
నదిలో చిక్కుకున్న వ్యక్తిని ఒడ్డుకు చేర్చిన ఎస్డీఆర్ఎ
కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో చిక్కుకుని కేకలు వేస్తున్న ఓ వ్యక్తిని ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడి ఒడ్డుకు చేర్చిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిఽధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నున్నకు చెందిన అంకా సెల్వరాజ్ బుధవారం రాత్రి కృష్ణానదిలోకి వెళ్లి వారధి 42వ పిల్లర్ వద్ద ఇసుక తిన్నెల్లో పడుకుని నిద్రపోయాడు. గురువారం ఉదయం లేచి చూడగా అతని చుట్టూ వరద నీరు చేరుతుండడంతో భయంతో కేకలు పెట్టాడు. వారధి పైన వెళ్తున్న ప్రయాణికులు కేకలు విని అతనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కృష్ణలంక పోలీసులు ఎస్డీఆర్ఎఫ్ బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని పడవ ద్వారా అతని వద్దకు చేరుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అతని వివరాలను సేకరించిన పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిగా నిర్ధారించారు.