చెందిన భక్తులు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. వరంగల్కు చెందిన ఎం. జయలక్ష్మి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి అభివృద్ధి పనుల కోసం రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. ● దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద పంపిణీకి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బి.విశ్వనాథశాస్త్రి, మహాలక్ష్మి దంపతులు శనివారం ఆలయ ఈవోను కలిసి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. మహానుభావులను స్మరించుకోవాలిచిలకలపూడి(మచిలీపట్నం): స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య, రంగస్థల నటుడు బళ్లారి రాఘవ వంటి మహానుభావులను స్మరించుకోవడం మన బాధ్యత అని ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, రంగస్థల నటుడు బళ్లారి రాఘవ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి శనివారం ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పింగళి వెంకయ్య జాతికి ఒక పతాకం ఉండాలని గుర్తించి దాన్ని రూపొందించిన మహనీయులన్నారు. ఆయన జిల్లావాసి కావడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. బళ్లారి రాఘవ నాటక రంగ పురోగతికి విశేష సేవలు అందించారని కొని యాడారు. కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, మచిలీపట్నం మార్కెట్యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్(నాని) తదితరులు పాల్గొన్నారు. -
తిరువూరు టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తిరువూరు తమ్ముళ్ల తిరుగుబాటు జెండా ఎగురవేశారు. టీడీపీ పార్టీని, ప్రభుత్వాన్ని, ఎంపీని ఎమ్మెల్యే కొలికపూడి అల్లరి చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్యే.. పార్టీని, ఎంపీని బదనాం చేస్తున్నారు.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎమ్మెల్యేకి కనిపించడం లేదు.. ఎమ్మెల్యే వైఖరిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అంటూ మండిపడ్డారు.‘‘ఒక పథకం ప్రకారమే ఎమ్మెల్యే కొలికపూడి ఇలా చేస్తున్నారు. కొలికపూడితో వివాదాలన్నీ టీడీపీ వారితోనే. ఎమ్మెల్యే కొలికపూడి వల్ల టీడీపీ తీవ్రంగా నష్టపోతోంది. కొలికపూడిని ఎంపీ కేశినేని చిన్ని కోట్లు ఖర్చుపెట్టి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి పార్టీకి, ఎంపీకి నమ్మకంగా ఉండాలి. ఏవైనా మనస్పర్థలు ఉంటే మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. తిరువూరులో పార్టీ, ప్రభుత్వం, ఎంపీ అల్లరవుతున్నారు తప్ప.. ఏం అభివృద్ధి జరిగింది’’ అంటూ తిరువూరు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.కాగా, తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం. -
‘ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు సమాధానం చెప్పాలి’
విజయవాడ: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో శనివారం(ఆగస్టు 2) బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాల్లాది విష్ణుతో పాటు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చారు. జగన్ కంటే ఎక్కువ పథకాలిస్తామని చంద్రబాబు చెప్పారు. జగన్ రూ.13 వేలు రైతు భరోసా కింద రైతులకు అందించారు. ఐదేళ్లలో రూ. 34,288 కోట్లు రైతులకు ఇచ్చారు. చంద్రబాబు 20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు కేంద్రం ఇచ్చినదాంతో కలిపి ఏడు వేలు మాత్రమే ఇచ్చారు. జగన్ ఐదేళ్లూ రైతు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏడు లక్షల మంది రైతులకు కోత పెట్టింది. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని కబుర్లు చెప్పారు. ఇచ్చిన మాట తప్పినందుకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేస్తున్నారు’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. -
‘అదే జరిగితే నిజాలు బయటకు.. సిట్ అధికారుల్లో కలవరం’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కాంలో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న రూ.11 కోట్లు స్వాధీనం విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సొమ్ముకు, లిక్కర్ స్కాంకు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులో సరైన ప్రొసీజర్స్ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.లేని స్కాంలో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంక్లో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారుల్లో కలవరం మొదలైందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..హైదరాబాద్లోని సులోచనా ఫార్మ్ ఫాంహౌస్లో 2024 జూన్లో రాజ్ కసిరెడ్డి దాచిపెట్టిన లిక్కర్ స్కాంకు సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా సిట్ అధికారులు ప్రకటించారు. పట్టుబడిన నగదును కోర్ట్కు సమర్పించారు. సిట్ ఆరోపణలపై ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ సొమ్ము తనకు చెందినది కాదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు.సదరు ఫాం హౌస్ యజమానులుగా ఉన్న తీగల విజయేందర్రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు, దేశ వ్యాప్తంగా డయాగ్నసిస్ సెంటర్లు, హాస్పటల్స్ ఉన్నాయి. వారికి వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారాలు ఉన్నాయి. వారు తనకు బినామీలు అని సిట్ ఆరోపించడం అన్యాయమంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నలబై అయిదేళ్ళకు పైగా వారు వ్యాపారాలు నిర్వహిస్తుంటే, నలబై ఏళ్ళ వయస్సు ఉన్న నాకు వారు బినామీలు అని చెప్పడం ఎంత వరకు సమంజసమని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. వారి ఆస్తులను కూడా నావిగా చిత్రీకరించడం బాధాకరణమని తన ఆవేదనను న్యాయస్థానం ముందుంచారు.సిట్ బృందం నిబంధనలను పాటించలేదు:హైదరాబాద్లో పట్టుబడిన రూ.11 కోట్లు కూడా వరుణ్కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కాంపై 23.9.2024న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. వరుణ్ కుమార్ అనే వ్యక్తిపై 21.12.2024న కేసు నమోదు చేశారు. విట్నెస్ కింద నోటీస్ ఇచ్చి వాగ్మూలం నమోదు చేశారు. దీనినే కోర్ట్కు సమర్పించారు. దీనిలో తీగల విజయేందర్రెడ్డి, తీగల బాల్ రెడ్డిని కూడా 17.4.2025న సాక్షులుగా పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు విచారించిన దర్యాప్తు అధికారులే నేటికీ సిట్లో కొనసాగుతున్నారు. ఆనాడు విచారణ సందర్భంగా ఈ డబ్బు విషయం ఎక్కడా సిట్ రికార్డుల్లో ప్రస్తావించలేదు.అదే దర్యాప్తు అధికారి వరుణ్ కుమార్ను విచారిస్తే ఈ సొమ్ము బయటపడిందని తాజాగా చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. గతంలో అదే వ్యక్తులను విచారించినప్పుడు ఈ డబ్బు ప్రస్తావన ఎందుకు రాలేదు.? హటాత్తుగా రాజ్ కసిరెడ్డి బెయిల్ విచారణ దశలో ఉండగా ఎలా బయటపడింది? పద్నాలుగు ఏ4 కాగితాలు పెట్టే బాక్స్ల్లో కొత్త కొత్త నోట్లతో ఈ సొమ్ము దొరికింది. ఏసీబీ కేసుల్లో ఎవరినైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సందర్భాల్లో ప్రతి నోట్పైనా ఉన్న నెంబర్ను రికార్డు చేస్తారు.వాటిని కోర్ట్కు సమర్పిస్తారు. కానీ ఈ కేసులో పట్టుబడిన పదకొండు కోట్ల రూపాయలకు చెందిన కరెన్సీ నోట్ నెంబర్లను ఎందుకు నోట్ చేయలేదు? వీడియో ఫుటేజీని ఎందుకు రికార్డు చేయలేదు? అలాగే సులోచనా ఫార్మ్ ఫాంహౌస్లో 2024 నుంచి సిసి కెమేరా ఫుటేజీని ఎందుకు సేకరించలేదు? దీనిపైన ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో నిందితులకు బెయిల్ రానివ్వకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆ కరెన్సీ విషయంలో సిట్ ఎందుకు కంగారు పడుతోంది..?విజయేందర్ రెడ్డిని బెదిరించి వారికి చెందిన వ్యాపార సంస్థల నుంచి తెచ్చిన డబ్బును పట్టుకున్నారా లేక ప్రభుత్వమే ఒక ప్లాన్ ప్రకారం ఆ సొమ్మును సమకూర్చి కేసును పక్కదోవ పట్టిస్తోందా? అనే అనుమానాలు ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి కోర్ట్లో మాట్లాడుతూ ఆ పదకొండు కోట్లు నేనే నా చేతితో ఇచ్చాను అని చెబుతున్నారు. ఆ సొమ్ముకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ను రికార్డు చేయండి. ఆ కరెన్సీ ఏ సమయంలో ఆర్బీఐ ముద్రించారో దాని నెంబర్లపై దర్యాప్తు చేయించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ప్రతి కరెన్సీ నోట్ను గుర్తించి పంచనామా నివేదికలో రికార్డు చేయాలని ఆదేశించింది. బ్యాంకుకు జమ చేసి ఉంటే, మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలని కూడా ఆదేశించింది. బ్యాంక్ వద్ద పోలీసులు రాత్రి నుంచే భారీ బందోబస్త్ను ఏర్పాటు చేశారు. రాత్రే బ్యాంకుకు జమ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ కరెన్సీపై విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు కంగారు పడుతున్నారా? వాటి విషయంలో సిట్ బృందం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. -
బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారు?: పొన్నవోలు
సాక్షి, విజయవాడ: రూ.11 కోట్ల విషయంలో సిట్ కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. సీరియల్ నంబర్స్ వీడియోగ్రఫి చేయాలని కోర్టు ఆదేశించినా కానీ.. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారంటూ ఆయన ప్రశ్నించారు. నోట్లు వెరిఫై చేస్తే ఎవరు విత్ డ్రా చేశారో తెలుస్తుందని పొన్నవోలు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.కాగా, ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రూ.11 కోట్లు రూపాయలు సీరియల్ నెంబర్లు వీడియో గ్రఫి చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. రూ.11 కోట్లు ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి సిట్ సన్నాహాలు చేస్తుండగా.. రూ. 11 కోట్లను కచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియో గ్రఫి చేయాలని పిటిషన్లో పేర్కొన్న న్యాయవాది.. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతుందన్నారు. -
లిక్కర్ కేసు.. ఆ రూ. 11 కోట్లను ఇతర నోట్లతో కలపొద్దు: ఏసీబీ కోర్టు
లిక్కర్ కేసు.. సిట్ కుట్ర.. కేసిరెడ్డి పిటిషన్ అప్డేట్స్.. విజయవాడఅక్రమ మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డి మెమోపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలువీడియోగ్రఫీ చేయకుండానే నోట్లు డిపాజిట్ చేస్తున్నారంటూ కెసిరెడ్డి మెమోకెసిరెడ్డి మెమో పై కోర్టు కీలక ఆదేశాలురూ.11 కోట్లను ఇతర డబ్బుతో కలపొద్దని ఏసిబి కోర్టు ఆదేశాలురూ.11 కోట్లను విడిగా ఉంచాలని సిట్ , మాచవరం ఎస్.బిఐ బ్యాంకుకు ఆదేశండిపాజిట్ చేసే ముందు సీరియల్ నెంబర్లు నమోదు చేయాలని ఆదేశండీటెయిల్డ్ పంచనామా కోర్టుకు సమర్పించాలని సిట్ కు ఆదేశం👉ఏసీబీ కోర్టులో కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రూ.11 కోట్ల సీరియల్ నెంబర్ వీడియోగ్రఫీ చేయాలని పిటిషన్లో కోరారు. రూ.11 కోట్లను ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు సిట్ సన్నాహాలు చేస్తోందన్నారు. 11 కోట్లను ఖచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ చేయాలని లాయర్ పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతోందని న్యాయవాది తెలిపారు. 👉ఏపీ మద్యం అక్రమ కేసులో సిట్ కుట్రలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేస్తోందంటూ రాజ్ కేసిరెడ్డి తరఫు న్యాయవాదులు ఆరోపించారు. నోట్ల కట్టలను కోర్టు అనుమతి లేకుండానే బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారని చెప్పారు. కోర్టు ఆదేశాలను సిట్ బృందం పట్టించుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు తెలిపారు.👉అక్రమ మద్యం కేసులో కేసిరెడ్డి తరఫు లాయర్లు తాజాగా మాట్లాడుతూ.. మద్యం అక్రమ కేసులో సీజ్ చేసిన నోట్ల కట్టలను సిట్ తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. కోర్టు అనుమతి లేకుండానే డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. న్యాయమూర్తి ఆదేశాలకు విరుద్దంగా రూ.11 కోట్లను ఆగమేఘాలపై బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సిట్ బృందం రాత్రి నుంచే ప్రయత్నాలు చేస్తున్నది. ఆర్బీఐ నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వెరిఫై చేస్తే సిట్ తప్పు దొరికిపోతుంది. తమ తప్పు దొరికిపోతుందనే భయంతోనే వెరిఫై చేయించకుండా కుట్ర చేస్తున్నారు.👉నోట్ల కట్టల బ్యాచ్ నెంబర్లను వీడియోగ్రఫీ చేయాలంటూ నిన్న సిట్కు జడ్జి చెప్పారు కదా. ఏ బ్యాంకు నుంచి నోట్ల కట్టలు వచ్చాయో వీడియో తీయాలంటూ నిన్న సిట్కు ఏసీబీ కోర్టు చెప్పినప్పటికీ డిపాజిట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో సిట్ కుట్రలపై కోర్టును ఆశ్రయిస్తామని నిందితుల తరఫు లాయర్లు చెప్పుకొచ్చారు. నాకు సంబంధమే లేదు: కేసిరెడ్డి👉ఇక, అంతకుముందు.. అక్రమ మద్యం కేసులో ‘సిట్’ అధికారులు హైదరాబాద్లో సీజ్ చేసిన రూ.11 కోట్ల నగదుతో తనకెలాంటి సంబంధంలేదని రాజ్ కేసిరెడ్డి న్యాయమూర్తి ఎదుట స్పష్టంచేశారు. తనకు సంబంధం లేకున్నా సిట్ సీజ్ చేసిన ఆ డబ్బు తనదేనని ‘సిట్’ లింకులు పెడుతోందన్నారు. ఎక్కడ డబ్బులు దొరికినా అవి మద్యం కేసుకు సంబంధించినవేనని అంటున్నారన్నారు. 2014లోనే తాను ఆ డబ్బును వరుణ్కు ఇచ్చినట్లు చెబుతున్నారని, ఆ నగదుపై ఉన్న నెంబర్లు రికార్డు చేస్తే ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుస్తాయని అన్నారు. ఆ నగదు తన స్వహస్తాలతోనే ఇచ్చానని చెబుతున్నారని, వాటిపై తన వేలిముద్రలు ఉన్నాయో లేదో చెక్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. 👉తన వయసు 43 ఏళ్లని, 45 ఏళ్ల కిందటి ఫామ్హౌస్కు తాను బినామీ అని చెబుతున్నారని, తాను పుట్టకముందే బినామీ ఆస్తులుంటాయా? అని ప్రశ్నించారు. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను మద్యం డబ్బులతో కొనుగోలు చేసినట్లు ‘సిట్’ చెబుతోందన్నారు. తనను అక్రమంగా కేసులో ఇరికించారని, తన బెయిల్ను అడ్డుకునేందుకు సిట్ అబద్ధాలు చెబుతోందంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడిపెట్టారు. దీనిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కరరావు కీలక ఆదేశాలిచ్చారు. సీజ్ చేసిన రూ.11 కోట్లను ఫొటోలు తీయాలని ‘సిట్’ను ఆదేశించారు. -
చిన్ని Vs కొలికిపూడి.. టీడీపీలో కోల్డ్ వార్!
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అక్రమ ఇసుక రవాణా పీక్ స్టేజ్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కింది. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం.వివరాల ప్రకారం.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుల కనుసన్నల్లో ఇసుక అక్రమంగా ఏపీ బోర్డర్ దాటేస్తోంది. అనంతరం, ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు గ్రామం పెద్దవరం వద్ద ఇసుక డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణకు ఇసుక తరలించి ఎంపీ అనుచరులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎంపీ మనుషులు గండ్ర హరినాథ్, నన్నపనేని సాయికృష్ణ పగలూ రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తమ వెనుక ఎంపీ ముఖ్య అనుచరుడు మాదాల హరిచరణ్ కిట్టు ఉన్నాడంటూ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో, అక్రమ ఇసుక వ్యవహారం స్థానికంగా హాట్టాపిక్గా మారింది.మరోవైపు.. పెద్దవరంలో నిల్వచేసిన ఇసుక డంపింగ్లను గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందన్నారు. పోలీసులే దగ్గరుండి సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఆరోపించారురు. అందుకే బోర్డర్లో సీసీ కెమెరాలు పెట్టలేదన్నారు. ఈ క్రమంలో ఏసీపీతో ఫోన్లో మాట్లాడిన కొలికపూడి.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో తిరువూరుకు చెందిన గంజాయి బ్యాచ్కు ఇసుక అక్రమ రవాణాకు సంబంధం ఉందన్నారు. ఆ గంజాయి బ్యాచ్కు పోలీసులు సహకరిస్తున్నారు. ఒకే వ్యక్తి పేరుతో ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. -
భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): దసరా ఉత్సవాల్లో సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లుచేస్తామని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకూ నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బందోబస్తు ఏర్పాట్లపై శుక్రవారం సీపీ రాజశేఖరబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో దుర్గగుడి అధికారులు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. వీటికి పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానుండటంతో భద్రత ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. క్యూ లైన్లలో, స్నాన ఘాట్ల వద్ద రద్దీ, ప్రసాదం కౌంటర్ల వద్ద ఏర్పాట్లు, రద్దీని తగ్గించి, భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రత్యేకంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా, సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం, సమాచార నిమిత్తం వారికి మెరుగైన సౌకర్యాలు అందించడానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఎస్వీడీ ప్రసాద్, టెంపుల్ ఈఓ శీనానాయక్, ఏడీసీపీలు జి.రామకృష్ణ, ఏవీఎల్ ప్రసన్నకుమార్, కె.కోటేశ్వరరావు, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్ పాల్గొన్నారు. దసరా ఉత్సవాల బందోబస్తుపై సీపీ సమీక్ష -
మంగళరూపిణికి జేజేలు
ఇంద్రకీలాద్రిపై శ్రావణ సందడి శ్రావణ శుక్రవారం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవార్చనలో ఉభయదాతలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రధాన ఆలయంతో పాటు ప్రవేశ మార్గాలను పూలతో విశేషంగా అలంకరించారు. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొనే టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. ఈ టికెట్లపై దేవస్థానం పరిమితి విధించడంతో డిమాండ్ మరింత అధికమైందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. – ఇంద్రకీలాద్రి (విజయవాడపశ్చిమ) -
ఏపీ రోలర్ స్కేటర్లకు పతకాలు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): దక్షిణ కొరియాలోని జెచియోన్లో గత నెల 19 నుంచి 29వ తేదీ వరకు జరిగిన 20వ ఆసియా రోలర్–స్కేటింగ్ చాంపియన్ షిప్లో వివిధ విభాగాల్లో ఏపీకి చెందిన చెందిన రోలర్ స్కేటర్లు ప్రతిభ చూపి పతకాలు సొంతం చేసుకున్నారని రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగీరథ్ చెప్పారు. దక్షిణ కొరియాలో జరిగిన చాంపియన్ షిప్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిరోపోర్టులో ఫెడరేషన్ సభ్యులు వీరికి స్వాగతం పలికి అభినందించారు. భగీరథ్ మాట్లాడుతూ వివిధ విభాగాలు, కేటగిరీల్లో పతకాలు పొందారన్నారు. రసిల్–గోల్డ్, దినేష్–సిల్వర్, క్షేత్ర–సిల్వర్, జెస్సిరాజ్–సిల్వర్, హరికమల్–కాంస్య, అన్మిష–కాంస్య, సంహిత–గోల్డ్, గ్రీష్మ–గోల్డ్, చేబోయిన ఆర్యని–సిల్వర్, సాయి కార్తీక్–కాంస్య పతకాలు పొందారని వివరించారు. ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.థామస్, వైస్ ఉపాధ్యక్షుడు బి.మురళీకృష్ణ, అసోసియేషన్ సభ్యులు క్రీడాకారులను అభినందించారు. జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక మైలవరం: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టర్స్ ఎంపికై నట్లు సంఘ జిల్లా అధ్యక్షుడు బి. వెంకట్రావు శుక్రవారం తెలిపారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్లో ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ స్థాయి మాస్టర్స్ కేటగిరి వపర్ లిఫ్టింగ్ పోటీల్లో మహిళా విభాగంలో ఎం. లక్ష్మి 69 కిలోల విభాగం, కె.వరలక్ష్మి 76 కిలోల విభాగంలో ఎంపికయ్యారన్నారు. పురుషులు.. 83 కిలోల విభాగంలో గంటా వెంకటేశ్వర్లు, 93 కిలోల విభాగంలో పి. నరసింహారావు, 93 కిలోల విభాగంలో పి.వి.సుబ్బారావు, 105 కిలోల విభాగంలో కె.బాబూరావు ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మల్లేశ్వరరావు, ఏపీ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సూర్యనారాయణ, గంటా వెంకటేశ్వరరావు అభినందించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు అక్కాచెల్లెళ్లువిస్సన్నపేట: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక పరీక్షలో విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన అక్కాచెల్లెళ్లు ఎంపికయ్యారు. అంగిడి శ్రావణి, ఆమె సోదరి సరస్వతి కానిస్టేబుళ్లుగా సెలెక్ట్ అయ్యారు. వీరి సోదరి అంగిడి మాధవి 2014లో సివిల్ కానిస్టేబుల్గా ఎంపికవగా, మరో సోదరుడు వెంకటకృష్ణారావు 2013లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు. శ్రావణి, సరస్వతిలను గ్రామస్తులు అభినందించారు. బంగారు కుటుంబాలకు మార్గదర్శులుగా రోజ్ సొసైటీ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పీ 4 విధానంలో బంగారు కుటుంబాలను దత్తత తీసుకొనేందుకు విజయవాడకు చెందిన రోజ్ సొసైటీ ముందుకు వచ్చింది. శుక్రవారం సొసైటీ ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ వారికి పీ4 విధానం విశిష్టతను వివరించారు. పీ 4లో భాగస్వాములవుతామని, తమ బాధ్యతగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని అండగా ఉంటామని సొసైటీ ప్రతినిధులు కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో 86,398 బంగారు కుటుంబాలను గుర్తించామని, ఇప్పటికే 4,279 మంది మార్గదర్శులుగా ముందుకొచ్చారన్నారు. 33,505 కుటుంబాలను దత్తత తీసుకున్నారని వివరించారు. పారిశ్రామికవేత్తలతో పాటు రెడ్క్రాస్, రోటరీ, ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) తదితర సంస్థలు ముందుకొచ్చాయన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో సొసైటీ అడ్వైజరీ చైర్పర్సన్ అడుసుమిల్లి సీతామహాలక్ష్మి, ప్రెసిడెంట్ సూరపనేని ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యులంతా ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచించారు. ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ 44వ వార్షిక సదస్సు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సును వీసీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక వైద్యచికిత్సా విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఔషధాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరిరావు మాట్లాడుతూ సదస్సును నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ నెఫ్రాలజీ సొసైటీకి అభినందనలు తెలిపారు. సదస్సుకు ఆర్గనైజింగ్ చైర్మన్గా వ్యవహరించిన నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎన్.అమ్మన్న మాట్లాడుతూ నెఫ్రాలజీ వైద్య విభాగానికి సంబంధించి ఆధునిక చికిత్సా విధానాలు, చికిత్సల్లో ఎదురయ్యే సవాళ్లు, నూతన ఆవిష్కరణలపై సదస్సులో చర్చిస్తామని వివరించారు. ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలతో మూత్రపిండాల చికిత్సలను అందించేందుకు, వైద్యుల నైపుణ్యతను పెంపొందించుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని చెప్పారు. సదస్సులో దక్షిణాది రాష్ట్రాల నుంచి 600మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. హెల్త్ యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్ -
‘వైరా’లో గల్లంతైన వ్యక్తి శవమై కనిపించాడు
కంచికచర్ల: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి వైరా ఉపనదిలో గల్లంతై శవమై కనిపించిన ఘటన మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. వీరులపాడు ఎస్ఐ అనిల్ తెలిపిన వివరాల మేరకు వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామానికి చెందిన నాగార్జున తిరుపతిరావు(31) తన స్నేహితుడు సాగర్తో కలసి గత నెల 22వ తేదీ మధ్యాహ్న సమయంలో గ్రామంలోని వైరా ఉపనదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. కాళ్లు కడుగుదామని నదిలో దిగడంతో ఒక్కసారిగా తిరుపతిరావుకు ఫిట్స్ రావటంతో ఉపనదిలో కొట్టుకుపోయాడు. దీనిపై సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి 23,24,25 తేదీల్లో గల్లంతైన వ్యక్తికోసం తాటిగుమ్మి, నందలూరు, గండేపల్లి, కీసర, పెండ్యాల, వేములపల్లి సమీపంలోని మున్నేరులో వెదికారు. ఆ వ్యక్తి ఆచూకీ తెలియలేదు. ఈనెల 1వ తేదీన గండేపల్లి గ్రామానికి చెందిన మట్టా వెంకటేశ్వరరెడ్డి అలియాస్ బాబు అనే రైతు తన పశువులను మేపేందుకు నది ఆవతలి ఒడ్డుకు తోలుకెళ్లాడు. కీసర సమీపంలో మున్నేటిలో ఓ శవం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు కుటుంబసభ్యులు వచ్చి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చేపలు పట్టేందుకు వెళ్లిన తిరుపతిరావు 11 రోజుల తర్వాత విగతజీవిగా కనిపించావా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వైద్యులు శవ పంచనామా చేశారు. తిరుపతిరావు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. యువతి ప్రేమ నిరాకరించిందని యువకుడి ఆత్మహత్యాయత్నం గుడివాడరూరల్: ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని తటివర్రు గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యువకుడు కొల్లూరి సంపత్కుమార్ (25)కు ఫేస్బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఆమెతో కొన్ని రోజులుగా నిత్యం చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందాని సంపత్కుమార్ చెప్పడంతో ఆ యువతి నిరాకరించింది. తీవ్ర మనస్తాపానికి గురైన సంపత్కుమార్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని తన స్నేహితులకు చెప్పాడు. వారు వెంటనే అతన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ తరలించారు. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద స్థితిలో యువకుడి బలవన్మరణం కాచవరం(ఇబ్రహీంపట్నం): అనుమానాస్పద స్థితిలో యువకుడు ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచవరం ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు విశ్వనాధపల్లి సాయితేజ (19) చిన్నప్పటి నుంచి కాచవరంలోని అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. అతను చెడు అలవాట్లుకు బానిసయ్యాడు. తలుపులు దగ్గరకు వేసుకుని గదిలో టీవీ చూస్తుండగా అమ్మమ్మ బయటకు వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత వచ్చి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎంతసేపటికి తీయకపోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడటం కనిపించింది. పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
ఉపాధ్యాయుల సతమతం!
● బోధనేతర పనులతో ఉక్కిరిబిక్కిరి ● పాఠాలు చెప్పనీయడం లేదని ఆవేదన ● దత్తత పేరుతో భారం ● పీ 4పై మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు ● ఉమ్మడి కృష్ణాజిల్లాలోనూ ‘దత్తత’ ఆదేశాలిస్తారని ప్రచారం వన్టౌన్(విజయవాడపశ్చిమ): బోధనేతర పనులతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాఠాలు చెప్పుకోనీయడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నపనులకు తోడు ఇప్పుడు పీ 4 దతత్త భారం కూడా టీచర్లపై పడనుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులకు కిట్ల పంపిణీ.. వాటి వివరాలను ఆన్లైన్ చేయడం, మెగా పేరెంట్స్ సమావేశం, యోగాంధ్ర, యాప్లు, శిక్షణ, వివరాల నమోదు వంటివాటితో వీరంతా విసిగిపోయారు. బోధనేతర పనుల కారణంగా పాఠాల బోధన మొక్కుబడిగా సాగు తోంది. దీంతో విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు తగ్గుతాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 9 వేల మందికిపైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరంతా విద్యార్థుల ఉన్నతికి ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కృషి చేశారు. అయితే కొంతకాలంగా యాప్లు, ఇతర పనుల కారణంగా తరగతులపై శ్రద్ధ చూపే సమయం తక్కువగా ఉంటోంది. పెరుగుతున్న ఒత్తిడి పీ 4లో భాగంగా ఉపాధ్యాయులు పిల్లలను దత్తత తీసుకోవాలంటూ ప్రభుత్వం ఇతర జిల్లాలతో పాటుగా ఉమ్మడి కృష్ణాలోనూ ఉత్తర్వులు జారీ చేసేందుకు సమాయత్తమవుతోందంటూ వారు మండి పడుతున్నారు. ఉపాధ్యాయులను పాఠశాలలకు పరిమితం చేయకుండా ఇలాంటి ఒత్తిడి తీసుకురావటం ఏమిటంటూ గురువులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు! రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పాఠశాల విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పీ 4 పథకంలో భాగంగా పిల్లలను, కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. దాంతో ఆయా స్థానిక జిల్లా అధికారులు ఆ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నామని, స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారిని భాగస్వాములను చేస్తామంటూ వారు ప్రకటన చేయాల్సి వచ్చింది. జిల్లా యంత్రాంగానికి టార్గెట్లు పీ 4 పథకానికి సంబంధించి ప్రతి జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం టార్గెట్లను నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ పాఠశాల విద్యాశాఖాధికారులు దీనిపై దృష్టి సారించారు. ఇక్కడ జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయుల లెక్కలను సైతం తీసి ఉత్తర్వులు ఇవ్వటానికి సమయుత్తమయ్యారు. అయితే కొన్ని జిల్లాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో తాత్కాలికంగా ఉమ్మడి జిల్లాలో వాయిదా వేసినట్లు తెలిసింది. బోధనపై ప్రభావం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ విధమైన నిర్ణయాలతో ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని ఆయా సంఘాల నేతలు చెబుతున్నారు. మొన్నటి వరకూ యోగాంధ్ర అంటూ నెల రోజుల పాటు హడావుడి చేసి ఉపాధ్యాయులను పరుగులు తీయించారని వారు చెబుతున్నారు. అనంతరం మెగా పెరంట్స్ మీట్ అంటూ మరో 20 రోజుల పాటు హడావుడి చేసి తమను కంగారు పెట్టారంటూ ఉపాధ్యాయులు గుర్తు చేసుకుంటున్నారు. గత నెలలో బదిలీల పేరుతో గందరగోళం చేశారని తాజాగా పీ 4 అంటూ ఆందోళనకు గురి చేస్తున్నారంటూ వారు వాపోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో ఉపాధ్యాయులు బోధనకు దూరమవుతున్నారని, విద్యార్థులకు తీవ్రమైన నష్టం కలుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎరువు..కరువు
కంకిపాడు: ఖరీఫ్ సాగు రైతులకు ఎరువు కరువైంది. సొసైటీల్లో ఎరువుల నిల్వలు నిండుకున్నాయి. బయటి మార్కెట్లో వ్యాపారులు సృష్టించిన కృత్రిమ కొరత కారణంగా అన్నదాతలు దోపిడీకి గురవుతున్నారు. అదునుకు వేయాల్సిన ఎరువు దొరక్క పైరు ఎదుగుదల లోపిస్తుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కోటి ఆశలతో చేపట్టిన ఖరీఫ్ సాగు కష్టాలతో సాగుతున్నా, వ్యవసాయశాఖ కాకిలెక్కలతో సరిపెడుతుందే తప్ప ఎరువులను సమృద్ధిగా అందించడం లేదు. అండగా నిలవాల్సిన కూటమి సర్కారు రైతులను అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. సీజన్కు అవసరమైన ఎరువులను అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందగా. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. ఖరీఫ్లో ఎరువుల కొరతను తీర్చాలంటూ రైతు పక్షాన ఆందోళనలు నిర్వహిస్తోంది. ఎరువుల కొరత.. ప్రస్తుతం ఎకరాకు ఒక కట్ట యూరియా, ఒక కట్ట డీఏపీ తప్పనిసరిగా వేయాల్సి ఉంది. పైరు ఎదుగుదలకు దోహదపడే యూరియా ప్రస్తుతం దొరకడం లేదు. 80శాతం సొసైటీల్లో ఎరువులు లేకపోవడంతో వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యూరియా ఎమ్మార్పీ ధర రూ 265.50 ఉండగా, కొందరు వ్యాపారులు రూ. 310 నుంచి రూ.330 వరకూ విక్రయిస్తున్నారు. డీఏపీ ఇతర ఎరువులతోపాటు జింకు, గుళికలను అంటగడుతున్నారు. అవి కొంటేనే డీఏపీ ఇస్తామంటూ రైతులను అందినకాడికి దోచేస్తున్నారు. యూరియా కొరత కారణంగా డీఏపీ రూ.1350 చొప్పున కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. పట్టించుకోని అధికారులు... జిల్లావ్యాప్తంగా ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతుంటే వ్యవసాయశాఖ అధికారులు మాత్రం తాపీగా ఎరువుల లభ్యతపై కాకిలెక్కలు చెబుతున్నారు. రైతులకు సరిపడా యూరియాను అందించడంలో విఫలమయ్యారు. మొక్కుబడిగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ఉయ్యూరులో విజిలెన్స్ తనిఖీలు చేపట్టగానే, వ్యాపారులు దుకాణాలు మూసివేశారంటే బహిరంగ మార్కెట్లో ఎరువుల గోల్మాల్ ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. కోఆపరేటివ్ సొసైటీల్లో 78 టన్నులు, హబ్లలో 0.24 టన్నులు, ఔట్లెట్లలో 534 టన్నులు, పీఏసీఎస్లలో 3807 టన్నులు, రిటైలర్స్ వద్ద 3191 టన్నులు, ఇతరుల వద్ద కలిపి జిల్లాలో మొత్తం 7,696 టన్నుల ఎరువుల లభ్యత ఉన్నట్లు అధికారులు చెబుతుండగా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. నిర్లక్ష్యం వీడని పాలకులు.. కూటమి సర్కారు రైతు విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సాగునీరు విడుదల, విత్తనాల సరఫరాలోనూ వైఫల్యం చెందింది. తాజాగా ఎరువుల లభ్యతలోనూ అలసత్వం కనబరుస్తుండటం రైతుల పాలిటశాపంగా మారింది. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే ఖరీఫ్ సాగు కష్ట మేననే రైతులు అభిప్రాయపడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వహయాంలో రైతుభరోసా కేంద్రాలు, సొసైటీల ద్వారా సకాలంలో ఎరువులు అందించడంతోపాటు పెట్టుబడిసాయాన్ని సైతం అందించిన వైనాన్ని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రభుత్వ పతనం తప్పుదు : కై లే వైఎస్సార్ సీపీ పోరుబాట.. అల్లాడుతున్న రైతులు సొసైటీల్లో నిండుకున్న ఎరువుల నిల్వలు మార్కెట్లో అన్నదాతల జేబులకు చిల్లు ఎరువుల లభ్యతపై వ్యవసాయశాఖ కాకి లెక్కలు నిర్లక్ష్యంగా కూటమి సర్కారు రైతుపక్షాన పోరుబాటలో వైఎస్సార్ సీపీ ఎరువుల కొరతతో అల్లాడుతున్న రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేపట్టింది. ఎరువులు సమృద్ధిగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ నేతృత్వంలో నియోజకవర్గవ్యాప్తంగా రైతుల పక్షాన ఆందోళనలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయ అధికారులకు వినతులు అందించి సమస్యను వివరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ సమాయత్తం అవుతోంది. పెదపారుపూడి: ఖరీఫ్ సీజన్లో ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వానికి పోయేరోజులు దగ్గరలోనే ఉన్నాయని పామర్రు మాజీఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ఆయన పెదపారుపూడి వైఎస్సార్ సీపీ మండల నాయకులతో కలసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీను నాయక్కు వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు అన్నిరకాల ఎరువుల అందించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాకా ఎరువుల కృతిమ కొరత సృష్టించి, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులు యూరియా క్లాంపెక్స్ అడుగుతుంటే షాపుల యజమానులు గుళికలు, జింక్నకు లింకు పెట్టి అమ్ముతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులకు ఎరువులు అందుబాటులోకి వచ్చేవరకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని వివరించారు. దోచేస్తున్నారు.. సొసైటీల్లో ఎరువులు లేవు. వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. యూరియా ధర రూ.265 ఉంటే, రూ.310 నుంచి రూ.330 వరకూ అమ్ముతున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఎరువులు దక్కడం లేదు. అధికారులు దృష్టిసారించి రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా తగినచర్యలు తీసుకోవాలి. పి.దుర్గారావు, కౌలురైతు, మద్దూరు ఒక్క బస్తా కూడా దొరకలేదు... నేను నాలుగు ఎకరాల్లో వరిసాగు చేశాను. ప్రస్తుతం యూరియా, డీఏపీ వేయాలి. సొసైటీలు చుట్టూ తిరిగా యూరియా లేదు. బయటి మార్కెట్లో డీఏపీ అడిగితే జింకు, గుళికలు అంటగట్టారు. చేసేది లేక అవి కూడా కొని డీఏపీ వేసి సరిపెట్టా. యూరియా కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. వి.జాన్మోజేస్, రైతు, జగన్నాథపురం -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యా అవార్డుకు జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ ఐదో తేదీ రాష్ట్ర పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆ క్రమంలో జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, పదేళ్లు సర్వీసు పూర్తి చేసిన ఉపాధ్యాయులు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చచని సూచించారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాల ఉప తనిఖీ అధికారి, ఉర్దూ రేంజ్ అధికారులు తమ పరిధిలోని ఉపాధ్యాయులకు సంబంధించిన దరఖాస్తులను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ ఆదేశాల ప్రకారం ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత తనిఖీ అధికారుల సిఫారసులు లేని దరఖాస్తులను స్వీకరించరని పేర్కొన్నారు. సంబంధిత దరఖాస్తు నమూనాను ఆయా అధికారులు కార్యాలయాల నుంచి పొందవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య హనుమాన్జంక్షన్ రూరల్: తల్లిదండ్రులు మందలించారనే కోపంతో తొమ్మిదో తరగతి విద్యార్థి పురుగుల మందు సేవించి అత్మహత్యకు పాల్పడ్డాడు.బాపులపాడు మండలం బండారుగూడెంకు చెందిన అలుగుల సుశాంత్ (14) తేలప్రోలులోని జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి. తరచుగా పాఠశాలకు వెళ్లకపోవడం, చదువును అశ్రద్ధ చేయటంతో తల్లిదండ్రులు సుశాంత్ను ఈ నెల 21వ తేదీ మందలించారు. హాస్టల్లో చేర్పిస్తామని హెచ్చరించారు. తీవ్ర మనస్తాపం చెందిన సుశాంత్ ఇంటి ఆవరణలో గడ్డివామి వద్ద భద్రపర్చిన పురుగుల మందు డబ్బా తీసుకుని సేవించారు. తండ్రి జోజిబాబు సుశాంత్ను చిన్నవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘సెర్ప్’తో మహిళా సాధికారత
భవానీపురం(విజయవాడపశ్చిమ): సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్)తో చేపడుతున్న కార్యక్రమాలు మహిళల జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు మహిళా సాధికారతకు దోహదం చేస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఒక హోటల్లో సెర్ప్ ఆధ్వర్యాన మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యవసాయ ఆధారిత జీవనోపాధుల శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ 4లో భాగస్వాములై మహిళా పారిశ్రామికవేత్తలు బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు కావాలని ఆకాంక్షించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థతో ఇప్పటికే ఎగ్జిబిషన్లు, వర్క్ షాపులు, ప్రత్యేక ఇగ్నేట్ సెల్ ద్వారా ప్రతి మహిళను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి నిర్వహిస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. జాతీయ ఉపాధి హామీ, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల ద్వారా అమలవుతున్న పథకాలతోపాటు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీ ఎఫ్పీఎస్), ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎం ఎఫ్ఎంఇ) పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ వర్చువల్గా హాజరై దశ దిశా నిర్దేశం చేశారు. శిక్షణకు అన్ని జిల్లాల ఏపీఎం, డీపీఎం లైవ్లీహుడ్స్ వచ్చారు. కార్యక్రమంలో డీఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వీ నాంచారరావు, సెర్ప్ అసిస్టెంట్ డైరెక్టర్ మహిత, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
రైతుల సమక్షంలోనే రీసర్వే
జేసీ ఇలక్కియ జి.కొండూరు: భూములు రీసర్వే సమాచారాన్ని ముందుగానే తెలియజేసి, సర్వేకు సంబంధిత రైతు తప్పక హాజరయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఆదేశించారు. భూముల రీ సర్వేలో భాగంగా జి.కొండూరు మండల పరిధి చెవుటూరు, వెంకటాపురం గ్రామాల మధ్య గ్రామసరిహద్దులను శుక్రవారం ఆమె పరిశీలించారు. రీ సర్వే సమర్ధవంతంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జి.కొండూరు శివారులో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను పరిశీలించారు. జేసీ వెంట తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు ఉన్నారు. నిత్యాన్నదానానికి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శుక్రవారం పలువురు దాతలు విరాళాలను అందజేశారు. రాజమండ్రికి చెందిన ఎం.ప్రేమ్కుమార్ ఆలయ అధికారులను కలిసి రూ.1,00,116ల విరాళాన్ని అందజేశారు. విజయవాడ పటమటకు చెందిన ఎం.వెంకటలక్ష్మి పేరిట కుమారుడు శ్రీనివాస్, లలిత దంపతులు నిత్యాన్నదానానికి రూ. 1,00,116ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు, దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. సీనియర్ డీసీఎంగా ప్రశాంత్కుమార్ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం (డివిజనల్ కమర్షియల్ మేనేజర్)గా బి.ప్రశాంత్కుమార్ శక్రవారం బాధతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు విజయవాడ డివిజన్లోనే సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించడంతో ఆస్థానంలో ప్రశాంత్కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఐవీఎఫ్ సెంటర్ తనిఖీ లబ్బీపేట(విజయవాడతూర్పు): సంతాన సాఫల్య కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి వైద్యసేవలు అందిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని హెచ్చరించారు. ఆమె శుక్రవారం నగరంలోని ఒయాసిస్ ఐవీఎఫ్ సెంటర్ను ఆకస్మిక తనిఖీ చేశారు. సెంటర్లోని రికార్డులు, రిజిస్టర్లు, అనుమతులు, పరికరాలను పరిశీలించారు. ఈసందర్భంగా డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలు పాటించని ఐవీఎఫ్ కేంద్రాలు, ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు. తొలుత షోకాజ్ నోటీసు జారీచేసి, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ఏఆర్టీ సెంటర్లు, ఆస్పత్రులు తప్పనిసరిగా విధి విధానాలు పాటించాలని ఆమె సూచించారు. తనిఖీల్లో ఎన్హెచ్ఎం డీపీఎం డాక్టర్ నవీన్ కూడా పాల్గొన్నారు. మొసళ్లున్నాయ్ జాగ్రత్త! కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో భయంకరమైన మొసళ్లు ఉన్నాయ్, నదిలోకి దిగి ప్రాణాలు పోగొట్టుకోవద్దని శనైశ్వర స్వామి దేవస్థానం వద్ద కృష్ణలంక పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ప్రవాహంలో వచ్చిన మొసళ్లు ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదిలో తిరుగుతున్నాయని, ఇప్పటికే ఈ ప్రాంతంలో సరదాగా ఈతకు దిగి పలువురు యువకులు మృతి చెందారంటూ ఫొటోలతో కూడిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. -
ఎడ్లంకకు నిలిచిన రాకపోకలు
అవనిగడ్డ: కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. పులిగడ్డ అక్విడెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద తాకిడికి ఎడ్లంక కాస్వే రహదారికి గండిపడింది.దీంతో ఎడ్లంక ప్రజలకు పడవ ప్రయాణమే దిక్కయింది. పడవ ఎక్కిదిగే క్రమంలో వృద్ధులు, విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడ్లంక వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇన్చార్జి ఆర్డీవో బి.శ్రీదేవి, డీఎస్పీ విద్యశ్రీ, తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, సీఐ యువకుమార్, ఆర్ఐ బాలాజీ, ఎస్ఐ శ్రీనివాస్ ఎడ్లంకను సందర్శించారు. వరద ఉధృతి పెరిగితే ఇళ్లను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025u8లో కూటమి ప్రభుత్వం మిథున్రెడ్డిని వేధిస్తోంది దుర్గమ్మ నమోస్తుతేఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శ్రావణ శుక్రవారం సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. జిల్లా మహాసభలు సీపీఐ ద్వితీయ జిల్లా మహాసభలు జగ్గయ్య పేటలో శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో పాల్గొన్నారు.తగ్గుముఖం పట్టిన వరద గాంధీనగర్: ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టింది. 89,625 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు. కాలువలకు 17, 576 క్యూసెక్కులు విడుదల చేశారు. మాజీ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి 7న్యూస్రీల్ -
చంద్రబాబు రైతులకు ఏం చేశాడు
జగ్గయ్యపేట అర్బన్: చంద్రబాబు ఎన్నికలపుడు రైతులకు రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇప్పుడు ఏడాది తర్వాత ప్రధాని నరేంద్రమోదీ రూ.2 వేలు ఇస్తున్నాడు కాబట్టి వాటికి రూ.5 వేలు జమచేసి మొత్తం రూ.7 వేలు రైతులకు ఇస్తామంటున్నాడని, ఇదేనా మీరు ఆదుకునేది అని రామకృష్ణ ప్రశ్నించారు. సీపీఐ ద్వితీయ జిల్లా మహాసభలు శుక్రవారం జగ్గయ్యపేట పట్టణంలో ఆర్టీసీ డిపో సెంటర్లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. నేతలు బలుసుపాడు సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ అని గర్వంగా చెప్పుకుంటున్నారని, దీంతో ఒరిగింది ఏంటని ప్రశ్నించారు. ట్రంప్ అంటేనే మోదీకి వణుకు నరేంద్రమోదీ అమెరికాకు లొంగిపోయాడని ట్రంప్ అంటేనే వణుకన్నారు. వంద ఏళ్ల చరిత్ర కలిగిన సీపీఐ ఎన్నో ప్రజా ఉద్యమాల్లో అగ్రభాగాన నిలబడిందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ -
అంతా మంత్రి ‘కొల్లు’ డైరెక్షన్లోనే
మాజీమంత్రి పేర్ని నాని చిలకలపూడి(మచిలీపట్నం): ఓ టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమవ్యవహారం తదనంతర ఘటనలన్నీ మంత్రి కొల్లు రవీంద్ర డైరెక్షన్లోనే చోటుచేసుకున్నాయని మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. మచిలీపట్నంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీ పార్టీలోని నాయకుని కుటుంబ వ్యవహారాలు, గొడవలను చివరికి మాకు ఆపాదించడమేమిటన్నారు. మీ పార్టీ, కుటుంబవ్యవహారాల్లో జరిగిన గొడవలకు మాకేమి సంబంధమని మంత్రి కొల్లు రవీంద్రను ప్రశ్నించారు. టీడీపీ నాయకుడి కుమారుడు ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి తీసుకువెళ్లిన ఘటనతో మాకు సంబంధం ఎలా ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రేమికులను తీసుకువచ్చేందుకు పోలీసులు ఒడిశా వెళ్లడం నిజం కాదా? ప్రశ్నించారు. హైదరాబాద్ ఎందుకు తీసుకువెళ్లారు... టీడీపీ నాయకుడి కుమారుడు, ఆ యువతి ఒడిశాలో దొరికిన అనంతరం వారిని మచిలీపట్నం పోలీస్స్టేషన్కు తీసుకురాకుండా భువనేశ్వర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎందుకు తీసుకువెళ్లారో విచారణ చేపట్టాలని నాని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వీరితో ఎయిర్పోర్టు ఎదురుగా ఉన్న నోవాటెల్లో మంత్రి కొల్లు రవీంద్ర ఏమి కౌన్సెలింగ్ ఇచ్చారు? ఆ యవతికి ఏం చెప్పారు? యువతి తండ్రితో ఏం మాట్లాడారో పోలీసులు విచారణ చేస్తే తేటతెల్లమవుతుందన్నారు. వీటితోపాటు ఒడిశా వెళ్లేందుకు అభినవ్కు ఫోన్ పే ద్వారా డబ్బులు ఎవరు పంపించారు...భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ ఎంత మంది వెళ్లారు...విమాన టికెట్లు ఎవరు కొన్నారు...హైదరాబాద్ నుంచి మచిలీప ట్నంకు ఎవరు మాట్లాడితే వారిని కారులో తీసుకువచ్చారో విచారణ చేస్తే పోలీసులు ఏవిధంగా ప్రవర్తించారో ఇట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో చిలకలపూడి సీఐ నబీతోపాటు కానిస్టేబుల్ మల్లి తీరుపై డీఎస్పీ చప్పిడి రాజా, ఎస్పీ గంగాధరరావు పూర్తిస్థాయి విచారణ చేస్తే నిజాలు నిగ్గుతేలతాయన్నారు. ఈ వ్యవహారమంతా మంత్రి కొల్లు రవీంద్ర డైరక్షన్, పోలీసుల ప్రమేయంతోనే సాగిందని ఆరోపించారు. కాల్ డేటాతో వెలికితీయాలి.. యువతి తల్లి తాగిన పురుగుమందు సీసా ఎక్కడ కొన్నారు, ఎవరు తెచ్చారో విచారణ చేస్తే నిజాలు తెలుస్తాయని పేర్ని నాని అన్నారు. ఓ కుటుంబానికి అన్యాయం జరిగితే నా కుమారుడు వెళ్లి ఆసుపత్రిలో వారిని పరామర్శించడం తప్పా? అని ప్రశ్నించారు. ఓ మహిళకు అన్యాయం జరిగితే పరామర్శించిన మాపార్టీ మహిళా అధ్యక్షురాలిపై విమర్శలు చేయడం టీడీపీ వారి అనైతికతకు నిదర్శనమన్నారు. యువతి తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి రాజీ చేసుకోవడం కోసం అప్సర హోటల్, ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో కొంతమంది టీడీపీ కాపు పెద్దలు యత్నించడం, గొడవలుపడటం జరగలేదా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో చిలకలపూడి సీఐ నబీ కాల్ డేటా, కానిస్టేబుల్ మల్లి చేసిన వ్యవహారంపై పోలీసులు సమగ్ర విచారణ జరిపితే ఎవరి డైరక్షన్లో...ఎవరి కోసం ఈతతంగమంతా చేశారో తెలిసిపోతుందన్నారు. దిగజారుడు రాజకీయాలతో యువతిని బలిచేయకుండా మనిషిగా ప్రవర్తించి వారిద్దరికీ వివాహం జరిపించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. సమావేశంలో మునిసిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్దాదా, నగర పార్టీ అధ్యక్షులు మేకల సుబ్బన్న, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. -
నదిలో చిక్కుకున్న వ్యక్తిని ఒడ్డుకు చేర్చిన ఎస్డీఆర్ఎఫ్ బృందం
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో చిక్కుకుని కేకలు వేస్తున్న ఓ వ్యక్తిని ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడి ఒడ్డుకు చేర్చిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిఽధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నున్నకు చెందిన అంకా సెల్వరాజ్ బుధవారం రాత్రి కృష్ణానదిలోకి వెళ్లి వారధి 42వ పిల్లర్ వద్ద ఇసుక తిన్నెల్లో పడుకుని నిద్రపోయాడు. గురువారం ఉదయం లేచి చూడగా అతని చుట్టూ వరద నీరు చేరుతుండడంతో భయంతో కేకలు పెట్టాడు. వారధి పైన వెళ్తున్న ప్రయాణికులు కేకలు విని అతనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కృష్ణలంక పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని పడవ ద్వారా అతని వద్దకు చేరుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అతని వివరాలను సేకరించిన పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిగా నిర్ధారించారు. -
వరద ప్రవాహంపై అప్రమత్తంగా ఉండాలి
ఇబ్రహీంపట్నం: ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి పెరుగుతున్న వరద ప్రవాహంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. మండలంలోని చినలంక, పెద్దలంక, ఫెర్రీ తదితర ప్రాంతాలను ఆయన గురువారం సందర్శించారు. చినలంక వద్ద అర కిలోమీటర్ దూరంలో నాలుగు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వరదనీటిని పరిశీలించారు. వరద నీటితో కలిగిన ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పులిచింతల నుంచి వరద నీరు నిలకడగా వస్తోందన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ పైకిఎత్తి నీటిని కిందకు విడుదలచేస్తూ లోతట్టు ప్రాంతాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామన్నారు. బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇచ్చామని వివరించారు. గురువారం సాయంత్రం నాటికి వరద ఉధృతి మూడు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉన్నందున కృష్ణానది పరీవాహక ప్రాంతాల ప్రజలు వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. చేపల వేటకు వెళ్లడం, పశువులు, జీవాలు వదలడం చేయొద్దని సూచించారు. వరదకు సంబంధించి ఫిర్యాదుల కోసం కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. అవసరమైతే ట్రక్ టెర్మినల్ల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వరద పరిస్థితిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆర్డీఓ చైతన్య, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, మునిసిపల్ కమిషనర్ రమ్య కీర్తన తదితరులు పాల్గొన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి వరద పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ జరపాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ పోలీసింగ్ బలోపేతం
లబ్బీపేట(విజయవాడతూర్పు):టెక్నాలజీ ఆధారిత ట్రాఫిక్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసేలా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్న కార్యాచరణతో ముందుకెళ్తున్నారని రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా కొనియాడారు. పోలీస్ కమిషనరేట్లో గురువారం ట్రాఫిక్ పోలీసులకు డ్రోన్లు, 40 ట్రాఫిక్ పెట్రోలింగ్ బైకులను డీజీపీ హరీష్కుమార్ గుప్తా అందజేశారు. పెట్రోలింగ్ బైక్లను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగపడతాయన్నారు. విజయవాడ సిటీలో ట్రాఫిక్, నేరాలను నియంత్రించడంలో సీపీ రాజశేఖరబాబు పని తీరు బాగుందన్నారు. అస్త్రం టూల్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. డ్రోన్ల వినియో గంలో ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. విజయవాడలో ట్రాఫిక్ నియంత్రణ, హెల్మెట్ వినియోగం, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండేందుకు చర్యలు, నిర్వహించిన అవగాహన కార్యక్రమాలను సీపీ ఎస్.వి.రాజశేఖరబాబు వివరించారు. డ్రోన్లు, ట్రాఫిక్ పరికరాలను సమకూర్చేందుకు దాతలు ముందుకొచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ ఎ.వి.ఎల్.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధిక శబ్దాలను వెలువరించే బైక్ సైలెన్సర్లను ధ్వంసం చేశారు. రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా -
నేటి నుంచి నెఫ్రాలజిస్టుల సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన అత్యాధునిక వైద్య చికిత్సలపై చర్చించేందుకు నగరంలో మూడు రోజుల పాటు సదస్సు నిర్వహించనున్నారు. ఇండియన్ నెఫ్రాలజీ సొసైటీ సదరన్ చాప్టర్ 44వ వార్షిక సదస్సు విజయవాడ లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు నెఫ్రాలజిస్టు డాక్టర్ నలమాటి అమ్మన్న తెలిపారు. సూర్యారావుపేటలోని తమ ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అమ్మన్న మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం జరిగే ప్రారంభోత్సవ వేడుకలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ డి.శ్రీహరిరావు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు. అత్యాధునిక నెఫ్రాలజీ చికిత్సలు, ఆధునిక ఔషధాలు, నవీన ఆవిష్కరణల గురించి చర్చించేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. నెఫ్రాలజీ వైద్య విభాగానికి సంబంధించి విజ్ఞాన సర్వస్వంగా ఈ సదస్సుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రాధిక, డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. -
రైల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేసి వారి నుంచి 30 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి రమణ తెలిపిన వివరాల ప్రకారం జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా గురువారం విజయవాడ రైల్వే స్టేషన్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా విశాఖపట్నం నుంచి ముంబై వెళుతున్న ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బీ4 కోచ్లోని 41, 44 బెర్త్లలో ప్రయాణం చేస్తున్న ముంబైకి చెందిన అంధురాలు జయ ఆలీముల్లా సర్దార్, లక్ష్మీ శంకర్ నాటేకర్ అనే ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద ఉన్న రెండు బ్యాగులను సోదా చేయగా అందులో 15 బండిల్స్లో ప్యాక్ చేసిన మొత్తం 30 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ తనిఖీల్లో ఆర్పీఎఫ్ సీఐ ఫతే ఆలీబేగ్, ఎస్ఐ మకత్లాల్, జీఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు. 30 కిలోల గంజాయి స్వాధీనం -
నిబంధనలకు తూట్లు.. జేబుల్లోకి రూ. కోట్లు!
ఉయ్యూరు: ఉయ్యూరు అక్రమార్కులకు అడ్డాగా మారింది. అనధికార లే అవుట్లకు ల్యాండ్ మార్కు అయ్యింది. సామాజిక స్థలాలకు రెక్కలొచ్చాయి. కొందరు పచ్చ చొక్కా నేతల అండదండలతో చట్టంలో ఉన్న లొసుగులను సాకుగా చూపుతూ అక్రమ లే అవుట్లతో రూ.కోట్లు లూటీ చేస్తున్నారు. అమరావతి, ఔటర్ రింగ్ రోడ్డు ఆశ చూపి పేద, మధ్య తరగతి వర్గాలను నిట్టనిలువునా దోచేస్తున్నారు. ఉయ్యూరు, గండిగుంట కేంద్రాలుగా సాగుతున్న రియల్ దందాలో రూ. 50కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన ప్రజాధనం రియల్టర్లు, పచ్చనేతల జేబుల్లోకి మళ్లింది. అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగి తేలుతుండటంతో ఇక్కడ అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు.. ఉయ్యూరు మునిసిపాలిటీ, గండిగుంట, చిన ఓగిరాల, ఆకునూరు, పెద ఓగిరాల, కడవకొల్లు, కా టూరు గ్రామాల్లో విచ్చలవిడిగా లే అవుట్లు వెలిశాయి. కొందరు సీఆర్డీఏ అనుమతులు తీసుకుని వెంచర్లు వేస్తుంటే.. మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా అనధికార లే అవుట్లను ఇష్టానుసారంగా వేస్తున్నారు. వ్యవసాయ భూములకు నాలా చెల్లించి ఆ వెంటనే లే అవుట్గా మార్చి స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. సెంటు రూ. 5లక్షల నుంచి రూ. 7లక్షల వరకూ ధర నిర్ణయించి మాయమాటలతో అమ్మేస్తున్నారు. ఉయ్యూరు, గండిగుంట పరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఇదే తంతు కొనసాగుతోంది. పచ్చచొక్కా నేతలు, అధికారులకు దండిగా కాసుల వర్షం కురిపిస్తుండటంతో అడిగే నాథుడే లేకుండా పోయాడు. ఇటీవలి కాలంలో 50 ఎకరాలకు పైగా అనధికార లేఅవుట్లు వెలిసినట్లు సమాచారం. మొక్కుబడి చర్యలతో సరి.. సీఆర్డీఏ నిబంధనలు ఉల్లంఘించి అనధికార లేఅవుట్ వేస్తే సీఆర్డీఏ చట్టం 114(2) ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. క్షేత్రస్థాయిలో ఆయా పంచాయతీ కార్యదర్శులు, మునిసిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమన్వయం చేసుకుని సీఆర్డీఏ టీపీఓ, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు అనధికార లేఅవుట్లపై ఉక్కుపాదం మోపాలి. వాస్తవంగా ఎక్కడా అలాంటి చర్యలు కానరావడం లేదు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే మొక్కుబకడిగా నోటీసులు ఇచ్చి నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. అనధికార వెంచర్లకు సంబంధించి సీఆర్డీఏ, ప్రభుత్వం నుంచి ఉయ్యూరు మునిసిపల్ కార్యాలయానికి లేఖలు అందినా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ‘పది శాతం’ నిబంధన కనుమరుగు..ప్రజాప్రతినిధులు, సీఆర్డీఏ, టౌన్ప్లానింగ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల ఉదాసీనత వైఖరి కారణంగా సామాజిక స్థలాలు కనుమరుగవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఎకరం విస్తీర్ణంలో లే అవుట్ వేసి స్థలం విక్రయించాలంటే పది శాతం భూమిని సామాజిక స్థలంగా మునిసిపాలిటీ, పంచాయతీలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. అనధికార వెంచర్ల ఫలితంగా ఒక్క సెంటు భూమి కూడా సామాజిక అవసరాలకు దక్కకుండా పోతోంది. ఉయ్యూరు, కాటూరు రోడ్డులోని సుమారు 17 ఎకరాల్లో లే అవుట్ నిర్మిస్తే ప్రజా సామాజిక అవసరాలకు 1.70ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉంది. ఇవేవీ ఇవ్వకుండానే లే అవుట్ను సక్రమం చేసే పనిలో అధికారులు తలమునకలయ్యారు. ఆ భూమి మొత్తం రోడ్డు, ప్రహరీలు నిర్మించి సెంటు భూమి రూ. 20 లక్షల చొప్పున యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రూ. కోట్లలో సొమ్ము చేతులు మారుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు 1.70 ఎకరాల భూమి సామాజిక స్థలంగా కేటాయించాల్సి ఉంది. దాని భూమి ధర మార్కెట్లో రూ. 34కోట్లుగా ఉంది. మునిసిపాలిటీ పరిధిలో 1, 2, 3, 4, వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో అనధికార వెంచర్లు ఏర్పాటు చేశారు. ఉయ్యూరు, గండిగుంట సమీపంలో సరిహద్దుగా గల టీటీడీ సమీపంలో, ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా నాన్ లేఅవుట్లు వెలిశాయి. ఈ లేఅవుట్లలోనూ సామాజిక స్థలం పత్తా లేకుండా పోయింది. ‘పచ్చ’ నేతల అండతో ఇష్టారాజ్యంగా అక్రమ లే అవుట్లు వ్యవసాయ భూముల్లో విచ్చలవిడిగా లే అవుట్లు ఆయా ప్లాట్లలో సామాజిక స్థలం హాంఫట్ పచ్చ చొక్కా నేతల అండతో రియల్టర్ల దందా రూ. 50కోట్లకు పైగా సొమ్ము లూటీ మామూళ్ల మత్తులో యంత్రాంగం -
గంజాయి ముఠా అరెస్టు
ఉయ్యూరు: గంజాయి ముఠాను ఉయ్యూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ టీవీవీ రామారావు తెలిపిన కథనం మేరకు...ఉయ్యూరు పట్టణంలో గంజాయి విక్రయాల సమాచారం అందుకున్న పోలీసులు సీఐ రామారావు ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో తొమ్మిది మంది గంజాయి విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2.50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న పొదిలపు జగదీష్కుమార్, కొలసాని వెంకట సాయి, సానక నరేంద్ర, గుడిమెట్ల ప్రవీణ్కుమార్, మిక్కిలి సంజయ్కుమార్, దున్నాల మనోజ్, మహ్మద్ అహ్మద్ బాషా, ఓరుగంటి గోపయ్యస్వామి, సయ్యద్ మునీర్లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. -
బ్యాంకులు భద్రతా ప్రమాణాలు పాటించాలి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం బ్యాంకు అధికారులు బ్యాంకులతో పాటు ఏటీఎంల వద్ద నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు పేర్కొన్నారు. కృష్ణాజిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ బ్యాంక్ల అధికారులతో సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం ఎస్పీ బ్యాంకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశపు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ గార్డుల నియామకం, సురక్షిత నగదు రవాణా, ఆన్లైన్ మోసాల నివారణ, సైబర్ భద్రత వంటి అంశాలపై అధికారులు జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. బ్యాంకుల్లో కొత్తగా నియమించుకునే ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బందికి ముందస్తు పోలీసుల పరిశీలన తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని ఏటీఎంల వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని, వాటి పనితీరును పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టంచేశారు. రాత్రి వేళ ఏటీఎం ప్రాంగణాలు వెలుతురుతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించాలని, అత్యవసర పరిస్థి తుల్లో పోలీసులకు వెంటనే సమాచారం చేరేలా అలారం లేదా లింకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాల డేటా కనీసం 30 రోజులు నిల్వ ఉండేలా జాగ్రత్తలు చూసుకోవాలని స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై ఖాతాదారులకు పూర్తి అవగాహన కలిగించే బాధ్యతను బ్యాంకులు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, డీఎస్పీలు సిహెచ్.రాజా, శ్రీనివాసరావు, ధీరజ్ నీల్, విద్య శ్రీ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు -
దుర్గమ్మకు కానుకగా బంగారపు సూత్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు గురువారం రూ.1.68 లక్షల విలువైన బంగారపు సూత్రాలు, నానుతాడును కానుకగా సమర్పించారు. హైదరాబాద్కు చెందిన దాసరి భారత నరేంద్ర సింహ తన తల్లి రాజేశ్వరి పేరిట అమ్మవారికి 16 గ్రాముల బంగారం, ఎరుపు రంగు రాళ్లుతో తయారు చేయించిన మంగళసూత్రాలు, నానుతాడును ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కనులపండువగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు విజయవాడకల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణమండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న అష్టబంధన, మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలు గురువారం ముగిశాయి. వైఖానస ఆగమ సంప్రదాయంలో మహా పూర్ణాహుతి, పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రవేశం, కుంభాబింబ సమారోహణం కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. సంప్రోక్షణ కార్యక్రమాన్ని కంకణభట్టార్ మురళీకృష్ణ అయ్యంగార్, టీటీడీ ఆస్థాన ఆగమశాస్త్ర పండితులు, అర్చక స్వాములు వేదాంతం వెంకట శశికిరణ్ నిర్వహించారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ లలితా రమాదేవి, భావన్నారాయణా చార్యులు, సూపరింటెండెంట్ మల్లికార్జునరావు, ఇంజినీరింగ్ అధికారులు నాగభూషణం, సురేంద్రనాథ్ రెడ్డి, జగన్మోహన్ పాల్గొన్నారు. టీటీడీ అధికారులు నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో ఐదువేలమంది పాల్గొన్నారు. ఫొటోగ్రఫీ ఎంట్రీలకు రేపటి వరకు గడువు పొడిగింపు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19) సందర్భంగా విశేష ప్రతిభ కనబరిచిన ఫొటోగ్రాఫర్లకు జిల్లాస్థాయిలో పురస్కారాలు ప్రదానం చేసేందుకు నిర్వహిస్తున్న ఫొటోగ్రఫీ పోటీల ఎంట్రీల గడువును ఫొటోగ్రాఫర్ల విజ్ఞప్తి మేరకు ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫొటోగ్రఫీ పోటీలకు ఎంట్రీల గడువును జూలై 31వ తేదీగా నిర్ధారించామని, ఫొటోగ్రాఫర్లు మరో రెండు రోజులు గడువుకావాలని విజ్ఞప్తి చేసిన దరిమిలా ఆగస్టు 2వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. -
విశ్రాంత ఉద్యోగుల జీవన రాజధాని విజయవాడ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ ఉద్యోగుల విశ్రాంత జీవితం అధికంగా విజయవాడతోనే ముడిపడి వుంటుందని సెంట్రల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ అతీరా ఎస్.కుమార్ అన్నారు. ఆటోనగర్ లోని ఒక ఫంక్షన్ హాలులో గురువారం జీఎస్టీ సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ సభ జరిగింది. ఈ సందర్భంగా అతీరా ఎస్.కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ జీవితంలో ఎన్ని ప్రాంతాలు మారినా, చివరకు విశ్రాంత ఉద్యోగిగా విజయవాడలోనే అధికంగా స్థిరపడుతున్నారన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల నివాస కేంద్రంగా విజయవాడ మారిందన్నారు. సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తన ఉద్యోగ జీవితంలో శాఖ అభివృద్ధికి అమూల్యమైన సేవలు అందించారని కొనియాడారు. అనంతరం శ్రీనివాసరావును అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. సెంట్రల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ అతీరా ఎస్.కుమార్ -
దమ్ముంటే పట్టుకోండి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. రెక్కీ నిర్వహించి మరీ చోరీలు చేస్తున్నారు. ఘటనాస్థలంలో ఆధారాలు దొరక్కుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వరుస దొంగతనాలతో ప్రజలు భయపడుతున్నారు. శుభకార్యాలకు బంగారు నగలు ధరించాలంటే వణికిపోతున్నారు. విజయవాడలో వరుస చోరీలకు అడ్డుకట్ట వేసి, దొంగల భరతం పట్టడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. పోలీసుల నిఘా కొరవడంతోనే దొంగలు రెచ్చిపోతున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇటీవల ఒకే ప్రాంతానికి చెందిన 35 మందికి పైగా దొంగలు రాష్ట్రానికి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురు, నలుగురు ఒక బృందంగా విడిపోయిన దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారని, రైల్వే లైన్ వెంబడి ప్రాంతాలను ఎంచుకొని, దొంగతనం చేసిన వెంటనే మరో ప్రాంతానికి చెక్కేస్తున్నారని పోలీసులు గుర్తించారని సమాచారం. కిటికీ గ్రిల్స్ తొలగించి.. విజయవాడలోని గుణదల గేటేడ్ కమ్యూనిటీలో జూలై ఐదో తేదీన చోరీ జరిగింది. చోరీ చేసింది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ధార్ ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో చోరీ చేసే విధానం, శారీక దారుఢ్యం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ముగ్గురు సభ్యుల ముఠా రైళ్లలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలోని ప్రాంతాలను ఎంచుకొని చోరీలకు తెగబడుతోంది. ఈ ముఠా ఇటీవల ఒకే రోజు పోలీసు కమిషనరేట్ పరిధిలోని గుణదల, గుంటుపల్లి, గొల్లపూడి ప్రాంతాల్లో పట్టపగలే వరుస చోరీలకు పాల్పడింది. రూ.12.98 లక్షల విలువైన ఆభరణాలు, నగదు చోరీ చేసింది. ఈ చోరీలన్నీ ప్రధాన ద్వారం గుండా కాకుండా హాలు, వాష్రూం ఇనుప గ్రిల్స్ను తొలగించి దొంగలు ఇళ్లలోకి ప్రవేశించి చేసినవే. అప్పటి నుంచి ఇప్పటి వరకు దొంగల ఆనవాళ్లను పోలీసులు గుర్తించలేదు. పెనుగంచిప్రోలులో జూలై 28వ తేదీన గ్రామానికి చెందిన తిరుపతమ్మ అమ్మవారి దేవాలయ మాజీ చైర్మన్ ఇంజం చెన్నకేశవరావు ఇంట్లో రూ.5 లక్షల విలువగల బంగారు ఆభరణాలు, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలోనూ దొంగలు చిక్కలేదు.జైళ్లలో పరిచయాలు వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితులను రిమాండ్కు తరలించినప్పుడు జైళ్లలో తోటి దొంగలతో పరిచయాలు పెంచుకొని గ్రూపులుగా మారుతున్నారు. శిక్ష పూర్తయిన తరువాత బయటకు వచ్చి ఆ గ్రూపుల్లో సభ్యులంతా ఏకకాలంలో వేర్వేరు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే ఇటీవల వెలుగు చూసింది. ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన చందర్లపాడు మండలంలోని లక్ష్మీపురం, కాండ్రపాడు, లింగాలపాడు గ్రామాల్లో ఒకేరోజు ఆరు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలు, నగదును దోచుకున్నారు.ఎన్టీఆర్ జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు పగలు రెక్కీ.. రాత్రివేళ ఇళ్లలో చోరీలు మహిళలే టార్గెట్గా చైన్ స్నాచింగ్లు టెక్నాలజీకి కూడా చిక్కకుండా చోరీలకు పాల్పడుతున్న దొంగలు పోలీసుల నిఘా వైఫల్యంతోనే దొంగతనాలని విమర్శలుముందే రెక్కీ దొంగలు చోరీకి ముందే రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. పాడైన వస్తువులను రిపేరు చేస్తామని అపార్ట్మెంట్లలోకి వచ్చి, ఆపై రెక్కీ నిర్వ హించి ఇళ్లను ఎంచుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగల్లో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. కొందరు ప్రేమికులు సైతం తమ ఖర్చులు, విలాసాల కోసం చోరీల బాటపట్టారన్న విమర్శలు ఉన్నాయి. -
స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ నోటిఫికేషన్ను తక్షణమే విడుదల చేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు తక్షణమే స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. నోటిఫికేషన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10వేల మంది ప్రత్యేక బీఈడీ చేసిన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారన్నారు. డీఎస్సీ సిలబస్ను రిలీజ్ చేయాలని కోరారు. ఏపీ కేబినెట్ ఆమోదించిన 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను డైరెక్టుగా డీఎస్సీ ద్వారా నియామకం చేయాలన్నారు. గతంలో మాదిరి డీఎస్సీ నోటిఫికేషన్లో వయో పరిమితి సడలింపు ఇవ్వాలన్నారు. నోటిఫికేషన్ జారీలో నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో డీవైఎఫ్ఐ ప్రతినిధులు, ప్రత్యేక బీఈడీ అభ్యర్థులు పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డిమాండ్ -
సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: లిక్కర్ స్కామ్కు చెందిందిగా చెబుతూ సిట్ సీజ్ చేసిన రూ.11 కోట్లపై ఏసీబీ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్(తెలంగాణ)లోని ఓ ఫామ్హౌజ్లో ఈ నగదును స్వాధీనం చేసుకున్నామని, ఇది రాజ్ కేసిరెడ్డిదేనని సిట్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. సీజ్ చేసిన ఆ రూ. 11 కోట్ల నగదును ఫొటోగ్రాఫ్ తీయాలని కోర్టు శుక్రవారం ఆదేశించింది. లిక్కర్ కేసులో ఇవాళ నిందితుల రిమాండ్ ముగియడం.. బెయిల్ పిటిషన్లపై కోర్టు వాదనలు వింది. ఆ సమయంలో.. ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తి ముందు కన్నీటి పర్యంతమైన రాజ్ కేసిరెడ్డి.. ఎక్కడ డబ్బులు దొరికినా అవి లిక్కర్ డబ్బులేనని చూపుతున్నారన్నారు. రూ.11 కోట్లకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.‘‘సిట్ అధికారులు అవి నావేనని అబద్ధం చెప్తున్నారు. 2024 జూన్లో నేను వరుణ్కి ఇచ్చినట్టు చెబుతున్నారు. నేను పుట్టకముందు ఆస్తులను కూడా నా బినామీలుగా చూపిస్తున్నారు. నా వయస్సు 43 ఏళ్లు. 45 ఏళ్ల కిందటి ఫామ్ హౌస్కి నేను బినామీ అని చూపిస్తున్నారు. నేను పుట్టకముందే నాకు బినామీ ఆస్తులుంటాయా..?’’ అంటూ కేసిరెడ్డి ప్రశ్నించారు.‘‘ఆ రూ.11 కోట్లు నేనే నా చేత్తో ఇచ్చానని చెబుతున్నారు. ఆ డబ్బులపైనా వేలిముద్రలు చెక్ చేయాలని కోరుతున్నాను. 2024 జూన్లో ఆ డబ్బు వరుణ్కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముందించిందో తనిఖీ చేయాలి. ఆ నోట్లపై నంబర్లు రికార్డ్ చేయాలని కోరుతున్నాను. ఏళ్ల కిందట వారసత్వంగా వచ్చిన ఆస్తులను అటాచ్ చేశారు. వారసత్వ ఆస్తులను కూడా లిక్కర్ డబ్బులతో కొన్నట్టు చూపిస్తున్నారు. నా బెయిల్ అడ్డుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారు’’ అంటూ ఏసీబీ న్యాయమూర్తి ముందు రాజ్ కేసిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తరుణంలోనే ఆ డబ్బులను ఫోటోగ్రాఫ్ తీయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. -
నేనో సిట్టింగ్ ఎంపీని.. జడ్జి ఎదుట మిథున్రెడ్డి రిక్వెస్ట్
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో అరెస్టైన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి.. ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఇవాళ ఓ విన్నపం చేశారు. శుక్రవారం బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా.. ‘‘నేను మూడుసార్లు ఎంపీగా చేశా. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నా. నేను ఎలాంటి స్కాం చేయలేదు. ఇది ఒక అక్రమ కేసు. నేనేం దేశం విడిచి ఎక్కడికీ పారిపోను. నాకు బెయిల్ మంజూరు చేయాలి’’ అని కోరారాయన. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనే అభియోగాల మీద వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నారీయన. జులై 20వ తేదీన సిట్ విచారణకు హాజరైన మిథున్రెడ్డిని.. ఏడుగంటల పాటు అధికారులు విచారించారు. ఆపై రాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆగస్టు 1 దాకా రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేటితో ముగియనుంది.ఇదిలా ఉంటే.. మిథున్రెడ్డి అరెస్ట్ను వైఎస్సార్సీపీ రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. జరగని స్కామ్ జరిగినట్లుగా తప్పుడు ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలతో తమ కీలక నేతలను వేధింపులకు గురి చేస్తోందని కూటమి ప్రభుత్వంపై మండిపడుతోంది. -
న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కంటతడి
సాక్షి, విజయవాడ: తనకు సంబంధం లేకపోయినా రూ.11 కోట్లు తనవేనని సిట్ అధికారులు లింకు పెడుతున్నారంటూ న్యాయమూర్తి ఎదుట రాజ్ కేసిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రూ. 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని ఆయన కోరారు.‘‘నేను 2024 జూన్లో ఆ డబ్బు వరుణ్కి ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ నోట్లు ఆర్బీఐ ఎప్పుడు ముద్రించిందనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని కేసిరెడ్డి కోరారు. ‘‘45 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఫామ్ హౌస్కు బినామీ అంటున్నారు. నా వయసు 43 ఏళ్లు. నేను పుట్టక ముందే వేరే వారికి నేను బినామీ ఎలా అయ్యాను’’ అంటూ కోర్టు ఎదుట కేసిరెడ్డి కంటతడి పెట్టారు. -
మీ ఇంటి ఆడపిల్లకు ఇలాగే న్యాయం చేస్తారా?: వరుదు కల్యాణి
చిలకలపూడి(మచిలీపట్నం): టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేస్తే మంత్రి కొల్లు రవీంద్ర రాజీకి ప్రయత్నించడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీ ఇంటి ఆడపిల్లకు కూడా ఇలాగే న్యాయం చేస్తారా?’ అని మంత్రిని ఆమె ప్రశ్నించారు. మచిలీపటా్ననికి చెందిన ఓ యువతిని టీడీపీ నాయకుడి కుమారుడు ప్రేమ పేరుతో గోవా తీసుకువెళ్లి మోసం చేసిన విషయం తెలిసిందే. తమ బిడ్డకు న్యాయం జరగదనే వేదనతో ఆ యువతి తల్లి పోలీస్స్టేషన్ వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను గురువారం వరుదు కల్యాణి పరామర్శించారు. అనంతరం వరుదు కల్యాణి మీడియాతో మాట్లాడుతూ బాధితులను హైదరాబాద్కు మంత్రి పిలిపించుకుని రాజీకి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. బాధిత యువతిని ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడనీయకుండా హోమ్లో నిర్బంధించడం దుర్మార్గమన్నారు. తాము ఏం చేసినా మంత్రులు, ఎమ్మెల్యేలు చూసుకుంటారనే ధైర్యంతో టీడీపీ మూకలు చెలరేగిపోతున్నాయని, ఇందుకు రాప్తాడు, రాజమండ్రి, తిరుపతి ఘటనలతోపాటు తాజాగా మచిలీపట్నం ఉదంతమే నిదర్శనమని మండిపడ్డారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ, మచిలీపట్నం మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, చిటికిన వెంకటేశ్వరమ్మ, పేర్ని కిట్టు పాల్గొన్నారు. మచిలీపట్నం టీడీపీ నేత కుమారుడిపై కేసుకోనేరు సెంటర్ (మచిలీపట్నం): ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి యువతిని బలవంతంగా తీసుకువెళ్లిన టీడీపీ సీనియర్ నాయకుడు, మచిలీపట్నం మునిసిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. స్థానిక పీకేఎం కాలనీకి చెందిన యువతిని అభినవ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి గోవా తీసుకెళ్లి నాలుగు రోజులు గడిపాడు. యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కుమారుడిని కాపాడేందుకు సుబ్రహ్మణ్యం విశ్వప్రయత్నాలు చేశారు. యువతిని బెదిరించి వెనక్కితగ్గేలా చేసేందుకు ప్రయత్నించారు. అది ఫలించకపోవటంతో రెండేళ్ల తరువాత ఇద్దరికి పెళ్లి జరిపిస్తానంటూ మాట మార్చారు. దీనికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆమె సామాజిక వర్గానికి చెందిన టీడీపీ, జనసేన నేతలను స్టేషన్కు పంపి పంచాయితీ పెట్టించి బెదిరించాలని చూశారు. పోలీసులనూ పావుగా వాడుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చేసేది లేక ఏకంగా స్టేషన్ బయటనే యువతి కుటుంబసభ్యులను మరింత బెదిరించేందుకు ప్రయత్నించారు. బిడ్డ జీవితం నాశనం అవుతుందని ఆందోళన చెందిన యువతి తల్లి స్టేషన్ ఎదుట పురుగుమందు తాగింది. వైఎస్సార్సీపీ, ప్రజాసంఘాలు, యువతి పక్షాన నిలబడ్డాయి.ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు జోక్యం చేసుకున్నారు. ఆయన ఆదేశాలు, యువతి స్టేట్మెంట్ మేరకు అభినవ్పై సెక్షన్లు మారుస్తూ చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిపై అభినవ్ గోవాలో లైంగికదాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. అతడిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అభినవ్పై పోలీసులు కేసు నమోదు చేయటం పట్ల మచిలీపట్నం కాపు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
ఎన్నికల కమిషనర్ను కలిసిన వైఎస్సార్సీపీ నేతల బృందం
విజయవాడ: ఆగస్టు 10వ జరగబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై వైఎస్సార్సీపీ నేతల బృందం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసింది. రాష్ట్ర ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతల్లో గడికోట శ్రీకాంత్రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్లు ఉన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలని ఈసీకి వినతిపత్రం సమర్పించారు. ఈసీని కిలిసిన అనంతరం గడికోట శ్రీకాంత్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నేతల పర్యటనలను అడ్డుకుంటున్నారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. తిరుపతి,తిరువూరు,కుప్పం వంటి మున్సిపల్ బై ఎలక్షన్స్ లో దుర్మార్గంగా వ్యవహరించారు. ఆగస్ట్ 10న జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలి. ఎన్నికలకు పటిష్టమైన భద్రత కల్పించాలి. సిసి కెమెరాల నిఘా మధ్య ఎన్నికలు జరిపించాలి. నామినేషన్లు వేయకుండా టిడిపి నేతలు బెదిరిస్తున్నారు. ఆన్ లైన్ నామినేషన్లకు అనుమతించాలని కోరాం’ అని ఆయన స్పష్టం చేశారు. 10, 12 తేదీల్లో ‘స్థానిక’ ఉప ఎన్నికలు -
వరదపై వదంతులు నమ్మొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో భారీగా ప్రవాహం ప్రకాశం బ్యారేజ్కు వస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లలో 55 గేట్లను ఒక అడుగు మేర, 15 గేట్లను రెండు అడుగులు ఎత్తి నీటిని కిందకు వదిలేస్తున్నట్లు చెప్పారు. వరదల నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ లక్ష్మీశ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. అధికారుల నుంచి వరద నీటి ప్రవాహానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద పెరిగే అవకాశం.. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం నాటికి లక్ష క్యూసెక్కులు, రెండు రోజుల్లో మూడు లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని.. బ్యారేజీ ఎగువ, దిగువ వైపుల ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా అవగాహన కల్పించామన్నారు. విజయవాడలో దాదాపు 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించామన్నారు. వీటిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలో పునరావాస కేంద్రాలతో మ్యాప్ చేసినట్లు తెలిపారు. ఒకవేళ ముంపు ముప్పు ఉన్నట్లయితే ఈ కేంద్రాలను తరలిస్తామని వివరించారు. డ్రెయినేజీ వ్యవస్థలు సరైన విధంగా ఉండేలా నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బుడమేరు, పులివాగు, కోతుల వాగు తదితర ప్రాంతాల విషయంలోనూ అప్రమత్తంగా ఉన్నామన్నారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మొద్దని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం.. వరదలపై జిల్లా కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని.. ఇది 24 గంటలూ పనిచేస్తుందని, ఎవరైనా సమస్యలను కంట్రోల్ రూమ్ దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని.. వచ్చే రెండు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆందోళన చెందొద్దని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్ఈ ఆర్.మోహనరావు, ఈఈ ఆర్.రవికిరణ్, డీఈ ఎన్.అజయ్బాబు, బ్యారేజ్ జేఈ సత్య రాజేష్ తదితరులు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
● కృష్ణమ్మ పరవళ్లు
జగ్గయ్యపేట: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండటంతో మండలంలోని ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు 12 గేట్లను ఎత్తి బుధవారం దిగువకు 3.24లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్కు విడుదల చేయటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ముక్త్యాల, రావిరాల, వేదాద్రి గ్రామాలలో కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముక్త్యాలలోని కృష్ణానది ఒడ్డునున్న భవానీ ముక్తేశ్వరాలయం మునగటంతో మత్స్యకారులు తమ పడవలకు తగిన రక్షణ చర్యలు చేపట్టారు. వేదాద్రి యోగానంద ఆలయంలోని కేశ ఖండనశాల మునిగింది. వరద పరిస్థితిని నియోజకవర్గ ప్రత్యేకాధికారి బాలాజీ కుమార్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో నితిన్, ఇన్చార్జ్ తహసీల్దార్ మనోహర్, వీఆర్వో చంద్రశేఖర్, కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, తదితరులు ఆయన వెంట ఉన్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 3.24 లక్షల క్యూసెక్కులు విడుదల -
నిరీక్షణ.. ప్రదక్షిణ!
వత్సవాయి: కూటమి ప్రభుత్వం వృద్ధుల జీవితాలతో చెలగాటమాడుతోంది. పేరుకు స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేస్తామని చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తోంది. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే ఆ పింఛన్ను భార్యకు పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కాలంలో స్పౌజ్ పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. గ్రామాల్లో వాటి వివరాలను కూడా లబ్ధిదారులకు తెలియపరిచారు. కానీ నేటివరకు పింఛన్ నగదు అందలేదు. రెండు నెలలకిత్రం స్పౌజ్ పింఛన్ల వివరాలను తెలియజేసినప్పటికీ ఎందుకు పంపిణీలో జాప్యం జరుగుతుందో అధికారులు తెలపడంలేదు. పింఛన్లు వస్తాయని వృద్ధులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సచివాలయాలలోని ఉద్యోగులు మాత్రం తమ చేతుల్లో ఏమీలేదని.. ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే వస్తాయని చెప్పి పంపించేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లాలో 4,138 స్పౌజ్ పింఛన్లకు అనుమతులు వచ్చాయి. విజయవాడ రూరల్లో 1,101, జగ్గయ్యపేట నియోజకవర్గంలో 614, నందిగామలో 764, మైలవరంలో 989, తిరువూరు నియోజకవర్గంలో 670 పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ సంబంధిత శాఖలకు పంపింది. కానీ నిధుల మంజూరుకు అనుమతులు మాత్రం రాలేదు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఆర్భాటపు హామీలతో అధికారం.. ఎన్నికల సమయంలో అర్హులైన వారందరికీ వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేస్తామని ఆర్భాటపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్తగా ఒక నూతన పింఛన్ను పంపిణీ చేయలేకపోయింది. వృద్ధులతోపాటు 50 ఏళ్లు దాటిన వారికి కూడా పింఛన్ను అందిస్తామని చెప్పింది. కానీ అమలులో మాత్రం నోచుకోవడంలేదు. ఆశపడి ఓట్లేసిన వారికి మాత్రం మొండిచేయి చూపెడుతోంది. భర్త చనిపోయి కుటుంబపోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతున్న వితంతు మహిళలు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరందరూ కార్యాలయాల చుట్టూ తిరగడంతోనే ఏడాదికి పైగా గడిచిపోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అర్హత కలిగి ఉంటే.. వలంటీరే దరఖాస్తు చేయించి, ఇంటికి వచ్చి నేరుగా పింఛన్ను అందించేవారు. నేడు కూటమి ప్రభుత్వం ఒక్క కొత్త పింఛన్ను ఇవ్వలేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. దీనిపై వత్సవాయి మండల పరిషత్ ఏవో ఎన్. రాంబా బును వివరణ కోరగా స్పౌజ్ పింఛన్లపై ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. రాగానే పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. స్పౌజ్ పింఛన్లపై వీడని సస్పెన్స్! ఇదిగో.. అదిగో అంటూ ప్రభుత్వం కాలయాపన ఆశగా ఎదురుచూస్తున్న వృద్ధులు ఇంకెన్నాళ్లకు ఇస్తారని ఆవేదన ఎన్టీఆర్ జిల్లాలో 4,138 పింఛన్లు -
కేయూతో మార్పు ట్రస్ట్ ఎంఓయూ
కోనేరుసెంటర్: మహిళల అక్రమ రవాణాతో పాటు పలు సామాజిక అంశాల గురించి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించే లక్ష్యంతో కృష్ణా విశ్వవిద్యాలయం, విజయవాడకు చెందిన మార్పు ట్రస్ట్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. బుధవారం కృష్ణా వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె. రాంజీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, మార్పు ట్రస్ట్ నిర్వాహకురాలు సూఈజ్ ఎంఓయూపై సంతకాలు చేశారు. మహిళల భద్రత, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై ఇరువురు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. రెక్టర్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు పాల్గొన్నారు. జర్మనీలో ఉపాధి అవకాశాలు పెనమలూరు: బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి, రెండేళ్ల అనుభవం ఉన్న మహిళలకు జర్మనీ దేశంలో ఉపాధి అవకాశం కల్పిస్తామని సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బి.మోహన్రావు తెలిపారు. ఆయన బుధవారం వివరాలు తెలుపుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు 35 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. జర్మనీ భాషపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 7వ తేదీ లోపు దరఖాస్తు చేయాలని అన్నారు. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో సంక్షేమ బాలికల వసతి గృహాల్లో 8 నెలల నుంచి 10 నెలలు శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు. వీసా, విమాన టికెట్ ఖర్చు ఉద్యోగం ఇచ్చిన వారే భరిస్తారన్నారు. ఆసక్తి కలిగిన వారు 99888 53335, 871265 5686 నంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. పవర్ లిఫ్టింగ్లో చంద్రకళ సత్తా గుడివాడరూరల్: జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారిణి సిరా చంద్రకళ ఉత్తమ ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ సాధించిందని స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్టేడియం కార్యాలయంలో చంద్రకళను బుధవారం పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నాటకలో జరిగిన నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న తమ క్రీడాకారిణి చంద్రకళ 75కేజీల విభాగంలో 215కేజీల బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటిందన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనేలా తమ కమిటీ ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తామన్నారు. కోచ్ ఎం.వెంకటేశ్వరరావు, స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆర్థిక ప్రయోజనాల కోసం మానవ అక్రమ రవాణాకు పాల్పడడం, వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి చర్యలకు పాల్పడే వారిపై గట్టి నిఘా ఉంచి నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నల్గొండ జిల్లా నేరేడుగుమ్ము మండలంలో విముక్తి కలిగిన వెట్టిచాకిరి కార్మికులను బుధవారం కార్మిక శాఖ అధికారులు కలెక్టర్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు మనుషులను అంగడి సరుకుగా మార్చి ఇతరులకు విక్రయిస్తున్నారన్నారు. పనులు కల్పిస్తామని ఆశ చూపి ఇతర ప్రాంతాలకు తరలించి వెట్టి చాకిరీకి పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి వాటిని నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా జూలై 30వ తేదీన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నిర్వహించి దానిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్కడ గుర్తించిన వారంతా విజయవాడ వారే.. ఇటీవల నల్గొండ జిల్లా నేరుడుగుమ్ము మండలంలో వెట్టిచాకిరికి పాల్పడే వారిపై నల్గొండ జిల్లా అధికారులు దాడులు చేసి వెట్టి చాకిరి కార్మికులకు విముక్తి కల్పించామన్నారు. ఇందులో నలుగురు వ్యక్తులు తాము విజయవాడ ప్రాంతానికి చెందిన వారమని తెలియజేయడంతో ఎన్టీఆర్ జిల్లా కార్మిక శాఖ అధికారులకు అప్పగించారన్నారు. నల్గొండ జిల్లా నేరేడుగుమ్ము మండలంలో విముక్తి కలిగిన వారిలో విజయవాడకు చెందిన దేవరగిరి శీలం వెంకయ్య ఉన్నారని వారి ఆధార్కార్డుల ఆధారంతో కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. గొల్లబ్రోలు వెంకటేశ్వర్లు, బూక్యా వెంకన్నల వద్ద ఆధార్ కార్డులు కూడా లేవని వారిని పూర్తిగా విచారించి వారి స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించామన్నారు. కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ సీహెచ్ ఆశారాణి పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
న్యాయం కోసం అన్నగా పోరాటం చేస్తా
ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించిన పేర్ని కిట్టు మచిలీపట్నంఅర్బన్: న్యాయం కోసం ఒక అన్నగా పోరాటం చేస్తానని, వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్, వైఎస్సార్ సీపీ నాయకులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) అన్నారు. ఆత్మహత్యకు యత్నించి సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను బుధవారం ఆయన పరామర్శించారు. టీడీపీ నేత కుమారుడు పల్లపాటి అభినవ్ ప్రేమ పేరుతో వంచనకు గురైన యువతి జాహ్నవి తల్లి శివపార్వతి ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే. ఆ బాధ్యత ప్రభుత్వానిదే.. పేర్ని కిట్టు బాధితురాలికి జరిగిన అన్యాయంపై స్పందించారు. తాను ఇక్కడికి రాజకీయాలు చేయడానికి రాలేదన్నారు. బాధితురాలి కన్నీళ్ల వెనక దాగిన నిస్సహాయత తనను కలిచివేస్తోందన్నారు. ఆడపిల్లలపై అన్యాయాలు, మోసాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే, బాధితురాలిని సెటిల్మెంట్ పేరుతో మోసం చేయాలని చూస్తున్నారన్నారు. డబ్బులు, ఉద్యోగం ఇస్పిస్తామంటూ ఆడపిల్ల జీవితానికి రేటు కట్టడం అమానుషమన్నారు. బాధితురాలిని పరామర్శించిన వారిలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా కోశాధి కారి బందెల థామస్నోబుల్, నగర ఉపాధ్యక్షుడు గూడవల్లి నాగరాజు, మాజీ డెప్యూటీ మేయర్ బందెల కవిత, నగరాధ్యక్షుడు మేకల సుబ్బన్న ఉన్నారు. -
‘అగ్రిగోల్డ్’ భూములపై నివేదిక ఇవ్వండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అగ్రిగోల్డ్ ఫామ్స్ కంపెనీ భూములకు సంబంధించి సమగ్రమైన నివేదికను వెంటనే అందజేయాలని కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అధికారులను ఆదేశించారు. ఆమె చాంబర్లో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి సంబంధిత అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఏలూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను వేలం వేసి, తదుపరి చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలోని గన్నవరం మండలంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను తెలియజేయాలని ఆర్డీవోకు సూచించారు. అగ్రిగోల్డ్ భూములు ఇవే.. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో అగ్రిగోల్డ్కు సంబంధించి 23.92 ఎకరాల భూమి, భవనాలు, కర్మాగారాలు, యంత్ర సామగ్రి ఉన్నాయని ఆర్డీవో ఇన్చార్జ్ కలెక్టర్కు వివరించారు. ఆ ఆస్తులను తాను, డీఎస్పీ పరిశీలించామన్నారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ స్పందిస్తూ భూముల నివేదికతో పాటు గన్నవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఆ ఆస్తులకు సంబంధించిన విలువ వివరాలను అధీకృత సంస్థ నుంచి ఆ ఆస్తులకు సంబంధించిన బహిరంగ మార్కెట్ విలువను కూడా సేకరించి ఇవ్వాలన్నారు. ఈ భూములను మ్యూటేషన్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అయితే ఆ భూములపై బ్యాంకు రుణాలున్న నేపథ్యంలో మ్యూటేషన్కు వీలులేదని ఆర్డీవో బదులిచ్చారు. వాటిన్నంటినీ క్రోడికరిస్తూ సమగ్ర నివేదికను సమర్పించాలని ఇన్చార్జ్ కలెక్టర్ ఆదేశించారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం, గన్నవరం సబ్రిజిస్ట్రార్ వీవీప్రసాద్, సీఐడీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసకుమార్, అగ్రిగోల్డ్ ప్రతినిధి యలవర్తి శరత్బాబు తదితరులు ఉన్నారు. కృష్ణా జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ -
కౌలు రైతులకు సత్వరమే పంట రుణాలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సీసీఆర్సీ కార్డులు కలిగిన ప్రతి అన్నదాతకూ సత్వరం పంట రుణాలు మంజూరు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ బ్యాంకర్లకు సూచించారు. ఇందుకోసం ప్రతి బ్యాంకు బ్రాంచ్లోనూ క్రెడిట్ డే నిర్వహించాలన్నారు. సీసీఆర్సీ కార్డులున్న కౌలు రైతులకు సాగు రుణాల మంజూరుపై కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి బుధవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. రుణం రైతు హక్కు.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కౌలు రైతులకు 56 వేల సీసీఆర్సీ కార్డుల జారీ లక్ష్యం కాగా ఇప్పటికే 42,415 కార్డులు అందించామన్నారు. రుణాలు పొందడం వారి హక్కు అని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు.. బ్రాంచుల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేయాలన్నారు. సీసీఆర్సీ రుణాల మంజూరు అనేది బ్యాంకుల పనితీరుకు కీలక ప్రగతి సూచిక అని పేర్కొన్నారు. ఇందులో మెరుగైన పనితీరు కనబరిచిన బ్యాంకులు, బ్రాంచులకు తగిన గుర్తింపు ఇస్తామన్నారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు కూడా కౌలు రైతులు పంట రుణాలు పొందడంలో సహాయ, సహకారాలు అందించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఫసల్ బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. తుపాన్లు, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వివిధ పంటలకు బీమా పరిహారం పొందేందుకు అందుబాటులో ఉన్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై), పునర్నిర్మించిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్డబ్ల్యూబీసీఐఎస్)ను రైతులు స్వచ్ఛందంగా సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ భూమి కలిగిన యజమానులు, సీసీఆర్సీ కార్డులు పొందిన సాగుదారులు పథకాల్లో చేరేందుకు అర్హులని వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఎల్డీఎం కె.ప్రియాంక, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
నివాసం ఉండని ఇళ్లలో మీటర్ల తొలగింపు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల తర్వాత కాలనీ ఇళ్లలో పేదలు నివసించని ఇళ్లను గుర్తించి, విద్యుత్ మీటర్లు తొలగించేందుకు విద్యుత్ శాఖ ద్వారా సర్వే చేపట్టింది. ఇళ్ల నిర్మాణం పూర్తయి నివాసం ఉండని ఇళ్లలో విద్యుత్ మీటర్లు, సర్వీస్ వైర్లు తొలగిస్తున్నారు. అయితే కాలనీల్లో రహదారి సౌకర్యం, ఇతర వసతులు లేకపోవడంతో పేదలు నివాసం ఉండడం లేదు. విద్యుత్ శాఖ అధికారులు మాత్రం నివాసం ఉండడం లేదని, మినిమం బిల్లు చెల్లించడం లేదని, విద్యుత్ వైర్లు చౌర్యానికి గురవుతున్నాయని.. ఇలా మీటర్లు తొలగించేందుకు పలు కారణాలు చెబుతున్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసి విద్యుత్ శాఖ మీటర్లు, వైర్లు తొలగిస్తుండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కాలనీల్లో ఇళ్ల లబ్ధిదారులంతా దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే కావడంతో ఇళ్లలో మిగిలిన పనులు పూర్తి చేసుకునేందుకు ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలకు రహదారి సౌకర్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తే నివాసం ఉండేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. -
ఇంటర్ తరగతులపై క్షేత్రస్థాయి పరిశీలన
హనుమాన్జంక్షన్ రూరల్: స్థానిక నూజివీడు రోడ్డులోని బాపులపాడు జెడ్పీ హైస్కూల్ను పాఠశాల విద్య కమిషనర్ వి.విజయరామ రాజు, ఇంటర్మీడియెట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా బుధవారం సందర్శించారు. హైస్కూల్ ప్లస్ పేరిట నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్ తరగతుల బాధ్యతను పాఠశాల విద్య శాఖ నుంచి ఇంటర్మీడియెట్ బోర్డుకు బదిలీ చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. బాపులపాడు జెడ్పీ హైస్కూల్లో ఇంటర్మీడియెట్ అభ్యసిస్తున్న విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. పలు సబ్జెక్టులకు జూనియర్ లెక్చర్లర్లు లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం వీరవల్లి లోని జెడ్పీ హైస్కూల్ ప్లస్ను కూడా ఇంటర్మీడియెట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు. -
విలాసాలు, వినోదాలు, బెట్టింగ్ యాప్లు, విచ్చలవిడి మద్యం విక్రయాలు, విష సంస్కృతిని వ్యాప్తి చేసే సోషల్ మీడియా, ఆవేశం, అర్థంపర్ధంలేని పట్టుదల, నిలకడలేని మనస్తత్వం, స్వార్ధ ప్రయోజనాలతో నేటి సమాజంలో నేర సంస్కృతి ప్రబలిపోతోంది. మానవత్వం మృగ్యమైపోతోంది. మనిషి
హత్య చేస్తే జీవితం నాశనమైనట్లే క్షణికావేశంలో హత్యలు చేసి ఎందరో జైలుపాలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయి. ఒక హత్య వలన బాధిత కుటుంబం, నిందితుడి కుటుంబం రెండూ చిన్నాభిన్నమవుతాయి. ఇటీవల పెరిగిపోతున్న హత్యలకు కారణాలు ప్రభుత్వాల వైఫల్యమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విష సంస్కృతిపై దృష్టి సారిస్తే నేరాలను అదుపు చేయవచ్చు. –రావూరి రమేష్బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, మైలవరం -
చంద్ర గ్రహణం
జగనన్న కాలనీలకుపేదల నివాసాలపై కాలకూటమి విషం చిమ్ముతోంది. కాలనీల్లో రోడ్లు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించకపోగా, ఇళ్లలో నివాసం ఉండడం లేదని నెపం చూపించి ఉన్న విద్యుత్ మీటర్లు, వైర్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను ఒక్కొక్కటీ ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం కన్ను ఇప్పుడు జగనన్న కాలనీలపై పడింది. తత్ఫలితంగా వాటికి చంద్రగ్రహణం పడుతోంది.గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదలు నివసించే జగనన్న కాలనీల్లో చీకట్లు అలముకుంటున్నాయి. విద్యుత్ సౌకర్యం కల్పించిన ఇళ్లలో సైతం పేదలు నివాసం ఉండడం లేదని మీటర్ల తొలగింపునకు విద్యుత్ శాఖ పూనుకుంటోంది. ఇందుకోసం ఆయా కాలనీల్లో ఎన్ని ఇళ్లలో నివాసం ఉండడం లేదో లెక్క తేల్చేందుకు సర్వే నిర్వహిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. సర్వేలో భాగంగా ఇళ్లలో నివాసం ఉండని వారిని గుర్తించి ఆయా ఇళ్లకు అమర్చిన విద్యుత్ మీటర్లు, వైర్లు, అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. మీటర్ల తొలగింపునకు కారణాలు వేరే ఉన్నప్పటికీ దొంగతనాలు జరుగుతున్నందు వల్ల విద్యుత్ మీటర్లు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అసలే పేదలు నివసించే కాలనీలు.. విద్యుత్ సౌకర్యం లేకపోతే అంధకారమేనని లబ్ధిదారులు వాపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇళ్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా లే అవుట్లు వేసి రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. మహిళా లబ్ధిదారుల పేరు మీద పట్టాలు జారీ చేసింది. గ్రామీణ పేదలకు సెంటున్నర, పట్టణ పేదలకు సెంటు భూమి చొప్పున కేటాయించింది. వాటిలో ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 335 జగనన్న లే అవుట్లు వేశారు. వీటిలో 69, 787 ఇళ్లు కేటాయించారు. 13,198 ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. 56,061 ఇళ్లు బేస్మెంట్ నుంచి ఆర్సీ వరకు వివిధ దశలలో ఉన్నాయి. ఇంకా 528 ఇళ్ల నిర్మాణం ప్రారంభించ లేదు. ఆయా లే అవుట్లలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి మీటర్లు అమర్చారు. కొన్ని లే అవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో కొందరు జగనన్న కాలనీల్లోనే సొంత ఇళ్లలో నివాసం ఉంటున్నారు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. గత ప్రభుత్వం దశల వారీ ఇళ్ల నిర్మాణం చేపడుతూ వచ్చింది. పూర్తయిన ఇళ్లలో విద్యుద్దీకరణ పనులు పూర్తి చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికీ పలు కాలనీల్లో సౌకర్యాలు లేవు.పేదల నివాసాలపై కాల‘కూటమి’ విషం నివాసాలు లేని వారి వివరాలు సేకరిస్తూ విద్యుత్ శాఖ సర్వే దొంగతనాల నెపంతో మీటర్ల తొలగింపునకు చర్యలు మౌలిక సౌకర్యాలు లేకే నివాసం ఉండని పేదలు కనీస సౌకర్యాలు కల్పించకపోగా ఉన్నవి ఊడబీకుతున్నారు అంధకారం అలముకుంటున్న కాలనీలు -
అసంపూర్తి పనులపై అసంతృప్తి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల తీరుపై దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులు, దాతల సహకారంతో నిర్మించిన యాగశాలను బుధవారం ఆయన పరిశీలించారు. తొలుత కనకదుర్గనగర్కు చేరుకున్న రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనానాయక్, దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు వెలివేటెడ్ క్యూకాంప్లెక్స్ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్లో చూపిన విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. అనంతరం మహా మండపం వద్ద నిర్మిస్తున్న అన్నదాన, ప్రసాదాల పోటు పనులను పరిశీలించారు. ఇంజినీరింగ్ పనుల్లో అర్చకుల జోక్యం తగదు ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన యాగశాలను కమిషనర్ పరిశీలించారు. యాగశాల పక్కనే నిర్మిస్తున్న పూజా మండపాల పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణాలు, అభివృద్ధి పనుల్లో కొంతమంది అర్చకులు జోక్యం చేసుకుంటున్నారని, ఇంజినీరింగ్ పనులలో వారి సలహాలు అవసరం లేదని, ఎవరి పనులు వారు చేసుకుంటే బాగుంటుందని సున్నితంగా మందలించారు. ఆలయంలో జరుగుతున్న పనులు సకాలంలో పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని ఈవో శీనానాయక్కు సూచించారు. మహా మండపం 7వ అంతస్తులోని చైర్మన్ చాంబర్లో దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దసరా నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు.దుర్గమ్మ సన్నిధిలో అభివృద్ధి పనులను పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్ -
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చే అర్జీలను గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే, పౌర సరఫరాల అధికారులతో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ సమావేశం నిర్వహించారు. భూ సేకరణ, రీ సర్వే, కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, ఈ–కేవైసీ, ప్రజా పంపిణీ వ్యవస్థ సరుకుల పంపిణీ తదితర అంశాలతో పాటు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో నాణ్యత నిర్ధారణకు అర్జీదారుల సంతృప్తే గీటురాయి అని, సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో సేవలందించాలని సూచించారు. రీసర్వే కార్యకలాపాలను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తిచేసేందుకు చొరవ చూపాలన్నారు. జాతీయ రహదారులతో పాటు వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణలో వేగం పెంచాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు చౌక ధరల దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీఓలు కావూరి చైతన్య, బాలకృష్ణ, మాధురి, పౌర సరఫరాల అధికారి ఎ.పాపారావు, సర్వే–ల్యాండ్ రికార్డుల ఏడీ పి.త్రివిక్రమరావు, కేఆర్సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ -
రూ.11 కోట్లతో నాకు సంబంధం లేదు: రాజ్ కేసిరెడ్డి
సాక్షి, విజయవాడ: సిట్ సీజ్ చేశామని చెబుతున్న రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్ ఫామ్హౌజ్లో సీజ్ చేశామంటున్న డబ్బు తనది కాదన్న రాజ్ కేసిరెడ్డి.. ఆ ఫామ్ హౌజ్ తీగల విజయేందర్రెడ్డికి చెందిందని తెలిపారు.‘‘తీగల విజయేందర్రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీతో పాటు హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. విజయేందర్రెడ్డి రూ.కోట్ల టర్నోవర్తో లావాదేవీలు చేస్తారు. విజయేందర్రెడ్డికి చెందిన ఆరెట్ ఆసుపత్రిలో నా భార్య మైనార్టీ షేర్ హోల్డర్ మాత్రమే. ..అంతకు మించి విజయేందర్రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు. సిట్.. కట్టు కథలు చెప్పి నాకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తోంది. కేవలం నా బెయిల్ను అడ్డుకునేందుకే డబ్బులు సీజ్ అంటూ అబద్ధాలు చెబుతోంది’’ అని రాజ్ కేసిరెడ్డి చెప్పారు. -
చీమలపాడులో జ్వరాలపై ఇంటింటి సర్వే
తిరువూరు: విష జ్వరాలు ప్రబలుతుండటంతో ఎ.కొండూరు మండలం చీమలపాడులో మంగళవారం జిల్లా మలేరియా అధికారి మోతీబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించాయి. గ్రామంలో మంచినీటి సరఫరాలో నాణ్యతను వైద్య బృందాలు విస్తృతంగా తనిఖీ చేయాలని, జ్వర పీడితుల వివరాలను నమోదు చేసి ప్రత్యేక వైద్య శిబిరాల్లో చికిత్స అందించాలని మోతీబాబు సూచించారు. చీమలపాడు, కేజీ తండాలలో రోగుల వివరాలను పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వర్షాలు కురుస్తున్నందున దోమలు ప్రబలే అవకాశం ఉందని, దోమ కాటుతో జ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర కన్సల్టెంట్ రామచంద్రుడు, హరి, ఎ.కొండూరు పీహెచ్సీ వైద్యాధికారులు స్వాతి, దివ్య, ఆరోగ్య, ఆశావర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
గొల్లపూడిలో హోం మంత్రి పర్యటన
భవానీపురం(విజయవాడపశ్చిమ): కూటమి ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గొల్లపూడి గ్రామం మౌలానగర్లో మంగళవారం జరిగింది. రాష్ట్ర హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. మంత్రి అనిత మాట్లాడుతూ ప్రజల బాగోగులు, సంక్షేమ పథకాల వర్తింపు గురించి నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుని, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలను రూపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మహిళలకు ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్ ప్రయాణం అమలు చేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పాలన అందించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదిక అన్నారు. గొల్లపూడి ఏఎంసీ చైర్మన్ నర్రా వాసు, బొమ్మసాని సుబ్బారావు, నారద తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత బస్సు ప్రయాణం అమలుపై వీడని సందిగ్ధత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు బస్సు ప్రయాణం ఉచితమంటూ హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చింది. ఆ హామీ ఎప్పుడెప్పుడు నెరవేరుస్తారా? ఎప్పుడు ఉచిత ప్రయాణం చేద్దామా అని మహిళలు ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఉచిత బస్సు ప్రయాణం ఇదిగో అదిగో అంటూ హామీ అమలు చేయకుండా ఊరిస్తూ వస్తోంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈసారైన అమలు చేస్తారా? మరోసారి వాయిదా వేస్తారా అంటూ మహిళలు చర్చించుకుంటున్నారు. రకరకాల ఊహాగానాలు.. చేతి వృత్తులు, చిరువ్యాపారాలు చేసుకునే వారు.. జీవనోపాధికి ప్రతి రోజు ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళా కార్మికులు ఉచిత ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాకే పరిమితం చేస్తారా? రాష్ట్ర నలుమూలలు ఉచిత ప్రయాణం చేయెచ్చా అనే దానిపై స్పష్టత లేకపోవడం రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. జిల్లాకే పరిమితం అని, అది కూడా కొన్ని సర్వీసులకేనని లీకులు ఇస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలకు సంబంధించి తమకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి ఇదీ.. ● ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 8 డిపోలు, 12 బస్ స్టేషన్లు ఉన్నాయి. 772 బస్సులు ఉన్నాయి. ● పల్లె వెలుగు 101 బస్సులు, అల్ట్రా పల్లె వెలుగు 7, అల్ట్రా డీలక్స్ 10 బస్సులు ఉన్నాయి. ●● సిటీ ఆర్డినరీ సర్వీసులు 180, ఎక్స్ప్రెస్ 69 బస్సులు సేవలందిస్తున్నాయి. ● జిల్లాలో 321 గ్రామాలకు గాను 67 గ్రామాలు ఇప్పటికీ బస్సు ముఖం చూడలేదు. అంటే 67 గ్రామాలకు బస్సు సర్వీసు లేదు. ● జిల్లాలో 12.20లక్షల మంది మహిళా జనాభా ఉన్నారు. సగటున రోజుకు 2.02 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తుంటారని అంచనా. ● ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే ఈ ప్రయాణించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ● ప్రస్తుతం 65 ఆక్యుపెన్సీ రేటు ఉంది. ఇది మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ● అందుకు తగ్గట్టుగా బస్సులు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా పరిణమించనుంది. ● ప్రధాన రూట్లలో తప్ప గ్రామీణ ప్రాంతాలకు పల్లె వెలుగు సర్వీసులే దిక్కు. ● విజయవాడ అర్బన్లో సిటీ ఆర్డినరీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. బస్సులే లేకుంటే ప్రయోజనం ఎలా? ప్రతి గ్రామానికి బస్సు సర్వీసు ఉంటేనే ప్రయోజనం అంటూ మహిళలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తిరువూరు, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం డిపోల్లో చాలా గ్రామాలకు బస్సు సర్వీసుల్లేవు. విజయవాడ డిపో బస్సులు నేరుగా జగ్గయ్యపేట, తిరువూరు రూట్లలో ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. ఇక లోపల కొన్ని గ్రామాలకు సర్వీసులు లేవు. తిరువూరు డిపో పరిధిలో ఆర్టీసీ, అద్దె పల్లె వెలుగు బస్సులు 32 ఉన్నాయి. ఈ డిపోలో 11 గ్రామలకు బస్సు సర్వీసులు లేవు. ఇబ్రహీంపట్నం డిపో పరిధిలో పల్లెవెలుగు బస్సులు 2 ఉన్నాయి. 15 గ్రామాలకు సర్వీసులు లేవు. అలాగే జగ్గయ్యపేట డిపో పరిధిలో 24 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ డిపో పరిధిలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఇప్పటికీ బస్సు ముఖం చూడని గ్రామాలు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దు గ్రామమైన వి. అన్నవరం బస్సు సౌకర్యమే లేదు. ఈ ప్రాంతాల్లో మహిళలు ఉచిత బస్సు సౌకర్యం ఐదారు కిలో మీటర్ల మేర ఆటోల్లో ప్రయాణించి రావాల్సి ఉంటుంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు బస్సు సౌకర్యం కల్పించి ఉచిత ప్రయాణం కల్పించాలని కోరుతున్నారు. మొత్తంమహిళలు 12.20 లక్షల మంది బస్సు సదుపాయం లేని గ్రామాలు 67 కండిషన్ అంతంత మాత్రం.. జిల్లాలో బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని బస్సులు సరైన కండిషన్లో లేవు. అర్బన్లో ఉన్న మెట్రో సర్వీసులు గతేడాదితో లైఫ్ ముగియడంతో వాటిని తొలగించారు. సిటీ ఆర్డినరీ సర్వీసులు కండిషన్ అంతంత మాత్రమే. ఈవీ బస్సులు వస్తాయని చెబుతున్నా.. అసలు ఉచిత ప్రయాణం ఉంటుందా? ఉంటే ఈవీ బస్సుల్లోనూ ఆ సౌకర్యం కల్పిస్తారా? అన్న సందేహాలు మహిళలు వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కూడా ప్రభుత్వం మహిళలకు కార్డు జారీ చేస్తుందా? ఆధార్ కార్డు ఆధారంగా ప్రయాణానికి అనుమతిస్తారా? వేచి చూడాలని, అమలు జరిగితే ఇబ్బందులు తప్పవని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తోందంటున్నారు. -
అడ్డగోలు భూ సంతర్పణ ఆపాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు, తమకు కావాల్సినవారికి అడ్డగోలుగా చేస్తున్న భూ సంతర్పణ ఆపాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ స్థలాలను కారుచౌకగా లులు మాల్కు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్లో మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగిన ఆందోళనలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రులు, ఎంపీలు, కార్పొరేట్ సంస్థలకు భూ కేటాయింపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదేనా సంపద సృష్టి.. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఏ కేబినెట్ సమావేశం నిర్వహించినా, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ సమావేశం జరిగినా ఆయాచితంగా వారికి కావాల్సిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సంస్థలకు ఇబ్బడిమబ్బడిగా భూములు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది కాలంలో సుమారు 8 లక్షల ఎకరాల భూమిని కారు చౌకగా, రైతుబజారుల్లో కూరగాయల ధరల కన్నా తక్కువ ధరకు అప్పగిస్తోందని మండిపడ్డారు. విజయవాడ నడిబొడ్డులో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని అప్పనంగా లులు షాపింగ్ మాల్కు కేటాయించిందన్నారు. టెండర్ లేకుండా అడిగిందే తడవుగా స్థలం కేటాయించడాన్ని తప్పుబట్టారు. టెండర్ లేదా ఆక్షన్ ప్రకారం మార్కెట్ రేటుకు కేటాయించాలి అవేమీ లేకుండా అడ్డగోలుగా భూములు పందేరం చేస్తోందన్నారు. లులు మాల్ ఏర్పాటు వలన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు. పైగా ఈ మాల్ ఏర్పాటు చేస్తే బీసెంట్ రోడ్డు, కాళేళ్వరరావు మార్కెట్, గాంధీనగర్, గవర్నర్పేట పరిసరాల్లో చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తులకు వందల ఎకరాలు కేటాయిస్తున్నారని ఇదేనా సంపద సృష్టి అని ప్రశ్నించారు. 2014–19 మధ్య కాలంలోనూ చంద్రబాబు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి అమరావతి ప్రాంతంలో లబ్ధి పొందారన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధానం కొనసాగిస్తున్నారన్నారు. భూ కేటాయింపు వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగే మేలేమిటో చెప్పాలని, ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లులుకు ఇచ్చిన జీవో రద్దు చేయాలని, భూ కేటాయింపులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు ఇసరపు దేవి, తిరుపతమ్మ, మహిళా విభాగం నేతలు పేరం త్రివేణి, తోపుల వరలక్ష్మి, గుండె సుందర్పాల్, కాలే పుల్లారావు, ఒగ్గు గవాస్కర్, ఒగ్గు విక్కీ, సుధాకర్, కర్నాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిపిన భూ కేటాయింపులన్నీ రద్దు చేయాలి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాత బస్టాండ్ స్థలాన్ని లులుకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ధర్నా -
బిరబిరా కృష్ణమ్మ
విజయవాడ కంట్రోల్ రూం నంబర్: 9154970454 కృష్ణానదిపై ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి 65వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇది క్రమేపీ 3లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. వరద నీరు బుధవారం మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి వరద నేపథ్యంలో పరీవాహక ప్రాంత ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లో కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. – గాంధీనగర్(విజయవాడసెంట్రల్) ● పులిచింతల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 65వేల క్యూసెక్కులు విడుదల ● ప్రకాశం బ్యారేజ్కు వరద హెచ్చరిక -
విజయకీల్రాదిపై ఘనంగా గరుడ పంచమి
తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం గరుడ పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్స్వామి మంగళ శాసనాలతో ఉదయం 9 గంటలకు గరుత్మంతునికి పంచామృతాలతో అభిషేకం, 10 గంటలకు సంతాన ప్రాప్తి కోసం గరుడ హోమం ఘనంగా నిర్వహించామని అన్నారు. పద్మావతి అమ్మవారి మాస తిరునక్షత్ర సందర్భంగా పద్మావతి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. సుబ్రమణ్యేశ్వరునికి నాగపంచమి పూజలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలోని సుబ్రమణ్యేశ్వరస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకులు శంకరమంచి రాజేష్శర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
పాయకాపురం(విజయవాడరూరల్): నున్న గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు నున్న వీఆర్వో పేకేటి ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నున్న గ్రామంలో పలతిప్ప సమీపంలో సాగర్ కాల్వకు కుడి వైపు భీమవరపు రాధిక మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నట్లు స్థానికులు గుర్తించారన్నారు. మృతుడు ఫుల్ డ్రాయర్ కలిగి, కుడి చేతిపై భాగం కుళ్లి పోయింది. ఎడమ చేయిపై డీఎస్ అను అక్షరాల పచ్చబొట్టు ఉన్నాయి. 5.5 అడుగుల ఎత్తు, ఎరుపు రంగులో సన్నగా ఉన్నాడు. ఇతర వివరాలు తెలియరాలేదు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక ట్రాక్టర్, పొక్లెయినర్ స్వాధీనం పెనమలూరు: చోడవరం గ్రామ పరిధి కృష్ణానదిలో ఇసుక అక్రమంగా తవ్వుతున్న టీడీపీ నాయకుడి ట్రాక్టర్, పొక్లెయినర్లను గనుల శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. చోడవరం ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాలపై కలెక్టర్ నిషేధం విధించారు. అయితే ఇసుక అక్రమంగా తవ్వుతున్నారన్న సమాచారంతో గనుల శాఖ, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అధికారులు ట్రాక్టర్ను సీజ్ చేయగా ఇసుక లోడ్ అవని పలు ట్రాక్టర్లను వదిలేశారు. -
చోరీ కేసులో ప్రేమికుల అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): ఇంటిలోకి చొరబడి నగలు చోరీ చేసిన కేసులో ప్రేమికులను అదుపులోకి తీసుకున్నట్లు సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ తెలిపారు. పటమట పోలీస్స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. భవానీపురానికి చెందిన బాలిక(16), మొగల్రాజపురానికి చెందిన మీసాల అజయ్(19) గతంలో వాసవీ కాలనీలో ఉండేవారు. వన్టౌన్ కోమలా విలాస్ వద్ద గ్యాస్ ఏజెన్సీ నిర్వహించే చిరుమామిళ్ల గిరిజా శంకర్ ఇదే కాలనీకి గతంలో అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27వ తేదీ రాత్రి గిరిజా శంకర్ ఇంటిలో నిద్రిస్తుండగా వీరిరువురూ ఇంటిలోకి చొరబడి విద్యుత్ సరఫరాను ఆపేసి ఇంటిలోని 365 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతమైన తనిఖీలు చేయటంతో నిందితులు పట్టుబడ్డారన్నారు. పలు కేసుల్లో నిందితులు.. నేరంలో భాగమైన బాలిక, అజయ్ ప్రేమికులు. వీరువురూ ఈ చోరీకి ముందు ఇదే ప్రాంతంలోని ఓ పెంపుడు కుక్కను కూడా చోరీ చేశారు. గిరిజా శంకర్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి చోరీ చేశారు. శంకర్ ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత చాకచక్యంగా ఇంటిలోకి చొరబడ్డారు. అజయ్ ఇంటిలోకి వెళ్లగా బాలిక బయట స్కూటర్పై కాపలా ఉండి, అజయ్ ఇంటి నుంచి రాగానే బండిపై అక్కడి నుంచి ఉడాయించారు. భవానీపురంలోని బాలిక బంధువుల వద్ద చోరీ సొత్తును దాచిపెట్టారు. వీరిపై నిఘా పెట్టడంతో బాలిక, అజయ్ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రి వద్ద పట్టుబడ్డారు. బాలికను జూవైనల్ హోంకు పంపామని, అజయ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచామని తెలిపారు. బాలిక, అజయ్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, తన కూతురును అజయ్ వేధింపులకు గురిచేస్తున్నారని బాలిక తల్లిదండ్రులు గతంలో మాచవరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అజయ్పై పోక్సో కేసు నమోదు చేయగా పెద్దల సమక్షంలో రాజీ కుదిరిందన్నారు. మాచవరం పోలీస్స్టేషన్లో పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సమావేశంలో సీఐ పవన్ కిషోర్, ఎస్.ఐలు డి.హరికృష్ణ, ఆర్ఎస్ కృష్ణ వర్మ, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో జిల్లా పరిశ్రమల మేనేజర్ వెంకట్రావు చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోందని, వీటిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల మేనేజర్ ఆర్. వెంకట్రావు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ సంస్థ జాతీయ చిన్నపరిశ్రమల సంస్థ, ఏపీ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం ఓ ప్రైవేటు హాలులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని రకాల వనరులు ఉన్నాయని, ప్రతి వ్యాపారవేత్తకు యూనిట్లు నెలకొల్పడానికి సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పరిశ్రమలకు కావాల్సిన మార్కెటింగ్ సౌకర్యాలు కూడా తమ ద్వారా తోడ్పాటును అందిస్తామన్నారు. 45శాతం పెట్టుబడి రాయితీ.. పరిశ్రమలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మహిళలకు 45 శాతం పెట్టుబడి రాయితీ ఉందని వెంకట్రావు తెలిపారు. ఎన్ఎస్ఐసీ సీనియర్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు తయారుచేసిన ఉత్పతులు, కళాకృతులను, అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థల మాదిరిగా స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్ చేసుకునే సదుపాయం తాము కల్పిస్తామన్నారు. ఏపీ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పి. భాస్కరరావు మాట్లాడుతూ మహిళా వ్యాపారవేత్తలను కూడా భాగస్వామ్యులను చేసి అందరికీ ఉపయోగపడేలా పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల పాలసీలను రూపొందించటంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ సహాయ సంచాలకులు లక్ష్మి, ఏపీ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఇమిటేషన్ జ్యూవెలరీ ప్రతినిధి జితేంద్ర, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. -
ఏసీ సర్వీసింగ్ మెకానికే.. నిందితుడు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఇంట్లో బీరువాలో భద్రపరిచిన నగదును చోరీ చేసిన నిందితుడిని కొత్తపేట పోలీసులు 18 గంటల్లో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.4.35 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపేట సీఐ చిన్న కొండలరావు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం టేనర్పేట అడ్డరోడ్డులోని కొండ కృష్ణ ఇంట్లోని బీరువాలో రూ.5 లక్షలు నగదు చోరీకి గురైంది. బాధితుడు ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి ఇంటి చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలో నమోదైన పుటేజీని పోలీసులు పరిశీలించారు. సంఘటనా జరిగిన సమయానికి కొద్దిసేపటి తర్వాత బాధితుడి ఇంటి నుంచి ఓ యువకుడు బయటకు వస్తున్నట్లు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి వివరాలను తెలుసుకుని సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అయోధ్యనగర్లోని శాంతినగర్కు చెందిన తాడికొండ పవన్కుమార్గా గుర్తించారు. అతను ఏసీ సర్వీసు చేస్తుంటాడని, కొద్ది రోజుల కిందట కృష్ణ ఇంటికి వచ్చి ఏసీ సర్వీసు చేసినట్లు గుర్తించారు. ఏసీ సర్వీసుకు వచ్చిన తరుణంలో కృష్ణ, అతని భార్యతో ఆర్థిక పరమైన అంశాల గురించి మాట్లాడుకోవడం పవన్ గమనించాడు. పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న పవన్ చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత భారీగా డబ్బులు ఉంటాయని భావించిన పవన్ సోమవారం కృష్ణ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ఎవరూ లేని సమయం చూసుకుని చోరీకి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 4.35 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.65 వేలు ఖర్చు చేసినట్లు నిందితుడు అంగీకరించగా, నిందితుడిని కోర్టులో హాజరు పరిచినట్లు వెస్ట్ ఏసీసీ దుర్గారావు పేర్కొన్నారు. 18 గంటల్లో నిందితుడి అరెస్ట్ రూ.4.35 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు -
అంతర్జాతీయ అథ్లెటిక్స్లో బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: మండలంలోని గురవాయిపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ నాగ రవీంద్ర అంతర్జాతీయస్థాయి పరుగు పందెంలో సత్తా చాటాడు. నేపాల్ దేశంలోని పోక్రాలో నిర్వహించిన ఇండో–నేపాల్ ఇంటర్నేషనల్ చాంపియన్షిప్ – 2025 అథ్లెటిక్స్లో 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు యూత్ అండ్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించినట్టు నాగరవీంద్ర సోమవారం తెలిపారు. నాగరవీంద్ర నాగార్జున సాగర్లోని ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కర్నూలుకు చెందిన కోచ్ షేక్ ఫయాజ్ ప్రోత్సాహంతో గతంలోనూ విశాఖపట్నం, గోవాలలో నిర్వహించిన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాడు. పారిశ్రామికవేత్తలూ మార్గదర్శులుగా ముందుకు రండి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ 4 విధానంలో పారిశ్రామికవేత్తలు మార్గదర్శులుగా ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు చేయూత అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ(డీఐఈపీసీ) సమావేశం జరిగింది. సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు తదితరాలపై చర్చించారు. 2025 మే 26 నుంచి జూలై 28 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులకు సంబంధించి 1,148 దరఖాస్తులు స్వీకరించగా, వీటిలో ఇప్పటికే 1,113 దరఖాస్తులు ఆమోదం పొందాయని పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు. మిగిలిన దరఖాస్తులను కూడా త్వరితగతిన గడువుకు ముందే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఎంఎస్ఎంఈ రంగానికి అందించే ప్రోత్సాహకాలలో భాగంగా 39 క్లెయిమ్లకు రూ.3 కోట్ల మేర ప్రతిపాదనలను తాజాగా చర్చించి డీఐఈపీసీ ఆమోదం తెలిపింది. క్లెయిమ్లను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పీఎం విశ్వకర్మ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమాన్ని(పీఎంఈజీపీ) జిల్లాలో వేగవంతం చేయాలని, నిర్థేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ చెప్పారు. ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు బ్యాంకుల నుంచి రుణాలను త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ను ఆదేశించారు. రుణాలు మంజూరైన యూనిట్లను త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని, పీఎం విశ్వకర్మ దరఖాస్తులపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలను పొత్సహించేందుకు ఉద్దేశించిన ర్యాంప్ కార్యక్రమంపై అవగాహన కల్పించేలా జిల్లా స్థాయిలో వర్క్ షాప్ నిర్వహిస్తామని కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి సాంబయ్య, ఎల్డీఎం కె.ప్రియాంక, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ పి.శ్రీనివాసరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకర్రావు, జిల్లా భూగర్భజల అధికారి ఎన్.నాగమల్లేశ్వరరావు, కమిటీ సభ్యులు డి.నిర్మల, ఎం.కిశోర్, ఎం.సుదర్శన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
40 బారికేడ్లు వితరణ
జి.కొండూరు: రోడ్డు ప్రమాదాల నివారణకు నాగార్జున సిమెంట్ కంపెనీ నుంచి రూ.3 లక్షల విలువైన 40 ఐరన్ బారికేడ్లను జి.కొండూరు పోలీసులకు కంపెనీ ప్రతినిధులు మంగళవారం అందజేశారు. ఈ బారికేడ్లను 30వ నంబర్ జాతీయ రహదారిపై వేగ నియంత్రణ కోసం వినియోగించనున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సిమెంట్ కంపెనీ టెక్నికల్ హెడ్ ఆర్ఎస్ఎన్ రాజు, హెచ్ఆర్ హెడ్ ఎంఎస్ అజహర్ పాల్గొన్నారు. పాఠశాలలో పాము కలకలం పెనుగంచిప్రోలు: స్థానిక కేవీఆర్ జెడ్పీ హైస్కూల్లో పాము కలకలం సృష్టించింది. హైస్కూల్ క్రీడా మైదానంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో విద్యార్థులకు పాము కనపడటంతో కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. అనంతరం పాముతో విద్యార్థులు కొందరు స్కిప్పింగ్ ఆడుతూ, మెడలో వేసుకుని విన్యాసాలు చేశారు. ఆ సమయంలో ఏఒక్క ఉపాధ్యాయుడు కూడా పర్యవేక్షణ లేకపోవటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని వాపోతున్నారు. వైభవంగా కుంభాభిషేక మహోత్సవాలు విజయవాడకల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మతోటలోని టీటీడీ దేవస్థానంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభాభిషేక అష్టబంధన, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు కనులపండువగా సాగుతున్నాయి. మంగళవారం నాటి కార్యక్రమంలో సర్వశాంతి హోమం, సహస్రాహుతి హోమం నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించిన యాగ క్రతువును వైఖానస పండితులు మురళీకృష్ణ అయ్యంగార్, వేదాంతం శశికిరణ్, టీటీడీ ఆగమ శాస్త్ర పండితులు నిర్వహించారు. టెంపుల్ ఇన్స్పెక్టర్లు లలితా రమాదేవి, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రైల్వే సిగ్నల్ కంట్రోల్ కార్యాలయం ప్రారంభం దుగ్గిరాల: నూతన కార్యాలయంలో రైల్వే సిగ్నల్ కంట్రోల్ వ్యవస్థను రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం ప్రారంభించారు. సుమారు మూడు సంవత్సరాలు నుంచి ఆధునీకరణ పనులు వాటితో పాటు 3వ లైను నిర్మాణ జరుగుతోంది. పనులు పూర్తి కావడంతో ఆధునిక సాంకేతిక విధానం కలిగిన కార్యాలయాన్ని ప్రారంభించారు. -
సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం
● దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు ● సాంకేతికత సాయంతో పటిష్ట చర్యలు ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల్లో సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యమిస్తూ సాంకేతికత, ఏఐ టూల్స్ అనుసంధానంతో భక్తులకు మధురానుభూతి కలిగించేలా ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజులపాటు జరగనున్న దసరా ఉత్సవాలపై కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారుల సమావేశం మంగళవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్ తదితరులు హాజరైన సమావేశంలో ఆయా శాఖలు ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, అమ్మవారి అలంకరణలు, భక్తుల క్యూలైన్లు, బారికేడింగ్, ఆన్లైన్, కరెంట్ బుకింగ్ కౌంటర్లు, పార్కింగ్, మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఘాట్ల వద్ద షవర్ల ఏర్పాటు, భద్రతా వ్యవస్థ, ప్రసాదాల తయారీ, పంపిణీ, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్, వైద్య శిబిరాలు, పాస్ల జారీ, సూచిక బోర్డుల ఏర్పాటు తదితరాలపై చర్చించి.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. రోజుకు లక్షమంది వస్తారని అంచనా.. కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది రోజుకు దాదాపు లక్ష మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశముందన్నారు. అదే విధంగా మూలా నక్షత్రం రోజున దాదాపు 1,50,000 నుంచి రెండు లక్షల వరకు భక్తులు రావొచ్చన్నారు. ఎంతమంది నగరానికి వచ్చినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. నిరంతర పర్యవేక్షణకు 24 గంటలూ సేవలందించే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి శాఖ నుంచి ఒక అధికారి ఈ కంట్రోల్ రూమ్లో ఉంటారన్నారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ నేపథ్యంలో అవసరం మేరకు ఇతర జిల్లాల సిబ్బంది సేవలను కూడా వినియోగించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 20 నాటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి, సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ.. దసరా ఉత్సవాలను డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని సీపీ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ఈసారి 42 డ్రోన్లు, 5వేల సీసీ కెమెరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ‘అస్త్రం ట్రాఫిక్ మేనేజ్మెంట్’ యాప్ వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా.. కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తామని ఈఓ శీనా నాయక్ పేర్కొన్నారు. సమావేశంలో ఆలయ స్థానాచార్యులు వి.శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్.దుర్గాప్రసాద్, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీసీపీ కేజీవీ సరిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వీరవల్లిలో దొంగల ముఠా అరెస్టు
హనుమాన్జంక్షన్రూరల్: రాష్ట్రంలోని పలుచోట్ల బైక్ చోరీలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వీరవల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరవల్లి పోలీస్స్టేషన్లో కేసు వివరాలను గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. చైన్నె–కోల్కతా జాతీయ రహదారిపై తేలప్రోలు సర్వీస్రోడ్డులో మంగళవారం వీరవల్లి ఎస్ఐ ఎం.శ్రీనివాస్ నేతృత్వంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఈ నలుగురు ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో తేలిందని చెప్పారు. వీరిని దేవప్రకాష్(కాకినాడ), పెద్దప్రోలు అశోక్కుమార్(విజయవాడ), నాయిని ప్రభుకుమార్ అలియాస్ లవ్లీ(విజయవాడ), వేము ప్రసన్నకుమార్(తాడేపల్లి)గా గుర్తించామన్నారు. వీరిపై పలు పోలీస్స్టేషన్లలో బైక్ చోరీ కేసులు, తాళాలు పగలుకొట్టి దొంగతనాలకు పాల్పడిన కేసులు ఉన్నాయని చెప్పారు. తాజాగా బాపులపాడు మండలం తిప్పనగుంటలో పగటిపూట తాళం వేసి ఉన్న ఇంట్లో చోరికి పాల్పడినట్లుగా దుండగులు ఒప్పుకున్నారన్నారు. ఈ ఘటనలో అపహరించిన బంగారు అభరణాలను ఓ కార్పొరేట్ గోల్డ్ ఫైనాన్స్ సంస్ధలో తాకట్టు పెట్టినట్లుగా విచారణలో వెల్లడించారని తెలిపారు. దీంతో చోరికి గురైన 16 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఈ నలుగురిని అరెస్ట్ చేసి నూజివీడు కోర్టుకు తరలిస్తున్నట్లుగా వివరించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన హనుమాన్జంక్షన్ సీఐ కేవీవీఎన్ సత్యనారాయణ, వీరవల్లి ఎస్ఐ ఎం.శ్రీనివాస్, కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించారు. -
గంజాయి విక్రేతల పట్టివేత
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 10 మందిని చిలకలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఐదుగురు పురుషులు, ఓ మహిళతో పాటు నలుగురు మైనర్లు ఉన్నారు. బందరు డీఎస్పీ సీహెచ్ రాజా చిలకలపూడి పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మచిలీపట్నంలోని మాచవరం మెట్టు సమీపంలోని రెడ్ పిచ్ ప్రాంతంలో కొంత మంది గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. చిలకలపూడి సీఐ ఎస్కే నభీ, ఎస్ఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి వారిపై మెరుపు దాడి చేశారు. దాడిలో గంజాయి అమ్ముతూ మాచవరానికి చెందిన షేక్బాబావలి, దాసరి శ్రీసాయిశంకర్భవాని, రాజుపేటకు చెందిన మహ్మద్ తలహా, న్యూరైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన చప్పిడి సంతోష్, గొడుగుపేటకు చెందిన రమణి అశోక్, పీకేఎం కాలనీకి చెందిన బలగం రామలక్ష్మితో పాటు మరో నలుగురు మైనర్ బాలురు పట్టుబడ్డారు. వారి నుంచి ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఒడిశా నుంచి తీసుకువచ్చి విక్రయాలు.. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నగరంలో మరి కొంత మంది గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. పట్టుబడిన నేరస్తులు అరకు నుంచి ఒడిశా సరిహద్దు ప్రాంతానికి వెళ్లి గంజాయిని తీసుకువచ్చారన్నారు. మచిలీపట్నంలో దిగుమతి చేసి ఇతరులకు సరఫరా చేసేందుకు పూనుకోగా అందిన సమాచారం మేరకు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. గంజాయి విక్రయదారులను పట్టుకున్న చిలకలపూడి పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో సీఐ నభీ, ఎస్ఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు. ఆరు కేజీల గంజాయి స్వాధీనం -
నూతన యాగశాలలో హోమాలు మళ్లీ వాయిదా !
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): నూతన యాగశాలలో హోమాల నిర్వహణ మళ్లీ వాయిదా పడింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని రాధాకృష్ణుల విగ్రహాల వద్ద దాతల సహకారంతో నూతన యాగశాల నిర్మాణం చేపట్టారు. ఈ నెల 25వ తేదీ శ్రావణ మాసం ప్రారంభం నుంచి నూతన యాగశాలలో చండీహోమం, గణపతి హోమం, నవగ్రహహోమాలను నిర్వహిస్తారంటూ ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. అయితే శ్రావణ మాసం తొలి రోజున యాగశాలలో హోమాలు ప్రారంభం కాకపోగా, దాదాపు ఐదు రోజులైనా ఇంత వరకు దేవస్థాన అధికారులు ఆ దిశగా ఎలాంటి ముందడుగు వేయడం లేదు. నూతన యాగశాలను ఆలయ ఈవో శీనానాయక్ మంగళవారం మరో మారు పరిశీలించారు. గడిచిన నెల రోజుల్లో ఇంజినీరింగ్ అధికారులు యాగశాలను 10 సార్లు పరిశీలించి ఉంటారు. చిన్న చిన్న మరమ్మతులు ఇంకా చేపట్టాల్సి ఉందని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు సూచించడంతో ఆ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో వైపున మల్లేశ్వర స్వామివారి ఆలయం సమీపంలోని యాగశాలలోనే హోమాలను నిర్వహిస్తున్నారు. హోమాలను జరిపించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తుండగా, వారికి సరైనా ప్రాంగణం లేకపోవడం ఆరు బయటే వేచి ఉండాల్సి వస్తోంది. నూతన యాగశాల నిర్మాణం పూర్తి కావడంతో భక్తులు తమ ఇబ్బందులు తీరుతాయని భావించారు. అయితే ఇంత వరకు యాగశాలకు తుది మెరుగులు దిద్దడంలో ఆలయ ఇంజినీరింగ్ అధికారులు శ్రద్ధ చూడపం లేదనే విమర్శలు వస్తున్నాయి. నూతన యాగశాలలో హోమాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వేచి చూడాలి. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 70 ఫిర్యాదులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు 70 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధుల వద్దకు వెళ్లి వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 43 ఫిర్యాదులు అందగా, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై మూడు, కొట్లాటలపై ఐదు, వివిధ మోసాలకు సంబంధించి మూడు, మహిళా సంబంధిత నేరాలపై ఐదు, దొంగతనాలకు సంబంధించి రెండు, ఇతర చిన్న చిన్న వివాదాలపై తొమ్మిది ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఉదయరాణి ఆదేశించారు. బూడిద కాలుష్యంతో అనారోగ్య సమస్యలు ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ బూడిద కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడ్డారని ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయప్రకాష్ అన్నారు. మండలలోని కిలేశపురం, జూపూడి, ఫెర్రీ ప్రాంతాల్లో ప్రజారోగ్య వేదిక బృందం సోమవారం పర్యటించింది. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కాలుష్యం వల్ల ప్రజలు చర్మ, శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నట్లు చెప్పారు. ఎన్టీటీపీఎస్ ఫ్లై యాష్తో పాటు బూడిద చెరువు వల్ల వాయు కాలుష్యం ఏర్పడి పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తాగునీరు కూడా కలుషితం అవుతోందన్నారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణయ్య, ప్రధాన కార్యదర్శి డి.కామేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.సీతారామారావు, మాజీ సర్పంచ్ కొల్లి వెంకటేశ్వరరావు, శ్రీధర్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎల్బీఆర్సీఈలో 32 స్టార్స్ ఫుట్బాల్ అకాడమీ
మైలవరం: మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల తోడ్పాటుతో స్థానిక కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 32 స్టార్స్ ఫుట్బాల్ అకాడమీని రాష్ట్ర ఫుట్బాల్ సంఘం గౌరవాధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఈ ఫుట్బాల్ అకాడమీలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 32 మంది ఫుట్బాల్ క్రీడాకారులు ఎంపికయ్యారన్నారు. క్రీడాకారులందరికీ స్థానికంగా కల్పించినటువంటి స్కూల్, కాలేజీ, వసతి సదుపాయాలు, క్రీడాకారుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన మైదానం, జిమ్ సదుపాయాలను కోటగిరి శ్రీధర్ పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్ర ఫుట్బాల్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ఉపయోగించుకుని క్రీడాకారులు అందరూ దేశం గర్వించదగ్గ ఫుట్బాల్ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడుశే శేషగిరిరావు, కార్యదర్శి చక్రవర్తి, కోశాధికారి బుజ్జి, ఏలూరు జిల్లా ఫుట్బాల్ సంఘం కార్యదర్శి పవన్కుమార్, కోనసీమ జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు నీలాద్రి, విశాఖపట్నం జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు రాజారావు, కృష్ణా జిల్లా సంఘం అధ్యక్షుడు అనిల్ పాల్గొన్నారు. -
దుర్గమ్మకు పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయ అభివృద్ధి పనులకు, నిత్యాన్నదానానికి సోమవారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. శ్రీ షిర్డీ సాయి కన్స్ట్రక్షన్స్ ఎండీ శ్రీనివాస్, వసంత దంపతులు తమ కుమార్తె సహన, కుటుంబ సభ్యుల పేరిట రూ. 2 లక్షల విరాళాన్ని ఆలయ ఈవో శీనానాయక్కు అందజేశారు. అదే విధంగా మచిలీపట్నంకు చెందిన సర్వలలిత కుటుంబం ఆలయ అభివృద్ధి పనులకు రూ. 2 లక్షలు, నిత్యాన్నదానానికి రూ. 2 లక్షల విరాళాన్ని ఈవో శీనానాయక్కు అందజేశారు. అలాగే విజయవాడకు చెందిన అట్లూరి రామచంద్రం, విజయలక్ష్మి దంపతుల సంతానమైన శ్రీరామ్, సుహాస్, పూజితల పేరిట నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. ఈవో శీనానాయక్, ఇతర అధికారులు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో బహూకరించారు. విజయవాడ డీఆర్ఎంగా మోహిత్ సోనాకియా రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే డీఆర్ఎంగా మోహిత్ సోనాకియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1995, 1997లో ఐఐటీ కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్, అనంతరం మాస్టర్ డిగ్రి పొందిన ఆయన 1998లో ఉత్తర రైల్వేలోని ఘజియాబాద్లో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్గా భారతీయ రైల్వే సర్వీసులో చేరారు. ఈ కొత్త నియామకానికి ముందు ఆయన రైల్ వీల్ ఫ్యాక్టరీలో ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ (పీసీఈఈ)గా విధులు నిర్వర్తించారు. భారతీయ రైల్వేలో ఆయనకు 27 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది. ఏపీఎంఆర్సీలో కాన్పూర్ మెట్రో ప్రియారిటీ కారిడార్ను ప్రారంభించడంలో, నార్త్ ఈస్టర్న్ రైల్వేలోని వారణాసి డివిజన్లో ఛప్రా–గోరఖ్పూర్ విభాగంలో విద్యుదీకరణ ప్రాజెక్ట్లలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. -
ఇటీవల కాలంలో యువతకు సాహస యాత్రలపై ఆసక్తి పెరుగుతోంది. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవితాన్ని కాసేపు పాజ్ చేసి.. వీకెండ్స్, సెలవు రోజుల్లో ఎంచక్కా అడవుల బాట పడుతున్నారు. స్వచ్ఛమైన ప్రకృతి రమణీయతను ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యానికి కూడా నడక మంచిది కావడంతో అందరూ ట
ఇబ్రహీంపట్నం: విజయవాడ సమీపంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో ప్రకృతి అందాలు దాగి ఉన్నాయి. ఖిల్లాతో పాటు లోయలు, అడవిలో జలపాతాలు, కోట బురుజులు, కోనేరులు పర్యాటకులను కనువిందు చేస్తాయి. అంతేకాక కొండపల్లి ఫారెస్ట్ ట్రెక్కింగ్కు అనుకూలమైన ప్రాంతంగా ఇప్పటికే గుర్తించారు. 2018లో ఖిల్లా వేడుకల్లో భాగంగా ట్రెక్కింగ్ నిర్వహించి ప్రకృతి ప్రేమికులను ప్రోత్సహించారు. విజయవాడ యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు గతంలో ట్రెక్కింగ్ నిర్వహించి అనేక నూతన ప్రదేశాలు, ఫిరంగ్లు, సొరంగ మార్గాలు, రాతి శిలలను గుర్తించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియా, ఆర్డీవో చైతన్య సైతం ఖిల్లాపైకి ట్రెక్కింగ్ నిర్వహించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ క్రమంలో విద్యార్థులు, యువతీ యువకులు, క్రీడాకారులు వారాంతపు సెలవుల్లో ట్రెక్కింగ్ చేయడం ఆనవాయితీగా మారింది. సాహసం.. శ్వాసగా.. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ చారిత్రక సంపద, సాహస క్రీడలకు వేదికగా మారింది. ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కంచికచర్ల, నందిగామ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో సుమారు 28వేల ఎకరాల్లో ఫారెస్ట్ విస్తరించింది. ఈ గ్రామాల పరిధిలో ట్రెక్కింగ్ ప్రదేశాలు, జలపాతాలు, బ్రిటీష్ కాలం నాటి ఫిరంగ్లు, సొరంగ మార్గాలు, ఆయుర్వేద వన వృక్షాలు, సీతాకోకచిలుకలు, ఖిల్లా పురాతన కట్టడాలు కనువిందు చేస్తాయి. ఖిల్లా నుంచి కుడి ఎడమల వైపు సుమారు ఒకటి నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో రాతి శిలలు, ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. వీటితో పాటు నెమలిధార, మావూళ్లమ్మ తీర్థం, బేబీ చిత్రకూట్, కొంగుధార, వనమాలి, చిట్టితుంబరఽ దార, సప్తస్వరదారులు, కుడి ఎడమల జలపాతాలు దర్శనమిస్తాయి. కొండపల్లి ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి చేరుకున్న విద్యార్థులు(ఫైల్) ట్రెక్కింగ్ ప్రేమికులకు వరంలా మారిన రిజర్వ్ ఫారెస్ట్ సాహస యాత్రలపై ఆసక్తితో ముందడుగు ప్రకృతి రమణీయతకు తోడు, ఆరోగ్యదాయకం కావడంతో మొగ్గు అందరూ చేయొచ్చు.. సాహసోపేతంగా చేసే ట్రెక్కింగ్తో యువతీ యువకుల్లో ధైర్య సాహసాలు పెరుగుతాయి. ట్రెక్కింగ్ చేయగలిగిన వారు జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఒడిదుడుకులైనా సమర్థంగా ఎదుర్కొని మానసికంగా ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు. ట్రెక్కింగ్లో నాలుగేళ్ల చిన్నారుల నుంచి 50ఏళ్ల వయస్సు గల ఎవరైనా పాల్గొనవచ్చు. విజయవాడ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం రిజర్వ్ ఫారెస్ట్కు చేరుకుని ట్రెక్కింగ్ నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఎత్తయిన ఒంటిమిట్ట కొండ పైకి ట్రెక్కింగ్ చేస్తే విజయవాడ పట్టణం కనిపిస్తుంది. -
ట్రావెల్స్ బస్సు ఢీకొని యువకుడు మృతి
రామవరప్పాడు: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం అర్ధరాత్రి ఎనికేపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన శ్రీనివాసరావు కొత్త ఆటోనగర్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎనికేపాడు శివాలయం పల్లాల్లో రూమ్లో ఉంటూ విధులకు హాజరయ్యేవాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రవీణ్కుమార్ శ్రీనివాసరావుకు పరిచయమై స్నేహితులయ్యారు. ప్రవీణ్కుమార్కు వివాహం కాగా ప్రస్తుతం ఇతని భార్య గర్భవతి అని సమాచారం. ఆదివారం రాత్రి శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్ ద్విచక్రవాహనంపై రామవరప్పాడు వైపు వెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో ఎనికేపాడు జాతీయరహదారిపై మలుపు తిరుగుతున్నారు. ఇదే సమయంలో గన్నవరం నుంచి రామవరప్పాడు వైపు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మలుపు తిరుగుతున్న వీరిని ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలై శ్రీనివాసరావు మృతి చెంద గా, ప్రవీణ్కుమార్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్రవీణ్కుమార్ తల్లి ఇటీవల మరణించగా సోమవారం పెద్ద కర్మ జరగాల్సి ఉంది. అనుకోని ప్రమాదంలో ప్రవీణ్కుమార్కు తీవ్ర గాయాలై చికిత్స పొందుతుండటంతో జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని సోదరుడు ఉమాశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.365 గ్రాముల బంగారం, రూ.30వేల నగదు చోరీభవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంట్లోని బంగారం, నగదు చోరీకి గురైన ఘటనపై పటమట పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటమట వాసవీనగర్ కాలనీలో ఎదుటగల ఫన్క్లబ్ రోడ్ 9లో చిరుమామిళ్ల గిరిజా వరప్రసాద్ కుటుంబం నివసిస్తోంది. వారితోపాటు పనిమనిషి లక్ష్మి కూడా ఉంటోంది. గిరిజా వరప్రసాద్ వన్టౌన్లోని అమ్మ హోటల్ దగ్గర గల సుమన ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్నారు. వారు ప్రతి రోజూ రాత్రి 8.30 గంటలకు నిద్రపోతుంటారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ రాత్రికూడా యథావిధిగా అన్ని తలుపులు వేసి నిద్ర పోయారు. సోమవారం ఉదయం 6 గంటలకు లేచి చూడగా పూజ గది తలుపు తెరిచి ఉండి, ఇంటి తూర్పు వైపు ఉన్న తలుపుకూడా తెరిచి ఉంది. అలాగే బెడ్ రూంలోని బీరువా పగులకొట్టి ఉంది. అందులోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మొత్తం వెతికి చూడగా ఉత్తరం వైపు ఉన్న సింహద్వారం పక్కనగల కిటికి ఊసలు తొలగించి అందులో నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. బెడ్ రూంలో ఉన్న బీరువాలోని సుమారు 365 గ్రాముల బంగారు వస్తువులు, రూ.30వేల నగదు కనిపించలేదు. అందరూ నిద్రపోతున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి వచ్చి చోరీ చేసినట్లు బాధితుడు గిరిజా వరప్రసాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అర్జీల పరిష్కారంలో స్పష్టత ఉండాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారంలో పూర్తి స్పష్టత ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (ీపీజీఆర్ఎస్) జరిగింది. కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సమస్యల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించినా ఉపేక్షించబోనని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ప్రతి అర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో 192 అర్జీలు పీజీఆర్ఎస్లో మొత్తం 192 అర్జీలు అందాయన్నారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 60, విద్య 34, పోలీస్ శాఖకు 17, ఎంఏయూడీ 12, అటవీ 10, పంచాయతీరాజ్ 9, సర్వే 8, పౌరసరఫరాలు 7, హెల్త్ 6,బీసీ కార్పొరేషన్ 3, ఉపాధి కల్పన 3, మార్కెటింగ్ 3, ఏపీసీపీడీసీఎల్ 2, డీఆర్డీఏ 2, మత్స్య 2, ఇంటర్మీడియెట్ 2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 2, వ్యవసాయం, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్డబ్య్లుఆర్ఇఐఎస్, విభిన్న ప్రతిభావంతులు, డ్వామా, జలవనరులు, ఎల్డిఎం, ఆర్డబ్ల్యూఎస్, సోషల్ వెల్ఫేర్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఒక్కో అర్జీ చొప్పున అందాయన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఏసీపీ కె. వెంకటేశ్వరరావు, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ జి.లక్ష్మీశ -
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
కంచికచర్ల: జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు. ముమ్మరంగా ఖరీఫ్ వ్యవసాయ పనులు సాగుతున్న వేళ సమృద్ధిగా ఎరువులు, పురుగుమందులు అంటుబాటులో ఉన్నాయని చెప్పారు. కంచికచర్లలో శ్రీ కనకదుర్గ ఎరువులు, పురుగుమందుల దుకాణం, గోదాముతో పాటు మన గ్రోమోర్ ఎరువులు, పురుగుమందుల దుకాణాలను సోమవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా స్టాక్ రిజిస్టర్తో పాటు ఫిజికల్ స్టాటస్ ఆన్లైన్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎరువుల సరఫరాపై అప్రమత్తంగా ఉన్నామని, ప్రస్తుతం జిల్లాలో 9,976 మెట్రిక్ టన్నుల యూరియా, 2,457 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1,157 మెట్రిక్ టన్నుల ఎంవీపీ, 14,197 మెట్రిక్ టన్నుల ఎస్పీకే మొత్తం 30,332 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఆర్డీఓలు, తహసీల్దార్లు తనిఖీలు చేస్తున్నారని, డీలర్లు కృత్రిమ కొరతను సృష్టించడం, ఎరువులను అధిక ధరలకు విక్రయించడం, రైతు కోరిన ఎరువును కాకుండా వేరే ఎరువులను ఇవ్వడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులు లేదా ఏదైనా సమాచారం కోసం కలెక్టరేట్లో 91549 70454 నంబర్తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగంతో కలిగే దుష్పరిమాణాలపై రైతులకు అవగాహన కల్పించి ప్రకృతి సాగువిధానాల దిశగా మళ్లిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లాలో అగ్రిటెక్ను అధిక ఆదాయాలు వచ్చే ఉద్యాన పంటలను కూడా ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ అన్నారు. తనిఖీల్లో నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ, అగ్రికల్చర్ ఏడీ ఐకే శ్రీనివాసరావు, తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు, మండల వ్యవసాయ అధికారి కె.విజయకుమార్, ఆర్ఐ వెంకటరెడ్డి, వీఆర్వోలు పాల్గొన్నారు. రైతుల నుంచి ఫిర్యాదులొస్తే ఉపేక్షించేది లేదు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
అందని ఉపాధి
ఈ ఏడాది మే, జూన్ నెలల్లో సాధారణ పరిస్థితుల కంటే భిన్నమైన వాతావరణం నెలకొంది. తీవ్రమైన ఎండలు వేశాయి. ఎండను సైతం ఖాతరు చేయకుండా కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. సొమ్ము అందుతుందని ఆశించిన కూలీలు ప్రతి రోజూ అధికారులు, బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నిరాశ చెందుతున్న దుస్థితి. నెలల తరబడి కూలీ డబ్బులు అందకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇల్లు గడవటానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. పాలకులు కూలీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో బకాయి పేరుకుపోయింది. కూలీల సమస్యను పట్టించుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొమ్ము విడుదలలో తాత్సారం కంకిపాడు: ఉపాధి పనుల వేతనాల కోసం కూలీలు నిరీక్షిస్తున్నారు. పనులు చేసి నెలలు గడుస్తున్నా కూలీల బ్యాంకు ఖాతాలకు జమ కావడం లేదు. అధికారులు, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా డబ్బులు మాత్రం చేతికందడం లేదంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి సొమ్ము విడుదల కావడంలో పాలకులు తాత్సారం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 25 మండలాల్లో.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో ఉపాధి పనులు నిర్వహించారు. ప్రధానంగా కాలువలు, చెరువుల పూడికతీత పనులు, తూటు, గుర్రపుడెక్క తొలగింపు, మెట్ట భూముల్లో ఆయిల్పామ్, మామిడి, ఇతర ఉద్యాన మొక్కలు నాటే పనులు చేశారు. 2025–26 సంవత్సరానికి 74 లక్షలు పనిదినాలు లక్ష్యంగా డ్వామా అధికారులు నిర్దేశించుకున్నారు. ఇందుకు జిల్లాలోని 2.50 లక్షల జాబ్ కార్డుల్లో ఉన్న 3.18 లక్షలు పైగా వ్యక్తిగత జాబ్ కార్డుదారులు ఉపాధి కూలీలుగా ఉన్నారు. వీరికి ఈ ఏడాది వేసవిలో అత్యధికంగా ఉపాధి కల్పన చేశారు. ఇప్పటికే 53 లక్షలు పనిదినాలు పూర్తి చేశారు. దీని తాలూకూ రూ.150 కోట్లు సొమ్ము కూలి రూపంలో రైతులకు అందాల్సి ఉండగా కొంత మేరకు చెల్లింపులు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ఉపాధి పనుల్లో పాల్గొన్న కూలీలు సొమ్ము చెల్లించినట్లు డ్వామా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. పేరుకున్న బకాయిలు జిల్లాలో ఏప్రిల్ నెల వరకూ ఉపాధి పనులు చేసిన కూలీ సొమ్ము చెల్లింపులు జరిగాయి. ఇంకా 25 లక్షలు పనిదినాలు పెండింగ్లో ఉన్నాయి. వీటికి సంబంధించి రూ. 70 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. ఒక్కో కూలీ రెండు, మూడు నెలల పాటు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. సరా సరిన రోజుకు రూ.260పైగా కూలిసొమ్ము ఉపాధి కూలీలకు దక్కాల్సి ఉంది. మూడు నెలలుగా విడుదల కాని వేతనాలు కృష్ణా జిల్లాలో 25 లక్షల పనిదినాలకు సంబంధించి రూ.75 కోట్ల బకాయిలు సొమ్ము కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణ వేతనాలు విడుదల చేయాలంటున్న కూలీలు -
నీలినీడలు!
పరీక్షలన్నీ జిల్లా కేంద్రానికే.. నియోజకవర్గ కేంద్రాల్లో ల్యాబ్లకు వచ్చే పరీక్షలన్నీ జిల్లా కేంద్రానికి తీసుకురావాలని ల్యాబ్ బాధ్యతలను చూసే ఇన్చార్జి ఏవోలకు, పశుసంవర్థక శాఖ ఎల్టీలకు ఆదేశాలు వచ్చాయి. పెడన పశుసంవర్థక శాఖ టెక్నీషియన్ మెడికల్ లీవ్ పెట్టడంతో ఈ ల్యాబ్ వారంలో రోజు విడిచి రోజు మూడు రోజులు తెరుస్తున్నారు. పరీక్షలు చేయడానికి వర్క్ అంతంత మాత్రమే ఉండటంతో ఏమి చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ల్యాబ్ పరిసరాలు కూడా చెత్తాచెదారంతో నిండిపోయి పాములకు ఆవాసాలుగా ఏర్పడుతున్నాయి. ఏఓలే ఇన్చార్జులు వీటిపై అగ్రికల్చర్ డీఏవో మనోహారరావు మాట్లాడుతూ అగ్రిల్యాబ్లకు నియోజకవర్గ కేంద్రాల్లోని ఏవోలనే ఇన్చార్జులుగా నియమించామన్నారు. సిబ్బంది కొరత కారణంగా అక్కడకు వచ్చే పరీక్షలను జిల్లా కేంద్రానికి పంపించాలని పేర్కొన్నామని తెలిపారు. పెడన: ఎన్డీయే కూటమి పాలనలో వైఎస్సార్ అగ్రి ల్యాబ్ల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వాటిని ఉంచుతారో లేదో అనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ రైతులతో పాటు పాడి రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో నాడు వైఎస్సార్ సీపీ హయాంలో నియోజకవర్గ కేంద్రంలోని ప్రతి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఒక అగ్రి ల్యాబ్ ఉండాలని నిర్ణయించారు. దీంతో పాటు పశుసంవర్థక శాఖ ప్రయోగశాల కూడా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్క దానిని రూ.60 లక్షలకు పైగా వెచ్చించి నిర్మించారు. వీటిలో పరీక్షల కోసం రూ.లక్షల ఖర్చుపెట్టి ప్రత్యేకమైన పరికరాలు, పనిముట్లను ఏర్పాటు చేశారు. అగ్రి ల్యాబ్లో ఏవోతో పాటు ఏఈవోను ప్రత్యేకంగా నియమించారు. వ్యవసాయశాఖ రైతులు జిల్లా కేంద్రానికి వెళ్లకుండా నియోజకవర్గ కేంద్రంలో మట్టి పరీక్షలు, ఎరువులు, విత్తనాల పరీక్షలు తదితర వాటిని చేయించుకునేవారు. పాడి రైతులు తమ పశువులకు రక్త పరీక్షలతో పాటు పేడ, మూత్రం తదితర వాటిని కూడా పరీక్షలు చేయించుకున్నారు. కానీ నేడు వ్యవసాయశాఖ రైతులకు, పాడి రైతులకు ఈ ల్యాబ్లు అందుబాటులో లేకుండా ఎన్డీయే సర్కారు కంకణం కట్టుకుంది. ల్యాబ్లు తెరుచుకునే పరిస్థితి రాకుండా చేస్తోంది. ● ఎన్డీయే అధికారంలోకి రాగానే.. సంచార వైద్యశాల అంబులెన్సులు రద్దు ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీలో పేదలకు, వ్యవసాయ రైతులకు, పాడి రైతులకు కల్పించిన వాటిని తొలగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా సంచారవైద్యశాల అంబులెన్సులను రద్దు చేసింది. గతంలో వైఎస్సార్ పశుసంవర్థక శాఖ ల్యాబ్ పరిధిలో నియోజకవర్గానికి రెండు చొప్పున ఉండేవి. 1962 నంబరుకు ఫోను చేసి పశువులకు ఇబ్బంది అంటే పశువైద్యులు, సిబ్బంది అంబు లెన్సుతో అనారోగ్యానికి గురైన పశువు ఉన్న చోటికే వెళ్లి వైద్యం అందించేవారు. ఇటువంటి అంబులెన్సులను సైతం రద్దు చేశారు. ఇప్పుడు ల్యాబ్ల వంతు వచ్చింది. సిబ్బందిని నియమించకుండా.. తెరవనీయకుండా చేస్తున్నారు. ● ఉన్న వారిని తొలగించి.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అగ్రిల్యాబ్లో ఒక ఏవో, ఏఈవో విధులు నిర్వహించే వారు. స్థానికంగా రైతుల నుంచి వచ్చే వాటినే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చే శాంపిల్స్ను పరీక్షించి నివేదికలను పంపించేవారు. అటువంటి సిబ్బందిని ప్రస్తుత ఎన్డీయే కూటమి ఇతర మండలాలకు బదిలీ చేసింది. నియోజకవర్గ కేంద్రంలో ఏవోగా విధులు నిర్వహించే వారికే ల్యాబ్ బాధ్యతలను చూసుకోవాలని అప్పగించారు. వీరికి మండలంలోని ఏవో బాధ్యతలతోనే రోజులు గడిచిపోతున్నాయి. వైఎస్సార్ అగ్రి ల్యాబ్లపై నిర్లక్ష్యం అప్పుడప్పుడు తెరుచుకుంటున్న పశువ్యాధి నిర్ధారణప్రయోగశాలలు అధికారులను నియమించ కుండా ఏవోలకు బాధ్యతలు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 10 ప్రయోగశాలలు జిల్లాకు ఒక ల్యాబ్ చాలంటున్న కూటమి సర్కారు అగ్రిల్యాబ్లకు తెరుచుకోని తాళం ఇలాంటి పరిస్థితుల్లో అగ్రి ల్యాబ్ తాళం తెరుచుకోని దుస్థితి ఎదురవుతోంది ఇక పశుసంవర్థక శాఖ ల్యాబ్ల్లో మొదటి నుంచి ల్యాబ్ టెక్నీషియన్ను, ఒక అసిస్టెంట్ను నియమించారు. ఈ ల్యాబ్లో కూడా అసిస్టెంట్లను తొలగించి ఎల్టీని మాత్రమే ఉంచారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతో పాటు పెడన, పామర్రు, కంకిపాడు, గుడ్లవల్లేరు, అవనిగడ్డ, గన్నవరం నియోజక వర్గాల్లో ఈ ల్యాబ్లున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ నియోజకవర్గాలలో ల్యాబ్లున్నాయి. మచిలీపట్నం, విజయవాడలలో ల్యాబ్లకు మినహా మిగిలిన చోట ఏవో, ఏఈవోలను తీసేశారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన..10 మందికే అనుమతి!
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు చర్యలకు దిగింది. వైఎస్ జగన్ ఏ పర్యటన చేపట్టినా జనం ప్రభంజనంలా తరలి రావడాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని జనాన్ని నియంత్రించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 31వ తేదీన (గురువారం) వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై ఆంక్షలు విధించింది. కేవలం పది మందికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులతో నోటీసులు ఇప్పించింది చంద్రబాబు సర్కారు. వైఎస్ జగన్ హెలీప్యాడ్ వద్ద కేవలం పది మంది మాత్రమే ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనలో భాగంగా జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ నేత కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్ కానున్నారు. ఇక్కడకు కూడా జనం రాకూడదని ఆంక్షలు విధించింది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ప్రసన్నకుమార్రెడ్డి నివాసానికి వైఎస్ జగన్ వెళ్లే క్రమంలో కూడా జనానికి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం కాన్వాయ్లకు మాత్రమే అనుమతి ఉందని, జనం పది మంది మించి రావడానికి వీల్లేదని నోటీసుల్లో స్పష్టం చేశారు. జగన్ వస్తున్నారంటే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం ఉండటంతో కూటమి సర్కారు భయభ్రాంతులకు గురౌవుతుంది., అందుకే ఆంక్షలతో వైఎస్ జగన్ జనాభిమానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. అప్పుడు హెలీప్యాడ్కు అనుమతి లేదంటూ..జులై 3న వైఎస్ జగన్ చేపట్టాల్సిన నెల్లూరు పర్యటనకు సైతం అడ్డంకులు సృష్టించింది కూటమి సర్కారు. హెలీప్యాడ్కు అనుమతి ఇవ్వకుండా కుట్రలకు తెరలేపింది. గత నెల 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్సీపీ నేతలు దరఖాస్తు చేశారు. ఆ సమయంలో హెలిప్యాడ్కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కల్గించారు. ఇప్పుడు పది మంది మాత్రమే రావాలంటూ ఆంక్షల పర్వాన్ని తెరపైకి తెస్తూ మరోమారు నోటీసులు ఇవ్వడం వైఎస్ జగన్ పర్యటనను ఏదో రకంగా అడ్డుకోవాలని చూడటమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, విజయవాడ: స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ అట్లూరి నమ్రతతో సహా 8 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసుల నేపథ్యంలో.. నగరంలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను రాత్రికి రాత్రే ఎత్తేసినట్లు తెలుస్తోంది. సెంటర్కి ఉన్న బోర్డులను తొలగించడంతో పాటు సెల్లార్లో ఉన్న రెండు కార్లు మాయం అయ్యాయి. అదే సమయంలో..విజయవాడ సెంటర్కు అనుమతులు లేవని, అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైధ్యాధికారులు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సోమవారం ఉదయం సెంటర్కు ఉన్న బోర్డులు మాయం కావడం గమనార్హం. ఉదయం 11గం. అయినా సిబ్బంది సెంటర్కు రాలేదు. మరోవైపు ల్యాబ్ ఇంఛార్జి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలు సిద్ధం అవుతుండగా.. డాక్టర్ కరుణ, డాక్టర్ వైశాలి, మిగతా సిబ్బంది సైతం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సెంటర్ వద్దకు చేరుకుని పరిశీలనలు జరుపుతున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరొకరి వీర్యకణాలతో సంతానం కలిగించడం లాంటి గలీజు దందా ఓ కేసు ద్వారా బయటపడింది. సికింద్రాబాద్లో ఇది చోటు చేసుకోగా.. అటుపై విజయవాడ, విశాఖపట్నంలోసెంటర్లలోనూ ఇంతకు మించే వ్యవహారాలు జరిగాయని తేలింది. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి.. సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడైంది. గతంలోనూ ఈ సెంటర్లపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసికి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షలు రూపాయలు వసూలు చేసింది డాక్టర్ నమ్రతా. ఢిల్లీకి చెందిన గర్భిణిని ఫ్లైట్లో విశాఖకు తీసుకొచ్చి .. కోల్కతాలోని ఓ దంపతులకు సరోగసి బిడ్డగా అప్పగించింది. ఇందుకుగానూ రూ.30 లక్షలు వసూలు చేసి.. ఇదే విధంగా కోట్ల రూపాయల దందా చేసినట్లు తేలింది. దీంతో ఆమెపై కేసు నమోదు కావడంతో పాటు సెంటర్లకు సీజ్ పడడం, ఆమె లైసెన్స్లు రద్దు కావడం జరిగిది. అయితే.. తీగలాగితే.. సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం ఘటనతో.. శనివారం ఉత్తర మండలం డీసీపీ సాధనరష్మి పెరుమాళ్, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, ఐవీఎఫ్, సరోగసీ విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడల్లోనూ సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్కతాలలో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీవారు బ్రాంచీలు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో హైదరాబాద్ కేపీహెచ్బీ, గోపాలపురం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నమ్రత వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసినా(గతంలో) మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ తరుణంలో.. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరాలు తీయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. వ్యాపార అభివృద్ధి కోసం బీహార్ నుంచి పూజారులను రప్పించి మరీ 9 రోజులపాటు నమ్రత హోమాలు చేయించింది. బెజవాడ సృష్టిలో.. డాక్టర్ కరుణ, డాక్టర్ సోనాలి, డాక్టర్ వైశాలి ఆధ్వర్యంలో సెంటర్ను నమ్రత నడిపిస్తోంది. ఇటు విశాఖలోనూ మహారాణిపేట పీఎస్ పరిధిలోని సెంటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2023లోనే వీటి లైసెన్లు ముగిశాయి. అయినా కూడా రెండు ఫ్లోర్లలో అనధికార సెంటర్లు నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి మేనేజర్ కళ్యాణిని అదుపులోకి తీసుకుని.. కీలక రికార్డులు స్వాధీనపర్చుకున్నారు. ఇక్కడా ఇతర డాక్టర్ల లైసెన్స్ల మీద నమ్రత నడిపిస్తున్న దందా బయటపడింది. నమ్రతకు నమ్మిన బంటుగా కల్యాణి..విశాఖ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో మేనేజర్గా పని చేసిన కల్యాణి అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పేద మహిళలకు డబ్బు ఆశ చూపడంలో కల్యాణి నెట్ వర్క్ కీలకమని, వాళ్లకు బ్రెయిన్వాష్ చేయడంలో కల్యాణి సిద్ధహస్తురాలిగా మారిందని పోలీసులు గుర్తించారు. 2020 నుంచి నమ్రతతో కలిసి పని చేస్తున్న కల్యాణి.. గతంలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. అయితే ఈ ఐదేళ్లలో నర్సు నుంచి ఏకంగా ఓ యూనిట్ మేనేజర్గా ఆమె ఎదిగడం కొసమెరుపు. -
దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ జరిగాయి. సమస్త జీవరాశికి ఆహారాన్ని అందించే సూర్య భగవానుడిని ఆరాధించడంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుష్షు వృద్ధి చెందుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొనగా, వారికి ప్రత్యేక క్యూలైన్లో అమ్మవారి దర్శనం చేయించారు. -
కేర్లెస్ హాస్టల్స్!
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యార్థుల హాస్టళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వందలాది మంది విద్యార్థులు రెండు మూడు బ్లాకుల్లోని హాస్టళ్లలో ఉంటారు. వీటిలో వసతులు, సౌకర్యాలు, భోజనం వంటి పర్యవేక్షణ సరిగా లేని పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కొన్నేళ్లుగా అనధికారికంగా ఒక ప్రైవేటు వ్యక్తి నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అతనే విద్యార్థుల నుంచి మెస్ చార్జీలను సైతం వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే హాస్టల్లో ఏదైనా సమస్య వస్తే ఆ వ్యక్తి అందుబాటులో ఉండరని, అతను ఏలూరులో నివాసం ఉంటున్నట్లు వైద్య కళాశాల ఉద్యోగులే చెబుతున్నారు. అంతేకాదు హాస్టల్స్ అనేక లోపాలు ఉన్నట్లు వైద్య విద్యార్థులు చెబుతున్నారు. కళాశాలలో శాశ్వత ఉద్యోగి కాని వ్యక్తి విద్యార్థుల నుంచి మెస్ చార్జీలు ఎలా వసూలు చేస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనిపై లోతుగా విచారిస్తే అనేక అవకతవకలు వెలుగు చూసే అవకాశం ఉంది. నెల రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. మొత్తం 850 మందిపైనే..వైద్య కళాశాల హాస్టల్స్లో సుమారు 850 మందికిపైగా విద్యార్థులు ఉంటున్నారు. వారిలో 650 మంది యూజీ విద్యార్థులు, వారిలో 350 మంది గరల్స్, 300 మంది బాయ్స్ ఉన్నారు. మరో 200 మంది వరకూ పీజీ విద్యార్థులు ఉంటారు. ఇలా మొత్తం 800 మందికి పైగానే హాస్టల్స్లో ఉంటున్నారు. వీరిలో యూజీ విద్యార్థులు ఏడాదికి రూ.19 వేలు చెల్లిస్తుంటారు. పీజీ విద్యార్థులు నెలకు రూ.4వేలు చెల్లిస్తారు. ఇవన్నీ ప్రైవేటు వ్యక్తి వసూళ్లు చేసి, హాస్టల్ కమిటీ అకౌంట్లో జమ చేస్తుంటారు. మళ్లీ వాటి నుంచి ఖర్చు రూపేణా ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తులతో నిర్వహణ!వైద్య విద్యార్థుల హాస్టల్స్ నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులు చూస్తున్నారు. కేర్టేకర్తో పాటు, మరో 16 మంది ఉన్నారు. వారంతా విద్యార్థులు చెల్లించే మెస్చార్జీల్లోనే జీతాలు పొందుతున్నారు. కమిటీ, వార్డెన్ ఉన్నా నామమాత్రమేనని చెబుతున్నారు. హాస్టల్లో ఏదైనా కొనాలన్నా, పనులు చేయించాలన్నా అతనే కొటేషన్ తీసుకొచ్చి చేయిస్తుంటాడని చెబుతున్నారు. ఇలా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు. వాస్తవానికి సెక్యూరిటీ, శానిటేషన్ పనులు చేసేందుకు కళాశాలలో కాంట్రాక్టు సంస్థ ఉంది. వారే ఇక్కడ కూడా విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇస్తే, విద్యార్థుల నుంచి వసూలు చేసే మెస్చార్జీల్లో జీతాలు చెల్లించాల్సిన అవసరం ఉండదని పలువురు అంటున్నారు. కేర్టేకర్గా ఉన్న వ్యక్తిని తొలగించాలని స్టూడెంట్స్ అసోసియేషన్ ఎప్పటి నుంచో చెబుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. అతని అక్రమాలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయంటున్నారు. ఇప్పటికై నా స్పందించి హాస్టల్స్ నిర్వహణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలంటున్నారు. సౌకర్యాలు అంతంత మాత్రమే వైద్య విద్యార్థుల భద్రత ఏదీ! హాస్టల్స్ నిర్వహణ ప్రైవేటు వ్యక్తి చేతుల్లో.. ఉండేది ఏలూరులో విద్యార్థుల నుంచి మెస్ చార్జీల వసూళ్లు చేసేది ఆయనే వార్డెన్, కమిటీ ఉన్నా.. పెత్తనం అంతా ఆ వ్యక్తిదే.. కొత్త ప్రిన్సిపాల్ దృష్టి సారించేనా? చర్యలు తీసుకుంటాం వైద్య విద్యార్థుల హాస్టల్స్ నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించాను. రెండు సార్లు హాస్టల్స్లో ఆకస్మిక తనిఖీలు చేసి, సమస్యలు తెలుసుకున్నా. అంతేకాకుండా ఇటీవల హాస్టల్స్ కమిటీ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. విద్యార్థుల మెస్ చార్జీల వసూలు, కార్యాలయ ఉద్యోగికి అప్పగిస్తాం. అంతేకాకుండా హాస్టల్స్ నిర్వాహణను మెరుగుపర్చే చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ఈ హాస్టల్స్లో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. సరైన తాగునీటి వసతి లేక పోవడం, డైనింగ్హాల్లో అపరిశుభ్ర వాతావరణం, టాయిలెట్స్ సరిగా శుభ్రపరచకపోవడం వంటి అనేక సమస్యలు ఉన్నాయి. కొన్ని గదుల కిటికీలకు తలుపులు ఊడిపోయేలా ఉండటం, ఫ్లోరింగ్ సరిగా లేక పోవడం వంటివి ఉన్నాయి. వాటన్నింటిపై అధికారులు దృష్టి పెట్టాలంటున్నారు. భవనాల మరమ్మతులు కూడా నోచుకోవడం లేదంటున్నారు. వాటిపై దృష్టి పెట్టాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. -
ఎక్మోతో పునర్జన్మ ప్రసాదించవచ్చు
మణిపాల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సునీల్ కారంత్ లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండె, ఊపిరితిత్తుల పనితీరు క్షీణించినప్పుడు ప్రత్యామ్నాయంగా ఎక్మోపై ఉంచి, రోగికి చికిత్స అందించొచ్చని మణిపాల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సునీల్ కారంత్ అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ శాఖతో కలిసి మణిపాల్ హాస్పిటల్ ఆదివారం ‘మాస్టరింగ్ ఎక్మో’ అనే అంశంపై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్(సీఎంఈ) సదస్సు ఆదివారం జరిగింది. విజయవాడ మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్లో జరిగిన సదస్సును డాక్టర్ సునీల్ కారత్, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ సురేష్కుమార్, డాక్టర్ హనుమయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం దేశంలో కేర్ మెడిసిన్లో అత్యుత్తమ నిపుణులు ఎక్స్ట్రా కార్పోరియల్ మైంబ్రేన్ ఆక్సిజనేషన్(ఎక్మో)లో అధునాతన పద్ధతులు, ఆవిష్కరణలపై చర్చించారు. ఎక్మో భాగాలు, కాన్యులేషన్ పద్ధతులు, ఆక్సిజనేటర్ వైఫల్యం, ఎయిర్ఎంబోలిజం నిర్వహణ–4హెచ్ ట్రబుల్షూటింగ్ వ్యూహాలపై దృష్టి సాధించే ఆచరణాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేసి డెమో ఇచ్చారు. డెమోను డాక్టర్లు శిల్పా చౌదరి, ధరణింద్ర, శ్రీకాంత్, జ్యోతి, దినేష్ నిర్వహించారు. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియో వాస్కులర్ సర్జన్ డాక్టర్ దేవానంద్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ శ్రీనివాస్ సామవేదం, బెంగళూరుకు చెందిన డాక్టర్ కార్తీక్ హనుమాన్ శెట్టి, డాక్టర్ వినయ్.కె, మణిపాల్ హాస్పిటల్ క్రిటికల్కేర్, పల్మనాలజీ వైద్యులు టి.శ్రీనివాసరావు, డాక్టర్లు వి.దినేష్కుమార్, లోకేష్ గుత్తా, ఉదయ్కిరణ్, డాక్టర్ జగన్మోహన్, మాధుర్య సీహెచ్, డి.అనీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి పర్యవేక్షించారు. -
బోద వ్యాధిగ్రస్తుల ప్రాణాలు కాపాడండి
●ఫ్లోరోసిడ్ ఇంజెక్షన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి ●కృష్ణా జిల్లా డ్రగ్స్ అధికారులకు కొల్లూరి విజ్ఞప్తి మచిలీపట్నంటౌన్: ఫ్లోరోసిడ్ ఇంజెక్షన్ల తయారీని నిలిపివేశారని ఈ మందు లేక బోధ వ్యాధిగ్రస్తులు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని వారిని కాపాడాలని కృష్ణాజిల్లా డ్రగ్స్ అధికారులకు పెడన హోల్సేల్ అండ్ రిటైల్ కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొల్లూరి సత్యనారాయణ (చిన్నా) విజ్ఞప్తి చేశారు. నగరంలో ఆదివారం జరిగిన కృష్ణాజిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో చిన్నా ఈ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సోకుతున్న ఈ వ్యాధిని నియంత్రించడానికి మందును అందుబాటులోకి తేవాలన్న ఆయన విజ్ఞప్తిపై స్పందించిన ఉమ్మడి కృష్ణాజిల్లా డ్రగ్స్ ఏడీ కోట అనీల్ కుమార్ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు లోకల్, నాన్–లోకల్ మార్పులతో ఇబ్బందులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభమై డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు మొదలైన సమయంలో లోకల్, నాన్–లోకల్ నిబంధనల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎ.సురేష్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైన నేపథ్యంలో ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలు, ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిబంధనలను స్పష్టం చేస్తూ ఏపీ ప్రభుత్వం మే 15న ఉన్నత విద్యా శాఖ ద్వారా 21, 22, 23, 36 జీఓలను జారీ చేసిందన్నారు. వీటి ప్రకారం ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ కోర్సుల్లో 15 శాతం నాన్–లోకల్ కోటాను రద్దు చేసి 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని సీట్లను లోకల్ విద్యార్థులకు కేటాయించారని పేర్కొన్నారు. ఈ నిబంధన ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన ఏయూ రీజియన్, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలతో కూడిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రీజియన్లలో తొమ్మిది నుంచి ఇంటర్ వరకు నాలుగేళ్లు చదివిన విద్యార్థులు మాత్రమే లోకల్గా గుర్తింపు పొందుతారని వివరించారు. రాష్ట్ర కోటా సీట్లకు అర్హత కోల్పోతున్నారు ఎస్వీయూ రీజియన్ నుంచి విజయవాడ (ఏయూ) రీజియన్లో ఇంటర్ చదివిన వేలాది విద్యార్థులు రెండు ప్రాంతాల్లోనూ నాన్–లోకల్గా మారారని, దీంతో సుమారు ఏడు వేల ఇంజినీరింగ్, అనేక మంది నీట్ అభ్యర్థులు 85 శాతం రాష్ట్ర కోటా సీట్లకు అర్హత కోల్పోతున్నారని వివరించారు. ఎస్వీయూ రీజియన్లో కోచింగ్ సౌకర్యాలు పరిమితమైనందున విద్యార్థులు నీట్ కోసం విజయవాడకు వచ్చి చదువుకుంటున్నారని పేర్కొన్నారు. అయినా 36 జీఓతో వారు రాష్ట్ర కోటా సీట్లకు అనర్హులవుతున్నారు. దీంతో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నిర్ణయం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్ర కోటా సీట్లు కోల్పోవడంతో విద్యార్థులు ఖరీదైన ప్రైవేట్ కళాశాలలపై ఆధారపడవలసి వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి జీఓలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టివేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు ఎడ్యుకేషన్: పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంటు అండ్ ఇంజినీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీఎంబీ బుచ్చిరాజు డిమాండ్ చేశారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. బుచ్చిరాజు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలోని విశ్రాంత ఉద్యోగులు, ఇంజినీరింగ్ అధికారుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగులు, ఇంజనీర్లు పెన్షన్, మెడికల్ రీ–యింబర్స్మెంట్ వంటి అంశాల్లో వేతన విభజన చట్టాల ముసుగులో జరుగుతున్న వర్గీకరణ కారణంగా ఇబ్బందులు పడుతూ, నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ దారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి గానూ అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపుతో ప్రధానికి ఒక వినతి పత్రాన్ని పంపనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ పంచాయతీరాజ్ ఉద్యోగుల ఇంజినీర్ల వేతన సవరణ, బకాయిలు, డీఏలు, మెడికల్ రీ–యింబర్స్మెంట్ వంటి అంశాల్లో అన్యాయం జరుగుతోందని వివరించారు. వేతన సవరణను పూర్తి స్థాయిలో అమలుచేయాలి12వ వేతన సవరణ పూర్తి స్థాయిలోఅమలు చేయడంతో పాటు 35 శాతం ఐఆర్ మంజూరు చేయాలని ఆయన కోరారు. 12వ పీఆర్సీలో చట్టబద్ధత కల్పించి, 11 పీఆర్సీలో అమలు చేసిన విధంగా అదనపు పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవో 315ను సవరించి, భార్యాభర్తలకు కుటుంబ పెన్షన్ వర్తించేలా మార్పులు చేయాలని సూచించారు. యూజీసీ స్కేల్స్ పరిధిలోకి వచ్చే పెన్షన్దారులకు అదనపు పింఛన్, 10వ పీఆర్సీ తరహాలో రిఫండ్ డెత్ రిలీఫ్ అమలు పర్చాలని కోరారు. పీఆర్సీ, డీఏ బకాయిలతో పాటు ఉద్యోగుల హెల్త్ స్కీం క్లెయిమ్స్ను చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ రీ–యింబర్స్మెంట్ పూర్తిగా ఈహెచ్ఎస్ కింద చెల్లించాలని, ఆరోగ్య బీమా కార్డులను పరిమితులు లేకుండా అందరికీ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు అమరావతిలో భవనం నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులను కలుస్తామని తెలిపారు. సమావేశంలో సంఘ అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి యు.కూర్మారావు, కోశాధికారి బి.శివరామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.శ్రీనివాసరావు, ఎం.వి.రంగాచారి, వి.వెంకటేశ్వరరావు, 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పీఆర్ విశ్రాంత ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు -
ఘనంగా కుంభాభిషేక మహోత్సవాలు
విజయవాడ కల్చరల్: టీటీడీ ఆధ్వర్యంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే అష్టబంధన, మహాసంప్రోక్షణ, కుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండపంలో కొలువైఉన్న పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో అధికారులు సర్వాంగ సుందరంగా యాగశాలను నిర్మించారు. టీటీడీ కంకణభట్టార్ మురళీకృష్ణ అయ్యంగార్, వేదాంతం వెంకటకిషోర్ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేశారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ లలితా రమాదేవి, ఎస్వీఎస్ఎస్ టెంపుల్ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు, డెప్యూటీ ఏఈ నాగభూషణం పాల్గొన్నారు. సోమవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నవగ్రహారాధన, కుంభారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డీఎస్పీల మృతికి రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం సంతాపం వన్టౌన్(విజయవాటపశ్చిమ): ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ డీఎస్పీల మరణానికి సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏఎస్ఎన్రెడ్డి, టి.హరి కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చౌటుప్పల్ సమీపంలోని జాతీయ రహ దారి–65పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు చెందిన ఇద్దరు డెప్యూటీ సూపరింటెండెంట్లు అకాల మరణం తమ సంఘానికి తీవ్ర మనస్తాపం కలిగించిందని పేర్కొన్నారు. మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడటంపై దిగ్భ్రాంతి చెందామని తెలిపారు. గాయపడిన అధికారులు త్వరగా, పూర్తిగా కోలుకోవాలనికోరుకుంటున్నట్లు తెలిపారు. ఈగల్ బృందాల విస్తృత తనిఖీలు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈగల్ బృందాలు శనివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేశాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏసీపీలు ఎస్.కిరణ్కుమార్, కె.లతాకుమారి పర్యవేక్షణలోఇంటర్ సెప్టర్, యాంటీ నార్కోటిక్, ఈగల్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తూ మద్యం, గంజాయి, ఇతర వస్తువులను రవాణా నియంత్రించడం, అనుమానిత ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేయడం వంటివి చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిని గుర్తించి వారికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా శనివారం రాత్రి 163 మందికి కౌన్సిలింగ్ ఇవ్వగా, 69 మందిని అనుమానిత వ్యక్తులుగా మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ ద్వారా తనిఖీ చేశారు. -
కృష్ణానదికి ‘మహావస్త్ర సమర్పణ’కు సన్నాహాలు
నాగాయలంక: కృష్ణానది వద్ద శ్రీరామపాదక్షేత్రం కమిటీ, భక్తుల ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీ చేయనున్న మహావస్త్ర సమర్పణ వేడుక నిర్వహణ సన్నాహాకాలు నాగాయలంక ఘాట్ వద్ద ఆదివారం ఆరంభించారు. దాతలు సమకూర్చే కొత్త చీరలను సమీకరించి క్షేత్రపాలకుడు తలశిల రఘుశేఖర్ నేతృత్వంలో ఆధ్యాత్మిక సేవకులు, భక్తులు ఒకదానికి ఒకటి ముడి వేస్తూ చీరల తోరణంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే 350చీరలు కమిటీకి అందగా వీటిల్లో 300చీరలను ఆర్యవైశ్య ప్రముఖులైన చిట్టా హరేకృష్ణ, వాణి దంపతుల ఆధ్వర్యంలో దాతల నుంచి సేకరించి తెచ్చారు. నదికి ఇరువైపుల రెండు తీరాల నడుమ రెండు కిలో మీటర్లకు పైగా దూరం ఉన్నందున వీటిని మహా వస్త్రంగా మలచడంలో ఇబ్బందులు అధిగమించే ప్రణాళికలో భాగంగానే ఈ సన్నాహాక పనులు ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు రఘుశేఖర్ చెప్పారు. వారణాసిలో గంగానదికి ఇలా 400మీటర్ల మహావస్త్రం సమర్పించినట్లు వచ్చిన వీడియో వార్త ఈవేడుక నిర్వహణకు స్ఫూర్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
సందడిగా కేఎల్యూ నూతన విద్యార్థుల సమ్మేళనం
తాడేపల్లి రూరల్: ఇంజినీరింగ్ అనేది ఒక మహాద్భుతమని.. ఎన్నెన్నో ఆవిష్కరణల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని కేఎల్యూ వీసీ డాక్టర్ పార్థసారథి వర్మ అన్నారు. ఆదివారం తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కోర్స్ తీసుకున్న విద్యార్థుల సమ్మేళన అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థసారథి వర్మ మూడు దశాబ్దాలుగా ఇంజినీరింగ్ రంగంలో గణనీయంగా వచ్చిన ప్రగతిని గురించి వివరించారు. ఇంజినీరింగ్ కోర్సులు, వాటిలో ప్రత్యేకతలు, విద్యార్థులు ఎలా ప్రణాళికా బద్ధంగా నేర్చుకోవాలి.. నైపుణ్యాలు ఎలా సాధించాలో తెలియజేశారు. యూనివర్సిటీలో నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రుల ఆశయాల సాధనతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యం చాలా అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో వీసీ డాక్టర్ కె.రాజశేఖరరావు, డీన్స్ డాక్టర్ శ్రీనాద్, కృష్ణారెడ్డి, కేఆర్ఎస్ ప్రసాద్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
తైక్వాండోలో బంగారు పతకం
ఆటోనగర్(విజయవాడతూర్పు): విజయవాడ గాయత్రీనగర్కు చెందిన 9వ తరగతి విద్యార్థిని వి.డిలిష్యారాజ్ 55 కేజీల ఫ్రెషర్స్ క్యాడెట్ ఫిమేల్ విభాగం తైక్వాండోలో సత్తాచాటింది. బంగారు పతకంతో పాటు మరొక సిల్వర్ పతకం సాధించింది. రెండు కేటగిరీల్లో రెండు పతకాలు సాధించింది. విజయవాడలో 10 వ జాతీయ తైక్వాండో చాంపియన్ పోటీలు మూడు రోజులుగా జరుగుతున్నాయి. ఇందు లో భాగంగా ఆదివారం సాయంత్రం జరిగిన తైక్వాండో పోటీల్లో డిలిష్యారాజ్ రెండు పతకాలు సాధించింది. బుల్లెట్ అదుపు తప్పి ముగ్గురికి గాయాలు యడ్లపాడు: జాతీయ రహదారిపై తిమ్మాపురం వద్ద ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన దొప్పలపూడి హనుమానా శాస్త్రి, దండా గోపి, మరొక వ్యక్తి కలిసి బుల్లెట్పై చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు ఆదివారం వెళ్తున్నారు. తిమ్మాపురం వంతెనపై మలుపు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం కూడా ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108లో గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వాహనంపై కూర్చున్న వారిలో మధ్యలో ఉన్న వ్యక్తి బుల్లెట్ హ్యాండిల్ పట్టుకున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. -
చంద్రబాబు అంటేనే దగా, మోసం
భవానీపురం(విజయవాడపశ్చిమ): అంబేడ్కర్ను చూస్తే రాజ్యాంగం, అబ్దుల్ కలాంను చూస్తే రాకెట్లు, ఉపగ్రహాలు స్మరణకు వచ్చినట్లు చంద్రబాబును చూస్తే దగా, నయవంచన, మోసం గుర్తుకు వస్తాయని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అబ్జర్వర్ మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. 45వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు సరగడ శంకరరెడ్డి ఆధ్వర్యంలో విద్యాధరపురం కబేళా సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ఆయన పశ్చిమ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ తాను గెలిచి.. రాష్ట్ర ప్రజలను ఓడించిన ఏకై క నాయకుడు చంద్రబాబు అన్నారు. మానసికంగా గెలిచింది వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీయేనని చెప్పారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా సిగ్గు లేకుండా సుపరిపాలన అంటూ వచ్చి ప్రజల నిలదీతకు గురయ్యారని పేర్కొన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దౌర్బాగ్య స్థితికి తీసుకువచ్చిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. ఆ బాండ్లు ఏమయ్యాయి? వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్ర బాబు, పవన్ కల్యాణ్ త్రికరణశుద్ధితో సంతకాలు చేసిన బాండ్లను ప్రజలకు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా బాండ్లలో పేర్కొన్న ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోవడం ఇది నాలుగోసారి అన్నారు. వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తే నారా లోకేష్ మెదడులో నుంచి వచ్చిన ఆలోచన అని నిస్సిగ్గుగా చంద్రబాబు చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. నాడు సుభిక్షం.. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను వెన్నుపోటు పొడిచి అన్ని రకాలుగా మోసం చేసిందన్నారు. ఈ సందర్భంగా బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఇంటింటికీ వెళ్లి వారి మొబైల్ ఫోన్లో క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేయించి స్కాన్ చేపించాలని, తద్వారా కూటమి ప్రభుత్వ మోసాలను వివరించాలని కోరారు. పలువురు కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు వేణుగోపాలరెడ్డి ఘనంగా 45వ డివిజన్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025దుర్గగుడి భూమిలో ‘రియల్’ మాయ! అమ్మ భూమికి రక్షణ కరువు.. విద్యా అవస్థ! ఉమ్మడి జిల్లాలో 23 పాఠశాలలకు తాళాలునేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.నిత్యాన్నదానానికి విరాళం చిట్టినగర్(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి ఏలూరుకు చెందిన చిత్త శ్రీనివాసరావు, చాముండేశ్వరిల కుటుంబం రూ. లక్ష విరాళాన్ని అందజేసింది. కొండలమ్మ సేవలో.. గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మవారిని చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక ఆదివారం దర్శించుకున్నారు. ఆమెను అమ్మవారి చిత్ర పటం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. సుబ్బారాయుడి సన్నిధిలో భక్తుల రద్దీ మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివారం కావడంతో తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఆలయం లోపల, వెలుపల కూడా క్యూలైనులో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. భక్తుల వాహనాలతో పార్కింగ్ ప్రదేశం, ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఆలయలో నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆలయ అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నీటి ట్యాంకర్ బహూకరణ పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారి ఆలయానికి ఆదివారం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం రాచపూడి గ్రామానికి చెందిన ఉప్పటూరి చంద్రశేఖర్, భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు రూ.2లక్షల విలువైన నీటి ట్యాంకర్ను బహూకరించారు. ఈ సందర్భంగా వేదపండితుల ఆశీర్వచనం అనంతరం దాతలను ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఈఓ కిషోర్కుమార్, ఏఈ రాజు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. హాస్టళ్లలో సమస్యల పరిష్కారానికి చర్యలు బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకులు చంద్రశేఖరరాజు వన్టౌన్(విజయవాడపశ్చిమ): బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ హాస్టళ్లలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఆ శాఖ రాష్ట్ర సంచాలకులు డి. చంద్రశేఖరరాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాక్షి పత్రిక ఈ నెల 27న హాస్టళ్లపై ప్రచురించిన వార్తకు ఆయన స్పందించారు. ఈ నెల మొదటి వారం నుంచి బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు విజయవాడ గుణదలలోని హాస్టల్తో పాటుగా పరిసర ప్రాంతాల్లోని హాస్టళ్లను సందర్శించారని పేర్కొన్నారు. ఆయా ప్రాంగణాల్లోని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే బ్యాంకర్ల సాయంతో హాస్టల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని పేర్కొ న్నారు. వసతులతో పాటుగా ఆహారం, భద్రత ఇతర అంశాల మెరుగునకు చర్యలు చేపట్టామని, వాటికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి నెలా ఒక హాస్టల్ను సందర్శించేలా ఆదేశించామన్నారు. వాటితో పాటుగా జేఎన్బీ నివాస్ పోర్టల్ ద్వారా హాస్టల్స్పై సమీక్ష, కేంద్ర స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. ‘సృష్టికర్త శతకం’ ఆవిష్కరణ విజయవాడ కల్చరల్: శతక సాహిత్యం విస్తృతం కావాలని సరస భారతి అధ్యక్షుడు గబ్బిట దుర్గాప్రసాద్ అన్నారు. రమ్యభారతి సాహిత్య వేదిక ఆధ్వర్యంలో బందరురోడ్డులోని రామ్మోహనరావు గ్రంథాలయంలో ఆదివారం తుమ్మోజు రామలక్ష్మణాచారి రచించిన ‘సృష్టికర్త శతకం’ ఆవిష్కరణ సభను నిర్వహించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన దుర్గాప్రసాద్ మాట్లాడుతూ శతకం తెలుగు సాహిత్యంలో విశిష్టమైన ప్రక్రియ అన్నారు. శతకాలు నేటి బాలబాలికలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందు మాట్లాడుతూ సృష్టికర్త శతకం సామాజిక అంశాల సమాహారమన్నారు. డాక్టర్ గుమ్మా సాంబశివరావు తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యం మకుటాయమానమైందని చెప్పారు. వేములపల్లి కేశవరావు శతక సాహిత్యాన్ని వివరించారు. రమ్యభారతి సాహిత్యవేదిక వ్యవస్థాపక కార్యదర్శి చలపాక ప్రకాష్ నిర్వహించారు. శతక రచయిత రామలక్ష్మణాచారి శతక రచనకు ప్రేరణ కలిగించిన అంశాలను తెలిపారు. ఆవిష్కరణ సభలో గోళ్ల నారాయణరావు, జర్నలిస్ట్ శర్మ, సాహితీవేత్తలు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి విజయవాడ/కంకిపాడు: రియల్ ఎస్టేట్ సంస్థలు దేవుడి భూములనూ వదలడం లేదు. దర్జాగా ఆక్రమించేస్తున్నాయి. ఫలితంగా కోట్ల రూపాయల విలువైన భూములు ఆ సంస్థ చేతిలో ఫలహారాలుగా మారుతున్నాయి. అందుకు ఉదాహరణే దుర్గమ్మ భూమి అన్యాక్రాంతం వ్యవహారం. ఇదీ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నా.. దేవదాయశాఖ నేటికీ చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తోంది. దుర్గగుడి దేవస్థానం అధికారులు కేవలం లేఖలు పంపి చేతులు దులుపుకొన్నారు. రెవెన్యూ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విచారణ నెలల తరబడి సాగుతుండటంతో రియల్ ఎస్టేట్ సంస్థలు ఎంచక్కా తమపని కానిచ్చేస్తున్నాయి. దారీ తెన్నూ లేని భూముల అమ్మకం.. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం నెప్పల్లి గ్రామ పరిధిలో 242 నుంచి 268 ఎల్పీఎం నంబర్లలో శ్రీసిటీ రియల్ ఎస్టేట్ సంస్థ 21.36 ఎకరాల్లో ప్లాట్లు వేసింది. హరివిల్లు వెంచరుకు తూర్పు వైపు నుంచి దేవుడి భూమిలో అనధికారికంగా రోడ్డు నిర్మించారు. ఈ వెంచర్ను సుమారు 265 ప్లాట్లుగా విభజించారు. ఇప్పటికే 150కిపైగా ప్లాట్లు ప్రీ బుకింగ్ అయినట్లు మార్కెటింగ్ ఏజెంట్లు చెబుతున్నారు. గజం రూ.17వేల చొప్పున విక్రయిస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఈ వెంచర్కు సమీపంలో వస్తోందని కొనుగోలుదారులను మభ్యపెడుతున్నారు. సంస్థ యజమానికి ఉన్న పరపతి దృష్ట్యా 20 రోజుల్లో సీఆర్డీఏ అనుమతులు వస్తాయని పేర్కొంటున్నారు. భవిష్యత్తులో భూముల ధర పెరుగుతుందని నమ్మబలికి ప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్నారు. త్వరితగతిన ప్లాట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దారితెన్నూ లేని ప్లాట్లను కొనుగోలు దారులకు కట్టబెట్టేయత్నం చేస్తున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో.. అధికారంలో ఉన్న పచ్చ నేతల అండతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సదరు వెంచరులోకి వెళ్లేందుకు దేవుడి భూమిలో రహదారిని నిర్మించి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ రోడ్డు నిర్మాణ అంశం మొదట్లోనే వివాదాస్పదం అయ్యింది. రహదారి నిర్మించిన భూమి దేవదాయశాఖ పరిధిలోనిదని కొందరు, కన్యకా పరమేశ్వరీ సత్రానికి చెందినదిగా కొందరు చెబుతున్నారు. నెప్పల్లి గ్రామానికి చెందిన కొందరు స్థానికులు ఈ భూమి వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సహా, దేవదాయ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేయటంతో విషయం వెలుగుచూసింది. ఫిర్యాదులతో కదిలిన దేవదాయశాఖ అధికారులు ఈ ఏడాది మే నెలలో సదరు భూమిని రెవెన్యూ అధికారులతో కలిసి సందర్శించారు. సర్వే నంబర్ 101లో 4.41 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి ఆర్ఎస్ఆర్లో విజయవాడ కనకదుర్గ దేవస్థానానికి చెందినదిగానూ, అడంగల్లో కన్యకాపరమేశ్వరీ సత్రం భూమిగా నమోదై ఉంది. రెండు రికార్డుల్లో రెండు విధాలుగా నమోదై ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ జిల్లాలోని విద్యా వ్యవస్థను తారుమారు చేసింది. మొత్తం పాఠశాలలను తొమ్మిది రకాలుగా విభజించింది. ఉమ్మడి కృష్ణాలోని మొత్తం 2,710 ప్రభుత్వ పాఠశాలలను 2,687కి కుదించింది. అంటే 23 పాఠశాలలు మాయ మయ్యాయి. అంతేకాక కొన్ని ప్రాంతాల్లోని పాఠ శాలల్లో తరగతులు తగ్గించింది. ఈ చర్యలతో విద్యా ర్థులు పూర్తిస్థాయిలో ప్రాథమిక విద్యను పొందేందుకు పాఠశాల మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త వ్యవస్థ ఇలా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో నూతన విధానంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలను పలు విభాగాలుగా విభజించింది. అవి బేసిక్ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా డౌన్ గ్రేడ్ చేసినవి, మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా డౌన్ గ్రేడ్ చేసినవి, ఫౌండేషనల్ పాఠశాలలు, హై స్కూల్స్, హై స్కూల్స్/బేసిక్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్/మోడల్ ప్రైమరీ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్, శాటిలైట్ స్కూల్స్, అప్గ్రేడ్ చేసిన హై స్కూల్స్ ప్లస్ కొత్త బేసిక్ ప్రైమరీ పాఠశాలలు, అప్ గ్రేడ్ చేసిన హై స్కూల్స్ ప్లస్ కొత్త మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్లో అధిక స్కూల్స్ డౌన్గ్రేడ్.. ఉమ్మడి కృష్ణాలో 2,687 పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో 863 ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నవే. ఇందులో అత్యధికంగా 83 పాఠశాలలు డౌన్గ్రేడ్ చేయడం గమనార్హం. మోడల్ స్కూల్స్ ఏర్పాటు పేరుతో పాత పాఠశాలలు మూతపడినట్టే అయిందని పలువురు అంటున్నారు. మోడల్ స్కూల్స్పై విమర్శలు.. జిల్లాలో ఏర్పాటు చేసిన 453 మోడల్ ప్రైమరీ స్కూల్స్లో 208 ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. పాత చిన్న స్కూల్స్ను కలిపి పెద్ద స్కూల్స్గా తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తున్నప్పటికీ స్పష్టత లేకపోవడం, తల్లిదండ్రుల అసంతృప్తి, ప్రయాణ భారం తదితర అంశాలు కొత్త సమస్యలుగా మారాయి. విద్యార్థుల సంఖ్యపై తీవ్ర ప్రభావం.. ●ప్రస్తుత కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఏర్పాటైన 653 బేసిక్ ప్రైమరీ, 94 అప్పర్ ప్రైమరీ, 129 ఫౌండేషనల్, 141 హై స్కూల్స్, 50 హై స్కూల్/బేసిక్ ప్రైమరీలు, 03 హై స్కూల్/మోడల్ ప్రైమరీలతోపాటు, మరో 15 బేసిక్ ప్రైమరీ, 01 మోడల్ ప్రైమరీ పాఠశాలను డౌన్గ్రేడ్ చేశారు. ఇదే సమయంలో 04 హై స్కూల్ ప్లస్ న్యూ బేసిక్ ప్రైమరీలు, 28 హై స్కూల్ ప్లస్ మోడల్ ప్రైమరీలు అప్ గ్రేడ్ అయ్యాయి. అంతేకాక 198 మోడల్ స్కూల్స్, 01 శాటిలైట్ స్కూల్ను ప్రారంభించినా, వీటి ద్వారా ఆశించిన ప్రయోజనం దక్కకపోవడం గమనార్హం. ఇవి విద్యా అవసరాల ప్రకారం కాక, గణాంకాల సమన్వయం కోసమే జరిపినవిగా తెలుస్తోంది. డౌన్గ్రేడ్, అప్గ్రేడ్ పేరుతో ప్రాథమిక పాఠశాలల విలీనానికి దారితీసిన ఈ చర్యలు, ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలోని పలు పాఠశాలలు విద్యార్థులే లేని పరిస్థితికి చేరుకున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైనా 141 పాఠశాలల్లో మొదటి తరగతిలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదన్న విషయం కలవరపెడుతోంది. ●ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 276 బేసిక్ ప్రైమరీ, 208 మోడల్ స్కూల్స్, 117 ఫౌండేషనల్, 139 హై స్కూల్స్, 01 శాటిలైట్ స్కూల్ ఏర్పాటు కాగా 54 బేసిక్ ప్రైమరీ, 29 మోడల్ ప్రైమరీ పాఠశాలలను డౌన్గ్రేడ్ చేయడం విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తోంది. మరో వైపు 05 హై స్కూల్ ప్లస్ బేసిక్ ప్రైమరీలు, 16 హై స్కూల్ ప్లస్ మోడల్ ప్రైమరీలు ఏర్పాటయ్యాయి. చిన్న పిల్లలు పెద్ద విద్యాసంస్థల్లో కలిసిపోయే పరిస్థితులు, ఉపాధ్యాయుల సంఖ్యలో అసమతుల్యత విద్యా నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 7న్యూస్రీల్లేఖలతో సరి.. ‘సాక్షి’లో వచ్చిన కథనాలపై విజయవాడ కనకదుర్గగుడి దేవస్థానం ఈఓ స్పందించి రెవెన్యూ రికార్డులను సరిచేసి అమ్మవారి భూమిని అమ్మవారికి చెందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు లేఖలు పంపారు. ఆర్ఎస్ఆర్కు అనుగుణంగా అడంగల్లో మార్పులు చేయాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. ఇందుకు దేవదాయశాఖ తమ పరిధిలోని 43 ప్రాపర్టీ రిజిస్టర్లో భూ వివరాలను ఆధారాలతో సహా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులకు అప్పగించాలి. ఆ దిశగా చర్యలు మాత్రం ముందుకు సాగటం లేదు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఇష్టారాజ్యం తన వెంచర్ కోసం అమ్మవారి భూమిలో అడ్డంగా రోడ్డు నిర్మాణం గ్రామస్తులు అభ్యంతరాలు చెప్పి, ఫిర్యాదులు చేసినా పట్టని వైనం విచారణ పేరుతో కాలం గడుపుతున్న దేవదాయశాఖ లేఖలతో సరిపెడుతున్న దుర్గగుడి దేవస్థానం మరోవైపు రింగ్ రోడ్డు పేరుతో యథేచ్ఛగా ప్లాట్ల అమ్మకాలు చేస్తున్న సంస్థ వైఎస్సార్ సీపీ హయాంలో సమగ్ర పాఠశాలలు..గత ప్రభుత్వ హయాంలో 2,710 పాఠశాలల్లో 1,972 ప్రాథమిక స్థాయిలో, 665 పాఠశాలలు ప్రైమరీ/అప్పర్, ప్రైమరీ సెకండరీ కలయికగా ఉండగా, 73 హయ్యర్ సెకండరీ స్థాయికి ఎదిగినవిగా ఉండేవి. దీంతో విద్యార్థుల విద్యా ప్రయాణం ఒకే ప్రాంగణంలో కొనసాగే అవకాశముండేది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో.. గత ప్రభుత్వంలో మొత్తం స్కూళ్లు: 2,710 ప్రస్తుతం ఉన్న స్కూళ్లు: 2,687 మూతపడ్డవి: 23 మార్పుల పేరుతో గందరగోళం 9 రకాలుగా స్కూళ్ల విభజన కొన్ని తరగతులకే పాఠశాలలు పరిమితం పాఠశాలల్లో భారీగా తగ్గిపోయిన కొత్త అడ్మిషన్లువిలీనం చేశాం.. జిల్లాలో ఒక్క పాఠశాల కూడా మూతపడలేదు. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సమర్థంగా పాఠశాలలు విలీనం చేశాం. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సదుపాయాలు, మౌలిక వనరుల ఆధారంగా సమీప పాఠశాలలతో విలీనం చేయడం ద్వారా బోధనా నాణ్యత పెరుగుతుంది. మార్పు వల్ల విద్యార్థులకు మెరుగైన వాతావరణం, బలమైన మౌలిక సదుపాయాలు, విద్యా పరిరక్షణకు తగిన నిబంధనలు అమలవుతాయి. – పీవీజే రామారావు, డీఈఓ, కృష్ణాజిల్లా నూతన విధానం ప్రకారం కొత్త జిల్లాల వారీగా స్కూళ్ల వివరాలు..పాఠశాల రకం ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ మొత్తం బేసిక్ ప్రైమరీ స్కూల్(బీపీఎస్) 248 653 276 1,177 అప్పర్ స్కూల్గా కొనసాగే స్కూళ్లు 40 94 9 143 బేసిక్ ప్రైమరీకి డౌన్ గ్రేడ్ చేసిన స్కూళ్లు 17 15 54 86 మోడల్ ప్రైమరీ స్కూల్(ఎంపీఎస్)గా డౌన్ గ్రేడ్ చేసిన స్కూళ్లు 7 1 29 37 ఫౌండేషన్ స్కూళ్లు 67 129 117 313 హై స్కూళ్లు 44 141 139 324 హై స్కూల్/బీపీఎస్ 21 50 9 80 హై స్కూల్/ఎంపీఎస్ – 3 – 3 మోడల్ ప్రైమరీ స్కూల్స్ 47 198 208 453 శాటిలైట్ స్కూల్ 5 1 1 7 హైస్కూల్ ప్లస్ కొత్త బీపీఎస్గా అప్ గ్రేడ్ అయిన స్కూళ్లు 4 4 5 13 హైస్కూల్ ప్లస్ కొత్త ఎంపీఎస్గా అప్గ్రేడ్ అయిన స్కూళ్లు 7 28 16 51 మొత్తం 507 1,317 863 2,687 చీమలపాడులో ప్రత్యేక వైద్య శిబిరం తిరువూరు: ఎ.కొండూరు మండలం చీమలపాడులో విష జ్వరాలు వ్యాపిస్తుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకులు పద్మావతి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సుహాసిని ఆదివారం చీమలపాడును సందర్శించి 40 మంది ఆరోగ్య సిబ్బందితో 15 వైద్య బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలో జ్వర పీడితుల సర్వే నిర్వహించారు. గ్రామంలోని పబ్లిక్, ప్రైవేటు మంచినీటి కుళాయిలు, ఓవర్ హెడ్ ట్యాంకుల వద్ద పరిసరాలు శుభ్రం చేయించారు. నీటి తొట్టెలు, కొబ్బరిబోండాలు, పూలకుండీలలో నీరు నిల్వ ఉంచవద్దని, వీటిలో దోమ లార్వా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామస్తులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్వో సుహాసిని సూచించారు. ఎ. కొండూరు ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు స్వాతి, దివ్య, హెల్త్ సూపర్వైజర్ మధుసూదనరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో ప్రస్తుతం ఎకరం భూమి రూ.5 కోట్లకు పైగా పలుకుతోంది. దీనికి తోడు ఇటీవల ఓఆర్ఆర్ గ్రామం వెంబడిగా వెళ్తోందన్న ప్రచారంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మట్టికి బంగారం కంటే ఎక్కువ డిమాండ్ పెరిగింది. అమ్మవారి భూమిగా చెబుతున్న భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 25 కోట్లకు పైగా పలుకుతోంది. దారీతెన్నూ లేని భూమిని కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ తమ భూమిలోకి వెళ్లేందుకు అమ్మవారి భూమిలో నుంచి దారిని దర్జాగా నిర్మించేసింది. దేవదాయశాఖ అధికారులు మాత్రం ఈ భూమి ముమ్మాటికీ దేవదాయశాఖదే అని తేల్చారు. కానీ దాని స్వాధీనం విషయంలో మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారులు భూ పరిశీలనకే పరిమితం అయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవదాయశాఖ మెతక వైఖరి కారణంగా రియల్ సంస్థ ప్రతినిధులు వెంచరులో రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా చేపడుతున్నారు. ప్రహరీ, కాంక్రీటు పను లు పూర్తి చేస్తున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో చైర్పర్సన్ వి.నిర్మల కుమారి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఎన్జీఓలో ఉన్న వివిధ శాఖల ఉద్యోగుల సంఘాలలో మహిళా ఉద్యోగ సంఘం కీలకపాత్ర పోషించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వినియోగంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని సవరించి, స్పష్టత కలిగించే ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వైద్య శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు భారంగా మారిన అనవసరమైన యాప్స్ తొలగింపు అంశంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు చాలా కాలంగా బకాయి ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యయన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని మహిళా ఉద్యోగుల సంఘం చేసిన తీర్మానాలను ప్రభుత్వానికి పంపుతామన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ నిర్మల కుమారి, కన్వీనర్ పి.మాధవి, కోశాధికారి శివలీల, కో కన్వీనర్ వి.వి.లలితాంబ, రాష్ట్ర కార్యదర్శి బి.తులసిరత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లకు వెళ్లి వస్తున్న దుస్థితి
హాస్టల్స్లో వసతులు లేకపోవటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి వస్తుండటంతో రాత్రి వేళ ఆయా హాస్టల్స్కు వార్డెన్ తాళాలు వేస్తున్నారు. నందిగామ ఎస్సీ హాస్టల్లో తలుపులు విరిగిపోయాయి. కంచికచర్ల మండలం గండేపల్లి ఎస్సీ బాలికల హాస్టల్లో రాత్రి సమయంలో విద్యార్థులు ఉండటం లేదు. వీరంతా గ్రామానికి చెందిన విద్యార్థులు. దీంతో వారంతా ఇళ్లకు వెళ్లి తిరిగి మరుసటి రోజు హాస్టల్కు చేరుకుంటున్నారు. అంతేకాకుండా వార్డెన్ కూడా అప్పుడప్పుడు వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ విధమైన దుస్థితి ఉన్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రేపు ధర్నా చౌక్లో నిరాహార దీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ, మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన అనంతరం అమలు చేయాలనే డిమాండ్తో ఈ నెల 28న విజయవాడ ధర్నా చౌక్లో మహిళలు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. ఈ దీక్షల్లో పెద్ద సంఖ్యలో ఓబీసీ మహిళలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ టిక్కిల్ రోడ్డులోని బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ స్థాయిలో జన గణనలో కులగణన జరిగి, ఆపై నియోజకవర్గాల పునర్విభజన చేసిన అనంతరమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. సమావేశంలో కుమ్మర క్రాంతికుమార్, ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మానేపల్లి వీవీఎస్ మూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, మేకా వెంకటేశ్వరరావు, చెప్పాడ చందు, వాక వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మహిళల రక్షణకు శక్తి, ఈగల్ బృందాలు ఏర్పాటు లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళల రక్షణ కల్పించేందుకు శక్తి, ఈగల్ బృందాలు పనిచేయనున్నాయి. ఆయా బృందాలతో డీసీపీ కేజీవీ సరిత శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాలతో నిర్వహించిన ఈ సమావేశంలో డీసీపీ సరితతో పాటు, మహిళా పోలీస్స్టేషన్ ఏసీపీ టి.దైవప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో, నిర్జీన ప్రదేశాలలో, ప్రతి కళాశాల, స్కూల్లలో మహిళలు, పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా చేసుకోవాలి, గుడ్, బ్యాడ్ టచ్, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలు, శక్తి యాప్ ఉపయోగాలపై ఏ విధంగా అవగాహన కలిగించాలనే అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా డీసీపీ సరిత మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా మేమున్నామనే భరోసా ప్రత్యేక బృందాలు పనిచేస్తామన్నారు. సోషల్మీడియా, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోక్సో యాక్ట్ గురించి, డయల్ 112, శక్తి యాప్ ఉపయోగాలను తెలియచేయాలని ఆమె సూచించారు. జిల్లాలో 18.90 మిల్లీమీటర్ల వర్షపాతం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో 18.90 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం ఉదయం నుంచి శనివవారం ఉదయం 8.30 గంటల మధ్య భారీ వర్షం కురిసింది. విజయవాడ సెంట్రల్లో 34.2 మిల్లీమీటర్లు, వెస్ట్లో 34.2, నార్త్లో 33.8, ఈస్ట్లో 33.6, రూరల్లో 33.2, కంచికచర్లలో 28.6, చందర్లపాడులో 24.2, వీరులపాడులో 23.2, మైలవరంలో 21.4, తిరువూరులో 19.8, జి కొండూరులో 19.6, ఇబ్రహీంపట్నంలో 18.4, గంపలగూడెంలో 9.2, ఏ కొండూరులో 9.0, విసన్నపేటలో 7.4, జగ్గయ్యపేటలో 6.8, పెనుగంచిప్రోలులో 6.8, వత్సవాయిలో 5.6, నందిగామలో 4.8, రెడ్డిగూడెంలో 4.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2025–8లోuజి.కొండూరు మండలం కుంటముక్కలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ముందు భాగంలో ప్రహరీ ధ్వంసమవ డంతో విద్యార్థినుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కనీసం ప్రహరీ సైతం నిర్మించలేని దుస్థితిలో పాలకులు ఉన్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలోని ఐరన్ విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయి. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల్లోనూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు–నేడు కింద నిర్మాణం, మరమ్మతులు చేసిన హాస్టళ్లలో విద్యార్థులు వసతి పొందుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మరమ్మ తులు చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంబాడీపేట హాస్టల్లో బెడ్లు లేకపోవటంతో చిన్నారులు నేలపైనే నిద్రిస్తున్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా లోని విద్యార్థి వసతి గృహాలు అధ్వానంగా తయా రయ్యాయి. కూటమి పాలకుల అలసత్వం, అధికారుల పర్యవేక్షణ లోపం, నిధుల లేమితో కనీస వసతులకు కూడా నోచుకోక పేద విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఆశ్రయం పొందుతున్న సమస్యలతో అల్లాడుతున్నారు. బెడ్లు, దుప్పట్లు లేక నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితులు దాపురించాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చలికి గజగజా వణుకుతున్నారు. ఈ సమస్యలను తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లకు పంపించడానికి వెనుకంజ వేస్తున్నారు. తరగతి గదుల్లోనే వసతి మైలవరం మండలం కొండపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో 414 మంది విద్యార్థులకు కేవలం 15 గదులు మాత్రమే ఉన్నాయి. ఇరుకు గదుల్లోనే ఉదయం తరగతుల నిర్వహణ, రాత్రి విద్యార్థులు నిద్రించేందుకు ఉపయోగిస్తున్నారు. విద్యార్థుల భోజనానికి పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ పట్టి సన్న బియ్యంగా సరఫరా చేస్తున్నారని స్థానికులు ఆరో పిస్తున్నారు. కంచికచర్ల ఎస్సీ హాస్టల్ను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాడు– నేడు పథకం ద్వారా ఆధునికీకరించారు. మండలంలోని పెండ్యాల బీసీ హాస్టల్లో దుప్పట్లు ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపించారు. చందర్లపాడు ఎస్సీ హాస్టల్లో మాత్రం అరకొర వసతులు దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. వెంటాడుతున్న గురువుల కొరత మైలవరం నియోజకవర్గంలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 260 మంది బాలికలు చదువుతున్నారు. ఇక్కడ పది మంది ఉపాధ్యాయులు అవసరం. అయితే ఏడుగురు మాత్రమే ఉన్నారు. జి.కొండూరు మండలం కుంటముక్కలలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో భోజనం చేసే డైనింగ్ హాలు సరిపో వడంలేదు. విద్యార్థులను మూడు బ్యాచ్లుగా విభజించి భోజనం వడ్డిస్తున్నారు. ఇక్కడ 64 మరుగుదొడ్లలో కేవలం 38 మాత్రమే పని చేస్తున్నాయి. డార్మిటరీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా మారింది. 7న్యూస్రీల్ప్రశ్నార్థకంగా మారిన భద్రత సంక్షేమ హాస్టళ్లలో అరకొర వసతులు చలికి వణుకుతూ నేలపై నిద్రించాల్సిన పరిస్థితి విద్యార్థులకు చాలినన్ని మరుగుదొడ్లు లేని వైనం ధ్వంసమైన ప్రహరీలకు మరమ్మతులు శూన్యం విషపురుగుల సంచారంతో భయం.. భయం విషపురుగుల సంచారంవిద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి లోని మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ వసతి గృహం పొలాల మధ్య ఉండటంతో రాత్రి వేళల్లో విష పురుగులు సంచరిస్తున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిల్లకల్లు బీసీ వసతి గృహంలో కిటికీలకు మెస్ లేకపోవటంతో దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు లేకపోవటంతో నేలపైనే నిద్రించాల్సి వస్తోంది. వసతి గృహం ప్రహరీ కూలిపోవటంతో రాత్రి వేళల్లో విష పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. పెనుగంచి ప్రోలులో బీసీ వసతి గృహం అద్దె భవ నంలో నడుస్తోంది. 60 మంది విద్యార్థులకు నాలుగు మరుగు దొడ్లు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. డైనింగ్ హాల్ లేకపోవటంతో నేలపైనే కూర్చుని భోజనాలు చేస్తున్నారు. పెంకుటిల్లు కావటంతో దూలాలకు చెదలు పట్టి ప్రమాదకరంగా ఉండటంతో ఎప్పుడు కూలుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. కనీస వసతులు సైతం కల్పించకపోవటంతో హాస్టల్స్లోని విద్యార్థులు అల్లాడుతున్నారు. రాజధానికి సమీపంలో ఉన్న నియోజకవర్గాల్లోనే హాస్టల్స్ దయనీయ పరిస్థితులు ఉంటే మిగిలిన జిల్లాల్లో ఇంకెంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. నాడు–నేడు ద్వారా విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుంది. ఆ పనులను నిలిపివేసి కూటమి సర్కార్ విద్యార్థులను ఇబ్బందులు పాలు చేస్తుంది. – ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం -
టీచర్ల జీతాల చెల్లింపులో జాప్యాన్ని నివారించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల జరిగిన బదిలీల్లో ఉద్యోగోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు సంబంధించిన పొజిషన్ ఐడీలను కేటాయించి వారికి వెంటనే జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.శ్రీను, ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డిని కలిసి వివిధ సమస్యలను చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ జీతాల చెల్లింపులో జాప్యాన్ని నివారించాలని కోరారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదుకు గతంలో ఇచ్చిన హామీలను అనుసరించి ఉదయం 9 గంటల నుంచి 9.10 వరకు గ్రేస్ పీరియడ్గా ప్రకటించాలన్నారు. తెలుగు, హిందీ సబ్జెక్టులకు సంబంధించి ఉద్యోగున్నతులు కల్పించాలన్నారు. పదో తరగతి స్పాట్ వేల్యూషన్, పరీక్ష నిర్వహణ, పాఠశాల నిర్వహణ గ్రాంట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలన్నారు. యాప్ల భారాన్ని తగ్గించి బోధన సమయం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
31న కృష్ణానదికి మహా వస్త్ర సమర్పణ
నాగాయలంక: పవిత్ర కృష్ణానదికి ఈనెల 31వ తేదీన మహా వస్త్ర సమర్పణ వేడుక నిర్వహిస్తున్నట్లు నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, క్షేత్ర పాలకుడు తలశిల రఘుశేఖర్ శనివారం తెలిపారు. సాగర సంగమ వేణి సర్వ పాపహరణిగా సాగర జలాలతో కలసి ఈ ప్రాంత ప్రజలను నిరంతరం తరింప చేస్తున్న నదీమతల్లికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3.10 గంటలకు 401 చీరలతో 2005 మీటర్ల పొడవైన తోరణం రూపొందించి కృష్ణవేణికి మహా వస్త్ర సమర్పణ చేస్తామన్నారు. ఈ చీరల తోరణాన్ని శ్రీరామపాదక్షేత్రం ఘాట్లో కృష్ణవేణి విగ్రహం నుంచి అవతలి వైపు గుంటూరు జిల్లా తీరం ఏర్పాటు చేస్తామన్నారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ప్రకాశం జిల్లాకు చెందిన భక్తులు శనివారం రూ.1.56 లక్షల విరాళం సమర్పించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఏడూరి శ్రీనివాసరెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1.56 లక్షల విరాళం అందజేసింది. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మ వారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ప్రతి ఇంటిని సర్వే చేయడమే లక్ష్యం వీరులపాడు: రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ సర్వే చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సమిత్వ సర్వే చేపట్టిందని రాష్ట్ర పీ–4 డైరెక్టర్ నిశాంత్రెడ్డి పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మండలంలోని పొన్నవరంలో జరుగుతున్న సమిత్వ సర్వేను ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు శనివారం పరిశీలించారు. నిశాంత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సమిత్వ సర్వే చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు పరిశీలనకు వచ్చారని తెలిపారు. సమిత్వ సెంట్రల్ టీం సహాయంతో మండలంలోని పంచా యతీ రాజ్ సిబ్బంది ఆరు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. డీపీఓలు లావణ్య, కొడాలి అనురాధ, డీఎల్పీఓ రఘువరణ్, డెప్యూటీ ఎంపీడీఓ రాజశేఖర్ పాల్గొన్నారు. తృప్తి క్యాంటీన్ ప్రారంభం వన్టౌన్(విజయవాడపశ్చిమ): మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని పురపాలక, పట్టణాభి వృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అన్నారు. పంజాసెంటర్ సమీపంలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.తేజ్భరత్, మునిసి పల్ కమిషనర్ ధ్యాన్చంద్రతో కలిసి సురేష్కుమార్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. క్యాంటీన్ ఏర్పాటుకు జీఎస్టీతో కలిపి ప్రాజెక్ట్ వ్యయం రూ.14,51,400 అవుతుందని తెలిపారు. ఈ మొత్తంలో 75 శాతం డ్వాక్రా మహిళలు, 25 శాతం సారాస్ ఏజెన్సీ లోన్ ద్వారా సమకూరుతుందన్నారు. క్యాంటీన్ నిర్వహణ కోసం కంటెయినర్ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ క్యాంటీన్లను ముఖ్యమైన కూడళ్లలో, హైవేలకు సమీపంలో ఏర్పాటు చేస్తారన్నారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ తేజ్భరత్ మాట్లాడుతూ.. 30 వేల మంది డ్వాక్రా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రీజినల్ మేనేజర్ హర్జిత్ సింగ్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. -
తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రెయిన్లు
నందిగామ రూరల్: మ్యాజిక్ డ్రెయిన్లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, వాటిని తక్కువ ఖర్చుతో నిర్మించుకోవచ్చని డీపీఓ లావణ్య కుమారి సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మండలంలోని సోమవరం గ్రామంలో జరుగుతున్న మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణ పనులను 25 జిల్లాల డీపీఓలు, సీఈఓలతో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. ముందుగా ఏపీడీఓలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు మ్యాజిక్ డ్రెయిన్ వివరాలను డీపీఓలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.90 వేల ఖర్చుతో 100 మీటర్ల మేర డ్రెయిన్ నిర్మిస్తున్నామని లావణ్యకుమారి తెలిపారు. ఈ డ్రెయిన్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోతుందని వివరంచారు. తద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని సూచించారు. మురుగు నీరు నిల్వ ఉండకపోవటంతో దుర్వాసన, దోమల వ్యాప్తి కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. 500 మీటర్లకు ఐదు మ్యాజిక్ డ్రెయిన్లు సోమవరం గ్రామంలో రెండు వేల మీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని ఏపీడీఓలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా కలెక్టర్ వెయ్యి మీటర్లకు ప్రతిపాదించగా ప్రస్తుతం 500 మీటర్ల మేర ఐదు మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మిగిలిన వెయ్యి మీటర్ల పనులను ప్రతిపాదనల అనంతరం చేపడ్తామన్నారు. గ్రామంలో జరుగుతున్న మ్యాజిక్ డ్రెయిన్ల పని తీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రామేశ్వరరావు, ఏపీఓ శరత్, పలు శాఖల అధికారులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
శిశు వికాస ప్రగతిపై దృష్టిపెట్టండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశగాంధీనగర్(విజయవాడసెంట్రల్): శిశు వికాస కీలక ప్రగతి సూచికల (కేపీఐ)పై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు దృష్టిసారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లో మిషన్ వాత్సల్యపై శనివారం సమన్వయ సమావేశం జరిగింది. మిషన్ వాత్సల్య లక్ష్యాలు, వాటి సాధనలో పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. శిశు సంరక్షణ చట్టాలు, కుటుంబ ఆధారిత సంరక్షణకు ప్రోత్సాహం, సంస్థా గత మద్దతు, ఆర్థిక సహకారం, శిశు సంరక్షణ పథకాల అనుసంధానంతో మిషన్ వాత్సల్య అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎత్తుకు తగిన బరువు, పూర్వ ప్రాథమిక విద్య, శారీరక–మానసిక ఆరోగ్యం వంటివాటిపై దృష్టిపెట్టాలని ఇందుకు అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కీలకమని అన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల సంక్షేమం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్యను అమలుచేస్తున్నాయని వివరించారు. 2023–24 నుంచి 2024–25 వరకు తల్లి లేదా తండ్రి లేని, తల్లిదండ్రులు లేని 18 ఏళ్లలోపు 551 మంది బాలబాలికలకు ఈ పథకం ద్వారా నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.73 కోట్లు ఆర్థిక సహాయం అందించామని వివరించారు. పాఠశాలలు, కళాశాలల్లో బాల్య వివాహాలు, పోక్సో, బాలల హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. జిల్లాలో ఉన్న 16 బాలల సంరక్షణ కేంద్రాల ద్వారా నాణ్యమైన పారదర్శకమైన సేవలందించాలని, రెస్క్యూ చేసిన బాలబాలికలను జువైనెల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్–2015 ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి వారి ఆదేశాల మేరకు బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, జువైనెల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ సువార్త, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, డీపీఓలు సత్యవతి, జ్యోతి, సీడబ్ల్యూసీ సభ్యులు రవి భార్గవ్, సీడీపీఓలు, డీసీపీయూ సిబ్బంది, పర్యవేక్షకులు, బాలల కేంద్రాల ఇన్చార్జ్లు తదితరులు పాల్గొన్నారు. -
అధికార లాంఛనాలతో లక్కీ అంత్యక్రియలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పోలీస్ శాఖలో 10 ఏళ్లు సేవలందించి అనారోగ్యంతో మృత్యువాత పడిన జాగిలం లక్కీకి శనివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లాబ్రాడార్ రీట్రీవర్ జాతికి చెందిన లక్కీ 2015లో జన్మించగా, దానికి హైదరాబాద్లోని ఐఐటీఏ, ఐఎస్డబ్ల్యూ శిక్షణ సెంటర్లో డాగ్ హ్యాండ్లర్ ఏఆర్హెచ్సీ సీహెచ్డీ ప్రసాద్ ఆధ్వర్యంలో పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం నగరానికి ముఖ్య వ్యక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రత కోసం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చేపట్టే ముందస్తు చర్యల్లో చురుగ్గా పాల్గొనేదని పోలీస్ సిబ్బంది తెలిపారు. 10 ఏళ్ల పాటు లక్కీ తనదైన నైపుణ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రముఖుల పర్యటనల్లో కీలకంగా వ్యవహరించింది. అనారోగ్యంగా తుదిశ్వాస విడిచిన లక్కీ మృతి పట్ల నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆదేశాల మేరకు డీసీపీలు ఏబీటీఎస్ ఉదయరాణి, కేజీవీ సరిత, సీఎస్డబ్ల్యూ డీసీపీ ఎస్వీడీ ప్రసాద్, ఏసీపీ కృష్ణంరాజు, ప్రేమ్కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు ఇతర అధికారులు లక్కీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
పింఛన్ల పునఃపరిశీలన త్వరగా పూర్తి చేయాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో విభిన్న ప్రతిభావంతులు(దివ్యాంగుల) పునఃపరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. పింఛన్ల పునఃపరిశీలన (రీ అసెస్మెంట్ ఆఫ్ పింఛన్స్)లో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య, జిల్లా పరిషత్, నగరపాలక సంస్థ, మున్సిపల్ కమిషనర్లతో శనివారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 27,235 మంది విభిన్న ప్రతిభావంతులకు చెందిన లబ్ధిదారులు ప్రతి నెల పింఛన్లు పొందుతున్నారన్నారు. వీరిలో శారీరక వైకల్యం, నేత్ర సమస్యలు, వినికిడి సమస్యలు, మానసిక అనారోగ్యం, మానసిక అస్వస్థత, బహుళ వైకల్యం వంటి విభాగాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారన్నారు. వీరిలో 15,607 మంది లబ్ధిదారుల పునఃపరిశీలన పూర్తి చేశారని చెప్పారు. మిగిలిన 11,628 లబ్ధిదారుల పునః పరిశీలన కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి పునఃపరిశీలన పూర్తి చేయాలన్నారు. క్యాంపుల సమాచారాన్ని లబ్ధిదారులకు ముందుగా తెలియజేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, డీసీహెచ్ఎస్ డాక్టర్ కేవీఎస్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
జీతాల సమస్య పరిష్కరించాలి : యూటీఎఫ్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న జీతాల సమస్యను తక్షణం పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేష్ డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు జరిగి 45 రోజులు కావస్తున్నా వారి జీతాల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద శనివారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా నక్కా వెంకటేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బది లీలు జరిగి 45 రోజులు గడిచినా కేడర్ స్ట్రెంత్ వివరాలు కిందికి పంపక పోవడం, పొజిషన్ ఐడీలు లేక పోవ డంతో జాన్, జూలై నెలల జీతాలు డీడీఓలు చేయడానికి ఆటంకం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 25 వేల మందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.పి.మనోహర్కుమార్ మాట్లాడుతూ.. హైస్కూల్ ప్లస్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య, నాయకులు ఎం.కృష్ణయ్య, పి.లీల, పి.నాగేశ్వరరావు, డి.హరిప్రసాద్, బి.రెడ్స్టార్, ఎం.లింగారెడ్డి, జై.సుధానంద్ తదితరులు పాల్గొన్నారు. -
తొలి న్యాయ సేవా సహాయ కేంద్రం ప్రారంభం
విజయవాడలీగల్: రాష్ట్రంలో తొలి న్యాయ సేవా సహాయ కేంద్రాన్ని విజయవాడలోని రాష్ట్ర సైనిక్ బోర్డు కార్యాలయంలో ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఇన్చార్జి చైర్మన్ పి.భాస్కరరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ.. న్యాయ న్యాయసేవా సహాయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోని, తమకు ఉన్న న్యాయ సంబంధిత సమస్యలకు ఉచితంగా పరిష్కారాన్ని పొందాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయ సేవా సహాయ కేంద్రం ద్వారా దేశానికి సేవ చేసిన సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులుకు అలాగే అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించనున్నారు. సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించేందుకు న్యాయసేవా సహాయ కేంద్రాలను ఏర్పాటుచేయడం ద్వారా, సమాజానికి వారి సేవలకు గౌరవం తెలపడం లక్ష్యంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ(నల్సా) వీర్ పరివార్ సహాయత యోజన – 2025 పని చేస్తోంది. నల్సా ఆధ్వర్యంలో నల్సా వీర్ పరివార్ సహాయత యోజన – 2025 పథకాన్ని ప్రవేశపెట్టారు. వీరి ఆదేశాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సూచనలను మేరకు మెంబర్ సెక్రటరీ బి.హిమబిందు ఆధ్వర్యంలో న్యాయ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ డెప్యూటీ సెక్రటరీ హెచ్.అమరరంగేశ్వరరావు, రాష్ట్ర సైనిక్ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి అచ్చెన్నాయుడుకి సమస్యలతో స్వాగతం
పాయకాపురం(విజయవాడరూరల్): సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకి మహిళలు సమస్యలతో స్వాగతం పలికారు. శుక్రవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్లో టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. నియోజకవర్గం పరిశీలకుడిగా వచ్చిన మంత్రికి స్థానిక మహిళలు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని, తల్లికి వందనం ఆర్థిక సహాయం అందలేదని, రేషన్ కార్డులు మంజూరు కాలేదని, తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకున్నారు. ● రామాలయం సమీపంలో నడుస్తున్న మంత్రికి సబ్బినేని ప్రభుకుమారి.. తమది చాల పేద కుటుంబమని, తనకు ముగ్గురు ఆడపిల్లల సంతానమని, ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలం ఇప్పించాలని కోరారు. 13 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నామని అద్దె చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేసే సందర్భంలో ఇస్తామని మంత్రి చెప్పారు. ● పిచ్చమ్మ అనే పేదరాలు కూడా తమ కుటుంబం ఎంతో కాలం నుంచి ఇళ్ల స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. తమ పాప 4వ తరగతి చదువుతోందని, తల్లికి వందనం పథకంలో ఆర్థిక సహాయం అందలేదని ఆమె తల్లిదండ్రులు మంత్రికి విన్నవించుకున్నారు. సాంకేతిక సమస్యల వల్ల ఆర్థిక సహాయం అందకపోయి ఉండవచ్చని సచివాలయానికి వెళ్లి సమస్య తెలుసుకొని, తిరిగి దరఖాస్తు చేసుకోవాలని మంత్రి వారికి సూచించారు. ఈ విధంగా అనేక సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. పాదయాత్ర చేస్తుండగా మధ్యలో వర్షం రావడంతో జనం వెళ్లిపోవడం సర్దుకోవడం కనిపించింది. వైకుంఠపాళి ఆడటం మానుకోవాలి.. అనంతరం రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలను కొన్ని అమలు చేశామని, మిగిలినవి అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రజలు వైకుంఠపాళి ఆట మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో రూ.240కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. రేటింగ్ విషయంలో జిల్లాలో మొదటి స్థానంలో నియోజకవర్గం ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు కె.రవికుమార్, ఎస్కే బాబు, సతీష్, నాగరాజు, భాగ్యలక్ష్మి, శివమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఆవిష్కరణల్లో జిల్లాను నంబర్ వన్ చేద్దాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), స్పోక్ల ద్వారా స్టార్టప్లకు కొత్త ఊపు రానుందని.. దీనిని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను ఆవిష్కరణల్లో నంబర్ వన్గా నిలిపేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శుక్రవారం వివిధ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ లక్ష్మీశ జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతలకు, కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని వేదికగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. దీనికి అనుసంధానంగా రాష్ట్రంలో అయిదు ప్రాంతాల్లో స్పోక్లను కేటాయించారని, ఎన్టీఆర్ జిల్లాకు ఒక స్పోక్ను వచ్చిందన్నారు. ఇది ట్రయల్ రన్.. విజయవాడలోని ఎనికేపాడులో రతన్టాటా ఇన్నోవేషన్ హబ్, స్పోక్ను త్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని.. ఈ నేపథ్యంలో సన్నద్ధతలో భాగంగా ట్రయల్రన్గా కలెక్టరేట్ ప్రాంగణంలో దాదాపు 62 స్టార్టప్లు తమ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, లిక్విడ్–సాలిడ్ వేస్ట్ రీసైకిలింగ్, డ్రోన్స్ యూజ్ కేసులు, అగ్రీ టెక్, ఎన్విరాన్ డిజిటల్ వంటి సొల్యూషన్స్ను ప్రదర్శించినట్లు వివరించారు. విద్యార్థులు, యువత కొత్త ఆలోచనలతో ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారని, వీరికి అన్ని విధాలా ఆర్టీఐహెచ్ హబ్, స్పోక్ల ద్వారా మద్దతు లభిస్తుందన్నారు. చాలా తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండే టెక్ సొల్యూషన్స్ను ప్రోత్సహించి.. వివిధ పథకాలను సద్వినియోగం చేసుకునేలా, సహాయసహకారాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే కలెక్టరేట్లో ఇగ్నైట్ సెల్ ద్వారా వివిధ శాఖల పరిధిలో అందుబాటులో ఉన్న పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మార్గాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. వివిధ స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
గండ్లు.. కళ్లకు గంతలు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేయాల్సిన అధికారులే, ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లకు దాపోహమయ్యారు.. సాంకేతిక అనుమతి లేకుండా.. కనీసం వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా.. నోటి మాటపై రూ.43.91 కోట్ల విలువైన 126 పనులు పప్పూ బెల్లాల్లా పంచేశారు. వాటిని అందిపుచ్చుకున్న కాంట్రాక్టర్లు వెంటనే పనులు ప్రారంభించేశారు. తూతూ మంత్రంగా కానిచ్చేసి.. బిల్లులు చేసుకొని కోట్ల రూపాయలు దోచుకొనేందుకు స్కెచ్ వేశారు. ఈ విషయమై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో కొంత మంది సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం సేకరించి, పనులకు సంబంధించి నిజాలు నిగ్గు తేల్చాలని కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఇదీ జిల్లాలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. బుడమేరు వరదల వల్ల దెబ్బతిన్న 126 పనులు చేపట్టడానికి జీవో నంబర్ 271 ప్రకారం రూ.43.91కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. అయితే ఈ పనులకు సాంకేతిక అనుమతులు ఇవ్వలేదు. టెండర్లు పిలువలేదు. అయినప్పటికీ గత మే నెలలోనే కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేశారు. కనీసం ఈ పనులకు నామినేషన్ పద్ధతి ద్వారా చేసేందుకు సైతం అనుమతి తీసుకోలేదు. అయితే అధికారులు అత్యవసర పరిస్థితుల్లో పనులు చేశామని స్వయంగా పేర్కొనడంతో దీని వెనుక కుట్ర బహిర్గతం అయ్యింది. ఇప్పుడు ఈ పనులకు పాత తేదీల్లో సాంకేతిక అనుమతులు ఇచ్చేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మరికొన్ని పనులను అత్యవసర పరిస్థితుల్లో రైతులే పూర్తి చేసుకున్నారు. అయితే ఆ పూర్తయిన పనులకు ఇప్పుడు ఆన్లైన్ టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేయడం హాస్యాస్పదంగా మారిందని నీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనిబట్టే ఈ పనుల్లో అవినీతి వ్యవహారం బట్టబయలు అవుతుందనే భావనను వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు సైతం పలువురు ఫిర్యాదులు చేశారు. ప్రొసీజర్ పాటించనేలేదు.. పనులు ప్రారంభానికి ముందు ప్రాథమిక కొలతలు తీసుకొని ఎంబుక్లో సంబంధిత ఏఈ, డీఈఈ, ఈఈ ఎంబుక్లో రికార్డు చేయాలి. పనులు పూర్తయ్యాక మరోసారి కొలతలు తీసుకొని, ప్రాథమిక కొలతలకు, పనులు పూర్తి అయ్యాక తీసుకున్న కొలతలతో సరిపోల్చి, చేసిన పనులకు ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు) ప్రకారం బిల్లుల చెల్లింపులకు రికార్డు చేసి పీఏఓ (పే అండ్ అకౌంట్) ఆఫీసుకు పంపాలి. కానీ బుడమేరు మరమ్మతు పనుల్లో ప్రాథమిక కొలతలు తీసుకొన్న దాఖలాలు లేవని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో కాంట్రాక్టర్లు ఎంత పనులు చేశారన్నది లెక్క కట్టలేని పరిస్థితి. దీనినే ఆసరాగా చేసుకున్న కాంట్రాక్టర్లు, ఓ కీలక ప్రజా ప్రతినిధి, భారీ ఎత్తున పనులు చేసినట్లు మాయ చేసి.. కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర చేసినట్లు అర్థమవుతోంది. తాజాగా పనులకు నీటి పారుదల శాఖ అధికారులు ఎస్టిమెంట్లు తయారు చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ అధికారే కీలకం.. బుడమేరు గండ్ల పూడ్చివేత పనుల్లో ఇష్టారాజ్యం నోటిమాటపై రూ. 43.91 కోట్ల విలువైన పనులు ఎలాంటి అనుమతుల్లేకుండా చేపట్టిన వైనం ఇప్పటికే ఈ అంశంపై వరుస కథనాలు ప్రచురించిన ‘సాక్షి’ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదుల వెల్లువ ఇప్పుడు కోర్టులో రిట్ పిటిషన్ వేసిన సామాజిక కార్యకర్తలు కమీషన్ల కక్కుర్తితో పనులు చేయించిన అధికారులకు చెమటలు బుడమేరు వరద పనుల వ్యవహారంలో ఓ నీటి పారుదల శాఖ అధికారి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి, పనుల కేటాయింపులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈయనకు ప్రజా ప్రతినిధులకు తలలో నాలుకల మారి అడ్డగోలుగా వారి పనులను చక్కబెట్టడంలో దిట్టగా పేరుంది. తమకు అనుకూలమైన కింది స్థాయి అధికారులను కోరే చోట వేయించేందుకు, ప్రజా ప్రతినిధుల వద్ద ఇతనే స్వయంగా సిఫారసు లేఖలు తెచ్చినట్లు చర్చ సాగుతోంది. ఇటీవల తిరువూరులో నీటి పారుదల శాఖ ఏఈ బదిలీ అయిన, ఆయన రిలీవ్ కాకుండా వేధించడంలో కీలక భూమిక పోషించినట్లు శాఖ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఇతని వ్యవహారంపైన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేసినా ఇతనిలో మార్పు లేదనే భావన వ్యక్తం అవుతోంది. ప్రజా ప్రతినిధుల అండతోనే రెచ్చి పోతున్నారనే చర్చ నీటి పారుదల శాఖ వర్గాల్లోనే నడుస్తోంది. -
ఉపాధ్యాయులను మానసిక వేదనకు గురి చేయొద్దు
డీఈఓకు ఫ్యాఫ్టో వినతి వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయు ల ముఖ ఆధారిత హాజరు విషయంలో వారిని మానసిక వేదనకు గురి చేయవద్దని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా నేతలు డీఈవో సుబ్బారావుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనను కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఫ్యాప్టో ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ ఏ సుందరయ్య మాట్లాడుతూ జిల్లాలో టీచర్స్ ఫేషియల్ అటెండెన్స్ నాట్ మార్క్డ్ లిస్ట్ను ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేసి ఉపాధ్యాయులను మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. సరైన నెట్ సౌకర్యం లేని చోట తొమ్మిది గంటలకి ముందు స్కూల్కి వచ్చినా గాని వివిధ కారణాలతో హాజరు పడకపోవడంతో నాట్ మార్క్డ్లిస్టు అని డీఈవో కార్యాలయం నుంచి తొమ్మిది గంటలకు లిస్ట్ పెట్టి జిల్లా అంతా వాట్సాప్ గ్రూప్లో ప్రతి రోజు వైరల్ చేస్తున్నారన్నారు. కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హాజరు వేయుటకు 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఉన్నాగాని జిల్లా తొమ్మిది గంటలకే విడుదల చేయడాన్ని తప్పు పట్టారు. 9.15 నిమిషాల తర్వాత లిస్ట్లు మాత్రమే విడుదల చేయాలని కోరారు. అదే విధంగా జిల్లాలో 2025 ఏప్రిల్ ఎస్ఎస్సీ పేపర్ల మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు నేటికీ పారితోషికం చెల్లించలేదని వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొంద రు ఎంఈవోలు డీడీఎస్లను సకాలంలో చేయటం లేదని చెప్పారు. సెక్రటరీ జనరల్ డాక్టర్ ఇంటి రాజు, వి.భిక్ష్మమయ్య, రాంబాబు నాయక్ సయ్యద్ ఖాసీం, సదారతుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు.