breaking news
National
-
వచ్చేస్తోంది మన బాహుబలి
న్యూఢిల్లీ: ఇరాన్లోని ఫోర్డో భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలపై అమెరికా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులను పడేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో తమ అమ్ముల పొదిలోనూ అలాంటి బాహుబలి బాంబులు ఆత్యావశ్యకమని భారత సైన్యం భావించింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా రంగం సిద్ధంచేసిందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. అత్యంత శక్తివంతమైన అగ్ని–5 ఖండాంతర క్షిపణికి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిస్సైల్ను మరింత ఆధునీకరిస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్లోని కిరానా హిల్స్లోని భూగర్భ అణుకేంద్రంపై భారత వాయుసేన బాంబులు పడేసిందన్న వార్తల నడుమ అధునాతన బంకర్ బస్టర్ బాంబు తయారీకి ఏర్పాట్లు జరుగుతుండటం విశేషం. ఏకంగా 100 మీటర్లు నేలలోకి చొచ్చుకుపోయేలా..అగ్ని–5 ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్కు అత్యంత బరువైన వార్హెడ్ను మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు డీఆర్డీవో తెలిపింది. తొలుత రెండు వేరియంట్లలో ఈ కొత్త మిస్సైల్ను తయారుచేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యంమీదకు జారవిడిచాక అది నేలలో ఏకంగా 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అవసరమైతే శత్రు భూగర్భ అణుకేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్–అమెరికా ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భారత్ తలపోస్తోంది. అందులో భాగంగానే బంకర్ బస్టర్ బాంబులతో సంప్రదాయక క్షిపణులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. సాధారణంగా అగ్ని–5 క్షిపణి గరిష్టంగా 5,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధిస్తుంది. దూరం కంటే కూడా అత్యంత బరువును మోయగలిగేలా కొత్తవేరియంట్లను సిద్ధంచేస్తున్నారు. తొలి దశలో గరిష్టంగా 7,500 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబును దీనిని అమర్చుతారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతులోకి చొచ్చుకుని పోయేలా కొత్తతరహా మెకానిజంతో దీనిని సిద్ధంచేస్తున్నారు. తక్కువ ఖర్చులో పని పూర్తయ్యేలా..అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను క్షిపణు లు మోసుకెళ్లలేవు. వాటిని మోసేందుకు, లక్ష్యంపై జారవిడిచేందుకు ప్రత్యేకంగా స్టెల్త్ రకంగా నార్త్రోప్ బీ–2 స్పిరిట్ బాంబర్లను అమెరికా సమకూర్చుకుంది. ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం ఖరీదు వేల కోట్ల రూపాయలు. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీనిని ప్రత్యామ్నాయంగా క్షిపణికి అమర్చి దాని ద్వారా బంకర్ బస్టర్ బాంబును రణక్షేత్రంలో పడేయాలని భారత్ భావిస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే తన అమ్ములపొదిలో ఉన్న అగ్ని–5ను ఈ కార్యం కోసం డీఆర్డీఓ ఎంచుకుంది. ఒకటి భూతలంపై.. మరోటి భూగర్భంలో..రెండు వేరియంట్లలో ఒకటి భూతలం మీది లక్ష్యాలను చేధిస్తుంది. ఇది నేలలోకి చొచ్చుకుపోదు. కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలనే నామరూపాల్లేకుండా పేల్చేస్తుంది. మరో రకం నేలలోకి చొచ్చుకెళ్లాన తర్వాతే పేలుతుంది. రెండు వేరియంట్లు గరిష్టంగా 8,000 కేజీల బాంబును మోసుకెళ్లేలా సిద్ధంచేయాలని భావిస్తున్నారు. ఈ బాంబు అందుబాటులోకి వస్తే ఇంతటి వేలకేజీల బరువైన బంకర్బస్టర్ బాంబులున్న దేశాల సరసన భారత్ నిలుస్తుంది. శత్రువుల కమాండ్–కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు. ఎప్పటికప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పక్కలో బళ్లెంలా తయారైన పాకిస్తాన్, చైనాలను నిలువరించాలన్నా, వాటి సైనిక సామర్థ్యాన్ని దెబ్బకొ ట్టాలన్నా భారత్కు ఇలాంటి భారీ బాంబుల అవసరం ఎంతైనా ఉందని డీఆర్డీఓ పేర్కొంది.హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా...ఎంత వేగంగా కిందకు పడితే అంతటి పెను వినాశనం సాధ్యమవుతుంది. అందుకే అత్యధిక హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా ఈ రెండు వేరియంట్లను తయారుచేస్తున్నారు. భూతల లక్ష్యాలను చేధించే వేరియంట్ మ్యాక్8 వేగంతో, భూగర్భ లక్ష్యాలను ఛిద్రంచేసే వేరియంట్ మ్యాక్20 వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు.బంకర్ బస్టర్ ఉపయోగాలేంటి?సైనిక బంకర్లు, క్షిపణి స్థావరాలు, భూగర్భ ఆయుధాగారాలు, భూగర్భ యురేనియం శుద్ధి కార్మాగారాలను భూస్థాపితం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబుతోనే సాధ్యం. జీపీఎస్ ట్రాకింగ్, అతి వేగం, భారీ బరువు దీని ప్రత్యేకతలు. నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రంచేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటివైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనిని రక్షణంగా ఉంటుంది. యుద్ధక్షేత్రంలో పోరాడే సైనికులు, యుద్ధట్యాంక్లు, డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారు. ఈ కంట్రోల్ సెంటర్ను నాశనంచేస్తే రణక్షేత్రంలోని బలగాలకు సరైన దిశానిర్దేశం కరువవుతుంది. దీంతో ఆ శత్రుబలగాలను నిలువరించడం భారత బలగాలకు తేలిక అవుతుంది. శత్రువులు ప్రయోగించే కొన్ని రకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు పాక్షిక భూగర్భ లాంఛర్ నుంచే దూసుకొస్తాయి. వీటిని భూస్థాపితం చేయాల న్నా బంకర్బస్టర్లు అవసరమే. -
ఆ వ్యాఖ్యల్లో అర్థం ఇదేనా ?.. సీఎం మార్పు ఖాయమేనా?
బెంగళూరులో తొక్కిసలాట ఘటన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టిందా?, కర్ణాటకలో సీఎంను మార్చాలా? అనేది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా చర్చిస్తున్న అంశం. మరొకవైపు తొక్కిసలాట ఘటన పేరుతో డీకే శివకుమార్ను సీఎం చేయడానికి రంగం సిద్ధమైందా? అనేది ఆ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్న చర్చ. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకూ హైకమాండ్ నుంచి ఎటువంటి ప్రకటనా నేరుగా రాకపోయినప్పటికీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కర్ణాటకలో సీఎంను మార్చబోతున్నారా? అనే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే డైరెక్ట్గా ఏమీ చెప్పలేకపోయారు. ఆయన నో అనే అవకాశం ఉన్నా కూడా ‘ అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ హైకమాండ్ అంటే తానే అనే విషయం మరిచిపోయి ఖర్గే ఇలా వ్యాఖ్యానించినప్పటికీ కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఏదో జరుగబోతుందనే సంకేతాలిచ్చారు ఖర్గే. మీడియా అడిగిన దానికి.. ‘ఇప్పుడు కర్ణాటకలో సీఎంను మార్చాల్సిన అవసరం ఏమిటి?’ అని చెప్పకుండా, అంతా హైకమాండ్ చేతుల్లో ఉంది అనడం త్వరలో ఏదో జరగబోతుందనే దాన్ని బలపరిచింది.డీకే శివకుమార్కు చాన్స్..? అక్కడ ప్రస్తుతం సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను తప్పిస్తే, ఆ తర్వాత రేసులో ఉన్నది డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్కే అవకాశం దక్కుతుంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడిన సమయంలో డీకే శివకుమార్ సీఎం అనే ప్రచారం జరిగింది. కానీ హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్యనే సీఎంను చేసింది. కర్ణాటకలో ఎటువంటి మార్పులు లేకుండా సీనియర్ అయిన సిద్ధరామయ్యను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అప్పట్నుంచి డీకే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య కాస్త దూరం పెరిగిందనేది జనాల్లో వినిపిస్తున్న మాట. అయితే సిద్ధరామయ్య కోసం తన చివరి శ్వాస వరకూ నిలబడతా అనే వ్యాఖ్య కూడా డీకే శివకుమార్ ఒకానొక సందర్భంలో చేసి తమ మధ్య ఏమీ విభేదాల్లేవని సంకేతాలిచ్చారు. ఈ ఏడాది శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది. ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలం చేకూర్చింది. అయితే డీకే శివకుమార్ తనపై వచ్చిన ఆరోపణలకు గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఎవరు ఏమనుకున్నా తాను చివరి శ్వాస వరకూ కాంగ్రెస్లోనే ఉంటానని తేల్చి చెప్పారు.మరింత పటిష్టం చేసే దిశగా పావులు..!కర్ణాటకలో కాంగ్రెస్ను మరింత పటిష్టం చేసి.. బీజేపీకి ధీటుగా నిలబడాలంటే డీకే శివకుమార్ సీఎం పగ్గాలు అప్పజెప్పాలని గత కొద్దికాలంగా వినిపిస్తున్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ఆలోచన చేసే దిశగా ముందుగా సాగుతున్నట్లు ఖర్గే వ్యాఖ్యల్లో అంతర్లీనంగా ఉన్న సారాంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ందేళ్లు జీవించాల్సిన పిల్లలు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో బలికావడాన్ని తట్టుకోలేకపోతున్నా. ఈ ఘటనతో బెంగళూరు, కర్ణాటక రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చింది’అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. 14–15 ఏళ్ల వయసున్న పిల్లలు చనిపోవడం కళ్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సదాశివనగరలోని తన నివాసం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టి లోపాలను సరిదిద్దుకుంటామని చెప్పారు. -
నేను స్త్రీ ద్వేషినా.. మీరు చేసిందేంటి?
నేను స్త్రీ ద్వేషినా? మరి ఆమె చేసిందేంటి? అంటూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత, ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఫైర్ అయ్యారు. ఆయన అంతలా ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రత్యర్థులపై కాదు.. సొంత పార్టీ మహిళా ఎంపీపైనే. ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన మహువా మొయిత్రాపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తూ నోరు పారేసుకున్నారు. కళ్యాణ్ బెనర్జీ ఎందుకంత కోపంతో ఊగిపోయారంటే..?జూన్ 25న, సౌత్ కలకత్తా లా కాలేజీలో విద్యార్థిపై దుండగులు దారుణానికి పాల్పడిన ఘటనపై కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'స్నేహితురాలిని స్నేహితుడే చెరబడితే మేమేం చేయగలం. యువతులు ఎలాంటి వారితో తిరుగుతున్నారో గమనించుకోవాలి. బెంగాల్లో ప్రతి చోట మహిళలకు రక్షణ కల్పించడం సాధ్యం కాద'ని వ్యాఖ్యానించారు. కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా మహువా మొయిత్రా ఖండించారు. 'భారతదేశంలో స్త్రీ ద్వేషం పార్టీలకు అతీతంగా ఉంటుంది. మిగతా పార్టీలతో టీఎంసీని వేరు చేసే విషయం ఏమిటంటే, ఈ అసహ్యకరమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా మేము ఖండిస్తామ'ని మొయిత్రా ఎక్స్లో పోస్ట్ చేశారు.మొయిత్రా వ్యాఖ్యలపై కళ్యాణ్ బెనర్జీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. 'ఆమె నన్ను మహిళా వ్యతిరేకి అంటుందా? ఆమె ఏమిటి? ఆమె ఏం చేసింది? ఆమె తన హనీమూన్ నుంచి తిరిగి వచ్చింది. ఆమె 40 సంవత్సరాల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి 65 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె నన్ను స్త్రీ ద్వేషి అంటుందా?' అని బెనర్జీ ఫైర్ అయ్యారు. బీజేడీ మాజీ ఎంపీ పినాకి మిశ్రాతో మొయిత్రా పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.చదవండి: ఖర్గేజీ.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉందా?మొయిత్రా వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించేలా ఉందని బెనర్జీ విమర్శించారు. కలిగంజ్ ఉప ఎన్నికల సమయంలో తనను ప్రచారం చేయనీయకుండా ఆమె అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళల గురించి మాట్లాడుతున్న ఆమె.. పార్టీలో మహిళా నాయకులను ఎదగనీయకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే మొయిత్రా, బెనర్జీ మధ్య విభేదాలు కొత్త కాదు. గతంలోనూ వీరిద్దరూ బహిరంగంగా పరస్పరం విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. -
‘ఖర్గేజీ.. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉందా?.. మీరు హైకమాండ్ కాదా?
బెంగళూరు: కాంగ్రెస్లో హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకే కట్టుబడి ఉండాలనేది ఎప్పట్నుంచో వస్తుంది. రాష్ట్రాల్లో ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలొ అది హైకమాండ్ ఫైనల్ చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర సీఎంలు కూడా హైకమాండ్ మాటకు ఎదురుచెప్పకూడదు. ఈ తరహా పరిణామాలను తరుచూ చూస్తూనే ఉన్నాం. మరి హైకమాండ్ అంటే ఎవరు?, ఏఐసీసీ అధ్యక్షుడే కాంగ్రెస్ హైకమాండ్ కదా.. మరి పార్టీ చీఫ్ అయిన మల్లిఖార్జున ఖర్గే నోట నుంచే హైకమాండ్ చూసుకుంటుంది అనే మాట వస్తే ఏమనాలి?ఇప్పుడు అదే జరిగింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే.. ‘హైకమాండ్ చేతుల్లో ఉంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లొ ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా> సీఎంను మార్చబోతున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే ఒక్క ముక్కలో తెగ్గొట్టి చెప్పేశారు. అది హైకమాండ్ చేతుల్లో ఉంది అంటూ దాటవేత ధోరణి అవలంభించారు. ఇది బీజేపీకి మంచి టానిక్లా దొరికింది. అటు కాంగ్రెస్ను, ఇటు ఖర్గేపై విమర్శలు చేయడానికి అవకాశం దొరికినట్లయ్యింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సెటైర్లతో విరుచుపడ్డారు. ‘ ఇక్కడ హైకమాండ్ అంటే ఎవరు? మీరు కాదా?, కాంగ్రెస్ చీఫ్గా ఉన్న మీరు హైకమాండ్ కాదా?, మరి ఇంకా హైకమాండ్ ఎవరు? అని తేజస్వి సూర్య పంచ్లు వేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కనపడదు.. అది మనకు కనిపించదు.. వినిపించని దెయ్యంలా ఉంటుందేమో. మనం మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ ఉందని ఫీలవుతూ ఉండాలి’ అని సెటైరికల్ పంచ్లు విసిరారు.The Congress High Command is like a ghost. It is unseen, unheard, but always felt. Even the Congress President, who people thought is the high command, whispers its name and says it’s not him. So eerie! https://t.co/GpcdHWQbSs— Tejasvi Surya (@Tejasvi_Surya) June 30, 2025 -
పాశమైలారం ఘటన బాధాకరం: ప్రధాని మోదీ
ఢిల్లీ: సంగారెడ్డి ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాం’’ అని ప్రధాని మోదీ తెలిపారు.పటాన్చెరు పారిశ్రామికవాడ పాశమైలారంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి కంపెనీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్ సహా చాలా భాగం దెబ్బతింది. ఆ సమయంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పరిసరాల్లోనే భారీ సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు సమాచారం. తెలంగాణరాష్ట్రం, సంగారెడ్డిలోగల ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.మృతుల బంధువులకు PMNRF నుండి రూ. 2 లక్షలు,…— PMO India (@PMOIndia) June 30, 2025 -
‘బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఫిక్సింగ్లో భాగమే’
ఢిల్లీ : తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం బీజేపీ-బీఆర్ఎస్ల మ్యాచ్ ఫిక్సింగ్లో భాగమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి. బీజేపీ-బీఆర్ఎస్లు మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నాయనే విషయం దీని ద్వారా నిరూపితమైందంటూ సెటైర్లు వేశారు. ఈరోజు(సోమవారం, జూన్ 30) ఢిల్లీ నుంచి మాట్లాడిన చామల.. కేసీఆర్ గెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, అటువంటప్పుడు దోచుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించారు కిరణ్కుమార్రెడ్డి‘మీరు(కేంద్రం) ఏమైనా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుపుకోసం బీఆర్ఎస్ చేసింది అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా ఆ రెండు పార్టీలు అదే రూట్ మ్యాచ్తో ముందుకు వెళ్లనున్నాయి. హైదరాబాద్లో మెట్రోకు పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్రెడ్డి.. తెలంగాణ, హైదరాబాద్ సమస్యల విషయంలో నోరు విప్పరు. హైదరాబాద్ నగర ప్రజకు కిషన్రెడ్డి చేసిందేమిటి?, ఈ ఏడాది కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. హైదరాబాద్ మెట్రో కోసం ఐదారుసార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వచ్చారు. మనం కట్టిన ట్యాక్సుల్లో మన వాటా వెనక్కి రావడం లేదు. సీఎం రేవంత్ తన ప్రయత్నం తాను చేస్తున్నారు.. కిషన్రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచెయ్యాలి’ అని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి సూచించారు. బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయనే.. -
ఐటీ ఉద్యోగితో పోలిస్తే వారికి రెట్టింపు ఆదాయం
కెరీర్కు బంగారు బాటగా ఇంజనీరింగ్ను పరిగణించే మన దేశంలో.. ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోవడానికి దాదాపు రూ.10-20 లక్షలు ఖర్చు చేయాలి. అంతేకాదు జీవితంలో విలువైన 4 సంవత్సరాలు వెచ్చించాలి. ఇంత వ్యయ ప్రయాసలకు ఓరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరితే చేతికి వచ్చే జీతం ఎంతో తెలుసా? సగటున గంటకు రూ.139-186 మాత్రమే. అదేదో చిన్నాచితకా కంపెనీల్లో వీరు ఉద్యోగం చేస్తు న్నారా అంటే అదీ కాదు. అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో! ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, డ్రైవర్ల వంటి నిపుణులైన కార్మికుల కంటే ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అందుకునే వేతనం తక్కువ.-సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో ఎంట్రీ-లెవల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సగటు జీతం 2007-2010 కాలంలో సంవత్సరానికి దాదాపు రూ.3.5 లక్షలుగా ఉండేది. అప్పటితో పోలిస్తే 2024లో ఆర్థికంగా చాలా మార్పులు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ సహా అన్నింటి ధరలూ పెరిగోయి, కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాలామంది ప్రెసర్ల వేతనాల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. అర్బన్ కంపెనీ, స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా వంటి ప్లాట్ఫామ్స్లో పనిచేస్తున్న కార్మికులైతే బీటెక్ గ్రాడ్యుయేట్ల కంటే రెండింతలకుపైనా ఆదాయం అందుకుంటున్నారని ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ కంపెనీ 'కెరీ ర్స్ 360' నివేదిక చెబుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రోత్స హించాలంటే జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది.బీటెక్ చదువు ఖర్చు పెరిగింది... రోజుకు 9 గంటల చొప్పుననెలలో 20 రోజుల పని దినాలకు అంటే నెలలో 180 గంటలు విధులు నిర్వర్తించారని భావిస్తే.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ లో ఫ్రెషర్లు అందుకునే వేతనం కంపెనీని బట్టి గంటకు రూ. 130 నుంచి రూ.180 మధ్య ఉంది. బీటెక్ డిగ్రీ దశాబ్దన్నర క్రితం రూ.1-2 లక్షల్లో పూర్తి అయ్యేది. ఇప్పుడు ఏకంగా దానికి పదిరెట్లకుపైనే ఖర్చు పెరిగింది. గ్రాడ్యుయేట్లు తమ నాలుగేళ్ల చదువు కోసం అధిక సమయం. కృషి, డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. కానీ, చదువు పూర్తై పట్టా చేతికొచ్చాక.. కోటి ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరితే జీతాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.రికవరీకి 6-8 ఏళ్లు..అర్బన్ కంపెనీలో నైపుణ్యం కలిగిన కార్మికులు సగటున గంటకు రూ.311 సంపాదిస్తున్నారు. ప్లంబర్లు. ఎలక్ట్రిష్ యన్స్, టెక్నీషియన్స్, బ్యూటీషియన్స్, కార్పెంటర్లు, డ్రైవర్లు, మసాజ్ థెరపిస్ట్ వంటి నైపుణ్యం కలిగిన ఈ కార్మి వీలు నెలకు సగటున 160 గంటలు పనిచేస్తే.. పన్నులు. కమీషన్, మెటీరియల్ వ్యయాలు పోను నెలకు రూ. 40 వేలకుపైగా సంపాదిస్తున్నారు.ఇది కేవలం జీతాల పోలిక కాదని కెరీర్స్ 300 అంటోంది. 2010 పూర్వం బీటెక్ విద్యార్ధి తన డిగ్రీకి అయిన ఖర్చును తిరి రాబట్టుకోవడానికి రెండు మూడేళ్లు పట్టేది. ఇప్పుడు తగ్గాల్సింది పోయి పెరిగిపోయింది. ఏకంగా 5 ఏళ్లకుపైనే: పడుతోంది. మరోవైపు గగ్ ఎకానమీలోనూ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి ఈ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఉపాధి అవకాశాలను వేగంగా, తక్కువ అడ్డంకులతో సాధిస్తున్నారని కెరీర్స్.. 360 చెబుతోంది. -
లా కాలేజీ విద్యార్థినిపై దాష్టీకం సీసీ కెమెరాలో రికార్డు
కోల్కతా: సౌత్ కోల్కతా లా కాలేజీలో విద్యార్థిపై గ్యాంగ్రేప్ ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. ఘటన చోటుచేసుకున్న జూన్ 25వ తేదీనాటి సీసీటీవీ ఫుటేజీలో ఫస్టియర్ చదివే విద్యారి్థనిని కొందరు సెక్యూరిటీ గార్డు రూంలోకి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. అందులో బాధితురాలు, ముగ్గురు నిందితుడు, సెక్యూరిటీ గార్డు కనిపించారన్నారు. అక్కడి స్టూడెంట్స్ యూనియన్ గది, వాష్రూంలో వెంట్రుకలు, హాకీ స్టిక్ను, గుర్తు తెలియని ద్రావకం కలిగిన కొన్ని బాటిళ్లను స్వా«దీనం చేసుకున్నట్లు చెప్పారు. గార్డు రూం, స్టూడెంట్స్ యూనియన్ గది, వాష్ రూంలలో పెనుగులాట చోటుచేసుకున్నట్లు ఆనవాళ్లున్నాయని వివరించారు. నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు తెలిపారు. బాధితురాలి ముఖం, మెడపై గీసుకుపోయినట్లు, ఛాతీపై కొన్ని గుర్తులు ఉన్నాయని వివరించారు. ప్రధాన నిందితుడు కాలేజీ మాజీ విద్యార్థి, టీఎంసీ విద్యార్థి నేత మోనోజిత్ మిశ్రాతోపాటు మరో ఇద్దరు విద్యార్థులను, కాలేజీ వాచ్మ్యాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఉండగా, ఘటన చోటుచేసుకున్న లా కాలేజీకి ఆదివారం జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ)సభ్యురాలు అర్చనా మజుందార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థినిపై జరిగిన దారుణంపై దర్యాప్తు చేయకుండా పోలీసులు తనకు ఆటంకం కలిగించారని అనంతరం మజుందార్ ఆరోపించారు. ఘటనాప్రాంతంలో ఫొటోలు, వీడియోలు నిషేధించినట్లు చెప్పారన్నారు. కాగా, ఘటనపై దర్యాప్తునకు అసిస్టెంట్ కమిషనర్ స్థాయి పోలీసు అధికారి సారథ్యంలో ఐదుగురు సభ్యుల సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెల్సిందే. -
భారత కాలపు ఆయుధాలు!
జైపూర్: పొలం దున్నుతుంటేనో, కొత్త ఇంటి కోసం భూమిని తవ్వుతుంటేనో లంకెబిందెలు దొరకడం, ఎవరూ చూడకుంటే దాచేసుకోవడం, అందరికీ తెలిస్తే ప్రభుత్వపరం కావడం తెల్సిందే. మానవాళి నడిచి వచ్చిన దారుల గురించి, మన పూరీ్వకులు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, సాంస్కృతిక సంపద గురించి తెలియాలంటే ఇలా లభ్యమైన పురాతన విగ్రహాలు, పాత్రలు, కళాఖండాలే ఆధారం. తాజాగా ఏకంగా మహాభారత కాలంనాటి, అంటే దాదాపు 4,500 ఏళ్ల నాటి పురాతన విగ్రహాలు, ఆయుధాలు, పాత్రలు రాజస్తాన్లోని బీట్ జిల్లాలో తవ్వకాల్లో బయటపడ్డాయి. మౌర్యులు, శుంగ వంశ పాలనా కాలానికి చెందిన ఈ వస్తువులను పురాతత్వ శాఖ (ఏఎస్ఐ) తాజాగా తవ్వితీసింది. గత నాగరికత తాలూకు అవశేషాలు బయల్పడిన రాజస్తాన్లోని భరత్పూర్కు 40 కిలోమీటర్ల దూరంలోని బహాజ్ గ్రామంలో ఈ తవ్వకాలు జరిపారు. ఉత్తరప్రదేశ్లోని మథుర, ఈ బహాజ్ గ్రామం, హరియాణాలోని మరికొన్ని ప్రాంతాలన్నింటినీ కలిపి కృష్ణుడు నడయాడిన ‘బ్రజ్ భూమి’గా పిల్చుకుంటారన్నది తెలిసిందే. జనవరిలో తవ్వకాలు షురూ బహాజ్ గ్రామ భూముల్లో పురాతన ఆనవాళ్లు ఉన్నట్లు ప్రాథమిక అంచనాతో ఈ ఏడాది జనవరిలో పురాతత్వ బృందాలు తవ్వకాలు మొదలెట్టాయి. నిరాటంకంగా ఆరు నెలలుగా తవ్వకాలు జరపగా ఎన్నెన్నో పురాతన వస్తువులు లభించాయి. రాజులు, రాజ్యాల ఘనతను చాటే విగ్రహాలు, వస్తువులు, పాత్రలు, ఆయుధాలు దొరికాయి. ఒక అస్థిపంజరం సైతం లభించింది. అది ఏ కాలపుదో తెల్సుకునేందుకు ఇజ్రాయెల్ పంపారు. కొన్ని అపురూప విగ్రహాలను జైపూర్లోని పురాతత్వ శాఖ విభాగానికి తరలించి భద్రపరిచారు. మరి కొన్నింటిని పౌరుల సందర్శనల కోసం డీగ్ జల్మహల్, ఇతర మ్యూజియాల్లో ప్రదర్శనకు ఉంచారు. ‘‘తవ్వకాలకు అనుమతి రాగానే ఎంతో సంతోషిచాం. ఏమాత్రం ఆలస్యంచేయకుండా జనవరి 10వ తేదీన తవ్వకాలు మొదలెట్టాం. తవ్వకాలు ఇకమీదట కూడా కొనసాగుతాయి. సమీప ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరిపి పురాతన నాగరికత తాలూకు అవశేషాలను కనుగొంటాం. నాటి సంస్కృతిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు కృషిచేస్తాం’’ అని జైపూర్ పురాతత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ వినయ్ గుప్తా చెప్పారు. దశాబ్దాల క్రితం సమీప నౌ గ్రామంలో ఏఎస్ఐ బృందాలు తవ్వకాలు జరిపారు. ఆనాడు సైతం కొన్ని పురాతన వస్తువులు లభించాయి. -
Shimla: పేకమేడ కాదది.. ఐదంతస్తుల భవనం
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోమవారం సిమ్లాలోని ఐదంతస్తుల భవనమొకటి కుప్ప కూలింది. పేకమేడలా నేలమట్టం అవుతున్న ఈ ఇంటికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, కొండచరియలు విరిగిపడుతున్న కారణంగా ముందుగానే భవన యజమాని అంజనా వర్మ బిల్డింగ్లోని అందరినీ ఖాళీ చేయించడంతో పెనుముప్పు తప్పింది. Himachal Pradesh: 5-storey building collapses in Shimla after heavy rain—no casualties reported.#Viral #Trending #ViralVideo pic.twitter.com/DVa4rXYcG9— TIMES NOW (@TimesNow) June 30, 2025భవనానికి సమీపంలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం కారణంగా భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయని అంజనా వర్మ ఆరోపించారు. గ్రామ ఉపాధ్యక్షుడు యశ్పాల్ వర్మ కూడా సమీపంలో రోడ్డు నిర్మాణం కారణంగానే బిల్డింగ్కు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. అయినప్పటికీ రోడ్డు పనులు చేపడుతున్న కంపెనీ ఆ పనులను నిలిపివేయలేదు. ఫలితంగా ఇప్పుడు మరికొన్ని ఇళ్లు కూడా ప్రమాదం అంచున ఉన్నాయన్నారు. హిమాచల్ ప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదంటూ వాతావరణ కార్యాలయం రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఇది కూడా చదవండి: చెత్త బండీలో మహిళ మృతదేహం.. దారుణానికి పాల్పడ్డ లివ్ ఇన్ పార్ట్నర్ -
అవి అస్పష్ట, గంపగుత్త ఆరోపణలు
నాగ్పూర్: క్యాన్సర్ నుంచి కోలుకుని భర్త వద్దకు వెళ్లిన తన సోదరిని అత్తింటి వారు కట్నం తేవాలంటూ వెనక్కి పంపించి వేశారంటూ ఓ వ్యక్తి చేసిన ఆరోపణలను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ప్రతీకారేచ్ఛతోనే ఈ ఫిర్యాదు చేసినట్టుగా భావిస్తున్నామని పేర్కొంది. తనతోపాటు 68 ఏళ్ల తన తల్లిపై నమోదైన కట్నం వేధింపుల కేసును కొట్టివేయాలంటూ పుణేకు చెందిన పిటిషనర్ వేసిన పిటిషన్పై జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ ప్రవీణ్ ఎస్ పాటిల్ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. పిటిషనర్కు 2016లో వివాహమవగా అతడి భార్యకు క్యాన్సర్ ఉన్నట్లు 2019లో నిర్థారణయింది.అనంతరం ఆమె తన సోదరుడి వద్ద ఉంటూ చికిత్స తీసుకుంది. వైద్యం ఖర్చు కొంత సోదరుడే భరించాడు. వ్యాధి నుంచి కోలుకున్నాక 2020 జనవరిలో ఆమె తిరిగి భర్త వద్దకు వెళ్లింది. అయితే, రూ.8 లక్షల కట్నం తేవాలంటూ ఆమెను భర్త, అత్త వెనక్కి పంపించి వేశారంటూ సోదరుడు 2021 ఫిబ్రవరి 11న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మరునాడు, అంటే ఫిబ్రవరి 12వ తేదీన ఆమె కన్నుమూసింది. అత్తింటి వారి నుంచి క్యాన్సర్ చికిత్సకు అయిన ఖర్చులను రాబట్టేందుకే అతడు కేసు వేశాడని పిటిషనర్ తరఫు లాయర్ యోగేశ్ వైద్య వాదించారు. పిటిషనర్ తన భార్య వైద్యానికైన ఖర్చు కొంత భరించారని, వైద్య బీమా కూడా చేయించారని ధర్మాసనానికి ఆధారాలను నివేదించారు. పైపెచ్చు, పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయలేదు, ఇతరత్రా వేధింపులేవీ నమోదు కాలేదన్నారు. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత భర్త వద్దకు ఆమె ఎప్పుడు వెళ్లింది వంటి వివరాలు సైతం లేవన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ భార్య సోదరుడు కక్ష సాధింపు కోసమే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. అస్పష్టంగా, ఎలాంటి ఆధారాల్లేకుండా గంపగుత్తగా అతడీ ఆరోపణలు చేశాడని తెలిపింది. పిటిషనర్, అతడి తల్లిపై నమోదైన కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
చెత్త బండీలో మహిళ మృతదేహం.. దారుణానికి పాల్పడ్డ లివ్ ఇన్ పార్ట్నర్
బెంగళూరు: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పసివయసు వారి నించి వృద్ధ మహిళల వరకూ ఎక్కడో ఒకచోట ప్రతీరోజూ అకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఇటువంటి దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. మహిళను నమ్మించి, ఆమెతో సహజీవనం సాగించి, ఆనక ఆమెను కడతేర్చిన ప్రబుద్ధుని ఉదంతం కలకలం రేపుతోంది.బెంగళూరులో ఒక మహిళ మృతదేహాన్ని ఒక చెత్త ట్రక్కులో పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహాన్ని ఒక సంచిలో ఉంచి, దానిని చెత్త ట్రక్కులో పడవేసినట్లు గుర్తించారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మహిళను ఆమె లివ్ ఇన్ పార్ట్నర్ హత్య చేశాడని కనుగొన్నారు. మృతురాలిని ఆశ(40)గా పోలీసులు గుర్తించారు. ఆమెకు మహ్మద్ షంషుద్దీన్(33) అనే వ్యక్తితో సంబంధం ఉందని, అతనే ఆమెను హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.బెంగళూరు పౌర సంస్థ బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) సిబ్బంది ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం కలిగిన గోనె సంచిని చూసింది. ఆ మహిళ చేతులను కట్టివేసి, గొనె సంచిలో కుక్కివేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు పంపి, కేసు దర్యాప్తు ప్రారంభించారు.మృతురాలికి సంబంధించిన ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడిని అస్సాంకు చెందిన మహ్మద్ షంషుద్దీన్గా గుర్తించారు. నిందితుడు ఆశతో ఏడాదిన్నరగా లివ్ ఇన్లో ఉన్నాడు. వారిద్దరూ దక్షిణ బెంగళూరులోని హులిమావులో ఒక అద్దె ఇంట్లో కలిసి ఉన్నారు. నిందితుడు, బాధితురాలికి గతంలోనే వేర్వేరుగా వివాహాలు కాగా, వారికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆశ,మహ్మద్ షంషుద్దీన్లు తాము భార్యాభర్తలమని చుట్టుపక్కల వారికి చెప్పేవారు.ఆశా అర్బన్ కంపెనీలో పనిచేస్తూ, గృహనిర్వాహక సేవలను అందిస్తుంటుంది. మహమ్మద్ షంషుద్దీన్ భార్య, ఇద్దరు పిల్లలు అస్సాంలోనే ఉన్నారు. ఈ కేసు గురించి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ బి జగల్సర్ మాట్లాడుతూ ఆశ, షంషుద్దీన్ మధ్య గొడవ జరిగిందని, అది మరింత తీవ్రం కావడంతో షంషుద్దీన్.. ఆశను గొంతు కోసి చంపాడని తెలిపారు. తరువాత అతను ఆశ మృతదేహాన్ని గొనె సంచిలో కుక్కివేసి, దానిని బైక్పై తీసుకువెళ్లి చెత్త ట్రక్కులో పడవేసి అక్కడి నుండి పారిపోయాన్నారు. అయితే ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో నిందితుడు పట్టుబడ్డాడని జగల్సర్ తెలిపారు. -
సిక్సర్ బాది.. గుండెపోటుతో కుప్పకూలి.. పిచ్పైనే ప్రాణాలొదిలి!
పంజాబ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానిక క్రికెటర్ పిచ్పైనే ప్రాణాలొదిలాడు. ఉత్సాహంగా మ్యాచ్ ఆడుతున్న అతడు.. సిక్సర్ బాదిన వెంటనే గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే అతడు మరణించినట్లు సమాచారం.మృతుడిని హర్జీత్ సింగ్గా గుర్తించారు. కాగా ఫిరోజ్పూర్లోని డీఏవీ పాఠశాల మైదానంలో రెండు జట్లు క్రికెట్ మ్యాచ్లో తలపడుతున్నాయి. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన హర్జీత్.. సిక్సర్తో అలరించాడు. అయితే, ఆ వెంటనే పిచ్ మధ్యలోకి వచ్చిన అతడు ఒక్కసారిగా కుప్పకూలాడు.ఇంతలో సహచర ఆటగాళ్లు వచ్చి హర్జీత్ను పైకిలేపే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించి సీపీఆర్ (CPR- కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేశారు. కానీ అప్పటికే అతడు స్పృహ కోల్పోయిన అతడిలో ఎలాంటి చలనం కనిపించలేదు. గుండెపోటు కారణంగా హర్జీత్ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.సిక్సర్బాది ఆ వెంటనే కాగా సిక్సర్బాది ఆ వెంటనే అతడు కుప్పకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. హర్జీత్ కుటుంబానికి నెటిజన్లు సానుభూతి తెలుపుతున్నారు. కాగా గతేడాది కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 35 ఏళ్ల క్రికెటర్ ఒకరు పుణెలోని గర్వారే స్టేడియంలో మ్యాచ్ ఆడుతూనే గుండెపోటుకు గురయ్యాడు.ఓపెనర్గా బ్యాటింగ్కు వచ్చిన ఇమ్రాన్ పటేల్ అనే వ్యక్తి కాసేపటికే ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి.. ఫీల్డ్ అంపైర్ల అనుమతితో మైదానాన్ని వీడాడు. కానీ పెవిలియన్ చేరేలోపే అతడు కుప్పకూలిపోయాడు. పూర్తి ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతడు గుండెపోటు కారణంగా మృతి చెందడం గమనార్హం. ఆల్రౌండర్ అయిన ఇమ్రాన్ మైదానంలో ఎంతో చురుగ్గా ఉండేవాడని.. దురదృష్టవశాత్తూ అతడిని కోల్పోయామని తోటి ఆటగాళ్లు, స్నేహితులు విచారం వ్యక్తం చేశారు.A local cricketer in Ferozepur hit a six off a delivery, but just moments later, he suffered a heart attack and tragically collapsed on the ground, losing his life. pic.twitter.com/7j4WXolkFf— Vipin Tiwari (@Vipintiwari952) June 29, 2025 -
‘కస్టమ్స్’ చేతికి 16 అందమైన పాములు
ముంబై: ప్రయాణికుల మాదిరిగా విమానం నుంచి దిగిన కొందరు.. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్లుగా పట్టుబడటాన్ని మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. వీరు బంగారం లాంటి విలువైన వస్తువులను తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. తాజాగా ముంబైలోని భారత కస్టమ్స్ అధికారులు థాయిలాండ్ నుండి వస్తున్న విమాన ప్రయాణికుడిని స్మగ్లింగ్ ఆరోపణలతో అడ్డుకున్నారు.ఈ సందర్భంగా కస్టమ్స్ అధికారులు వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. థాయిలాండ్ నుండి భారత్కు వస్తున్న ప్రయాణికుని నుండి 16 సజీవ పాములను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. తదుపరి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది.ఈ సజీవ పాములు విషపూరితం కానివని అధికారులు తెలిపారు. జూన్ ప్రారంభంలో థాయిలాండ్ నుంచి డజన్ల కొద్దీ పాములను అక్రమంగా రవాణా చేస్తున్న ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇదేవిధంగా కొద్దిరోజుల వ్యవధిలో బల్లులు, సన్బర్డ్ల తదితర 100 జీవులను తరలిస్తున్న మరో ప్రయాణికుడిని కూడా అధికారులు అడ్డుకున్నారు.ఇది కూడా చదవండి: భారత్-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి? -
సీసీటీవీ సాక్షిగా భార్యాభర్తల గొడవ, ఆ మర్నాడే..
జైపూర్: రాజస్థాన్లోని జైపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఒక దంపతుల జంట వారి ఇంట్లో అచేతనంగా కనిపించింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ జంట ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. అలాగే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు.జైపూర్లోని ఒక బ్యాంకులో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్న ధర్మేంద్ర సమయం గడుస్తున్నా బ్యాంకుకు రాకపోవడంతో, సిబ్బంది అతనికి కాల్ చేశారు. దానికి కూడా సమాధానం రాకపోవడంతో ధర్మేంద్ర స్నేహితుడు అతని ఇంటికి వెళ్లాడు. అతను ఇంటి తలుపు తెరవగానే ధర్మేంద్రతో పాటు అతని భార్య విగతజీవులుగా కనిపించారు.కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారి ఫ్లాట్ పార్కింగ్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా, దానిలో ధర్మేంద్ర, సుమన్లు ఏదో విషయమై తీవ్ర స్థాయిలో అరుచుకుంటూ, వాదించుకోవడం కనిపించింది. ఈ ఫుటేజ్ దంపతులు మృతిచెందడానికి ముందురోజుదిగా పోలీసులు గుర్తించారు. అలాగే ఆ వీడియోలో సుమన్ తన భర్త కారు తీయడాన్ని అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆ తరువాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారు తమ ఇంటిలోనికి వెళ్లిపోయారు.అదే రోజు సాయంత్రం నాటి మరో వీడియోలో వారు అపార్ట్మెంట్లోకి ప్రవేశించడం కనిపించింది. ఆ సమయంలో సుమన్ ఒక బ్యాగ్ తీసుకెళుతున్నది. ఇద్దరూ సజీవంగా కనిపించిన చివరి ఫుటేజ్ ఇదే. కాగా ఈ జంట ఇటీవలే ఫ్లాట్ను కొనుగోలు చేశారని, వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని స్థానికులు తెలిపారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ప్రస్తుతం భరత్పూర్లోని తాత ఇంటిలో ఉన్నారు. కాగా సుమన్ తండ్రి అజయ్ సింగ్ పోలీసులతో మాట్లాడుతూ తన కుమార్తె శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని, ఇది హత్యనని ఆరోపించారు.ఇది కూడా చదవండి: Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు -
నాన్నా.. ఈ మెంటల్ టార్ఛర్ భరించలేకున్నా!
అన్నానగర్: తిరుప్పూర్ జిల్లా అవినాశిలోని కైకాట్టిపుదూర్ ప్రాంతానికి చెందిన అన్నాదురై బనియన్ కంపెనీ నడుపుతున్నాడు. ఇతని కూతురు రిదన్య ( 27). ఈమెకి కైకట్టిపుదూర్ లోని జయం గార్డె¯న్కు చెందిన కవింకుమార్కు మూడు నెలల క్రితం వివాహమైంది. శనివారం ఇంటి నుంచి కారు తీసుకెళ్లిన రిదన్య ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇంతలో, మొండిపాళయం సమీపంలోని చెట్టిపుత్తూరులో కొబ్బరి చెట్లకు ఉపయోగించే పురుగుమందుల మాత్రలు మింగి రిదన్య తన కారులో మృతి చెంది కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న సేవూర్ పోలీసులు రిదన్య మతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కుటుంబ వివాదం కారణంగా రిదన్య విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ముందు రిదన్య తన తండ్రికి వాట్సాప్ ద్వారా కొన్ని ఆడియోలను పంపింది. పోలీసులు వాటిని స్వా«దీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందులో భర్త కవిన్కుమార్, మామగారు ఈశ్వరమూర్తి, అత్తగారు చిత్రాదేవి, ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పేర్కొంది. ఇకపై ఈ జీవితాన్ని గడపలేనని వెల్లడించింది. రిదన్యకు పెళ్లయి 3 నెలలే కావడంతో, ఆర్టీఓ దర్యాప్తు కూడా జరుగుతోంది. -
ఉత్తరాదిలో దంచికొడుతున్న వానలు.. ఈ రాష్ట్రాలకు రెడ్, ఎల్లో అలర్ట్
ఢిల్లీ: ఉత్తర, ఈశాన్యం భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో పలువురు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బైండ్లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతిచెందారు. ఏడుగురి ఆచూకీ గల్లంతైంది. ఘటనాస్థలానికి 18 కిలోమీటర్లల దూరంలోని తిలాడీ షాహిద్ స్మారక్ వద్ద ఆ ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ప్రమాద స్థలంలో మొత్తం 29 మంది ఉన్నారని, వీరిలో 20 మందిని రక్షించామని అధికారులు తెలిపారు.⛈️ Uttarakhand Cloudburst Triggers Chaos – Char Dham Yatra Halted, 9 Missing📍Uttarkashi, India –• Heavy rains and a cloudburst hit Uttarkashi, causing landslides and widespread disruption.• Nine workers missing near a hotel site on the Yamunotri Highway, search ops… pic.twitter.com/ZkxDgS2l03— Snap Media (@SnapMediaLive) June 29, 2025చార్ధామ్యాత్రపై ప్రభావం.. వరదల కారణంగా చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, దేహ్రాదూన్, నైనీతాల్, తెహ్రీల్లో ఉన్న యాత్రికులను ముందుకు వెళ్లకుండా ఆపాలని స్థానిక యంత్రాంగానికి సమాచారం అందించారు. అనంతరం, మళ్లీ యాత్ర ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇక, హిమాచల్లోని కుల్ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కుల్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 🌧️ #Uttarakhand | Heavy rains caused Dhangarhi & Dhikuli canals to overflow, disrupting traffic on NH-309 between Ramnagar & Kumaon-GarhwalVehicle movement halted, police managing traffic. Administration on alert; public advised to avoid unnecessary travel🛣️ #UttarakhandRains pic.twitter.com/NniieWLzYP— The Bharat Current (@thbharatcurrent) June 29, 2025 జార్ఖండ్లోని తూర్పు సింగ్బూమ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా వరద నీటిలో మునిగిన ఓ ఆశ్రమ పాఠశాల భవనంలో చిక్కుకున్న 162 మంది విద్యార్థులను స్థానికుల సాయంతో రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 1 నుంచి 28 వరకు రాష్ట్రంలో 80 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Kullu, Himachal Pradesh | IMD issues a yellow alert for Kullu as the state continues to receive heavy rainfall. pic.twitter.com/A71nfgEyML— ANI (@ANI) June 30, 2025 రాబోయే వారం రోజులు భారీవర్షాలు: ఐఎండీబంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ ఆదివారం రెడ్ అలర్ట్ జారీచేసింది. చండీగఢ్లో ఒక్కరోజే 119.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది. -
Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో విద్యార్థినిపై జరిగిన అకృత్యం దేశవ్యాపంగా సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తులో పలు విస్తుపోయే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. బాధితురాలిని ఇద్దరు నిందితులు కళాశాల లోపలికి బలవంతంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో కనిపించాయి. ఈ కేసులో ప్రధాన నిందితుని నుంచి వచ్చిన వివాహ ప్రతిపాదనను బాధితురాలు తిరస్కరించిన నేపధ్యంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.అత్యాచార బాధితురాలిని కళాశాల గేటు నుండి కళాశాల ప్రాంగణంలోకి ఇద్దరు నిందితులు బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో బయటపడ్డాయని కోల్కతా పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి. ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రా మరో ఇద్దరు నిందితులతో తనను బలవంతంగా గార్డు గదిలోనికి తీసుకువెళ్లాలని ఆదేశించాడని బాధితురాలు చెప్పడాన్ని ఈ వీడియో క్లిప్ ధృవీకరిస్తోంది. ప్రస్తుతం తాము ఫుటేజ్ను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఈ కేసులో నిందితులు మనోజిత్ మిశ్రా, ప్రోమిత్ ముఖర్జీ, జైద్ అహ్మద్, కాలేజీ సెక్యూరిటీ గార్డులను ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేశారు. మనోజిత్ బాధితురాలిపై అత్యాచారం చేశాడని, మిగిలిన ఇద్దరు ఆమెను బ్లాక్ మెయిల్ చేసేందుకు వీడియో చిత్రీకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనోజిత్ మిశ్రా తృణమూల్ యువజన విభాగంలో సభ్యునిగా ఉన్నారు. దీంతో పార్టీపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోంది.ఇది కూడా చదవండి: Maharashtra:‘హిందీ’పై గరంగరం.. త్రిభాషా విధానం రద్దు -
Maharashtra:‘హిందీ’పై గరంగరం.. త్రిభాషా విధానం రద్దు
ముంబై: మహారాష్ట ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై వెనక్కు తగ్గింది. త్రిభాషా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి చేసే ప్రభుత్వ ప్రయత్నాన్ని పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా విమర్శించిన దరిమిలా తాజా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అమలుపై ఒక కమిటీ సమగ్రంగా చర్చించనున్నదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ ‘పాఠశాలల్లో వివిధ భాషలను ఏ ప్రమాణాల ప్రకారం అమలు చేయాలి? విద్యార్థులకు ఏ ఎంపికలు ఇవ్వాలి? అనేది నిర్ణయించేందుకు విద్యావేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా విధానం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఏప్రిల్ 16, జూన్ 17న జారీ చేసిన రెండు ప్రభుత్వ తీర్మానాలను రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించారు.ఫడ్నవీస్ ప్రభుత్వం గతంలో ఒక ప్రకటనలో ఇంగ్లీష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా వెల్లడించింది. దీనిపై శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఎన్సీపీ (ఎస్పీ)ల ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం మరాఠీపై దృష్టి సారిస్తుందని ప్రకటించారు. అలాగే ఇంగ్లీషును అంగీకరించిన ఉద్ధవ్ థక్రే తీరును ఆయన తప్పుబట్టారు. గతంలో త్రిభాషా విధానం అమలుపై ఒక కమిటీని ఏర్పాటు చేయాన్న డాక్టర్ రఘునాథ్ మషేల్కర్ కమిటీ సిఫార్సులను ఉద్ధవ్ థాక్రే అంగీకరించారని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ హిందీ భాష నేర్చుకోవాలని కోరుకున్నారని సీఎం ఫడ్నవీస్ అన్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా.. ప్రపంచవ్యాప్త పిలుపు -
‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్..
న్యూఢిల్లీ: ఇరాన్లోని అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు మద్దతు పలుకుతూ, రంగంలోకి దిగిన అమెరికా తన సత్తాను చాటుతూ, మూడు అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల గురించి తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ తమ బీ-2 స్టెల్త్ ఫైటర్ విమానాలు విసిరిన బాంబులు ఇరాన్లోని అత్యంత రక్షణాత్మక ఫోర్డో అణు కేంద్రంపై వెన్నలా విస్తరిస్తూ వెళ్లి, దానిని ధ్వంసం చేశాయని వ్యాఖ్యానించాయి.ట్రంప్ ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘వారు(ఇరాన్) బాంబులు లోపలికి వెళ్లే అవకాశం ఉన్న ద్వారాన్ని మూసివేసేందుకు ప్రయత్నించారు. అయితే తమ బాంబులు వెన్నలా ఆ ద్వారం గుండా సంపూర్ణంగా దూసుకెళ్లాయి. జూన్ 22న ఫోర్డో, నటాంజ్ ఇఫ్సహాన్ అణుకేంద్రాలపై సాగించిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ విజయవంతమయ్యింది. ఆ దేశ అణు కార్యక్రమాన్ని నిర్మూలించాం. ఫోర్డోను కాపాడుతున్న వేల టన్నుల రాతి భాగాన్ని బంకర్ బస్టర్ బాంబు దాడులు కొల్లగొట్టాయి. వారు దాడికి ముందు అక్కడి యురేనియం నిల్వలను ఆ ప్రదేశం నుండి తరలించలేదు. ఫోర్డోను ధ్వంసం చేయడం కష్టమని తొలుత భావించాం. ఈ దాడులు ఎప్పటికి పూర్తి చేస్తామో కూడా ముందుగా చెప్పలేకపోయాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. “Like Absolute Butter”: Trump On How US Struck Iran’s Fordow Nuclear Site https://t.co/GzjLqH6sz6 - #bharatjournal #news #bharat #india— Bharat Journal (@BharatjournalX) June 29, 2025ఫోర్డో అణుకేంద్రం ఇరాన్లో అత్యంత రహస్య ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది పర్వతం దిగువ భాగంలో ఉంది. వైమానిక దాడులు, విదేశీ జోక్యాన్ని నిరోధించేందుకు ఇరాన్ దీనిని పటిష్టంగా నిర్మించింది. కాగా యురేనియం నిల్వలను వృద్ధి చేయడాన్ని ఆపాలని టెహ్రాన్(ఇరాన్)కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. అయితే ఇందుకు ఇరాన్ అంగీకరించకపోవడంతో ఆ దేశంలోని అణుకేంద్రాలపై అమెరికా.. జీబీయూ-57 బంకర్ బస్టర్లు, టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది.ఇది కూడా చదవండి: Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే.. -
మెదడును నియంత్రించే ఫంగస్!
చాన్నాళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సృష్టించిన హాలీవుడ్ చిత్రం జురాసిక్ పార్క్ సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో అడవిలో పేద్ద చెట్టు నరికేస్తుంటే దాని జిగురులో ఒక దోమ చిక్కుకుపోయి ఉంటుంది. ఆ దోమ అప్పటికే ఒక పెద్ద డైనోసార్ను కుడుతుంది. ఆ డైనోసార్ రక్తం నుంచి సేకరించి డీఎన్ఏతో శాస్త్రవేత్తలు మళ్లీ డైనోసార్కు ప్రాణప్రతిష్టచేస్తారు. అచ్చం అలాగే 9.9 కోట్ల సంవత్సరాల క్రితంనాటి ఒక జిగురులో చిక్కుకుపోయిన చీమ, ఈగల సాయంతో వాటికి సోకిన ఒక ఫంగస్ జాడను నేడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే ఆ ఫంగస్ కూడా డైనోసార్ల కాలంనాటిదిగా పరిశోధకులు భావిస్తున్నారు.జాంబీ ఫంగస్?చెట్లు సూర్యరశ్మి ద్వారా కిరణజన్యసంయోగ క్రియ జరిపి శక్తిని సంపాదిస్తాయి. అయితే ఫంగస్, కీటకాలు వంటివి సొంతంగా ఆహారాన్ని, శక్తిని సృష్టించుకోలేక ఇతర జీవులపై ఆధారపడతాయి. వీటిని పరాన్న జీవులు అంటారు. అలాంటి పరాన్న జీవజాతులకు చెందిన కొన్ని ఫంగస్ రకాలు ఏకంగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టేస్తాయి. అంటే చీమ మెదడులోకి దూరి దానినే ఈ ఫంగస్ నియంత్రిస్తుంది. దాంతో ఆ చీమ ఒక ‘జాంబీ’ తరహాలో నియంత్రణ తప్పి ప్రవర్తిస్తుంది. అలాంటి జాంబీ ఫంగస్ ఈకాలంలోనేకాదు డైనోసార్ల కాలంలోనూ జీవించి ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఈ జిగురులో చిక్కుకుపోయిన ఈగ, చీమలో కొత్త రకం ఫంగస్ల ఆనవాళ్లను గుర్తించారు. అయితే ఈ జాంబీ ఫంగస్ ఎంతటి శక్తివంతమైంది?. ఆనాటి చిన్నపాటి జీవజాలానికి ఇవి సోకి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాయా అనే ప్రశ్నలకు ఇప్పుడు శాస్త్రవేత్తలు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు.ఏమిటీ ఫంగస్ ప్రత్యేకత కొన్ని రకాల కీటకాలు ఎక్కువగా ఒఫియోకార్డిసెప్స్ అనే ఫంగస్ బారిన పడతాయి. ఈ కీటకాల్లోని అతిదేహి కణాల్లోకి ఫంగస్ చొరబడి నెమ్మదిగా మెదడును చేరుతుంది. మెదడు కణాలను ఫంగస్ తనకు అనువుగా పనిచేసేలా మార్చేస్తుంది. పని పూర్తయ్యాక చివరకు ఆ కీటకాన్ని ఈ ఫంగస్ కణాలు చంపేస్తాయి. కీటక ప్రపంచంలో ఒఫియోకార్డిసెప్స్ ఫంగస్ వ్యాప్తి వివరాలపై తాజాగా పరిశోధన వేగవంతంకానుంది. అయితే తాజాగా ఈ చీమ, ఈగలో కనుగొన్న ఫంగస్లను గతంలో శాస్త్రవేత్తలు ఎన్నడూ చూడలేదు. దీంతో వీటికి కొత్త పేర్లు పెట్టారు. ‘‘ 9.9 కోట్ల ఏళ్ల క్రితం నాటి జీవులకు సోకిన ఫంగస్ రకాలున్న చీమ, ఈగ లభించడం నిజంగా అత్యంత అరుదు’’ అని నైరుతి చైనాలోని యునాన్ విశ్వవిద్యాలయంలోని పురాతనజీవశాస్త్ర విభాగ డాక్టోరల్ విద్యారి్థ, ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన యుహూయీ ఝువాంగ్ చెప్పారు. ‘‘ఒఫియోకార్డిసెప్స్ ఫంగస్ పూరీ్వకులను గుర్తించడం ఇదే తొలిసారి. అందుకే వీటికి కొత్త పేర్లు పెట్టాం. చీమలో లభించిన కొత్త ఫంగస్కు పాలియోకార్డిసెప్స్ అని, ఈగకు సోకిన ఫంగస్కు పాలియోకార్డిసెప్స్ ఐరనోమేయీ అని నామకరణం చేశారు. కొన్ని ఒఫియోకార్డిసెప్స్ ఫంగస్ జాతులు ఈకాలంనాటి చీమలకూ సోకుతాయి. ఈ ఫంగస్కు ‘జాంబీయాంట్ ఫంగీ’ అనే పేరుంది. మెదడులోకి ఒఫియోకార్డిసెప్స్ ఫంగస్ వ్యాపించి తనకు అనువుగా ప్రవర్తించేలా చీమను తన వశంచేసుకుంటుంది. హెచ్బీఓ ప్రసారమైన టీవీ సిరీస్ ‘ ది లాస్ట్ ఆఫ్ అస్’కు ఈ ఫంగసే స్ఫూర్తి. కొత్త ఫంగస్ రకాలను కనుగొన్న పరిశోధనా తాలూకు వివరాలు ‘‘ప్రొసీడింగ్స్ ఆఫ్ రాయల్ సొసైటీ’’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. కొత్త ఫంగస్ల రూపురేఖలు, లక్షణాలను తెల్సుకునేందుకు మైక్రో–కంప్యూటెడ్ టోమోగ్రఫీ ద్వారా త్రిమితీయ చిత్రాలను తీశారు. 14 నుంచి ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం నాటి ఫంగస్గా తేల్చారు. ఈ కాలాన్ని క్రిటేసియస్ కాలంగా పరిగణిస్తారు. ‘‘ జాంబీ ఫంగస్ సోకిన కీటకాలు త్వరగా చనిపోతాయి. ఒకరకంగా ఈ రకం కీటకాల జనాభాను నియంత్రించే కారకాలుగా జంబీ ఫంగస్ను చెప్పొచ్చు’’ అని పరిశోధకుడు ఝువాంగ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏ జాతులకు సోకుతున్నాయి? చీమలతోపాటు ఈగ, సాలెపురుగు, పేడపురుగు, సికాడాస్ పెద్ద ఈగ జాతులకూ ఈ జాంబీ ఫంగస్ బెడద ఉందని లండన్లోని నేచరల్ హిస్టరీ మ్యూజియం పత్రాలు వెల్లడిస్తున్నాయి. గండు చీమల మెదడులోకి నేరుగా దూరిపోయి వాటిని జాంబీ చీమలుగా మారుస్తాయని వాషింగ్టన్లోని స్మిత్సోనియన్ మ్యూజియం ఆఫ్ నేచరల్ హిస్టరీ సీనియర్ సైంటిస్ట్ కాన్రాడ్ లాబండీరీ చెప్పారు. -
బుద్ధుడిపై వియత్నాం ప్రజల్లో భక్తి, ఆప్యాయత ఉన్నాయి
సాక్షి, న్యూఢిల్లీ/విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక బౌద్ధ కేంద్రమైన నాగార్జునకొండలోని భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కలి్పంచినందుకు వియత్నాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సందేశాల ద్వారా కృతజ్ఞతలు చెబుతున్నారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మొదట భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలు రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నాగార్జున కొండలో కనుగొన్నట్టు తెలిపారు.ఈ ప్రదేశానికి బౌద్ధ మతంతో లోతైన సంబంధం ఉందన్నారు. ఒకప్పుడు శ్రీలంక, చైనా వంటి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి సందర్శించే వారని మోదీ వివరించారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్లో మోదీ ప్రసంగించారు. వియత్నాం ప్రజలు పంపించిన సందేశాలలో ప్రతి పంక్తిలో భక్తి, ఆప్యాయత ఉన్నాయన్నారు. బుద్ధుని పవిత్ర అవశేషాలను దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించినందుకు వారు భారతదేశానికి తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. ఆదివాసీ విద్యార్థులు భేష్ ‘పదేళ్ల క్రితం ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం గొప్పగా మారుతోంది. విశాఖపట్నంలో జరిగిన యోగా దినోత్సవంలో చాలా ఆకర్షణీయమైన చిత్రాలను మనం చూశాం. బీచ్లో 3 లక్షల మంది యోగా చేయడం.. యోగాపై వారికున్న అంకితభావాన్ని గుర్తు చేస్తోంది’ అని మన్ కీ బాత్లో మోదీ గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం జ్ఞాపకాలతో నిండి ఉండాలని ఆకాంక్షించారు.ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘విశాఖ నుంచే మరో అద్భుతమైన దృశ్యం వెలువడింది. రెండు వేలకు పైగా ఆదివాసీ విద్యార్థులు 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేశారు. వారికి యోగాపై ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉందో మీరే ఊహించుకోండి. మన నావికాదళ నౌకలపై కూడా యోగా గొప్పతనం కనిపించింది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. -
ప్రయాణానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు శుభవార్త. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు రైల్వే శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం 4 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ ప్రకటిస్తున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇకపై 8 గంటల ముందే చార్ట్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రయాణం విషయంలో గందరగోళానికి తెరపడనుంది.రిజర్వేషన్ ఖరారు అయ్యిందో లేదో 8 గంటల ముందే తెలిసిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా వెయిటింగ్ లిస్టు ప్రయాణిలకు లబ్ధి చేకూరనుంది. టికెట్ బుకింగ్ వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. టికెటింగ్ వ్యవస్థ పూర్తి పారదర్శ కంగా, ప్రభావవంతంగా, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే రిజర్వేషన్ చార్ట్ను ప్రయాణానికి 8 గంటల ముందు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని దశల వారీగా అమల్లోకి తీసుకొస్తారు. -
దేశమంతటా రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతీ రుతుపవనాలు ఈ సీజన్లో తొమ్మిది రోజులు ముందుగానే దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం తెలిపింది. సాధారణంగా జూన్ ఒకటిన కేరళ మీదుగా దేశంలోకి ప్రవేశించే రుతుపవనాలు జూలై 8వ తేదీనాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తా యని పేర్కొంది. ఈసారి మాత్రం ముందుగానే ప్రవేశించడంతోపాటు విస్తరించాయంది. 2020లో జూన్ 26వ తేదీకల్లా దేశమంతటా రుతు పవనాల విస్తరణ పూర్తయిందని గుర్తు చేసింది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ యూపీ, హరియాణాల్లో వ్యాపించాయని వివరించింది.వచ్చే వారం రోజుల్లో దేశంలోని వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతం మీదుగా బలమైన అల్పపీడన వ్యవస్థల మద్దతుతో, రుతుపవనాలు వేగంగా ముందుకు సాగాయని తెలిపింది..అయితే, మే 29 నుంచి జూన్ 16 వరకు దాదాపు 18 రోజుల పాటు రుతు పవనాల కదలికలో స్తబ్దత ఏర్పడిందని పేర్కొంది. జూన్–సెప్టెంబర్ మధ్య ఈసారి సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశాలున్నాయంది.ఉత్తరాఖండ్లో కుంభవృష్టి..ఇద్దరు మృతిఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఆదివారం ఉదయం కురిసిన కుంభవృష్టి నిర్మాణ కార్మికులిద్దర్ని బలి తీసుకుంది. మరో ఏడుగురు గల్లంతయ్యారు. యమునోత్రి జాతీయ రహదారి పక్కన ఓ హోటల్ నిర్మాణం పక్కనే కార్మికులు తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. భారీ వర్షంతో కొండచరియలు విరిగి ఈ నివాసాలపై పడ్డాయి. ఈ ఘటనలో ఘటనలో ఇద్దరు చనిపోయారు.గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టాయి. హైవే దెబ్బతినడంతో ఛార్ ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. హిమాచల్ ప్రదేశ్లోనూ కుంభవృష్టి కారణంగా సిమ్లా–కల్కా రైలు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. జార్ఖండ్లోని ఈస్ట్ సింగ్భుమ్ జిల్లాలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పండర్సోలిలోని ప్రైవేటు స్కూల్ ఆవరణలోకి వరద చేరడంతో లోపల కనీసం 162 మంది విద్యార్థులు చిక్కుబడిపోయారు. -
ఎమర్జెన్సీ యోధులు చిరస్మరణీయులు
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన వ్యక్తులు రాజ్యాంగాన్ని హత్య చేయడంతోపాటు న్యాయ వ్యవస్థను చెరబట్టారని, కీలుబొమ్మను చేసి ఆడించారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఎమర్జెన్సీ పేరిట అప్పటి ప్రభుత్వం ప్రజలను వేధింపులకు గురి చేసిందని, లెక్కలేనన్ని అఘాయిత్యాలు జరిగాయని ఆరోపించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన నాయకులు చిరస్మరణీయులని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో వారి పోరాటమే మనకు స్ఫూర్తి అని ఉద్ఘాటించారు. ఆదివారం 123వ ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రజల భాగస్వామ్యం, వారి సమ్మిళిత శక్తితో ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కోవచ్చని అన్నారు. కొన్ని ఆడియో రికార్డులను ప్రధానమంత్రి వినిపించారు. సంక్షోభం అంటే ఎంత భయకరంగా ఉంటుందో వీటిద్వారా తెలుస్తుందని అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రధానమంత్రిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్ మాట్లాడిన ఆడియో, ఎమర్జెన్సీ దారుణాల గురించి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ మాట్లాడిన ఆడియోలు ఇందులో ఉన్నాయి. నాటి దారుణాలు మరవలేం ‘‘ఇందిర హయాంలో ప్రజలపై దమనకాండ కొన్ని సంవత్సరాలపాటు నిరంతరాయంగా కొనసాగింది. ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత రెండేళ్లపాటు మరింత తీవ్రంగా మారింది. ప్రజల హక్కులను హరించారు. స్వాతంత్య్రపు హక్కును అణచివేశారు. వార్తాపత్రికలపై కఠిన ఆంక్షలు విధించారు. కోర్టులను సైతం వదల్లేదు. వాటికి అధికారాలు లేకుండా చేశారు. లక్ష మందికిపైగా జనాన్ని జైళ్లలో పెట్టారు. అక్షరాలా రాక్షస పాలన సాగించారు’’ అని మొరార్జీ దేశాయ్ మాట్లాడిన ఆడియోలో వినిపించింది. 1975 నుంచి 1977 దాకా 21 నెలలపాటు ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అప్పటి దారుణాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.జార్జి ఫెర్నాండెజ్ చేతులకు సంకెళ్లు వేశారని, మీసా చట్టం కింద వేలాది మందిని నిర్బంధించి, వారిపట్ల అమానవీయంగా ప్రవర్తించారని గుర్తుచేశారు. కానీ, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారని, చివరకు విజయం సాధించారని చెప్పారు. ఎమర్జెన్సీ విధించినవారికి గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లయిన సందర్భంగా ఇటీవల ‘సంవిధాన్ హత్య దివస్’ జరుపుకున్నామని మోదీ తెలిపారు. 1977 ఎన్నికల్లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వాజ్పేయ్ ఏం మాట్లాడారంటే.. ‘‘దేశంలో ఇప్పుడు జరిగిన దాన్ని కేవలం ఎన్నికలు అనలేం. ఇదొక శాంతియుత విప్లవం. ప్రజా వెల్లువ ప్రజాస్వామ్య హంతకులను కుర్చీ నుంచి కూలదోసింది. వారిని చెత్తబుట్టలోకి విసిరేసింది’’ దీనిపై మోదీ స్పందిస్తూ.. అత్యవసర పరిస్థితిని ఎదిరించి పోరాడిన వారిని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చెప్పారు.ట్రకోమా రహిత దేశంగా భారత్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ‘ట్రకోమా’ రహిత దేశంగా భారత్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాన మోదీ అన్నారు. ఇందుకోసం కృషి చేసినవారికి అభినందనలు తెలియజేశారు. అస్సాంలోని బోడోలాండ్ ఫుట్బాల్ క్రీడాకారులుకు కేంద్రంగా మారిందని హర్షం వ్యక్తంచేశారు. మేఘాలయాలో ఎరీ సిల్క్కు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించిందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పట్టు పరుగులను చంపకుండా అక్కడ వ్రస్తాలు తయారు చేస్తున్నారని ప్రధాని వెల్లడించారు. -
2026 ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో 16వ జన గణన, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 8వ జన గణనకు రంగం సిద్ధమవుతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి జన గణన అధికారికంగా ప్రారంభం కానుంది. జనాభా లెక్కల సేకరణ వీలుగా పరిపాలనా యూనిట్ల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా ప్రతిపాదించాలని కేంద్రం సూచించింది. జన గణన ప్రక్రియకు మార్పులు చేసిన పరిపాలనా యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. డిసెంబర్ 31న సరిహద్దులు ఖరారు చేస్తామన్నారు.ఈ మేరకు రిజి్రస్టార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ నారాయణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, పట్టణాలను ఏకరూప ఎన్యూమరేషన్ బ్లాక్లుగా విభజించనున్నట్లు తెలిపారు. ఒక్కో బ్లాక్కు ఒక ఎన్యూమరేటన్ను నియమిస్తారు. జనాభా లెక్కల సేకరణలో పొరపాట్లు జరగకుండా వీరు చర్యలు తీసుకుంటారని వివరించారు. 3 నెలల్లోగా జన గణన పూర్తిచేయాల్సి ఉంటుంది.2027 మార్చి 1వ తేదీ లోగా రెండు దశల్లో జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో హౌజ్లిస్టింగ్ ఆపరేషన్, రెండో దశలో పాపులేషన్ ఎన్యూమరేషన్ నిర్వహిస్తారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి జన గణనతోపాటు కుల గణన కూడా చేపట్టనున్నారు. ఎన్యూమరేషన్ బ్లాక్లు ఖరారైన తర్వాత పరిపాలనా యూనిట్ల సరిహద్దుల్లో మార్పులు చేయడానికి వీలుండదు. దేశంలో చివరిసారిగా 2011లో జన గణన జరిగింది. మళ్లీ 16 ఏళ్ల తర్వాత.. 2027లో జరగబోతోంది. -
రథయాత్రలో తొక్కిసలాట
పూరీ: ఒడిశాలో విఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో గుండిచా ఆలయం ఎదుట తొక్కిసలాట జరగడంతో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 50 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించామని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు.మూడు రథాల్లో కొలువుదీరిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను దగ్గరి నుంచి తిలకించడానికి గుండిచా ఆలయం వద్ద భక్తులు ఇసకేస్తే రాలనంతగా గుమిగూడారు. అంతలో యాత్రా సామగ్రితో రెండు ట్రక్కులు జనం మధ్యలోకి దూసుకొచ్చాయి. దాంతో భయాందోళనకు గురై వారంతా ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. ఒకరిపై ఒకరు పడిపోయారు. తొక్కిసలాటలో బోలాగఢ్కు చెందిన బసంతి సాహూ (36), బాలిపాట్నాకు చెందిన ప్రేమకాంత్ మొహంతీ (80), ప్రవతి దాస్ (42) మరణించారు. అధికారులపై వేటు తొక్కిసలాటపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వయిన్, ఎస్పీ వినీత్ అగర్వాల్పై బదిలీ వేటు వేశారు. డీసీపీ బిష్ణు పాటీ, కమాండెంట్ అజయ్ పాధీని సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. జగన్నాథుడి భక్తులు క్షమించాలంటూ ‘ఎక్స్’లో సీఎం పోస్టు చేశారు. రథయాత్రలో తొక్కిసలాటకు భద్రతా లోపాలే కారణమని దర్యాప్తులో తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. రథయాత్ర ఇన్చార్జిగా సీనియర్ అధికారి అరవింద్ అగర్వాల్ను నియమించింది.పరిస్థితి అదుపులోకి వచి్చందని న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం మనసును కలచివేసిందని పూరీ రాజు, శ్రీజగన్నాథాలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ గజపతి మహారాజా దివ్యసింగ్ దేవ్ చెప్పారు. ఇవి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాందీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పటా్నయక్ తదితరులు సంతాపం ప్రకటించారు.ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఘోరం జరిగిందని విమర్శించారు. పూరీలో రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. సంప్రదాయం ప్రకారం మూడు రథాలు ప్రధానాలయం నుంచి 2.6 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి శనివారం చేరుకున్నాయి. గుండిచా మాతను జగన్నాథ, బలభద్ర, సుభద్రల తల్లిగా భావిస్తారు. రథాలు జూలై 5 దాకా అక్కడే ఉంటాయి. అనంతరం బహుదా యాత్ర ద్వారా ఆలయంలోకి తిరుగు ప్రయాణం అవుతాయి. -
సిలికాన్ లేకుండానే కంప్యూటర్
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ టెక్నాలజీలో రారాజుగా వెలుగొందుతున్న సిలికాన్ మూలకానికి ఉన్న ప్రాభవం భవిష్యత్తులో తగ్గిపోనుందని తాజా పరిశోధన ఒకటి స్పష్టంచేస్తోంది. ఆధునిక ఎలక్ట్రానిక్, సాంకేతిక ప్రపంచానికి ప్రాణాధారంగా నిలుస్తున్న స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లలో సిలికాన్ మూలకం అత్యంత కీలకం. ఈ మూలకం లేకుండా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువు పురుడుపోసుకోదన్న వాదనను బద్దలుకొడుతూ అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధనా బృందం ప్రపంచంలోనే తొలిసారిగా సిలికాన్రహిత కంప్యూటర్ను అభివృద్ధిచేసింది. గత అర్ధశతాబ్దకాలంతో పోలిస్తే నేటి కంప్యూటర్ల పరిమాణం తగ్గడానికి, స్మార్ట్ఫోన్లు, విద్యుత్ వాహనాల సర్క్యూట్లలో సిలికాన్ అత్యంత ప్రధానమైన మూలకం.అలాంటి సిలికాన్ లేకుండానే ‘కాంప్లిమెటరీ మెటల్ –ఆక్సైడ్ సెమీకండక్టర్’ కంప్యూటర్ను తయారుచేశామని వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరిశోధనా తాలూకు వివరాలు ‘నేచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. తక్కువ పరిమాణంలో విద్యుత్తో వినియోగించుకుంటూ అత్యంత పల్చటి, వేగవంతమైన ఎలక్ట్రానిక్స్ తయారీకి ఈ ద్విమితీయ వస్తువులు బాటలు వేస్తాయని పరిశోధకులు చెప్పారు. సర్క్యూట్లో ట్రాన్సిస్టర్లు ముఖ్యమైనవి. ఈ ట్రాన్సిస్టర్లను అత్యంత శుద్ధమైన సిలికాన్తో తయారుచేస్తారు. అయితే తాజా పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకులు సిలికాన్కు బదులుగా ఎన్–టైప్ ట్రాన్సిస్టర్ కోసం మాలిబ్డినమ్ డైసల్ఫైడ్, పీ–టైప్ టాన్సిస్టర్ కోసం టంగ్స్టన్ డైసెలినైడ్ను ఉపయోగించారు. సారథ్యం వహించిన భారతీయుడుఈ పరిశోధనకు పెన్సిల్వేనియా వర్సిటీలోని ఇంజనీరింగ్ సైన్స్, మెకానిక్స్ విభాగ ప్రొఫెసర్, భారతీయ మూలాలున్న సప్తర్షి దాస్ సారథ్యం వహించారు. ఈయన నేతృత్వంలోని బృందం తాజాగా ప్రాథమిక స్థాయిలో కాంప్లిమెంటరీ మెటల్–ఆక్సైడ్ సెమీకండక్టర్ (సీఎంఓఎస్)కంప్యూటర్ను తయారు చేసింది. ‘‘ సిలికాన్ పాడైతే ఆ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. అదే ఈ ద్విమితీయ వస్తువులతో తయారైన సర్క్యూట్.. విద్యుత్ ప్రవాహాన్ని స్థిరీకరిస్తుంది. దాంతో సర్క్యూట్ ఎక్కువకాలం మన్నుతుంది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ రంగంలో ఇదొక మైలురాయి.భవిష్యత్తులో సిలికాన్రహిత సర్క్యూట్ల తయారీకి ఇది బాటలువేస్తుంది’’ అని సప్తర్షి దాస్ వివరించారు. మెటల్–ఆర్గానిక్ కెమికల్ వేపర్ డిపోజీషన్(ఎంఓసీవీడీ) విధానంలో అత్యంత పల్చని పొరల మీద మాలిబ్డినమ్ డైసల్ఫైడ్, టంగ్స్టన్ డైసెలినైడ్ పరుచుకునేలా చేస్తారు. తద్వారా ఈ వినూత్న ట్రాన్సిస్టర్లను తయారుచేశారు. రెండు అంగుళాల పొరమీద సైతం ఈ ట్రాన్సిసర్ను అభివృద్ధిచేయొచ్చు. ఈ కంప్యూటర్ అత్యంత తక్కువ కరెంట్ను ఉపయోగించుకుంటూ 25 కిలోహెడ్జ్ సామర్థ్యంతో పనిచేస్తుందని పరిశోధనలో కీలకపాత్ర పోషించిన డాక్టోరల్ విద్యార్థి, భారతీయ మూలాలున్న సుభీర్ ఘోష్ చెప్పారు. ఈ ప్రాథమిక స్థాయి కంప్యూటర్ ప్రస్తు తానికి సింపుల్ లాజిక్ ఆపరేషన్స్ను సమర్థవంతంగా పూర్తిచేయగలదు.భవిష్యత్తు అంతా 2డీదే‘‘మీరొక బహుళ అంతస్తుల భవనం కట్టాలంటే పటిష్టమైన ఇటుకలను వాడతారు. కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతికతను ఉపయోగించి పటిష్టమైన పల్చటి పేపర్లతోనూ నిర్మాణం పూర్తిచేయొచ్చు. పల్చని, వేగవంతమైన ట్రాన్సిస్టర్లతో కంప్యూటర్నూ రూపొందించవచ్చు’’ అని సప్తర్షి వ్యాఖ్యానించారు. సిలికాన్ సాంకేతికత గత 80 ఏళ్లుగా సరైన అభివృద్ధికి నోచుకోలేదు. కానీ 2డీ టెక్నాలజీ 2010లో మొదలైనా వెనువెంటనే అభివృద్ధిచెందుతోంది. భవిష్యత్తు అంతా 2డీ టెక్నాలజీదే’’ అని పరిశోధకులు చెప్పారు. ఈ పరిశోధనకు అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్, ది ఆర్మీ రీసెర్చ్ ఆఫీస్, నేవీ రీసెర్చ్ ఆఫీస్లు సైతం ఆర్థికసాయం అందిస్తున్నాయి. -
సాంకేతిక మార్గదర్శకులు!
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘2025 టెక్నాలజీ పయనీర్స్’ పేరిట 28 దేశాల నుండి 100 స్టార్టప్స్ను ఎంపిక చేసింది. ‘ఆవిష్కరణల రంగంలో విస్తృత మార్పులు చోటు చేసుకున్నాయి. తక్కువ వనరులతో తదుపరి స్థాయి, ఆధునికతను అందుకోవడానికి అనేక కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగిస్తున్నాయి. ఆస్టరాయిడ్ మైనింగ్, ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీల నుండి వ్యవసాయాన్ని మార్చడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించడం, భూమి ఉపరితలం కింద కీలక ఖనిజాలను గుర్తించడానికి సూపర్నోవా పేలుళ్ల నుండి శక్తిని ఉపయోగించడం వరకు.. ఇలాంటి కొత్త దారులను కంపెనీలు ఎంచుకుంటున్నాయి’ అని వరల్డ్ ఎకనమిక్ ఫోరం కితాబిచ్చింది. వివిధ రంగాల్లో ఆవిష్కరణలను నడిపిస్తున్న ఈ సంస్థల్లో.. 2025 జాబితాలో భారత్ నుంచి ఏకంగా 10 కంపెనీలు చోటు సంపాదించుకోవడం విశేషం. హైదరాబాద్ కంపెనీ ఈక్వల్ సైతం వీటిలో ఉంది. ఈ కంపెనీల గురించి సంక్షిప్తంగా..అగ్నికుల్ కాస్మోస్: ఇది 2017లో చెన్నైలో ఏర్పాటైంది. భూమికి తక్కువ కక్ష్యలో 100 కేజీల వరకు బరువుండే పేలోడ్ను, సుమారు 700 కి.మీ. ఎత్తువరకు మోయగల ’అగ్నిబాణ్’ అనే చిన్న ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేసింది. దీన్ని ప్రయోగించేందుకు అగ్నికుల్ లాంచ్ప్యాడ్ను కూడా ఈ సంస్థ తయారుచేసింది. ఇది దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ప్యాడ్. ఇంతవరకు శ్రీహరికోటలో ఒకటే లాంచ్ప్యాడ్ ఉండేది. అగ్నిబాణ్ను 2024 మే 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ‘అగ్నిలెట్’ పేరుతో ప్రపంచంలో తొలిసారిగా సింగిల్–పీస్, 3డీ–ప్రింటెడ్, సెమీ–క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ తయారు చేసింది.సైన్స్ ఎల్ఆర్ (సైబర్నెటిక్స్ ల్యాబొరేసైన్స్ ఎల్ఆర్ (సైబర్నెటిక్స్ ల్యాబొరేటరీ): టరీ): బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ రోబోటిక్స్ తయారీలో ఉంది. ఇప్పటికే సైరో అనే రోబో తయారుచేసింది. ఇది గుడ్డు, బిస్కెట్ నుంచి.. ఎలాంటి వస్తువునైనా అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుందని, ఏ పరిశ్రమ అవసరాలనైనా చక్కబెడుతుందని కంపెనీ చెబుతోంది.డెజీ: స్మైల్స్.ఏఐ పేరుతో 2019లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభం అయింది. తర్వాత డెజీగా పేరు మార్చుకుంది. ఏఐ ఆధారిత డయాగ్నస్టిక్ టెక్నాలజీని ఉపయోగించి దంత సంరక్షణ సేవలను అందిస్తోంది.దిగంతర: అంతరిక్ష నిఘా, ఇంటెలిజెన్స్ సేవల్లో ఉంది. ప్రపంచంలో తొలిసారిగా వాణిజ్యపరంగా అంతరిక్ష నిఘా శాటిలైట్ను ప్రయోగించింది. అంతరిక్ష కార్యకలాపాలు, ట్రాఫిక్ నిర్వహణ సేవలూ అందిస్తోంది. అంతరిక్షంలో ఉన్న పరిస్థితులను తెలియజేయడంతోపాటు శాటిలైట్లు, శకలాలు ఢీకొనకుండా అలర్ట్స్ చేస్తుంది. భూమికి తక్కువ కక్ష్యలో 5 సెంటీమీటర్ల చిన్న వస్తువులనూ గుర్తిస్తుంది. ఉత్తరాఖండ్లో 2018లో స్థాపించారు.ఈక్వల్: సురక్షిత కేవైసీ ధ్రువీకరణ సేవలను హైదరాబాద్ కేంద్రంగా అందిస్తోంది. కంపెనీని కేశవ్ రెడ్డి, రాజీవ్ రంజన్ 2022లో నెలకొల్పారు. 250లకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. 2025 మార్చిలో 10 కోట్లకుపైగా లావాదేవీలను పూర్తి చేసింది.ఎక్స్పోనెంట్ ఎనర్జీ: బెంగళూరు కేంద్రంగా అడ్వాన్స్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ రంగంలో ఉంది. బ్యాటరీ ప్యాక్స్తోపాటు 15 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పూర్తి అయ్యే ఈ–పంప్స్ (చార్జింగ్ స్టేషన్) తయారు చేస్తోంది.ఫ్రేట్ టైగర్: ముంబై కేంద్రంగా సరుకు రవాణా మౌలిక వసతులు, నిర్వహణ సేవలు అందిస్తోంది. సరుకు సేకరణ, డెలివరీ, బిల్లింగ్తో సహా రవాణా కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి డిజిటల్ వేదికను రూపొందించింది.గెలాక్స్ ఐ: అంతరిక్ష సాంకేతిక రంగంలో బెంగళూరుకు చెందిన స్టార్టప్. ఐదుగురు ఐఐటీ మద్రాస్ విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు. అన్ని కాలాలలోనూ వాతావరణ సమాచారం, తక్కువ వెలుతురులోనూ నిఘా; భూమిపై మనుషులు, వాహనాలు, వస్తువుల కదలికలు; పంట దిగుబడి వంటి సమాచారాన్ని హై రిజొల్యూషన్స్ చిత్రాలతో అందించే హైబ్రిడ్ ఇమేజింగ్ శాటిలైట్ను ప్రపంచంలో తొలిసారిగా దేశీయంగా తయారు చేస్తోంది. మేఘాలు ఉన్నా, రాత్రి సమయంలోనూ చిత్రాలను తీయగల సాంకేతికత అభివృద్ధి చేసింది.సోలార్స్క్వేర్: ముంబైలో 2015లో మొదలైన ఈ కంపెనీ సోలార్ ప్యానెల్ సిస్టమ్స్ రూపకల్పన, స్థాపన రంగంలో ఉంది. రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్, నిర్వహణ, ఫైనాన్సింగ్ సేవలను అందిస్తోంది.ది ఈ–ప్లేన్ కో: ఐఐటీ మద్రాస్లో 2019లో ప్రాణం పోసుకుంది. నగరాల్లో రవాణా కోసం.. ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఒక కార్గో విమానాన్ని సైతం పరీక్షిస్తోంది. ఎయిర్ ట్యాక్సీని తొలుత మానవ పైలట్తో ప్రవేశపెట్టే పనిలో ఉంది. నిబంధనలు అనుమతిస్తే రానున్న రోజుల్లో అటానమస్ ఎయిర్ ట్యాక్సీ రానుంది. పైలట్ లేకుండానే ఇది గాల్లో చక్కర్లు కొడుతుంది. -
స్కోరుంటేనే.. లోన్
తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని ఓ యువతి పెళ్లికి నిరాకరించింది. మహారాష్ట్రలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది. మరో సంఘటనలో క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. ఈ రెండు సందర్భాల్లోనూ రెండు జీవితాలను క్రెడిట్ స్కోర్ మార్చేసింది. క్రెడిట్ స్కోర్ అంత ముఖ్యమా.. ఇంతకీ ఈ స్కోర్ ఏమిటి.. ఎవరు, ఎలా నిర్ణయిస్తారు.. సామాన్యుల మదిలో ఉన్న సందేహాలకు జవాబు తెలుసుకుందాం. – సాక్షి, స్పెషల్ డెస్క్నాకు లోన్ కావాలి. క్రెడిట్ స్కోర్ ఉంటేనే ఇస్తామన్నారు. ఏమిటీ స్కోర్?ఓసారి మీ స్నేహితులనో, బంధువులనో ఓ రూ.లక్షో.. 2 లక్షలో చేబదులు అడిగి చూడండి! ఎంతమంది ఇచ్చి ఉంటారు? ఎంతమంది బంగారమో, ఇంటి పత్రాల వంటి హామీలు అడిగి ఉంటారు? మీరు బాగా తెలిసినవారే అయినా మీరు తిరిగి చెల్లించగలరా అని వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది మీరెవరో తెలియకుండా ఓ బ్యాంకు లేదా లోన్ యాప్ మిమ్మల్ని నమ్మి, ఎలాంటి తనఖా లేకుండా అప్పు ఎలా ఇస్తాయి? అందుకే, మీరేంటి.. గతంలో ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే తిరిగి ఎలా చెల్లించారు.. చెల్లించకుండా ఎగ్గొట్టారా.. వంటి అంశాలన్నీ వారు చూస్తారు. ఇలా వినియోగదారుడి రుణ అర్హతను సూచించే సంఖ్యే క్రెడిట్ స్కోర్. దీని ఆధారంగానే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) ఒకరికి రుణం ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తాయి. చెల్లింపుల చరిత్ర, రుణ అర్హత–తీసుకున్న మొత్తాలు, కాల పరిమితి, తరచూ లోన్లకు దరఖాస్తులు, విభిన్న రుణాలు.. వీటి ఆధారంగా స్కోర్ మారుతుంది. మనదేశంలో తొలి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్యూనియన్ సిబిల్. ఈ కంపెనీ ఇచ్చే క్రెడిట్ స్కోర్.. సిబిల్ స్కోర్గా జనంలో బాగా పాపులర్ అయింది.నా క్రెడిట్ స్కోరు తక్కువైతే రుణం రాదా? ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను నిర్వహించిన తీరు ఆధారంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ/క్రెడిట్ బ్యూరోలు 300 నుంచి 900 వరకు స్కోర్ ఇస్తున్నాయి. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే రుణం లభించే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. 90 శాతం లోన్స్ 750కిపైగా స్కోర్ ఉన్నవారికే మంజూరు అవుతున్నాయి. ఆదాయం, ప్రస్తుత ఈఎంఐలు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణ అర్హతను ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. ఏ కంపెనీలు ఈ స్కోర్ ఇస్తున్నాయి? వాటికి ఆర్బీఐ అనుమతి ఉందా?క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ లేదా క్రెడిట్ బ్యూరోలు వ్యక్తులు, కంపెనీల రుణ సమాచారాన్ని ఆర్థిక సంస్థల నుంచి నెలవారీ ప్రాతిపదికన సేకరించి, నిర్వహణతోపాటు విశ్లేషిస్తాయి. ఈ రుణ సమాచారాన్ని ఉపయోగించి వ్యక్తుల కోసం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లు, కంపెనీల కోసం క్రెడిట్ కంపెనీ రిపోర్ట్లు రూపొందిస్తాయి. రుణ అర్హత, గత రుణ చరిత్ర ఆధారంగా వ్యక్తుల కోసం క్రెడిట్ స్కోర్, కంపెనీలకు క్రెడిట్ ర్యాంక్లను జారీ చేస్తాయి. ఆర్బీఐ లైసెన్స్ పొందిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు భారత్లో ట్రాన్స్యూనియన్ సిబిల్, ఈక్విఫ్యాక్స్ ఇండియా, ఎక్స్పీరియన్ ఇండియా, సీఆర్ఐఎఫ్ హై మార్క్. ఆర్బీఐ నియంత్రణలోనే ఇవి పనిచేస్తాయి. స్కోర్ ఎక్కువగా ఉంటే ప్రయోజనం ఏమిటి?ట్రాన్స్యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం 2025 జనవరి–మార్చిలో కొత్తగా మంజూరైన రుణాల్లో 57.6 శాతం వినియోగదారుల స్కోర్ 800లకుపైగా ఉంది. 22.8 శాతం మంది స్కోర్ 750–799 మధ్య, 9.7 శాతం వినియోగదారులకు 700–749 మధ్య, 5.2 శాతం కస్టమర్లకు 650–699 మధ్య, 4.7 శాతం మందికి 650 కంటే తక్కువ స్కోర్ ఉంది. స్కోర్ ఎక్కువగా ఉన్నవారికే లోన్ లభిస్తోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. గృహ, వాహన రుణాల వంటి సెక్యూర్డ్ లోన్స్కు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా, క్రెడిట్ హిస్టరీ లేకున్నా రుణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. వ్యక్తిగత రుణం, విద్యా రుణాల వంటి అన్ సెక్యూర్డ్ లోన్స్కు క్రెడిట్ స్కోర్ ఉండాల్సిందే. కొత్త వాళ్లకు రుణం రాదంటున్నారు. నిజమేనా?అలాంటిది ఏమీ లేదు. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో లోన్లు తీసుకున్నవారిలో 16 శాతం మంది కొత్తవారే. ఉద్యోగులైతే వారు పనిచేస్తున్న కంపెనీని బట్టి రుణ సంస్థలు సూపర్–ఏ, కేటగిరీ–ఏ, బీ, సీ, డీ అని విభజించి రుణ మొత్తాన్ని, కాల పరిమితిని నిర్ణయిస్తున్నాయి. కంపెనీ పనితీరు కూడా లోన్ అప్లికేషన్ ను ప్రభావితం చేస్తుంది.నాకు క్రెడిట్ హిస్టరీ లేదు. యూపీఐ వాడుతున్నాను. లోన్ వస్తుందా?క్రెడిట్ హిస్టరీ లేని ఉద్యోగులు అయితే కనీసం మూడు నెలల పే స్లిప్స్ను సమర్పించాలి. ఎన్ బీఎఫ్సీలు చిన్న మొత్తాల్లో రుణం ఇస్తాయి. సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ లిమిట్ (రుణ మొత్తం) పెంచుతాయి. యూపీఐ వాడుతున్న చిరు వ్యాపారులు, కార్మికులకు కూడా ఆదాయం, యూపీఐ చెల్లింపులను విశ్లేషించి ఎన్ బీఎఫ్సీలు చిన్న మొత్తాల్లో అప్పులు ఇస్తున్నాయి.ఏది మంచి స్కోర్ ?851-900 (అద్భుతం)బకాయిలు లేని రుణగ్రహీతలు.751-850 (మంచిది)సకాలంలో చెల్లింపులతో బలమైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారు.651-750 (సగటు)తగిన రుణ నిర్వహణతో సగటు రుణ చరిత్ర కలిగినవారు.501- 650 (పేలవమైనది)సమయానికి పూర్తికాని చెల్లింపులు, అధిక రుణ వినియోగం కారణంగా ఎక్కువ రిస్క్ ఉన్నవారు.300 - 500 (చాలా పేలవమైనది)బకాయిలు, రుణం పొందడంలో ఇబ్బందులతో దారుణమైన రుణ చరిత్ర ఉన్నవారు.రూ.50 లక్షల వరకు.. దరఖాస్తుదారు పనిచేస్తున్న కంపెనీ సూపర్–ఏ ప్లస్ విభాగంలో ఉండి, స్కోర్ మెరుగ్గా ఉంటే.. ఎన్ బీఎఫ్సీలు 8 ఏళ్ల కాల పరిమితితో రూ.50 లక్షల వరకు అన్ సెక్యూర్డ్ లోన్స్ ఇస్తున్నాయి. గతంలో ఈ కాల పరిమితి అయిదేళ్లు ఉండేది. కంపెనీల స్థిరత్వం, లాభ, నష్టాలు, ఆదాయం కూడా వారి ఉద్యోగులు పొందే రుణ మొత్తాన్ని నిర్ణయిస్తోంది. అంతిమంగా దరఖాస్తుదారు క్రెడిట్ స్కోరే ముఖ్యం. – సాయి కుమార్ మామిడి, ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ సేల్స్ అడ్వైజర్, హైదరాబాద్ -
కలిసి తింటే.. కలదు సుఖం
‘కలిసి తినే కుటుంబం కలిసి ఉంటుంది’ అని సామెత. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని, భోజనం చేస్తే మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని పూర్వీకులు తమ అనుభవంతో ఏర్పరచిన ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు వైద్య పరిశోధకులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ‘కలిసి ఉంటే కలదు సుఖం – కలసి తింటే కలదు ఆరోగ్యం’ అని నిర్ధారణగా చెబుతున్నారు. చక్కటి భోజన సంభాషణ మనిషిలోని నిస్సత్తువను పోగొడుతుందని, మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత బలపడతాయని మానసిక, వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆస్వాదనతో పాటు అనుభూతీ!కుటుంబ సభ్యులను అత్మీయతలతో పెనవేసే అనేక అంశాలలో ‘అందరూ కలిసి భోజనం చేయటం’ అనే అలవాటు ముఖ్యమైనది. భోజనాన్ని ఆస్వాదిస్తూనే, సంభాషణలను అనుభూతి చెందే అవకాశం డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. కుటుంబానికి ఇంతకంటే ముఖ్యమైన ‘రౌండ్ టేబుల్ సమావేశం’ మరొకటి ఉండదు. ఉల్లాసకరమైన మాటలు వస్తాయి. ఉత్తేజకరమైన నవ్వులు పూస్తాయి. ఆహ్లాదం ఘుమఘుమలాడుతుంది. సందట్లో ఓ నాలుగు ముద్దలు ఎక్కువ తింటాం. అందుకే భోజన సంభాషణ అంటే కేవలం ఒక మంచి విషయం మాత్రమే కాదు, మానసికమైన ఆరోగ్యం కూడా అంటున్నారు మనోవైజ్ఞానిక నిపుణులు. – సాక్షి, స్పెషల్ డెస్క్జెన్–జి తరానికి తప్పనిసరిభోజన సంభాషణలు కేవలం ఆచారాలు కావు. ఇవి రోజువారీ నిస్సత్తువను పోగొట్టి, మానసిక ఆరోగ్యాన్నిచ్చే సందర్భాలు కూడా. భారతీయ సంస్కృతిలో అంతర్లీనమైనదిగా ఉన్న ప్రియ భోజన భాషణ ఇప్పటి జెన్–జి తరానికి తప్పనిసరి అవసరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనం చేసే సమయంలోని మనోల్లాసమైన సంభాషణలు మెదడును నెమ్మదింపజేస్తాయి. నాడీ వ్యవస్థను నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి. అయితే ఆధునిక జీవన శైలిలోని ఉరుకులు పరుగుల వల్ల వ్యక్తిగత జీవితంలోకి వృత్తిపరమైన బాధ్యతలు చొరబడి, ఇంటిల్లపాదీ కలిసి కూర్చొని భోజనం చేసే సంప్రదాయం నెమ్మదిగా అంతరించిపోతోంది.ఆసక్తి ఉన్నా అవకాశం లేదుఈ తరం పిల్లలు భోజనానికి కలవరు. ఇంటి సంభాషణలపై ఆసక్తి చూపరు. అలాగని కుటుంబ సంబంధాలు, కుటుంబ భోజనాలపై వారు మరీ అంత నిర్లిప్తంగా కూడా ఏమీ లేరు. 1996 తర్వాత జన్మించిన 2,000 మందిపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 64 శాతం మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో భోజన సంభాషణలను జరపటంలో ఆసక్తి చూపారు. అదే సమయంలో.. అందుకు అవకాశం ఉండటం లేదని అన్నారు. ఎవరికి వారుగా భోజనం ముగించే వ్యక్తిగత వ్యవహారంగా మారిన ప్రస్తుత తరుణంలో.. కుటుంబ బంధాలు మెరుగవ్వాలంటే కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.భోజన సమయ బంధుత్వాలు..: చిన్న కుటుంబాల్లో పెద్దవాళ్లకు చోటు ఉండదు. కానీ భోజన సమయంలో పెద్దవాళ్ల గురించిన కథలకు చోటు లేకుండా ఉండదు. తరాల కథలు మాటల్లోకి వస్తాయి. పారంపర్య కుటుంబ గాథలు ఇష్టమైన భోజనంలా అనిపిస్తాయి. ‘మరి కాస్త వడ్డించు’ అని అడిగినట్లుగా వంశవృక్షంలోని తాత ముత్తాల గురించి ‘ఇంకా చెప్పు’ అని కుతూహలంగా అడిగి మరీ చెప్పించుకుంటారు. ఎంతో ముఖ్యమైన రేపటి ఆ ‘ముఖ్యమైన సమావేశం’ గురించిన ఆలోచన మదిలోకే రాదు. అంతా కలిసి భోంచేస్తున్నారు కదా పాపం.. అని డెడ్లైన్లు డైనింగ్ హాల్ బయటే ఉండిపోతాయి. ఇక భోజన సమయంలో ‘నో–ఫోన్ పాలసీ’ పెట్టుకుంటే కడుపు నిండా కబుర్లు.. కళ్ల నిండా కమ్ముకునే నిద్ర మేఘాలు. ‘బర్నౌట్కు’ తగిన చికిత్స..: ఒత్తిడి, అలసట. శక్తి క్షీణత.. అన్నీ కలిసి ప్రపంచాన్ని ఇప్పుడు ‘బర్నౌట్’ చేసేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ బర్నౌట్ను ‘పని ఒత్తిడి సిండ్రోమ్’గా వర్ణించింది. ప్రస్తుతం ఈ డిజిటల్ ప్రపంచంలో బర్నౌట్ కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. 2024 సెప్టెంబర్లో భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనం.. 58 శాతం మంది భారతీయులు పనిలో అమితంగా బర్నౌట్ అవుతున్నట్లు వెల్లడించింది. ఈ బర్నౌట్ నుంచి బయటపడేందుకు కుటుంబంతో కలిసి భోజనం చేయటం ఒక మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, సానుకూల భోజన సంభాషణలు.. ఒత్తిడికి మూలమైన ‘కార్టిసాల్’ అనే హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ‘ఆక్సిటోసిన్’ హార్మోన్ను విడుదల చేస్తాయి. ఆక్సిటోసిన్ సామాజిక బంధాలకు, సంతానోత్పత్తికి దోహదపడుతుంది. లైంగిక సామర్థ్యం పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీని వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. మాటలు ప్లేట్లు దాటకూడదు!..: భోజన సంభాషణలు తేలికగా ఉన్నప్పుడే కలిసి భోజనం చేయటం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. లేదంటే, ఒంటరిగా తినడమే నయం అనే నిస్పృహలోకి వెళ్లిపోతారు. పచ్చళ్ల దగ్గర మొదలై పంతాలూ పట్టింపుల వరకు వెళ్లిపోతే.. కలిసి భోజనం చేయకపోతేనే ఉత్తమం. చాలా వరకు సంభాషణ ఆహార పదార్థాల చుట్టూరానే తిరగాలి. మాటల్లోనే మాధుర్యం ఒలకాలి. ఇంట్లో ఎవరు ఏది ఇష్టంగా తింటారో సరదాగా చర్చించుకోవాలి. రుచికరమైన వంటకాలు చేసిన వారిని ప్రశంసించడం.. ఈ చర్చా కార్యక్రమాన్ని రక్తికట్టించే అసలైన ప్రధాన ముడిసరుకు. అది మన అభిరుచిని తెలియజేయడమే కాదు.. మనకు ప్రేమగా వండిపెట్టిన వారి నైపుణ్యానికి కూడా దక్కాల్సిన కితాబు. వంటంతా ఒక ఎత్తయితే.. వడ్డన మరో ఎత్తు. ప్రేమగా, కొసరి కొసరి వడ్డిస్తుంటే.. ఎవ్వరూ నో చెప్పలేరు. అందుకే, అలా ప్రేమగా వడ్డించినవారిని కూడా మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. కిందటి రోజు చూసిన సినిమా, ఆవకాయ పచ్చళ్లపై చర్చ, వంశపారంపర్య విశేషాల ప్రస్తావన.. కాదేదీ ప్రస్తావనకు అనర్హం. ఇలాంటి మంచి విషయాల చుట్టూ మాటలు సాగితే మనసుకు, దేహానికి మంచి మెడిసిన్ పడినట్లే. -
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదం తర్వాత ప్రయాణికులు హడలెత్తిపోతుండగా.. వరుసగా అదే సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వామ్మో ఎయిరిండియా అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టోక్యో-ఢిల్లీ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా.. కోల్కతా ఎయిర్పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్య కారణంగా కోల్కతాకు మళ్లించారు. ఢిల్లీకి వస్తున్న AI 357 బోయింగ్ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది.. క్యాబిన్లో ఉష్ణోగ్రత పెరగడాన్ని గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని కోల్కతాలో ల్యాండ్ చేశారు.విమానం కోల్కతాలో సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. విమానంలో సాంకేతిక తనిఖీలు జరుగుతున్నాయని పేర్కొంది. కోల్కతాలోని గ్రౌండ్ సిబ్బంది.. ప్రయాణీకులకు సహాయం చేస్తున్నారని.. వీలైనంత త్వరగా వారిని ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. -
దిగొచ్చిన ‘మహా’ సర్కారు.. 'హిందీ తప్పనిసరి' తీర్మానం రద్దు
ముంబై: దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్న ‘త్రి భాషా విధానం’లో భాగంగా హిందీని తప్పనిసరి చేయాలనే అంశంపై పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా ఈ సెగ గట్టిగానే ఉండటంతో ఫడ్నవీస్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఈ త్రి భాషా విధానం పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడింది. గత ఉద్ధవ్ ఠాక్రే సర్కారే దీనికి ఆమోదం తెలిపి, ఇప్పుడు నిరసనలకు పిలుపునివ్వడంపై ఫడ్నవీస్ తప్పుబడుతున్నారు. మహారాష్ట్రలో మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని ఉద్ధవ్ సర్కార్ అప్పుడు నిర్ణయం తీసుకుని, ఇప్పుడు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారని సీఎం ఫడ్నవీస్ ప్రశ్నించారు. త్రి భాషా విధానంపై శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో నిరసన సెగ తీవ్రతరమైంది. హిందీని తప్పనిసరి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తీర్మానాన్ని వ్యతిరేకించాలని, దానికి సంబంధించిన తీర్మానం ప్రతులను చించి వేయాలని శివసేన(యూబీటీ) చీఫ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. దక్షిణ ముంబైలో జరిగే నిరసన కార్య క్రమానికి నేటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ పాలసీని రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
సభలో కలకలం.. తేజస్వీ వైపు దూసుకొచ్చిన డ్రోన్
పాట్నా: ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆదివారం.. పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్లో ‘సేవ్ వక్ఫ్, సేవ్ కాన్స్టిట్యూషన్’ పేరిట ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తేజస్వీ ప్రసంగిస్తుండగా ఆయన వైపు ఓ డ్రోన్ దూసుకొచ్చింది. ర్యాలీ వీడియో కవర్ చేసేందుకు డ్రోన్ ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్.. తేజస్వీ యాదవ్ మాట్లాడుతుండగా దిశ మారి.. హఠాత్తుగా ఆయన వైపుకు వెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన తేజస్వీ యాదవ్ తన ప్రసంగాన్ని ఆపేసి వెనక్కి జరిగి.. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అనంతరం తన ప్రసంగాన్ని కొనసాగించారు.కాగా, భద్రతా సిబ్బంది డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై పాట్నా సెంట్రల్ ఎస్పీ దీక్ష స్పందించారు. ఘటన జరిగిన ప్రాంతం.. నిషేధిత ప్రదేశమని డ్రోన్లు ఎగరవేయకూడదని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.VIDEO | Patna: While addressing ‘Waqf Bachao, Samvidhan Bachao Sammelan’ at Gandhi Maidan, RJD leader Tejashwi Yadav (@yadavtejashwi) narrowly escapes injury as a drone crashes into the podium.(Source: Third Party)(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/66B1fMRaHs— Press Trust of India (@PTI_News) June 29, 2025 -
అన్యోన్య దాంపత్యం.. అర్ధాంతరంగా ముగిసిపోయింది..!
వారిది కచ్చితంగా అన్యోన్య దాంపత్యమనే చెప్పొచ్చు. కానీ వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇక్కడ అన్యోన్య దాంపత్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అది సీసీ టీవీ ఫుటేజ్ చెబుతున్న మాట. మనిషి మాట నమ్మని ఈ రోజుల్లో.. సీసీ టీవీ ఫుటేజ్ ‘మాట’ కచ్చితంగా నమ్ముతాం. వీరు శవాలుగా మారకముందు గత రెండు రోజుల సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించి చూస్తే వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు. మరి ఈ జంట ఎలా చనిపోయిందనేది ప్రశ్న. ఏమైనా చిన్నపాటి మనస్పర్థలు తలెత్తి అది ఆత్మహత్య వరకూ వెళ్లిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగానే ఈ కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.రాజస్థాన్ రాష్ట్రంలోనే జైపూర్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దంపతుల్లో భర్త పేరు ధర్మేంద్ర కాగా, భార్య పేరు సుమన్. వీరికి 11, 8 ఏళ్లు కల్గిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారి ఇద్దరు భరత్పూర్ గ్రామంలో తమ నానమ్మ, తాతయ్యలు దగ్గర ఉంటున్నారు. సమ్మర్ హాలీ డేస్కు తాతయ్య ఇంటికి వెళ్లిన ఆ పిల్లలు ఇంకా రాలేదు.ధర్మేంద్ర- సుమన్ జంట ఈ శుక్రవారం(జూన్ 27వ తేదీ) తమ ఫ్లాట్లో విగతజీవులుగా కనిపించారు. అంతకుముందూ వరకూ ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట.. ఎందుకు ఇలా చేశారు అనేది చర్చగా మారింది. ధర్మేంద్ర బ్యాంక్ సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం ధర్మేంద్ర బ్యాంక్కు వెళ్లకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్ చేస్తే స్పందన రాలేదు. దీంతో ఈ విషయాన్ని సదర ఉద్యోగి.. ధర్మేంద్ర బంధువులకు తెలియజేశాడు. దీంతో వారు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా ఆ జంట విగతజీవులుగా కనిపించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వీరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని బంధువులు చెబుతున్నారు. ఇటీవలే రీసెంట్గా ఫ్లాట్ కొనుగోలు చేసిన వీరి ఆర్థికపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు అంటున్నారు. మూడు సీసీ ఫుటేజ్లో ఇలా..ఒక సీసీ ఫుటేజ్లో వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వారు ఫ్లాట్లో కారు పార్కు చేసే క్రమంలో భార్య సుమన్.. భర్త ధర్మేంద్ర భుజంపై తలపెట్టుకుని అతని చేతుల్ని పట్టుకుని ఉంది. ఆపై కారు దిగి వెళ్లిపోతున్న వీడియోలో ఆమె భుజంపై భర్త ధర్మేంద్ర చేయి వేసి నడుచుకుంటూ వెళ్లినట్లు ఉంది. అయితే వారు చనిపోవడానికి ముంద రోజు గురువారం మాత్రం ఇద్దరికీ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు కనిపించింది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం భార్య సుమన్.. ఒక క్యారీ బ్యాగ్ తీసుకుని వెళుతున్నట్లు కనిపించింది. అదే వారు చివరిసారి సజీవంగా కనిపించడం. ఆ తర్వాత రోజే ఈ దారుణం చోటు చేసుకుంది. సుమన్ ఒంటిపై గాయాలుఅయితే భార్య సుమన్ ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్యా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి కుటుంబంలో ఎటువంటి వైవాహిక విభేదాలు ఉన్నట్లు తమకు కనిపించలేదని పోలీస్ అధికారి అజయ్ సింగ్ తెలిపారు. అయితే ఇద్దరూ సూసైడ్ చేసుకుని ఉండటంతో అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఏమైనా క్లూ దొరుకుతుందనే కోణంలో వారి మొబైల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు. -
పెళ్లి కోసం అమెరికా వెళ్లి.. భారతీయ యువతి మిస్సింగ్
పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారతీయ మహిళ అదృశ్యమైంది. అమెరికా పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత్కు చెందిన 24 ఏళ్ల సిమ్రాన్ అనే యువతి జూన్ 20న అమెరికాకు చేరుకోగా, పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికాకు వచ్చినట్లు అధికారులకు చెప్పింది. అమెరికా వచ్చిన కొన్ని రోజులకే సిమ్రాన్ అదృశ్యమైనట్లు న్యూజెర్సీ అధికారులు వెల్లడించారు.జూన్ 25న ఆమె చివరిసారి కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫోన్ చూస్తూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని తెలిపారు. మరోవైపు, ఆమె అమెరికాకు వచ్చింది.. పెళ్లి కోసమా, లేక వేరే ఉద్దేశ్యమా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చివరిసారిగా గ్రే స్వెట్ప్యాంట్స్, వైట్ టీ షర్ట్, బ్లాక్ ఫ్లిప్ఫ్లాప్స్ ధరించి, చిన్న డైమండ్ ఇయరింగ్స్ పెట్టుకుని కనిపించింది. ఆ యువతి వాడుతున్న ఫోన్ కేవలం వైఫై ద్వారా మాత్రమే పని చేయడంతో పోలీసులు ఆమెను ట్రేస్ చేయలేకపోతున్నారు.సిమ్రాన్ ఇంగ్లీష్ మాట్లాడలేదని, అమెరికాలో ఆమెకు బంధువులు కూడా ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. భారత్లోని ఆమె బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. సిమ్రాన్ రూపు రేఖలు, మిస్సింగ్కు ముందు ఆమె ధరించిన దుస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆమె ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
హలో.. లంచం త్వరగా ఇచ్చేయాలి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ రెన్యూవల్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన డాక్టర్ ఆడియో ఒకటి వైరల్గా మారిన ఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా జవగొండనహళ్లిలో వెలుగు చూసింది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండేళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ రెన్యూవల్ కోసం అక్కడి వైద్యుడు డాక్టర్ క్రిష్ణను కోరగా రూ.5వేలు లంచం అడిగాడు.డబ్బు ఇవ్వకపోతే రేటు రూ.10వేలు అవుతుందని, ఇంకా లేట్ చేస్తే రూ.15వేలు అవుతుందని, ఎవరికి చెపుకున్నా తాను సంతకం పెట్టబోనని నర్స్ను హెచ్చరించాడు. ఈమేరకు ఆడియో లీక్ అయ్యి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. -
చావే శరణ్యం
యశవంతపుర(కర్ణాటక): తమ జీవనానికి ఆసరాగా ఉండే భూమిని బ్యాంక్లో తాకట్టు పెడితే, అప్పు తీర్చలేదని వేలం వేసేశారు, మేమిక జీవించలేం, కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని వృద్ధ దంపతులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా దేవవృంద గ్రామంలో జరిగింది. డిఆర్ విజయ్, హెచ్ఎన్ పార్వతికి 7 ఎకరాలు ఉండగా, మూడిగెరె కర్ణాటక గ్రామీణ బ్యాంక్లో కుదువపెట్టి రూ.30 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కరోనా విపత్తు, అడవి జంతువుల బెడద వల్ల పంటలు పండలేదు. దీంతో అప్పులు తీర్చలేకపోయారు. గతేడాది రూ.5.30 లక్షలను చెల్లించారు. మిగతా డబ్బులను కట్టలేకపోయారు. బ్యాంక్ అధికారులు హడావుడిగా ఆ పొలాన్ని వేలం వేసి అమ్మేశారు. తమకు చెప్పకుండానే ఇదంతా చేశారని, ఇక మరణమే శరణ్యమని వృద్ధ దంపతులు విలపించారు. వృద్ధులం అయినందున ఏ పనీ చేయలేం. మా భూమిని అప్పగించాలని, లేదంటే మరణాన్ని ప్రసాదించాలని లేఖలో మనవి చేశారు. -
పెళ్లి కోసం ‘రీల్స్’లో ఆస్తి చూపించాడు.. వివాహమైన రెండు గంటలకే..
జబల్పూర్: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలపై హత్యలకు తెగబడుతున్న మహిళల ఉదంతాలు కలకలం రేపుతున్నాయి. ఇటువంటి ఘటనలను విన్నవారు విస్తుపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. జబల్పూర్కు చెందిన ఇంద్ర కుమార్ తివారీ(45)ని పెళ్లి పేరుతో వంచించి, అతనిని అంతమొందించిన సాహిబా బానో అనే మహిళను ఉత్తరప్రదేశ్లో పోలీసులు అరెస్టు చేశారు.జూన్ 6న ఉత్తరప్రదేశ్లోని కుషినగర్లోని హటా ప్రాంతంలోని ఒక కాలువలో ఒక పురుషుని మృతదేహం బయటపడిన దరిమిలా ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. తొలుత ఈ మృతదేహం ఎవరిదైనదీ తెలియలేదు. దర్యాప్తులో కొన్ని వారాల తర్వాత జబల్పూర్లో అదృశ్య వ్యక్తితో ఈ మృతదేహాన్ని పోల్చి చూడగా, అది ఇంద్ర కుమార్ తివారీ మృతదేహమని తేలింది.ఈ హత్య వెనుక సూత్రధారి సాహిబా బానో అని, ఆమె ఖుషీ తివారీగా పేరు మార్చుకుని ఇంద్రకుమార్ను ఆకట్టుకున్నదని పోలీసులు తెలిపారు. పెళ్లికాని ఇంద్రకుమార్ ఇటీవల తనకు గల భూమి వివరాలను చెబుతూ ఒక రీల్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని చూసిన సాహిబా బానో ఆ భూమిని దక్కించుకోవాలనే ఆశతో, అతనిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది.సోషల్ మీడియాలో అతనిని సంప్రదించి, తన పేరు ఖుషీ తివారీ అని పరిచయం చేసుకుని, గోరఖ్పూర్కు రావాలని ఆహ్వానించింది. తర్వాత తన ఇద్దరు సహచరుల సహాయంతో ఇంద్రకుమార్ను వివాహం చేసుకుంది. కొన్ని గంటల తర్వాత తివారీని హత్య చేసి, అతని మృతదేహాన్ని తన సహచారుల సాయంతో కాలువలో పడేసింది. ఈ కేసులో పోలీసులు సాహిబాతో ఆమెకు సహకరించిన ఇద్దరినీ అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Mann Ki Baat: తెలంగాణను మెచ్చుకున్న ప్రధాని మోదీ..ఎందుకంటే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీనెలా నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు (జూన్ 29) పలు అంశాలను ప్రస్తావించారు. భారతదేశాన్ని ట్రకోమా(కంటి వ్యాధి) నుండి విముక్తి పొందిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని ప్రధాని పేర్కొన్నారు. ఇది దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు సాధించిన విజయమని, 'జల్ జీవన్' మిషన్ దీనికి దోహదపడిందని ప్రధాని వివరించారు.జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారని, ముఖ్యంగా తెలంగాణలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో మూడువేల మంది దివ్యాంగులు పాల్గొనడం విశేషమన్నారు. యోగా ఎంత శక్తివంతమైన సాధనంగా ఉంటుందో వారు చూపించారన్నారు. ఢిల్లీ ప్రజలు నది ఒడ్డున యోగా చేశారని, ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ వద్ద కూడా యోగా కార్యక్రమాలు జరిగాయన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ తదితర ప్రాంతాల్లో యోగా వేడుకలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Sharing this month's #MannKiBaat. Do tune in! https://t.co/N8WrWlWNId— Narendra Modi (@narendramodi) June 29, 2025కైలాశ్-మానసరోవర్ యాత్ర చాలా కాలం తర్వాత తిరిగి ప్రారంభమైందని, జూలై మూడు నుండి అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానున్నదన్నారు. మరోవైపు మన దేశం ఆరోగ్య రంగంలోనూ విజయం సాధించిందని, భారత్ ట్రాకోమా రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందన్నారు. భారతదేశంలోని 64 శాతం జనాభాకు సామాజిక భద్రత అందుబాటులో ఉందంటూ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఒక నివేదికను విడుదల చేసిందన్నారు. దేశంలో దాదాపు 95 కోట్ల మంది సామాజిక భద్రతా పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు.ప్రధాని మోదీ నాటి అత్యవసర పరిస్థితి చీకటి రోజులను కూడా గుర్తుచేసుకున్నారు. ఆనాటి సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛను రద్దు చేశారన్నారు. అయితే చివరకు వివిధ పోరాటాలతో ప్రజలు గెలిచారని, ఫలితంగా అత్యవసర పరిస్థితిని ఎత్తివేశారన్నారు. ఆ సమయంలో ధైర్యంగా ముందుకొచ్చి పోరాడిన వారిని మనం గుర్తుంచుకోవాలన్నారు. కాగా మేఘాలయకు చెందిన ఎరి సిల్క్ ఇటీవలే జీఐ ట్యాగ్ను పొందిందని, ఎరి సిల్క్ను ‘అహింసా సిల్క్’ అని కూడా పిలుస్తారన్నారు. చివరిగా ప్రధాని మోదీ భారత అంతరిక్ష మిషన్ గురించి కూడా మాట్లాడారు. వ్యోమగామి శుభాన్షు శుక్లాను అభినందించారు. -
అపార్టుమెంటులో యువతి క్షుద్ర పూజలు
బనశంకరి(కర్ణాటక): క్షుద్ర పూజల కోసం ఓ మహిళ పెంపుడు శునకాలను హత్యచేసిన ఘటన వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళ బెంగళూరు మహదేవపుర చిన్నప్పలేఔట్లోని అపార్టుమెంట్లో ఉంటోంది. త్రిపర్ణ పైక్ అనే మహిళ 4 లేబ్రడార్ పెంపుడు కుక్కలను నాలుగురోజులు క్రితం గొంతుకోసి హతమార్చింది.ఆమె ఫ్లాటులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సమాచారం అందించారు. మహదేవపుర పోలీసులు, బీబీఎంపీ సిబ్బంది చేరుకుని చూడగా కుక్కల కళేబరాలు కనిపించాయి. మొదట వారు ఇంట్లోకి రావడానికి ఆ మహిళ అంగీకరించలేదు. ఆత్మహత్య చేసుకుంటానని నానా యాగీ చేసింది. చివరకు లోపలకు వెళ్లి చూడగా దారుణమైన దృశ్యాలు కనిపించాయి. చచ్చిపోయిన కుక్కలు, రకరకాల పూజల దృశ్యాలు చూసి హడలిపోయారు. కళేబరాలను శవ పరీక్షల కోసం పశువుల ఆసుపత్రికి తరలించారు. వాటిని చాకుతో కోసి చంపారని నివేదికల్లో వచ్చింది. సదరు మహిళ చేతబడి కోసం కుక్కలను చంపి వాటి రక్తంతో పూజలు చేసి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి. మరో 2 కుక్కలను కాపాడి తరలించారు. మహిళపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. -
Rath Yatra Tragedy: ‘ఏ ఒక్కరూ పట్టించుకోలేదు’: మృతురాలి భర్త
పూరి: ఒడిశాలోని పూరిలో జరుగుతున్న రథయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటనలో భార్యను కోల్పోయిన ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తూ, జరిగిన ఘటన వివరాలను మీడియా ముందు వెళ్లగక్కాడు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులెవరూ స్పందించలేదని ఆయన ఆరోపించారు.తొక్కిసలాట ఘటనపై పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్ మాట్లాడుతూ ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగిందని. జగన్నాథుడు, అతని తోబుట్టువుల వార్షిక రథోత్సవాన్ని వీక్షించడానికి వందలాది మంది భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారని తెలిపారు. ఆచారాల నిర్వహణకు సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తున్న రెండు ట్రక్కులు.. రథాల సమీపంలోని రద్దీగా ఉండే ప్రాంతంలోకి ప్రవేశించడంతో, గందరగోళం నెలకొంది. ఈ నేపధ్యంలోనే తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. #WATCH | Puri, Odisha: Swadhin Kumar Panda, a resident of Puri, says, "I was there near the temple till 2-3 am last night, but the management was not good. A new way was made for VIPs, and common people were asked to exit from a distance. People started exiting from the entrance… https://t.co/jFE36gLDfu pic.twitter.com/6Ln6348Eoy— ANI (@ANI) June 29, 2025ఈ తొక్కిసలాటలో మరణించిన ముగ్గురిని బోలాఘర్కు చెందిన బసంతి సాహు, బలిపట్నానికి చెందిన ప్రేమకాంత్ మొహంతి, ప్రవతి దాస్గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా మృతి చెందిన ఒక మహిళ భర్త మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన జరిగినప్పుడు అధికారులెవరూ స్పందించలేదని, అగ్నిమాపక అధికారులు, రెస్క్యూ బృందం, వైద్య సిబ్బంది సమయానికి చేరుకోలేదని ఆరోపించారు.పురి నివాసి స్వాధిన్ కుమార్ పాండా మాట్లాడుతూ జనసమూహ నియంత్రణలో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపించారు. ట్రాఫిక్ ఏర్పాట్లు సరిగా లేవన్నారు. ఈ ఘటనకు ఒడిశా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పాండా డిమాండ్ చేశారు. ఈ ఘటన దరిమిలా ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యిందని ఒడిశా న్యాయ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు. ఘటనా స్థలంలో డీజీపీ ఉండి, పరిస్థితులను చక్కదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Jagannath Rath Yatra: తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు -
బీహార్లో ప్లాన్ మార్చిన ఎంఐఎం ఒవైసీ.. బీజేపీ ఓటమే టార్గెట్గా..
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తుండగా.. ప్రతిపక్ష కూటమి ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత ఒవైసీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమి ఓడించడమే తమ ముందున్న లక్ష్యమని ఒవైసీ చెప్పుకొచ్చారు.ఎంపీ, ఎంఐఎం అధినేత ఒవైసీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు ప్రతిపక్ష మహాఘటబంధన్తో ఎంఐఎం కలిసి పనిచేయాలని నిర్ణయించింది. మహాఘటబంధన్ నాయకులతో సంప్రదింపులు జరిగాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మా పార్టీ బీహార్ చీఫ్ అఖ్తరుల్ ఇమాన్, కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతరులతో కూడిన మహాఘటబంధన్ నాయకులను సంప్రదించారు. బీహార్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని మేం కోరుకోవడం లేదు.ఇప్పుడు బీహార్లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావాలా? వద్దా? అనేది ఈ రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంది. బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో ఎంఐఎం బలమైన ఉనికిని కలిగి ఉంది. గత ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత వారిలో నలుగురు ఆర్జేడీలో చేరడంతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మా పార్టీ సీమాంచల్ నుంచే కాకుండా బయట కూడా అభ్యర్థులను నిలబెడుతుంది. ఒకవేళ వారు (మహాఘట్బంధన్) తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేకుంటే.. ప్రతీ స్థానంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పుకొచ్చారు.#WATCH | Hyderabad | AIMIM chief Asaduddin Owaisi, says, "Our State President, Akhtarul Iman, has spoken to some leaders in the Mahagathbandhan and he has categorically stated that we do not want the BJP or NDA to come back in power in Bihar. Now it is up to these political… pic.twitter.com/08iNw1QZjI— ANI (@ANI) June 29, 2025ఇదే సమయంలో ఓటర్ల జాబితాపై ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితాలో “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్”ను వ్యతిరేకిస్తూ ఒవైసీ భారత ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఒవైసీ..‘ఇది చట్టబద్ధంగా ప్రశ్నార్థకమైన చర్య. ఇది రాబోయే ఎన్నికలలో నిజమైన ఓటర్లకు స్వరం లేకుండా చేస్తుంది. ఓటరు జాబితాలో నమోదు కావడానికి, ప్రతి పౌరుడు ఇప్పుడు వారు ఎప్పుడు, ఎక్కడ జన్మించారో నిరూపించే పత్రాలను మాత్రమే కాకుండా, వారి తల్లిదండ్రులు ఎప్పుడు, ఎక్కడ జన్మించారో కూడా చూపించాల్సి ఉంటుంది. దీంతో, ఓటర్లకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది వారి రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంది’ అని తెలిపారు. -
విమాన ప్రమాదం వెనుక విద్రోహ చర్య?: మంత్రి మురళీధర్ మోహోల్
న్యూఢిల్లీ: ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంపై అన్ని కోణాలలో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. ఈ ప్రమాదం దరిమిలా ఎయిర్ ఇండియా విమానం ఏI 171లోని బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నామని, దానిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారని అన్నారు.విమాన ప్రమాదం దురదృష్టకర సంఘటన అని, ఏఏఐబీ దీనిపై పూర్తి దర్యాప్తు ప్రారంభించిందని, దీనిలో ఏదైనా విద్రోహ చర్య ఉందా? అనే అంశంతో పాటు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లను సంబంధిత అధికారులు సమీక్షిస్తున్నారని, పలు సంస్థలు విచారణలో భాగస్వామ్యం వహిస్తున్నాయని మోహోల్ తెలిపారు. జూన్ 12న లండన్కు వెళ్తున్న బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 ఫ్లీట్కు చెందిన ఏI 171 విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒకరు మాత్రమే ప్రమాదం నుండి బయటపడ్డారు.ఈ ప్రమాదాన్ని మంతి మురళీధర్ మోహోల్ అరుదైన కేసుగా అభివర్ణించారు. రెండు ఇంజిన్లు ఒకేసారి షట్ డౌన్ కావడం ఎప్పుడూ జరగలేదంటూ, అనుభవజ్ఞులైన పైలట్లు, నిపుణుల వాదనలను ఆయన గుర్తుచేశారు. విచారణ అనంతరం నివేదిక వచ్చిన తర్వాతనే ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని అన్నారు. ఈ ఘటనపై నివేదిక మూడు నెలల్లో వస్తుందని కూడా ఆయన తెలిపారు. కాగా బ్లాక్ బాక్స్ను పరిశీలన కోసం విదేశాలకు పంపుతారనే వాదనలను మోహోల్ తోసిపుచ్చారు. -
రెండు కార్లలో వెంటాడి ఇద్దరినీ కిడ్నాప్..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న తమను కిడ్నాప్ చేసేందుకు యత్నంచారని నవ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేకల్ తాలూకా చందాపుర వద్ద చోటుచేసుకుంది. సంజయ్, దివ్య ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు వ్యతిరేకించడంతో 15 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈక్రమంలో దివ్య తల్లి కాల్ చేసి మీ నాన్నకు ఆరోగ్యం బాగాలేదని, జయదేవ ఆస్పత్రిలో అడ్మిట్ చేశామని, చూసివెళ్లమని కోరింది. దీంతో సంజయ్, దివ్యలు బైక్పై ఆస్పత్రికి వెళ్తుండగా బొమ్మసంద్ర నివాసి శోభ, ఆమె గ్యాంగ్ సభ్యులు రెండు కార్లలో వెంటాడి ఇద్దరినీ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు అయితే నవదంపతులు వారిబారి నుండి తప్పించుకొని సూర్యా నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
Jagannath Rath Yatra: తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు
పూరీ: ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా జరుగుతున్న రథయాత్రలో అపశృతి చోటచేసుకుంది. గుండిచా ఆలయం సమీపంలో ఈరోజు (ఆదివారం) ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా, 50 మందికిపైగా జనం గాయపడ్డారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గుండిచా ఆలయం ముందు భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. 🚨 BREAKING:Tragedy strikes at #JagannathRathYatra in Puri, Odisha — 3 people have died and at least 10 injured in a stampede near Gundicha Temple.What was meant to be a sacred celebration turned into chaos.💔 Heartfelt prayers for the families of the victims. pic.twitter.com/nNC43uSw35— Sarcasm Scoop (@sarcasm_scoop) June 29, 2025ఆలయం వెలుపల జనసమూహం ఒక్కసారిగా పెరగడంతో భయాందోళనలు నెలకొని, ఫలితంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. మృతులను, గాయపడిన వారిని వెంటనే పూరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గుండిచా ఆలయం ముందు శారదబాలి సమీపంలో ఈ విషాదరక ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో రథంపై కూర్చున్న జగన్నాథుడిని చూసేందుకు భారీగా జనసమూహం అక్కడికి చేరుకుంది. దీంతో భక్తులను నియంత్రించడం పోలీసులుకు కష్టతరంగా మారింది.Distressing visuals from Jagannath Puri Rathyatra in Odisha where 3 reportedly killed in a stampede, multiple injured. pic.twitter.com/DoEZrXjM3p— Piyush Rai (@Benarasiyaa) June 29, 2025అదే సమయంలో తోపులాట జరగడంతో, కొందరు కింద పడిపోయారు. ఈ గందరగోళంలో ముగ్గురు ఇతరుల కాళ్లకింద నలిగిపోయి మృతిచెందారు. వారు ఖుర్దా జిల్లాకు చెందిన ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42)గా గుర్తించినట్లు పూరి జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. బాధితులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం వారికి చికిత్స అందిస్తోంది. బాధితులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. #WATCH | Odisha: A stampede has been reported during the Rath Yatra in Puri. Further details are awaited. (Visuals from outside the post-mortem centre in Puri) pic.twitter.com/4mOTnE6QTe— ANI (@ANI) June 29, 2025#PuriRathYatraMishap | On Puri Gundicha Temple stampede that led to death & injury of several devotees, Puri Collector Siddharth Shankar Swain says, “As soon as the Pahuda was opened, there was a sudden surge in the crowd. Nine devotees complained of breathlessness and were… pic.twitter.com/Z1TTlE7rPV— OTV (@otvnews) June 29, 2025 -
భారత్పై పాక్ దుష్ప్రచారం.. ‘ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి మీ పనే’..
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి 13మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనను పాకిస్తాన్ భారత్ పైకి నెట్టేసింది. తమ దేశ సైనికుల మరణానికి భారత్ కారణమని ప్రచారం చేస్తోంది. అయితే, పాక్ ప్రచారాన్ని భారత్ ఖండించింది. పాక్ చేస్తున్న ప్రచారం ఆమోదయోగ్యం కాదంటూ ఆదివారం విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 28న పాక్ ఉత్తర వజీరిస్తాన్ జిల్లా ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఆర్మీ సైనికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ని ఓ అగంతకుడు పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో 13మంది ఆర్మీ సైనికులు మరణించగా..10 మంది గాయాలయ్యాయి. 13 మంది సాధారణ పౌరులు గాయపడినట్లు ప్రముఖ పాక్ మీడియా సంస్థ డాన్ తెలిపింది. Statement regarding Pakistan 🔗 : https://t.co/oQyfQiDYpr pic.twitter.com/cZkiqY1ePu— Randhir Jaiswal (@MEAIndia) June 28, 2025 ఈ దాడి వెనక భారత్ ఉందంటూ పాకిస్తాన్ అధికారంగా చేసిన ప్రకటనను ఖండించింది. వజీరిస్తాన్లో పాక్ ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్ ప్రమేయం ఉందని పాక్ అధికారికంగా ప్రకటన చేసింది. ఆ ప్రకటనను మేం ఖండిస్తున్నాం. ఆమోదయోగ్యం కాదని..విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాక్ మీడియా ఏమంటోంది దక్షిణ వజీరిస్తాన్లో నిఘా ఆధారిత ఆపరేషన్ (IBO)లో ఇద్దరు సైనికులు మరణించి, 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగిందని డాన్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం, 2021లో కాబూల్లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో హింస గణనీయంగా పెరిగింది. తమ దేశంలో తమ గడ్డను ఉపయోగించుకొని దాడులకు తెగబడుతోందని తాలిబాన్ల ప్రభుత్వంపై పాక్ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఆ ఆరోపణల్ని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధులు ఖండించారు. కాగా,ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ రెండింటిలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి జరిపిన దాడుల్లో దాదాపు 290 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
కూతురిపై తల్లి అత్యాచార పర్వం
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): కన్నకూతురిపై తల్లి లైంగిక దాడులు చేస్తున్న దారుణ ఉదంతం బెంగళూరులో వెలుగు చూసింది. ఆరేళ్లుగా ఓ తల్లి కుమార్తెపై లైంగికదాడి చేస్తున్నట్టు తెలిసింది. ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలిక తల్లి దాష్టీకం గురించి ఉపాధ్యాయురాలికి మొరపెట్టుకుంది. దీంతో విషయం పోలీసులకు చేరింది. కేసు నమోదు చేసి, తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వివాహం జరిగాక భర్తతో ఎలా ఉండాలో అవగాహన కల్పిస్తున్నట్లు నిందితురాలు బుకాయించింది. స్వలింగ సంపర్కానికి అలవాటు పడిన తల్లి కుమార్తె మీద లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
Shefali Death: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నాక..
న్యూఢిల్లీ: ప్రముఖ నటి, మోడల్ షెఫాలీ జరివాలా ఆకస్మిక మృతిపై జరుగుతున్న దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఆమె మృతిచెందగా, అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముంబైలో జరిగాయి. ఈ కార్యక్రమాలకు దగ్గరి కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.సాక్షుల వాంగ్మూలాలు, షెఫాలీ జరివాలా గదిలో నుంచి స్వాధీనం చేసుకున్న ఆధారాలు, ప్రాథమిక ఫోరెన్సిక్ ఇన్పుట్ల సాయంతో పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. షెఫాలీ గత ఏడెనిమిది ఏళ్లుగా క్రమం తప్పకుండా యాంటీ ఏజింగ్ మందులు తీసుకుంటున్నది. జూన్ 27న ఆమె ఇంటిలో పూజ జరిగింది. ఆరోజు షెఫాలీ ఉపవాసం ఉంది. అయినప్పటికీ ఆమె ఆ రోజు మధ్యాహ్నం యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకుంది. ఒక వైద్యుని సలహా మేరకు షెఫాలీ ఈ మందులను వాడుతోంది. పోలీసుల దర్యాప్తులో ఈ మందులే ఆమె గుండెపోటుకు ప్రధాన కారణం కావచ్చని వెల్లడయ్యింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 27న రాత్రి 10 నుంచి 11 గంటల మధ్య షెఫాలీ ఆరోగ్యం క్షీణించింది. ఆమె శరీరంలో వణుకు మొదలైంది. తరువాత ఆమె అపస్మారక స్థితికి చేరింది. ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో షెఫాలీ భర్త పరాగ్, తల్లి, మరికొందరు ఆమెకు సాయం అందించారు. షెఫాలీ మృతి కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ బృందం ఆమె నివాసం నుండి యాంటీ ఏజింగ్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్స్, గ్యాస్ట్రిక్ మాత్రలు మొదలైనవాటిని స్వాధీనం చేసుకుంది.ఇప్పటివరకు, ఈ కేసులో కుటుంబ సభ్యులు, ఇంటి పనిమనుషులు, బెల్లేవ్ ఆసుపత్రి వైద్యుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక షెఫాలీ మృతికి గల కారణం స్పష్టం కానున్నదని పోలీసులు తెలిపారు. ఆమె శుక్రవారం రాత్రి ముంబైలోని తన నివాసంలో గుండెపోటుకు గురయ్యింది. ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు షెఫాలీ మృతి చెందినట్లు ధృవీకరించారు.ఇది కూడా చదవండి: కోల్కతా కేసు: మెడ, ఇతర భాగాలపై కమిలిన గాయాలు.. మెడికల్ రిపోర్టులో వెల్లడి -
బంగ్లాదేశ్కు షాకిచ్చిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ జనపనార, అనుబంధ ఉత్పత్తుల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చాయి. భూమార్గం, మహారాష్ట్రలోని నావ సేవా పోర్టు మినహా అన్ని నౌకాశ్రయాల ద్వారా వచ్చే వాటికి ఆంక్షలు వర్తిస్తాయి. ఈ మేరకు వాణిజ్య శాఖ పరిధిలోని ఫారిన్ ట్రేడ్ డైరెక్టరేట్ జనరల్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. బంగ్లాదేశ్తో సంబంధాల్లో అగాధం పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం సంభవించడం గమనార్హం.దక్షిణాసియా వాణిజ్య స్వేచ్ఛా ప్రాంత(సాఫ్టా) నిబంధనల ప్రకారం బంగ్లా నుంచి వచ్చే జనపనార దిగుమతులపై భారత్లో ఇప్పటి వరకు ఎలాంటి పన్నులూ లేవు. ఇది దేశీయ జూట్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందుకే, ఇకపై బంగ్లాదేశ్ నుంచి దిగుమతయ్యే జనపనార, సంబంధిత ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీ(ఏడీడీ) విధించింది.ఈ చర్య బంగ్లాదేశ్ దిగుమతులపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోయింది. పైపెచ్చు, బంగ్లాదేశ్ ఎగుమతిదారులు సాంకేతికపరమైన సాకులు చూపుతూ ఏడీడీ నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా విధించిన ఆంక్షలతో బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తుల నాణ్యత తనిఖీలను క్రమబదీ్ధకరించడం, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత లేబులింగ్ను నివారించడం, మూడో దేశం ద్వారా చేసే దిగుమతులను నిలువరించేందుకు వీలవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ పరిశ్రమను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపాయి. -
కోల్కతా కేసు: మెడ, ఇతర భాగాలపై కమిలిన గాయాలు.. మెడికల్ రిపోర్టులో వెల్లడి
కోల్కతా: కోల్కతాలోని లా కాలేజీలో జూన్ 25న అత్యాచారానికి గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లా విద్యార్థిని(24)కి నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమెపై శారీరక దాడి జరిగినట్లు స్పష్టమయ్యింది. బాధితురాలి మెడ, ఛాతీపై కమిలిపోయిన గుర్తులను మెడికల్ రిపోర్టు వెల్లడించింది. బాహ్య జననేంద్రియం లేదా నోటిపై ఎటువంటి గాయాలు కనిపించనప్పటికీ, ఫోరెన్సిక్ నిర్ధారణ మేరకు లైంగిక దాడిని వైద్యులు తోసిపుచ్చలేదు.26న రాత్రి 10 గంటలకు కోల్కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో బాధితురాలికి వైద్యపరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియలో మూడు స్వాబ్లను సేకరించి, ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. దీనిలో మూత్ర గర్భ పరీక్ష ప్రతికూలంగా వచ్చింది. అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లా విద్యార్థిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తున్నదని ఒక అధికారి తెలిపారు.ఈ కేసులో కోల్కతా పోలీసులు తాజాగా నాల్గవ వ్యక్తి, సౌత్ కలకత్తా లా కాలేజీ సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విచారణ సమయంలో గార్డు సమాధానాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ అరెస్టుతో ఈ కేసులో అదుపులోకి తీసుకున్న వారి సంఖ్య నాలుగుకు చేరింది. గార్డు గదిలో ఈ లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో తృణమూల్ ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) సమావేశం తర్వాత తనపై లైంగిక దాడి జరిగిందని తెలిపింది. ఈ సమయంలో తన తలపై హాకీ స్టిక్తో కొట్టారని, రాత్రి 10:50 గంటల ప్రాంతంలో నిందితులు తనను విడిచిపెట్టారని తెలిపింది. ఇది కూడా చదవండి: 20 ఏళ్ల తర్వాత థాక్రే బద్రర్స్ రీయూనియన్.. దేనికి సంకేతం? -
బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు?
న్యూఢిల్లీ: బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపికపై రాజకీయ వర్గాల్లో, పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవీకాలం ముగిసి రెండేళ్లయినా, ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. జూలై రెండో వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ నియమావళి ప్రకారం, జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముందు కనీసం సగం రాష్ట్ర శాఖల (స్టేట్ యూనిట్ల) అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వాలి. దేశవ్యాప్తంగా బీజేపీకి 37 రాష్ట్ర శాఖలు ఉన్నాయి. అంటే 19 రాష్ట్రాల అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పటివరకు పార్టీ 14 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తిచేసింది. మిగతా ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా త్వరలో పూర్తయ్యే అవకాశముంది. జూలై రెండో వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఇలా.. బీజేపీ దశలవారీ ప్రక్రియ ద్వారా అధ్యక్షుడిని ఎంచుకుంటుంది. ముందుగా బూత్ అధ్యక్షులు, ఆ తర్వాత మండల అధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులను ఎన్నుకుంటారు. సగం జిల్లాల అధ్యక్షులు ఎంపికైన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారు. అలాగే 19 రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన అనంతరం జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమమవుతుంది. చాలా సందర్భాల్లో ఈ ఎన్నికలు ఏకగ్రీవ పద్ధతిలోనే జరుగుతాయి. పార్టీ నేతలు, ఆర్ఎస్ఎస్ నాయకత్వం కలిసి బీజేపీ జాతీయ అధ్యక్ష అభ్యరి్థని ఖరారు చేస్తారు. కొత్త అధ్యక్షుడి ముందు సవాళ్లు జేపీ నడ్డా జనవరి 2020లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం జనవరి 2023లోనే ముగిసింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పుడు బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై దృష్టి పెట్టారు. కొత్త అధ్యక్షుడి ఆధ్వర్యంలోనే 2025లో బిహార్, 2026లో పశి్చమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎదుర్కోవాల్సి ఉంది. కుల, ప్రాంత సమీకరణపై దృష్టి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో కుల సమీకరణ, ప్రాంతీయ ప్రాతినిధ్యం, రాబోయే ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటారు. పలువురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. అందువల్ల కేంద్ర కేబినెట్లో మార్పులు, కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రివర్గ విస్తరణలు జరిగే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి మోదీ జూలై 2 నుంచి 9వ తేదీ వరకు ఐదు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఆయన విదేశాల నుంచి తిరిగివచి్చన తర్వాత, జూలై రెండో వారంలో కొత్త జాతీయ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
డీపీఆర్లో స్పష్టత లేదు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశలోని కొన్ని కీలక అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడినందునే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లో ప్రాజెక్ట్కు సంబంధించిన చాలా అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాల్సి ఉందని, ఇవి లేకుండా ప్రాజెక్ట్కు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నాయి.ముఖ్యంగా ఎల్ అండ్ టీ సంస్థ నెట్వర్క్పై ఉమ్మడి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవై) ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఎల్ అండ్ టీ నెట్వర్క్పై నడిస్తే విద్యుత్తు టారిఫ్, రవాణా చార్జీలు ఎంత ఉంటాయి? అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం క్లారిటీ కోరుతు న్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తర్వాత అనుమతులు ఇవ్వటంపై ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవలే మెట్రో ఫేజ్–2 డీపీఆర్ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఆర్ఎల్) కేంద్రానికి సమర్పించింది. అయితే, పుణే మెట్రోకు అనుమతిచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రోపై మాత్రం నోరు మెదపలేదు. డీపీఆర్లో స్పష్టత లేకుండా ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశం లేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కేంద్రం లేవదీసిన కొన్ని ప్రశ్నలు..» మొత్తం 76.4 కి.మీ. నిడివితో 5 కారిడార్లతో రూ.2,269 కోట్ల ఖర్చుతో హైదరాబాద్ మెట్రో ఫేజ్–2ను నిర్మించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కొత్త లైన్లు, ఇప్పటికే ఉన్న లైన్లపై రైళ్లను సమన్వయంతో నడుపుతామని డీపీఆర్లో ప్రస్తావించారు. అయితే, ఎల్ అండ్ టీ నెట్వర్క్పై ఉమ్మడి ఎస్పీవై ట్రైన్లు నడిపే ఏర్పాట్లు ఎలా ఉంటాయన్నది స్పష్టంగా పేర్కొనలేదు. » 50:50 ఎస్పీవై ట్రైన్లు ఎల్అండ్టీ నెట్ వర్క్పై నడిస్తే విద్యుత్తు టారిఫ్, రవాణా చార్జీలు ఎంత ఉంటాయనేది స్పష్టంగా తెలియాలి. ఇలాంటి సేవల వల్ల ఎల్ అండ్ టీకి పరోక్షంగా లాభం కలుగుతోంది. కానీ, ఎస్పీవై మాత్రం ఆ ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. » ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో కారిడార్లపై మూడు కార్ ట్రైన్లు నడుస్తున్నాయి. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ట్రైన్లు చాలక కిక్కిరిసిపోతున్నాయి. ఎల్ అండ్ టీ సంస్థ అదనపు బోగీలు, ట్రైన్లను అందుబాటులోకి తేవాల్సి ఉంది. కానీ, డీపీఆర్లో దీనిపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఈ విషయంపై ఎల్ అండ్ టీతో చర్చించిందా? అనే విషయంలోనూ స్పష్టత లేదు.» జూన్ 3వ తేదీ తర్వాత మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఎల్ అండ్ టీ మెట్రో రైలు ఎండీ పాల్గొన్నారు. ఖర్చు పంచుకోవడం, ఆపరేషనల్ అంశాలపై ఇంకా అంగీకారం లేదు. ఫేజ్–2 అమలయ్యాక ప్రభుత్వ సంస్థతో లాభాలు పంచుకోలేం అని ఆయన స్పష్టంగా తెలిపారు అని కేంద్రం పేర్కొంది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం... ఆఖరి బాధితుడి గుర్తింపు
అహ్మదాబాద్: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి గుర్తింపు పూర్తయింది. డీఎన్ఏ పరీక్ష ద్వారా శనివారం 260వ మృతుడిని గుర్తించి, సంబంధీకులకు మృతదేహాన్ని అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనలో మొత్తం 260 మంది చనిపోయినట్లు తేలిందన్నారు. జూన్ 12వ తేదీన జరిగిన దుర్ఘటనలో విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మొత్తం 241 మంది చనిపోయారు. విమానం కూలిన ప్రాంతంలో మరికొందరు చనిపోయారు. దీంతో, 270 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేశారు. అయితే, మృతదేహాలను బట్టి విమానంలోని 241 మంది, నేలపైనున్న 19 మంది కలిపి మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తేలిందని అహ్మదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ జోషి శనివారం చెప్పారు. ప్రమాదం కారణంగా తీవ్రంగా గాయపడిన ముగ్గురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామన్నారు. -
కార్తీక్ మహరాజ్పై అత్యాచార ఆరోపణలు
కోల్కతా: భారత్ సేవాశ్రమ్ సంఘ్కు చెందిన సాధువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కార్తీక్ మహరాజ్ తనపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. టీచర్ జాబ్ ఇప్పిస్తాననే హామీతో ముర్షిదాబాద్లోని ఆశ్రమానికి తీసుకెళ్లి, అక్కడ తనపై అత్యాచారం చేశారంది. 2013 జనవరి–జూన్ మధ్యలో ఆరు నెలల కాలంలో డజనుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. భయం, నిస్సహాయత వల్లే ఇంతకాలం మౌనంగా ఉన్నట్లు వివరించింది. పోలీసులకు ఈ విషయం చెబితే ఆత్మహత్య చేసుకుంటానని కార్తీక్ మహరాజ్ బెదిరించారంది. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణలను కార్తీక్ మహరాజ్ తీవ్రంగా ఖండించారు. తమవంటి సన్యాసులకు ఇలాంటి అడ్డంకులు సహజమేనన్నారు. ఈ వ్యవహారాన్ని తమ లాయర్లు చూసుకుంటారని చెప్పారు. కాగా, కార్తీక్ మహరాజ్ బీజేపీకి సన్నిహి తుడని పేరుంది. తమ టీఎంసీకి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా కార్తీక్ మహరాజ్ పనిచేస్తు న్నారంటూ 2024లో సీఎం మమతా బెనర్జీ ఆరోప ణలు చేశారు. తమ ఆశ్రమం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సీఎం మమత క్షమాపణ చెప్పా లంటూ కార్తీక్ మహరాజ్ లీగల్ నోటీసు పంపారు. -
ఆఖరి వ్యక్తికి సైతం సంక్షేమ పథకాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత, సజీవ సంస్కృతి మన సొంతమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎందరో యోగులు, గురువులు, ఆచార్యులు, సాధువులు అందించిన మన ఆలోచనలు, ఆశయాలు, తాతి్వకత శాశ్వతమని, అందుకే భరతజాతి వేలాది సంవత్సరాలుగా సజీవంగా మనగలుగుతోందని వివరించారు. ప్రఖ్యాత జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీవిద్యానంద్జీ మహారాజ్ శత జయంతి వేడుకలు, ఏడాదిపాటు జరిగే శతాబ్ది ఉత్సవాలు శనివారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆచార్య స్మారకార్థం తపాలా బిళ్ల ఆవిష్కరించారు. ఆచార్యుడి జీవిత విశేషాలతో కూడిన ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కార్యక్రమ నిర్వాహకులు ‘ధర్మ చక్రవర్తి’ బిరుదు ప్రదానం చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఈ బిరుదుకు తాను అర్హుడినని భావించడం లేదని చెప్పారు. కానీ, గురువులు, యోగుల నుంచి ఏదీ లభించినా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం మన సంప్రదాయం, సంస్కృతిలో భాగమని తెలిపారు. అందుకే ‘ధర్మ చక్రవర్తి’ ప్రసాదాన్ని స్వీకరించి, భరతమాతకు అంకితం ఇస్తున్నానని ఉద్ఘాటించారు. మానవ జన్మకు అసలైన పరమార్థం అదే భారతీయ తాతి్వక చింతనకు సేవ, మానవత్వం మూల స్తంభాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. హింసను హింసతోనే అణచివేసే ధోరణి ప్రపంచంలో కొనసాగిందని, కానీ, మన దేశం అహింస అనే ఆయుధం అందించిందని చెప్పారు. మానవ సేవే మహోన్నతం అని మన దేశం బోధించినట్లు తెలిపారు. షరతులు లేకుండా, నిస్వార్థంగా సాటి మానవులకు సేవ చేయడమే మానవ జన్మకు అసలైన పరమార్థమని వివరించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు అచార్య శ్రీవిద్యానంద్జీ మహారాజ్ ఆశయాలు, బోధనలే స్ఫూర్తి అని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన, జల్జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ యోజన వంటి పథకాలను సంతృప్త స్థాయిలో అందించాలని నిర్ణయించామని చెప్పారు. సమాజంలో ఆఖరి వ్యక్తికి సైతం ఈ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ‘ప్రజలంతా కలిసి పని చేయాలి.. కలిసికట్టుగా ఎదగాలి’ అని ఆచార్య విద్యానంద్జీ మహారాజ్ బోధించారని, అదే తమ సంకల్పమని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు. -
అంబేడ్కర్ ఆశయం ‘ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం’
నాగపూర్: దేశాన్ని ఐక్యంగా ఉంచాలంటే ఒక్కటే రాజ్యాంగం అమల్లో ఉండాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ నిర్దేశించారని, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రాజ్యాంగం అనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఆయన ఆశయం ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం అని స్పష్టంచేశారు. మహారాష్ట్రలోని నాగపూర్లో శనివారం ‘రాజ్యాంగ ప్రవేశిక ఉద్యానవనాన్ని’ జస్టిస్ గవాయ్ ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఐక్యతకు ఏకైక రాజ్యాంగం అనే అంబేడ్కర్ దార్శనికత నుంచి సుప్రీంకోర్టు స్ఫూర్తి పొందిందని, అందుకే ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిందని తెలిపారు. ఈ ఆర్టీకల్ రద్దును సమర్థించిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ సైతం ఉన్న సంగతి తెలిసిందే. ఆర్టీకల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు తమ ముందుకు వచ్చినప్పుడు అంబేడ్కర్ మాటలు గుర్తుచేసుకున్నానని జస్టిస్ గవాయ్ చెప్పారు. దేశానికి ఒక్కటే రాజ్యాంగం ఉండాలన్న అంబేడ్కర్ బాటను అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఐక్య భారత్ రాజ్యాంగంలో సమాఖ్య లక్షణాలు అధికంగా ఉన్నట్లు అంబేడ్కర్పై అప్పట్లో విమర్శలు వచ్చాయని జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. యుద్ధాలు జరిగితే దేశం ఐక్యంగా ఉండలేదని, ముక్కలవుతుందని చాలామంది అనుమానించారని చెప్పారు. దేశాన్ని ఐక్యంగా ఉంచడంతోపాటు అన్ని రకాల సవాళ్లు సమర్థంగా ఎదుర్కోగల సత్తా రాజ్యాంగానికి ఉందని అంబేడ్కర్ బదులిచ్చారని పేర్కొన్నారు. పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరుగుతోందో చూడాలని, ఎన్ని సవాళ్లు ఎదురైనా మన దేశం మాత్రం దృఢంగా, ఐక్యంగానే ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ప్రసంగించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే గొప్ప బహుమతులను రాజ్యాంగం రూపంలో అంబేడ్కర్ మనకు అందించారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలోని నాలుగు మూలస్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా రంగాల బాధ్యతలు, హక్కులను రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిందని వెల్లడించారు. కొలీజియంపై పదవీ విరమణ తర్వాత మాట్లాడుతా.. ముంబై: న్యాయమూర్తులకు పదోన్నతులు, నియామకాలు, కొలీజియం తీసుకుంటున్న నిర్ణయాలపై పదవీ విరమణ (ఈ ఏడాది నవంబర్ 24) చేసిన తర్వాత వివరంగా మాట్లాడతానని సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఇప్పుడు తనకున్న పరిమితుల దృష్ట్యా ఆయా అంశాలపై ఎక్కువగా స్పందించలేనని పేర్కొన్నారు. మనం కోరుకున్నట్లుగా ఏదీ జరగదని న్యాయమూర్తులు, న్యాయవాద వర్గాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో అడ్వొకేట్స్ అసోసియేషన్ ఆఫ్ బాంబే హైకోర్టు బెంచ్ ఆధ్వర్యంలో జస్టిస్ గవాయ్ని తాజాగా సన్మానించారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ సంజయ్ వి.గంగాపూర్వాలాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం దక్కలేదని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ వి.గంగాపూర్వాలాను ఉద్దేశిస్తూ.. ‘‘సంజయ్ భాయ్.. సుప్రీంకోర్టుకు రాకపోవడం వల్ల మీరు నష్టపోయింది ఏమీ లేదు. సుప్రీంకోర్టే నష్టపోయింది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను’’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియంలో సభ్యుడిగా చేరినప్పటి నుంచి ప్రతిభకే పట్టం కట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ప్రతిభ ఆధారంగా న్యాయమూర్తులను నియమించడానికి తపన పడుతున్నానని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఉన్న ఉత్తమమైన ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా రావాలన్నదే తన ఉద్దేశమని, అందుకోసం కొలీజియంలోని సహచర సభ్యులను ఒప్పిస్తుంటానని అన్నారు. జడ్జీల నియామకం కోసం పేర్లను ఒకసారి షార్ట్లిస్టు చేసే సమయంలో వారి కులం, మతం, ప్రాంతం చూసే అలవాటు లేదని చెప్పారు. వారికి అర్హత ఉందా? లేదా? వారికి చట్టాలు తెలుసా? లేదా? అనేది మాత్రమే చూస్తామని స్పష్టంచేశారు. జస్టిస్ ఏఎస్ చందూర్కర్ ఇటీవల బాంబే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చారని, ఆయన తన పాత మిత్రుడేనని, గతంలో కలిసి పని చేశామని జస్టిస్ గవాయ్ వెల్లడించారు. ఆయనకు పదోన్నతి కలి్పంచే విషయంలో ఆ స్నేహాన్ని పక్కనపెట్టి, అర్హతలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టంచేశారు. -
ఒక్క రోజులో 16 సూర్యోదయాలు: శుభాంశు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రభాని నరేంద్ర మోదీతో జరిపిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఈరోజు(శనివారం, జూన్ 28వ తేదీ) శుభాంశు శుక్లాతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. తొలుత శుభాంశును విష్ చేసిన ప్రధాని మోదీ.. ‘ఇది శుభ్ ఆరంభ్ అని, ఇది నయా శకం’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మోదీ.. గొప్ప ఘనతను సాధించావంటూ కొనియాడారు. దానికి శుభాంశు బదులిస్తూ ఇది తన ఒక్కడి విజయం కాదని, భారత్ విజయమని వినమ్రతను చాటుకున్నారు. PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd— PMO India (@PMOIndia) June 28, 2025 అదే సమయంలో అక్కడ ఎలా ఉంది అని మోదీ అడగ్గా... ఇక్కడ వాతావరణం అంతా భిన్నంగా ఉందని శుభాంశు తెలిపారు. ఈ కక్ష నుంచి చూస్తే భారత్ చాలా స్పెషల్గా కనిపిస్తుందని శుభాంశు స్పష్టం చేశారు. ఇక్కడ రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలుగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కక్షలో పరిస్థితులకు అలవాటు పడుతున్నామని, నిద్ర పోవడం అనేది చాలా పెద్ద చాలెంజ్గా ఉందన్నారు. ఇక్కడ గ్రావెటీ లేమి కారణంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని శుభాంశు తెలిపారు. తల కాస్త భారంగా ఉంటుందని, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులేనని తెలిపారు. మీ యొక్క ఆశీర్వాదంతో ఐఎస్ఎస్లో అతి సులభంగా అడుగుపెట్టానని పేర్కొన్నారు శుభాంశు. ఇక ఐఎస్ఎస్ నుంచి భారత్ చాలా పెద్దదిగా కనిపిస్తుందని, మ్యాప్ కంటే భిన్నంగా ఉందని మోదీ పేర్కొనగా, ఇక్కడ నుంచి చూస్తే భారత్ చాలా స్పెషల్గా కనిపిస్తుందని శుభాంశు తెలిపారు. ఇలా పలు విషయాలను పంచుకుంటూ ప్రధాని మోదీ-శుభాంశుల సంభాషణ కొనసాగింది. #WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025 -
అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్యకావ్యం
న్యూఢిల్లీ: ‘‘అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్యకావ్యంలా కనువిందు చేస్తోంది’’ – మన వ్యోమగామి వాయుసేనాని, యాగ్జియం–4 మిషన్ కెప్టెన్ శుభాంశు శుక్లా (39) చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలివి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో క్రమంగా కుదురుకుంటున్న ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో లింక్ ద్వారా మాటామంతి జరిపారు. ‘‘మ్యాప్లో చూసే భారతావనికి, అంతరిక్షం నుంచి కనిపిస్తున్న దృశ్యానికి పోలికే లేదు. ఇక్కడినుంచి మన దేశం చాలా పెద్దదిగా, ఎంతో గొప్పగా కనిపిస్తోంది. అంతరిక్షం నుంచి భూమి కూడా దేశాల ఎల్లలన్నవే లేకుండా ఎటునుంచి చూసినా నిండుగా, ‘వసుధైక కుటుంబం’లా కనువిందు చేస్తోంది. భూగోళమంతా మన ఇల్లుగా, అన్ని దేశాల ప్రజలందరం సమస్త మానవాళికీ ప్రాతినిధ్యం వహిస్తున్నామని మనసుకు తోస్తోంది’’ అని వివరించారు. ఐఎస్ఎస్లో కాలుపెట్టిన తొలి భారతీయునిగా శుభాంశు తిరుగులేని చరిత్ర సృష్టించారంటూ మోదీ ప్రస్తుతించారు. ‘‘మాతృభూమి నుంచి మీరు అత్యంత దూరంగా ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం ప్రతి భారతీయుని హృదయానికీ అత్యంత దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభముంది. అందుకు తగ్గట్టే మీ యాత్ర కూడా సరికొత్త యుగానికి శుభారంభం పలికింది. మన దేశ యువతకు కొంగొత్త ఆశలతో కూడిన కొత్త అధ్యాయానికి మీ ప్రస్థానం గొప్పగా బాటలు పరిచింది’’ అంటూ కొనియాడారు. ‘‘ఇప్పుడు మనమిలా మాట్లాడుకుంటున్న ఈ సమయాన ప్రతి ఒక్క భారతీయునికీ భావోద్వేగపరంగా మీతో విడదీయలేనంతటి బంధం పెనవేసుకుపోయింది. ఆ 140 కోట్ల పై చిలుకు అవ్యక్త భావనలను, ఆకాంక్షలను వారి ప్రతినిధిగా మీకు చేరవేస్తున్నాను. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా వెంట తీసుకెళ్లిన మీకు నా మనఃపూర్వక శుభాభినందనలు. యాగ్జియం–4 మిషన్కు నా శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. తన ఐఎస్ఎస్ యాత్రను దేశ ప్రజలందరి సమష్టి ఘనతగా శుభాంశు అభివర్ణించారు.మీ సారథ్యంలో కలలకు కొత్త రెక్కలు‘‘రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తున్నాం. గంటకు 28 వేల కి.మీ. వేగంతో భూమికి ప్రదక్షిణలు చేస్తున్నాం. ఈ వేగం మన దేశ ప్రగతి పరుగులకు అద్దం పడుతోంది’’ అని శుభాంశు తెలిపారు. ఐఎస్ఎస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ మోదీ ఆరా తీశారు. అక్కడి పరిస్థితులకు ఎలా అలవాటు పడుతున్నారని అడిగారు. తాను బావున్నానని శుభాంశు తెలిపారు. కాకపోతే శూన్య గురుత్వాకర్షణ స్థితిలో నిద్రపోవడం కూడా పెను సవాలుగానే ఉందంటూ చమత్కరించారు! అన్నింటికీ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నట్టు చెప్పారు. ‘‘ఇలాంటి సవాళ్ల కోసమే ఏడాది పాటు కఠోర శిక్షణ పొందాం. కానీ తీరా ఇక్కడికొచ్చాక అంతా మారిపోయింది. శూన్యస్థితి కారణంగా చిన్నచిన్న విషయాలు కూడా భూమి మీదికంటే ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఇది నాకు నిజంగా సరికొత్త అనుభూతి. ‘‘అంతరిక్షంలో తరచూ తీవ్ర ఒత్తిళ్లతో కూడిన పరిస్థితులెన్నో ఎదురవుతుంటాయి. అందుకే ఏకాగ్రత, ప్రశాంతచిత్తం చాలా అవసరం. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. శిక్షణ సందర్భంగా వీటి గురించి ఎంతో తెలుసుకున్నా. అదంతా బాగా ఉపకరిస్తోంది. భూమికి 400 కి.మీ. ఎత్తుకు చేరిన ఈ ప్రయాణం నా ఒక్కనిది కాదు. మొత్తం దేశానిది. అంతరిక్షంలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఎనలేని సంతోషంగా ఉన్నా. నాకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపిన మీకు, 140 కోట్ల సహచర భారతీయులకు కృతజ్ఞతలు. ఇలా ఒకనాటికి వ్యోమగామిని అవుతానని చిన్ననాడు కలలో కూడా అనుకోలేదు. మీ నాయకత్వంలో దేశం తన కలలకు కొత్త రెక్కలు తొడుక్కుంటోంది’’ అంటూ ప్రధాని నాయకత్వాన్ని ప్రశంసించారు. ‘‘యువతకు నేనిచ్చే సందేశమల్లా ఒక్కటే. ఆకాశమే మీ హద్దు!’’ అని పేర్కొన్నారు. సంభాషణను ముగిస్తూ ‘భారత్ మాతా కీ జై’ అంటూ శుభాంశు చేసిన నినాదాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమంతటా ప్రతిధ్వనించాయి. PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd— PMO India (@PMOIndia) June 28, 2025 #WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025అపార అనుభవంతో తిరిగి రండిమన గ‘ఘన’ యాత్రలకు అదే పునాదిశుభాంశుకు ప్రధాని ‘హోంవర్క్’అంతరిక్షాన్ని మరింతగా అన్వేషించాలన్న మన యువత, విద్యార్థుల సంకల్పాన్ని శుభాంశు చరిత్రాత్మక యాత్ర మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆయనకు ప్రత్యేకమైన ‘హోంవర్క్’ అప్పగించారు. ‘‘తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు వీలైనంత త్వరలో శ్రీకారం చుట్టేందుకు భారత్ ఎంతో పట్టుదలతో ఉంది. అలాగే పూర్తి స్వదేశీ ‘భారత అంతరిక్ష కేంద్రం’ నిర్మించేందుకు, భారత వ్యోమగాములను చంద్రునిపైకి పంపేందుకు కూడా! అంతరిక్ష పరిస్థితులపై సంపూర్ణ అనుభవం గడించి విజయవంతంగా తిరిగిరండి. గగన్యాన్ తదితర ప్రాజెక్టులన్నింటికీ మీరు వెంటతీసుకొచ్చే వెలకట్టలేని అనుభవమే తిరుగులేని పునాది!’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. అంతరిక్షంలో భారత్ సృష్టించబోయే నూతన చరిత్రకు తన యాత్ర కేవలం ఆరంభం మాత్రమేనని శుభాంశు బదులిచ్చారు.క్యారెట్ హల్వా, మామిడి రసం రుచి చూపాతనతో పాటు ఐఎస్ఎస్కు క్యారెట్ హల్వా, మామిడి రసం తీసుకొచ్చానని ప్రధానికి శుభాంశు వివరించారు. వాటిని, చవులూరించే పలు భారతీయు మిఠాయిలను ఐఎస్ఎస్లోని 10 మంది తోటి వ్యోమగాములతో శుభాంశు పంచుకున్నట్టు చెప్పారు. చరిత్ర సృష్టించిన శుభాంశు -
‘మేం కూడా స్నేహితులమే.. మరి మీరు తమిళం నేర్చుకోండి’
చెన్నై: హిందీ భాష అనేది ఎవరికీ శత్రువు కాదని, ఆ భాషను స్నేహపూర్వకంగా దక్షిణాది రాష్ట్రాలు చూడాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీ కనిమొళి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తాము హిందీ నేర్చుకోవడం సంగతిని కాసేపు పక్కన పెట్టి, ఉత్తరాది వారు తమిళం నేర్చుకుంటే బాగుంటుందని కనిమొళి స్పష్టం చేశారు. అలాగైనా తమిళ భాష జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందని ఆమె పేర్కొన్నారు. ‘మేం(తమిళులం) కూడా ఎవరికీ శత్రువులం కాదు.. మేం కూడా స్నేహితులమే. మా భాష కూడా అంతా నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా నార్త్ ఇండియన్స్ తమిళం నేర్చుకంటే బాగుంటుంది’ అని అమిత్ షా పేరును ప్రస్తావించకుండానే తనదైన శైలిలో పేర్కొన్నారు.అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. హిందీ భాషను దేశంలోని ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలన్నారు. హిందీని ఎవరూ శత్రువుగా భావించొద్దని, అది ఏ భాషకు శత్రువు కూడా కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ‘త్రిభాషా పాలసీ’లో హిందీని తప్పనిసరి చేయడానికి చూడటాన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలు హిందీ భాషను తమ రాష్ట్రాల్లో రుద్దడాన్ని ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు తమిళం ఉండగా హిందీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రాజకీయ దురుద్దేశాలతోనే హిందీని తమిళనాడులో పాతాలని చూస్తున్నారని ఇప్పటికే ఎన్నోసార్లు ధ్వజమెత్తారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి సైతం హిందీ భాషను తమ రాష్ట్రంలోకి తీసుకు రావడాన్ని ఖండించారు. -
Kolkata: లా విద్యార్థిని అత్యాచారం కేసులో నాలుగో నిందితుడు అరెస్ట్
కోల్కతా: సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ లా ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ దారుణంలో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. విద్యార్థినిపై దారుణం జరిగిన తర్వాత కూడా ఆమెను వేధించిన కాలేజీ క్యాంపస్ సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలకంగా వ్యవహరించడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. కోల్కతాలోని కస్బా ప్రాంత న్యాయ కళాశాలలో జూన్ 25న రాత్రి మొదటి సంవత్సరం లా చదువుతున్న 24 ఏళ్ల విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్లోనే అత్యాచారం జరిగింది. జూలై 16న జరగనున్న సెమిస్టర్ పరీక్షల కోసం పరీక్షా ఫారాలను పూర్తి చేసేందుకు బుధవారం కాలేజీ క్యాంపస్కు వచ్చింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు.నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. -
‘రా’ చీఫ్గా పరాగ్ జైన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాద మూకలపై భారతసైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో కీలక పాత్ర పోషించిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్కు ముఖ్యమైన పదవి లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను అత్యున్నత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) నూతన చీఫ్గా నియమించింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. పరాగ్ జైన్ వచ్చే నెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుత ‘రా’ చీఫ్ రవి సిన్హా ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. నూతన చీఫ్(సెక్రెటరీ)గా పరాగ్ జైన్ నియామకానికి కేబినెట్ అపాయింట్స్మెంట్ కమిటీ ఇటీవలే ఆమోద ముద్ర వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పరాగ్ జైన్ ఇప్పటిదాకా ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ చీఫ్గా వ్యవహరించారు. ప్రతిభావంతుడు పరాగ్ జైన్ పంజాబ్ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన పరాగ్ జైన్కు ప్రతిభావంతుడిగా పేరుంది. గొప్ప నేరపరి శోధకుడిగా నిఘా వర్గాల్లో గుర్తింపు సాధించారు. మానవ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని మిళితం చేసి అనుకున్న ఫలితం సాధించడంలో దిట్ట. దేశంలో పలు కీలక ఆపరేషన్లలో స్వయంగా పాలుపంచుకున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ఆయనది కీలక భూమిక. పాకిస్తాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను, లాంచ్ప్యాడ్లను నేలమట్టం చేయడంలో ఆయన హస్తం ఉంది. పరాగ్ జైన్ ఇచ్చిన కచ్చితమైన నిఘా సమాచారంతోనే పాకిస్తాన్కు చావుదెబ్బ తగిలింది. ఆయనకు జమ్మూకశ్మీర్లో క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం ఉంది. తన పదవీ కాలంలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పంజాబ్లో తీవ్రవాదాన్ని అణచివేశారు. 2021 జనవరి 1న పంజాబ్లో డీజీపీ ర్యాంక్ పొందారు. డిప్యూటేషన్పై కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోనే ఎక్కువ కాలం పనిచేశారు. కెనడా, శ్రీలంకలోనూ వివిధ మిషన్లలో ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. కెనడాలో ఉన్నప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాద శక్తులపై నిఘా పెట్టి, కీలక సమాచారం సేకరించారు. -
20 ఏళ్ల తర్వాత థాక్రే బద్రర్స్ రీయూనియన్.. దేనికి సంకేతం?
మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా?. రాజకీయంగా తీవ్ర విభేదాలతో రెండు దశాబ్దాలపాటు దూరంగా ఉన్న సోదరులు ఉద్దవ్ థాక్రే, రాజ్ థాక్రే.. ఒకే వేదికను పంచుకోబోతుండడమే ఇందుక కారణం. ఈ బ్రదర్స్ రీయూనియన్పై ఇప్పుడు మరాఠానాట ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) కింద త్రిభాషా సూత్రం అమలులో భాగంగా.. పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ విపక్షాలు జులై 5వ తేదీన నిరసనకు పిలుపు ఇచ్చాయి. ఈ కార్యక్రమానికి శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేతలు మద్దతు ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ పోస్టులో శివసేన (యూబీటీ)ఎంపీ, ప్రతినిధి సంజయ్ రౌత్ తెలియజేశారు. తొలుత ఈ రెండు పార్టీలు ఈ అంశంపై వేర్వేరుగా నిరసనలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత ఇద్దరు నేతలు మరాఠీల ప్రయోజనం కోసం వేర్వేరు నిరసనలు నిర్వహించడం సముచితం కాదని గ్రహించి, నిరసన ప్రదర్శనలను సంయుక్తంగా నిర్వహించాలని ప్రతిపాదించారు. మహారాష్ట్ర సర్కారు మరాఠీ , ఇంగ్లీష్-మీడియం పాఠశాలల్లో ఒకటి నుండి ఐదు తరగతుల వరకు హిందీని తప్పనిసరి మూడవ భాషగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనిపై పలు వర్గాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడే రాజ్ థాక్రే. శ్రీకాంత్ థాక్రే రాజకీయాల్లో క్రియాశీలకంగా లేనప్పటికీ.. ఆయన తనయుడు రాజ్ థాక్రే.. బాల్ థాక్రే వారపత్రిక మార్మిక్లో కార్టూనిస్ట్గా పనిచేశాడు. అక్కడి నుంచే ఆయన రాజకీయ ప్రస్థానానికి పునాది పడింది. అయితే..90వ దశకంలో శివసేనలో రాజ్ థాక్రేకు మంచి ప్రజాదరణ ఉండేది. పార్టీ శ్రేణులు, బాల్ థాక్రే అభిమానులు రాజ్నే వారసుడిగా భావించేవారు. కానీ 2003లో బాల్ థాక్రే తన కుమారుడు ఉద్ధవ్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాడు. దీంతో రాజ్ అసంతృప్తికి లోనయ్యారు. తదనంతర పరిణామాలతో.. 2006లో శివసేనను విడిచిపెట్టి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) అనే కొత్త పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సోదరుల మధ్య రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగాయి.దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ ఒకే సమస్యపై రాజకీయ వేదికను పంచుకోవాలనుకోవడం.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇది తాత్కాలిక ఐక్యతా? లేక శివసేన పునఃఏకీకరణకు సంకేతమా?.. బీజేపీ రాజకీయంపై ఇది ఎలాంటి ప్రభావం చూపించబోతోందో?.. అంటూ మహారాష్ట్రలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇది కూడా చదవండి: kerala: స్కూళ్లలో ‘జుంబా’ వార్.. ఆరోగ్యానికే అంటున్న విద్యాశాఖ -
ISSలో శుభాంశు శుక్లా.. ఇస్రో ఎందుకో వెనుకబడింది!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరు?.. ఇంకెవరు తాజాగా ఆ ఫీట్తో చరిత్ర సృష్టించింది భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లానే. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మిషన్లో భారతీయ అంతరిక్ష సంస్థ(ISRO) కూడా భాగంగా ఉంది. అలాంటప్పుడు ఇస్రో ఎందుకు దీనిని అంతగా ప్రమోట్ చేసుకోవడం లేదు!!.శుభాంశు శుక్లా అడుగు.. భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం. శుభాంశు పైలట్గా సాగిన ఐఎస్ఐఎస్కి సాగిన యాక్జియం-4 మిషన్ ప్రయాణం.. అంతరిక్షంపై భారత్ చేసిన సంతకం. కానీ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ISRO తక్కువగా ప్రచారం చేయడం కోట్ల మంది భారతీయులకు నిరాశ కలిగిస్తోంది. దేశం మొత్తం గర్వపడే ఈ ఘనతను మరింత ఉత్సాహంగా, ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇస్రో ఎందుకు వెనకబడిందనే విషయాన్ని పరిశీలిస్తే..వీళ్ల తర్వాత శుక్లానే..అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ. సోయుజ్ T-11 (Soyuz T-11) మిషన్ కోసం 1984, ఏప్రిల్ 3న ఆయన స్పేస్లోకి వెళ్లారు. అక్కడ సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) ద్వారా నిర్వహించబడిన సల్యూట్ 7లో(సెకండ్జనరేషన్ అంతరిక్ష కేంద్రం) ఏడు రోజులపాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత భారతీయులెవరూ స్పేస్లోకి వెళ్లింది లేదు. కానీ..భారతీయ మూలాలు ఉన్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్.. తెలుగు మూలాలున్న భారత సంతతికి చెందిన శిరీషా బండ్లా, రాజా జాన్ వూర్పుటూర్ చారి మాత్రం రోదసీ యాత్రలు చేశారు. ఈ లెక్కన రాశేష్ శర్మ తర్వాత స్పేస్లోకి.. అందునా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగిడిన తొలి వ్యక్తి ఘనత శుభాంశు శుక్లాదే. పైగా నలుగురితో కూడిన ఈ బృందంలో పైలట్గా ఉన్న శుభాంశు స్వయంగా 7 కీలక ప్రయోగాలు(60 ప్రయోగాల్లో) నిర్వహించనున్నారు. అలాంటప్పుడు భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిని ఇస్రో ఎందుకు హైలైట్ చేసుకోవడం లేదు!.అంత బడ్జెట్ కేటాయించి మరీ..అంతరిక్ష ప్రయోగంలో దూసుకుపోతున్న భారత్.. చంద్రయాన్, మంగళయాన్తో సూపర్ సక్సెస్ సాధించింది. అలాంటి దేశం తరఫున ఐఎస్ఎస్కి వెళ్లిన తొలి మిషన్ ఇదే. పైగా భారతదేశం భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ మిషన్కు.. శుక్లా పాల్గొన్న ఈ మిషన్ ముందడుగుగా పరిగణించబడుతోంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం తరఫున Department of Space (DoS) ఈ మిషన్ కోసం రూ. 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి రూ. 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన రూ. 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు.ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. పైగా తాజా మిషన్లో జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. అనుకుంటే ఈ విషయాలన్నింటిని భారీగా ప్రచారం చేసుకునేదే. కానీ, ఎందుకో ఆ పని చేయడం లేదు. దీంతో Wake up ISRO! అనే చర్చ మొదలైంది.అందుకేనా?..ఇస్రో మౌనానికి కారణాలు కొన్ని ఉండొచ్చు. సాధారణంగా తక్కువ ప్రచారంతో, శాస్త్రీయ దృష్టితో ముందుకు సాగే సంస్థ ఇది. అందుకే దేశానికి గర్వకారణమైన ఘట్టం విషయంలోనూ అదే వైఖరి అవలంభిస్తుందా? అనే అనుమానం కలగకమానదు. సంస్థ సంస్కృతికి తోడు ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు కూడా ప్రభావం చూపించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. వీటికి తోడు..యాక్సియం-4 స్పేస్ మిషన్.. ప్రైవేట్ అంతర్జాతీయ భాగస్వామ్యం అంటే ISRO, NASA, Axiom Space సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన మిషన్. అందుకే గతంలో చంద్రయాన్-3 వంటి సొంత మిషన్లకు భారీ ప్రచారం ఇచ్చిన ఇస్రో, తాజా మిషన్ అంతర్జాతీయ భాగస్వామ్యంతో జరిగినందున తక్కువ స్థాయిలో స్పందించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. మిషన్ ముగిసే సమయంలోనైనా ఇస్రో శుభాంశు శుక్లా ఘనతను ప్రపంచమంతా మారుమోగిపోయేలా ప్రచారం చేయాలని పలువురు భారతీయులు ఆశిస్తున్నారు.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
అత్తతో కలిసి అల్లుడి పరార్
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భార్య సవతితల్లితో అల్లుడు పరారైన సంఘటన దావణగెరె జిల్లా ముద్దేనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. చెన్నగిరి తాలూకా మరవంజి గ్రామం నివాసి గణేశ్(25) గతనెల 12న తన భార్య హేమను వదిలి ఆమె సవతి తల్లి శాంత(55)తో పరారయ్యాడు. వివాహం జరిగినప్పటి నుంచి గణేశ్ శాంతతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఈ విషయం భార్య హేమకు తెలియడంతో ఇద్దరూ ఊరు వదిలి పరారయ్యారు. -
kerala: స్కూళ్లలో ‘జుంబా’ వార్.. ఆరోగ్యానికే అంటున్న విద్యాశాఖ
తిరువనంతపురం: పాఠశాల విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించడానికి, వారు మాదకద్రవ్యాల వైపు మొగ్గుచూపకుండా ఉండేందుకు కేరళ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జుంబా శిక్షణను అందిస్తోంది. అయితే ప్రభుత్వం సదుద్దేశంతో ప్రారంభించిన ఈ శిక్షణపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేరళలోని పాఠశాలల్లో జుంబా ఫిట్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడంపై రాష్ట్రంలోని ముస్లిం సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధంగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాల మేరకు పాఠశాలల్లోని విద్యార్థులకు జంబాలో శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ తరహా నృత్యం నైతిక విలువలకు విరుద్ధమంటూ కేరళ సున్నీ యువజన సంఘం (ఎస్వైఎస్) రాష్ట్ర కార్యదర్శి అబ్దుస్సమద్ పూక్కొట్టూర్ ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు.విజ్డమ్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి టికె అష్రఫ్ కూడా దీనిని వ్యతిరేకించారు. బాలురు, బాలికలు పొట్టి దుస్తులు ధరించి సంగీతానికి అనుణంగా గెంతులు వేయడం ఏమిటి? ఇది నృత్యం చేసే సంస్కృతి కాదని, ఇటువంటి పాఠశాలలో తన కుమారుడిని తాను జాయిన్ చేయనని అన్నారు. ఉపాధ్యాయునిగా తాను ఈ తరహా నృత్యాన్ని పాఠశాలలో అమలు చేయనివ్వనని, దీనికి ప్రతిగా ఏ చర్య తీసుకున్నా, తాను సిద్ధమేనని ఆయన అన్నారు. ముస్లిం సంఘాల నుండి ఎదురవుతున్న విమర్శల మధ్య కేరళ విద్యా శాఖ.. జుంబా నృత్యం అనేది మానసిక, శారీరక శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని పేర్కొంది. మనం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. ఇది 2025. మనం ఆదిమ కాలంలో జీవించడం లేదు. ప్రతి ఒక్కరూ కాలానికి అనుగుణంగా నడుచుకోవాలని కేరళ ఉన్నత విద్యా మంత్రి ఆర్ బిందు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నిందితులతో టీఎంసీ దోస్తీ?.. ఫొటోతో బీజేపీ ఆరోపణ -
నిందితులతో టీఎంసీ దోస్తీ?.. ఫొటోతో బీజేపీ ఆరోపణ
కోల్కతా: లా విద్యార్ధిని గ్యాంగ్ రేప్ నిందితులకు.. టీఎంసీ అగ్రనేతలకు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయంటూ బీజేపీ నేతలు అధికార టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 26న సౌత్ కలకత్తా లా కాలేజీలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే చోటుచేసుకున్న తాజా ఉదంతం బెంగాల్లో మరోమారు రాజకీయ దుమారాన్ని రేపుతోంది.ఈ కేసులోని నిందితులకు, టీఎంసీ అగ్ర నేతలకు మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై విమర్శల దాడి ప్రారంభించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రదీప్ భండారి, పార్టీ ఐటీ చీఫ్ అమిత్ మాల్వియాలు తాజాగా సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆరోగ్య మంత్రి చంద్రిమా భట్టాచార్యతో సహా పలువురు టీఎంసీ నేతల పక్కన నిందితుడు మనోజిత్ మిశ్రా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో ఒక పోస్టులో షేర్ చేశారు. Yet again Mamata Banerjee's govt is found standing with the accused!Accused no 1 Manojit Mishra is a TMC member!Whether it is RG Kar Rape and Murder case where Mamta Banerjee tried to silence victims parents,Or now when accused in Kasba gangrape case is found to be a TMC… pic.twitter.com/mYuAYjRgwh— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) June 27, 2025‘మళ్లీ మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులకు అండగా నిలుస్తోంది. మనోజిత్ మిశ్రా టీఎంసీ సభ్యుడు అని బీజేపీ నేత భండారి పేర్కొన్నారు. టీఎంసీ నిందితులను కాపాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ఎందుకు మౌనం? ఎవరిని కాపాడుతారు?” అని బీజేపీ నేత మాల్వియా ప్రశ్నించారు. మమతా బెనర్జీ పాలన.. బెంగాల్ మహిళలకు ఒక పీడకలగా మారిందని ఆయన ఆరోపించారు. బీజేపీ నేతల ఆరోపణలకు స్పందించిన టీఎంసీ మహిళా నేత శశి పంజా ఈ ఘటనను ఖండించారు. ఈ విషాదాన్ని రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలను కోరారు. ఇది తనకు ఎంతో బాధ కలిగించిందని, ఈ కేసలో నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన 12 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారని, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని ఆమె తెలిపారు.ఇది కూడా చదవండి: ఫరీదాబాద్ కేసు: చేసిందంతా మామనే.. ఎంత దారుణం -
ఫరీదాబాద్ కేసు: చేసిందంతా మామనే.. ఎంత దారుణం
ఫరీదాబాద్: హర్యానాలోని ఫరీదాబాద్లో రెండు నెలలుగా కనిపించకుండా పోయిన మహిళ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఆ మహిళ మృతదేహాన్ని ఆమె అత్తమామలే స్వయంగా తమ ఇంటి ముందు పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో మామనే ఆమైపై అత్యాచారం చేసి, హత్య చేశారని వెల్లడయ్యింది. ఇందుకు మృతురాలి అత్త, భర్త కూడా సహకరించారని తెలుస్తోంది.మృతురాలు తన్ను ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్కు చెందినది. ఆమెకు రెండేళ్ల క్రితం అరుణ్ సింగ్తో వివాహమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మామ భూప్ సింగ్, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. తన్ను భర్త అరుణ్ పరారీలో ఉన్నాడు. తమ కోడలు తన్ను అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ విషయం బయటకు పొక్కకుండా అత్తామామలు జాగ్రత్తపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 21న రాత్రి అరుణ్ తన భార్య తన్ను తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. అర్థరాత్రి తన్ను గదిలోకి ప్రవేశించిన మామ అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణం తర్వాత అతను తన కుమారుడు అరుణ్ను పిలిచాడు. వారిద్దరూ కలిసి తన్ను మృతదేహాన్ని.. అప్పటికే వీధిలో తవ్విన గొయ్యిలో పడవేసి, దానిపై ఇటుకలు, మట్టిని పోశారు. ఆ గొయ్యి మురుగునీటి కోసం తవ్వినదని భూప్ సింగ్ చుట్టుపక్కలవారికి తెలిపాడు. దీనిపై అనుమానించిన స్థానికులు తహశీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ గొయ్యిని తవ్వించగా, తన్ను మృతదేహం బయటపడింది. ఈ ఘటనలో పోలీసులు మామ భూప్ సింగ్, అతని భార్య సోనియా, కుమారుడు అరుణ్ సింగ్ కుమార్తె కాజల్పై కేసు నమోదు చేశారు. కాగా తమకుమార్తె తన్నును కట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని, వివాహం తర్వాత కూడా తమ కుమార్తె ఏడాదిపాటు తమ ఇంటిలోనే ఉన్నదని ఆమె తండ్రి రోదిస్తూ మీడియాకు తెలిపాడు.ఇది కూడా చదవండి:‘మధ్యవర్తిత్వం’ చట్టవిరుద్ధం.. పాక్కు భారత్ మరో షాక్ -
బెంగాల్లో లా విద్యార్థి ఘటన.. ఆర్జీకర్ వైద్యురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో వరుస అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆర్జీకార్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచార ఘటన మరువక ముందే.. కోల్కతాలోని ఓ న్యాయ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థిని సామూహిక అత్యాచారం జరగడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో వరుస ఘటనలపై ఆర్జీకర్ వైద్యురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ ఉదాసీనత వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు.బెంగాణలో పరిస్థితులపై తాజాగా ఆర్జీకర్ వైద్యురాలి తండ్రి స్పందిస్తూ..‘న్యాయ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థిని సామూహిక అత్యాచారం జరగడం దారుణం. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ ఎందుకు జరుగుతున్నాయి. రాష్ట్రంలో తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇలా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ముగ్గురు అధికార టీఎంసీకి చెందిన వారే. గతంలో నా కుమార్తె అత్యాచారానికి గురైనప్పుడు వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. దీంతో, ఇలాంటి ఘటనలు పునరావృతం కావని భావించాం. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. కాబట్టి రాజకీయ పార్టీలే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.ఘటన వివరాలు.. ఇదిలా ఉండగా.. దక్షిణ కోల్కత్తా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. పరీక్షకు సంబంధించిన పత్రాలను నింపేందుకు బాధితురాలు (24) బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు.సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు.మోనోజిత్ బెదిరింపు..మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు. నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది.‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. గది బయట కాపలాగా ఉన్నారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముగ్గురు నిందితులకు కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితునికి సహకరించడం కూడా అత్యాచారానికి పాల్పడటంతో సమానమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఘటన జరిగిన గార్డు గదితోపాటు పక్కనే ఉన్న విద్యార్థి సంఘం గదిని సీజ్ చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించాం’’ అని పోలీసులు తెలిపారు. -
విమానం రెక్కలో ఇరుక్కున్న గడ్డి
ముంబై: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఈ నెల 25న ముంబై విమానాశ్రయంలో దాదాపు 5 గంటలపాటు నిలిచిపోయింది. విమానం ఒక రెక్క దిగువ భాగంలో గడ్డి ఇరుక్కుపోయి ఉండటమే ఇందుకు కారణమని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. గమనించిన వెంటనే తొలగించి, విమానం టేకాఫ్కు క్లియరెన్స్ ఇచ్చామంది. అయితే, ఆ విమానం ఏ రకానిది? అందులోని ప్రయాణికులు, సిబ్బంది సంఖ్య ఎంత? టేకాఫ్ షెడ్యూల్ సమయం? ప్రయాణికులు ఎంతసేపు విమానంలో ఉండిపోయారు? వంటి వివరాలను టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిరిండియా వివరించలేదు. రెక్క దిగువ భాగంలో గడ్డి ఎలా చేరిందని విషయాన్ని సైతం తెలపలేదు. అయితే, ముంబైలో ఉదయం 7.45 గంటలకు టేకాఫ్ తీసుకోవాల్సిన ఏఐ 2354 విమానం మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరినట్లు ఫ్లయిట్రాడార్24. కామ్ ట్రాక్ రికార్డును బట్టి తెలుస్తోంది. -
ఐరాస సాయం తిరస్కరించిన భారత్
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తులో సాయం చేస్తామన్న ఐక్యరాజ్యసమితి విమానయాన దర్యాప్తు సంస్థ ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. కీలకమైన బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించడంలో జాప్యం జరుగుతోందని భద్రతా నిపుణులు అంటుండటం తెలిసిందే. జూన్ 13న స్వాధీనం చేసుకున్న కంబైన్డ్ బ్లాక్ బాక్స్ యూనిట్ స్థితి, జూన్ 16న దొరికిన కాక్పిట్ వాయిస్ రికార్డర్తో సహా దర్యాప్తు గురించి సమాచారం లేకపోవడాన్ని వారు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తులో సాయం చేసేందుకు ఐరాస సంస్థ ముందుకొచ్చింది. భారత్లో ఉన్న తమ అధికారికి పరిశీలకుడి హోదా ఇవ్వాలని కోరింది. అందుకు భారత్ తిరస్కరించింది. 2014లో మలేషియా విమాన ప్రమాదం, 2020లో ఉక్రేనియా జెట్లైనర్ కూలిపోయిన ఘటనల్లో దర్యాప్తులకు సాయపడేందుకు ఆ దేశౠల విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ పరిశోధకులను నియమించింది. ప్రమాదం జరిగిన రెండు వారాల తర్వాత దర్యాప్తు అధికారులు ఫ్లైట్ రికార్డర్ డేటాను డౌన్లోడ్ చేసుకున్నట్టు పౌర విమానయాన శాఖ గురువారం తెలిపింది. -
బాధలో అహ్మదాబాద్ బాధితులు.. డీజే పార్టీ జోష్లో ఎయిర్ ఇండియా ఉద్యోగులు
ఢిల్లీ: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) విమానం కూలిపోయిన ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన నుంచి మృతుల కుటుంబాలు, ప్రజలు తేరుకోక ముందే ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన ఉద్యోగులు.. ఆఫీసులోనే పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంస్థ.. నలుగురు సీనియర్ల ఉద్యోగులపై వేటు వేసింది. ఉద్యోగులు పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఎయిర్ ఇండియా గ్రౌండ్ సేవల సిబ్బంది ఆఫీసులో పార్టీ చేసుకోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఎస్ఏటీఎస్ లిమిటెడ్ (గతంలో సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ సర్వీసెస్) ఎయిరిండియా భాగస్వామ్యంతో (AISATS) దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఫుడ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వంటి గ్రౌండ్ సేవలందిస్తోంది. అయితే, గుజరాత్లో విమాన దుర్ఘటన జరిగిన కొన్ని రోజులకే.. గురుగ్రామ్లోని ఏఐఎస్ఏటీఎస్ కార్యాలయ సిబ్బంది ఓ పార్టీ చేసుకున్నారు. సిబ్బందితో కలిసి సీనియర్ ఉద్యోగులు కూడా డీజేకు స్టెప్పులు వేస్తూ డ్యాన్సులు చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.A video showing senior Air India SATS (AISATS) executives dancing at a DJ party in their Gurugram office—just eight days after the deadly Flight AI171 crash—has sparked public outrage.The June 20 celebration, reportedly attended by top officials of AISATS (Air India SATS… pic.twitter.com/jBQwUSBstd— Mid Day (@mid_day) June 23, 2025విమాన ప్రమాదం కారణంగా ఓ వైపు మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. ఉద్యోగులు మాత్రం కనీన మానవత్వం లేదా? అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. ప్రయాణీకుల ప్రాణాలంటే అంత చులకనగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్ ఉద్యోగులను రాజీనామా చేయాలని ఆదేశించడంతోపాటు మిగతా వారిని హెచ్చరించినట్లు తెలిసింది. ఉద్యోగుల ప్రవర్తన మా విలువలకు అనుగుణంగా లేదు. బాధ్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాం’ అని చెప్పుకొచ్చింది. -
‘శశి థరూర్.. ఒవైసీ వేరుకాదు’: జావేద్ అక్తర్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని, యావత్ దేశంపై జరిగిన దాడి అని ప్రముఖ గీత రచయిత, స్క్రిప్ట్ రైటర్ జావేద్ అక్తర్ పేర్కొన్నారు. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రపంచదేశాలకు వివరించేందుకు ప్రతిపక్ష సభ్యుల బృందం వివిధ దేశాల్లో పర్యటనలు సాగిస్తోంది.ఒక మీడియా సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో గీత రచయిత జావేద్ అక్తర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాంగ్రెస్ నేత శశి థరూర్, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వంటి నాయకులను ప్రభుత్వం ఈ ప్రతినిధుల బృందంలో చేర్చడం సరైనదేనా? అని అడిగినప్పుడు, ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్ ఉగ్ర దాడి ప్రభుత్వంపై జరిగిన దాడి కాదని, దేశంపై జరిగిన దాడి అని అన్నారు. అందుకే దేశంలోని అన్నివర్గాల ప్రతినిధులూ వెళ్లారన్నారు. వీరిలోని కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారని. కానీ దేశం విషయానికి వస్తే, అందరం ఒకటేనని అన్నారు. ఈ విధంగా చూస్తే ప్రతినిధుల బృందంలోని శశిథరూర్, అసదుద్దీన్ ఒవైసీ వేరుకాదని జావేద్ అక్తర్ పేర్కొన్నారు.శశి థరూర్ అన్ని విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడతారని,ఇలాంటి కాంగ్రెస్ నేత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం సంతోషంగా ఉందని, ఆయనకు ఐక్యరాజ్యసమితిలో దౌత్య అనుభవం ఉందని అక్తర్ పేర్కొన్నారు. భారత్- పాకిస్తాన్ మధ్య సంబంధం గురించి ఆయన మాట్లాడుతూ 1965 యుద్ధం.. అనంతరం జరిగిన కార్గిల్ యుద్ధం నాటి నుంచి కూడా వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయన్నారు. అయితే పాక్ ప్రభుత్వం ఇటువంటి వివాదాల్లో తన ప్రమేయం లేదని చెబుతూ వస్తున్నదన్నారు. పహల్గామ్ దాడి వారు చేసినదేనని అక్తర్ పేర్కొన్నారు.పాకిస్తాన్లోని కోట్లాది మంది భారతదేశంతో స్నేహాన్ని కోరుకుంటున్నారని, అలాగే అక్కడి యువత భారతదేశానికి వచ్చి, వినోద పరిశ్రమతో పాటు కార్పొరేట్ రంగంలో పనిచేయాలని కోరుకుంటున్నారని జావేద్ అక్తర్ పేర్కొన్నారు. అయితే అక్కడి సైనిక పాలకులకు ఇది నచ్చిన అంశమన్నారు. పాక్లో సైన్యం ఆధిపత్యం తెలుసుకున్న మీదటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ సైన్యాధ్యక్షుడు అసిమ్ మునీర్ను ఆహ్వానించారన్నారు. పాక్లో ప్రజాస్వామ్యం ఒక బూటకమని, సైన్యమే ఆ దేశాన్ని పాలిస్తుందని జావేద్ అక్తర్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అభినందన్ను బంధించానన్న.. పాక్ ఆర్మీ అధికారి మృతి -
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు
కోల్కతా: దేశమంతటా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ కాలేజీ మెడికోపై హత్యాచార ఘటనను మరవకముందే కోల్కతాలో అలాంటిదే మరో దారుణం జరిగింది. సౌత్ కలకత్తా లా కాలేజీ విద్యార్థిపై కాలేజీలోనే అత్యాచారం జరిగింది. అదే కాలేజీకి చెందిన మాజీ విద్యార్థి ఇద్దరు ప్రస్తుత విద్యార్థులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురినీ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పశ్చిమబెంగాల్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షకు సంబంధించిన పత్రాలను నింపేందుకు బాధితురాలు (24) బుధవారం మధ్యాహ్నం కాలేజీకి వెళ్లింది. విద్యార్థి సంఘం గదిలో కూర్చుని పత్రాలు నింపుతుండగా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఛాత్ర పరిషత్ (టీఎంసీపీ) జిల్లా ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) అక్కడికి వచ్చాడు. ఆమెతోపాటు మరో ఆరుగురు విద్యార్థులను కూర్చోబెట్టి టీఎంసీపీ గురించి, తన అధికారాల గురించి మాట్లాడాడు. బాధితురాలిని కళాశాల విద్యార్థిని విభాగం కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించాడు. సాయంత్రం దాకా ఆమెను ఒక్కదాన్నే ఆ గదిలో కూర్చోమని చెప్పాడు. అనంతరం జరిగిన పరిణామాలను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ‘‘మోనోజిత్ గదిలోకి వచ్చి, ఉన్నట్టుండి తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రతిపాదించాడు. దాంతో విస్తుపోయా. ఇంకొకరితో ప్రేమలో ఉన్నానంటూ అందుకు నిరాకరించా. దాంతో ఒక్కసారిగా ఆగ్రహించాడు. కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేయాల్సిందిగా అక్కడి వారిని ఆదేశించాడు. నన్ను పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు రూంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. మా కాలేజీలో ఫస్టియర్ చదువుతున్న జయీబ్ అహ్మద్ (19), ప్రమీద్ ముఖర్జీ (20)తో కలిసి నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తప్పించుకోవడానికి ప్రయ త్నిస్తే అడ్డుకుని చేయిచేసుకున్నాడు. బాయ్ఫ్రెండ్ ఉన్నాడని, వదిలేయాలని కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించలేదు. ఈ దారుణాన్ని జయీబ్, ప్రమీద్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను నా బంధుమిత్రులకు పంపుతామని బెదిరించారు. కాలేజీ గార్డు కూడా నన్ను కాపాడేందుకు ప్రయత్నించలేదు. బుధవారం రాత్రి 7.30 నుంచి 10.50 మధ్య ఈ దారుణం జరిగింది. దీని గురించి ఎవరికైనా చెబితే దారుణ పరిణామాలుంటాయని మోనోజిత్ బెదిరించాడు. నా బోయ్ఫ్రెండ్కు హాని తలపెడతామని, తల్లితండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టాడు’’ అని వాపోయింది. ‘‘క్రూరమైన లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డా. ఒక దశలో శ్వాస కూడా అందలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా మోనోజిత్ పట్టించుకోలేదు. పైగా హాకీ స్టిక్ చూపించి, కొడతానని బెదిరిస్తూ వెళ్లిపోయాడు’’ అని వివరించింది. ‘‘ప్రధాన నిందితునికి మిగతా ఇద్దరు సహకరించారు. గది బయట కాపలాగా ఉన్నారు’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముగ్గురు నిందితులకు కోర్టు ఐదు రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితునికి సహకరించడం కూడా అత్యాచారానికి పాల్పడటంతో సమానమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. ‘‘బాధితురాలు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఘటన జరిగిన గార్డు గదితోపాటు పక్కనే ఉన్న విద్యార్థి సంఘం గదిని సీజ్ చేసి, ప్రత్యక్ష సాక్షులను విచారించాం’’ అని పోలీసులు తెలిపారు.అతనో క్రిమినల్ లాయర్ ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా అదే లా కాలేజీలో చదివాడు. 45 రోజుల కాంట్రాక్టుపై ప్రస్తుతం కాలేజీలో బోధనేతర విధుల్లో పనిచేస్తున్నాడని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నైనా చటర్జీ చెప్పారు. అంతేగాక అలీపోర్ పోలీస్ అండ్ సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్గా చేస్తున్నట్టు కాలేజీ వర్గాలు తెలిపాయి. టీఎంసీకి చెందిన పలువురు నేతలతో మోనోజిత్కు దగ్గర సంబంధాలున్నట్లు సమాచారం. ఘటనపై వామపక్ష విద్యార్థి విభాగం, కాంగ్రెస్ శ్రేణులు కస్బా పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగాయి.తృణమూల్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు అత్యాచారోదంతంపై తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘యువతులు తాము ఎలాంటి వారితో కలిసి తిరుగుతున్నామో చూసుకోవాలి. రాష్ట్రంలో ప్రతి చోటా మహిళలకు పోలీసులు రక్షణ కల్పించడం సాధ్యం కాదు’’ అన్నారు. ఈ ఉదంతంపై నిరసనలు పెరిగి పెద్దవవుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ప్రధాన నిందితుడు మోనోజిత్తో పారీ్టకి సంబంధం లేదని ప్రకటించింది. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొంది. కానీ తృణమూల్ ప్రకటనను బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో పాటు పలువురు ప్రముఖ తృణమూల్ నేతలతో పాటు మోనోజిత్ ఎన్నోసార్లు వేదికలపై కని్పంచినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మమతకు సీఎంగా కొనసాగే అర్హత లేదని రాష్ట్ర బీజేపీ చీఫ్ సువేందు అధికారి మండిపడ్డారు. -
8 రోజులు.. 5 దేశాలు!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 2వ తేదీ నుంచి 8 రోజులపాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. బ్రెజిల్లోని రియోడీజనిరోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రంలో పాల్గొననున్న ప్రధాని మోదీ ఆ తర్వాత.. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియాల్లో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. మొదటగా జూలై 2, 3వ తేదీల్లో ఆఫ్రికా దేశం ఘనా వెళ్తారు. ఈ దేశంలో ప్రధాని మోదీ మొట్టమొదటి పర్యటన ఇదే కాగా, మన ప్రధాని ఒకరు అక్కడ పర్యటించడం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. ఘనా నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్తారు. అక్కడ జూలై 3, 4వ తేదీల్లో పర్యటించనున్నారు. 1999 తర్వాత భారత ప్రధాని ఒకరు అక్కడికెళ్లడం ఇదే మొదటిసారి. అనంతరం, జూలై 4, 5వ తేదీల్లో అర్జెంటినా వెళ్తారు. జూలై 5 నుంచి 8 వరకు జరిగే 17వ బ్రిక్స్ సమిట్లో పాల్గొంటారు. చివరగా ప్రధాని మోదీ నమీబియా చేరుకుంటారు. మోదీ నమీబియాలో పర్యటించే మూడో భారత ప్రధాని కావడం గమనార్హం. -
డీజిల్లో నీళ్లు..కాదు నీళ్లలో డీజిల్!
భోపాల్: పెట్రోల్ బంకుల్లో జరిగే ఇంధన కల్తీ తీవ్రతకు తాజా ఉదాహరణ ఇది. మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. ఏకంగా సీఎం మోహన్ యాదవ్ కాన్వాయ్లోని ఎస్యూవీలే కల్తీ కాటుకు గురికావడం గమనార్హం. రట్లాంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం మోహన్ యాదవ్ గురువారం ఇండోర్ నుంచి వాహనాల్లో బయలుదేరారు. రట్లాం వద్దకు వచ్చేసరికి డీజిల్ నిండుకోవడంతో అక్కడున్న పెట్రోల్ బంకులో వాహనాలకు డీజిల్ ఫుల్ట్యాంక్ చేయించారు. అక్కడ్నుంచి ఒక కిలోమీటర్ దూరం వెళ్లాయో లేదో వాహనాలన్నీ ముందుకు వెళ్లమని మొరాయించాయి. ఒకటీరెండూ కాదు, ఏకంగా 19 వాహనాలు నిలిచిపోయాయి. సిబ్బందే వాటిని రోడ్డు పక్కకు నెట్టాల్సి వచ్చింది. రట్లాంలోని సంబంధిత పెట్రోల్ బంకులో తనిఖీలు చేపట్టిన అధికారులు డీజిల్లో భారీగా నీళ్లు కలిసి ఉన్నట్లు నిర్థారించారు. కాగా, కొద్దిసేపటి తర్వాత ఇండోర్ నుంచి తెప్పించిన వేరే వాహనాల్లో సీఎం కాన్వాయ్ ముందుకు సాగింది. -
రాజ్నాథ్ నిర్ణయం సరైందే: జైశంకర్
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) ఉమ్మడి ప్రకటనలో ఉగ్రవాదం గురించిన ప్రస్తావన తప్పనిసరిగా ఉండాలని భారత్ కోరుకుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ చెప్పారు. కానీ, ఒకే ఒక్క సభ్య దేశానికి అది ఆమోదయోగ్యం కాదని, పాకిస్తాన్ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పోరాటమనే ప్రధాన లక్ష్యంతో ఎస్సీవో రక్షణ మంత్రులు చైనాలో సమావేశమయ్యారని గుర్తు చేసిన జై శంకర్..ఆ ప్రస్తావనే లేకుండా రూపకల్పన చేసిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయరాదని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. శుక్రవారం మంత్రి జై శంకర్ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని, సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఆజ్యపోయడంపై భారత్ ఆందోళనను పట్టించుకోకుండా తయారు చేసిన ప్రకటనపై భారత్ సంతకం చేయని విషయం తెల్సిందే. పైపెచ్చు, ఆ ప్రకటనలో భారత్ ప్రోద్బలంతో బలూచిస్తాన్లో భారత్ ఉగ్ర కార్యకలాపాలను ప్రేరేపిస్తోందంటూ పాకిసాŠత్న్ ఒక పేరాను కలిపేందుకు ప్రయత్నించడం గమనార్హం. -
ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి 4,400 మంది వెనక్కి: కేంద్రం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ల నుంచి 4,400 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఆపరేషన్ సిందూలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి వీరి కోసం 19 ప్రత్యేక విమాన సర్వీసులను నడిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నుంచి ఆర్మీనియా రాజధాని ఎరెవాన్ చేరుకున్న 173 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం తాజాగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుందని పేర్కొంది. అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేశాక తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాకు వివరించారు. మొత్తమ్మీద ఇరాన్లో 10 వేల మంది, ఇజ్రాయెల్లో 40 వేల మంది భారతీయులు ఉన్నారన్నారు. భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో సహకరించిన ఈజిప్టు, జోర్డాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 20న గగనతలాన్ని భారతీయుల కోసం తెరిచిన ఇరాన్తోపాటు తుర్క్మెనిస్తాన్, ఆర్మీనియా ప్రభుత్వాలకు సైతం ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మద్య ఉద్రిక్తతలు మొదలుకాగా, 22న అమెరికా ఇరాన్ అణు వసతులపై దాడులకు దిగడంతో తీవ్ర రూపం దాల్చడం తెల్సిందే. -
భార్య ఉద్యోగం చేస్తున్నా భరణానికి అర్హురాలే
ముంబై: ఉద్యోగం చేస్తూ వేతనం ఆర్జిస్తున్న మహిళ కూడా విడిపోయిన తన భర్త నుంచి నెలనెలా జీవన భృతి పొందడానికి అర్హురాలేనని బాంబే హైకోర్టు తేల్చిచెప్పారు. ఆమెకు సొంత సంపాదన ఉందన్న కారణంతో భర్త నుంచి ఆర్థిక సాయం పొందకుండా నిరోధించలేమని పేర్కొంది. మహారాష్ట్రలోని థానేకు చెందిన యువతి, యువకుడికి 2012 నవంబర్ 28న వివాహం జరిగింది. విభేదాల కారణంగా 2015 మే నెల నుంచి దూరంగా ఉంటున్నారు. అధికారికంగా విడాకులు తీసుకోలేదు. సదరు యువతి ఓ పాఠశాలలో టీచర్గా ఉద్యోగం చేయడం ప్రారంభించింది. తన భర్త నుంచి జీవన వ్యయం ఇప్పించాలని కోరుతూ బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దాంతో ప్రతినెలా రూ.15 వేల చొప్పున ఆమెకు ఇవ్వాలని ఆదేశిస్తూ భర్తను ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ మంజూష దేశ్పాండే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. భార్య ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఆమె జీవన వ్యయాన్ని తాను భరించాల్సిన అవసరం లేదన్న భర్త వాదనను తిరస్కరించింది. భార్య ఉద్యోగం చేస్తున్నా ఆమెను పోషించాల్సిన బాధ్యత భర్తపై ఉందని పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వుల ప్రకారం భార్యకు ప్రతినెలా రూ.15 వేల చొప్పున ఇవ్వాలని భర్తను ఆదేశిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. -
సామ్యవాద, లౌకిక పదాలను సమీక్షించాలి
న్యూఢిల్లీ: దేశ రాజ్యాంగం వాస్తవ స్ఫూర్తిని పునరుద్ధరించేందుకు పీఠికలో సవరణ ద్వారా చేర్చిన ’సోషలిస్ట్’, ’లౌకిక’ పదాలపై సమీక్ష చేపట్టాలని రాష్రీ్టయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళె పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ తీసుకువచ్చిన పలు వక్రీకరణ విధానాల నుంచి రాజ్యాంగానికి విముక్తి కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన రాసిన వ్యాసం శుక్రవారం ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక ఆర్గనైజర్లో ప్రచురితమైంది. 1948లో దేశాన్ని సెక్యులర్, ఫెడరల్, సోషలిస్ట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్’గా భారత్ను పేర్కొనాలన్న ప్రతిపాదనను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సారథ్యంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చ సందర్భంగా తిరస్కరించారని హొసబళె తన వ్యాసంలో గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సభ చర్చా ప్రక్రియకు ప్రతిబింబం కాదన్నారు. భవిష్యత్ తరాలకు అధికారం ఇచ్చే ప్రజాస్వామ్య చట్రం అనే అంబేద్కర్ దార్శనికతకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసేందుకు హోసబళె బహిరంగ చర్చను కోరుకున్నారని ఆర్గనైజర్ వారపత్రిక వివరించింది. అంతేతప్ప, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఆయన ఉద్దేశం కానేకాదని స్పష్టత నిచ్చింది. కాంగ్రెస్ వంచనను బయటపెట్టి, రాజ్యాంగం నిజ స్ఫూర్తికి గౌరవం కల్పించేందుకు చర్చ జరగాల్సిన అవసరముందని పేర్కొంది. హొసబళె వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. మన రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ ఎన్నడూ ఆమోదించలేదని, రాజ్యాంగాన్ని రద్దు చేయడమనే దీర్ఘకాలం కుట్రలో తాజా వ్యాఖ్యలు ఒక భాగమని ఆరోపించింది. రాజ్యాంగం ఆత్మపై ఆర్ఎస్ఎస్ ఉద్దేశ పూర్వకంగా దాడి చేస్తోందిన మండిపడింది. సోషలిస్ట్, సెక్యులర్ విధానాల కోసమే స్వాతంత్య్ర పోరాట యోధులు తమ జీవితాలను త్యాగం చేశారని సీపీఎం పేర్కొంది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి హొసబళె వ్యాఖ్యలను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. దేశాన్ని ‘హిందూ రాష్ట్ర’గా మార్చాలన్న ఆర్ఎస్ఎస్ కుట్రలో ఇదో భాగమని పేర్కొంది.ఆర్ఎస్ఎస్ ముసుగు తొలగింది: రాహుల్ ఆర్ఎస్ఎస్ నేత హొసబళె వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఆర్ఎస్ఎస్కు కావాల్సింది మనుస్మృతే తప్ప రాజ్యాంగం కాదన్న విషయం మరోసారి రూఢీ అయ్యిందని విమర్శించారు. రాజ్యాంగం వంటి శక్తివంతమైన ఆయుధాన్ని, హక్కులను లాగేసుకుని, సామాన్యులను బానిసలుగా మార్చడమే ఆర్ఎస్ఎస్ వాస్తవ అజెండా అని ఆయన శుక్రవారం ఎక్స్లో పేర్కొన్నారు. ఈ అజెండా ఎన్నటికీ నిజం కాబోదు, ఇలాంటి కలలను కనడం ఆర్ఎస్ఎస్ మానుకోవాలని హితవు పలికారు. దేశభక్తి కలిగిన ప్రతి భారతీయుడూ రాజ్యాంగాన్ని ఆఖరి శ్వాస వరకు కాపాడుకుంటారని రాహుల్ స్పష్టం చేశారు. -
13 రోజులైనా కేరళలోనే యూకే యుద్ధ విమానం
త్రివేండ్రం: కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయిన బ్రిటన్ నేవీ యుద్ధ విమానం ఎఫ్–35 గత 13 రోజులుగా అక్కడే ఉంది. టేకాఫ్ ప్రయత్నాలు విఫలం కావడంతో రాయల్ బ్రిటీష్ నేవీ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైడ్రాలిక్ స్నాగ్ కారణంగా ఉండిపోయిన ఎఫ్–35బీ యుద్ధనౌకను తరలించడం కోసం యూకే నుంచి ప్రత్యేక టో వాహనం వస్తోంది. 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు, నిపుణుల బృందం కూడా కేరళకు బయల్దేరింది. ఫైటర్ జెట్ను భారత్లోనే మరమ్మతు చేయనున్నట్లు సమాచారం. యుద్ధవిమానం పార్కింగ్ కోసం బ్రిటన్ భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సరిపడా ఇంధనం లేకపోవడంతో పాటు వాతావరణం అనుకూలించక విమాన వాహన నౌక తిరిగి రాకపోవడంతో ఎఫ్–35బి జూన్ 14న తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవడం తెలిసిందే. సురక్షిత ల్యాండింగ్కు భారత వైమానిక దళం వీలు కల్పించింది. ఇంధనం నింపడంతో పాటు అన్నిరకాల మద్దతు అందించింది. కానీ హైడ్రాలిక్ వైఫల్యంతో జెట్ ఎగరలేకపోయింది. దాన్ని సరిచేయడానికి రాయల్ నేవీ టెక్నీషియన్ల చిన్న బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం ప్రస్తుతం సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) రక్షణలో బే 4 వద్ద ఉంది. ‘‘తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎఫ్–35బీని వీలైనంత త్వరగా మరమ్మతు చేయడానికి యూకే కృషి చేస్తోంది. భారత అధికారుల నిరంతర మద్దతుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’అని భారత్లోని బ్రిటిష్ హైకమిషన్ పేర్కొంది. నిపుణుల బృందం మరమ్మత్తు ప్రయత్నాలు కూడా విఫలమైతే జెట్ను యూకేకి విమాన మార్గంలో తరలించడమే చివరి మార్గమని చెబుతున్నారు. జోరుగా మీమ్స్ బ్రిటన్ యుద్ధ విమానం రెండువారాలుగా కేరళలోనే ఉండటంపై ఆన్లైన్లో జోరుగా మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. 11 కోట్ల డాలర్ల విలువైన జెట్ను కేవలం 4 కోట్లకే ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచినట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రెండు వారాలుగా ఇక్కడే ఉంటున్నందున ఆ జెట్కు భారత పౌరసత్వానికి అర్హత వచ్చిందని కొందరు చమత్కరించారు. ‘‘బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయబట్టి సరిపోయింది. మరెక్కడైనా అయితే దొంగతనానికి గురయ్యేది’’అంటూ మీమ్స్ వైరలవుతున్నాయి. -
అంతరిక్షం నుంచి భారత్
న్యూఢిల్లీ: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడిగా రాకేశ్ శర్మ రికార్డుకెక్కారు. 1984 ఏప్రిల్లో ఆయన అంతరిక్ష యాత్ర చేశారు. వారం రోజుల్లో భూమిపైకి తిరిగొచ్చారు. అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది? అని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రశ్నించగా.. ‘సారే జహాసే అచ్ఛా’అటూ రాకేశ్ శర్మ బదులిచ్చారు. ఒకవేళ ఆయన ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లి ఉంటే అప్పట్లో చూడని ఎన్నో దృశ్యాలు తిలకించేవారు. ముఖ్యంగా రాత్రిపూట మన ఇండియా ఎలా కనిపిస్తోందో వెల్లడించేవారు. ప్రస్తుతం ఆ అవకాశం శుభాన్షు శుక్లా దక్కింది. ఆయన గురువారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. 1984 నుంచి గమనిస్తే.. గత 41 ఏళ్లలో మన దేశం ఎంతగానో పురోగమించింది. పట్టణీకరణ విపరీతంగా పెరిగింది. రాత్రి సమయంలో చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాలు 2000 సంవత్సరం నుంచి విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అంతకంటే ముందున్న శాటిలైట్ కెమెరాలు ఆధునికమైనవి కావు. రాత్రి సమయంలో ఫొటోలను స్పష్టంగా చిత్రీకరించే సామర్థ్యం వాటికి లేదు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ శాటిలైట్ కెమెరాలు అంతరిక్షం నుంచి ప్రతి దేశాన్ని స్పష్టంగా మన కంటికి చూపగలుగుతున్నాయి. రాత్రిపూట దేదీప్యమానంగా వెలిగే విద్యుత్ దీపాలను బట్టి ఆయా ప్రాంతాల అభివృద్ధిని అంచనా వేయొచ్చు. దేశ ప్రగతితోపాటు సామాజిక, ఆర్థిక మార్పులను ఇవి కొంతవరకు ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదు. విద్యుత్ కాంతి విస్తృతి ఇండియాలో పట్టణీకరణ, అభివృద్ధి ఏ మేరకు జరిగిందో తెలుసుకొనేందుకు శాటిలైట్ చిత్రాల ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ) ఒక అధ్యయనం చేసింది. 2012 నుంచి 2021 వరకు రాత్రి సమయంలో అంతరిక్షం నుంచి ఉపగ్రహాలు చిత్రీకరించిన ఫొటోలు సేకరించి, విశ్లేషించింది. పదేళ్లలో దేశంలో రాత్రిపూట విద్యుత్ కాంతి(నైట్టైమ్ లైట్) విస్తృతి ఏకంగా 43 శాతం పెరిగినట్లు తేలింది. ముఖ్యంగా బిహార్, మణిపూర్, లద్ధాఖ్, కేరళలో ఈ విస్తృతి అధికంగా ఉండడం విశేషం. 2020 సంవత్సరంలో చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. ఇందుకు కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి కారణమని చెబుతున్నారు. 1984 నాటి చిత్రాలను, ఇప్పటి చిత్రాలను గమనిస్తే 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాతే ఇండియాలో పట్టణీకరణ వేగం పుంజుకున్నట్లు స్పష్టమవుతోంది. అంతరిక్షం నుంచి భారత్ అద్భుతం ఇండియన్–అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలపాటు ఉండి, ఏప్రిల్లో భూమిపైకి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపిస్తోందని ఆమె చెప్పారు. హిమాలయ పర్వతాలపై నుంచి వెళ్లినప్పుడల్లా అందమైన చక్కటి ఫొటోలు తీసుకున్నామని తెలిపారు. గుజరాత్, ముంబైలో సౌందర్యవంతంగా కనిపించాయని వెల్లడించారు. -
కుర్చీకి అతుక్కోకు.. రోగాలు తెచ్చుకోకు
రోజులో గంటల తరబడి కూర్చుని ఉండేవాళ్లలో.. అల్జీమర్స్ వంటి మెదడు సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు చాలా ఎక్కువట. అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ మే నెలలో విడుదల చేసిన అధ్యయనం చెప్పిన విషయమిది. ఎక్కువసేపు కూర్చుని ఉండే ఐటీ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్, ఊబకాయం సమస్యలు వస్తున్నాయని ఫిబ్రవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ పరిశోధన వెల్లడించింది. రోజులో 8 గంటలు అంతకుమించి ఎక్కువ సమయం కూర్చుని ఉండిపోయేవాళ్లు మానసిక అనారోగ్యాలు, గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్లు, ఒత్తిడి.. ఇంకా అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. ఎక్కువసేపు కూర్చోవడం అన్నది టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని దాదాపు రెట్టింపు చేస్తుందట. – సాక్షి, స్పెషల్ డెస్క్గంటల తరబడి.. కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగస్తులు, టీవీలకు అతుక్కుపోయేవాళ్లంతా పారాహుషార్. కూర్చున్నంతసేపూ సుఖంగానే ఉంటుంది కానీ.. తరువాత్తరువాత అనారోగ్యాలతో కష్టం తెలుస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు, పరిశోధకులు. ఎక్కువసేపు కూర్చోవడం లేదా శారీరక కదలికలు బొత్తిగా లేకపోవటం అన్నవి శారీరకంగా, మానసికంగా అనేక అనారోగ్యాలకు దారి తీస్తున్నట్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వైద్య పరిశోధకులు గుర్తించారు. ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల కేలరీలు కరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. దాంతో బరువు పెరుగుతారు. జీర్ణక్రియ మందగిస్తుంది. కొవ్వుల్ని, చక్కెరలను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసి, శరీరానికి శక్తిని అందించే సామర్థ్యం తగ్గి అనారోగ్యాలు దరిచేరతాయి.ఎక్కువసేపు కూర్చుంటే వచ్చేవి..హృద్రోగాలు..: రక్త ప్రవాహం తగ్గడం, రక్త నాళాలలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం రక్తపోటుకు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి.టైప్ 2 మధుమేహం..: మన శరీరంలోని క్లోమం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం లేదా శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం లేదా ఈ రెండింటి వల్లా టైప్ 2 మధుమేహం వస్తుంది. దీనివల్ల దాహం, అలసట, మసక దృష్టి, పుండ్లు గాయాల వంటివి నెమ్మదిగా నయమవడం లాంటివి జరుగుతాయి.మస్క్యులోస్కెలెటల్ (అస్థి–కండరాల నొప్పి)..: కోర్ (ఉదరం, వీపు కటిభాగం సహా ప్రధాన దేహం), నడుము, కాళ్ల కండరాలు బలహీనపడతాయి. శరీరంలో కదలికలు కష్టం అవుతాయి. వెన్ను, మెడ దృఢత్వాన్ని కోల్పోతాయి. వెన్నెముక అమరిక దెబ్బతింటుంది.రక్త ప్రసరణ, రక్తనాళ సమస్యలు..: రక్త ప్రసరణ సాఫీగా జరగదు. దాంతో కాళ్లు, పాదాలలో రక్తం ఒక చోట చేరటం జరుగుతుంది. వాపు, కాళ్లలో ఉబ్బిన (వెరికోస్) సిరలు, రక్తం గడ్డకట్టటం లాంటివి సంభవించవచ్చు.కేన్సర్ ప్రమాదం..: పెద్దపేగు, రొమ్ము, మహిళల్లో గర్భాశయ సంబంధ కేన్సర్ల వంటివి వచ్చే ప్రమాదం ఉంది. తగ్గిన రక్త ప్రసరణ, జీవక్రియ మందగమనం కణుతుల పెరుగుదలకు, వ్యాప్తికి దోహదం చేయవచ్చు.మానసిక అనారోగ్యాలు..: ఎక్కువసేపు కూర్చోవటం అన్నది మొదట శరీరంపై ప్రభావం చూపి, మెల్లిగా మానసిక అనారోగ్యాల వైపు కూడా దారి తీయవచ్చు. మెదడు పరిమాణం తగ్గడం, (సెరిబ్రల్ ఎట్రొఫీ) మెదడు కుంచించుకుపోతుంది, మతిమరుపు వస్తుంది.వ్యాయామం చేస్తే సరిపోదా?సరిపోతుంది. అయితే అది కొంతవరకు మాత్రమే. ప్రతిరోజూ 60 నుంచి 75 నిమిషాలు తేలికైన లేదా కఠినమైన వ్యాయామం చేయగలిగిన వారు కూర్చోవడం వల్ల కలిగే అనారోగ్య ప్రమాదాలను కొంత వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఇది వైద్యులు సాధారణంగా సిఫార్సు చేసే దానికంటే ఎక్కువ వ్యాయామం. చాలామంది అంత చేయలేరు కూడా. అంత మాత్రాన నిరాశ చెందనవసరం లేదు. రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయగలిగినా కూడా కూర్చోవటం వల్ల ముప్పిరిగొనే వ్యాధుల నుండి చాలావరకు తప్పించుకోవచ్చు. అయితే, అరగంట వ్యాయామం చేశాం కదా అని 6 గంటలపాటు కదలకుండా కూర్చుంటాం అంటే కుదరదు. రోజంతా కదులుతూ ఉండటం కూడా ముఖ్యమేనని పరిశోధకులు అంటున్నారు. అదే పనిగా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్నచిన్న విరామాలు తీసుకోవాలి. కనీసం అరగంటకోసారి లేచి నిల్చోవడం, కాసేపు నడవడం, ఫోన్ కాల్స్ సమయంలో నడుస్తూ మాట్లాడటం, ఒళ్లు సాగదీసుకోవడం వంటివి చేయాలి.ఏ యూనివర్సిటీ ఏం కనుగొంది?హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) సంయుక్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐటీ ఉద్యోగుల మీద ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించాయి. ఎక్కువసేపు కూర్చోవటం, అధిక పనిగంటలు, పని ఒత్తిడుల కారణంగా వారిలో ఊబకాయం, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం (ఫ్యాటీలివర్ – ఎమ్ఏఎఫ్ఎల్డి) వంటి సమస్యలతో బాధపడుతున్నారట.గంటల తరబడి కూర్చోవడాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఏకంగా ధూమపానంతో సమానమని, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ప్రమాదకరమని పేర్కొంది.ఎక్కువసేపు కూర్చుంటే వచ్చే దుష్ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరిగాయి. ఎలాంటి సమస్యలు వస్తాయని వారు చెప్పారంటే..» యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్ (బ్రిటన్): హృద్రోగాలు, మధుమేహం» యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో (అమెరికా) : చురుగ్గా ఉండే యువతలోనూ గుండె జబ్బులు, ఊబకాయం. » హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (అమెరికా): టైప్ –2 మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్» యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ (బ్రిటన్) : టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు. » ఘెంట్ యూనివర్సిటీ (బెల్జియం) : (12–14 ఏళ్ల పిల్లల్లో) నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తక్కువ సేపు నిద్ర పోవడం» యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ల్యాండ్ (ఆస్ట్రేలియా) : ఊబకాయం, హృద్రోగాలు, టైప్ – 2 డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల కేన్సర్లు -
‘మామిడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టండి’
ఢిల్లీ : దేశంలో అత్యధికంగా మామిడి సాగు జరిగే ఆంధ్రప్రదేశ్లో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని కేంద్రానికి తెలియజేశారు తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు గురుమూర్తి లేఖ రాశారు. ఎంపీ గురుమూర్తి రాసిన లేఖలో పేర్కొన్న అంశాల్లో కొన్ని.. 🔹దేశంలో అత్యధికంగా మామిడి సాగు అయ్యే రాష్ట్రంగా ఏపీ – 12.35 లక్షల ఎకరాల్లో సాగు🔹 చత్తూరు, తిరుపతి జిల్లాల్లో మామిడి సాగు దెబ్బతిన్నది – రైతులు దిగులులో ఉన్నారు.🔹 కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.12 కంటే వాస్తవంగా ధర కేవలం రూ.1 నుంచి రూ.4/kg మాత్రమే అందుతుంది🔹 ధర పతనం వల్ల 52 ప్రాసెసింగ్ యూనిట్లలో 28 మూతపడ్డాయి – వేలాది మంది రైతులకు ఆదాయ నష్టం జరిగింది🔹 దేశ మామిడి ఎగుమతుల్లో 20% మేరకు ఏపీ వాటా ఉన్నప్పటికీ రైతులకు లాభం లేకపోవడం దురదృష్టకరం🔹 తక్షణమే తోటపురి మామిడి కొనుగోలుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి – ఎంపీ విజ్ఞప్తి🔹 మామిడి ధరలు, ఎగుమతులపై సమన్వయం చేసేందుకు ‘జాతీయ మామిడి బోర్డు’ ను తిరుపతిలో ఏర్పాటు చేయాలి🔹 మామిడి పరిశోధన కోసం చిత్తూరులో ‘నేషనల్ మామిడి రీసెర్చ్ స్టేషన్’ ఏర్పాటుచేయాలి🔹 రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి -
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు?
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు నియామకానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు రాబోతున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మరో మూడు నెలల్లోపే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న తరుణంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిపై అధిష్టానం తీవ్రంగా దృష్టి సారించింది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డి స్థానంలో మరొకరి పగ్గాలు అప్పగించేందుకు ఇప్పటికే అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్తో పాటు ధర్మపురి అరవింద్లు ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. దీనిపై అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు, వచ్చే నెల ఒకటో తేదీనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా ఈనెల 30వ తేదీన నామినేషన్ల ప్రక్రియ జరుగనుంది. అదే సమయంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడి నియామకం కూడా జరుగనుంది. ఈ రెండు నామినేషన్ల ప్రక్రియ ఈనెల చివరన నిర్వహించే జూలై 1వ తేదీన కొత్త అధ్యక్షుల్ని ప్రకటించే యోచనలో ఉన్నారు. తెలంగాణ బిజెపి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శోభ కరండ్లాంజె నియమించగా, ఏపీ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పీసీ మోహన్ను నియమించారు. -
సముద్రం ఒడ్డున.. వానరంతో సీఎం.. ఫొటోలు వైరల్
కోల్కతా: ‘సముద్ర తీరంలోని టీ చెప్పలేని బంధానికి దారితీసినప్పుడు’ అనే క్యాప్షన్ జత చేస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఆ ఫొటోల్లో దీదీ.. ఓ వానారానికి బిస్కెట్లు అందించారు. ఆ బిస్కెట్లు తీసుకున్న కోతి ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఉండటానికి గమనించవచ్చు. తన అఫీయల్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు పశ్చిమ బెంగాల్లోని పుర్బా మెదినిపూర్లోని దిఘా బీచ్లో తీసినట్లు ఒక యూజర్ పేర్కొన్నారు. West Bengal CM @MamataOfficial feeds Monkey at Digha Beach . pic.twitter.com/0OehHoHxFk— Syeda Shabana (@JournoShabana) June 26, 2025 -
'కన్నీళ్లు ఉప్పొంగే క్షణం': శుభాంశు తల్లిదండ్రుల భావోద్వేగం
శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి విజయవంతంగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పేరు దేశమంతటా మారుమ్రోగిపోతుంది. ఎక్కడ చూసినా.. ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఆ బృందం 14 రోజుల పాటు చేయనున్న పరిశోధనల గురించే అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరి నోట చూసినా..శుభాంశు శుక్లా పేరే హాట్టాపిక్గా మారింది. 140 కోట్ల పై చిలుకు బారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లిను శుభాంశు బృందం మిషన్ సక్సెస్ అవ్వాలన్నేదే దేశమంతటి ఆ కాంక్ష కూడా. ఈ క్రమంలో యావత్తు దేశం గర్వపడేలా చేసే కుమారుడిని కన్న తల్లిదండ్రుల భావోద్వేగం మాటలకందనిది. అంతరిక్షంలోకి అడుగుపెట్టి తమ కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏ పేరెంట్స్కి అయినా ఇది గర్వంతో ఉప్పొంగే క్షణం. లక్నోలోని తమ ఇంటి నుంచి తమ కుమారుడు శుభాంశు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆక్సియమ్ మిషన్ 4 ఆకాశంలోకి ఎగిసిన విధానాన్ని వీక్షించారు. ముఖ్యంగా శుభాంశు తల్లి ఆశా శుక్లాకి అదంతా చూసి కన్నీళ్లు ఆగలేదు. అయితే అవి ఆనందంతో ఉప్పొంగిన ఆనందభాష్పాలని చెప్పారామె. తమ బంధువులు, సన్నిహితులు స్క్రీన్లకి అతుక్కుపోయి చూస్తున్న విధానం..పట్టరాని ఆనందాన్నిచ్చిందని అన్నారామె. మాటలే రానంతగా గొతు వణుకుతోందామెకు. అలాగే అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి చేరిన వెంటనే గ్రూప్ కెప్టెన్ శుభాంశు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘అంతరిక్షం నుంచి మీ అందరికి నమస్కారం. ఈ యాత్ర చాలా అద్భుతంగా ఉంది. సుమారు 41 ఏళ్ల తర్వాత మనం అంతరిక్షంలోకి తిరిగి వచ్చాం. ఈ అద్భుత యాత్రలో ప్రతి భారతీయుడూ నాకు తోడుగా ఐఎస్ఎస్లో ఉన్న భావనే కలుగుతోంది మీ అందరి ప్రేమ, ఆశీస్సులతోనే ఐఎస్ఎస్ చేరగలిగా. మనమంతా కలిసి ఈ యాత్రను మరింత ఉత్సాహభరితంగా మారుద్దాం. మీ అందరితో పాటు త్రివర్ణ పతాకం వెంట రాగా నాతోపాటు ఐఎస్ఎస్ చేరా. ఇది నా ఒక్కని ఘనత కాదు. భారతీయులందరి విజయం." అని అన్నారు. దానికి అతడి తల్లిదండ్రులు స్పందిస్తూ.. అది కేవలం తమ కుమారుడి దేశభక్తి మాత్రమే కాదు. అది చాలా వ్యక్తిగతమైనది. మా బిడ్డ ఇప్పుడు దేశ జెండా తోపాటు ఆ నక్షత్రాల మధ్య యావత్తు దేశ సామూహిక ఆకాంక్షలను తన భుజాలపై మోస్తున్నాడు. అని భావోద్వేగంగా అన్నారు.కాగా, తమ కుమారుడితో అంతరిక్షంలోనికి వెళ్లడానికి కొన్ని గంటల ముందు ఫోన్లో సంభాషించినట్లు తెలిపారు. నాన్న నా గురించి బాధపడుతూ ఉండిపోవద్దు. దేనికోసం ఇక్కడికి వచ్చానో..ఆ మిషన్ని విజయవంతంగా పూర్తి చేస్తాను అని చెప్పినట్లు శుభాంశు తండ్రి అన్నారు. అలాగే ఆయన అక్క సుచి కూడా 30 సెకన్లపాటు శుభాంశుతో మాట్లాడినట్లు సమాచారం. ఇక శుభాంశు కూడా బాగానే ఉన్నాడని, అతడికి శుభాకాంక్షలు కూడా తెలిపామని చెప్పుకొచ్చారు కుటుంబసభ్యులు. #WATCH | Lucknow, Uttar Pradesh: Parents, relatives of IAF Group Captain & astronaut Shubhanshu Shukla, celebrate as #Axiom4Mission lifts off from NASA's Kennedy Space Centre in Florida, US. The mission is being piloted by India's IAF Group Captain Shubhanshu Shukla. pic.twitter.com/bNTrlAq72r— ANI (@ANI) June 25, 2025 (చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..) -
కోర్టు విచారణలో అర్జంట్గా బాత్రూమ్ వెళ్లాల్సి వస్తే ఎలా?
న్యాయవ్యవస్థపై కనీస గౌరవం ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా?.. నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఘటనపై చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. ఏకంగా టాయిలెట్ సీటుపై నుంచే వర్చువల్ కోర్టు విచారణకు హాజరు కాగా, ఆ తతంగం అంతా రికార్డు అయ్యింది కూడా. అయితే కోర్టు విచారణలో ఉన్నప్పుడు నిజంగా ఇలాంటి అవసరం పడితే ఎలా మరి?గుజరాత్ హైకోర్టు వీడియో విచారణకు ఓ వ్యక్తి టాయిలెట్ సీటుపై కూర్చొని పాల్గొన్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జడ్జి నిర్జర్ దేశాయ్ ఓ చెక్బౌన్స్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు కోసం వాదనలు వింటున్నారు. జూమ్ కాల్ విచారణ(Virtual Hearings) లో టాయిలెట్ సీటు నుంచి హాజరైన వ్యక్తి ఫిర్యాదుదారుడే. కానీ జూమ్కాల్లో పేరు ‘సమద్ బ్యాటరీ’ అని ఉంది. ఆ వ్యక్తి టాయిలెట్ సీటు మీద బ్లూటూత్ హెడ్ఫోన్స్ ధరించి విచారణలో పాల్గొన్నాడు. ఓ పక్క అవతలి పార్టీ, మరోపక్క కోర్టులో లాయర్ వాదనలు వినిపిస్తున్నాడు. ఈలోపు.. ఆ వ్యక్తి ఫోన్ నేలపై ఉంచి శుభ్రం చేసుకున్నాడు కూడా. అటుపై మరో గదికి వచ్చి విచారణలో కొనసాగాడు. జూన్ 20వ తేదీ ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలను న్యాయమూర్తులు అస్సలు ఉపేక్షించరు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలే జరగ్గా.. కోర్టులు తీవ్రంగా పరిగణించాయి కూడా. ఈ ఏడాది మార్చిలో.. ఓ వ్యక్తి లావేటరీ నుంచి కోర్టువిచారణకు హాజరు కాగా.. ఆగ్రహించిన జడ్జి ఆ వ్యక్తికి ₹2 లక్షల జరిమానా, కోర్టు ప్రాంగణం శుభ్రం చేయాలని కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించారు. అలాగే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెడ్పై పడుకుని విచారణలో పాల్గొన్న వ్యక్తికి ₹25,000 జరిమానా విధించారు. 2020లో ఏకంగా ఓ అడ్వొకేట్ విచారణ టైంలో సిగరెట్ తాగుతూ న్యాయమూర్తి ఆగ్రహానికి గురయ్యారు. అయితే కోర్టులకు హాజరైనప్పడు సరైన వస్త్రధారణ మాత్రమే కాదు.. ప్రవర్తన కూడా సవ్యంగా ఉండాలి. కోర్టు హాల్లో విచారణ జరుగుతున్నప్పుడు గంభీరమైన వాతావరణం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో.. న్యాయమూర్తికి అసహనం కలిగించే పనులు చేయకూడదు. ఒకవేళ.. అత్యవసరం పడితే(ఒకటికి, రెంటికి) జడ్జిలకు విజ్ఞప్తి చేస్తే కచ్చితంగా అనుమతిస్తారు. ఒకవేళ సమయం గనుక లేనట్లయితే విచారణ త్వరగతిన పూర్తి చేయాలని లాయర్లకు సూచిస్తారు. వర్చువల్ హియరింగ్స్(వీడియో కాల్స్ విచారణలో)కు ఇదే వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో.. మైక్ను మ్యూట్లో ఉంచడం, కెమెరాను ఆఫ్ చేయడం, లేదంటే తమ లాయర్ల ద్వారా జడ్జిలను రిక్వెస్ట్ చేసుకోవడం ద్వారా అవసరాలను తీర్చుకోవచ్చు. తాజా గుజరాత్ హైకోర్టు ఉదంతంలో అలాంటివేం జరగలేదని తెలుస్తోంది. అంతేకాదు.. సదరు వ్యక్తిపై క్రమశిక్షణా చర్య తీసుకోవడంగానీ, జరిమానా విధిచండంగానీ జరగలేదని సమాచారం.A video showing a man attending Gujarat High Court virtual proceedings while seated on a toilet and apparently relieving himself has gone viral on the social media. Read full story: https://t.co/FbendKMD2M #GujaratHighCourt #VirtualHearings #VideoConferencehearing… pic.twitter.com/spyxMiptiO— Bar and Bench (@barandbench) June 27, 2025 -
పెళ్లికి నిరాకరించిందని.. కాలేజీలోనే లా విద్యార్థినిపై గ్యాంగ్రేప్
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో ఆర్జీకర్ ఆస్పత్రిలో (rg kar medical college and hospital) జూనియర్ వైద్యురాలి ఘటన మరువకముందే.. మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లికి నిరాకరించిందనే అకారణంగా లా కాలేజీలో (Calcutta Law College) న్యాయవిద్యను అభ్యసిస్తున్న లా విద్యార్థినిపై ముగ్గురు విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. కాలేజీ క్యాంపస్లోని సెక్యూరిటీ గార్డు రూమ్లో నిందితులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాధితురాలు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు లా కాలేజీ పూర్వ విద్యార్థి కాగా.. మరో ఇద్దరు పూర్వ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. Kolkata Law student gang-raped inside college campusDo not repost @ravish_journo will get angry if news go viral. pic.twitter.com/Q8sqXyeCmt— Lala (@FabulasGuy) June 27, 2025కోల్కతా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ కోల్కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్ కోల్కతా లా కాలేజీలో జూన్ 25 రాత్రి 7.30 నుంచి 10.30 సమయంలో కాలేజీ క్యాంపస్లోనే లా విద్యార్థినిపై ముగ్గురు నిందితులు గ్యాంగ్రేప్ జరిగినట్లు తెలిపారు. వారిలో ఒకరు మోనోజిత్ మిశ్రా (31) ఆ కాలేజీకి కాలేజీకి అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం యూనిట్ ప్రెసిడెంట్గా పనిచేశారు. టీఎంసీ నేతలతో మిశ్రా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సైతం వెలుగులోకి రావడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం అదే కాలేజీలో లా చదువుతున్న జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20)గా గుర్తించారు. కాళ్లమీద పడ్డా కనికరించని నిందితులుబాధిత విద్యార్థిని ఘటన జరిగిన బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో పరీక్షకు సంబంధించిన ఫారాలను ఫిల్ చేసేందుకు వచ్చారు. ఆ సమయంలో కాలేజీ యూనియన్ రూమ్ లోపల కూర్చున్నారు. అప్పుడే నిందితుడు ఆదేశాలతో గుర్తు తెలియని వ్యక్తులు కాలేజీ మెయిన్ గేటు కాలేజీకి తాళం వేశారు. తరువాత క్యాంపస్లోని సెక్యూరిటీ గార్డు రూమ్లో అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ముగ్గురిలో నిందితుల్లో ఒకరైన మిశ్రా నన్ను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. దీంతో ఇప్పటికే నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా. అంతే మిశ్రా కోపంతో రగిలిపోయాడు. నన్ను ఓ రూమ్లోకి నెట్టి తాళం వేశాడు. నన్ను,నా స్నేహితుడిని చంపేస్తామని, నా తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేయిస్తానని బెదిరించాడు.దారుణం జరుగుతుండా వీడియోలు తీసివద్దని మిశ్రా కాళ్లమీద పడ్డా కనికరించలేదు. గార్డ్ రూమ్కి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దారుణం జరిగే సమయంలో నిందితులు వీడియోలు తీశారు. సహకరించపోతే ఆ వీడియోలను లీక్ చేస్తామని బెదిరించారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా నిందితులు హాకీ స్టిక్తో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయ’ని బాధితురాలి ఫిర్యాదుతో కస్బా పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించి, ఫోరెన్సిక్ పరీక్షల కోసం సంఘటన స్థలాన్ని భద్రపరిచారు.నిందితులకు ఐదురోజుల పోలీస్ కస్టడీజూన్ 26న తల్బాగన్ క్రాసింగ్లోని సిద్ధార్థ శంకర్ రాయ్ శిశు ఉద్యాన్ సమీపంలో మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్లను అరెస్టు చేయగా, జూన్ 27 తెల్లవారుజామున ప్రమిత్ ముఖర్జీని అతని నివాసంలో అరెస్టు చేశారు. ముగ్గురి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం అలీపోర్ కోర్టులోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పద్నాలుగు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తదుపరి దర్యాప్తు కోసం కోర్టు ముగ్గురినీ ఐదు రోజుల పోలీసు కస్టడీకి మంజూరు చేసింది. పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలు గతేడాది ఆగస్టులో కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. లా విద్యార్థిని ఘటన వెలుగులోకి రావడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రతపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. లా కాలేజీలో దుర్ఘటనలో నిందితుల్లో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలక నేతగా వ్యవహరించడంతో అక్కడ రాజకీయ దుమారం చెలరేగింది. ఈ సంఘటనపై అధికార టీఎంసీపై ప్రతిపక్ష బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.స్పందించిన టీఎంసీఈ తరుణంలో లా విద్యార్థినిపై జరిగిన ఘటన నిజంగా సిగ్గుచేటు.అయినప్పటికీ, కాలేజీలు, విద్యాసంస్థలలో పోలీసులను మోహరించడం సాధ్యం కాదు’ అని తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అన్నారు. మహిళా సహోద్యోగులను రక్షించడం పురుష సహోద్యోగుల విధి. కొంతమంది వికృత పురుషులు ఇలాంటి నేరాలు చేస్తారు. ఈ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలు సైతం ఈ తరహా నిందితులపై పోరాడాలి. అది ప్రభుత్వ కళాశాల అయినా.. కళాశాల పరిపాలనపై విభాగంపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులే బాధ్యత వహించాలిఈ సంఘటనపై ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ దారుణానికి పోలీసులే బాధ్యత వహించాలి. కోల్కతాలోని మొత్తం పోలీసులను దిఘా (రథ యాత్రలో)కి పాల్గొన్నారు. కోల్కతా పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు? మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కొనసాగే హక్కులేదని మండిపడ్డారు. কলকাতার কসবা ল' কলেজ ক্যাম্পাসের মধ্যে এক তরুণীর উপর নৃশংস গণধর্ষণের ঘটনায় আমি স্তম্ভিত। এই জঘন্য অপরাধের সঙ্গে জড়িত তিনজন অভিযুক্তের মধ্যে মূল মাথা হিসেবে চিহ্নিত হয়েছে তৃণমূল ছাত্র পরিষদের প্রভাবশালী নেতা মনোজিৎ মিশ্র (৩১)। পুলিশ তাকে গতকাল সন্ধ্যায় তালবাগান ক্রসিংয়ের কাছে… pic.twitter.com/ishPpC7Iui— Suvendu Adhikari (@SuvenduWB) June 27, 2025 బాధితురాలికి అండగా బీజేపీమరో బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ సంఘటనను భయంకరమైనదని అభివర్ణించారు. ఈ నేరాన్ని ఒక మాజీ విద్యార్థి,ఇద్దరు కళాశాల సిబ్బంది, ఒక టీఎంసీ సభ్యుడు సైతం ఉన్నాడని ఆరోపించారు. ఆర్జీ కార్ ఆసుపత్రి సంఘటనను ప్రస్తావిస్తూ..పశ్చిమ బెంగాల్లో మహిళలపై నేరాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా నిలుస్తోందని, నిందితులందరికీ శిక్ష పడేలా చూడాలని అన్నారు. 🔴 RAPE IN A REPUTED LAW COLLEGE IN KOLKATA BY A TMC LEADERAnother shameful chapter has been added to Bengal’s collapsing law and order under TMC rule.▶️ A female student of a prestigious law college in South Kolkata was brutally gang-raped—not in some dark alley, but right… pic.twitter.com/PFVpEOR7Mj— Amit Malviya (@amitmalviya) June 27, 2025 -
రాహుల్, రేవంత్ టార్గెట్గా పీకే ఫైర్.. క్షమాపణ చెప్పాల్సిందే..
పాట్నా: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది. బీహార్ రాజకీయాల్లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ స్పీడ్ పెంచారు. అధికార నితీష్ కుమార్, కాంగ్రెస్ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తాజాగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. బీహార్ పట్ల రాహుల్కు ఉన్న నిబద్ధతను పీకే ప్రశ్నించారు.జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘బీహార్లో అట్టడుగు వర్గాలతో మంచి సంబంధాలు ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారు. బీహార్లోని గ్రామంలో ఒక్క రాత్రి రాహుల్ ఉండాలని సవాల్ చేస్తున్నాను. రాహుల్ రాష్ట్రానికి వస్తున్నారు.. పోతున్నారు. కానీ, ఎలాంటి యాత్రలు చేపట్టడం లేదు. రాహుల్ ఏదైనా ఒక గ్రామంలో ఒక్కరోజు ఉండగలిగితే.. ఆయన వ్యాఖ్యలను నేను అంగీకరిస్తాను. మీరు ఢిల్లీలో కూర్చుని.. బీహారీలను చూసి నవ్వండి. మాకు ఉపన్యాసాలు ఇవ్వడానికి మాత్రం ఇక్కడి రండి అని ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా పీకే టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఆర్ఎస్ఎస్, బీజేపీ, టీడీపీతో సంబంధాలున్నాయి. చివరకు కాంగ్రెస్లో చేరి ముఖ్యమంత్రి కాగలిగారు. సీఎం అయిన తర్వాత ఆయన బీహారీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శ్రమ చేయడం బీహారీల డీఎన్ఏలోనే ఉంది. బీహారీలు శ్రమ చేయడం కోసమే పుట్టారు అంటూ ఆయన మాట్లాడారు. ఆయన ఎందుకు అలా అన్నారు?. బీహారీ ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. బీహారీల ప్రజల పట్ల సంవత్సరాల తరబడి నిర్లక్ష్యం, అగౌరవం ఉంది.Action Should Be Taken Against Revanth Reddy for Insulting Bihar People: Prashant Kishor#RevanthReddy #PrashantKishor #BiharCommentsControversy #RahulGandhi #BiharPolitics #TelanganaCM #PoliticalControversy #BiharElections #RevanthControversy #TeluguNews pic.twitter.com/bWUdcOMxuo— Telangana Ahead (@telanganaahead) June 27, 20251989లో అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ బీహార్ను అభివృద్ధి కేంద్రంగా మారుస్తానని చెప్పారు. ఆ డబ్బు ఎక్కడికి పోయింది?. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి మీరు బీహార్కు ఏం చేశారో మాకు చెప్పండి? అని ప్రశ్నించారు. సిక్కులకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ క్షమాపణ చెబితే.. రాహుల్ గాంధీ బీహార్లో ప్రచారం చేసే ముందు బీహారీలకు కూడా క్షమాపణ చెప్పాలి. బీహారీలు శ్రమ కోసమే పుట్టినట్లయితే, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? తెలంగాణలో ప్రచారం చేసి అక్కడ మీ ఓట్లు పొందండి. బీహార్లో కాంగ్రెస్కు ఉనికి లేదు. రాహుల్ గాంధీకి నిజంగా రాజకీయ బలం ఉంటే, ఆయన బీహార్లో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలి. లాలూ పార్టీలో పొత్తు లేకుండా బరిలో దిగాలి అని సవాల్ విసిరారు. Jan Suraaj Party chief Prashant Kishor said Rahul Gandhi doesn't undertake any yatra in Bihar. pic.twitter.com/rAqPTvDEFO— The Brief (@thebriefworld) June 27, 2025 -
మనం చేసే పని 80 శాతం నాన్ కోర్ వర్కే!!
పని గంటలు.. వర్క్కల్చర్ గురించి ఈ మధ్యకాలంలో విపరీతంగా చర్చ నడుస్తోంది. రంగాలకు అతీతంగా ఈ వ్యవహారంపై ప్రముఖులు సైతం స్పందిస్తుండడం చూస్తున్నాం. అయితే.. ఓ సీనియర్ బ్యూరోక్రట్, అందునా LinkedIn లాంటి ప్రొఫెషనల్ వెబ్సైట్లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ల పని తీరు గురించి చర్చించుకునేలా చేసింది. జైపూర్: రాజస్థాన్ సీనియర్ ఐఏఎస్ అధికారి అజితాభ్ శర్మ (Ajitabh Sharma).. ఇటీవల విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన తాజాగా LinkedInలో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆయన IAS అధికారుల పని విధానంపై కఠినమైన వ్యాఖ్యలు చేశారు.ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి అజితాభ్ శర్మ ఏమన్నారంటే.. ‘‘మన పని 80 శాతం పైగా నాన్-కోర్ వర్క్(ప్రధాన బాధ్యతలు కాని పనులు) మీదే వెచ్చిస్తున్నాం. అవి.. ఇతర శాఖలతో జరిపే సాధారణ సమావేశాలు, మానవ వనరుల సమస్యలు (HR issues), కేసులు..లీగల్ వ్యవహారాలు, సమాచార హక్కు చట్టం (RTI)కు సమాధానాలు, వార్తా కటింగ్స్.. లేఖలపై సమాధానాలు ఇవ్వడం, ఎన్నో రిపోర్టులు తయారు చేయడం ఇవే ప్రధానంగా ఉన్నాయి. ఒక శాఖ యొక్క నిజమైన కోర్ పని చేయడమే సమాజానికి నిజమైన సేవ.. అయితే.. ప్రతీ IAS పోస్టింగ్ను కష్టమైనదిగా అనుకోవడం తప్పుదారి చూపుతోంది. అలాంటి భావనను నేను ఎప్పుడూ నమ్మను. అధికులు అసలు బాధ్యతలను నిర్వహించాల్సిన సమయం లేక విలువైన పని చేసేందుకు అవకాశం కోల్పోతున్నారు. తద్వారా పాలనా వ్యవస్థ నెట్వర్క్లో కొత్తతరహా ఆలోచనలకు తలుపులు మూసేస్తున్నారు అని అభిప్రాయపడ్డారాయన. అజితాభ్ శర్మ వ్యాఖ్యలపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, అధికారుల పనితీరు, శాఖల స్వాతంత్ర్యం వంటి అంశాలపై పలువురు స్పందిస్తున్నారు. ప్రభుత్వం, పాలనా వ్యవస్థలో మార్పు కోరే దిశగా ఒక IAS అధికారే స్పందించిన తీరు.. పరిశీలించదగ్గదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. LinkedInలో తన పోస్టుతో IAS వ్యవస్థలో చెలామణిలో ఉన్న కొన్ని భ్రమలపై అజితాభ్ తీవ్ర విమర్శలు చేశారంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.IAS అధికారులు శాఖానుసారమైన ముఖ్యమైన లక్ష్యాల మీద కాకుండా.. సాధారణ పరిపాలనా ప్రక్రియల్లో బిజీగా ఉంటారని అజితాభ్ ఐఏఎస్ల వర్క్కల్చర్(IAS Work Culture) పోస్టుతో తేటతెల్లమైందని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వ పరిపాలనలో సమర్థత, ఉద్యోగుల స్వయంప్రేరణ, శాఖానుగుణమైన అవగాహన ఎంత అవసరమో గుర్తు చేశాయని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇది పరిపాలనలో నిపుణత, ప్రత్యేకత, వినూత్నతను తగ్గించేలా ఉందని.. ఫలితంగా అధికారుల శక్తి ప్రభావవంతమైన పాలన మీద కాకుండా ‘ఫార్మాలిటీ’గానే మిగిలిపోతోందని మరో యూజర్ విమర్శించారు. అయితే అజితాభ్ శర్మ మాత్రమే కాదు.. గతంలో కూడా కొంతమంది ఏఏఎస్, ఐపీఎస్ అధికారులు పాలనా వ్యవస్థలో ఉన్న లోపాలు, అధికారుల పని ఒత్తిడి, సమర్థత లోపం వంటి అంశాలపై తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ మహిళా ఐఏఎస్ అరుణా సుందరరాజన్ బ్యూరోక్రసీలో ఉన్న ఫైల్ కల్చర్, కొత్త ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్న దృక్పథం గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. శివానందన్ అనే మాజీ ఐపీఎస్.. అధిక బ్యూరోక్రసీ, ఫీల్డ్ వర్క్కు ప్రాధాన్యత లేకపోవడాన్ని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ స్వరూప్ తన పుస్తకాల్లో(Fear of decision-making is the biggest bottleneck in governance), ఇంటర్వ్యూలలో.. ఫైల్ నిబంధనలు, అనవసరమైన నివేదికలు, అన్నింటికి మించి పాలనా వ్యవస్థలో ఉన్న భయాందోళనలు గురించి స్పష్టంగా చెప్పారు. అయితే.. ప్రస్తుతం సర్వీసులో ఉన్న అజితాభ్ శర్మ లాంటి వ్యక్తి.. సూటిగా అదీ LinkedIn వేదికగా, పైగా గణాంకాలతో (80%) పాలనా సంస్కరణల అవసరాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. అజితాభ్ శర్మ గురించి..1996 రాజస్తాన్ కేడర్కు చెందిన అజితాభ్ శర్మ.. ఢిల్లీ ఐఐటీలో బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివారు. భివాడి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అథారిటీ (BIDA)కి ఓఎస్డీగా , జైపూర్ మెట్రో రైల్ కార్పొరేషన్కు చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్గా, ఇన్వెస్ట్మెంట్ & NRI వ్యవహారాలు, BIP, జైపూర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ.. ఇలా పాలనా రంగంల అనేక విభాగాల్లో సేవలందించారు. ఈ మధ్యే విద్యుత్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. -
రథయాత్రలో అపశృతి.. భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు
గాంధీనగర్: గుజరాత్లో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథ యాత్రలో పాల్గొన్న ఒక ఏనుగు ఆగ్రహంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన భక్తులు ఆలయం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో, ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట కారణంగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడడానికి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ రథయాత్ర సందర్భంగా పలు రాష్ట్రాల్లో కూడా జగన్నాథ ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్లోని గోల్వాడలో కూడా భక్తులు రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు 18 ఏనుగులను అక్కడికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగ్రహంతో జనం పైకి దూసుకెళ్లింది.Breaking!🚨Three elephants went out of control during the Jagannath Rath Yatra in Ahmedabad, GujaratHorrifying visuals. #RathaJatra2025pic.twitter.com/W2b7CwHpVw— 𝗩eena Jain (@DrJain21) June 27, 2025 ఇక, సదరు ఏనుగును చూసి పక్కనే ఉన్న ఏనుగులు సైతం ఆగ్రహానికి లోనయ్యాయి. ఒక్కసారిగా అక్కడున్న భక్తులపైకి ఏనుగులు దూసుకెళ్లాయి. దీంతో, ఏనుగులను చూసి అక్కడ ఉన్న వారు భయపడి పరుగులు తీశారు. ఏనుగులు గట్టిగా అరుస్తూ.. అటూ ఇటూ తిరగాయి. ఈ క్రమంలో రథ యాత్ర వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఆ ఏనుగులను కంట్రోల్ చేయడానికి మావటివాళ్లు కూడా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు కాలేదు. ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేసి రథ యాత్రకు సిద్ధం చేశారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది గాయపడినట్టు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. Ahmedabad Rath Yatra ….All people are safe … pic.twitter.com/0rw979Mfxa— €hetu $oN¥ (@chetusony) June 27, 2025🔵During the Rath Yatra in Ahmedabad, an elephant ran out of control. A mishap was narrowly avoided...Jai Jagannath Ji 🙏🙏🙏 pic.twitter.com/fr6Cyx2qSi— THE UNKNOWN MAN (@Theunk13) June 27, 2025 -
వీడియో: తమిళ ‘సింగం’.. రౌడీని పట్టుకునేందుకు ఎస్ఐ పోరాటం
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హీరో సూర్య.. నటించిన సింగం సినిమాలో మాదిరిగా.. రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ను పట్టుకునేందుకు ఓ ఎస్ఐ.. అదే రేంజ్లో ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్లో సదరు ఎస్ఐ చివరకు విఫలమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన అళగురాజా.. మయిలై శివకుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే అళగురాజాపై ఇప్పటికే పలు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సదరు రౌడీ షీటర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. తాజాగా అళగురాజా.. తిరువళ్లూరు జిల్లాలో దాక్కున్నాడని సమాచారం అందడంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో, అతడు ఉన్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.పోలీసుల రాకను పసిగట్టిన అళగురాజా, అతడి బ్యాచ్.. అక్కడి నుంచి పారిపోయింది. వీరంతా ఓ కారులో పారిపోతుండగా వారిని జామ్ బజార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద కుమార్, పలువురు పోలీసులు వెంటాడారు. ఎస్ఐ ఆనంద కుమార్.. వాళ్లు ప్రయాణిస్తున్న కారుపైకి దూకారు. తిరువళ్లూరు-తిరుపతి హైవేపై సదరు ఎస్ఐ.. కారుకు డోర్కు వేలాడుతూ దాదాపు ఒక కిలోమీటర్ వెళ్లారు. కారుతో పాటు ఎస్ఐని అళగురాజా ఈడ్చుకెళ్లారు. అనంతరం, కారు లోపల ఉన్న నిందితులు ఎస్ఐను తోసివేయడంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. అయితే, ఎస్ఐ ఆనంద కుమార్.. హెల్మెట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ కారు నుంచి ఎస్ఐ కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. అనంతరం, ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోసారి రౌడీ షీటర్ అళగురాజా.. పోలీసుల నుంచి తప్పించుకుని పరారీ అయ్యాడు.திருவள்ளுர் அடுத்த திருப்பாச்சூர் பகுதியில் சென்னை ஸ்பெஷல் டீம் போலீசார் முக்கிய வழக்கு ஒன்றில் தொடர்புடைய குற்றவாளியை சினிமாவில் வரும்சண்டைக் காட்சிகளையும் மிஞ்சும் அளவிற்கு துரத்தி சென்றபோது கீழே விழும் காட்சி#Tiruvallur #Chanakyaa pic.twitter.com/x3m4Q7ceJp— சாணக்யா (@ChanakyaaTv) June 26, 2025 -
కేరళలో విషాదం.. భారీ వర్షాలకు కుప్పకూలిన పాత భవనం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. తాజాగా.. త్రిస్సూర్ సమీపంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో 27 మంది భవనంలో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఇప్పటికే 14 మంది బయటకు తీసుకొచ్చింది. తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. శుక్రవారం ఉదయం కొడకర ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలి ముగ్గురు మరణించారు. భవనం పాతదని, అందులో వలస కార్మికులు నివసిస్తున్నారని సమాచారం. మరణించిన ముగ్గురూ పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కార్మికులేనని అధికారులు ప్రకటించారు. మృతులు:రాహుల్ (19) – ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిరుపెల్ (21) – మృతదేహంగా వెలికితీశారుఅలీమ్ (30) – శవంగా గుర్తింపుసుమారు 40 ఏళ్ల భవనం కావడం, లాటరైట్ ఇటుకలతో నిర్మించబడడంతో భారీ వర్షాలకు కూలి ఉంటుందని అధికారులు పప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ బిడ్డింగ్ పక్కనే కొడకర పంచాయతీ కార్యాలయం ఉన్నప్పటికీ.. ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఫైర్, రెస్క్యూ బృందాలు జేసీబీలు, భారీ యంత్రాలు ఉపయోగించి శిథిలాలను తొలగిస్తున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
కాంట్రాక్టర్ హంతకులపై తూటా
దొడ్డబళ్లాపురం: హావేరి జిల్లా శిగ్గాంవి పట్టణంలో రెండు రోజుల క్రితం జరిగిన కాంట్రాక్టర్ శివానంద కున్నూరు (40) హత్య కేసులో నిందితులపై పోలీసులు ఫైరింగ్ చేశారు. నిందితులు అష్రఫ్, నాగరాజు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, వారికి హావేరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హుబ్లి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మూడురోజుల కిందట పట్టపగలు నలుగురు దుండగులు శివానందను కత్తులతో నరికి చంపడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ హత్య వీడియోలు వైరల్ అయ్యాయి.దాగి ఉండగా..పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి వారి కోసం శోధించారు. హానగల్ తాలూకా కొండోజి క్రాస్ వద్ద నిందితులు దాగి ఉన్నట్టు తెలిసి గురువారం తెల్లవారుజామున అరెస్టు చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. శిగ్గాంవి సీఐ సత్యప్ప, ఎస్సై సంపత్ నిందితుల కాళ్లకు షూట్ చేయడంతో గాయాలై దొరికిపోయారు. ఈ ఘటనలో సత్యప్ప, సంపత్, కానిస్టేబుల్ రవికి స్వల్ప గాయాలయ్యాయి. హత్యకు ఆర్థిక వ్యవహారాలు, లేదా అక్రమ సంబంధం కారణమని అనుమానాలున్నాయి. ఇప్పటికే సుదీప్, సురేష్ గౌళి, హనుమంత అనే ముగ్గురు అరెస్టయ్యారు. -
ఎయిరిండియా విషాదం : రూ. 500కోట్లతో టాటా సన్స్ కీలక నిర్ణయం!
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే లండన్ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 12న లండన్కు బయలుదేరిన విమానం (AI-171) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన విషాద సంఘటన 270 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాద బాధితుల కుటుంబీకుల కోసం టాటా సన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల బంధువుల కోసం రూ. 500 కోట్ల ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అటా సన్స్ యోచిస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. విమాన ప్రమాద బాధితుల బంధువులకు ఆర్థిక సహాయం అందించడానికి ఒక ట్రస్ట్ ఏర్పాటుకు టాటా సన్స్ బోర్డు అనుమతులు కోరుతోంది. ఈ ఘోరవిషాదం తర్వాత జరిగిన మొదటి బోర్డు సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ దీని గురించి చర్చించారు.ప్రమాదంలో ప్రభావితమైన వారి కుటుంబాల కోసం టాటా గ్రూప్ తీసుకున్న చర్యల గురించి డైరెక్టర్ల బోర్డుకు వివరిస్తూ, సహాయక చర్యలు త్వరగా అమలు అయ్యేలా చూసుకోవడానికి తాను ఎయిర్ ఇండియాతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నానని చంద్రశేఖరన్ వివరించారు. అలాగే వీరి సహాయార్థం ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేయడానికి టాటా సన్స్ రూ. 500 కోట్ల అంచనా కేటాయింపుతో ఆమోదం కోరుతున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ గతంలో రెండు ప్రత్యేక ట్రస్టులను ఏర్పాటు చేయాలని భావించింది. ఒకటి భారతీయ పౌరుల కుటుంబాలకు, మరొకటి విదేశీ పౌరులకు. ఈ మొత్తాన్ని 271 మంది బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు, వైద్య సంరక్షణ అలాగే ప్రభావితమైన బీజే మెడికల్ కాలేజ్ , సివిల్ హాస్పిటల్ పునరుద్ధరణ కోసం ఉపయోగిస్తారు."టాటా గ్రూప్ చరిత్రలో చీకటి రోజులలో ఒకటి" గా పేర్కొన్న చంద్రశేఖరన్, కంపెనీ తన బాధ్యతల నుండి వెనక్కి తగ్గదని గాయపడిన వారి వైద్య ఖర్చులు, బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణంలో సహాకారం తోపాటు సంబంధిత అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ప్రయాణీకుడి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కాళ్లు, చేతులు కట్టేసి.. డ్రమ్ములో కుక్కేసి..
మరో ఘోర ఉదంతం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. బ్లూ కలర్ డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహాం బయటపడింది. దీంతో యూపీ మీరట్ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. మీరట్లో ఓ మహిళ గంజాయి మత్తులో తూలుతూ.. ప్రియుడి సాయంతో తన భర్తను చంపి మృతదేహాన్ని డ్రమ్ములో దాచిపెట్టిన సంగతి తెలిసిందే.ఛండీగఢ్: మీరట్ ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. పంజాబ్లోని లూధియానాలో ఓ డ్రమ్ములో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మెడ, కాళ్లను తాడుతో కట్టి.. డ్రమ్ములోకి కుక్కిన వైనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జూన్ 25వ తేదీన.. ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి చెత్త ఏరుకుంటుండగా దుర్వాసన వస్తుండడం చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించాడు. వాళ్ల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు డ్రమ్ము నుంచి మృతదేహాన్ని స్వాధీనపర్చుకున్నారు. డ్రమ్ములో ఓ బెడ్షీట్లో మృతదేహం చుట్టి ఉంది. చనిపోయిన వ్యక్తికి 40 ఏళ్ల వయసు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. ఒంటిపై గాయాలు లేవని.. పోస్ట్మార్టం నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు. లోతైన దర్యాప్తు.. డ్రమ్ము కొత్తగా ఉండడంతో.. లూథియానాలో 42 డ్రమ్ము తయారీ యూనిట్లకు, దుకాణాలకు వెళ్లి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసుకుని.. ఈ మధ్యకాలంలో కనిపించకుండా పోయిన వ్యక్తల జాబితాతో మృతుడి వివరాలు సరిపోల్చుకుంటున్నారు. మీరట్ సౌరభ్ రాజ్పుత్ హత్య కేసు ఇలా.. ఫిబ్రవరి 24, 2025:మర్చంట్ నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్పుత్ లండన్ నుంచి తన కుమార్తె పుట్టినరోజు కోసం భారత్కు వచ్చారు. ఫిబ్రవరి 25, 2025:భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి హత్యకు ప్రయత్నించారు. కానీ ఆ రోజు ప్రయత్నం విఫలమైంది. మార్చి 3, 2025:సౌరభ్ను కత్తితో పొడిచి హత్య చేశారుశరీరాన్ని ముక్కలు చేసి, తల, చేతులను వేరు చేశారుశరీర భాగాలను మిక్సర్ గ్రైండర్లో వేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు మార్చి 4-5, 2025సిమెంట్, డ్రమ్ములు కొనుగోలు చేసి శరీర భాగాలను డ్రమ్ములో వేసి సిమెంట్ పోసారుడ్రమ్మును ఇంట్లో దాచారుమార్చి 10, 2025 (సుమారు):డ్రమ్ము నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ అనుమానం వ్యక్తం చేశాడుసౌరభ్ కూతురు ‘‘నాన్న డ్రమ్ములో ఉన్నాడు’’ అని చెప్పినా, మొదట ఎవ్వరూ పట్టించుకోలేదు మార్చి 20–25, 2025:పోలీసులు డ్రమ్మును స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారుఫోరెన్సిక్ బృందం బెడ్షీట్లు, బాత్రూమ్ టైల్స్పై రక్తపు మరకలు గుర్తించిందిసూట్కేస్లో కూడా రక్తపు ఆనవాళ్లు లభించాయి మార్చి 26–27, 2025:ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లా అరెస్టయ్యారుఇద్దరూ నేరాన్ని అంగీకరించారుముస్కాన్కు 2019 నుంచి సాహిల్తో వివాహేతర సంబంధం ఉన్నట్లు వెల్లడించారు ప్రస్తుతం నిందితులిద్దరూ ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా జైలులో ఉన్నారు. ముస్కాన్ ఆరు నెలల గర్భవతి కావడంతో ఆమెను ప్రత్యేక బ్యారక్లో ఉంచారు. ఆమె జైలులో లా చదివే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
భారత్తో బోర్డర్ టెన్షన్స్.. చైనా మంత్రితో రాజ్నాథ్ మాస్టర్ ప్లాన్
బీజింగ్: భారత్, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య సరిహద్దుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీంతో, భారత్ సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సభ్యదేశాల రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్.. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్జున్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, కొత్త సంక్లిష్టతలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.Held talks with Admiral Don Jun, the Defence Minister of China, on the sidelines of SCO Defence Minitsers’ Meeting in Qingdao. We had a constructive and forward looking exchange of views on issues pertaining to bilateral relations. Expressed my happiness on restarting of the… pic.twitter.com/dHj1OuHKzE— Rajnath Singh (@rajnathsingh) June 27, 2025ఈ క్రమంలో 2024లో కుదిరిన బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉండటం, ఉద్రిక్తతలను తగ్గించేందుకు నిరంతర ప్రయత్నాలు, సరిహద్దుల గుర్తింపు-నిర్థారణ లక్ష్యాలను సాధించే విషయంపై చర్చించారు. అలాగే, ఇరు దేశాల మధ్య విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను కొనసాగించడం వంటి నాలుగు అంశాలతో రాజ్నాథ్ ఈ ప్రణాళికను సూచించినట్టు తెలుస్తోంది. దీంతో, రెండు దేశాల మధ్య సరిహద్దుల విషయంలో ఉద్రికత్తలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో చైనా.. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అరుణాచల్లో పలు ప్రాంతాల పేర్లను చైనా మార్చేసింది. దీన్ని భారత్ పలుమార్లు ఖండించింది. -
శుభాంశు వెంట అంతరిక్షంలోకి జ్యోతి, ఉమ, సూర్య.. ఎలా తీసుకెళ్లాడంటే?
ఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయానికి తెరలేచింది. భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లి కెప్టెన్ శుభాంశు శుక్లా మరో చరిత్ర లిఖించారు. గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి విజయవంతంగా ప్రవేశించారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు అది భూమి నుంచి 418 కి.మీ.ల ఎత్తున ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. తర్వాత ఐఎస్ఎస్తో డ్రాగన్ అనుసంధాన (డాకింగ్) ప్రక్రియ కొనసాగాయి. శుభాంశు బృందం ఆనంద హేలను కెమెరాల్లో ఆ క్షణాలను బంధించి భద్రపరిచారు. ఇక, శుభాంశు బృందం 14 రోజులపాటు అక్కడ గడపనుంది. 60కి పైగా వినూత్న ప్రయోగాలు చేసి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది.14 పాటు పరిశోధనలు..అయితే, ఈ అంతరిక్ష ప్రయాణానికి శుభాంశు తనతో పాటు కేరళకు చెందిన జ్యోతి, ఉమ, విజయ్, సూర్యను కూడా తీసుకెళ్లారట. మరి ఈ జ్యోతి, ఉమను శుభాంశు ఎలా తీసుకెళ్లాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటంటే.. శుక్లాతో కూడిన నలుగురు సభ్యుల బృందం ఆక్సియం-4 మిషన్లో భాగంగా 14 రోజుల పాటు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు చేయనున్నారు. ఈ ప్రయోగాల్లో విత్తనాల అధ్యయనం అనేది అతిముఖ్యమైనది. ఈ అంతరిక్ష ప్రయోగంలో ఉపయోగించనున్న అన్ని విత్తనాలు కేరళ నుంచి పంపినవే కావడం గమనార్హం. వీటిని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వెల్లాయణి, పట్టాంబి వంటి ప్రాంతీయ కేంద్రాలు అభివృద్ధి చేశాయి.విత్తనాలను అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో ఉంచి, తిరిగి భూమికి తీసుకొచ్చిన తర్వాత వాటిలో చోటుచేసే మార్పులను అధ్యయనం చేస్తారు. తద్వారా వాతావరణ మార్పులకు తట్టుకునే పంట రకాలను అభివృద్ధి చేయాలన్నది ఈ పరిశోధనల ప్రధాన లక్ష్యం. ఈ అధ్యయనం శాస్త్రీయంగా వాతావరణ మార్పులతో పోరాడేలా విత్తనాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకుల నమ్మకం.ఇంతకీ జ్యోతి, ఉమ ఎవరంటే?జ్యోతి, ఉమ అనేవి కేరళలో చాలా పాపులర్ వరి విత్తనాలు. ఈ రెండు అధిక దిగుబడినిచ్చే వరి రకాలు. వరి సాగు కోసం రైతులు వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. వరి విత్తనాలతో పాటు కింద చెప్పిన సీడ్స్ను కూడా శుభాన్షు తనతో తీసుకెళ్లారు. వీటిని పలుచోట్లలో అభివృద్ధి చేశారు. వ్యోమనౌకలో బరువు పరిమితి కారణంగా ఇస్రో (ISRO), ఈఎస్ఏ (ESA), నాసా (NASA) సూచనల మేరకు ఈ విత్తనాలను తగిన పరిమాణంలో తీసుకెళ్లారు. వరి విత్తనాలు – 20 గ్రాములు, టమాటా, వంకాయ, నువ్వులు, కూట్ల పప్పులు – ఒక్కోటి 4 గ్రాములు చొప్పున తీసుకెళ్లారు.జ్యోతి: (పట్టాంబి పరిశోధన కేంద్రం)ఉమ: (మంకొంబు పరిశోధన కేంద్రం)టమాటా: వెల్లాయణి విజయ్ (వెల్లాయణి వ్యవసాయ కళాశాల)కుట్ల పప్పు: కనకమణి (పట్టాంబి ప్రాంతీయ పరిశోధన కేంద్రం)వంకాయ: సూర్య (త్రిస్సూర్ వ్యవసాయ కళాశాల)నువ్వులు: తిలతార (కాయంకుళం ఓనట్టుకర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది)ఈ ప్రయోగం ఎందుకు?ఈ ప్రయోగం ద్వారా విత్తనాలు అంతరిక్ష పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందిస్తాయి?. ఎలా మనుగడ సాగిస్తాయో తెలుసుకోవచ్చు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత మొలకెత్తించి, వాటిలో సంభవించిన శారీరక, జన్యు మార్పులను విశ్లేషిస్తారు. భారతదేశం ఈ తరహా ప్రయోగాన్ని మొదటిసారిగా చేపడుతోంది. గతంలో చైనా ఇలాంటి ప్రయోగాలు చేసింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి విత్తనాలు అంతరిక్షానికి వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ ప్రయోగం విజయం సాధిస్తే అది కేవలం కేరళకే కాకుండా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి శాస్త్రీయ పురోగతిలో ఓ మైలురాయి అవుతుంది. అటు శుభాంశు సైతం చరిత్రలో నిలిచిపోతారు. ఇదిలా ఉండగా.. ఫాల్కన్ 9 రాకెట్ రాకెట్ లాంచ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు తన భార్య కోసం శుభాంశు ఒక భావోద్వేగమైన లేఖ రాశారు. అందులో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ.. తన ప్రయాణంలో నువ్వులేని లేటుని భర్తీ చేయలేనిది అని భావోద్వేగంగా రాశారు. దానికి శుభాంశు భార్య కామ్నా గర్వంతో కూడిన ప్రేమతో స్పందించారు. అదే సమయంలో, శుభాన్షు తల్లి ఆశా శుక్లా, యాక్సియం మిషన్-4కు ముందు తన కుమారుడికి కోడలు అందించిన మద్దతును ప్రశంసించారు. ‘ఇది మనందరికీ గర్వకారణమైన క్షణం. దేశంలోని త్రివేణి నగర్కు చెందిన ఒక అబ్బాయి ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నాడని అందరూ సంతోషంగా ఉన్నారు. మా కోడలు లేకుండా ఇది సాధ్యం కాదు. ఈ విజయంలో తను అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించింది’ అని ఆమె అన్నారు. -
భవనం టెర్రస్ పైకి యువతి.. రీల్స్ పిచ్చే బలి తీసుకుందా?
బెంగళూరు: తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్లిన ఒక యువతి, నిర్మాణంలో ఉన్న భవనంలోని 13వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం రాత్రి ఆ మహిళ తన స్నేహితుల బృందంతో కలిసి పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ భవనానికి వెళ్లిందని పోలీసులు వెల్లడించారు.పార్టీ మధ్యలో యువతి రీల్స్ కోసం టెర్రస్పైకి వెళ్లింది.. అక్కడ వీడియో తీసుకుంటూ కాలుజారి నుంచి కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు బీహార్కు చెందిన యువతిగా గుర్తించారు. నగరంలోని ఓ షాపింగ్ మార్ట్లో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటననుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అయితే, ఆమె రీల్ షూట్ కోసమే భవనం టెర్రస్పైకి వెళ్లినట్లు చెబుతున్నప్పటికి.. ఆమె ఫోన్ నుంచి అలాంటి రికార్డింగ్ ఏదీ లభించలేదని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. ఆ యువతి ప్రమాదవశాత్తు పడిపోయిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కాసేపట్లో పూరీ రథయాత్ర.. భారీగా తరలిన భక్తులు
భువనేశ్వర్: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్ర కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు పూరీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అంచనావేసిన అధికారులు, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు.ఇక, జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాముడు, వారి చెల్లి సుభద్ర రథాలలో కొలువై భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాది భక్తులు వెంటరాగా ఈ రథాలు జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి రథాలపై తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి.#WATCH | Odisha: Devotees gather in large numbers at Puri's Jagannath Temple for the annual Rath Yatra, which is set to begin today. pic.twitter.com/jOCJphlKVx— ANI (@ANI) June 27, 2025Every single day, at 214 feet high, a priest fearlessly climbs the Jagannath Temple in Puri without ropes or safety - to change the flag. pic.twitter.com/qgqgLgvmX9— urvi (@itsmiling_face) June 26, 2025సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనికి భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని.. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా మందిరం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరోజు యాత్ర తర్వాత మూడు మూర్తులూ ఏడు రోజులపాటు గుండిచా ఆలయంలో విడిది చేస్తారు. తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు.VIDEO | Odisha: Several foreign devotees gather to attend the Jagannath Rath Yatra in Puri. Here’s what one foreign devotee, Premdas, said: “We came from Vrindavan under the guidance of our Gurudev. We feel extremely happy to be in such a sacred place to have the darshan of… pic.twitter.com/8WwwyPIPzX— Press Trust of India (@PTI_News) June 27, 2025 -
వీడియో: నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం
ఉత్తరప్రదేశ్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 2లోని ఓ ప్రైవేట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటన ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.భారీగా మంటలు వ్యాపించడంతో అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా తెలియలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, గత వారం రోహిణిలోని రిథాల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనంలో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.#WATCH | Uttar Pradesh | Updated visuals: A fire breaks out at a private firm in Noida Sector 2. Fire tenders are at the spot. Fire being doused. https://t.co/PJBThX8uSH pic.twitter.com/vPSt1vMoFk— ANI (@ANI) June 27, 2025 -
భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం
వాషింగ్టన్: భారత్తో త్వరలో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చాలారోజులుగా కొనసాగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. ట్రంప్ గురువారం శ్వేతసౌధంలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలో గొప్ప ఒప్పందాలు పట్టాలెక్కబోతున్నాయని, వాటిలో ఒక ఒప్పందం బహుశా ఇండియాతోనే కావొచ్చని పేర్కొన్నారు. అది భారీగానే ఉంటుందని ఉద్ఘాటించారు. వ్యాపారం, వాణిజ్యం విషయంలో ఇండియాతో కలిసి పని చేయబోతున్నామని వివరించారు. ప్రతి దేశంతోనూ తమకు చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అమెరికాతో ట్రేడ్ డీల్ ప్రతి దేశం ఆసక్తి చూపుతోందని అన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొనే పనిలో తమ ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని తెలిపారు. అయితే, ప్రతి ఒక్కరితో ఒప్పందాలకు రావాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు వాణిజ్యం అమెరికాతో తదుపరి వాణిజ్య చర్చల కోసం భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ బృందం గురువారం వాషింగ్టన్కు చేరుకుంది. మధ్యంతర ట్రేడ్ డీల్ను వచ్చే నెల 9వ తేదీ కల్లా ఖరారు చేసుకొనేందుకు ఇరుదేశాలు ప్రయతి్నస్తున్నాయి. ఇండియా ఉత్పత్తులపై ఏప్రిల్ 2న విధించిన అధిక టారిఫ్లను జూలై 9 దాకా ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. గడువులోగా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వ్యవసాయం, పాడి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులపై సుంకాలను చాలావరకు మినహాయించాలని అమెరికా కోరుతుండడం భారత్కు ఇబ్బందికరంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలు, మద్యం, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, కొన్ని రకాల పండ్లు, జన్యుమారి్పడి పంటలపై సుంకాలు భారీగా తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. వ్రస్తాలు, వజ్రాలు, బంగారు అభరణాలు, తోలు ఉత్పత్తులు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, ఆరటి పండ్లపై సుంకాల్లో కోత విధించాలని అమెరికాను భారత్ కోరుతోంది. వాణిజ్య ఒప్పందంలో ఇరుదేశాల డిమాండ్లకు ఏమేరకు ప్రాధాన్యం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి దీన్ని ఏకంగా 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరుదేశాలు పట్టుదలతో ఉన్నాయి. #WATCH | "...We just signed (trade deal) with China. We're not going to make deals with everybody... But we're having some great deals. We have one coming up, maybe with India, a very big one. We're going to open up India. In the China deal, we're starting to open up China.… pic.twitter.com/fJwmz1wK44— ANI (@ANI) June 26, 2025చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం అమెరికా, చైనా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే, ఈ ఒప్పందం వివరాలు బహిర్గతం చేయలేదు. రెండు రోజుల క్రితమే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తాజాగా స్పష్టంచేశారు. అమెరికాతో ఒప్పందం కుదిరిన మాట నిజమేనని చైనా వాణిజ్య శాఖ సైతం ధ్రువీకరించింది. చైనాలోని అరుదైన ఖనిజాలను అమెరికా కంపెనీలు సులభంగా పొందడానికి వీలుగా ఒప్పందానికి రాబోతున్నట్లు రెండు వారాల క్రితం ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, తాజా ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చారా? లేదా? అనేది బయటపెట్టలేదు. అమెరికా కాలేజీల్లో చదువుకుంటున్న చైనా విద్యార్థుల వీసాలను రద్దుచేసే ప్రక్రియను నిలిపివేస్తామని అమెరికా ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల నడుమ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. -
గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి
గుండెపోటుతో 3వ తరగతి బాలుడు మృత్యువాత, తరగతిలో ఆరో తరగతి బాలిక హఠాన్మరణం.. ఇలాంటి బాధాకర ఘటనలు కొన్నేళ్లుగా అధికమయ్యాయి. నూరేళ్ల జీవితం కళ్లముందే ఆవిరైతే కన్నవారి ఆవేదన మిన్నంటుంతోంది. ఈ కడుపు కోతకు పరిష్కారమే లేదా అని ఘోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యనిపుణులు కొన్ని పరిశోధనలు చేసి మొబైల్ఫోన్తో పాటు మరికొన్ని లింకులు ఉన్నట్లు తేల్చారు. కర్ణాటక: హాసన్ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థిని గుండెపోటుతో అర్ధాంతరంగా కన్నుమూసింది. బెంగళూరులో నివాసం ఉంటున్న సుప్రియా (22) గుండెపోటు రావడంతో క్షణాల్లో ప్రాణాలు విడిచింది. దీంతో గత నెలరోజుల్లో గుండెపోటుతో చనిపోయిన హాసన్వాసుల సంఖ్య 14కు పెరిగింది. సుప్రియా హాసన్ జిల్లా హొళెనరసీపుర తాలూకా కట్టళ్లి వాసి, బెంగళూరు బ్యాటరాయనపురలో నివాసం ఉంటూ కర్ణాటక ఓపెన్ వర్శిటీలో డిగ్రీ చదువుతోంది. బుధవారం ఇంటిలో ఉండగా హఠాత్తుగా కుప్పకూలింది. కుటుంబీకులు ఆస్పత్రి తరలిస్తుండగా దారిలో మరణించింది. -
పొద్దున్నే లేవలేను.. పోలీసు ఉద్యోగం వొద్దు!
డియోరియో: పోలీసు శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో యూపీ పోలీసు నియామకాలు మరోసారి నిరూపిస్తున్నాయి. నాలుగు గంటలకు తాను నిద్ర లేవలేనని, ఈ పోలీసు ఉద్యోగం తనకొద్దని చెబుతున్నాడో పోలీసు. ఉత్తరప్రదేశ్లో కొత్తగా కానిస్టేబుల్ నియామకాలు జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి నియామక లేఖలు అందుకున్నారు. అయితే.. శిక్షణ ఐదవ రోజునే ఓ కానిస్టేబుల్ తన తండ్రితో కలిసి డియోరియాలోని ఎస్పీ కార్యలయానికి వచ్చాడు. ఎస్పీ విక్రాంత్ వీర్ను కల్పించాలని కోరాడు. కారణం ఏమిటని ఎస్పీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) డాక్టర్ మహేంద్ర కుమార్ అడగగా.. తనకు ఉదయం త్వరగా నిద్రలేవడం అలవాటు లేదని స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు... ఉదయం 8 గంటల వరకు నిద్రపోయే అలవాటు ఉందని, రోజంతా కఠినమైన శిక్షణ తనకు చాలా కష్టంగా ఉందని వెల్లడించాడు. తన కుమారుడికి బీఎడ్ డిగ్రీ కూడా ఉందని, ఆయన ఉపాధ్యాయుడు కావాలని కోరుకుంటున్నాడని అభ్యర్థి తండ్రి తెలిపాడు. పోలీసు శిక్షణలో శారీరక కఠినత్వం తన కొడుకును పెద్దగా ఉత్సాహపరచలేదని చెప్పాడు. అయితే, కౌన్సెలింగ్ నిర్వహించిన పీఆర్వో మహేంద్ర కానిస్టేబుల్కు నచ్చజెప్పి ఒప్పించాడు. శిక్షణా సెషన్లలో ఇటువంటి సమస్యలు సహజమని, తరువాత అంతా సాధారణంగా ఉంటుందని చెప్పారు. చివరికి మనసు మార్చుకున్న కానిస్టేబుల్ ఎస్పీని కలవకుండానే శిక్షణకు వెళ్లిపోయాడు. -
బ్లాక్బాక్స్ నుంచి డేటా సేకరణ షురూ
సాక్షి, న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో ఈ నెల 12న చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంపై ‘ఎయిర్క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’(ఏఏఐబీ) నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని కేంద్ర పౌర విమానయానశాఖ తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లభించిన బ్లాక్బాక్స్ను ఢిల్లీకి తరలించినట్లు తెలిపింది. ఈ బృందంలో ఒక ఏవియేషన్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఏటీసీ అధికారి, బోయింగ్ విమానాల తయారీ, డిజైన్ను రూపొందించిన అమెరికా సంస్థ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) ప్రతినిధులు ఉంటారని పేర్కొంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లు (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్(ఎఫ్డీఆర్) రెండూ ఏఏఐబీ) ఆధీనంలో ఉన్నాయని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ‘ఈ నెల 25న ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ యుగంధర్ సారథ్యంలోని బృందం ఏఏఐబీ, ఎన్టీఎస్బీకి చెందిన సాంకేతిక సభ్యులు సమాచార వెలికితీత ప్రక్రియను ప్రారంభించారు. ముందుగా బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ (సీపీఎం)ను సురక్షితంగా వెలికి తీశారు. మెమరీ మాడ్యూల్ను విజయవంతంగా తెరిచాం. డేటాను ఏఏఐబీ ల్యాబ్లో డౌన్లోడ్ చేశాం. కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), విమాన డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్) విశ్లేషణ మొదలైంది. ఇది ప్రమాదానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని పునరి్నర్మించడంతో పాటు విమానయాన భద్రతను మెరుగు పరిచేందుకు సహాయపడుతుంది’అని పౌర విమానయాన శాఖ తెలిపింది. -
హిందీని రుద్దితే ఊరుకోం
ముంబై: మహారాష్ట్రలోని స్కూళ్లలో హిందీ భాష బోధనకు వ్యతిరేకంగా పోరాడుతామని శివసేన ‘యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సోదరుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే స్పష్టం చేశారు. గురువారం వీరిద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. బీజేపీ భాష ఆధారంగా ప్రజలను విభజించాలని చూస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. బలవంతంగా హిందీని రుద్దా లని చూస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. మరాఠా మాట్లాడే మహారాష్ట్రలో భాషాపరమైన అత్యవసర పరిస్థితిని తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. హిందీకి తాము వ్యతిరేకం కాదు, హిందీని ద్వేషించడం లేదంటూ.. తప్పనిసరి చేస్తే మా త్రం అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. మరాఠా, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు హిందీని బోధించడంపై ఆయన పైవిధంగా స్పందించారు. స్కూళ్లలో హిందీ బోధనను తప్పనిసరి చేయబోమని సీఎం ఫడ్నవీస్ ప్రకటిస్తేనే ఈ వివాదం సమసిపోతుందని ఠాక్రే తెలిపారు. స్కూళ్లలో హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ముంబైలో జూలై 7వ తేదీన జరిగే నిరసన ప్రదర్శనలో తమ పార్టీ పాల్గొంటుందని ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర విద్యార్థులపై హిందీని బలవంతంగా రుద్దేందుకు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) గురువారం స్పష్టం చేసింది. జూలై 5వ తేదీన ముంబైలోని గిర్గామ్ చౌపట్టి నుంచి ర్యాలీ చేపడతామని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే చెప్పారు. తమకు ఏ రాజకీయ పారీ్టతోనూ సంబంధం లేదన్నారు. హిందీని తప్పనిసరిగా బోధించాలనుకుంటే 5వ తరగతి తర్వాతే అమలు చేయాలని ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్ శరద్ పవార్ సూచించారు. ఒకటో తరగతి నుంచే హిందీని నిర్బంధంగా బోధించాలన్న విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఉద్ధవ్, రాజ్ ఠాక్రే సోదరుల వైఖరిని ఆయన సమరి్థంచారు. మరాఠా భాషకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. దీనిపై వారితో కలిసి ముందుకు సాగుతామన్నారు. మరాఠా భాష కోసం జరిగే నిరసనల్లో తామూ పాల్గొంటామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్థన్ సప్కాల్ తెలిపారు. 1, 2 తరగతులకు పుస్తకాలుండవు ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఎలాంటి పుస్తకాలు ఉండవని పాఠశాల విద్యా శాఖ మంత్రి దాదా భుసే చెప్పారు. ఈ రెండు తరగతుల చిన్నారులకు మౌఖికంగాను పాటలు, చిత్రాల ద్వారా బోధన ఉంటుందన్నారు. ఈ తరగతుల విషయంలో హిందీ ప్రసక్తే లేదని వివరించారు. -
అరిగిపోయిన టైర్లు.. అడుగడుగునా నిర్లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: విమానసంస్థల నిర్లక్ష్యం, విమానాశ్రయాల నిర్వహణ తీరుపై కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. అహ్మదాబాద్లో ఎయిరిండియా డ్రీమ్లైనర్ విషాదం నేపథ్యంలో ఈనె 20, 21వ తేదీల్లో పౌరవిమాన యాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) దేశంలోనే అత్యంత రద్దీ అయిన ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో సేఫ్టీ ఆడిటింగ్ చేపట్టింది. ఒక విమానయాన సంస్థకు చెందిన విమానం టైర్లు పూర్తిగా అరిగిపోయినా దాన్ని అలాగే టేకాఫ్ చేయిస్తున్నట్లు గుర్తించింది. వెంటనే ఆ విమానాన్ని నిలిపివే యాలని అక్కడికక్కడే ఆదేశాలిచ్చింది. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసి ఇలాంటివే పలు లోపాలు డీజీసీఏ ఆడిట్ సమ యంలో అధికారుల దృష్టికి వచ్చాయి. అహ్మదాబాద్లో ఘోర విషాదం జరిగిన తర్వాత కూడా దేశీయ విమా నాయాన సంస్థల నిర్వహణ తీరు మారకపోవడంపై డీజీసీఏ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. నిబంధనలు బేఖాతరు...ఒక ఎయిర్పోర్టులో రన్వేపై ఉండే సెట్టర్ లైన్ మార్కింగ్ కనిపించని విషయాన్ని అధికారులు ఆడిట్లో గుర్తించారు. పైలట్లకు ఈ మార్కింగ్ స్పష్టంగా కనిపించకుంటే రన్వేపై ల్యాండింగ్ చేస్తున్నప్పుడు విమానం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, విమాన సంస్థలు పలురకాల డేటాను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ, చాలావరకు విమానయాన సంస్థలు గత మూడేళ్లుగా అవసరమైన డేటాను అప్డేట్ చేయలేదని తెలిసింది. విమానాశ్రయం లోపల స్పీడ్ గవర్నర్లు లేకుండానే చాలా వాహనాలు నడుస్తున్నట్లు, గ్రౌండ్ హ్యాండ్లింగ్లో కూడా చాలా లోపాలు ఉన్నట్లు ఆడిట్లో గుర్తించారు. విమానం ఒకటైతే.. శిక్షణ మరొకటి...ఒక విమానం నడపడానికి పైలట్కు సిమ్యులేటర్ శిక్షణ ఇస్తారు. పైలట్ ఆ విమానాన్ని నడపడానికి, అందులోని కమాండ్లను అర్థం చేసుకోవడానికి ఈ శిక్షణ ఇస్తారు. అయితే, విమానం ఒకటైతే పైలట్కు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ ఇంకొకటని, అది ఆ విమానం కాన్ఫిగరేషన్తో సరిపోలలేదని సేఫ్టీ ఆడిట్లో వెల్లడైంది. దీంతో, విమాన ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే పైలట్కు దిక్కుతోచని స్థితి తప్పదని తేలింది. ఇంజనీర్లు కూడా లేరు విమానం నిర్వహణ సమయంలో ఇంజనీర్లు కొన్ని ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ మాన్యువల్లను పాటించడం లేదని కూడా ఈ ఆడిట్లో తేలింది. విమానంలో ఏమైనా లోపాలు తలెత్తితే వాటిని సరిచేయడానికి చాలా చోట్ల ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్లు లేరని గుర్తించారు. విమానానికి సబంధించిన మరమ్మతుల రిపోర్ట్ను టెక్నికల్ లాగ్ పుస్తకంలో నమోదు చేయడంలేదని తేలింది. ఈ రికార్డును తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని సైతం డీజీసీఏ సేఫ్టీ ఆడిట్ బృందం గుర్తించింది. -
హిమాచల్ వరదల్లో నలుగురి మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో నలుగురు చనిపోగా సుమారు 20 మంది గల్లంతయ్యారు. కంగ్రా, కులూ జిల్లాల్లో బుధవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టి కారణంగా ఒక్కసారిగా వరదలు వచ్చాయి. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు పనులు చేస్తున్న కార్మికుల కోసం ఆ సమీపంలోనే తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆకస్మిక వరదల్లో కార్మికుల శిబిరాలు కొట్టుకుపోయాయి. నలుగురు చనిపోగా మరో 15 మందికిపైగా గల్లంతై ఉంటారని స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో హిమాచల్ ప్రదేశ్తోపాటు యూపీకి చెందిన వారున్నారు. కొందరిని రక్షించామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎందరనే విషయంలో స్పష్టత లేదు. -
చరిత్ర సృష్టించిన శుభాన్షు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయానికి తెరలేచింది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భారీ ముందడుగు పడింది. 140 కోట్ల పై చిలుకు బారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ నిన్న రోదసిలోకి దూసుకెళ్లి, ఆ ఘనత సాధించిన రెండో భారతీయునిగా నిలిచిన మన వాయుసేనాని గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా (39) నేడు మరోచరిత్ర లిఖించారు. గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి విజయవంతంగా ప్రవేశించారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. శుభాన్షుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఇస్రో, నాసా సంయుక్త వాణిజ్య మిషన్ యాగ్జియం–4లో భాగంగా స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ ద్వారా బుధవారం విజయవంతంగా నింగికెగిసిన విషయం తెలిసిందే. 28 గంటల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించిన అనంతరం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 1 నిమిషానికి అది భూమి నుంచి 418 కి.మీ.ల ఎత్తున ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. తర్వాత రెండు గంటల పాటు తప్పనిసరి తనిఖీలు, ఐఎస్ఎస్తో డ్రాగన్ అనుసంధాన (డాకింగ్) ప్రక్రియ కొనసాగాయి. 12 జతల హుక్కులతో పరస్పరం అనుసంధానమయ్యాయి. తర్వాత డ్రాగన్, ఐఎస్ఎస్ నడుమ సమాచార, ఇంధన లింకేజీ తదితర సంబంధాలు నెలకొన్నాయి. అంతా సజావుగా జరిగిపోయిందని నిర్ధారించుకున్నాక సాయంత్రం 5.44 గంటలకు ఐఎస్ఎస్ మూత తెరుచుకుని తొలుత మిషన్ కమాండర్ పెగ్గీ వాట్సన్ (అమెరికా), ఆ వెనకే శుభాన్షు ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. అనంతరం ఉజ్నాన్స్కీ విస్నేవ్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) వారిని అనుసరించారు. ఐఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాములు వారికి చప్పట్ల నడుమ హార్దిక స్వాగతం పలికారు. వెల్కం డ్రింక్గా మంచినీళిచ్చి సేదదీర్చారు. శుభాన్షు బృందం ఆనంద హేలను కెమెరాల్లో బంధించి భద్రపరిచారు. అనంతరం పరస్పర ఆలింగనాలు, హై–ఫైవ్లు, క్షేమ సమాచారాలు తదితరాలతో ఐఎస్ఎస్ సందడిగా మారింది. శుభాన్షు బృందం 14 రోజులపాటు అక్కడ గడపనుంది. 60కి పైగా వినూత్న ప్రయోగాలు చేసి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది. ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా కొత్త చరిత్ర సృష్టించిన శుభాన్షుకు దేశ నలుమూలల నుంచీ అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వస్థలం లఖ్నవూలో తల్లిదండ్రులు తదితరులు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించారు. హంగరీ, పోలండ్ దేశాల నుంచి ఒక వ్యోమగామి ఐఎస్ఎస్లో ప్రవేశించడం కూడా ఇదే తొలిసారి. 1984లో రాకేశ్ శర్మ అనంతరం అంతరిక్షంలోకి ప్రవేశించిన రెండో భారతీయునిగా శుభాన్షు నిలవడం తెలిసిందే.పాపాయిలా నేర్చుకుంటున్నా ఐఎస్ఎస్ నుంచి శుభాన్షు తొలి పలుకులు ఐఎస్ఎస్లో ప్రవేశించిన క్షణాలను ‘అత్యద్భుతమైనవి’గా శుభాన్షు అభివరి్ణంచారు. తన అనుభూతిని వీడియో లింకేజ్ ద్వారా అందరితోనూ పంచుకున్నారు. ‘‘తొలిసారి సహజమైన, సంపూర్ణమైన భారరహిత స్థితిలో అడుగుపెట్టా. శూన్యంలో తేలిపోతుంటే కలుగుతున్న అనుభూతి వర్ణనాతీతం!. ఇక్కడంతా కొత్త కొత్తగా, గమ్మత్తుగా ఉంది. నేను ఊహించిన దానికంటే కూడా ఎంతో గొప్పగా ఉంది. ఐఎస్ఎస్లో ప్రవేశించాక సజావుగా నుంచోవడం నేను అనుకున్న దానికంటే తేలికగానే ఉంది. కెమెరాలకు పోజివ్వడం వంటివన్నీ కూడా ఎంతో సరదాగా ఉన్నాయి. కాకపోతే తలే కాస్త భారంగా అనిపిస్తోంది. పారాడే పాపాయి మాదిరిగా నడక మొదలుకుని అన్నీ మొదటినుంచి కొత్తగా నేర్చుకుంటున్నా. శూన్య స్థితిలో నన్ను నేను నియంత్రించుకోవడానికి ప్రయతి్నస్తున్నా. చివరికి ఎలా తినాలో కూడా నేర్చుకుంటున్న పరిస్థితి!. ఆ క్రమంలో ఎన్నో తప్పటడుగులూ వేస్తున్నా. ఆ పొరపాట్లను పూర్తిగా ఆస్వాదిస్తున్నా. భారరహిత స్థితి అలవాటు లేక నా సహచరులు చేస్తున్న సరదా తప్పిదాలను కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడి పరిస్థితులకు మెల్లిగా అలవాటు పడుతున్నా. అద్భుత దృశ్యాలను ఆస్వాదిస్తున్నా. అన్ని విషయాలనూ ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నా. కొత్త వాతావరణం. ప్రతి క్షణమూ సరికొత్త అనుభూతులు. సహచరులతో కలిసి ప్రయోగాలు చేపట్టేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని వివరించారు.శూన్యంలో తేలియాడా ప్రయోగం పొడవునా ఎదురైన అనుభూతులను శుభాన్షు ఆసక్తికరంగా వివరించారు. ‘‘బుధవారం గ్రేస్ (డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్కు శుభాన్షు బృందం పెట్టుకున్న పేరు)లో కూర్చుని ప్రయోగానికి సిద్ధమైన క్షణాల్లో నాలో ఒకే ఆలోచన మెదిలింది. ‘సరికొత్త చరిత్ర సృష్టించేందుకు బయల్దేరదాం పదా!’ అని నాకు నేను చెప్పుకున్నా. ప్రయోగం మొదలవగానే ఆ విసురుకు నా సీట్లోకి నొక్కుకుపోయా. రోదసిలోకి ప్రవేశించిన తొలి క్షణాల్లో ఏమంత పెద్దగా తేడా అనిపించలేదు. కానీ కాసేపటికే భారరహిత స్థితి తాలూకు మజా అనుభవంలోకి వచ్చింది. ‘వావ్! సూపర్ కదా!!’ అనిపించింది. ఐఎస్ఎస్ చేరేదాకా ఏకబిగిన 28 గంటల పాటు కదలకుండా కూచుని ఉండటం అలసటగా అని్పంచినా చెప్పలేని అనుభూతిని కూడా పంచింది. కాకపోతే చాలాసేపు నిద్రలోనే గడిపా. దాన్ని గుర్తు చేస్తూ నా సహచరులు ఇంకా నన్నెంతగానో ఆటపట్టిస్తున్నారు కూడా’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు.అంతరిక్షం నుంచి నమస్కారం! ఐఎస్ఎస్తో అనుసంధానం అయ్యేముందు భారతీయులందరినీ శుభాన్షు ఆప్యాయంగా పలకరించారు. ‘అంతరిక్షం నుంచి మీకందరికీ నమస్తే. ఈ అద్భుత యాత్రలో ప్రతి భారతీయుడూ నాకు తోడుగా ఐఎస్ఎస్లో ఉన్న భావనే కలుగుతోంది’ అని శుభాన్షు అన్నారు. ‘‘మీ అందరి ప్రేమ, ఆశీస్సులతోనే ఐఎస్ఎస్ చేరగలిగా. మనమంతా కలిసి ఈ యాత్రను మరింత ఉత్సాహభరితంగా మారుద్దాం. మీ అందరితో పాటు త్రివర్ణ పతాకం వెంట రాగా నాతోపాటు ఐఎస్ఎస్ చేరా. ఇది నా ఒక్కని ఘనత కాదు. భారతీయులందరి విజయం. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష యాత్రకు ఘనమైన ఆరంభం’’ అంటూ శుభాన్షు హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.అరగంట ముందుగానే డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్ అనుకున్న సమయం కంటే అరగంట ముందుగానే ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం వేపాయింట్ 1, 2 వద్ద ఆగకుండా చకచకా ఐఎస్ఎస్ను సమీపించడమే అందుకు కారణం. దానికి 20 మీటర్ల సమీపానికి చేరుకున్నాక డ్రాగన్ తుది అప్రోచ్కు సిద్ధమైంది. లేజర్ ఆధారిత సెన్సర్లు, కెమెరాల సాయంతో ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్ తాలూకు డాకింగ్ పోర్ట్తో సవ్యంగా అనుసంధానమైంది. అనంతరం ఐఎస్ఎస్లోని ఏడుగురు సిబ్బంది డ్రాగన్లో ఏమైనా లీకేజీలు తదితరాలు చోటుచేసుకున్నాయేమో తనిఖీ చేశారు. డ్రాగన్ లోపలి పీడనం ఐఎస్ఎస్తో సమానంగా ఉందని నిర్ధారించుకున్నారు. అలా డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిశాక వ్యోమగాములు ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టారని నాసా ప్రకటించింది. ఇది దేశమంతటికీ గర్వకారణమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. జాయ్.. ఐదో ‘వ్యోమగామి’ శుభాన్షు, మరో నలుగురితో పాటు యాగ్జియం–4 మిషన్ ద్వారా ఐదో వ్యోమగామి ‘జాయ్’ కూడా ఐఎస్ఎస్ చేరింది! అదెవరా అని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి అదొక హంస బొమ్మ!. వ్యోమగాములు జీరో గ్రావిటీ (శూన్య స్థితి)కి చేరగానే వారిని అలర్ట్ చేస్తుందన్నమాట. జీరో గ్రావిటీని సూచించే బొమ్మలను ఇలా అంతరిక్షంలోకి వెంట తీసుకెళ్లడం తొలి రోదసి యాత్రికుడు యూరీ గగారిన్ నాటినుంచీ వస్తున్న ఆనవాయితీ. దానికి కొనసాగింపుగా జాయ్ బొమ్మను యాగ్జియం–4 బృందం తమ వెంట తీసుకెళ్లింది. శుభాన్షు కుమారుని కోసం.. శుభాన్షు కుమారుడు కియశ్కు జంతువులంటే ఉన్న ప్రేమను దృష్టిలో పెట్టుకుని హంస బొమ్మను ఎంపిక చేసుకున్నట్టు యాగ్జియం–4 మిషన్ కమాండర్ వాట్సన్ చెప్పడం విశేషం! పాలను, నీటిని వేరుచేసే హంస భారతీయ సంప్రదాయంలో జ్ఞానానికి అత్యున్నత ప్రతీక అని శుభాన్షు తన సహచర వ్యోమగాములకు వివరించారు. నంబర్ 634 శుభాన్షు అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగామిగా నిలిచారు. అందుకు గుర్తుగా ఐఎస్ఎస్లో ఆయనకు వ్యోమగామి నంబర్ 634 అంటూ అధికారికంగా స్పేస్ స్టేషన్ పిన్ కేటాయించారు. ‘‘నేను ఆస్ట్రోనాట్ నంబర్ 634ను. ఇక్కడ ఉండటం నిజంగా గర్వకారణంగా అనిపిస్తోంది. ఐఎస్ఎస్ నుంచి భూమిని చూసే అవకాశం దక్కిన అతి కొద్ది మందిలో నాకు చోటు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని శుభాన్షు వ్యాఖ్యానించారు. -
టూ వీలర్లపై టోల్ చార్జీలుండవ్: గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు ఎటువంటి టోల్ చార్జీలను తాము విధించడం లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) స్పష్టం చేసింది. జూలై 15 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టూ వీలర్లకు కూడా టోల్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు జాతీయ మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. ఇటువంటి కట్టుకథలు, తప్పుడు వార్తలను ఎవరూ నమ్మొద్దని కోరారు. ‘ద్వి చక్రవాహనాలకు టోల్ రుసుము వసూలు ప్రతిపాదనేదీ మా పరిశీలనలో లేదు. అటువంటి యోచన చేయడం లేదు. టూ వీలర్స్కు టోల్ ఛార్జీలంటూ వచ్చేవన్నీ ఫేక్ వార్తలు’ అంటూ ఎన్హెచ్ఏఐ, మంత్రి గడ్కరీ వేర్వేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. జాతీయ రహదారులపై ఇప్పటి వరకూ ఫోర్ వీలర్స్, భారీ వాహనాలకు మాత్రమే టోల్ వసూలు చేస్తున్నారు. ఈ విధానంలో మార్పునకు కేంద్రం శ్రీకారం చుట్టినట్లు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. దీంతో, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీరును నెటిజన్లు సోషల్ మీడియాలో తప్పుబట్టారు. అసత్యాల ప్రచారంపై ఎన్హెచ్ఏఐ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు స్పష్టతనిచ్చారు. -
మేడిన్ ఇండియా ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ చాలా పురోగతి సాధించింది. దశాబ్దంలో వచ్చిన మార్పును చూస్తే ఔరా అనిపించాల్సిందే. ఇందుకు స్మార్ట్ఫోన్స్ను ఉదాహరణగా చెప్పవచ్చు. యాపిల్ ఫోన్లూ భారత్లో రూపుదిద్దుకుంటున్నాయి. 2014లో దేశంలో వినియోగించిన ఫోన్లలో 30 శాతంలోపు దేశీయంగా అసెంబుల్ అయితే.. 2024 వచ్చే సరికి ఇది 99 శాతం దాటిందంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత దూకుడును అర్థం చేసుకోవచ్చు. ఉపకరణాల తయారీలో వినియోగించే విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్ హబ్’గా అవతరించే దిశగా భారత్ దూసుకుపోతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏటా కొత్త మైలురాళ్లు..మొబైల్ ఫోన్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్.. ఇలా విభాగం ఏదైనా తయారీపరంగా భారత్లో ఏటా కొత్త మైలురాళ్లు నమోదవుతున్నాయి. దేశంలో తయారైన ఎలక్ట్రానిక్స్ విలువ 2014–15లో రూ. 1.9 లక్షల కోట్లుగా ఉంటే 2023–24 నాటికి ఐదురెట్లు పెరిగి రూ. 9.5 లక్షల కోట్లకు చేరుకోవడం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్లో జరుగుతున్న పురోగతికి నిదర్శనం. అయితే మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్ కొత్త రికార్డులకు ప్రధానంగా రూ. 1.9 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కారణం. 2024–25లో భారత్ నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతులు రూ. 2 లక్షల కోట్లు దాటాయి. ఎలక్ట్రానిక్స్ తయారీలో వినియోగించే విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ పథకం ప్రకటించడం ఈ రంగంలో పెద్ద అడుగు పడినట్టు అయింది.ఈసీఎంఎస్తో ఊతం..విడిభాగాల తయారీ కంపెనీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో రూ. 22,919 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం (ఈసీఎంఎస్) ప్రారంభించింది. ఈ పథకం 2031–32 వరకు కొనసాగుతుంది. కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, మల్టీ లేయర్ పీసీబీలు సహా వివిధ విడిభాగాల తయారీని ప్రోత్సహించనుంది. రూ. 59,350 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, రూ. 4.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధించడం, కొత్తగా 91,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఇప్పటికే 70 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 80% చిన్న, మధ్యతరహా కంపెనీలు ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, డిక్సన్ టెక్నాలజీస్ వంటి పెద్ద కంపెనీలు సైతం దరఖాస్తు చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయని సమాచారం. అసెంబ్లింగ్ను మించితేనే..ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదగాలంటే విడిభాగాల తయారీలో దూసుకుపోవాలి. అసెంబ్లింగ్కు పరిమితం కాకుండా తయారీ దిశగా అభివృద్ధి చెందాలన్నది నిపుణుల అభిప్రాయం. మొబైల్ ఫోన్లను తయారు చేయడానికి దేశీయంగా ఉన్న ఎలక్ట్రానిక్ తయారీ సేవలు లేదా కాంట్రాక్ట్ తయారీ కంపెనీలు కెమెరాలు, డిస్ప్లేలు, హై–ఎండ్ బ్యాటరీ ప్యాక్లు, సెమీకండక్టర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల వంటి కీలక భాగాల దిగుమతులపై ఆధారపడుతున్నాయి. ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్లు, వేరబుల్స్, హియరబుల్స్ను సైతం దిగుమతి చేసుకున్న విడిభాగాలతోనే అసెంబుల్ చేçస్తున్నారు. విడిభాగాలు ఇప్పటికీ చైనా, కొరియా, తైవాన్ నుంచి ప్రధానంగా సరఫరా అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల విలువలో దిగుమతుల వాటా ఏకంగా 85–90% ఉందని ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
రాజ్యాంగమే సుప్రీం
అమరావతి(మహారాష్ట్ర): దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందేనని పేర్కొన్నారు. రాజ్యాంగానికి సవరణలు చేసే అధికారం పార్లమెంట్కు ఉన్నప్పటికీ.. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం మాత్రం లేదని గతంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు గుర్తుచేశారు. 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ గత నెలలో ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని అమరావతి పట్టణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనను తాజాగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ అత్యున్నతమని కొందరు చెబుతుంటారని, కానీ, తన ఉద్దేశంలో రాజ్యాంగమే సుప్రీం అని స్పష్టంచేశారు. అలాగే ప్రజాస్వామ్యంలో శాసన, కార్వనిర్వాహక, న్యాయ విభాగాల్లో ఏది అత్యున్నతం అనే చర్చ కూడా సాగుతోందని, నిజానికి రాజ్యాంగం పరిధిలోనే ఈ మూడు విభాగాలూ పనిచేయాలని ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉన్నంత మాత్రాన ఒక న్యాయమూర్తి తనను తాను స్వతంత్రుడిగా భావించుకోవడానికి వీల్లేదన్నారు. పౌరుల హక్కులను, రాజ్యాంగ విలువలను, సూత్రాలను కాపాడాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఉందని, అది అతడి విద్యుక్త ధర్మమని చెప్పారు. -
ఆ 14 రోజులు ఎలా ఉంటుందనేదే అత్యంత ఆసక్తిగా ఉంది: శుభాంశు శుక్లా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లా.. మిగతా 14 రోజులు తాము ఇక్కడ చేసే పరిశోధనే అత్యంత ఆసక్తిని కల్గిస్తుందని స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి కాస్త చిన్నపాటి తలనొప్పిగా ఉన్నప్పటికీ అదేమీ పెద్ద సమస్య కాదన్నాడు. తమ ముందున్న టాస్క్ అనేది చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు శుభాంశు శుక్లా. ‘ ఇది చాలా గర్వించదగ్గ సమయం. మన అంతరిక్షయానంలో ఇదొక మైలురాయి. 14 రోజుల పరిశొధన మాకు అత్యంత కీలకం కానుంది’ అని తెలిపాడు ఐఎస్ఎస్ నుంచి స్పష్టం చేశాడు శుభాంశు.కాగా, అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫలితంగా శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకు ముందు ఐఎస్ఎస్తో స్పేస్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది. 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే, ఇస్రో తరఫున శుభాంశు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద, యాక్సియం-4 మిషన్లో పాల్గొన్న వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది. -
‘ప్రియ’రాలి వల.. ఆపరేషన్ సింధూర్ సమాచారం పాక్కు అమ్మేశాడు!
ఇటీవల కాలంలో పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ ఏదైనా ఉంది అంటే అది.. ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. భారత్ చేపట్టిన ఆ మెరుపు ఆపరేషన్కు పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ఆ యుద్ధం ముగిసింది. ఇక ఎప్పుడైనా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడి భారత్ను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ మళ్లీ ఆరంభమవుతుందనే గట్టి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. అయితే ఫహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు ఆపరేషన్ సింధూర్ వివరాలను పాకిస్తాన్కు భారత్కు చెందిన వ్యక్తి చేరవేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఢిల్లీలోని నావీ డైరెక్టర్ ఆఫ్ ద డాక్యార్డ్లో అప్పర్ డివిజన్ క్లర్క్గా పని చేస్తేన్న విశాల్ యాదవ్ అనే వ్యక్తి.. ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని పాక్కు చేరవేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విశాల్ యాదవ్,. ప్రియురాలి మోజులో పడి ఆ సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. భారత్కు చెందిన ప్రియగా పరిచయమై..భారత్కు చెందిన అమ్మాయిగా, ప్రియా శర్మగా పరిచయం అయిన సదరు అమ్మాయి.. సోషల్ మీడియ ద్వారా విశాల్ను ఆకట్టుకుంది. తాను భారత్కు చెందిన అమ్మాయినంటూ మాయమాటలతో బురిడీ కొట్టించింది. ఈ క్రమంలోనే కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ పరిచయం అలా మొదలై.. వాట్సాప్ వరకూ వచ్చింది. ఈ క్రమంలోనే భారత్ చేపట్టిన పలు ఆపరేషన్ల సమాచారాన్ని విశాల్ నుంచి తస్కరించింది. తొలుత చిన్నా చితకా భారత డిఫెన్స్ వ్యవహారాల సమాచారాన్ని తనకు తెలియకుండానే పాక్కు చేరవేసిన విశాల్.. ఆపై పహల్గాం ఉగ్రదాడి ఘటన, ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని సైతం అమ్మేశాడు. ప్రధానంగా ఆపరేషన్ సింధూరు సమాచారాన్ని రూ. 50 వేలకు అమ్మేసిట్లు తేలగా, మొత్తంగా రూ. 2 లక్షల వరకూ ఇలా సమాచారాన్ని అమ్మి డబ్బులు చేసుకున్నాడు విశాల్.పోలీసులు ఏం చెబుతున్నారంటే..తొలుత ఫేస్బుక్లో విశాల్కు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టి పరిచయయ్యింది. ఒక ఫేక్ ఐడెంటీతో పరిచయం అయిన అమ్మాయి.. భారత్కు చెందిన ప్రియా శర్మగా పరిచయం అయ్యింది. అనంతరం మెల్లగా అతన్ని మాయమాటల్లో పెట్టి, వరుసగా భారత ఆపరేషన్ల సమాచారాన్ని దొంగిలించింది. ఈ క్రమంలోనే విశాల్కు డబ్బులు ఆశపెట్టి మరీ తనపని తాను కానిచ్చేసింది. సీఐడీ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ విష్ణు కాంత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. సమాచారాన్ని పాక్కు చేరవేసినందకు రూ. 2 లక్షల వరకూ విశాల్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో ఆపరేసన్ సింధూర్ సమాచారానికి రూ. 50 వేలు ప్రత్యేకంగా తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. -
షాకిచ్చిన ట్రంప్.. సోషల్ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు!
వాషింగ్టన్: వీసా అభ్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. వీసా అప్లయి దారులు వారి సోషల్ మీడియా అకౌంట్ల వివరాల్ని బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు అభ్యర్థుల వీసా క్యాన్సిల్ చేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. తద్వారా సోషల్ మీడియా అకౌంట్లలో వీసా అప్లయి దారులు ఏ మాత్రం నెగిటీవ్ అనిపించినా అలాంటి వారు అమెరికాలోకి అడుగు పెటట్టడం అసాధ్యం అవుతుంది.ఉదాహారణకు నార్వేకు చెందిన 21ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ అమెరికాలో పర్యాటించాలని అనుకున్నాడు. కానీ మాడ్స్ ఫోన్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బట్టతలతో ఉన్న మీమ్ ఫొటో ఉంది. అంతే ఆ ఫొటొ దెబ్బకు అమెరికాలో పర్యటించే అవకాశాన్ని కోల్పోయాడు. మాడ్స్ తరహాలో భారతీయులు సైతం అమెరికాలో అడుగుపెట్టేందుకు రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోనున్నారు. అందుకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయమే కారణం. ఇంతకి ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా?.అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల మంజూరుపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. వీసాల మంజూరులో పారదర్శకతను పాటిస్తూ వీసా అభ్యర్థుల గుణగణాల్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కొత్త వీసా నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.Visa applicants are required to list all social media usernames or handles of every platform they have used from the last 5 years on the DS-160 visa application form. Applicants certify that the information in their visa application is true and correct before they sign and… pic.twitter.com/ZiSewKYNbt— U.S. Embassy India (@USAndIndia) June 26, 2025 సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త.. లేదంటే నో వీసాఅమెరికా వెళ్లేందుకు వీసా అప్లయి చేసుకునే అభ్యర్థులు వారి ఐదేళ్లకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్ల (సోషల్ మీడియా వెట్టింగ్) వివరాల్ని డీఎస్-160ఫారమ్లో బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. ఆ ఫారమ్లో వీసా కోసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్ వివరాల్ని ఎవరైతే మీరు పొందే కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని వీసా ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఫారమ్లో అభ్యర్థులు వారి సోషల్ మీడియా వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ సోషల్ మీడియా అకౌంట్స్ను చెక్ చేస్తారు. అందులో ఏ మాత్రం తేడా అనిపించినా వీసా ఇవ్వరు.అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించేలాఇక తాజా చర్య ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థుల్ని నియంత్రించే ప్రయత్నాల్లో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతేడాది అమెరికాలోని పలు కాలేజీ క్యాంపస్లలో పాలస్తీనాకు అనుకూలంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం వీసా ప్రక్రియ సమయంలో సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం జాతీయ భద్రతా చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.భారత్లో అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన అందుకు అనుగుణంగా గత సోమవారం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. అందులో 2019 నుండి, యునైటెడ్ స్టేట్స్ వీసా దరఖాస్తుదారులు వలసదారుల, వలసేతర వీసా దరఖాస్తు ఫారమ్లపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్లను అందించాలని కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా, యునైటెడ్ స్టేట్స్కు అనుమతించబడని వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి మేము మా వీసా స్క్రీనింగ్, వెట్టింగ్లో అందుబాటులో సమాచారాన్ని ఉపయోగిస్తాము’ అని రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
మీరు భారతీయుడిలా కాదు.. పాకిస్తానీలా కనిపిస్తున్నారు: కంగనా
న్యూఢిల్లీ: న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేశారు. డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మమ్దానీ గెలుపొందిన తర్వాత అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించగా, కంగనా రనౌత్ సైతం అతని గెలుపును ఉద్దేశిస్తూ మండిపడ్డారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా మమ్దానీ భారతీయుడి కంటే పాకిస్తానీగానే ఎక్కువగా కనిపిస్తున్నాడని ఆరోపించారు కంగనా. @మమ్దానీ తల్లి మీరా నాయర్.. భారత అత్యుత్తమ చిత్ర నిర్మాణ రంగానికి కృషి చేసి పేరు సంపాదించారు. పద్మశ్రీ కూడా గెలుచుకున్నారు. ఆమె న్యూయార్క్లో ఉన్నప్పటికీ భారత్లో పుట్టి పెరిగారు. గుజరాత్కు చెందిన మెహ్మద్ మమ్దానీని మ్యారేజ్ చేసుకుని న్యూయార్క్లో సెటిల్ అయ్యారు. మెహ్మద్ మమ్దానీకి కూడా రచయితగా మంచి గుర్తింపు ఉంది. మరి జోహ్రాన్ మమ్దనీ మాత్రం పాకిస్తానీలాగా కనిపిస్తున్నాడు. భారత మూలాలు ఎక్కడ కనిపించడం లేదు. అతని భారత మూలాల్లో జరిగిందేదో జరిగింది. కానీ మమ్దానీ మాత్రం యాంటీ ఇండియన్ కాబోతున్నాడు’ అని కంగనా రనౌత్ రాసుకొచ్చారు. His mother is Mira Nair, one of our best filmmakers, Padmashri , a beloved and celebrated daughter born and raised in great Bharat based in Newyork, she married Mehmood Mamdani ( Gujarati origin) a celebrated author, and obviously son is named Zohran, he sounds more Pakistani… https://t.co/U8nw7kiIyj— Kangana Ranaut (@KanganaTeam) June 26, 2025 కాగా, 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ డెమొక్రాటిక్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి రేసులో నిలిచాడు. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య సిరియా మోడల్ రమా దువాజీ(rama duwaji). రాజకీయ నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా న్యూయార్క్ మేయర్ రేసు ప్రచారంలో తొలి నుంచి.. ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు. అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్, బెర్నీ సాండర్స్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.అయితే జోహ్రాన్ మమదానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. -
Shubhanshu Shukla: ISSలోకి అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించిన శుభాంశు
సాక్షి,ఢిల్లీ: అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫలితంగా శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. శుభాంశు శుక్లా బృందం యాక్సియం-4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోదనా కేంద్రంలోకి అడుగు పెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకు ముందు ఐఎస్ఎస్తో స్పేస్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. #Ax4's @SpaceX Dragon spacecraft docked with the @Space_Station at 6:31am ET (1031 UTC). Next, the mission crew and our NASA astronauts will prepare to open the hatches. pic.twitter.com/Qj1sgy7RzC— NASA (@NASA) June 26, 2025అమెరికా టూ అంతరిక్షంభారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్గా శుభాంశు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. (Shubhanshu Shukla ‘నిన్నటినుంచి తెగ నిద్రపోతున్నానట’)అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అయ్యింది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)తో కలిసి శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తారు. LIVE: @Axiom_Space's #Ax4 mission, with crew from four different countries, is about to launch to the @Space_Station! Liftoff from @NASAKennedy is targeted for 2:31am ET (0631 UTC). https://t.co/yBgO8bxb6Z— NASA (@NASA) June 25, 202514 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 14 రోజుల పాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనుంది. ఈ ప్రయోగాలు ప్రధానంగా భారరహిత స్థితిలో మానవ శరీరంపై ప్రభావం, పోషకాహార వ్యవస్థలు, జీవనాధార సాంకేతికతలు, రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అలాగే, ఇస్రో తరఫున శుభాంశు ఏడు ముఖ్యమైన ప్రయోగాలు చేస్తారు. దీంతో పాటు నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లోనూ ఆయన పాల్గొంటారు. మొత్తం మీద, యాక్సియం-4 మిషన్లో పాల్గొన్న వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలు చేపడతారు. ఇది ఒకే మిషన్లో అత్యధిక ప్రయోగాలుగా గుర్తింపు పొందుతోంది.రాకేశ్ శర్మ తర్వాత శుభాంశు శుక్లారాకేశ్ శర్మ భారతదేశం తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామి. ఆయన 1984లో సోవియట్ యూనియన్కు చెందిన సోయుజ్ టి-11 రాకెట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆయన మొత్తం 7 రోజులు 21 గంటలు 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన భారతదేశాన్ని అంతరిక్షం నుంచి పరిశీలించి, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు.రాకేశ్ శర్మ తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన రెండో భారతీయుడే ఈ శుభాంశు శుక్లా. నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెడుతున్న సందర్భంలో రాకేశ్ శర్మే తనకు స్పూర్తంటూ శుభాంశు శుక్లా పేర్కొన్నారు. 1984లో రాకేశ్ శర్మను చూసి ఎంతోమంది యువత అంతరిక్షం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఇప్పుడు శుభాంశు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ, తదుపరి తరం భారతీయులకు ప్రేరణగా నిలిచారు. -
odisha: ఘోరం.. పది రోజుల్లో ఐదు అత్యాచారాలు
భువనేశ్వర్: భారతదేశ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి వైభవం, ఆధ్యాత్మిక శోభతో అలరారే రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి కోణార్క్ సూర్య దేవాలయం, పూరీ జగన్నాథ దేవాలయం, చిలికా సరస్సు వంటి అనేక ప్రాచీనమైన, ప్రకృతి శోభతో ఒడిశా ఫరిడవిల్లుతోంది. కానీ ఇటీవల అక్కడ చోటుచేసుకున్న వరుస అత్యాచార ఘటనలు ఆ రాష్ట్ర ప్రాభవాన్ని దెబ్బతీస్తున్నాయి. గడిచిన గత పది రోజుల వ్యవధిలో జరిగిన నాలుగు అత్యాచార ఘటనలు రాష్ట్రంలో మహిళా భద్రతపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.తాజాగా, మయూర్భంజ్ జిల్లా కరంజే ప్రాంతంలో దారుణం జరిగింది. జూన్ 25న ఓ యువతి స్థానికంగా ఉన్న దేవాలయంలో దైవ దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో మాటు వేసిన ముగ్గురు అగంతకులు యువతిపై దాడి చేశారు. అనంతరం, స్థానిక అడవుల్లోకి బలవంతంగా లాక్కెళ్లారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన మలర్పాడ గ్రామానికి చెందిన బికాష్ పాత్రాను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. VIDEO | Bhubaneswar: On Gopalpur gang rape case, Congress leader Shobha Oza (@Shobha_Oza) says, “In one month, three heart-wrenching gang rape cases like Nirbhaya case have come up. Odisha ranks 5th in India in terms of rape cases. In past one year, cases of human trafficking,… pic.twitter.com/9D5FnqAvxw— Press Trust of India (@PTI_News) June 21, 2025 1. గంజం జిల్లా,గోపాల్పూర్ బీచ్,జూన్17 : ఓ యువతి తన స్నేహితుడితో కలిసి గోపాల్పూర్ బీచ్ చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో నిందితులు బాధితురాల్ని స్నేహితుడిపై దాడి చేశారు. అనంతరం, నిందితులు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. మొత్తం 10మంది నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు.2.టెన్తలపాషి గ్రామం, కియోంఝర్ జిల్లా, జూన్ 18: ఉదయం తన ఇంటి సమీపంలో 17 ఏళ్ల బాలికను నిందితులు ఉరితీశారు.దుర్ఘటన జరిగిన ముందు రోజు సాయంత్రం నుంచి ఆమె కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహంపై గాయాలైన గుర్తులు ఉండడంతో బాలికపై దారుణం జరిగినట్లు తేలింది. ఆమె మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరిగిందని కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 3.బరిపడ, మయూర్భంజ్ జిల్లా, జూన్ 19: 31 ఏళ్ల మహిళ భర్త జూన్ 19న బరిపడ సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో నలుగురు నిందితులు ఇంట్లోకి చొరబడి తన భార్యపై అత్యాచారం చేశారని ఆరోపించారు.4. బెర్హంపూర్, గంజాం జిల్లా, జూన్ 25: జూన్ 25న క్లినిక్ యజమాని తనపై అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక ఆరోపించింది. బాధితురాలు బీఎస్సీ (నర్సింగ్) చదవడానికి సహాయం చేస్తానని, ఉచిత వసతి కల్పిస్తానని నిందితుడు కుటుంబానికి హామీ ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు మరియు దర్యాప్తు జరుగుతోంది. -
అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో కీలక పురోగతి
న్యూఢిల్లీ: అహ్మదాబాద్(గుజరాత్) విమాన ప్రమాదం కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. అత్యంత ముఖ్యంగా భావిస్తున్నబ్లాక్బాక్స్(Air India Black Box) నుంచి డేటాను సేకరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.బ్లాక్బాక్స్లో ముందు భాగంలో ఉండే క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్ డాటాను అధికారులు గురువారం రికవరీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) ల్యాబ్లో ఆ డాటాను విశ్లేషిస్తున్నట్లు ఆ కథనాలు వెల్లడించాయి. అలాగే.. కాక్పిట్ వాయిస్ రికార్డర్స్, ఫ్లైట్ డాటా రికార్డర్స్ నుంచి డాటా సేకరించే పనిలో ఉన్నారట. విచారణ కొనసాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది.జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో..బ్లాక్బాక్స్ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్బాక్స్ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆప్షన్లను పరిశీలించిన ఏఏఐబీ.. ఇక్కడే దానిని విశ్లేషిస్తున్నట్లు సమాచారం.బ్లాక్బాక్స్తో..డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్బాక్స్గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్లు 25 గంటలపాటు కాక్పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్బాక్స్లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).జూన్ 12వ తేదీ మధ్యాహ్నాం.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మంది(సిబ్బందితో కలిపి), జనావాసాలపై విమానం కూలి పేలిపోవడంతో మరో 34 మంది స్థానికులు మరణించారు. -
ఉమ్మడి ప్రకటనపై సంతకానికి నో
ఖింగ్డావో: ఆనవాయితీకి భిన్నంగా ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు గురువారం ముగిసింది. 26 మంది పర్యాటకులను బలితీసుకున్న పహల్గాం ఉగ్రవాద దాడితోపాటు భారత్కు వ్యతిరేకంగా కొనసాగుతున్న సీమాంతర ఉగ్రవాదం, ముష్కరుల దాడుల పట్ల భారత్ ఆందోళన గురించి ఈ ప్రకటన ముసాయిదాలో మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడం గమనార్హం. పైగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో స్థానిక వేర్పాటువాద ఉద్యమకారులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక భారత్ హస్తం ఉండొచ్చనే వాదనను ఈ జాయింట్ డాక్యుమెంట్ ముసాయిదాలో పొందుపర్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సంతకం చేసేందుకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఫలితంగా ఏకాభిప్రాయం కుదరలేదన్న కారణంతో ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండానే ఎస్సీఓ సదస్సును ముగించాలని నిర్ణయించారు. చైనాలోని తీరప్రాంత నగరం ఖింగ్డావోలో ఎస్సీఓ దేశాల రక్షణ శాఖ మంత్రుల సదస్సు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. చైనా ఆతిథ్యం ఇచి్చన ఈ సదస్సులో ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు చేపట్టిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.🚨Breaking News: Rajnath Singh refused to sign the SCO joint statement. Why? Pakistan and China tried to weaken the conversation on terrorism. India stood firm on PulwamaAnd Rajnath Singh maintained a strong anti-terror stance#scosummit #RajnathSingh pic.twitter.com/ujsP9JiO9I— Priyanshi Bhargava (@PriyanshiBharg7) June 26, 2025 పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఇండియాలో అశాంతి సృష్టించాలన్న లక్ష్యంతో సీమాంతర పొరుగుదేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని పరోక్షంగా పాకిస్తాన్పై మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ ఆర్థికంగా అండగా నిలస్తోందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధానంగా మార్చుకుందని దుయ్యబట్టారు. ఉగ్రవాదులను ఏరిపారేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాల పాటించొద్దని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశాలపై కఠినంగా వ్యవహరించేందుకు ఏమాత్రం వెనుకాడొద్దని షాంఘై సహకార సంస్థకు సూచించారు. ఉగ్రవాదులను, వారి పోషకులను చట్టం ముందు నిలబెట్టి, శిక్షించాల్సిందేనని తేల్చిచెప్పారు. -
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన బస్సు.. అలకనంద నదిలోకి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. 10 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రుద్ర ప్రయాగ్ జిల్లా ఘోల్తీర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగిపొర్లుతుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక, రక్షణ చర్యలు చేపడుతున్నాయని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.#WATCH | Uttarakhand | One person dead, seven injured after an 18-seater bus falls into the Alaknanda river in Gholthir of Rudraprayag district. Teamsof SDRF, Police and Administration conduct search and rescue oeprationdVideo source: Police pic.twitter.com/dgdznAc0ck— ANI (@ANI) June 26, 2025 -
హేమ కమిటీ రిపోర్టుపై సిట్ సంచలన నిర్ణయం
తిరువనంతపురం: కేరళలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయమై సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఆధారంగా నమోదైన 35 కేసులను మూసి వేస్తున్నట్లు సిట్ తాజాగా కేరళ హైకోర్టుకు తెలిపింది. అయితే, ఆ కేసులకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు బాధితులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాటిని క్లోజ్ చేస్తున్నట్టు సిట్ స్పష్టం చేసింది.మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జస్టిస్ హేమా కమిటీ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిపోర్ట్ దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటైంది. అనంతరం, సిట్.. ఆయా కేసులఫై దర్యాప్తు చేపట్టినప్పటికీ బాధితులు ఎవరూ వాంగ్మూలం ఇచ్చేందుకు మాత్రం ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసులన్నింటినీ మూసివేస్తున్నామని న్యాయస్థానానికి తెలియజేసింది. దీంతో, సిట్ నివేదికపై దర్యాప్తు జరిపిన న్యాయస్థానం.. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. ఆయా కేసులను మూసివేయమని ఆదేశించింది.కమిటీ సంచలన నివేదిక..ఇదిలా ఉండగా.. మలయాళ పరిశ్రమలో కథలు ఎంత వినూత్నంగా ఉన్నా స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. ‘వినీల ఆకాశంలో ఎన్నో రహస్యాలు... చందమామ అందంగా ఉంటుందని.. నక్షత్రాలు మెరుస్తాయని అనుకుంటాం. కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. మీరు చూసేదంతా నిజమనుకోకండి. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అంతే. పైకి కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు. వాటిని వింటుంటే గుండె తరుక్కు పోతుంది. రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదనను అక్షరబద్ధం చేశాం’ అంటూ నివేదికను మొదలు పెట్టారు జస్టిస్ హేమ.ఇదీ నేపథ్యం..దాదాపు ఏడేళ్ల కిందట 2017లో మలయాళనటి భావనా మీనన్పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్స్టార్ దిలీప్ పేరు రావడంతో గగ్గోలు రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు.విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు.ఎదురు ప్రశ్నించకూడదు..‘శరీరాలను అర్పించుకోవాలి.. ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి.. సహకరించిన వాళ్లకు అవకాశాలు. ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు.. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. ‘ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ అని జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది.అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ‘కొత్తగా వచ్చే నటీమణులకు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలం అయ్యారు’ అని కమిటీ తెలిపింది. ‘సినిమా వాళ్లు వేషం ఇస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు. అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ‘ఫేవర్’ చేయాల్సిందే’ అని కమిటీ తెలిపింది.ఆ 15 మంది..కొంతమంది హీరోలు.. మరికొంతమంది దర్శకులు.. ఇంకొందరు నిర్మాతలు.. ఇలా 15మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్టే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది. -
సైబర్ క్రైమ్ కాలర్ ట్యూన్ నిలిపివేత
‘‘సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు, మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావొచ్చు.’’ అంటూ కొద్దిసెకన్లపాటే వచ్చి వాయిస్ వాడేవాళ్లను ఎంత ఇరిటేట్ చేసిందో తెలియంది కాదు. అయితే ఇకపై ఆ గొంతు వినపించదు. అవును..న్యూఢిల్లీ: సైబర్ క్రైమ్ అవగాహన కాలర్ ట్యూన్ను నేటి నుంచి (జూన్ 26, 2025) అధికారికంగా ఆపేశారు. అటు హిందీ భాషలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వాయిస్తో వినిపించిన సందేశాన్ని రావడం లేదు. ప్రజలను సైబర్ మోసాల గురించి హెచ్చరించేందుకు ప్రతి ఫోన్ కాల్కు ముందు ఈ సందేశం వినిపించేది. ఈ కాలర్ ట్యూన్ కేంద్ర ప్రభుత్వ అవగాహన కార్యక్రమంలో భాగంగా రూపొందించబడింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేవలం మూడు నెలల కాలపరిమితితో ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ క్యాంపెయిన్లో టెలికామ్ కంపెనీలు భాగం అయ్యాయి. ఆయా భాషల్లో పలువురితో డబ్బింగ్ చెప్పించి.. వాయిస్ మెసేజ్లను వదిలాయి. అలా.. అన్ని భాషల్లో రోజులో 8 నుంచి 10 సార్లు వాయిస్ వినిపించాయి. తెలుగులో మిర్చి అమృత వాయిస్ ఇచ్చినట్లు ఆ మధ్య ఓ వీడియో కూడా వైరల్ అయ్యింది. అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటుడి వాయిస్ను ఈ క్యాంపెయిన్లో భాగం చేశారు. View this post on Instagram A post shared by Amritha Pasumarthi (@mirchi_amritha)అయితే.. అత్యవసర పరిస్థితుల్లో కాల్ ఆలస్యం అవుతోంది అనే కారణంతో చాలా మంది వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి కూడా. మరోవైపు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్కు కూడా అమితాబ్ బచ్చన్ గురయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రభుత్వం చెప్పిందే చేశానని, ఏమైనా చెప్పదల్చుకుంటే సర్కార్కే చెప్పాలంటూ బచ్చన్ సాబ్ అసహనం వ్యక్తం చేశారు. ఈలోపే ప్రభుత్వం ఆ క్యాంపెయిన్ను ముగించడం గమనార్హం. అంతకు ముందు.. కరోనా కాలర్ ట్యూన్ విషయంలోనూ బిగ్బీపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. -
పార్లమెంట్ కాదు.. రాజ్యాంగమే సర్వోన్నతం
మన దేశంలో కొంతమంది పార్లమెంటే సుప్రీం అని అంటారు. కానీ, నావరకైతే రాజ్యాంగమే దేశానికి సర్వోన్నతం అని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్(CJI BR Gavai) అన్నారు. పార్లమెంట్కు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం మాత్రమే ఉందన్న ఆయన.. రాజ్యాంగపు మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తన స్వస్థలం అమరావతి(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత మంది దేశానికి పార్లమెంటే అత్యున్నతమైందని భావిస్తారు. కానీ, నా వరకైతే న్యాయ(judiciary), శాసన(legislature), కార్యనిర్వాహక (executive) వ్యవస్థల్లో ఏదీ గొప్పది కాదు. రాజ్యాంగమే సర్వోన్నతం. ఎందుకంటే..పార్లమెంట్కు రాజ్యాంగంలో సవరణలు చేసే హక్కు మాత్రమే ఉంది. కానీ, మౌలిక నిర్మాణాన్ని మార్చే హక్కు మాత్రం లేదు’’ అని అన్నారాయన.జడ్జి ఎలా ఉండాలంటే..ఒక న్యాయమూర్తి కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల స్వతంత్రుడు అవ్వలేడు. తాము కేవలం అధికారం ఉన్నవాళ్లం అని మాత్రమే కాకుండా, పౌర హక్కులు, రాజ్యాంగ విలువలను సంరక్షించాల్సిన బాధ్యతగల వాళ్లమని న్యాయమూర్తులు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రజలు తమ తీర్పుల గురించి ఏమనుకుంటారో? ఎలా స్పందిస్తారో? అనే విషయాలపై ప్రభావితం కాకూడదు. స్వతంత్రంగా ఆలోచించాలి. ప్రజలు ఏమంటారన్నది నిర్ణయ ప్రక్రియలో భాగం కావాల్సిన అవసరం లేదు.బుల్డోజర్ జస్టిస్ తీర్పు గురించి..నా పని గురించి నా తీర్పులతోనే మాట్లాడుకునేలా చేస్తాను. రాజ్యాంగంలో స్థిరపరిచిన మూల హక్కుల పట్ల గౌరవంగా నిలబడతా. ఈ సందర్భంగా.. బుల్డోజర్ జస్టిస్ తీర్పును(కిందటి ఏడాది నవంబర్ 13న ఇచ్చిన తీర్పును) ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజలకు ఆశ్రయం (నివాసం) హక్కు అత్యున్నతమైనది అని పేర్కొన్నారాయన.భారత సుప్రీంకోర్టు బుల్డోజర్ జస్టిస్పై 2024 నవంబర్ 13న కీలక తీర్పు వెల్లడించింది. నేరారోపణలు ఉన్న వ్యక్తుల ఇళ్లను విచారణ లేకుండానే కూల్చడం చట్ట విరుద్ధం అని జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన బెంచ్ స్పష్టం చేసిందిఆర్కిటెక్ట్ కావాలనుకున్నా..అలాగే.. తన బాల్యంలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు. తాను నిజానికి ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నప్పటికీ, తన తండ్రి మాత్రం న్యాయవాదిగా అవ్వాలని ఆకాంక్షించారని గవాయ్ చెప్పారు. నిజానికి నా తండ్రికి కూడా న్యాయవాది అవ్వాలన్న ఆశ ఉండేది. కానీ ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని అరెస్టు కావడంతో అది సాధ్యపడలేదు’’ అని తెలిపారాయన. గవాయ్ తండ్రి సూర్యభాన్ గవాయ్ అంబేద్కర్వాదిగా రాజకీయాల్లో రాణించారు. బిహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు కూడా.రాజ్యాంగంపై బీఆర్ గవాయ్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ ప్రాముఖ్యతను, పార్లమెంట్ సహా అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
పాక్కు రాజ్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్.. దెబ్బకు చైనా సైలెంట్!
బీజింగ్: చైనా గడ్డపై దాయాది దేశం పాకిస్తాన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చుక్కలు చూపించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్టు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ భారత్ హక్కు అని కుండబద్దలు కొట్టారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు అని చెప్పుకొచ్చారు.చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(SCO) రక్షణ మంత్రుల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ మాట్లాడుతూ..‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదు. పలు దేశాలు (పరోక్షంగా పాకిస్తాన్) ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ఎస్సీఓ అలాంటి దేశాలను విమర్శించడానికి వెనుకాడకూడదు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు. అలాంటి వారి చేతుల్లో విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కోడానికి నిర్ణయాత్మకమైన చర్య అవసరం. సామూహిక భద్రత కోసం ఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఐక్యం కావాలి’ అని పిలుపునిచ్చారు.#WATCH | Qingdao, China | At the SCO Defence Ministers' meeting, Defence Minister Rajnath Singh says, "It is my pleasure to be here in Qingdao to participate in the SCO Defence Ministers meeting. I would like to thank our hosts for their warm hospitality. I would also like to… pic.twitter.com/c9SyHOaZDp— ANI (@ANI) June 26, 2025ఇదే సమయంలో రాజ్నాథ్.. ఇటీవల జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని గురించి కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదులకు దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి కూడా వివరించారు. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించడానికే భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మా దేశంపై ఉగ్రదాడులు జరిగిన కారణంగా.. ఆపరేషన్ చేపట్టాం. ఆపరేషన్ సిందూర్ భారత్ హక్కు. ఉగ్రవాదుల విషయంలో మేము సహనంతో ఉండే అవకాశమే లేదు. ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడబోం. మన యువతలో రాడికలైజేషన్ వ్యాప్తిని నిరోధించడానికి కూడా మనం సరైన చర్యలు తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు.Defence Minister @rajnathsingh attends the SCO Defence Ministers’ Meeting in Qingdao, China.Mr Singh says India’s zero tolerance for terrorism is manifest today through its actions. This includes our right to defend ourselves against terrorism. We have shown that epicentres of… pic.twitter.com/Hy2W98l7uT— All India Radio News (@airnewsalerts) June 26, 2025ఇదిలా ఉండగా.. ఎస్ఈవో రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రాజ్నాథ్ సింగ్ చైనా వెళ్లారు. 2020లో గల్వాన్ లోయ వివాదం తర్వాత నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి చేసిన మొదటిసారిగా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని రాజ్నాథ్ చెప్పుకొచ్చారు. ఇక, గురువారం సమావేశం ప్రారంభమయ్యే ముందు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి సభ్య దేశాల రక్షణ మంత్రులు గ్రూప్ ఫోటో కోసం సమావేశమయ్యారు. -
వెండి కంచాల్లో విందు.. వివాదంలో బీజేపీ సర్కార్
ముంబై: మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై కొత్త వివాదం నెలకొంది. ప్రభుత్వం వృథా ఖర్చులపై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ కార్యక్రమంలో అతిథులకు భారీ ఖర్చుతో వెండి పళ్లెంలో ఆహారం వడ్డించడం వివాదాస్పదంగా మారింది. అంత ఖర్చు చేసి వెండి ప్లేట్లలో వడ్డించాల్సిన అవసరమేంటని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై వేదికగా పార్లమెంట్ అంచనాల కమిటీ ప్లాటినం జూబ్లీ సమావేశం జరిగింది. ముంబైలోని విధాన్ భవన్ కాంప్లెక్స్లో రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది అతిథులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అతిథులకు విలాసవంతమైన హోటల్లో వెండి ప్లేట్లలో, భారీ ఖర్చుతో భోజనం వడ్డించారు. దీంతో, ఈ ఘటన వివాదానికి దారి తీసింది. అతిథులు ఒక్కొక్కరికి రూ.550 చొప్పున అద్దెకు తీసుకున్న వెండి డిన్నర్ ప్లేట్లపై రూ.5,000 విలువైన భోజనం వడ్డించారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది.ఈ సందర్బంగా కాంగ్రెస్ శాసనసభా నాయకుడు విజయ్ వాడేట్టివార్స్ స్పందిస్తూ..‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఇంత ఖర్చు చేసి వెండి ప్లేట్లపై అతిథులకు వడ్డించడం ఎందుకు?. విలాసవంతమైన విందు ఎందుకు ఇచ్చారు. దీని కోసం దాదాపు 27 లక్షలు ఖర్చు చేశారు. ఇదంతా వృథా ఖర్చే కదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయలేదు. బోనస్లు చెల్లించడం లేదు. అనేక సంక్షేమ పథకాల్లో కోతలు విధించారు. కానీ, ఇలాంటి ఖర్చులు చేయడానికి మాత్రం బీజేపీ ప్రభుత్వం వెనుకాడదు అంటూ చురకలు అంటించారు.While enjoying ₹4,500 meals served in silver platters with royal Peshwa-style flair, and staying in luxury hotels like Taj and Trident, members of the Estimates Committee proclaimed in the conference that,“Estimates Committees must ensure that every rupee is spent for public… pic.twitter.com/mMwjbCkWGv— Vijay Kumbhar (@VijayKumbhar62) June 25, 2025మరోవైపు.. ఈ సమావేశంపై సామాజిక కార్యకర్త కుంభార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన..‘రాజ పేష్వా శైలి వైభవంతో వెండి ప్లేట్లతో అతిథులకు భోజనం వడ్డించారు. తాజ్, ట్రైడెంట్ వంటి లగ్జరీ హోటళ్లలో అంచనాల కమిటీ సభ్యులు బస చేశారు. అంచనాల కమిటీ అంటే ప్రతీ రూపాయిని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడం కోసం ఆలోచించాలి. కానీ, ఇలాంటి దుబారా ఖర్చులు చేయడమేంటి?. ఇలాంటి వారు.. ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. 5000 ఖర్చు చేసే భోజనం పెట్టి వెండి ప్లేట్ల కోసం 27 లక్షలు ఖర్చు చేశారు’ అని మండిపడ్డారు.అయితే, కాంగ్రెస్ నేతలు, పలువురు ఆరోపిస్తున్నట్టు అవి వెండి ప్లేట్లు కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేవలం వెండి పూత మాత్రమే ప్లేట్లకు పూసి ఉందని అంటున్నారు. అలాగే, భోజనం ఖర్చు కూడా 5000 కాదని తక్కువగా ఉందని వ్యాఖ్యలు చేశారు. -
భర్తను కాదని భార్య వేరే యువకుడితో..
కర్ణాటక: ఓ యువకుడు తమ ప్రియురాలిని చంపి తన పొలంలోనే మృతదేహాన్ని పాతిపెట్టిన అమానుష ఘటన జిల్లాలోని కరోటి గ్రామంలో జరిగింది. హాసన జిల్లా హొసకొప్పలు గ్రామానికి చెందిన ప్రీతి అనే యువతి హత్యకు గురైంది. పునీత్ అనే యువకుడే హత్య చేసిన నిందితుడు. ప్రీతికి వివాహమై పిల్లలున్నా పునీత్ వెంటపడింది. గత ఆదివారం మండ్య, మైసూరులకు ట్రిప్ వెళ్లిన ఇద్దరూ జాలీ జాలీగా సమయాన్ని గడిపారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు. కేఆర్ పేటె కత్తరఘట్ట అడవిలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత పునీత్ ఆమెను చంపి బంగారు ఆభరణాలను దోచుకుని ఆమె మృతదేహాన్ని తమ పొలంలోనే పాతిపెట్టి పరారయ్యాడు. ప్రీతి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పునీత్ పట్టుబడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పునీత్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రీతి పెళ్లయి పిల్లలు ఉన్నా పునీత్ వెంటపడి తనువు చాలించగా తల్లిని కోల్పోయి పిల్లలు అనాథలయ్యారు. -
బిహార్ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్లో
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఏడాది అక్టోబర్ తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి తుది ఓటరు జాబితాను ప్రకటించిన వెంటనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని ఈసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 243 మంది సభ్యులున్న బిహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 22వ తేదీన ముగుస్తోంది. ఈ నేపథ్యంలో అప్పటిలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ యోచిస్తోంది. ప్రస్తుతం బిహార్లో వచ్చే నాలుగు నెలల్లోగా ఓటర్ల జాబితా ఖరారుపై ఒక షెడ్యూల్ను కేంద్రం విడుదల చేసింది. -
మరో 25 మంది తెలంగాణ వాసులు ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ: ఇజ్రాయిల్, ఇరాన్ నుంచి మరో 25 మంది తెలంగాణవాసులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వారిలో ఇరాన్ నుంచి ఏడుగురు, ఇజ్రాయిల్ నుంచి 18 మంది ఢిల్లీకి చేరుకున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీ నుంచి వారంతా స్వస్థలాలకు చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణభవన్ సిబ్బంది ఎయిర్పోర్టులో తగిన సహాయ, సహకారాలు అందిస్తున్నారన్నారని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ చొరవ కారణంగా ఇప్పటివరకు ఇజ్రాయిల్, ఇరాన్ల నుంచి మొత్తం 48 మంది క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారని తెలిపింది. -
ఘనంగా రెండో అడుగు
న్యూఢిల్లీ: భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, దేశమంతా ఊపిరి బిగబట్టి మరీ ఎదురుచూస్తున్న చరిత్రాత్మక క్షణాలు ఎట్టకేలకు రానే వచ్చాయి. యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. మర్చిపోలేని ఆ క్షణాలను రోదసి నుంచే దేశవాసులందరితో పంచుకుని మురిసిపోయారు. ‘ప్రియమైన నా దేశవాసులారా! నమస్తే’ అంటూ భుజాన త్రివర్ణ పతాకం ధరించి భావోద్వేగానికి లోనయ్యారు. అంతరిక్ష ప్రవేశ యాత్ర అద్భుతంగా సాగిందంటూ సంభ్రమాశ్చర్యాల నడుమ పేర్కొన్నారు. జైహింద్, జై భారత్ అంటూ రోదసి సాక్షిగా నినదించారు. శుభాన్షు స్వస్థలం లఖ్నవూ నుంచి ప్రయోగాన్ని ఆద్యంతం వీక్షించిన ఆయన తల్లిదండ్రులు ఆనందాశ్రువులు రాల్చారు. తమ కుమారుడు చరిత్ర సృష్టించాడంటూ పరవశించిపోయారు. కేంద్ర మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమై శుభాన్షు ఘనతను ప్రస్తుతించింది. దేశపతాకను ఆయన అత్యున్నత స్థాయిలో రెపరెపలాడించారంటూ ప్రశంసించింది. రాజకీయ తదితర రంగాల ప్రముఖులు తదితరుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అవనుంది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)తో కలిసి శుభాన్షు ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. యాగ్జియం–4 ఇస్రో, నాసా సంయుక్త మద్దతుతో రూపొందిన వాణిజ్య అంతరిక్ష యాత్ర.మిషన్ గ్రేస్ మిస్టర్ శుక్స్ ఐఎస్ఎస్లో ఉన్నంతకాలం శుభాన్షును శుక్స్ అనే సంకేత నామంతో పిలవనున్నారు. అలాగే తమ యాగ్జియం–4 వ్యోమనౌకకు కూడా వ్యోమగాములు నలుగురూ గ్రేస్ అని పేరు పెట్టుకున్నారు. విజయవంతంగా అంతరిక్షంలో చేరిన అనంతరం వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘ఓపికతో వేచి చూసేవారికి అంతా మంచే జరుగుతుంది. గ్రేస్ సిబ్బంది తొలి యాత్రను దేవుడు అన్నివిధాలా వెంట ఉండి నడిపించు గాక’’ అంటూ యాగ్జియం–4 బృందానికి స్పేస్ ఎక్స్ శుభాకాంక్షలు తెలిపింది.వందేమాతరం నుంచి... ‘యూ హి చలా చల్’ దాకా అంతరిక్ష యాత్రకు బయల్దేరే ముందు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి వ్యోమగాములు తమకు నచి్చన సంగీతాన్ని, పాటలను ఆస్వాదించడం ఆనవాయితీ. అలా యాగ్జియం–4 యాత్రకు బయల్దేరే ముందు శుభాన్షు హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘ఫైటర్’ సినిమాలోని తనకెంతో ఇష్టమైన వందేమాతరం పాటను విన్నారు. ఐఎస్ఎస్లో ఆస్వాదించేందుకు వీలుగా పలు పాటలతో కూడిన ప్లే లిస్ట్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. అందులో షారుక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని సూపర్హిట్ రోడ్డు పాట ‘యూ హి చలా చల్ రాహీ, కిత్నీ హసీఁ హై ఏ దునియా (అలా సాగిపో యాత్రికా, ఈ ప్రపంచమెంత అందమైనదో!) తదితర పాటలు అందులో ఉన్నాయి. ప్రయోగానికి ముందు శుభాన్షు ఎక్స్ పోస్టులో ఈ మేరకు వెల్లడించారు. యాదృచి్చకంగా స్వదేశ్ సినిమాలో షారుక్ కూడా నాసా సైంటిస్టు కావడం విశేషం.చిన్ననాటి కల సాకారం! గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్ఎస్లో అడుగుపెట్టబోతున్న ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. రాకేశ్ శర్మ అంతరిక్షంలో కాలుమోపిన ఏడాదికి, అంటే 1985లో ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్నవూలో శుభాన్షు జని్మంచారు. బాల్యంలో ఒక ఎయిర్ షో చూసినప్పటి నుంచే ఆకాశంపై మనసు పారేసుకున్నారు. విమానాలు, వాటి వేగం, వాటి శబ్దాలు తన బుల్లి మనసులో శాశ్వతంగా తిష్ట వేసుకుపోయాయి. పైలట్ కావాలని అప్పుడే తీర్మానించుకున్నారాయన. నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చేరి తన కల నిజం చేసుకున్నారు. 2006లో భారత వాయుసేనలో చేరారు. పదేళ్ల పై చిలుకు కెరీర్లో 2 వేల గంటల పైచిలుకు ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఆయన సొంతం. సుఖోయ్–30 ఎంకేఐ, మిగ్–29తో పాటు జాగ్వార్, డోర్నియర్–228 వంటి పలు యుద్ధ విమానాలు నడిపారు. ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్గా చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్లో ఎంటెక్ చేశారు. 2027లో ఉద్దేశించిన గగన్యాన్ మిషన్ కోసం 2019లో కేంద్రం ఎంపిక చేసిన నలుగురు ఆస్ట్రొనాట్ల బృందంలో శుభాన్షు ఒకరు. అంతరిక్ష యాత్ర నిమిత్తం తొలుత బెంగళూరులో, తర్వాత రష్యాలో గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో కఠోరమైన శిక్షణ పొందారు. యాగ్జియం–4 మిషన్కు పైలట్గా కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏకాగ్రత, సునిశిత బుద్ధి తిరుగులేనివని సహచర వ్యోమగాములు కూడా కితాబిచ్చారు. ...అలా ఎన్డీఏలోకి శుభాన్షు పేరు ఇప్పుడిలా దేశమంతా మారుమోగుతోందంటే ఆయన ఎన్డీఏలో చేరి వాయుసేన పైలట్ కావడమే ప్రధాన కారణం. అయితే ఎన్డీఏలో శుభాన్షు ప్రవేశం అనుకోకుండా జరిగిందని ఆయన తండ్రి గుర్తు చేసుకున్నారు. ‘‘శుభాన్షు స్కూల్మేట్స్ ఎన్డీఏ పరీక్ష రాసేందుకు దరఖాస్తు ఫారాలు తీసుకొచ్చారు. కానీ వారిలో ఒకరికి వయోపరిమితి దాటిపోయింది. దాంతో శుభాన్షును రాస్తావా అని అడిగాడు. మావాడు వెంటనే సరేనన్నాడు. అలా పరీక్ష రాసి ఎన్డీఏకు సెలక్టయ్యాడు’’ అంటూ వివరించారు. తమకైతే శుభాన్షు సివిల్స్ రాసి కలెక్టర్ కావాలని ఉండేదని వెల్లడించారు. తల్లిదండ్రుల ఆనంద నృత్యం శుభాన్షు అంతరిక్షయాత్రను వీక్షించి ఆయన తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. యాగ్జియం–4 ప్రయోగాన్ని లఖ్నవూలో శుభాన్షు విద్యాభ్యాసం చేసిన సిటీ మాంటెసొరీ స్కూల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా వారు వీక్షించారు. యాత్ర విజయవంతం కాగానే తోటివారందరితో కలిసి భాంగ్రా నృత్యం చేస్తూ ఆనందం పంచుకున్నారు. ప్రాంగణమంతా చప్పట్లతో, ‘హిప్ హిప్ హుర్రే’, ‘భారత్మాతా కీ జై’ నినాదాలతో మార్మోగిపోయింది. తమకివి మరపురాని క్షణాలని శుభాన్షు తండ్రి శంభూ శుక్లా అన్నారు. ‘‘ఇవి ఆనందాశ్రువులు. ఇంతకన్నా మాట్లాడేందుకు నాకు మాటలే రావడం లేదు’’ అని తల్లి ఆశా చెప్పారు. తన కొడుకు ఇలాంటి ఘనత సాధిస్తాడని ముందే తెలుసన్నారు. యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రయోగానికి ముందు కుమారునికి ఆమె వర్చువల్గా చక్కెర కలిపిన పెరుగు తినిపించి నోరు తీపి చేశారు. తమ విద్యార్థి భారత కీర్తిని అంతరిక్షం దాకా చేర్చాడంటూ స్కూలు టీచర్లు తదితరులు కూడా హర్షం వెలిబుచ్చారు.నాడు ‘సారే జహా సే అచ్చా’ స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి ప్రవేశించిన రెండో భారతీయునిగా శుభాన్షు శుక్లా నిలిచారు. సోవియట్ యూనియన్ సల్యూట్–7 స్పేస్ మిషన్లో భాగంగా రాకేశ్ శర్మ 1984లో 8 రోజుల పాటు అంతరిక్ష యాత్ర చేయడం తెలిసిందే. అక్కడినుంచి భూమి ఎలా కన్పిస్తోందన్న అప్పటి ప్రధాని ఇందిర ప్రశ్నకు బదులుగా ‘సారే జహా సే అచ్చా’ అంటూ రాకేశ్ శర్మ ఇచ్చిన భావోద్వేగపూరిత సమాధానంతో జాతి యావత్తూ ఉప్పొంగిపోయింది.ప్రయోగానికి ముందూ సమస్యలే యాగ్జియం–4 ప్రయోగ వేళ సమీపించగానే సహచర వ్యోమగాములతో కలిసి శుభాన్షు నెల రోజుల క్వారెంటైన్ నుంచి బయటికొచ్చారు. ఒక్కొక్కరుగా వ్యోమనౌకలోకి ప్రవేశించారు. రాకెట్ తాలూకు ఒక తీగ వేలాడుతుండటంతో పాటు పలు సమస్యలను గమనించి అప్పటికప్పుడు సరిచేశారు. మే 29న జరగాల్సిన ఈ ప్రయోగం రాకెట్ సమస్యలతో పదేపదే వాయిదా పడుతూ వచ్చింది.14 రోజులు, 60 ప్రయోగాలు శుభాన్షు తన ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 14 రోజుల పాటు గడుపుతారు. ఈ సందర్భంగా భారరహిత స్థితిలో వారు దాదాపు 60 ప్రయోగాలు నిర్వహిస్తారు. వాటిలో ఆహారం, పౌష్టికత సంబంధిత ప్రయోగాలు కూడా ఉన్నాయి. వాటిని నాసో మద్దతుతో ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ రూపొందించాయి. శుభాన్షు కోసం ఇస్రో ఏడు ప్రయోగాలను సిద్ధం చేసి ఉంచింది. సూక్షభార స్థితిలో మెంతులు, పెసలు ఎలా మొలకెత్తుతాయో ఆయన పరీక్షించి చూడనున్నారు. ప్రధానితో, పిల్లలతో మాటామంతి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ప్రధాని మోదీతో శుభాన్షు మాటామంతి జరపనున్నారు. అలాగే పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులతో పాటు అంతరిక్ష రంగ నిపుణులు, సంస్థల సీఈఓలు, దిగ్గజాలతో కూడా ఆయన తన అనుభవాలను పంచుకుంటారు.క్యారెట్ హల్వా, మామిడి రసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భారతీయ వంటకాల ఘుమఘుమలాడనుంది. భారత పాక ప్రావీణ్యానికి అద్దం పట్టే కూరలు, అన్నం, మామిడి రసం వంటివాటిని శుభాన్షు ఐఎస్ఎస్కు వెంట తీసుకెళ్లారు. ‘‘తనకు క్యారెట్, పెసరపప్పు హల్వా అంటే చాలా ఇష్టం. వాటితోపాటు మరెన్నో మా ఇంటి రుచులను వెంట తీసుకెళ్లాడు. తోటి వ్యోమగాములకు కూడా రుచి చూపిస్తానని చెప్పాడు’’ అని శుభాన్షు సోదరి శుచి తెలిపా రు. ఇతర వ్యోమగాములు పప్రికా పేస్ట్ (హంగరీ), ఫ్రీజ్–ఫ్రైడ్ పైరోజీస్ (పోలండ్) వంటి వంటకాలను తమతో పాటు తీసుకెళ్లారు.నింగిని నెగ్గి, తారలు తాకి శుభాన్షుకు వాయుసేన అభినందనలు యాగ్జియం–4 మిషన్ను భారత్కు ఓ అది్వతీయానుభూతిగా వాయుసేన అభివరి్ణంచింది. ‘‘వాయుసేన యోధుడు గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా చరిత్రాత్మక అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టారు. నింగిని నెగ్గుతూ తారల్ని తాకుతూ దేశ గౌరవాన్ని, ప్రతిష్టను తనతోపాటు సగర్వంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లారు’’ అంటూ అభినందించింది. ఆయన ప్రొఫైల్ ఫొటోను షేర్ చేసింది. ‘నీలిదుస్తుల్లో (వాయుసేన యూనిఫాంను ఉద్దేశించి) శిక్షణ, చుక్కలకేసి పయనం’ అంటూ అందమైన క్యాప్షన్ జోడించింది. ‘ఈ అద్భుత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం’ జాతీయ పతాకంలోని మూడు రంగులతో కూడిన అక్షరాలతో మరో సందేశాన్ని పోస్టు చేసింది. కేంద్ర మంత్రివర్గం అభినందనలు దేశ ఆకాంక్షలను మోసుకెళ్లారు: మోదీ యాగ్జియం–4 మిషన్ విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆశలు, ఆకాంక్షలను శుభాన్షు తనతో పాటు అంతరిక్షంలోకి మోసుకెళ్లారన్నారు. ‘‘ఐఎస్ఎస్లో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా నిలవనున్న గ్రూప్ కెప్టెన్ శుక్లాకు, ఇతర వ్యోమగాములకు శుభాభినందనలు’’ అంటూ ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన సారథ్యంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై శుభాన్షుకు అభినందనలు తెలిపింది. యాగ్జియం–4 యాత్ర దిగి్వజయం కావాలని ఆకాంక్షించింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ చదివి విని్పంచారు.సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారు: ఖర్గేశుభాన్షు సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఆయన యాత్ర సఫలమవాలన్నారు. -
ఆ ఐదింటిలో... టాప్–10లో భారత్
సాక్షి, స్పెషల్ డెస్క్ : కీలకమైన ఐదు ప్రధాన సాంకేతిక రంగాల్లో భారత్ టాప్–10లో చోటు సంపాదించింది. ఈ రంగాల్లో ప్రపంచంలోని 25 ప్రధాన దేశాల సామర్థ్యాలను తెలియజేస్తూ హార్వర్డ్ కెన్నడీ స్కూల్కు చెందిన బెల్ఫర్ సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్’ అనే సూచీని రూపొందించింది. ఏఐ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్స్, అంతరిక్షం, క్వాంటమ్ టెక్నాలజీ విభాగాల్లో దేశాల తయారీ సామర్థ్యం, సాంకేతిక పురోగతి, ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరుల వంటి అంశాల ఆధారంగా దేశాలకు స్థానాలు కేటాయించారు.ఏఐలో దూసుకుపోతూ..కృత్రిమ మేధ విభాగంలో భారత్ దూసుకుపోతోందని చెప్పాలి. దేశంలో ఏఐ వినియోగం.. అమెరికా, యూకేలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 90% మంది ఏదో ఒక విధంగా ఏఐని వాడుతున్నారు. దేశంలో ఏఐ యూజర్ల సంఖ్య 72 కోట్లు దాటింది. ‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్’ ఏఐ విభాగంలో జపాన్ , తైవాన్ , దక్షిణ కొరియా కంటే మనం ముందున్నాం. బయో టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో భారత్ అగ్రదేశాల సరసన చోటు దక్కించుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మనమే ప్రపంచంలో నంబర్ వన్. ఈ సూచీలోని బయోటెక్నాలజీ విభాగంలో ఫ్రాన్స్, తైవాన్ , దక్షిణ కొరియాలను మనం అధిగమించాంసిలికాన్ వేఫర్ల ఉత్పత్తిలో.. సెమీకండక్టర్ల తయారీలో వాడే సిలికాన్ వేఫర్ల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం మూడో స్థానంలో ఉన్నాం. ప్రపంచ చిప్ వినియోగంలో 10 శాతం వాటా భారత్ కైవసం చేసుకుంది. చిప్ డిజైన్ సౌకర్యాలలో ప్రపంచంలో 7% మాత్రమే భారత్ కలిగి ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని డిజైన్ ఇంజనీర్లలో దాదాపు 20% మంది భారత్లోనే ఉన్నారు. వీరిలో అత్యధికులు యూఎస్, యూరప్ సంస్థల కోసం పనిచేస్తున్నారు. ఈ సూచీలో సెమీకండక్టర్స్ విభాగంలో మనం ఫ్రాన్స్కంటే ముందున్నాం. 5వ అతిపెద్ద సంస్థగా ఇస్రోఅంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలో 5వ అతిపెద్ద సంస్థగా ఇస్రో చోటు సంపాదించింది. ప్రపంచంలో మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ‘మంగళ్యాన్’ ప్రాజెక్టు ద్వారా అంగారకుడిపైకి అడుగుపెట్టిన దేశం భారత్. ఈ సూచీలో అంతరిక్ష విభాగంలో జపాన్ , దక్షిణ కొరియా, తైవాన్ కంటే మనదేశం ముందుంది. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అత్యధిక పేటెంట్లకు దరఖాస్తు చేసిన దేశాల్లో మనదేశం 9వ స్థానంలో ఉంది. ఈ సూచీలో క్వాంటమ్ టెక్నాలజీలో తైవాన్, దక్షిణ కొరియాలను భారత్ మించిపోవడం గమనార్హం.ఏయే అంశాల ఆధారంగా స్కోర్ను నిర్ణయించారంటే...ఏఐటాప్ మోడల్స్ కచ్చితత్వం, డేటా, ఆల్గరిధమ్స్, కంప్యూటింగ్ పవర్, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు.బయోటెక్నాలజీ జన్యు ఇంజనీరింగ్, ఔషధాల తయారీ, వ్యాక్సిన్ పరిశోధన, వ్యవసాయ సాంకేతికత, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, భద్రత, ఆర్థిక వనరులు.సెమీకండక్టర్స్అసెంబ్లింగ్, టెస్టింగ్, ఎక్విప్మెంట్, తయారీ–ఫ్యాబ్రికేషన్ , చిప్ డిజైన్ – టూల్స్, ప్రత్యేక ముడిపదార్థాలు–వేఫర్స్, నియంత్రణ, అంతర్జాతీయంగాస్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు. స్పేస్రిమోట్ సెన్సింగ్, టెలికమ్యూనికేషన్ ్స, పొజిషనింగ్–నావిగేషన్ –టైమింగ్, సైన్ ్స– అంతరిక్ష పరిశోధన, దేశీయంగా అంతరిక్ష ప్రయోగ సామర్థ్యం, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు క్వాంటమ్క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ , సెన్సింగ్,ప్రభుత్వ విధానాలు, అంతర్జా తీయంగా స్థానం, మానవ వనరులు, భద్రత, ఆర్థిక వనరులు. -
వైరల్ వీడియో: యువతులపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్!
ముంబై: ముగ్గురు యువతులు బైక్పై త్రిబుల్ రైడింగ్ చేసూకుంటూ వెళుతున్నారు. స్కూటీని వేగంగా, ప్రమాదకరంగా మలుపులు తిప్పుతూ డ్రైవ్ చేస్తున్నారు. ఆ సమయంలో తన కుమార్తెను ట్యూషన్ కాలేజీకి తీసుకెళ్తున్న ఓ మహిళా ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని ఆపి, తల్లిలా మందలించింది. కానీ వెరసి మహిళా కానిస్టేబుల్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ అమ్మాయిల విషయంలో తాను చేసింది తప్పేనంటూ బహిరంగంగా క్షమాపణాలు చెప్పాల్సి వచ్చింది. ఇంతకి ఏం జరిగిందంటే?మహరాష్ట్ర లాతూర్ సిటీలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ప్రణిత ముస్నే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిని త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువతులపై చేయి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.రెనాపూర్ నాకా వద్ద చిత్రీకరించిన ఈ వీడియోలో.. కానిస్టేబుల్ ప్రణిత ముస్నే యువతులను మాటలతో దూషిస్తూ, చివరికి వారిలో ఒకరిని చెంపదెబ్బ కొడుతూ కనిపించారు. ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు.తర్వాత మీడియాతో మాట్లాడిన కానిస్టేబుల్ మాట్లాడుతూ.. నా కుమార్తెలను ట్యూషన్కు వదిలి విధులకు వెళ్తున్న సమయంలో, ముగ్గురు యువతులు స్కూటర్పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారని గమనించాను. వారిని ఆపి జాగ్రత్తగా వెళ్లమని చెప్పాను. కానీ వారు 'నీ పని చూసుకో' అంటూ స్పందించారు. అందుకే వారిని వెంబడించి ఆపాను. ఆ సమయంలో నేను తల్లిలా స్పందించాను, కానిస్టేబుల్గా కాదు.అయితే, ఆమె అసభ్యంగా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు సైతం ఆమె మాట్లాడిన తీరుపై విమర్శలు గుప్పించారు. చట్టం ప్రకారం.. యువతులపై చేయిచేసుకునే హక్కు లేదని ట్వీట్లు కూడా పెట్టారు. ఇలా ఆమె తీరు వివాదంగా మారింది. చివరికి ఆమె క్షమాపణలు చెప్పేందుకు దారి తీసింది. ‘నేను వాడిన భాష తప్పు. దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. కానీ నా ఉద్దేశం తప్పు కాదు’అని ఆమె స్పష్టం చేశారు.లాతూర్ పోలీస్ అధికారులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. Lady Traffic Constable Abuses, Beats Three Young Girls For Triple-Seat Riding In Latur pic.twitter.com/juTK3okkLg— ExtraOrdinary (@Extreo_) June 24, 2025 -
ఒట్టి చేతులతో చిరుతపై పోరాటం .. యువకుడి ధైర్యానికి నెటిజన్ల షాక్!
లక్నో: తన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించిన చిరుతపులిపై ఓ యువకుడి ఒంటి చేత్తో పోరాడాడు. ఎలాంటి ఆయుధాలు లేకుండా చిరుతపులిపై తిరగబడ్డాడు. ఆపత్కాలంలో తెగువ, ధైర్య సాహాసానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన ఆ వ్యక్తి పేరు మిహిలాల్ గౌతమ్ (33). అతనిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. చిరుతపులిపై పోరాటం చేసిన ఘటన లఖ్మీపూర్ ఖేరిలోని జుగనూపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అటవి శాఖ అధికారుల సమాచారం మేరకు.. మిహిలాల్ గౌతమ్ది ఇర్ధారి పూర్వా అనే గ్రామం.ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు గౌతమ్తో పాటు మరికొందరు సోమవారం జుగనూపూర్ గ్రామానికి వచ్చారు.ఇటుక బట్టీల్లో పని ప్రారంభించేందుకు గౌతమ్తో పాటు ఇతర కార్మికులకు కలిసి ఇటుకుల్ని వేడి చేసే కొలిమి ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే సేదతీరుతున్న చిరుతపులి కార్మికులపై దాడి చేసేందుకు ఒక్క ఉదుటున మీద పడింది.ఒట్టి చేతుల్ని ఆయుధాలుగా మార్చిదాడి చేస్తున్న చిరుతపులిని భయపడకుండా, గందరగోళానికి గురవుకుండా గౌతమ్ తన ఒట్టి చేతుల్నే ఆయుధాలుగా మార్చి దానిని నిలురించే ప్రయత్నం చేశాడు. ఏ మాత్రం బెదరకుండా చిరుతపై ఎదురు దాడికి దిగాడు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. గౌతమ్ బలాబలాల ముందు చిరుత తేలిపోయింది. అప్రమత్తమైన సహచర కార్మికులు గ్రామస్తుల సాయంతో చిరుత నుంచి గౌతమ్ను రక్షించే ప్రయత్నం చేశారు. చేతికి దొరికిన వస్తువుల్ని చిరుతపైకి విసిరేస్తూ చిరుతను భయబ్రాంతులకు గురిచేసేందుకు యత్నించారు. ఆ ప్రయత్నంలో చిరుత భయపడి స్థానిక అరటితోటల్లోకి పారిపోయింది. "फिल्मों में देखा होगा हीरो शेर से लड़ता है... लेकिन ये रियल है!"लखीमपुर-खीरी के धौरहरा की बबुरी गांव से चौंकाने वाला वीडियोयहां एक ईंट भट्टे में घुस आया तेंदुआ और सामने था एक युवक... न डर, न भागा — सीधा भिड़ गया! तेंदुए ने झपट्टा मारा, युवक ने डटकर मुकाबला कियागांववालों ने… pic.twitter.com/rd0FiBFEGY— आदित्य तिवारी / Aditya Tiwari (@aditytiwarilive) June 24, 2025 అధికారులపై చిరుత దాడిచిరుతపులి దాడిపై స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ప్రయత్నంలో అధికారులపై చిరుత దాడికి దిగింది. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ రాజేష్ కుమార్ దీక్షిత్,రేంజర్ నిరూపేంద్ర చతుర్వేది, పోలీస్ అధికారి రామ్ సంజీవన్,స్థానిక గ్రామస్తుడు ఇక్బాల్కు గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం తొలిసారి దాడికి చేసిన మిహిలాల్ గౌతమ్తో పాటు ఇక్బాల్ ఖాన్ ,ఫారెస్ట్ రేంజర్ రాజేష్ కుమార్ లక్ష్మీపూర్ ఆస్పత్రికి, రేంజర్ చతుర్వేది, పోలీస్ కానిస్టేబుల్ రామ్ సంజీవన్లను తాలూకా ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్స అనంతరం బాధితులు ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు.ఈ ఘటన తర్వాత అంటే మంగళవారం అదనపు పోలీసు సిబ్బందితో కలిసి అటవీ శాఖ, పోలీస్ శాఖ జాయింట్ ఆపరేషన్ను నిర్వహించాయి. అరటితోటల్లోనే ఉన్న చిరుత పులిని బంధించాయి. -
CBSE: ఇక ఏడాదికి రెండుసార్లు పదో తరగతి పరీక్షలు
సాక్షి,ఢిల్లీ: విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ఈపీ) భాగంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏడాది నుంచి రెండుసార్లు (twice a year) పది పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు బోర్డు ఆమోదం తెలిపింది. బోర్డు నిర్ణయంతో సీబీఎస్ఈ విధానంలో 10వ తరగతి (CBSE Class 10 board exams) చదివే విద్యార్థులు వచ్చే ఏడాది అంటే 2026 నుంచి బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు రాయాల్సి ఉంటుంది. ఇందులో తొలి దఫా పరీక్షలు ఫిబ్రవరిలో రెండో విడత పరీక్షలు మేలో జరుగుతాయని సీబీఎస్ఈ కంట్రోలర్ సన్యాం భరద్వాజ్ తెలిపారు. దీనికి అనుగుణంగా తొలి విడత పదో తరగతి పరీక్షలను బోర్డు తప్పనిసరి చేసింది. రెండో విడత పదో తరగతి పరీక్షలను ఆప్షనల్గా పెట్టింది. రెండు విడతల్లో మంచి స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. రెండు దశలకు సంబంధించిన ఫలితాలు వరుసగా ఏప్రిల్, జూన్లో ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.సీబీఎస్ఈ (CBSE) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, విద్యార్థులు సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లలో ఏదైనా మూడు విభాగాలలో తక్కువ మార్కులు వచ్చినా, వారు మళ్లీ పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. తద్వారా విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి, వారి అసలు సామర్థ్యాన్ని మెరుగ్గా చూపించేందుకు సహాయ పడనుట్లు తెలిపారు. -
ఖర్గే చురకలు.. శశిథరూర్ కౌంటర్!
కాంగ్రెస్ అధిష్టానంతో సీనియర్ నేత శశిథరూర్కు ఉన్న విభేదాలు ఇవాళ మరోసారి అధికారికంగా బయటపడ్డాయి. శశిథరూర్ను ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. కాసేపటికే థరూర్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాకు ఇంగ్లీష్ చదవడం అంత బాగా రాదు. కానీ, శశిథరూర్ భాష చాలా బాగుంటుంది. అందుకే ఆయన ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్నారు. మేము మాకు వచ్చిన భాషలో ‘‘దేశమే ముందు(మా తొలి ప్రాధాన్యం) అంటాం’’. భారత సైన్యానికి మద్దతుగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్ కోసం ఐక్యంగా నిలబడ్డాం. కానీ కొంతమంది ‘‘మోదీనే ముందు.. ఆ తర్వాతే దేశం అంటారు. అలాంటప్పుడు మేమేం చేయాలి?’’ అని నవ్వుతూ అన్నారాయన. మోదీని ప్రశంసించినందుకు థరూర్పై చర్యలు ఉంటాయా? అని ఎదురైన ప్రశ్నకు.. ఆ వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంటుందని, చర్యలు తీసుకునే ఉద్దేశమేదీ లేదని అన్నారు. అదే సమయంలో పార్టీ ఐక్యతే అధిష్టానానికి ముఖ్యం అని ఖర్గే పేర్కొన్నారు. #WATCH | #Congress President #MallikarjunKharge says #ShashiTharoor’s strong language skills earned him a spot in the party's working committee and emphasizes that the entire opposition stands united in support of the #IndianArmy.@kharge @ShashiTharoor pic.twitter.com/kiJLpcwE8K— The Federal (@TheFederal_News) June 25, 2025మరోవైపు.. ఖర్గే ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తన ట్విటర్లో ఓ పోస్ట్ ఉంచారు. ‘‘ఎగరడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. రెక్కలు నీవి.. ఆకాశం ఎవరి సొంతం కాదు’’ అంటూ ఓ పోస్ట్ను ఉంచారాయన. దీంతో ఇది ఖర్గేకు సెటైరే అంటూ ఆయన కామెంట్ సెక్షన్లో చర్చ నడుస్తోంది. pic.twitter.com/dNkwZb721E— Shashi Tharoor (@ShashiTharoor) June 25, 20252020 – G-23 లేఖ దగ్గరి నుంచి శశిథరూర్కు, అధిష్టానం మధ్య గ్యాప్ మొదలైంది. థరూర్ సహా 23 మంది సీనియర్ నేతలు ‘కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం’ కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా(మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..) తిరుగుబాటు లాగా భావించారంతా. ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. శశిథరూర్ మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఖర్గే గెలిచినా, థరూర్కు 1,000కి పైగా ఓట్లు వచ్చాయి. అయితే పార్టీలో అంతర్గతంగా థరూర్కు మద్దతు ఉన్నట్లు ఈ ఎన్నిక సూచించింది.2023–24.. శశిథరూర్ ఈ మధ్యకాలంలో తరచూ పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది.2025.. ఆపరేషన్ సిందూర్ తర్వాత కాంగ్రెస్కే షాకిస్తూ ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోదీ నాయకత్వంపై ప్రశ్నలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే.. అవి నాలుగు గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం.. ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశిథరూర్ తాజాగా స్పష్టత ఇచ్చారు. -
కుమార్తెలపై కోపంతో.. రూ.4 కోట్ల ఆస్తి పత్రాలు హుండీలో వేసిన తండ్రి
వేలూరు: ఓ మాజీ సిపాయి తనకు చెందిన రూ.4 కోట్ల విలువైన భూమి పత్రాలను రేణుకాంబాల్ ఆలయ హుండీలో వేశాడు. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని పడవేడు గ్రామానికి చెందిన విజయన్ మాజీ ఆర్మీ సిపాయి. ఇతనికి భార్య కస్తూరి ఉంది. ఈమె కన్నమంగళం సమీపంలోని మంగళాపురంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. కుమార్తెలకు వివాహం కావడంతో ఇద్దరు కుమార్తెలు వేర్వేరుగా జీవిస్తున్నారు.ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ సిపాయి విజయన్కు భార్య కస్తూరి మధ్య ఏర్పడిన ఘర్షణ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నారు. విజయన్ మాత్రం ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో విజయన్ మనోవేదనతో ఉండేవాడు. దీంతో మే 2వ తేదీన జిల్లాలోని పడవేడులోని రేణుకాంబాల్ ఆలయానికి స్వామివారి దర్శనం కోసం విజయన్ వచ్చాడు. దర్శనం చేసుకున్న అనంతరం రూ.4 కోట్ల విలువ చేసే భూ పత్రాలను హుండీలో వేశాడు. అనంతరం అక్కడ నుంచి ఇంటికి వెళ్లాడు.మంగళవారం ఉదయం రేణుకాంబల్ ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న విజయన్ ఆలయానికి వచ్చాడు. అనంతరం ఆలయ నిర్వహకులతో మాట్లాడి ఆలయ హుండీలో రూ.4 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలున్నాయని, వాటన్నింటిని ఆలయాన్ని రాసి ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఆస్తి కోసం తన కుమార్తెలు నిత్యం వేధిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయన్ వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది, స్థానికులు అవాక్కయ్యారు. విజయన్ ఆలయ హుండీల్లో ఆస్తి పత్రాలు వేసిన విషయం తెలుసుకున్న భార్య, ఇద్దరు కుమార్తెలు ఆలయానికి వచ్చారు. ఆస్తి తమదని, ఆ పత్రం తిరిగి ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు ఆస్తిపత్రం తమ దగ్గరే ఉంటుందని దేవస్థానం అధికారులు వారికి స్పష్టం చేశారు. -
స్పేస్లోకి శుభాంశు శుక్లా.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ఏమన్నారంటే
సాక్షి,ఢిల్లీ: ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం అంతరిక్షంలోకి బయల్దేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla)కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకంక్షలు తెలిపారు. శుభాంశు శుక్లా స్పేస్లోకి 1.4 బిలియన్ల మంది భారతీయుల శుభాకాంక్షల్ని,నమ్మకాల్ని, ఆకాక్షంల్ని మోసుకెళ్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్కు చెందిన మిషన్ స్పెషలిస్ట్స్లావోష్ ఉజ్నాన్స్కీ,హంగేరీ మిషన్ స్పెషలిస్ట్ టిబోర్ కాపులకు మోదీ శుభాంక్షలు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణంపై స్పందించారు. గ్రూప్ కెప్టెన్గా శుభాంశు శుక్లా భారత అంతరిక్ష విభాగంలో సరికొత్త రికార్డ్లను సృష్టించారు. అంతరిక్షంలోకి ఈ భారతీయుడి ప్రయాణం పట్ల మొత్తం దేశం ఉత్సాహంగా గర్వంగా ఉంది. శుభాంశు తన ఆక్సియం మిషన్ 4లోని అమెరికా, పోలాండ్, హంగేరీ వ్యోమగాములుతో తమదంతా ‘వసుధైవ కుటుంబం (ఒకే కుటుంబం)’గా నిరూపించారని ముర్ము అన్నారు.భారత సంతతికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ స్పేస్ నిర్వహిస్తున్న Ax-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళుతున్నారు. ఈ మిషన్ ద్వారా రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్రలో నిలవనున్నారు. We welcome the successful launch of the Space Mission carrying astronauts from India, Hungary, Poland and the US. The Indian Astronaut, Group Captain Shubhanshu Shukla is on the way to become the first Indian to go to International Space Station. He carries with him the wishes,…— Narendra Modi (@narendramodi) June 25, 2025 As Group Captain Shubhanshu Shukla creates a new milestone in space for India, the whole nation is excited and proud of an Indian’s journey into the stars. He and his fellow astronauts of Axiom Mission 4 from the US, Poland and Hungary prove the world is indeed one family –…— President of India (@rashtrapatibhvn) June 25, 2025 -
Uttarakhand: పొంగిపొర్లుతున్న కాలువలోకి కారు.. నలుగురు దుర్మరణం
హల్ద్వానీ: భారీ వర్షాల నడుమ ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నైనిటాల్ జిల్లాలోని హల్ద్వానీలో ఏడుగురు ప్రయాణికులతో వెళుతున్న కారు రోడ్డు పక్కన పొంగిపొర్లుతున్న కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో నాలుగు రోజుల శిశువుతో సహా నలుగురు మృతిచెందారని స్థానిక పోలీసులు తెలిపారు. VIDEO | Haldwani: Tragedy strikes as a car carrying seven people, including a newborn, plunges into an overflowing canal amid heavy rainfall. Four dead including a four-day-old infant, two women, and a man, while three others were injured.Rescue teams pulled the car from under… pic.twitter.com/r2fgGtM5Nh— Press Trust of India (@PTI_News) June 25, 2025ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు ప్రయాణికులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కారు కాలువలో పడగానే అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కారును కల్వర్టు కింద నుండి బయటకు తీశారు. ఇదిలావుండగా, ఉత్తరాఖండ్లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే ట్రెక్ మార్గంలో కొండచరియలు విరిగిపడి, ఇద్దరు యాత్రికులు మృతి చెందారని అధికారులు తెలిపారు. వీరిద్దరి మృతదేహాలను శిథిలాల నుండి బయటకు తీశారు. ఇదేవిధంగా మహారాష్ట్రకు చెందిన ఒక యాత్రికుడిని రక్షించి, ఆస్పత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: అభినందన్ను బంధించానన్న.. పాక్ ఆర్మీ అధికారి మృతి -
‘ఎమర్జెన్సీ రోజుల్లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్’.. గతం గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: నాడు దేశంలో అత్యవసర పరిస్థితులు విధించిన రోజుల్లో తాను ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ఉన్నానని.. నాటి రోజులను ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. నాటి నిరసనల్లో కీలకంగా వ్యవహరించిన దేవెగౌడను ప్రధాని ప్రశంసించారు. దేశరాజధాని ఢిల్లీలో బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ను విడుదల చేసింది. దీనిలో నాటి అత్యవసర పరిస్థితిలో నరేంద్ర మోదీ ప్రారంభ రాజకీయ ప్రతిఘటనలను వివరించారు.నాటి కాలాన్ని అభ్యాస అనుభవంగా అభివర్ణించిన ప్రధాని, నాటి మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడను అత్యవసర పరిస్థితుల వ్యతిరేక ఉద్యమంలో కీలక నేతగా పేర్కొన్నారు. మోదీ తొలి రాజకీయ ప్రయాణాన్ని హైలైట్ చేసిన ఈ పుస్తకంలో.. నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితులను మోదీ ఏ విధంగా వ్యతిరేకించారో తెలియజేశారు. ఆ సమయంలో మోదీతో కలిసి పనిచేసిన వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించి, ఈ పుస్తకంలో పొందుపరిచారు. When the Emergency was imposed, I was a young RSS Pracharak. The anti-Emergency movement was a learning experience for me. It reaffirmed the vitality of preserving our democratic framework. At the same time, I got to learn so much from people across the political spectrum. I am… https://t.co/nLY4Vb30Pu— Narendra Modi (@narendramodi) June 25, 2025ఈ పుస్తకం విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ఒక ట్వీట్లో ‘అత్యవసర పరిస్థితి విధించినప్పుడు, నేను ఆర్ఎస్ఎస్ యువ ప్రచారక్ను. అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమం నాకు కొత్త పాఠాలను నేర్పింది. రాజకీయ వర్గాల నుంచి, ప్రజల నుంచి నేను చాలా నేర్చుకోగలిగాను. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్.. నాటి తన అనుభవాలలో కొన్నింటిని పుస్తకం రూపంలో సంకలనం చేసినందుకు ఆనందంగా ఉంది. దీనికి ముందుమాటను.. అత్యవసర పరిస్థితి వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన హెచ్డీ దేవెగౌడ రాశారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: అన్నగా భావించిన యువతికి ‘ప్రపోజల్’.. అభ్యంతరం చెప్పడంతో.. -
అన్నగా భావించిన యువతికి ‘ప్రపోజల్’.. అభ్యంతరం చెప్పడంతో..
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు క్షణికావేశంతో బలవన్మరణాలకు లేదా అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఒక యువతి తనను తిరస్కరించడంతో ఆగ్రహం చెందిన యువకుడు ఆ యువతిని కడతేర్చాడు.ఢిల్లీలోని జ్యోతి నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువతికి మరణానికి కారకుడైన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని తౌఫిక్గా గుర్తించిన పోలీసులు.. అతనిని ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలోని టాండాలో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తౌఫిక్ ముందుగా బుర్ఖా ధరించి.. తాను ఎంతగానో ఇష్టపడిన నేహా ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడేవున్న నేహా తండ్రిని పక్కకు నెట్టేసి నేరుగా టెర్రస్ వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో నేహా అక్కడ వాటర్ ట్యాంక్ను పరిశీలిస్తోంది.అతనిని నేహా గమనించింది. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో తౌఫిక్ ఆమెను ఐదవ అంతస్తు నుంచి తోసివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన నేహాను వెంటనే జీటీబీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, ఆమె మృతిచెందింది. కాగా నేహా అతనిని సోదరునిగా భావించిందని, అయినా అతను ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడని తెలుస్తోంది.తౌఫిక్ మూడేళ్లుగా తమను తెలుసని, నేహా అతనిని సోదరునిలా చూసుకున్నదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే గతకొంతకాలంగా అతను నేహాను వివాహం చేసుకోవాలని భావిస్తూ, ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే నేహా అతని ప్రతిపాదనను తిరస్కరించింది. తౌఫిక్ తన సోదరిని నెల్లాళ్లుగా పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని నేహా సోదరి మీడియాకు తెలిపింది. ఉత్తరప్రదేశ్కు చెందిన తౌఫిక్ ఢిల్లీలోని మండోలి రోడ్డులో నివాసం ఉంటున్నాడు.ఇది కూడా చదవండి: ‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే.. -
ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో ఉన్న పాలిథీన్ ఫ్యాక్టరీలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి నుంచి మంటల చెలరేగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.#WATCH | Delhi: 3 people died and three were injured after a fire broke out in a polythene factory near the Rithala metro station yesterday at around 7.30 pm, say Delhi police The search operation is still going on.(Morning visuals from the spot) pic.twitter.com/RmMXSE0nef— ANI (@ANI) June 25, 2025 -
‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే..
గౌహతి: మేఘాలయ హనీమూన్ కేసులో లెక్కలేనన్ని ట్విస్ట్లు బయటపడుతున్నాయి. భర్త రాజారఘువంశీ హత్యకు కుట్ర పన్నిన సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు పోలీసుల ముందు మరో నిజాన్ని వెల్లడించారు. ఎప్పటి నుంచో తమ మధ్య సంబంధం ఉన్నదని వారు పోలీసుల సమక్షంలో అంగీకరించారని మేఘాలయ పోలీసులు తెలిపారు.తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ మీడియాతో మాట్లాడుతూ తమ దర్యాప్తులో రాజ్, సోనమ్లు రిలేషన్షిప్లో ఉన్నట్లు అంగీకరించారని తెలిపారు. వారిద్దిరూ ఇప్పటికే నేరాన్ని అంగీకరించారని, తాము సీన్ రీకన్స్ట్రక్షన్ చేయగా, దానికి వారు సహకరిస్తూ, అన్ని ఆధారాలు చూపించారన్నారు. అందుకే సోనమ్కు ఇప్పుడు నార్కో టెస్టులు అవసరం లేదని భావిస్తున్నామని అన్నారు.సాధారణంగా ఎటువంటి ఆధారాలు లభ్యం కానప్పుడే నార్కో పరీక్ష జరుగుతుందని, వాస్తవానికి సుప్రీంకోర్టు నార్కో విశ్లేషణను నిషేధించిందని వివేక్ సయీమ్ తెలిపారు. కేవలం వారి ఒప్పుకోలును మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, బలమైన సాక్ష్యాధారాలను సేకరించామన్నారు. చార్జిషీట్ను వీలైనంత త్వరగా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రఘువంశీ హత్యకు డబ్బు ప్రధాన కారణం కాదని, వారి సంబంధానికి అతను అడ్డుకాకూడదని వారు భావించివుండవచ్చునన్నారు.మేఘాలయ పోలీసులు తాజాగా ఇండోర్లోని ఫ్లాట్ యజమాని లోకేంద్ర తోమర్ను విచారణ కోసం రప్పిస్తున్నారు. సోనమ్ను అరెస్టు చేయడానికి ముందు ఆమె భర్తతో పాటు అతని ప్లాట్లో కొంతకాలం ఉన్నారు. కాగా సోనమ్ బ్యాగ్లో ఒక దేశీయ పిస్టల్, ఫోన్, రాజా రఘువంశీకి చెందిన నగలు, రూ ఐదు లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇవి విచారణలో కీలకంగా మారనున్నాయని అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘అది నాకు దక్కిన గౌరవం’.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
నేను అమన్ సొంతం.. నాకు అల్లుడే కావాలి..
లక్నో: ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకుని.. భార్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భర్తకు ఊహించని అనుభవం ఎదురైంది. నాటకీయంగా మొదటి రాత్రి వధువు ప్రవర్తనతో వరుడు ఖంగుతిన్నాడు. ‘నన్ను తాకితే.. 35 ముక్కలు చేస్తా.. నేను అమన్కు మాత్రమే సొంతం’ అంటూ భర్తకు భార్య వార్నింగ్ ఇచ్చింది. అనంతరం, అర్ధరాత్రి ఇంట్లో నుంచి నవ వధువు పరారీ అయ్యింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. ప్రయాగ్రాజ్లోని ఏడీఏ కాలనీకి చెందిన కెప్టెన్ నిషాద్ ఏప్రిల్ 29న సితారను వివాహం చేసుకున్నాడు. అనంతరం, ఏప్రిల్ 30న వధువు తన అత్తమామల ఇంటికి చేరుకుంది. మే రెండో తేదీన కొత్త జంటలకు ఘనంగా రిసెప్షన్ జరిగింది. తర్వాత, కుటుంబ సభ్యులు వారిద్దరూ మొదటి రాత్రికి ఏర్పాటు చేశారు. కొత్త జంటకు లోపలికి వెళ్లగానే.. వరుడికి ఊహించని అనుభవం ఎదురైంది. వధవు..‘నన్ను ముట్టుకుంటే.. నువ్వు 35 ముక్కలుగా కనిపిస్తావు. నేను అమన్ను ప్రేమిస్తున్నా. నేను అమన్ సొంతం’ అని సితార తన భర్తను కత్తితో బెదిరించింది. ఈ అనూహ్య ఘటనతో ఖంగుతిన్న నిషాద్కు ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్త, అతడి కుటుంబసభ్యులపైనా బెదిరింపులకు పాల్పడింది.దీంతో మరుసటిరోజు వారు గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో నిషాద్ ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగలేదు. దీంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. సితార తన ప్రియుడు అమన్తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. కాగా.. సితారకు అమన్ వరుసకు మేనల్లుడు కావడం గమనార్హం. #BREAKING : Touch me and I’ll cut you into 35 pieces’, Bride threatens groom on wedding night in Prayagraj. later jumps wall to escape with lover.After the Sonam murder case, a shocking incident from Prayagraj has surfaced. On the wedding night, a bride threatened her husband… pic.twitter.com/QBGDK9SjEK— upuknews (@upuknews1) June 24, 2025ఈ ఘటన అనంతరం, భర్త నిషాద్ మాట్లాడుతూ..‘నేను గదిలోకి వెళ్లగానే ఆమె నిశ్శబ్దంగా పూర్తిగా ముసుగు వేసుకుని కత్తి పట్టుకుని కూర్చుని ఉంది. ఆమె నాతో సూటిగా ఒక్కటే చెప్పింది. నన్ను ముట్టుకోవద్దు. నేను అమన్ ఆస్తిని. నువ్వు నన్ను తాకాలని ప్రయత్నిస్త.. నిన్ను 35 ముక్కలుగా నరికివేస్తాను అని బెదిరించింది. నన్ను అమన్ వద్దకు పంపించు అని చెప్పింది. దాంతో, నాకు ఏం చేయాలో తోచలేదు. ఆ రాత్రంతా ఆమె కత్తితో మంచం మీద ఉండగా నేను సోఫాలో కూర్చున్నాను. నిద్రపోయే ధైర్యం చేయలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఆమె ప్రవర్తనపై అటు నిషాద్ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. #Prayagraj सुहागरात के दिन घूँघट में सितारा ने पति को चाकू दिखाए और 35 टुकड़ों में काटने की धमकी दी.. 3 दिन तक चाकू और धमकी का सिलसिला चलता रहा.दुल्हन के घर वालों को बुलाया गया और सहमति हुई कि दूल्हा दुल्हन हंसी खुशी रहेंगे, लेकिन सितारा दीवार फांदकर अपने प्रेमी के साथ फरार pic.twitter.com/SPEl9hFsqU— News & Features Network (@newsnetmzn) June 24, 2025 -
ఓ తండ్రి దారుణం.. మార్కులే జీవితమా?
సాంగ్లీ: నీట్లో తక్కువ మార్కులు వచ్చాయని ఓ తండ్రి.. కూతురిని కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాంగ్లికి చెందిన 17 ఏళ్ల సాధన వైద్య జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) రాసింది. ఇటీవలే ఫలితాలు వచ్చాయి. సాధనకు తక్కువ మార్కులు రావడంతో ఆగ్రహించిన ధోండి రామ్ భోస్లే శుక్రవారం రాత్రి ఆమెను కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆమె తల్లి ప్రీతి భోస్లే.. స్థానిక ఆసుపత్రికి తరలించింది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు.అనంతరం, అక్కడ చికిత్స పొందుతూ సాధన మరణించింది. కూతురికి అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ప్రీతి.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు.. ధోండి రామ్ భోస్లేను ఆదివారం అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. జూన్ 24 వరకు పోలీసు కస్టడీకి విధించారు. -
వేడెక్కుతున్న ఆసియా.. భారత్లో వారికే ప్రమాదమే..
పర్యావరణంపై ఓ కొత్త నివేదిక ఆసియాను ఆందోళన పరుస్తోంది. తీవ్రమైన వాతావరణ మార్పులు ఆసియాను సంక్షోభానికి గురి చేస్తాయని హెచ్చరిస్తోంది. వాతావరణ మార్పులపై ప్రపంచ వాతావరణ సంస్థ ఇటీవల ‘స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా–2024’ను విడుదల చేసింది. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకంటే ఆసియా రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోందని అధ్యయనం పేర్కొంది. ఈ మార్పు అత్యంత తీవ్రమైన పర్యావరణ సమస్యలను కలిగిస్తుందని హెచ్చరించింది. మంచి నీటి వనరులతో పాటు, తీర ప్రాంతాలకు ముప్పు అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.వేగంగా కరుగుతున్న హిమనీనదాలు ఆసియాలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2024లో ఒకటిగా నమోదైందని నివేదిక తెలిపింది. 1991–2020 బేస్లైన్ కంటే సగటు ఉష్ణోగ్రతలు 1.04 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయని పేర్కొంది. ఖండం ప్రపంచ సగటు కంటే దాదాపు రెండు రెట్లు వేగంగా వేడెక్కుతోందని నివేదిక తెలిపింది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా మధ్య ఆసియాలోని హిమాలయాలు, టియాన్ షాన్ వంటి కీలక పర్వత శ్రేణుల్లో హిమానీనదాలు కరగడం వేగవంతం అయ్యింది. దీనివల్ల కీలకమైన మంచినీటి వనరులు, పర్యావరణ వ్యవస్థలకు ప్రమాదం ఉందని వివరించింది. తీరప్రాంతాలకు ముప్పు.. ఆసియాలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని ‘స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ ఇన్ ఆసియా–2024’నివేదిక తెలిపింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన కారణంగా, ఆసి యా పసిఫిక్, హిందూ మహాసముద్ర తీరప్రాంతా ల్లో సముద్ర మట్టాలు ప్రపంచ సగటు కంటే వేగంగా పెరిగాయి. ఈ ధోరణులు భారత్తో సహా ఖండంలోని తీరప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది ప్రజలకు ప్రమాదమని పేర్కొంది. ఇవి వరదలు, తుఫానుల ప్రమాదాలను పెంచుతాయని వెల్లడించింది. 2024 ఆసియా ఖండం అంతటా తీవ్ర విపత్తులు సంభవించిన విషయం తెలిసిందే. తీవ్రమైన వేడి..ఆసియాలోని కొన్ని ప్రాంతాలను, ముఖ్యంగా భారత్, జపాన్లను సుదీర్ఘమైన వేడి గాలులు తాకాయని తెలిపింది. ఇవి వందలాది మంది మరణాలకు కారణమయ్యాయని నివేదిక పేర్కొంది. సముద్ర ఉష్ణ గాలులు రికార్డు స్థాయిలో 15 మిలియన్ చదరపు కిలోమీటర్లకు చేరుకున్నాయని, ఇది సముద్ర జీవవైవిధ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరించింది. ఈ సంవత్సరంలో ఉష్ణమండల తుఫాను యాగి ఆగ్నేయాసియా అంతటా విస్తృతమైన నష్టాన్ని కలిగించింది. ఇది గత సెపె్టంబర్లో ఉత్తర వియత్నాంలో డజన్ల కొద్దీ ప్రజల ప్రాణాలను బలిగొంది. అలాగే, మధ్య ఆసియా 70 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత దారుణమైన వరదలను చవి చూసింది. ఎన్నడూ లేనంత వర్షపాతంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మౌలిక సదుపాయాలకు తీవ్ర అంతరాయం కలిగింది. సెపె్టంబర్ 2024లో నేపాల్ కూడా విపరీతమైన వరదలొచ్చాయి. 246 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు సకాలంలో పనిచేయడం, పరిపాలనా వ్యవస్థలు సమన్వయంతో ప్రతిస్పందించడంతో వేలాది మంది ప్రాణాలను కాపాడగలిగారు. తక్షణ లక్ష్యాలు..ఈ విపత్కర పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి తక్షణ వ్యూహాలు అత్యవసరమని నివేదిక సూచించింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి దేశాలన్నీ ఉమ్మడి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని పేర్కొంది. పర్యావరణ మార్పుల వల్ల కలిగే మానవ, ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి ముందస్తు చర్యలు చాలా అవసరమని, ప్రజల జీవితాలను, వారి జీవనోపాధిని రక్షించడానికి విపత్తు సంసిద్ధతను మెరుగుపరచాలని సూచించింది. ఇక రాబోయే ముప్పును గుర్తించడంలో జాతీయ వాతావరణ సేవలు కీలకమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Jammu: దొంగకు చెప్పుల దండ.. పోలీసుల చర్యపై దర్యాప్తు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పోలీసులు విచిత్ర వివాదంలో చిక్కుకున్నారు. వారు ఒక దొంగకు చెప్పుల దండవేసి జమ్ములో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆ పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక దుకాణంలో నగదు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు.అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని విషయంలో అమానవీయంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. పోలీసులు సిబ్బంది ప్రవర్తనపై విఘర్శలు తలెత్తాయి. వారు వృత్తికి విరుద్ధంగా, అనుచితంగా ప్రవర్తించారంటూ, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, తాము వెంటనే విచారణకు ఆదేశించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులు ఆ వ్యక్తిని అర్థనగ్నంగా చేసి, చేతులకు సంకెళ్లు వేసి, చెప్పుల దండతో పోలీసు జీపు బోనెట్పై కూర్చోబెట్టి జమ్మూ నగర వీధుల్లో తిప్పుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది. బక్షి నగర్ ప్రాంతంలో ఆ వ్యక్తి ఔషధం కొనుగోలు చేస్తూ, రూ. 40 వేలు చోరీ చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు ప్రారంభమయ్యింది. ఇది కూడా చదవండి: Uttarakhand: బహుభార్యత్వ వివాదం.. మాజీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు -
బంధం.. బలహీనం!
ప్రియుడితో ఫోన్ మాట్లాడొద్దని మందలించిన కన్న తండ్రిని.. తల్లి, అక్కతో కలిసి కొట్టి చంపిన కూతురు.. మహబూబాబాద్ జిల్లాలో ఘటనఆస్తి వివాదం కోసం కన్న తండ్రి ఎదుటే సోదరుడిని తుదముట్టించిన చెల్లెళ్లు.. జగిత్యాల జిల్లాలో ఘోరం ప్రేమకు అడ్డు వస్తోందని కన్నతల్లినే ప్రియుడితో హత్య చేయించిన 15 ఏళ్ల బాలిక.. తాజాగా హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం – సాక్షి సెంట్రల్ డెస్క్మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయనడానికి వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలే నిదర్శనం. చిన్న చిన్న కారణాలకు అయినవాళ్లను, ఆప్తులను అంతమొందించే పరిస్థితులు పెరిగిపోతున్నాయ్. ఓవైపు విజ్ఞానం పెరుగుతున్నా.. మరోవైపు ఇలాంటి అజ్ఞానమూ తాండవిస్తోంది. కుటుంబం అంటే అందమైన పొదరిల్లు అనే భావన క్రమంగా అంతర్థానమవుతోంది. ఒకప్పుడు కుటుంబ సభ్యులతో చిన్నచిన్న పంతాలు, పట్టింపులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడవి పగలు, హత్యల వరకు వెళ్లిపోయాయి. తమ ఆనందం కోసం ఏం చేయడానికైనా, ఎంతకు తెగించడానికైనా వెనకాడటంలేదు. తల్లి లేదు.. తండ్రి లేడు.. తోబుట్టువులైనా.. కట్టుకున్న వాళ్లైనా.. బంధనాల్లాంటి బంధాలు మాకొద్దు.. మా లైఫ్.. మా ఇష్టం.. మా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అడ్డొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు.. అనే తీరు నేడు ఎక్కువైపోయింది. రక్తపాతమే కావాలా?ఫోన్ మాట్లాడొద్దన్నారని.. ప్రేమ పెళ్లికి అంగీకరించడంలేదని.. కన్నవాళ్లనే కడతేరుస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్లో వారికి వేరే ఆప్షన్లు ఉన్నప్పటికీ, రక్తపాతాన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? హత్య చేస్తే జైలుకు వెళతామనే ఆలోచన కూడా లేకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పోలీసు అధికారులు, మానసిక వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఇలాంటి ఘటనల వెనుక కారణాలు అన్ని కేసుల్లో ఒకేలా ఉండవు. పరిస్థితులు, అవసరాలను బట్టి పలు అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అయితే, ఇవేవీ ఆకస్మిక కోపం వల్లో, క్షణికావేశంలోనో జరిగే నేరాలు మాత్రం కావు. నిందితులకు ఉన్న మానసిక రుగ్మతలు, ఒత్తిడి, విభ్రాంతికరమైన ఆలోచనలు, కోరుకున్న వాతావరణం ఇంట్లో లేకపోవడం, తమకు ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదనుకోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. పిల్లల్లో పెడాలోచనలు ఎందుకు? మా పిల్లలు మాట వినరు.. సరిగ్గా చదవరు.. ఎప్పుడూ ఫోన్తోనే ఉంటారని చెప్పని తల్లిదండ్రులే లేరంటే అతిశయోక్తి కాదు. మారుతున్న ప్రపంచంతోనే అందరి అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయి. పిల్లల ఆలోచనలు, అలవాట్లలో కూడా ఇదే కనిపిస్తోంది. పిల్లల్లో విపరీత మనస్తత్వానికి కారణం ఏమిటి అంటే... స్మార్ట్ ఫోన్ అనే సమాధానం ఠక్కున వస్తుంది. కొంతవరకు ఇది నిజమే అయినా.. ఇతర కారణాలూ ఉన్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు ఇరువురూ కలిసి సంపాదిస్తే తప్ప.. అవసరాలు తీరని పరిస్థితి. ఈ నేపథ్యంలో పిల్లలతో కలిసి గడిపేందుకు సమయమే ఉండటంలేదు. వారితో ప్రేమగా మాట్లాడి, అవసరాలు తెలుసుకుని తీర్చే పరిస్థితి లేదు. ఇది క్రమంగా వారిలో ఒంటరితనానికి దారితీసి.. తమకు కావాల్సింది స్మార్ట్ ఫోన్లో వెతుక్కోవడం మొదలుపెడుతున్నారు. ఇంట్లో లభించని ప్రేమానురాగాలు బయటి వ్యక్తి చూపిస్తే.. అది నిజమో, అబద్ధమో కూడా తెలుసుకోకుండా వారికి దాసోహమైపోతున్నారు. అదే సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు తమను కంట్రోల్ చేయడం వారికి నచ్చడంలేదు. బయట తమకు ఎంతో స్వేచ్ఛ ఉందని.. ఇంట్లో అన్నింటికీ తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారనే భావన క్రమంగా పెరిగి.. వారిపై కోపం పెంచుకుంటున్నారు. అది ఏకంగా కన్నవారి అడ్డు తొలగించుకోవాలనుకునే స్థాయికి వెళ్లిపోతోంది. అయితే, అందరూ ఇలాగే ఉన్నారని కాదు. మానసిక రుగ్మతలు ఉన్నవారు, చాలాకాలంగా తల్లిదండ్రుల వైఖరితో విభేదిస్తున్నవారు, ప్రేమ వంటి విపరీతమైన భావోద్వేగంలో కూరుకుపోయి ఉన్నవారు.. ఏదీ ఆలోచించే పరిస్థితిలో ఉండరు. ఇలాంటివారు పర్యవసనాలను పట్టించుకోకుండా తాము అనుకున్నది చేయడానికే మొగ్గు చూపిస్తారు.తల్లిదండ్రులు ఏం చేయాలి? తమ పిల్లల ప్రతి చర్యకూ తల్లిదండ్రుల బాధ్యత తప్పకుండా ఉంటుంది. కాలానికి తగ్గట్టే తల్లిదండ్రుల ప్రవర్తనలోనూ మార్పులు రావాలి. పిల్లలను ఎక్కువగా నియంత్రించడం, ఆంక్షలు పెట్టడం వంటివి చేయకూడదు.. అలా అని పూర్తిగా వదిలేయకూడదు. రెండింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేయాలి. పిల్లలను అదేపనిగా కట్టుదిట్టం చేస్తే ఒత్తిడిలో కూరుకుపోయి నిరాశలో మునిగిపోతారు.. లేదా తిరగబడతారు. రెండూ ప్రమాదకరమే. రోజులో వీలైనంత సమయం వారితో మాట్లాడాలి. ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. అన్నింటికీ మేం ఉన్నాం అనే భరోసా కల్పించాలి. కుటుంబ బంధాలు, విలువల గురించి అర్థమయ్యేరీతిలో చిన్నప్పటి నుంచే తెలియజెప్పాలి. వ్యక్తిత్వ లోపాలే కారణం అకారణంగా హత్యలకు పాల్పడే వాళ్లకు ఐక్యూ లెవల్స్ తక్కువ ఉంటాయి. ఈ బెడద నుంచి తప్పించుకోవాలన్న తాత్కాలిక ఆలోచన వల్లే చంపుతున్నారు. వారి వ్యక్తిత్వంలోనే లోపాలు ఉంటాయి. మానసిక రుగ్మతలు ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి కుట్రలు చేసి, ఇతరులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారు.. కుట్రలో పాల్గొనే వారందరికీ వ్యక్తిత్వ లోపాలు ఉంటాయి. ఇలాంటివారిలో చాలామంది.. చిన్నప్పటి నుంచి కుటుంబంలో ఒకరకమైన అనిశ్చితి, హింస, కోపాలకు గురై ఉంటారు. వారికి తాము చేసిన నేరం సమంజసమే అనిపిస్తుంది.– వీరేందర్, సైకాలజిస్ట్కనుమరుగవుతున్న బంధాలను కాపాడుకోవాలి కన్నవాళ్లను, కట్టుకున్నోళ్లను కడతేర్చడం వంటివి మామూలు హత్యకేసులు కావు. సమాజంలో కనుమరుగవుతున్న బంధాలు, అనుబంధాలకు నిదర్శనంగా వీటిని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో సినిమాల్లో, సోషల్ మీడియాలో కనిపించే ప్రేమను నిజమని నమ్మేస్తున్నారు. దానికి అడ్డుగా నిలిచినవారిని తొలగించాలనే తప్పుడు భావనలు పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ బంధం లేనప్పుడు ప్రేమ ఒక వ్యసనంగా మారుతుంది. పిల్లలకు చిన్న వయసులోనే ఎమోషనల్ ఎడ్యుకేషన్ అందించడం ఇందుకు ఒక పరిష్కారం. తల్లిదండ్రులు పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే వారితో బంధానికి ఎక్కువ విలువనివ్వాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి, వారి ప్రైవసీని గౌరవించాలి. – సైకాలజిస్ట్ విశేష్ విలువలు నేర్పకపోవడం వల్లే.. చిన్న వయసులోనే ప్రేమ అనే భ్రమలో పడుతున్నారు. అది తల్లిదండ్రుల కంటే ఎక్కువనుకుంటున్నారు. తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేకపోవడం, వాళ్లని సరిగా అర్థం చేసుకోలేకపోవడం ఇందుకు కారణాలు.అందుకే పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారనేది చాలా ముఖ్యం. చాలా మంది టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి విలువలు నేర్పడంలేదు. బాల్యం నుంచే విలువలతోపాటు నేరాలు–చట్టాలపై అవగాహన కల్పించాలి. – డా. మమతా రఘువీర్, తరుణి స్వచ్ఛంద సంస్థ కుటుంబ సభ్యులపైనే దాడులు, హత్యలకు కారణాలివీ..నియంత్రించడం (ఏదైనా వద్దు అని చెప్పడం, ఫోన్ తీసేసుకోవడం వంటివి) 38%ఆస్తి వ్యవహారాలు 10%విభేదాలు 8%కోపం, క్షణికావేశం 8%స్వేచ్ఛాయుత జీవితం కోరుకోవడం 7% -
హలో... హలో.. 120 కోట్లు
తిండి, బట్ట, నీడ.. వీటి సరసన ఇప్పుడు ఫోన్ కూడా చేరిపోయింది. అంతలా మన జీవితంలో ఈ ఉపకరణం భాగమైంది. దీనికంతటికీ కారణం టెలికం సేవలు మారుమూల పల్లెలకూ చొచ్చుకుపోవడమే. ఎంతలా అంటే ఏకంగా 120 కోట్ల మంది భారతీయులకు చేరువయ్యేలా! టెలికం చందాదార్ల సంఖ్య పరంగా ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద దేశం మనదే. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏప్రిల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 30 లక్షల మంది టెలికం చందాదారులు పెరిగారు. ఇందులో మూడింట రెండొంతులు గ్రామీణ ప్రాంతాలవారే కావడం ఆసక్తికరమైన అంశం. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఏప్రిల్ గణాంకాల ప్రకారం మొత్తం చందాదారుల సంఖ్య 120.38 కోట్లకు చేరుకుంది. ఇక దేశంలో ప్రతి 100 మంది జనాభాకు 85.19 టెలిఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి. టెలి సాంద్రత పట్టణాల్లోనే అధికం. ఇక్కడ 100 మంది జనాభాకు 131.46 టెలిఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 59.26. టెలి సాంద్రత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 94.77గా ఉంది. ఢిల్లీలో అత్యధికంగా 276.75 ఉంటే, అత్యల్పంగా బిహార్లో 57.37 ఉంది. ఇంటర్నెట్ యూజర్లలో సగం వాటా రిలయన్స్ జియో సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో వైర్లెస్ వినియోగదారులు 8.24 కోట్లు కాగా, వైర్లైన్ కస్టమర్లు 41.12 లక్షల మంది ఉన్నారు.పల్లెల్లో మోగుతోందిగ్రామీణ ప్రాంతాల్లో ఫోన్ మోగుతోంది. అవును.. టెలిఫోన్ సబ్స్క్రైబర్లు దశాబ్ద కాలంలో పట్టణాల్లో 8.7 కోట్లు పెరిగితే పల్లెల్లో 11.71 కోట్లు అదనంగా వచ్చి చేరారు. చందాదారుల విషయంలో పట్టణాలకు, పల్లెలకు అంతరం తగ్గుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారన్న మాట. ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్లో టెలిఫోన్ చందాదారులు పట్టణ ప్రాంతాల్లో 10 లక్షలు (0.16 శాతం) పెరిగితే గ్రామీణ ప్రాంతాల్లో 19.6 లక్షలు (0.37 శాతం) వృద్ధి చెందడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాలకు టెలికం సేవలు విస్తృతం అవుతుండడమే ఇందుకు కారణం.నెటిజన్స్ పెరిగారుదశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా టెలికం చందాదారుల సంఖ్య 20 శాతమే పెరిగింది. అంటే కొత్తగా 20 కోట్ల మంది తోడయ్యారు. అదే ఇంటర్నెట్ విషయంలో యూజర్ల సంఖ్య పెరిగిన తీరు చూస్తే ఔరా అనిపించక మానదు. 2015లో నెటిజన్ల సంఖ్య 10 కోట్లు మాత్రమే. 2025 ఏప్రిల్ 30 నాటికి బ్రాడ్బ్యాండ్ కస్టమర్ల సంఖ్య 9 రెట్లు దూసుకెళ్లి ఏకంగా 94 కోట్లు దాటింది. చవక స్మార్ట్ఫోన్లు, టెలికం కంపెనీల మధ్య చవక టారిఫ్ల యుద్ధం.. వెరసి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఈ స్థాయికి చేరింది. 2015 ఏప్రిల్లో మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు 8.5 కోట్లు, వైర్డ్ సబ్స్క్రైబర్స్ 1.5 కోట్లు ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం వైర్లెస్ నెట్ వాడకందారులు 90 కోట్లు, వైర్డ్ చందాదారులు 4.14 కోట్లు.» చైనాలో 170 కోట్ల మంది టెలికం వినియోగదారులు ఉన్నారు.» భారత్లో మొత్తం టెలికం చందాదారుల సంఖ్య 120.38 కోట్లు» ఏప్రిల్లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ దరఖాస్తులు 1.35 కోట్లు -
రైల్వే చార్జీల్లో స్వల్ప పెరుగుదల!
న్యూఢిల్లీ: రైల్వే చార్జీలు త్వరలో నామమాత్రంగా పెరిగే అవకాశముంది. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతికి కిలోమీటర్కు ఒక పైసా, ఏసీ ప్రయాణాలకు 2 పైసల చొప్పున పెంచే ప్రతిపాదన ఉన్నట్టు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. బోర్డు ఆమోదం లభిస్తే జూలై 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపాయి.‘‘2020, 2013ల్లో చేసిన పెంపుతో పోలిస్తే ఇది సగమే. అంతేగాక రోజువారీ ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా సబర్బన్, నెలవారీ, సీజన్ పాసుల చార్జీలు పెంచబోవడం బోదు. ఆర్డినరీ సెకండ్ క్లాస్ టికెట్ల ధరలు కూడా 500 కి.మీ. దాకా పెరగబోవు. ఆ తర్వాత కి.మీ.కి అర పైసా చొప్పున పెంచే ప్రతిపాదన ఉంది’’ అని పేర్కొన్నాయి.