
పోలీసు గ్రీవెన్స్కు 84 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన గ్రీవెన్స్కు 84 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 45మంది ఫిర్యాదు చేయగా, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 7, కొట్లాటకు సంబంధించి 2, వివిధ మోసాలపై 3, మహిళా సంబంధిత నేరా లపై 5, దొంగతనాలకు సంబంధించి 5, ఇతర చిన్న వివాదాలకు సంబంధించి 17 కలిపి మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.