breaking news
National
-
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. ఆర్జేడీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం (అక్టోబర్20)రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) 143 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అనూహ్యంగా పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరుపుతున్న ఇండియా కూటమి అభ్యర్థులపై పోటీగా ఆర్జేడీ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇక ఆర్జేడీ విడుదల చేసిన జాబితాలో 24 మంది మహిళలు,18 మంది ముస్లిం అభ్యర్థులు ఉన్నారు.ఆర్జేడీ 143 మంది అభ్యర్థులను ప్రకటించడంతో మహాగఠ్బంధన్ (విపక్షాల మహా కూటమి)లో సీట్ల పంపకాల ఫార్ములా ఆర్జేడీ (143), కాంగ్రెస్ (55), సీపీఐఎంఎల్(20), సీపీఐ(6),సీపీఎం(4),వీఐపీ (15) సీట్లు ఉన్నాయి. ఓ వైపు కాంగ్రెస్ ఇప్పటికే 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. RJD releases its list of candidates for the Bihar Assembly Election 2025, fielding candidates in 143 seats. RJD leader Tejashwi Yadav will contest from the Raghopur assembly seat in Vaishali district. pic.twitter.com/wSsMEj8gdm— ANI (@ANI) October 20, 2025 -
భారత్ పర్యటనకు నెతన్యాహు.. అమెరికాకు షాక్!
జెరూసలేం: భారత్-ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది చివరిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా ఒత్తిడిని పక్కనపెట్టి భారత్ వైపు అడుగులుచైనా, భారత్, రష్యా వంటి దేశాలపై టారిఫ్ల పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారు. హమాస్తో యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్కు హెచ్చరించారు. ఆ హెచ్చరికలకు తలొగ్గి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. అయినప్పటికీ హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ.. ఆ సంస్థ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయే వరకు గాజాలో యుద్ధం ముగియదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో, అమెరికా ఒత్తిడిని పక్కనపెట్టి భారత్తో సత్సంబంధాలను మెరుగుపరచేందుకు ఇజ్రాయెల్ ప్రధాని భారత్లో పర్యటించనున్నారంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వ్యూహాత్మక రంగాల్లో సహకారంనెతన్యాహు పర్యటన సందర్భంగా ఇరు దేశాలు శాస్త్ర సాంకేతిక రంగం, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్తో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. ఇప్పటికే ఇజ్రాయెల్, భారత్ మధ్య రక్షణ రంగంలో అనేక ఒప్పందాలు కొనసాగుతున్నాయి. ఈ పర్యటన ద్వారా వాటిని మరింత విస్తరించే అవకాశం ఉంది.అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ పాత్రఈ పరిణామం ద్వారా భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యతను మరోసారి నిరూపించుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల సమయంలో భారత్తో ఇజ్రాయెల్ సత్సంబంధాలను మెరుపరచడం, భారత్కు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను సూచిస్తుంది.ప్రపంచ వేదికపై భారత్ తన దౌత్య నైపుణ్యాన్ని సమర్థంగా ప్రదర్శిస్తోంది. అమెరికా టారిఫ్ బెదిరింపులకు వెనక్కి తగ్గకుండా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ..అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది. ఇప్పటికే ఆప్తమిత్రుడిగా ఉన్న రష్యాతో చమురు కొనుగోలు ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుచుకుంది. ఓ వైపు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన గాజా ప్రజలకు మానవతా సహాయం అందిస్తూ, మరోవైపు ఇజ్రాయెల్తో సైనిక పరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటూ, సమతుల్యమైన దౌత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ విధంగా, భారత్ తన అంతర్జాతీయ సంబంధాలను వ్యూహాత్మకంగా విస్తరించుకుంటూ, ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. -
‘నడుములు విరుగుతున్నాయ్!’.. ఇక్కడ 90శాతం గుంతలు..2శాతమే రోడ్లు
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగర రోడ్ల గురించి చర్చలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 90శాతం గుంతలు,రెండు శాతం రోడ్లంటూ నగర వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. గుంతలమయమైన రోడ్లను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.తాజాగా,నగరంలోని వర్తుర్-గుంజూర్ ప్రాంతంలో గుంతల మయమైన రోడ్ల గురించి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టుకు నగర వాసులతో పాటు నెటిజన్లు సైతం విమర్శలు,ఆవేదనతో కూడిన కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆ ఫొటోను పోస్టు చేసిన సదరు ప్రాంత నివాసి.. సాధారణంగా..రోడ్డు పరిమాణం 98 శాతం..గుంతల పరిమాణం 2 శాతం ఉంటుంది. అక్టోబర్ 17న బెంగళూరులో తీసిన ఈ ఫోటోలో రోడ్డు కేవలం 2 శాతం మాత్రమే.. గుంతల రోడ్లు 98 శాతం ఉంది.మనం వర్తూర్-గుంజూర్ను గుంతలు లేనిదిగా చేయగలమా? అంటూ గ్రేటర్ బెంగళూరు అథారిటీ కమిషనర్కు ట్యాగ్ చేశారు. ఆ పోస్టుకు స్పందిస్తున్న నెటిజన్లు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు మా వెన్నెముకలు విరుగుతున్నాయి. పన్ను చెల్లించే ప్రజల పట్ల ఈ నిర్లక్ష్యం ఎందుకు?’అంటూ ఓ నివాసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ ‘నేషనల్ అక్వాటిక్ హైవే’ కార్లు బోట్లుగా మారుతున్నాయి.హెల్మెట్లు లైఫ్ జాకెట్లుగా... గూగుల్ మ్యాప్స్ చెబుతోంది‘500 మీటర్లు ఈదుతూ ముందుకు సాగండి’ అని. ఇలా రోడ్లు లేక్లుగా మారితే..కార్లు కాదు... బోట్లే అవసరం!’అంటూ చమత్కరిస్తున్నారు.Normally the Road size will be 98% and the Pothole size would be 2%.In this photo shot on 17th October 2025 in Bengaluru, Road is only 2% and LakeHole is 98% 🙏@GBAChiefComm ji, can we make Varthur-Gunjur Pothole Free?#FI pic.twitter.com/pYYLKpG63O— Fundamental Investor ™ 🇮🇳 (@FI_InvestIndia) October 18, 2025 -
ఉదయ్నిధి దీపావళి శుభాకాంక్షలు.. భగ్గుమన్న బీజేపీ
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయ్నిధి స్టాలిన్ దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పడం.. రాజకీయంగా దుమారాన్ని రేపింది. నమ్మకం ఉన్నవారికే.. అంటూ చేసిన కామెంట్పై బీజేపీ భగ్గుమంది. ఇది హిందువులపై వివక్షేనంటూ తీవ్రస్థాయిలో ఆ పార్టీ నేతలు విరుచుకుపడతున్నారు.తాజాగా ఉదయ్నిధి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘వేదికపైకి వచ్చినప్పుడు కొందరు నాకు పుష్పగుచ్ఛాలు, పుస్తకాలు ఇచ్చారు. అయితే దీపావళి శుభాకాంక్షలు చెప్పడం కోసం కొందరు సంకోచించారు. ‘చెబితే వీడు ఎక్కడ కోపపడతాడేమో?’ అని అనుకుని ఉండొచ్చు. అందుకే నమ్మకం ఉన్నవారికి మాత్రమే శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యలపై(Udhayanidhi Stalin Diwali wish) బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ‘‘వాళ్లు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా హిందువులే. అందుకే మేం అందరికీ శుభాకాంక్షలు చెబుతాం" అంటూ ఉదయ్నిధి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇతర మతాల విషయంలో ఇలా ఎందుకు చేయబోరని.. ఆయన వ్యాఖ్యలు హిందువులపై వివక్ష చూపుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన నమ్మకం ‘‘ఉన్నవారికి దీపావళి శుభాకాంక్షలు" అనే వ్యాఖ్యపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా తీవ్రంగా స్పందిస్తున్నారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి ANS ప్రసాద్ స్పందిస్తూ.. హిందూ పండుగలపై డీఎంకే ప్రభుత్వం కనీస గౌరవం ప్రదర్శించబోదని మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడిని సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. అయినప్పటికీ ఎందుకనో డీఎంకే ప్రభుత్వం హిందూ మతంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తోంది. ఆ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది’’ అని ప్రసాద్ విమర్శించారు. ఇదిలా ఉంటే.. డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయ్నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మం అనేది సామాజిక అసమానతలకు మూలం అంటూనే.. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించకూడదు, నిర్మూలించాలి. ఇది డెంగీ, మలేరియా లాంటి వ్యాధిలా ఉంది అంటూ విమర్శించారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడగా.. దేశవ్యాప్తంగా కేసులు కూడా నమోదు కావడంతో కోర్టుల్లో విచారణ జరుగుతోంది.ఇదీ చదవండి: తమిళనాడు ఎలక్షన్స్.. వార్నీ.. అప్పుడే తొలి జాబితా రిలీజ్ -
INS విక్రాంత్లో మోదీ దీపావళి వేడుకలు.. పాకిస్తాన్కు కౌంటర్
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సందడి కొనసాగుతోంది. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.గోవా సముద్ర తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్లో ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొని సైనికులతో సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఐఎన్ఎస్ విక్రాంత్పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో మావోయిస్టుల లొంగుబాటు కూడా మొదలైంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గోవాలో ఐఎన్ఎస్ విక్రాంత్ను సందర్శించారు. నేవీ అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఐఎన్ఎస్ విక్రాంత్లో దీపావళి జరుపుకోవడం గర్వంగా ఉంది. సైనికులే భారత్ బలం. ఓవైపు అనంతమైన ఆకాశం ఉంటే.. మరోవైపు అనంత శక్తులు కలిగిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు, దీపావళికి వెలిగించే దీపాల లాంటివి. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టింది. పాక్ నౌకలు అడుగు ముందుకు వేయాలంటే భయపడిపోయాయి.#WATCH | Prime Minister Narendra Modi says, "The night spent yesterday on INS Vikrant is hard to put into words. I saw the immense energy and enthusiasm you all were filled with. When I saw you singing patriotic songs yesterday, and the way you described Operation Sindoor in your… pic.twitter.com/UrGF2gngn6— ANI (@ANI) October 20, 2025ఐఎన్ఎస్ విక్రాంత్ ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియాకు ప్రతీక. ఆపరేషన్ సిందూర్ సమయంలో పరాక్రమం చూపించిన త్రివిధ దళాలకు సెల్యూట్. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే శత్రువులకు నిద్ర కూడా పట్టదు. ఐఎన్ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక. బ్రహ్మోస్, ఆకాశ్ మిస్కైల్ తమ సత్తా ఏంటో చూపించాయి. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరం’ అని చెప్పుకొచ్చారు.#WATCH | Prime Minister Narendra Modi says, "... Just a few months ago, we witnessed how the very name Vikrant sent waves of fear across Pakistan. Such is its might — a name that shatters the enemy’s courage even before the battle begins. This is the power of INS Vikrant... On… pic.twitter.com/TL03Z9CFdg— ANI (@ANI) October 20, 2025ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సింధూర్ విజయం తర్వాత తొలి దీపావళిలో మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ.. 2014 నుంచి సాయుధ దళాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఇక, అంతకుముందు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ..‘దీపావళి వెలుగుల పండగ మన జీవితాలను సౌభాగ్యంతో, సంతోషంతో నింపాలి. సానుకూలత మన చుట్టూ వ్యాపించాలి’ అని పోస్ట్లో పేర్కొన్నారు.Greetings on the occasion of Diwali. May this festival of lights illuminate our lives with harmony, happiness and prosperity. May the spirit of positivity prevail all around us.— Narendra Modi (@narendramodi) October 20, 2025 -
తమిళనాడులో కుండపోత వర్షం.. చెన్నై పరిస్థితి దారుణం..
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై విమానాశ్రయంలో రన్వేపైకి నీళ్లు చేరడంతో ఎక్కడికక్కడే విమానాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఆదివారం రాత్రి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో, నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. తూర్పు తీర రోడ్డు (ECR) వెంబడి ఉన్న వేలచేరి, మేదవాక్కం, పల్లికరణై, నీలంకరై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికులు మోకాలి లోతు నీటితో ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్త వహించాలని అధికారులు కోరారు.మరోవైపు.. భారీ వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీశారు. ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందించాలని ఆదేశించారు. Heavy rain @aaichnairport. The runways are water-logged. @NewIndianXpress @ChennaiRains @praddy06 @IMDWeather #Chennaiairport #TamilNadu #ChennaiRains pic.twitter.com/lxlx6bdLYe— S V Krishna Chaitanya (@Krish_TNIE) October 20, 2025భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనా ప్రకారం.. చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, పుదుచ్చేరి, కారైకల్, పరిసర జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 22 వరకు తమిళనాడు తీరప్రాంతంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.@ChennaiRains @RainStorm_TN Heavy rains with gusty wind at Thoraipakkam #wetdiwali pic.twitter.com/rMl98JVZwV— Lakshmanan S (@Laxman190566) October 20, 2025కొండ ప్రాంతాలైన నీలగిరి, కల్లార్, కూనూర్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో నీలగిరి మౌంటైన్ రైల్వే (NMR)లో రైలు సర్వీసులు రద్దు చేసింది. చెట్లు కూలిపోవడం వల్ల ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగిందని దక్షిణ రైల్వే తెలిపింది. అక్టోబర్ 19న మెట్టుపాళయం–ఉదగమండలం (రైలు నం. 56136 మరియు 06171), ఉదగమండలం–మెట్టుపాళయం (రైలు నం. 56137) సహా మూడు రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. Heavy rain on the bypass road in Chinnamanur, Theni districtand drizzling continues @ChennaiRains @MasRainman @RainStorm_TN @kalyanasundarsv @praddy06 pic.twitter.com/tudC0r5Gbn— Michael 🌿 (@michaelraj_GD) October 19, 2025 -
వార్నీ.. ఇవేం సెలబ్రేషన్స్ భయ్యా!! దీపావళి-2025 ధమాకా.. వీటిని చూశారా?
దీపావళి వేళ.. ఒక చిన్న వీడియో, ఒక సరదా ఫోటో అసాధారణ స్పందనను తెచ్చుకుంటున్నాయి. లక్షల మంది హృదయాలను గెలుచుకుంటూ వైరల్ కంటెంట్గా మారుతున్నాయి. ఆ సాధారణ దృశ్యాలు, వినూత్న ఆలోచనలను సోషల్ మీడియా మరింత సంబరంగా మార్చుతోంది. వాటిల్లో కొన్ని మీకోసం..దీపావళి పండుగ వేళ.. ఇంటి డెకరేషన్లు, తమ ముస్తాబులు, తాము చేసుకునే సంబురాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అదే సమయంలో సరదాగానూ కొంత కంటెంట్ వైరల్ అవుతుంది. సినీ నటులు రజినీకాంత్, బ్రహ్మానందాలు నోట్లో బాంబులు పెట్టుకోవడం.. సినిమాల్లో దీపావళి శుభాకాంక్షలు చెప్పడం.. ఓ తెలుగమ్మాయి ధైర్యంగా సుతిల్ బాంబులను చేత్తో అంటించి విసిరేయడం, కుక్క నోటితో బాణాసంచాని కరుచుకుపోయి పదే పదే ఇంట్లో పడేయడం, పొల్యూషన్తో సంబంధం లేకుండా బాంబ్ఫ్రూఫ్ వేడుకలు(డప్పులు, తినే కంచాలతో సౌండ్లు).. ఇలాగన్నమాట. అయితే ఈసారి కొంత కొత్త స్టఫ్ నెట్లో వైరల్ అవుతోంది. ఇదేం సెలబ్రేషన్ భయ్యా.. అది అత్యంత ఖరీదైన ఏరియా. అలాంటి చోట ‘వెరీ లేజీ సెలబ్రేషన్స్’ను ఎవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది!. అవును.. నోయిడాలో ఓ బ్యాచిలర్ బద్మాషుగాళ్లు చేసిన పని నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీపావళి సెలబ్రేషన్స్లో భాగంగా.. కుల్వంత్ సింగ్, యాగేశ్వర్ అనే ఇద్దరు కుర్రాళ్లు తమ బాల్కనీకి అలంకరించారు. ఓ గ్రీన్ లైట్ దండ బల్బ్ సెట్ను వేలాడదీసి దానిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అంతే.. View this post on Instagram A post shared by Kulwant Singh Rangra (@kulwant_singh0810)రాత్రికి రాత్రే అది ఆ ఇద్దరినీ ఫేమస్ చేసింది. లక్షల మంది దానికి స్పందిస్తూ.. ఆ యువకులపై చిత్రవిచిత్రమైన కామెంట్లు చేశారు. దీంతో తమ బాల్కనీని మరిన్ని లైట్ సెట్లతో కలర్ఫుల్గా మార్చేశారు. కావాలని చేశారో.. అనుకోకుండా జరిగిందోగానీ లక్షల మందిని ఆకట్టుకున్న ఈ వీడియో వైరల్ సంబరంగా మారింది. నువ్వో ఆణిముత్యానివి!దీపావళి వేడుకల్లో ఓ వ్యక్తి ల్యాప్ట్యాప్తో చిందులేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైభవ్ చంద్ర అనే వ్యక్తి ఆఫీస్ దీపావళి సెలబ్రేషన్స్ వీడియో అంటూ దానిని పోస్ట్ చేశారు. అయితే.. ఈ వీడియో కొత్తేదేనా? వైభవ్ ఎందుకు పోస్ట్ చేశాడన్నదానిపై స్పష్టత లేదు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్నా.. దీపావళి వేడుకలను మిస్ కాలేదు అంటూ క్యాప్షన్ ఉంచాడు. దీంతో ఆ ఎంప్లాయిపై ఆణిముత్యం అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చర్చ మొదలైంది. View this post on Instagram A post shared by Vaibhav Chhabra (@vaibhav9497)టచ్ చేశావ్ భయ్యా.. హైదరాబాద్(తెలంగాణ)కు ఓ వ్యక్తి వెరైటీగా జరిపిన దీపావళి సంబురాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. సాధారణంగా మనకు డెలివరీలు వస్తే ఏం చేస్తాం.. వెంటనే పెమెంట్ చేసేసి మన పార్శిల్స్ అందుకుని వచ్చేస్తాం. కానీ, ఇక్కడో హైదరాబాదీ వివిధ డెలివరీ యాప్స్లో స్వీట్లను ఆర్డర్ చేసి.. తీసుకొచ్చిన ఆ డెలివరీ బాయ్స్ చేతికి అందించాడు. పైగా షేక్హ్యాండ్తో హ్యాపీ దీపావళి చెప్పడంతో నెట్టింట యూజర్లు తెగ ఖుషీ అయిపోతున్నారు. View this post on Instagram A post shared by Gundeti Mahendhar Reddy (@_the_hungry_plate_)యూ నెయిల్డ్ ఇట్ బ్రో!ఇక్కడో ఆర్టిస్ట్ వెరైటీగా చేసిన ప్రయత్నం.. నెట్టింట సందడి చేస్తోంది. తన సృజనాత్మతకు పని చెబుతూ.. చేతి గోళ్ల మీద ఓ వ్యక్తి పెయింటింగ్ వేశాడు. ఈ త్రీడి నెయిల్ ఆర్ట్లో.. బాణాసంచాతో పాటు హ్యాపీ దీపావళి అనే అక్షరాలనూ అతను చెక్కాడు. ఈ క్రమంలో.. ఓ గోటిపై ఏకంగా దీపాన్ని వెలిగించడం గమనార్హం. దీనిపై అతనికి ప్రశంసలతో పాటు కొంత మంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Yogesh Kumar (@love_nail_yogesh) -
మహారాష్ట్రలో కోటి బోగస్ ఓట్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో కనీసం కోటి బోగస్ ఓట్లున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ ఓట్లను ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేస్తూ నవంబర్ ఒకటో తేదీన ముంబైలో ఉమ్మడిగా ర్యాలీ చేపడతామని ప్రకటించాయి.ఆదివారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)నేత బాల నంద్గావోంకర్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత సచిన్ సావంత్, ఎన్సీపీ(ఎస్పీ)నేత జయంత్ పాటిల్లు మీడియాకు ఈ విషయం తెలిపారు. త్వరలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నకిలీ ఓటర్లను తొలగించాకే నిర్వహించాలని వారు ఈసీని కోరారు. అంతకుముందు, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 96 లక్షల ఫేక్ ఓటర్లను జాబితాల్లో చేర్చారని ఆరోపించారు. ఒక్క ముంబైలోనే సుమారు 10 లక్షల నకిలీ ఓట్లున్నాయన్నారు. నకిలీ ఓట్లతో ఎన్నికలు జరపడం ఓటర్లను అవమానించడమేనన్నారు. -
‘భారత్కు భారీ సుంకాల మోతే..’ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!
రష్యా-భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చమురు కొనుగోలును భారత్ తక్షణమే ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారాయన. ఈ క్రమంలో మోదీకి తనకు మధ్య ఫోన్ సంభాషణేదీ జరగలేదన్న భారత విదేశాంగ శాఖ ప్రకటనపైనా ఆయన స్పందించారు. ఆదివారం రాత్రి కొందరు రిపోర్టర్ల నుంచి ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. దానికి స్పందిస్తూ.. ‘‘ఆయన(మోదీ) రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని నాతో స్పష్టంగా చెప్పారు. అయినా కూడా కొనుగోళ్లు జరుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే భారీ సుంకాలను ఆ దేశం ఎదుర్కొనక తప్పదు’’ అని ట్రంప్ హెచ్చరించారు(Trump On India Russia Oil Trade). ఆ సమయంలో.. ‘‘ప్రధాని మోదీ మీకు మధ్య ఇటీవలి ఫోన్ సంభాషణ జరిగిందన్న తమకు తెలియదని భారత ప్రభుత్వం చెబుతోంది కదా’’ అని ఓ రిపోర్టర్ ట్రంప్ వద్ద ప్రస్తావించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘వాళ్లు అలా చెప్పాలనుకుంటే కచ్చితంగా భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. కానీ, వాళ్లు అలా చేయాలనుకోరని నేను అనుకుంటున్నా’(Trump Warn India) అని బదులిచ్చారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేసిందని, రాబోయే రోజుల్లో పూర్తిగా ఆపేస్తుందని, ఈ మేరకు తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ లభించిందని ట్రంప్ గత బుధవారం తన ఓవెల్ ఆఫీస్లో స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఇద్దరు నేతల మధ్య అలాంటి ఫోన్ సంభాషణేది జరగలేదన్న భారత విదేశాంగ శాఖ.. ఎవరి ఒత్తిళ్లు తమపై పని చేయబోవని, దేశ ప్రజల ప్రయోజనాల మేరకే ఎలాంటి నిర్ణయం అయినా ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఆ మరుసటిరోజు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ సమయంలో మాట్లాడుతూ.. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయబోదని, ఢిల్లీ వర్గాల నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందని, ఉక్రెయిన్ యుద్ధంలో ఇది కీలక అడుగు అని, ఈ ప్రభావంతో రష్యా ఆర్థిక స్థితిపై ప్రభావం పడి యుద్ధం ఆగిపోతుందని అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్తో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తోందని.. పైగా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతూ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తోందంటూ ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో సుంకాల యుద్ధానికి దిగారు. భారత్పై జులై 31వ తేదీన 25 శాతం అదనపు సుంకాన్ని(ప్రతీకార సుంకాన్ని) విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆ వెంటనే రష్యా చమురు కొనుగోలు నేపథ్యంతో ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం సుంకాన్ని పెనాల్టీగా విధించారు. అలా.. ఆగష్టు 27వ తేదీ నుంచి భారత్పై అమెరికా వివధించిన 50 శాతం టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. ఈ సుంకాలను భారత్ అన్యాయంగా పేర్కొంటూనే.. మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ తాజా హెచ్చరికలపై భారత్ ఎలా స్పందిస్తుంది.. ఈ ప్రభావం ట్రేడ్ డీల్పై పడుతుందా? అనేది చూడాలి(Trump Massive Tariff Warn To India).ఇదీ చదవండి: ట్రంప్ది ముమ్మాటికీ నిరంకుశ పాలనే! -
కొడుకును వెళ్లగొట్టినా.. కోడలికి హక్కుంటది
న్యూఢిల్లీ: కుటుంబ కలహాల కారణంగా తమ ఆస్తిపై కుమారుడికి హక్కు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వారి ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కు కోడలికి (కుమారుడి భార్యకు) ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహ బంధంతో అత్తగారింట్లోకి అడుగుపెట్టి కాపురం ఉన్న కోడలికి ఆ ఇంట్లో నివసించే హక్కును తిరస్కరించటం గృహసింహ చట్టం ప్రకారం సాధ్యం కాదని ఈ నెల 16న జస్టిస్ సంజీవ్నారుల్ స్పష్టంచేశారు. ఆ ఇంట్లో నుంచి కోడలిని వెళ్లగొట్టాలంటే చట్టప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇదీ కేసు.. ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం తమ కుమారుడికి 2010లో వివాహం జరిపించింది. అప్పటినుంచి అత్త, మామ, కొడుకు, కోడలు ఒకే ఇంట్లో ఉన్నారు. అయితే, 2011 నుంచి తల్లిదండ్రులతో కుమారుడికి గొడవలు మొదలు కావటంతో కొంతకాలం కొడుకు, కోడలు తమ సొంత ఇంటిని వదిలి అద్దె ఇంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ఆస్తిపై కొడుక్కు ఎలాంటి హక్కులు లేవని తల్లిదండ్రి ప్రకటించారు. ఆ ఆస్తి తమ స్వార్జితమని, దానిపై తమకే పూర్తి హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత కొంతకాలానికి కోడలు తిరిగి అత్తగారింటికి రావాలని నిర్ణయించుకుంది. కానీ, అప్పటికే ఆమె వస్తువులన్నీ ఆ ఇంట్లో నుంచి తీసివేశారు. అయినా, ఆమె ఆంట్లోకి తిరిగి వచ్చింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ అత్తమామ హైకోర్టును ఆశ్రయించారు.తమ కుమారుడినే త్యజించామని, అలాంటప్పుడు కోడలికి తమ ఇంట్లో నివసించే హక్కు లేదని వాదించారు. ఈ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. కోడలిగా అత్తగారింట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆమెకు ఆ ఇంట్లో నివసించే హక్కు ఉంటుందని స్పష్టంచేసింది. అత్తమామలు తన భర్తకు హక్కులు నిరాకరించినా, ఆమె హక్కులను కాదనలేరని తేల్చి చెప్పింది. అత్తమామ ఇంట్లో మొదటి అంతస్తులో, కోడలు గ్రౌండ్ఫ్లోర్లో నివసించాలని సూచించింది.గృహసింహ చట్టంలోని సెక్షన్ 17(1) ప్రకారం కుటుంబసభ్యురాలిగా ఉన్న మహిళలకు వారి ఉమ్మడి ఇంట్లో నివసించే అధికారం, హక్కు ఉంటాయని తెలిపింది. సెక్షన్ 17(2) ప్రకారం ఆ మహిళలను ఉమ్మడి ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలంటే కచ్చితంగా చట్టప్రకారమే వెళ్లాలని స్పష్టంచేసింది. కొడుకు కోడలు తమ ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని నాశనం చేశారన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. కొడుకు, కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయినంత మాత్రాన ఉమ్మడి కుటుంబ వాతావరణం చెడిపోయినట్లు కాదని వివరణ ఇచ్చింది. -
ప్రమాదకరంగా ఢిల్లీలో వాయు కాలుష్యం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానిలో వాయుకాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది(Delhi Pollution). సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) ప్రకారం.. ఆదివారం వాయునాణ్యత(AQI) సూచీ 300 మార్కు దాటింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత పడిపోవడంతో విజిబిలిటీ తగ్గింది. దీంతో గ్రాప్-2 చర్యలను అమల్లోకి తెచ్చారు. గ్రాప్-2(GRAP-2) చర్యల నేపథ్యంలో.. ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. డీజిల్ జనరేటర్లు, కట్టెల పొయ్యిపై నిషేధం ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఐదు రోజులుగా దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. దీంతో దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని.. అదే 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని.. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ చెబుతుంది. ఇదీ చదవండి: ‘దీపాలపై డబ్బులు తగలేయొద్దు!’ -
చెట్టుకు వేలాడదీసిన మంచంపై కూర్చుని నిరాహారదీక్ష
జల్నా/థానే: తమ హక్కులు సాధించుకునేందుకు శాంతియుత మార్గంలో చేపట్టే నిరసనల్లో ప్రధానమైనది నిరాహారదీక్ష. సాధారణంగా ఓ ప్రాంతంలో టెంటు వేసుకొని నిరాహారదీక్షలు చేయటం మనం చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఒక చెట్టుకు నులక మంచాన్ని వేలాడదీసి, అందులో కూర్చొని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. మహారాష్ట్రలో బంజారాలను ఎస్టీలుగా పరిగణించరు. వారిని విముక్త, సంచార జాతుల (వీజేఎన్టీ) జాబితాలో చేర్చారు. అయితే, హైదరాబాద్ గెజిట్ ప్రకారం తమను ఎస్టీల్లో చేర్చాలని వారు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ సాధనకోసం మహారాష్ట్రలోని జల్నా పట్టణానికి సమీపంలో ఉన్న అంబద్ చౌఫుల్లీ ప్రాంతంలో విజయ్ చవాన్ అనే వ్యక్తి ఇలా మంచాన్ని చెట్టుకు వేలాడదీసి శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. పూర్వపు హైదరాబాద్ స్టేట్లో తమ జాతిని ఎస్టీల్లో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చారని, మండల్ కమిషన్ సమయంలో మహారాష్ట్రలోని బంజారాలను వీజేఎనీ్టలుగా వర్గీకరించటంతో ఆ హోదా కోల్పోయామని ఆగ్రహం వ్యక్తంచేశాడు. తిరిగి ఎస్టీ హోదా సాధనకోసమే తీను నిరాహార దీక్షకు పూనుకున్నట్లు వెల్లడించాడు. నిజానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దే దీక్షకు ప్రయత్నించినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలిపాడు. ఎస్టీ హోదా కోసం మహారాష్ట్రలో బంజారాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మరాఠాలను ఓబీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించటంతో ఇతర వర్గాలు కూడా తమ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలు ఉధృతం చేశాయి. ఎస్టీ హోదా కోసం నవంబర్ 9న ముంబైలోని శివాజీ పార్కులో నిరసన చేపట్టనున్నట్లు మాజీ ఎంపీ హరిభావ్ రాథోడ్ ప్రకటించారు. -
బిహార్లో హోరాహోరీ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. మొత్తం రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి అంకానికి తెరలేచింది. నవంబర్ 6వ తేదీన మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో 18 జిల్లాల పరిధిలోని 121 శాసనసభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోరు ముఖ్యంగా అధికార, విపక్ష కూటముల్లోని ప్రధాన పార్టీలైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), లాలు ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రా్రïÙ్టయ జనతాదళ్ (ఆర్జేడీ)లకే అగ్నిపరీక్షగా మారింది. తొలి దశలోని అత్యధిక స్థానాల్లో ఈ రెండు పార్టీలే పోటీ పడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బరిలో ఎవరెవరు? తొలి దశ ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులు కలిపి మొత్తం 1698 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఎన్డీయే, మహాఘట్బంధన్ కూటముల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. మహాఘట్బంధన్ కూటమి నుంచి ఆర్జేడీ ఏకంగా 71 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 25, సీపీఐ (ఎంఎల్) 13 చోట్ల బరిలో ఉన్నాయి. ఎన్డీయే తరఫున జేడీయూ 57 సీట్లలో, బీజేపీ 48, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జనశక్తి (రామ్ విలాస్) పార్టీ 14 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ముఖాముఖి పోరు.. హోరాహోరీ! ఈ 121 స్థానాల్లో అనేక చోట్ల నువ్వా–నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ముఖ్యంగా 36 కీలక స్థానాల్లో ఆర్జేడీ, జేడీయూ అభ్యర్థులు నేరుగా తలపడుతున్నారు. మరో 23 స్థానాల్లో ఆర్జేడీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా, ఇంకో 23 సీట్లలో కాంగ్రెస్–బీజేపీ మధ్య ముఖాముఖి పోరు జరగనుంది. దిగ్గజాల భవితవ్యం.. పరువు కోసం పోరు! తొలి దశ ఎన్నికలు పలువురు రాజకీయ దిగ్గజాలు, ప్రముఖుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి (తారాపూర్), విజయ్ కుమార్ సిన్హా (లఖిసరాయ్) భవితవ్యం కూడా ఈ దశలోనే తేలనుంది. వీరితో పాటు భోజ్పురి సూపర్స్టార్ పవన్ సింగ్ (చప్రా నుంచి), జానపద గాయని మైథిలీ ఠాకూర్ (అలీనగర్ నుంచి) వంటి సెలబ్రిటీ అభ్యర్థులు కూడా బరిలో ఉండటం ఆసక్తిని రేపుతోంది. వీరే కాకుండా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు సైతం తొలి విడతలోనే తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో మొదటి దశ ఫలితాలు తదుపరి దశలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అమ్మాయిలకు విద్య..అందని ద్రాక్షే!
న్యూఢిల్లీ: అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడల్లా వినిపించే ఒకే ఒక మాట లింగసమానత్వం. దశాబ్దాలుగా లింగసమానత్వం కోసం ప్రపంచదేశాలు పోరాడుతున్నా ఏదో ఒక రంగంలో లింగఅసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. వీటికితోడు అమ్మాయిలు పాఠశాల విద్యకు దూరమవుతున్న ధోరణిలో ఏమాత్రం మార్పురావట్లేదని తాజాగా యునెస్కో ప్రపంచ విద్యా పర్యవేక్షణ(జెమ్) బృంద పరిశోధనలో తేలింది. విద్యసహా అన్ని రంగాల్లో లింగసమానత్వ సాధనే ధ్యేయంగా 1995లో చేసిన బీజింగ్ డిక్లరేషన్ ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదని యునెస్కో ఆవేదన వ్యక్తంచేసింది. దశాబ్దాలుగా కోట్లాది మంది అమ్మాయిలు ఇంకా కనీసం పాఠశాల విద్యకు కూడా నోచుకోవట్లేదని యునెస్కో జెమ్ బృందం వెల్లడించింది. మారని పరిస్థితి‘‘1995 ఏడాది నుంచి చూస్తే నేటి ఆధునిక ప్రపంచంలో విద్యావ్యవస్థలో లింగసమానత్వ సాధనకు కృషి అధికమైంది. ఇప్పుడు ప్రాథమిక, దిగువ, ఎగువ మాధ్యమిక పాఠశాలల్లో బాలురతో సమానంగా బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు అన్ని దేశాల్లో 9.1 కోట్ల మంది అమ్మాయిలు ప్రాథమిక విద్య చదువుతున్నారు. కానీ మాధ్యమిక విద్య విషయానికి వచ్చేసరికి ఏకంగా 13.3 కోట్ల మంది అమ్మాయిలు పాఠశాలకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ వైరుధ్యం అంతటా ఒకేలా లేదు. ప్రాంతాల వారీగా చూస్తే మధ్యాసియా, దక్షిణాసియా దేశాల్లో బాలికలు విద్యలో రాణిస్తుండగా సహారా ఆఫ్రికా ప్రాంతంలో బాలికలకు పాఠశాల విద్య అనేది అందని ద్రాక్షలా మిగిలిపోతోంది’’అని జెమ్ బృంద సభ్యులు ఒకరు మీడియాతో చెప్పారు. లాటిన్ అమెరికాలో మరోలా.. ‘‘ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, వేలాది పాలినేసియా, మైక్రోనేసియా, మెలనేసియా దీవుల సమాహారమైన ‘ఓషేనియా’లో గతంలో విద్యలో లింగసమానత్వం ఉండేది. ఇప్పుడది కరువైంది. ఇక లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో మాధ్యమిక విద్యలో అబ్బాయిల కంటే అమ్మాయిలే అధికంగా రాణిస్తుండటం విశేషం. అయితే గినియా, మాలీ లాంటి దేశాల్లో పరిస్థితి అమ్మాయిల విషయంలో అధ్వాన్నంగా ఉంది. కొన్ని పాఠశాలల్లో అసలు విద్యారి్థనులే లేరు. కడు పేదరికం, బాల్య వివాహాలు, సౌకర్యాల లేమి, అనారోగ్యం వంటి కారణాలతో అమ్మాయిలకు పాఠశాల విద్య అనేది సుదూర స్వప్నంగా మారింది’’అని జెమ్ బృందసభ్యుడు వెల్లడించారు. మహిళా టీచర్ల ప్రాతినిథ్యం పెరగాలి విద్యలో నాయకత్వ స్థాయిలో మహిళల ప్రాతినిథ్యం సైతం తక్కువగా ఉంటోంది. పురుష టీచర్లతో పోలిస్తే మహిళా టీచర్ల సంఖ్య సైతం చాలా తక్కువగా ఉంది. ఉన్నత విద్యలో ఇంకా మహిళా టీచర్ల సంఖ్య 30 శాతమే. ఇలాంటి వ్యవస్థాగత అసమానతలు సైతం విద్యలో సమానత్వ సాధనకు ప్రతిబంధకాలుగా పరిణమిస్తున్నాయి. బాలికలు, అమ్మాయిల విద్యావకాశాలు మెరుగుపడేలా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తూ ప్రపంచం సంస్కరణపథంలో దూసుకుపోవాలని బీజింగ్ డిక్లరేషన్ చాటుతోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్,మ్యాథమేటిక్స్(స్టెమ్) కోర్సు ల్లో అమ్మాయిల ప్రాతినిథ్యం పెరగాలని ఆనాడు ప్రపంచదేశాలు ఆకాంక్షించాయి. బాలికావిద్య అనేది కేవలం వాళ్ల హక్కు కాదు. అది మహిళల, చిన్నారుల, సమాజ భవిష్యత్తు. నాటి బాసలను నిలబెట్టుకున్ననాడే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది’’అని నివేదిక హెచ్చరించింది. నెరవేరని ఆశయాలు, ఆకాంక్షలు ‘‘ప్రపంచవ్యాప్తంగా పాఠశాల్లో అమ్మాయిల చేరికలు అధికంగా ఉండాలని, ఆమేరకు అన్ని దేశప్రభుత్వాలు కృషిచేయాలని బీజింగ్ డిక్లరేషన్ ఉద్ఘాటించింది. కానీ ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. పాఠశాలల్లో లైంగిక విద్య సైతం ఖచి్చతంగా బోధించాలి. లేదంటే అదే లైంగిక అంశాలను చిన్నారులు పాఠశాల విద్యకు ఆవల తప్పుడు కోణంలో తెల్సుకుంటారు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ వంటి అంశాలను చిన్నారులకు ప్రపంచంలో మూడింట రెండొంతుల దేశాల్లో ప్రాథమిక స్థాయిలోనే నేర్పించాలి. మాధ్యమిక విద్య స్థాయిలో నాలుగింట మూడొంతుల దేశాల్లో నేర్పించాలి’’అని నివేదిక అభిప్రాయపడింది. -
కొత్తగా 10,650 ఎంబీబీఎస్ సీట్లు
న్యూఢిల్లీ: వైద్య విద్య అభ్యసించాలని కోరుకొనే ఔత్సాహికులకు శుభవార్త. దేశంలో 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా 10,650 ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఆమోదం తెలియజేసింది. అలాగే కొత్తగా 41 వైద్య కశాళాలలు కూడా రాబోతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్య 816కి చేరుకోనుంది. రాబోయే ఐదేళ్లలో కొత్తగా 75 వేల ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు 2024లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్య విద్యను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే 10,650 సీట్లకు తాజాగా ఆమోదం లభించింది. మరో 5,000 పీజీ మెడికల్ సీట్లు అండర్గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ సీట్ల విస్తరణకు వైద్య కళాశాలల నుంచి 170 దరఖాస్తులు వచ్చాయని ఎన్ఎంసీ చైర్పర్సన్ డాక్టర్ అభిజాత్ సేథ్ చెప్పారు. ఇందులో 41 దరఖాస్తులు ప్రభుత్వ కాలేజీల నుంచి, 129 దరఖాస్తులు ప్రైవేట్ కాలేజీల నుంచి వచ్చినట్లు తెలిపారు. కొత్తగా 10,650 సీట్ల రాకతో 2024–25లో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,37,600కు చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఇక పోసు్ట్రగాడ్యుయేట్ సీట్ల విషయంలో 3,500 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈసారి మరో 5,000 పీజీ మెడికల్ సీట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో దేశమంతటా మొత్తం పీజీ సీట్ల సంఖ్య 67,000కు చేరుతుందని స్పష్టంచేశారు. ఈ ఏడాది మొత్తంగా 15,000 యూజీ, పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి రాబోతున్నట్లు చెప్పారు. ఐసీఎంఆర్తో వైద్య విద్య అనుసంధానం యూజీ, పీజీ సీట్లకు తుది అనుమతి, కౌన్సెలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, నిర్దేశిత గడువులోగానే ఈ ప్రక్రియ పూర్తవుతుందని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అక్రెడిటేషన్, పరీక్షలు, సీట్ల ఆమోదానికి త్వరలో బ్లూప్రింట్ను ప్రచురించబోతున్నారు. 2025–26లో దరఖాస్తులకు పోర్టల్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని అధికారులు వివరించారు. వైద్య విద్యలో నాణ్య తను పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని డాక్టర్ అభిజాత్ సేథ్ తెలిపారు. మెడికల్ పాఠ్య ప్రణాళిక(కరిక్యులమ్)లో క్లినికల్ రీసెర్చ్ను అంతర్భాగంగా చేర్చబోతున్నట్లు స్పష్టంచేశారు. -
దీపాలపై డబ్బులు తగలేయొద్దు
లక్నో: దీపావళి వేడుకలపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీపాలు, కొవ్వొత్తులపై అనవసరంగా డబ్బులు తగలేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దీపాలు వెలిగించడానికి ప్రజల సొమ్ము వృథా చేయొద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘సలహాలు ఇవ్వాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ, రాముడి పేరిట ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. కొన్ని నెలలపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. నగరాలు, ఇళ్లను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తారు. మనం కూడా అలా ఎందుకు చేయకూడదు? క్రిస్మస్ నుంచి మనం ఎందుకు నేర్చుకోకూడదు. దీపాలు, కొవ్వొత్తుల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. ఈ విషయం అందరూ ఆలోచించాలి. డబ్బులు వృథా చేయొద్దు. ప్రభుత్వం నుంచి మనం కోరుకొనేది ఆదే. విద్యుత్ దీపాలతో దీపావళి వేడుకలు చేసుకుందాం’’ అని ప్రజలకు అఖిలేశ్ యాదవ్ సూచించారు. ఆ దుర్గతి హిందువులకు పట్టలేదు: వీహెచ్పీ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి దీపావళి సందర్భంగా క్రిస్మస్ను ప్రశంసిస్తున్నాడని, ఈ విషయం ప్రజలు గమనించాలని కోరారు. వరుస దీరిన దీపాలు అఖిలేశ్ హృదయాన్ని కాల్చేస్తున్నాయని చెప్పారు. అందుకే దీపాలపై డబ్బులు ఖర్చు చేయొద్దని చెబుతున్నాడని, క్రిస్మస్ను చూసి నేర్చుకోవాలని చెబుతున్నాడని విమర్శించారు. అఖిలేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఆయన ఆంటోనీ లేదా అక్బర్: బీజేపీ అఖిలేశ్ యాదవ్పై మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి, బీజేపీ నాయకుడు విశ్వాస్ సారంగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అఖిలేశ్ను ఆంటోనీ లేదా అక్బర్ అని పిలవాలని అన్నారు. ఆయన మతం మారినట్లు కనిపిస్తోందని చెప్పారు. ప్రమిదలు తయారు చేసి, మన ఇళ్లల్లో వెలుగులు నింపే పేద కారి్మకులను అవమానిస్తారా? అని విశ్వాస్ సారంగ్ నిప్పులు చెరిగారు. -
కర్నాటకలో ఆర్ఎస్ఎస్ మార్చ్కి నో
కలబురిగి: కర్నాటకలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్లో ఆదివారం ఆర్ఎస్ఎస్ ‘రూట్ మార్చ్’నిర్వహించాలని భావించింది. ఈ మేరకు తహశీల్దార్కు దరఖాస్తు చేసుకుంది. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందంటూ తహశీల్దార్ అనుమతి నిరాకరించారు. ఆ దరఖాస్తును తిరస్కరించారు. కలబురిగి జిల్లా చిట్టాపూర్ పట్టణంలో అక్టోబర్ 19వ తేదీన ఆర్ఎస్ మార్చ్ నిర్వహణకు అనుమతి కోరిందని తహశీల్దార్ చెప్పారు. భీమ్ ఆర్మీ, ఇండియన్ దళిత్ పాంథర్స్ కూడా అదే రోజు ర్యాలీలు జరుపుతామని దరఖాస్తు చేసుకున్నాయన్నారు. వీటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయంటూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నో చెప్పామన్నారు. అదేవిధంగా, ర్యాలీకి అనుమతివ్వక మునుపే ఏర్పాటు చేశారంటూ పట్టణ ప్రధాన రహదారిపైని ఆర్ఎస్ఎస్ కటౌట్లు, బ్యానర్లను శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది తొలగించి వేశారు. ప్రభుత్వ ప్రాంగణాలు, భవనాల్లో అనుమతి లేకుండా ఏ సంస్థలు గానీ వ్యక్తులు గానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదంటూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
నమ్మక ద్రోహుల ఓట్లు నాకు అక్కర్లేదు
పట్నా: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలుచేసే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి మైనారిటీలపై అనుచితంగా మాట్లాడారు. బిహార్లో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఆదివారం అర్వాల్ జిల్లాలో గిరిరాజ్ మాట్లాడారు. ‘‘ఒకసారి నేను మౌల్వి(ముస్లిం మతాధికారి)ని ఒక ప్రశ్న వేశా. మీకు కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యకార్డ్ ఉందా? అని అడిగితే ఉంది అని చెప్పారు. హిందూ–ముస్లిం ప్రాతిపదికన మాత్రమే ప్రభుత్వం ఈ కార్డ్లు ఇచ్చిందని భావిస్తున్నారా? అని అడిగితే లేదు అని సమాధానం చెప్పారు. మీకు నాకు ఓటేశారా? అంటే అవునన్నారు. మరి ఖుదా (దైవం) మీద ప్రమాణంచేసి నిజం చెప్పండి అంటే ఆయన చెప్పలేదు. ముస్లింలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ వాడుకుంటారు. వాటి ప్రయోజనాలు, లబ్ధి పొందుతారు. కానీ ఓటు మాత్రం మాకు వేయరు. ఇలాంటి వాళ్లనే నమ్మకద్రోహులు అంటారు. మీలాంటి వాళ్ల ఓటు నాకు వద్దు అని ఆయన ముఖం మీదనే చెప్పేశా’’ అని ర్యాలీలో గిరిరాజ్సింగ్ వెల్లడించారు. ‘‘బిహార్లో మొత్తం మౌలికసదుపాయాల కల్పనకు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో చేసింది. బిహార్లో రోడ్డు కేవలం ఎన్డీఏ నేతల కోసం వేయలేదు. మొత్తం ప్రజల కోసం వేశారు. ఇప్పుడు బిహార్ ఎంతో మారింది. సమాజంలోని ప్రతి వర్గం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది. అయినాసరే ముస్లింలు బీజేపీకి ఓటు వేయట్లేరు’’ అని ఆయన అన్నారు. మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ -
పండగ సీజన్లో స్వదేశీ ఉత్పత్తులనే కొనండి
న్యూఢిల్లీ: పర్వదినాల సందర్భంగా స్వదేశీ వస్తువులను కొనుగోలుచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ 140 కోట్ల మంది భారతీయుల కృషి, సృజనాత్మక వస్తువులైన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఈ పండగ సీజన్ను ఆనందాలతో గడపండి. భారతీయ ఉత్పత్తులను కొనండి. మేం కొన్నది స్వదేశీ ఉత్పత్తి అని గర్వంతో చెప్పండి. పండగ సీజన్లో ఏఏ స్వదేశీ ఉత్పత్తులను కొన్నారో వాటి వివరాలను మీమీ సొంత సామాజికమాధ్యమ ఖాతాల్లో పోస్ట్చేసి అందరితో షేర్చేసుకోండి. స్వదేశీ ఉత్పత్తులను, వాటి కొనుగోళ్లను ప్రోత్సహించండి. కొన్నవి అన్నీ సోషల్ మీడియాలో పెట్టండి. ఇలా మీరు ఇంకొకరిలో స్ఫూర్తిని రగిలించగలరు’’ అని మోదీ హితవు పలికారు. -
22న లద్దాఖ్ ప్రతినిధులతో కేంద్రం భేటీ
లేహ్: ఈ నెల 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్ ప్రతినిధులతో చర్చలు జరపనుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సారథ్యంలో ఏర్పాటైన ఉప సంఘం ఢిల్లీలో లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ), కార్గిల్ డెమోక్రాటిక్ అలయెన్స్(కేడీఏ) ప్రతినిధులతోపాటు లద్దాఖ్ ఎంపీ మహ్మద్ హనీఫా జాన్తో సమావేశం కానుందని ఎల్ఏబీ సహాధ్యక్షుడు చెరింగ్ డోర్జె లక్రుక్ ఆదివారం వెల్లడించారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించడం, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చడంపైనే ప్రధానంగా చర్చలు జరుగుతాయని లక్రుక్ మీడియాకు వివరించారు. తమను కేంద్రం చర్చలకు ఆహ్వానించడాన్ని ఆయన స్వాగతించారు. చర్చలతో సానుకూల ఫలితం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లద్దాఖ్కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో ఎల్ఏబీ సెప్టెంబర్ 24వ చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారడం. ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను అధికారులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేయడం తెల్సిందే. కాగా, తనతోపాటు ఎల్ఏబీ లీగల్ అడ్వైజర్, అంజుమన్ ఇమామియా అధ్యక్షుడు అఫ్రాఫ్ అలీ బర్చా, కేడీఏ తరఫున మరో ముగ్గురు చర్చల్లో పాల్గొంటారని లక్రుక్ వివరించారు. -
జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ మెయిన్–2026)ను వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ప్రవేశపరీక్ష తొలిదశకు ఈ నెలలోనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి 10 వరకు రెండో దశను నిర్వహిస్తామని పేర్కొంది. రెండో దశ కోసం జనవరి చివరి వారంలో దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించింది. ఈలోగా విద్యార్థులంతా వారి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేసుకోవాలని సూచించింది. అయితే నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఎన్టీఏ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా, దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ.. ఈసారి జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలను పెంచాలని నిర్ణయించింది. -
'నాడి' పట్టుకోవాలి
అల్జీమర్స్, స్ట్రోక్, మూర్ఛ.. ఇలాంటి నాడీ సంబంధ సమస్యలు ప్రపంచంలో 40 శాతానికిపైగా జనాభాను కుంగదీస్తున్నాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెనుభారంగా పరిణమిస్తున్నాయని వెల్లడించింది. సంస్థ చరిత్రలో తొలిసారి ఈ వ్యాధులపై ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ న్యూరాలజీ’ పేరిట నివేదికను విడుదల చేసింది. మొత్తం సభ్య దేశాల్లో కేవలం 32 శాతం (63 దేశాలు) మాత్రమే.. నాడీ సంబంధ సమస్యల నివారణకు జాతీయ విధానం ప్రకటించాయని, ఇందులో భారత్ కూడాఉందని నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రపంచంలోని మూడో వంతు దేశాల్లో కూడా.. పెరుగుతున్న నాడీ సంబంధ సమస్యలపై ఇప్పటికీ నిర్దిష్ట జాతీయ విధానం అంటూ ఒకటి లేదు. 2021 నాటికి ప్రపంచ జనాభాలో సుమారు 42 శాతం మంది (దాదాపు 340 కోట్లకుపైగా) ప్రజలు నాడీ సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారు. వీటివల్ల ఏటా 1.1 కోట్ల మంది మరణిస్తున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ న్యూరాలజీ’ వెల్లడించింది.జాతీయ విధానం 32%దేశాల్లోనే..ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఉన్న మొత్తం 194 సభ్య దేశాల్లో 102 మాత్రమే ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది. ప్రపంచ జనాభాలో 71 శాతం ఈ దేశాల్లోనే ఉంది. మొత్తం సభ్య దేశాల్లో 32 శాతం (63 దేశాలు) మాత్రమే.. నాడీ సంబంధ సమస్యల నివారణకు జాతీయ విధానం ప్రకటించాయి. కేవలం 34 దేశాలే.. ఇందుకోసం నిధులు కేటాయించాయట. 49 దేశాలు (25 శాతం) మాత్రమే.. ఆయా దేశాల్లోని సార్వత్రిక ఆరోగ్య పథకాల్లో నాడీ సంబంధ సమస్యలను చేర్చాయి.ఒక డాలర్ ఖర్చు.. 10 డాలర్ల రాబడినాడీ సంబంధ సమస్యలు.. ముఖ్యంగా మెదడు ఆరోగ్యంపై అన్ని దేశాలూ విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. నాడీ సంబంధ వ్యాధుల నివారణకు చేపట్టే చర్యలు దీర్ఘకాలంలో ఆర్థికంగా ప్రయోజనకరమైనవేనని తెలిపింది. ‘ఉదాహరణకు స్ట్రోక్, హృద్రోగాలపై పెట్టే ఒక డాలర్ ఖర్చు.. 10 డాలర్ల కంటే ఎక్కువ రాబడి ఇస్తుంది. ఇలా ఆలోచిస్తే ఈ సమస్యలన్నింటిపైనా చేసే ఖర్చును వ్యయంలా భావించలేం. అవి భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలను సుసంపన్నం చేసే పెట్టుబడులే’ అని పేర్కొంది.నివేదికలో మనదేశ ప్రస్తావనప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికలో మనదేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కర్ణాటక రాష్ట్రం ‘కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనీషియేటివ్ (కభీ)’ పేరిట ఆ రాష్ట్రంలో నాడీ సంబంధ రుగ్మతల నివారణకు సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి 2023లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది. ఇందులో భాగంగా 32 క్లినిక్లు ఏర్పాటుచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రోక్, డిమెన్షియా వంటి రుగ్మతలతో బాధపడేవారి వివరాలను డిజిటైజ్ చేసింది. అనేక రూపాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమ స్ఫూర్తితో భారత ప్రభుత్వం 2024లో మెదడు ఆరోగ్యంపై జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసింది.2021లో మరణాలు లేదా అంగ వైకల్యానికి కారణమైన ప్రధాన నాడీ సమస్యలు..స్ట్రోక్, అప్పుడే పుట్టిన పిల్లల్లో మెదడులో సమస్యలు, మైగ్రెయిన్, అల్జీమర్స్, మతిభ్రమణం, డయాబెటిక్ న్యూరోపతి, మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరల వాపు), నెలలు నిండక ముందే పుట్టే పిల్లల్లోని నాడీ సంబంధ సమస్యలు, ఆటిజం సంబంధిత సమస్యలు, నాడీ సంబంధ కేన్సర్లు.2021 గణాంకాల ప్రకారం చూస్తే.. మైగ్రెయిన్, మల్టిపుల్ స్కె›్లరోసిస్ (కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి) మహిళల్లో ఎక్కువగా ఉంటే.. పార్కిన్సన్స్, స్ట్రోక్ పురుషుల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2021లో మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య 5.17 కోట్లు. -
ఏఐ వాణిజ్యం ఇంతింతై!
కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తులు.. 2025 మొదటి ఆరు నెలల్లో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించాయని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో పేర్కొంది. సెమీకండక్టర్లు, ప్రాసెసర్లు, సర్వర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు.. ఇలా ఏఐలో అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది. మనదేశం నుంచి ఏఐ సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నా.. ఇప్పటికీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం.2024 మొదటి ఆరు నెలల్లో కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తుల వాణిజ్యం విలువ 1.61 లక్షల కోట్ల డాలర్లు కాగా.. 2025లో ఇదే సమయంలో 1.92 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే 20 శాతం వృద్ధి అన్నమాట. మనదేశంలో 2023–24తో పోలిస్తే 2024–25లో ఏఐ సంబంధిత దిగుమతులు 13.1 శాతం పెరిగాయి. వీటి మొత్తం విలువ 66.8 బిలియన్ డాలర్లు.ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అత్యాధునిక కంప్యూటింగ్ హార్డ్వేర్ కోసం మనం ఇప్పటికీ అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. మనదేశ మొత్తం దిగుమతుల్లో.. అమెరికా నుంచి వచ్చే 5 ఉత్పత్తులదే ఏకంగా 50 శాతం వాటా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనదేశం నుంచి బోర్డులు, ప్యానెళ్లు వంటి వాటి ఎగుమతులు 2023–24తో పోలిస్తే అత్యధికంగా 58.5 శాతం పెరిగాయి.ప్రపంచ దేశాల్లో ఏఐకి సంబంధించి విధానపరమైన చర్యలు చేపట్టిన దేశాలు ఇప్పటికీ తక్కువే ఉన్నాయని డబ్ల్యూటీవో నివేదిక చెబుతోంది. అధిక ఆదాయ దేశాల్లో 68 శాతం దేశాలు ఈ చర్యలు చేపడితే.. ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో కేవలం 30 శాతమే ఈ జాబితాలో ఉన్నాయి. -
ఒకరికి భార్య.. మరొకరికి లవర్.. ఢిల్లీలో జంట హత్యలు!
వివాహేతర సంబంధం కారణంగా తన ప్రాణాలే కోల్పోయింది ఓ మహిళ. తన భార్యను ప్రియుడు తన కళ్లముందే చచ్చేలా కొట్టడాన్ని భరించలేకపోయాడు భర్త. దాంతో ఆ ప్రియుడ్ని కూడా చంపేసి కసి తీర్చుకున్నాడు. భార్యను రక్షిద్దామని చేసిన ప్రయత్నంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నైతికతను మరిచి వివాహేతర సంబంధం కొనసాగిస్తే ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలో జరిగిన జంట హత్యలు కలకలం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒకరు లవర్ కోసం, మరొకరు భార్య కోసం నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే రామ్ నగర్ ఏరియాలో షాలిని(22) తనది అంటూ స్థానికంగా క్రిమినల్గా పేరొందిన అశూ అలియాస్ శైలేంద్ర రోడ్డుపైనే ఆమెను అడ్డగించాడు. ఇందుకు కారణంగా ఆ రౌడీ షీటర్తో షాలిని కొంతకాలం వివాహేతర సంబంధం నడపడమే. భర్తతో కలిసి బయటకు వెళుతన్న సమయంలో ఇది చోటు చేసుకుంది. తామిద్దరికీ ఒక బిడ్డ కూడా పుట్టాడని, తనతోనే కలిసుండాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ హఠాత్తు పరిణామంతో ఒక్కసారిగా భయపడిపోయిన షాలిని.. లవర్తో విభేదించింది. తాను భర్తతో ఉంటానని తెగేసి చెప్పేసింది. దాంతో ఆమెను నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టాడు ప్రియుడు. దాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త ఆకాశ్.. భార్యను కాపాడుకునే యత్నం చేశాడు. ఒకవైపు భార్యను లవర్ చావబాదుతంటే అదే స్థాయిలో ప్రతిఘటించాడు. ఈ క్రమంలోనే ముగ్గురికి కత్తిపోట్లు బలంగా దిగాయి. వీరు ముగ్గురు రక్తమడుగులో ఉన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ షాలిని, ఆమె ప్రియుడు ఆశూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు డిల్లీ సెంట్రల్ డీసీపీ నిధిన్ వాల్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం భార్యను కాపాడే క్రమంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త ఆకాశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందన్నారు.అతిపెద్ద మ్యూజియంలో అతిపెద్ద చోరీ.. ఏడు నిమిషాల వ్యవధిలోనే..! -
రైల్వే స్టేషన్లలో ఏదైనా కొనుక్కుంటున్నారా? ఇలా కాలర్ పట్టుకుంటారు జాగ్రత్త!
భోపాల్: అది ఓ ప్రాంత రైల్వేస్టేషన్. ఓ పక్క ట్రైన్ కదులుతుంటే.. పక్కనే ఓ యువకుడి కాలర్ పట్టుకుని సమోసా వ్యాపారి బెదిరిస్తున్నాడు. ‘నా ట్రైన్ కదులుతోంది..నన్ను వదిలి పెట్టండి నమహాప్రభో అని బ్రతిమాలడుతున్న పట్టించుకోలేదు. పైగా ట్రైన్ పోతే పోనీ.. నన్నేం చేయమంటావు. నా డబ్బులు ఇస్తావా.. చస్తావా.. నా టైం వేస్టు చేశావు అంటూ సదరు సమోసా వ్యాపారి ప్రయాణికుడిని బెదిరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే స్టేషన్లో సమోసా వ్యాపారికి, రైల్వే ప్రయాణికుడికి మధ్య జరిగిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న ఓ ట్రైన్ జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఆగింది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ ప్రయాణికుడు ఫ్లాట్ఫారమ్ మీద ఏదైనా దొరుకుతుందేమోనని పరిసరాల్ని నిశితంగా గమనించాడు. అటు పక్కనే సమోసాలు అమ్మే స్టాల్ అతని కంట్లో పడింది. వెంటనే ట్రైన్ దిగి సమోసాలు తీసుకుని.. ఓ సంస్థ యూపీఐ యాప్ నుంచి పేమెంట్ చేసే ప్రయత్నం చేశాడు. నెట్వర్క్ సమస్య వల్ల చెల్లింపులు జరగలేదు. వెంటనే తీసుకున్న సమోసాలు తిరిగి వ్యాపారికి ఇచ్చి బయల్దేరాడు ఆ యువకుడు. అంతే ఠాట్.. నా టైం వేస్ట్ చేశావు. సమోసాలు తీసుకుని డబ్బులు ఇచ్చి ముందుకు కదులు అంటూ ప్రయాణికుడికి సమోసా వ్యాపారి హుకుం జారీ చేశాడు. అంతలోనే ట్రైన్ మెల్లగా కదలడం మొదలైంది. క్షమించండి. సమోసాలు వద్దు. నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేవుంటూ అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. అంతే ఒక్క ఉదుటున.. అవన్నీ చెప్పకు.. డబ్బులు ఇచ్చి సమోసాలు తీసుకో అంటూ ప్రయాణికుడిని కాలర్ పట్టుకున్నాడు. కాలర్ విడిపించుకుని ముందుకు వెళుతుంటే అడ్డు తగిలాడు. అతని చేతికి ఉన్న చేతిగడియారం (wristwatch) బలవంతంగా తీసుకున్నాడు. నాలుగైదు సమోసాలు ప్రయాణికుడు చేతిలో పెట్టాడు. ట్రైన్ మరింత వేగంతో ముందుకు కదులుతుంటే పాపం ఏం చేయాలో పాలపోని యువ ప్రయాణికుడు సమోసాలు తీసుకుని ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు. ఈ ఉదంతాన్ని ఎదురుగా ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో జబల్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) స్పందించారు. ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన సమోసా వ్యాపారిపై చర్యలకు ఉపక్రమించాం. రైల్వే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు’అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సమోసా వ్యాపారి ప్రవర్తనను తప్పుపడుతుండగా, మరికొందరు యూపీఐ చెల్లింపులపై ఆధారపడటం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. యూపీఐ వ్యవస్థలో సాంకేతిక లోపాలు,నెట్వర్క్ సమస్యలు వల్ల చెల్లింపులు నిలిచిపోవడం సాధారణమే అయినా, విక్రేతలు దీనిపై ఎలా స్పందించాలి అనే అంశంపై స్పష్టత అవసరం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.At Jabalpur railway station, a vendor forced a passanger to pay online and buy samosas as the train chugged out of platform. When the online payment didn't go through, the passanger took off his wrist watch and gave it to the vendor who then released the collar. pic.twitter.com/sCzv69pDCb— Piyush Rai (@Benarasiyaa) October 18, 2025 #WATCH | A passenger was forced to give a watch to a samosa seller after his UPI payment failed while his train was departing from Jabalpur.West Central Railway CPRO Harshit Srivastava says, "The incident occurred on the evening of 17th October. At Jabalpur station, a vendor… pic.twitter.com/3mHkMROq1E— ANI (@ANI) October 19, 2025 -
ఎవరీ పుష్పం ప్రియా చౌదరి..? రాజకీయాల్లో సరికొత్త ఫైర్ బ్రాండ్లా..
విదేశీ విద్య నేపథ్యంతో రాజకీయాల్లో సరికొత్త బ్రాండ్లా ప్రభంజనం సృష్టించాలనుకుంటోంది. మత, కులాలకు అతితంగా ఫైర్బ్రాండ్ పాలిటిక్స్తో దూసుకుపోవాలనుకుంటోంది. అంతేగాదు బిహార్ రాష్ట్రానికి సరికొత్త పాలిటిక్స్ని పరించయం చేస్తూ..నాయకురాలిగా పెనుమార్పుకి శ్రీకారం చుట్టాలనుకుంటోంది. ఆమె పొలిటికల్ వ్యూహం, డ్రెస్సింగ్ విధానం రాజకీయనాయకుల వేషధారణ, ఆలోచనలకే అత్యంత విరుద్ధం. గెలుస్తుందో లేదో తెలియదు గానీ..ఆమె ఆహార్యం నుంచి..రాజకీయ వ్యూహాల వరకు ప్రతీది అత్యంత విభిన్నం. యువ రాజకీయ నాయకురాలికి సీఎం రేసులో గెలిస్తే..సరికొత్త చరిత్రను క్రియేట్ చేయడమే కాదు..పాలిటిక్స్లో యువ సత్తా ఏంటన్నది తెలుస్తుంది. ఇంతకీ ఎవరామె..? రాజకీయాల్లో ఎలాంటి బ్రాండ్ సెట్ చేయాలనుకుంటుంది అంటే..ఆ అమ్మాయే యునైటెడ్ కింగ్డమ్ నుండి తిరిగి వచ్చిన పుష్పం ప్రియా చౌదరి. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలనేది ఆమె ప్రగాఢ ఆకాంక్ష. 2020లో 'ది ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించిన పుష్పం ప్రియా చౌదరి కుల, మతాలకు అతీతంగా సరికొత్త బ్రాండ్ రాజకీయాలను బిహార్ రాష్ట్రానికి పరిచయం చేయాలనుకుంటోంది. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి..సరికొత్త నారీశక్తిగా ఓ వెలుగు వెలగాలనే ఉత్సాహంతో ఉంది. ఆమె బిహార్లోని దర్భంగా నుంచి పోటీ చేస్తోంది. ప్రియా 2020లో తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లుగా మెగా అడ్వర్టైస్మెంట్ ఇచ్చి మరీ..రాజకీయల్లోకి ప్రవేశించింది. అయితే ఆమె గెలుపుని అందుకునేంత వరకు నలుపు దుస్తులు, బ్లాక్మాస్క్లోనే ఉండాలని ప్రతిజ్ఞ చేయడం విశేషం. కుటుంబ నేపథ్యం..పుష్పం ప్రియ దర్భంగాకు చెందిన మాజీ జెడీయూ శాసనసభ్యుడు వినోద్ కుమార్ చౌదరి కుమార్తె. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు సన్నిహితుడు. ఆమె మామ వినయ్ కుమార్ చౌదరి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెనిపూర్ నుంచి గెలిచిన జేడీయూ నాయకుడు. జూన్ 13, 1987న జన్మించిన పుష్పం ప్రియ దర్బంగాలోనే తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఆ తర్వాత యూకేలో ఉన్నత విద్యను అభ్యసించింది. 2019లో సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డెవలప్మెంట్ రీసెర్చ్లో మాస్టర్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పూర్తించేసిందామె. అతేగాదు తన పార్టీ పేరు ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుందని చెబుతోందామె. ది ప్లూరల్స్ పార్టీ అనగా అన్ని కులాల, మతాల ప్రజలు కలిసి పాలించడం అని సరికొత్త అర్థం వివరించింది. ఇంతవరకు ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పదాలను ఉచ్ఛరించిలేకపోయారు. మరి ఈ పదం వారికి ఎలా అలవాటవుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రంగు దుస్తులే ఎందుకంటే..రాజకీయ నాయకులు అనగానే తెల్లటి దుస్తులే ఎందుకు ధరిస్తారనేది తనకు అస్సలు తెలియదని అంటోంది. అయతే తాను మాత్రం నలుపు రంగు దుస్తులనే ధరిస్తానని, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించే వరకు ఇలా నల్లటి దుస్తులు, ముసుగుతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయినా అందరి రాజకీయ నాయకులలా కాదని, తనకంటూ ఒక సిద్ధాంతం ఉందని అంటోంది. కాగా, ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ..అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ కంటూ తీవ్రమైన నాయకుడని అభిప్రాయం వెలిబుచ్చింది. ఇక నితీష్ కుమార్ ఇప్పటి వరకు బిహార్ని పాలించిన వారి జాబితాలో అత్యత్తుమ ముఖ్యమంతిగా పేర్కొనడం విశేషం. అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యహకర్తగానే ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావించకూడదంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.(చదవండి: ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..) -
జేఈఈ మెయిన్స్-2026 షెడ్యూల్ విడుదల
జేఈఈ మెయిన్స్-2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల నుంచి మొదటి సెషన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్స్-1 పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్-2కు జనవరి చివరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జేఈఈ మెయిన్స్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.విద్యార్థులు ముందుగానే తమ ఆధార్ కార్డులను తప్పులు లేకుండా అప్డేట్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ టెన్త్ సర్టిఫికెట్ ప్రకారం ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. షెడ్యూల్ పూర్తి వివరాల కోసం jeemain.nta.nic.in వెబ్ సైట్ను సందర్శించాలని పేర్కొంది. ఈ పరీక్షలు జరిగే కచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. -
‘దీపోత్సవ్’కు అయోధ్య ముస్తాబు.. ఈసారి ప్రత్యేకతలివే..
అయోధ్య: శ్రీ రాముని జన్మస్థలమైన అయోధ్య నేడు (ఆదివారం) జరిగే ‘దీపోత్సవ్’కు ముస్తాబయ్యింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఈ వేడుక ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘దీపోత్సవం-2025’కు అందరినీ ఆహ్వానించింది.2017లో ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అయోధ్యలో దీపోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తొమ్మిదవ దీపోత్సవానికి విస్తృత సన్నాహాలు చేశారు. ధరంపత్ నుండి లతా చౌక్, రామ్కథా పార్క్, సరయు ఘాట్ వరకు అంతటా వెలుగులు విరజిమ్మనున్నాయని ఒక అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో 33 వేల మంది వాలంటీర్లు పాల్గొననున్నారు. 26 లక్షల11 వేల 101 దీపాలను వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించనున్నారు.దీపోత్సవ్ నోడల్ అధికారి ప్రొఫెసర్ సంత్ శరణ్ మిశ్రా మాట్లాడుతూ ఇప్పటికే రెండు లక్షలకు పైగా దీపాలను వెలిగించారని తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం ఘాట్ల వారీగా దీపాల సంఖ్యను లెక్కిస్తోందన్నారు. ఘాట్ నంబర్ 10 వద్ద, విశ్వవిద్యాలయ వాలంటీర్లు 80 వేల దీపాలతో స్వస్తిక్ చిహ్నాన్ని రూపొందించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా ఐడి కార్డు లేకుండా ఘాట్లలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి 8:30 గంటలకు రామ్ కీ పైడిలో లేజర్ షో, లైట్ అండ్ సౌండ్ షో, డ్రోన్ షో నిర్వహించనున్నారని మీడియాకు అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ తెలిపారు. -
సీనియర్ వేధింపులు.. రాలిన విద్యా కుసుమం
సాక్షి, బెంగళూరు: భార్యను చంపిన భర్త, యువతిని చంపిన దుండగుడు.. ఇంతలోనే బెంగళూరులో మరో దుర్ఘటన జరిగింది. సీనియర్ వేధింపులను తాళలేక బాగలూరులో ఓ పీజీ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సనా పర్వీన్ (19)గా గుర్తించారు. సనా మరణానికి కాలేజీలో సీనియర్ రిఫాన్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సనా చదివే కాలేజీలోనే రిఫాన్ చదువు పూర్తి చేసుకుని కాలేజీ వదిలి వెళ్లిపోయాడు. అయినప్పటికీ సనాకు వేధింపులు ఆపలేదు. కేరళకు చెందిన రిఫాన్ గత పది నెలల నుంచి తరచుగా కాలేజీకి వచ్చి వెళ్లేవాడు. పీజీ వద్దకు కూడా వచ్చి సనాను ప్రేమ పేరుతో ఒత్తిడి చేసేవాడు. పలుమార్లు కాలేజీలో గొడవలు కూడా జరిగినట్లు ఆమె స్నేహితులు తెలిపారు. ఇది తట్టుకోలేక ఆమె పీజీలోని గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై బాగలూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. మహిళా సంఘాల నిరసన మరోవైపు మహిళలకు, యువతులకు భద్రత కల్పించాలని, దౌర్జన్యాలను అరికట్టాలని ఏఐడీఎస్ఓ సహా పలు స్త్రీవాద, వామపక్ష సంఘాల కార్యకర్తలు బెంగళూరు ఫ్రీడంపార్క్లో ధర్నా చేశారు. మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని, దాడులు అధికమైనట్లు వాపోయారు. ప్రభుత్వం దుండగులకు ముకుతాడు వేయాలని నినాదాలు చేశారు. -
Bihar Elections: 25 మంది అభ్యర్థులను ప్రకటించిన ఏఐఎంఐఎం
పట్నా: బీహార్లో నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తొలిదశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ముస్లిం నేత అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే 25 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆదివారం విడుదల చేసింది. బీహార్లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న లెక్కింపు ఉంటుంది. ఏఐఎంఐఎం పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో.. ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బీహార్లో అత్యంత అణగారిన ప్రజల గొంతుకగా పార్టీ నిలుస్తుందని దానిలో పేర్కొంది. పార్టీ జాతీయ నాయకత్వం అభ్యర్థులను ఎంపికచేసింది. అమౌర్ నుండి అఖ్తరుల్ ఇమాన్(పార్టీ సీనియర్ నేత), గోపాల్గంజ్ నుండి అనస్ సలాం, కిషన్గంజ్ నుండి న్యాయవాది షమ్స్ ఆగాజ్, నర్కటియా నుండి షమీముల్ హక్, బహదూర్గంజ్ నుండి తౌసీఫ్ ఆలం, నవాడా నసీమా ఖాటూన్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. बिहार विधानसभा चुनाव के AIMIM प्रत्याशियों के नाम कुछ इस तरह हैं। इंशाअल्लाह उम्मीद है कि हम बिहार के सबसे मज़लूम लोगों की आवाज़ बनेंगे। यह सूची AIMIM बिहार यूनिट ने तैयार की है और इस सिलसिले में पार्टी की क़ौमी कियादत से भी मशविरा किया गया है।We are happy to announce the list… pic.twitter.com/9ec1t4KpR2— AIMIM (@aimim_national) October 19, 2025243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ భారీ స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ,జేడీయూలతో కూడిన అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఇందుకు ముమ్మర కసరత్తు చేసింది. అక్టోబర్ 24 నుండి ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అంతటా 12 ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు కీలక నియోజకవర్గాలలో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఎన్డీఏలో సమన్వయం కనిపిస్తుండగా, ‘మహాఘట్ బంధన్’ (గ్రాండ్ అలయన్స్)లో సీట్ల పంపకాల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, సంకీర్ణ వ్యూహం ఇంకా అస్పష్టంగానే ఉంది. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆరు నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 18న తన రెండవ జాబితాను విడుదల చేసింది. దానిలో శాశ్వత్ పాండే (నర్కటియాగంజ్), జితేందర్ యాదవ్(పూర్నియా), మహమ్మద్ కమ్రుల్ హోడా(కిషన్గంజ్), మహమ్మద్ ఇర్ఫాన్ ఆలం (కస్బా), మోహన్ శ్రీవాస్తవ (గయా టౌన్) తదితరులు ఉన్నారు. -
Bihar Elections: గేదెనెక్కి ఒకరు.. సంకెళ్లతో మరొకరు.. తెగ నవ్విస్తున్న అభ్యర్థులు
పట్నా: బీహార్కు ఎన్నికల పండుగొచ్చింది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో చిత్రవిచిత్రాలు మీడియా కంటపడుతున్నాయి. నామినేషన్లకు వస్తున్న అభ్యర్థులు అందరినీ అకట్టకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు గేదెపై ఊరేగుతూ నామినేషన్ వేసేందుకు వస్తుండగా, మరికొందరు చేతులకు సంకెళ్లు వేసుకుని, మద్దతుదారులను వెంటేసుకుని వస్తున్నారు. गोपालगंज के बरौली में हथकड़ी में बंद धर्मेंद्र कुमार 'क्रांतिकारी' पुलिस की सुरक्षा में नामांकन करने पहुंचे. हथकड़ी हाथ में थी, आंखों में आंसू थे, और जुबान पर गाना था. लोगों की भीड़ जमा हो गई, कोई वीडियो बना रहा था, कोई लाइव चला रहा था.नेताजी बोले, “मैं साजिश का शिकार हूं, जनता… pic.twitter.com/kW5ZXwomWF— NDTV India (@ndtvindia) October 19, 2025లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు చెందిన జనశక్తి జనతాదళ్ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర కుమార్ శుక్రవారం బరౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఈ సందర్బంగా అతని చేతులకు సంకెళ్లు ఉన్నాయి. ఈయన కలెక్టరేట్ వద్దకు చేరుకోగానే విలేకరులు, జనం ఆయన చుట్టూ గుమిగూడారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ ‘నేను కుట్రకు బలైపోయాను. అయితే ఇప్పుడు ప్రజల నుండి న్యాయం కోరుకుంటాను’ అని అన్నారు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. तेज प्रताप यादव के प्रत्याशी अरुण यादव भैंस पर चढ़कर नामांकन करने पहुंचे#BiharElection2025 pic.twitter.com/X86XD0BRjo— NDTV India (@ndtvindia) October 18, 2025ఇదేవిధంగా అర్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి దిగిన అరుణ్ యాదవ్ తన నామినేషన్ దాఖలు చేసేందుకు గేదెపై స్వారీ చేస్తూ జిల్లా కలెక్టరేట్కు వచ్చారు. ఇది అక్కడున్నవారిని అమితంగా ఆకట్టుకుంది. లాలూ యాదవ్ ఫొటోను పట్టుకుని.. ‘రాజకీయాల్లో తన ఏకైక రోల్ మోడల్ లాలూ అని, అతని ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాను" అని అరుణ్ యాదవ్ మీడియాకు తెలిపారు. తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీకి చెందిన అభ్యర్థులు విచిత్ర తీరుతెన్నులతో నామినేషన్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్లకు తరలిరావడం విశేషంగా మారింది. -
బీహార్ ఎన్నికలు.. ఎన్డీయే కూటమికి బిగ్ షాక్
పట్నా: బీహార్ అసెంబ్లీ(Bihar Assembly Election) ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే(NDA Alliance) కూటమికి ఊహించని షాక్ తగిలింది. మధుర అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా నిలిచిన సీమా సింగ్(Seema Singh) నామినేషన్ రద్దైంది. దీంతో, మధుర అసెంబ్లీ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి పోటీలో లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీల మధ్య ఉండనుంది.వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాప్రా జిల్లాలోని మధుర అసెంబ్లీ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా సీమా సింగ్ నామినేషన్ వేశారు. మొదటి విడత నామినేషన్ వేయడానికి అక్టోబర్ 17 చివరి తేదీ కావడంతో ఆమె.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అధికారులు శనివారం పరిశీలించగా సీమా సింగ్ నామినేషన్లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె నామినేషన్ రద్దు చేసినట్లు డిప్యూటీ ప్రొవిన్షియల్ ఎలక్షన్ ఆఫీసర్ (డీపీఆర్వో) ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, ఈ నియోజకవర్గంలో నామినేషన్లో లోపం కారణంగా సీమా సింగ్తో పాటు మొత్తం నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు.సినిమా నుంచి పాలిటిక్స్లోకి.. సీమా సింగ్ పలు భోజ్పురి సినిమాల్లో నటించారు. తన మార్క్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమా రంగం నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చి అందరనీ ఆశ్చర్యపర్చారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ తనకు మధుర స్థానాన్ని కేటాయించిన తర్వాత ఆమె చాలా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి రాజకీయంగా యాక్టివ్గా ప్రచారం చేసుకుకున్నారు. మరోవైపు.. ఆమె తన అఫిడవిట్లో తొమ్మిదో తరగతి చదివినట్లు పేర్కొన్నారు. దీంతో, ఆమెపై ప్రజల్లో మరింత ఫోకస్ పెరిగింది. ఇదిలా ఉండగా.. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సీమా సింగ్పై కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా షేక్పురాలో ఆమె హోలీ నిర్వహించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా.. బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీకి గడువు నవంబర్ 22తో ముగియనుంది. -
Kerala: మెలిపడిన ప్రయాణికుని దవడ.. క్షణాల్లో అద్భుతం చేసిన రైల్వే వైద్యుడు
పాలక్కాడ్: ఎటువంటి ప్రమాదం లేదా వ్యాధి విషయంలో తక్షణం స్పందిస్తే, పెద్ద ముప్పును తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. సరిగ్గా దీనినే ఆచరించి చూపారు కేరళకు చెందిన ఒక వైద్యుడు. ఈ ఘటన పాలక్కాడ్ జంక్షన్లో చోటుచేసుకుంది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా ఆ వైద్యుడిని మెచ్చుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే పాలక్కాడ్ జంక్షన్లో కన్యాకుమారి-దిబ్రుగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల ప్రయాణికుని దవడ అకస్మాత్తుగా మెలిపడింది. దీంతో అతను బాధతో విలవిలలాడిపోయాడు. తోటి ప్రయాణికులు కూడా అతనిని చూసి, ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రైల్వే వైద్యాధికారి డాక్టర్ జితిన్ పీఎస్ బాధితుడిని పరీక్షించారు. నిముషాల వ్యవధిలోనే అతని దవడను మాన్యువల్గా చక్కదిద్దారు. బాధితుడు ఆ వైద్యునికి కృతజ్ఞతలు తెలిపాడు. తరువాత రైలులో ఎక్కి, తన ప్రయాణాన్ని కొనసాగించాడు. 🏥 Quick medical aid at Palakkad JunctionA 24-year-old passenger traveling on Train No. 22503 Kanniyakumari – Dibrugarh Vivek Express suffered a Jaw dislocation and received timely medical assistance from Dr. Jithin P.S., DMO/RH Palakkad. The passenger resumed the journey… pic.twitter.com/UY4zvSxwJH— Southern Railway (@GMSRailway) October 18, 2025ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దీనిని చూసినవారంతా ఆ వైద్యుడిని మెచ్చుకుంటున్నారు. బాధితుడు ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడ్డాడని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని దక్షిణ రైల్వే అధికారులు మీడియాకు తెలిపారు. ప్రయాణికుల భద్రత, సంక్షేమం విషయంలో తమ వైద్య సిబ్బంది అంకితభావానికి ఇదొక నిదర్శనమని వారు పేర్కొన్నారు. -
Bihar Elections: బీజేపీపై ఆగ్రహం.. స్వతంత్రంగా పోటీ.. క్షణంలో మారిన సీన్
పట్నా: బీహార్లో నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ పోలింగ్నకు సంబంధించి, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలో ఒక ఉదంతం మీడియా దృష్టిని ఆకర్షించింది. భాగల్పూర్ బీజేపీ టికెట్ లభించకపోవడంతో కలత చెందిన మాజీ కేంద్ర మంత్రి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ శశ్వత్ చౌబే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతలో వచ్చిన ఒక ఫోన్ కాల్తో క్షణంలో అతని నిర్ణయం మారిపోయింది.నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థి అర్జిత్ శశ్వత్ చౌబే జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకోగానే, అతని మద్దతుదారులు అతనికి పూలమాలలు వేసి, మరింత ఉత్సాహపరిచారు. ఇంతలో శశ్వత్ చౌబే ఫోన్ రింగ్ అయ్యింది. అదే సమయంలో అతనితో మాట్లాడేందుకు విలేకరులు వేచివున్నారు. శశ్వత్ చౌబే తనకు వచ్చిన కాల్ తీసుకుని, నామినేషన్ పత్రాలను దాఖలు చేయకుండా వెనుదిరిగారు. తరువాత తాను ఊహించని విధంగా యూ టర్న్ తీసుకోవడానికి గల కారణాన్ని మీడియాకు వివరించారు.తన తండ్రి అశ్విని చౌబే సూచనల మేరకు బీజేపీలోనే ఉంటానని శశ్వత్ చౌబే స్పష్టం చేశారు. తన తండ్రి మాటను మన్నిస్తూ, ఆయనకు గౌరవాన్నిస్తూ, ఎన్నికల్లో పోటీ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించగానే, బీజేపీ అగ్ర నాయకత్వం నుండి ఒత్తిడిని ఎదురయ్యిందని శశ్వత్ చౌబే పేర్కొన్నారు.‘ఈరోజు, నా తల్లిదండ్రులు నాతో మాట్లాడారు. ఇది బీజేపీ అగ్ర నాయకత్వం నుండి వచ్చిన సూచన. నేను వారికి అవిధేయునిగా ఉండలేను. నేను నా పార్టీకి, దేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేను.వారిని వ్యతిరేకించలేను’ అని శశ్వత్ చౌబే మీడియాకు తెలిపారు. -
బిహార్ ఎన్నికల్లో జేఎంఎం సొంతంగా పోటీ
రాంచీ: బిహార్ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)బాంబు పేల్చింది. పక్క రాష్ట్రం బిహార్లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా ఆరు సీట్లలో పోటీ చేయనున్నట్లు జేఎంఎం శనివారం ప్రకటించింది. అదేవిధంగా, ప్రస్తుతం జార్ఖండ్లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కొనసాగుతున్న పొత్తుపై బిహార్ ఎన్నికల అనంతరం సమీక్షిస్తామని కూడా స్పష్టం చేసింది. జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య మీడియా సమావేశంలో ఈ విషయాలను ప్రకటించారు. బిహార్లో తమకు 12 సీట్లు కేటాయించాలని ఇండియా కూటమిని జేఎంఎం కోరింది. స్పందన లేకపోవడంతో స్వయంగా పోటీకి దిగాలని నిర్ణయించుకున్నామన్నారు. -
మీ ఆలోచనలే.. దుష్ట చతుష్టయం
అసమాన నాయకత్వ ప్రతిభ కనబరిచే టీమ్ లీడర్లు బయటి నుంచి ఎదురయ్యే సవాళ్ల వల్ల కాకుండా.. తమ అపరిమితమైన ఆత్మవిశ్వాసం వల్ల విఫలమవుతుంటారని ‘హార్వర్డ్ బిజినెస్ రివ్యూ’ (హెచ్.బీ.ఆర్.) తాజా సంచికలోని ఒక వ్యాసం విశ్లేషించింది. ఇందులో ముఖ్యంగా కొన్ని లక్షణాలు.. ఇటు నాయకులు / లీడర్లు / బాస్లకే కాదు.. ఇంటిని నడిపే ఇంటి యజమానులకూ వర్తిస్తాయి అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.‘ఇనుమును ఏదీ నాశనం చేయలేదు.. దాని తుప్పు తప్ప. అలాగే ఒక మనిషి పురోగతిని ఆపేసేది తన మనస్తత్వమే తప్ప బయటి వ్యక్తులో, అంశాలో కాదు’– రతన్ టాటాప్రతి పనిలో నేనుండాలితమ ముద్ర కనిపించాలి అనే తాపత్రయంతో ప్రతి పనిలో ‘నేనుండాలి’ అని అనుకుంటారు చాలామంది.దుష్ఫలితం: అలసట, నిస్సత్తువ పెరుగుతాయి. టీమ్లో చొరవ లోపిస్తుంది. ‘అన్నీ ఆయన చూసుకుంటాడులే’ అనే ధోరణి కిందివారిలో పెరిగిపోతుంది. సృజనాత్మకంగా ఆలోచించడం మానేస్తారు. పిల్లలు పెద్దయ్యాక కూడా చాలామంది తల్లిదండ్రులు వాళ్లను స్వతంత్రంగా పనిచేయనివ్వరు.ఇలా మార్చుకొని చూడండి: ‘నేను ఏదైనా చేయగలను. కానీ ప్రతి పనీ నేనే చేయాల్సిన అవసరం లేదు’ అనే ధోరణి మంచిది. అప్పుడు అందరికీ పనిచేసే అవకాశం వస్తుంది. వినూత్నంగా ఆలోచిస్తారు. నాయకుడు అంటే నడిపించాలి కానీ ప్రతి స్థాయిలో ప్రతి పనీ తానే చేయాల్సిన అవసరం లేదు.సంస్థల్లోని నాయకులు లేదా ఇంటికి యజమానిలో అజ్ఞాతంగా ఉండే ఆధిపత్య భావనలు వారి పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేసి, వారి అభివృద్ధికి ఆటంకంగా మారతాయి. మొదట బలాలుగా కనిపించిన ఈ భావనలు క్రమేణా బలహీనతలుగా మారతాయి. బాహ్య అడ్డంకుల్లా ఇవి పైకి కనిపించవు. ఎవరికి వారు వీటిని గుర్తించి, సానుకూలంగా మలుచుకుంటే వైఫల్యాలను నివారించవచ్చు. ఎందుకంటే.. నిజమైన నాయకత్వ పురోగతి అంతర్గతంగా ప్రారంభమవుతుంది. ఏమిటీ భావనలు.. వీటి దుష్ఫలితాలేంటి.. వీటిని ఎలా అధిగమించాలి?వెంటనే పని పూర్తి చేసేయాలిప్రాధాన్యతలతో సంబంధం లేకుండా.. ప్రతి పనినీ తక్షణమే పూర్తి చేయాలి, వెంటనే ఫలితాలు కనిపించాలి అనే ధోరణితో చాలామంది ఉంటారు.దుష్ఫలితం: పిల్లలకు అన్ని అంశాల్లోనూ ఇలాగే చెప్పడం వల్ల వారికి ప్రాధాన్యతలు తెలియవు. బృందం విషయానికొస్తే.. ప్రతి పనిలోనూ ‘ఎమర్జెన్సీ’ పరిస్థితి ఏర్పడి తప్పులు జరగొచ్చు.ఇలా మార్చుకొని చూడండి: ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి’ అన్నట్టు అవసరమైన పనిపై ముందు దృష్టి పెడతాను అనుకోవాలి. ప్రాధాన్యతలు గుర్తించడమే సగం విజయం. పిల్లలు కూడా రోజువారీ చేసే పనుల్లో ఎక్కువ ఫలితం ఇచ్చే పనికి అధిక ప్రాధాన్యత.. తక్కువ ఫలితం ఇచ్చే దానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటారు. దానికి తగ్గట్టుగా సమయం, ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు వినియోగిస్తారు.నేను తప్పులు చెయ్యకూడదుపనిలో కచ్చితత్వం కోసం తపన పడుతూ ఇలా ఆలోచిస్తుంటారు. దుష్ఫలితం: వినూత్న విధానాలను ప్రయత్నించే ధైర్యం చేయలేకపోవడం, అతి జాగ్రత్త, ఎప్పుడూ ఫలితంపైనే అధిక శ్రద్ధ.ఇలా మార్చుకొని చూడండి: ‘తప్పులు జరగకుండా చూడటం కాదు, సరిగ్గా పని జరిగేటట్లు చూడాలి’ అనే ధోరణి ఏర్పరచుకోవాలి. ఇది కింది వాళ్లను మూస ధోరణిలో కాకుండా కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఫలితంపై శ్రద్ధ కాకుండా.. పనిని సరిగ్గా చేయడం అలవాటవుతుంది.అందరూ నాలాగే పని చెయ్యాలిఇంట్లో లేదా ఆఫీసులో అందరూ తమలాగే ఆలోచించాలని, పనిచేయాలని.. ఆలోచిస్తారు, ఆశిస్తారు.దుష్ఫలితం: వ్యక్తిగత సామర్థ్యాలలోని వ్యత్యాసాలు గుర్తించరు. ఎవరి సామర్థ్యానికి, పనిచేసే ఒడుపునకు తగ్గట్టు వారిని స్వేచ్ఛగా పనిచేయనివ్వరు. ముఖ్యంగా పిల్లల విషయంలో వారి వయసును కూడా ఒక్కోసారి మర్చిపోయి వారిపై ఒత్తిడి పెంచుతుంటారు.ఇలా మార్చుకొని చూడండి: ‘నాలా అందరూ ఆలోచించలేకపోవచ్చు, పనిచేయలేకపోవచ్చు’ అనే వాస్తవాన్ని గుర్తించండి. వారి వారి సామర్థ్యాలు, తెలివితేటలకు అనుగుణంగా పనిచేసే వాతావరణం కల్పించండి. ముఖ్యంగా ఇది పిల్లల మానసిక వికాసానికి దోహదపడుతుంది. -
స్థితిమంతురాలైన భార్యకు భరణమా?
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా స్వతంత్రంగా ఉండి, స్థిరమైన ఆదాయం కలిగిన జీవిత భాగస్వామికి భరణం ఇవ్వజాలమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. శాశ్వత భరణం సామాజిక న్యాయం కోసం ఉద్దేశించినదే తప్ప, ఆర్థికంగా సమర్థులైన ఇద్దరు వ్యక్తుల మధ్య సంపదను సమానం చేయడానికి కాదని సష్టం చేసింది. భరణం కోరే వ్యక్తికి తనకు నిజంగా ఆర్థిక సాయం అవసరమని నిరూపించాల్సిన బాధ్యత ఉందని నొక్కి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ క్షేత్రపాల్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్ల ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఓ జంట విడాకుల కేసులో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. భర్తకు క్రూరత్వం ఆధారంగా విడాకులు మంజూరు చేసిన కుటుంబ న్యాయస్థానం, భార్యకు శాశ్వత భరణం ఇచ్చేందుకు నిరాకరించడం సరైందేనని స్పష్టం చేసింది.2010 జనవరిలో వివాహబంధంతో ఒక్కటైన ఈ జంట 14 నెలల్లోనే విడిపోయింది. భర్త లాయర్ కాగా, భార్య రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్) గ్రూప్ ’ఎ’అధికారి. భార్య తనను మానసికంగా, శారీరకంగా హింసించిందని, దూషణ పదజాలం వాడిందని, అవమానకరమైన మెసేజ్లు పంపిందని, వైవాహిక హక్కులను నిరాకరించిందని, వత్తిపరమైన, సామాజిక వర్గాల్లో తనను అవమానించిందని భర్త ఆరోపించారు. ఈ ఆరోపణలను భార్య ఖండించింది, భర్తే తనను హింసించాడంటూ ప్రత్యారోపణలు చేసింది. కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు, భర్త ఆరోపణల్లో వాస్తవం ఉందని తేలడంతో విడాకులు మంజూరు చేసింది. అంతేకాకుండా, రూ.50 లక్షలిస్తేనే విడాకులకు ఒప్పుకున్నానంటూ భార్య డిమాండ్ చేయడాన్ని గుర్తించిన ఫ్యామిలీ కోర్టు భరణం అభ్యర్థనను తిరస్కరించింది.ఉన్నది ప్రేమ కాదు.. ఆర్థిక ప్రయోజనాలే..ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. పరిశీలించిన ధర్మాసనం, కింది కోర్టు తీర్పులో తప్పులేదని అభిప్రాయపడింది. ’విడాకులను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతూనే, భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం.. ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలనే ప్రేమ, ఆప్యాయతతో కాదని, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. భార్య వైఖరిలో స్పష్టమైన ఆర్థిక కోణం ఉందని ఫ్యామిలీ కోర్టు తేల్చడం సమంజసమే’అని ధర్మాసనం పేర్కొంది. -
48 ఏళ్ల తర్వాత చిక్కిన ప్రేమ పావురం
ఏదో చిన్నచితకా కేసు కాదు.. ఏకంగా తన ప్రేయసిని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించిన కేసు! మన హీరో చంద్రశేఖర్ మధుకర్ కాలేకర్.. ఈ సాహసం చేసింది 1977లో. అప్పుడు ఆయ న వయసు కేవలం 23 ఏళ్లే. రక్తంలో ప్రేమ, అపనమ్మకం, యవ్వనం.. అన్నీ ఉప్పొంగుతున్న సమయం. ఈ లవర్ బాయ్కి.. తన లవర్ క్యారెక్టర్పై తెగ అనుమానం వచ్చేసింది. అంతే.. కోపంతో ఊగిపోయాడు.. ముంబైలోని కొలాబాలో ప్రియురాలిపై కత్తి దూశాడు. పాపం ఆ రోజుల్లోనే ఇంత కసితో ప్రేమించిన మొనగాడున్నాడంటే.. మామూ లు విషయం కాదు!. కుర్రాడిని ఎలాగోలా పోలీసులు పట్టేసుకున్నారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతే! ఆ బెయిల్ పత్రాన్ని అందుకున్నారో లేదో, మన కాలేకర్ గారు ‘ట్రయల్ బై ఎస్కేప్’ అనే కొత్త రూల్ కనిపెట్టి, మాయమైపోయారు. దాదాపు ఐదు దశాబ్దాలు (48 ఏళ్లు) ఎక్కడా కనిపించకుండా, దొరక్కుండా, సన్యాసిలా జీవితం గడిపారు! కోర్టు విచారణ లేకుండా 48 ఏళ్లు బతికారంటే.. తన జీవితంపై ఆయనకు ఎంత నమ్మకమో కదా!. ముంబై పోలీసులు పాపం చాలా వెతికారు. అడ్రస్ మారడం, ఆ నివసించిన భవనం కూల్చేయడం... ఇలా సకల కారణాల వల్ల అతన్ని పట్టుకోలేకపోయారు. కోర్టు నాన్ – బెయిలబుల్ వారెంట్ ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇక కేసు మూలనపడింది అనుకుంటున్న టైమ్లో.. మిరాకిల్!దొరికిపోయాడోచ్.. తాజాగా దర్యాప్తు మొదలుపెట్టిన కొలాబా పోలీసులు, ఈ పాత కేసు ఫైల్ని దుమ్ము దులుపుతుండగా.. ఓ చిన్న క్లూ దొరికింది. అదేంటంటే.. 2015లో రత్నగిరి జిల్లాలోని దాపోలి పోలీస్ స్టేషన్లో ఓ ప్రమాదం కేసులో కాలేకర్ పేరు నమోదైంది! అంటే, పారిపోయి ప్రశాంతంగా ఉన్నా, ప్రమాదం రూపంలో కర్మ ఆయనను వెతుక్కుంటూ వచ్చింది! ఆ దెబ్బతో, పోలీసులు వెతికి పట్టుకున్నారు. పోలీసు అంకుల్స్కి హ్యాట్సాఫ్!.48 ఏళ్ల క్రితం 23 ఏళ్ల యువకుడిని.. ఇప్పుడు గుర్తు పట్టడం అంటే మాటలా? అంతా సవాలే. కానీ పాత ఫొటోలు చూసి, ఇంటరాగేషన్ చేయగా.. మన 81 ఏళ్ల తాతగారు తప్పనిసరి పరిస్థితుల్లో తన తప్పును ఒప్పుకున్నారు! ఇంతకాలం గుర్తు పెట్టుకుని ఉండాలంటే.. ఎంత ఘోరమైన అటాక్ అయి ఉంటుందో!.ఇప్పటికింకా ఈయన వయసు నిండా 81 ఏళ్లే..కోర్టులో అడ్వకేట్ సునీల్ పాండే ఆయన తరపున వాదించారు. ‘సార్! నా క్లయింట్ వయసు 81 ఏళ్లు, బోలెడన్ని వ్యాధులు ఉన్నాయి. అసలు చార్జిషీట్ ఫైల్ చేశాక నోటీస్ ఇవ్వలేదు! 2010లో ఆయన గుడిసె పడిపోయింది, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరారు.. అందుకే కోర్టుకు రాలేకపో యారు’.. అంటూ 48 ఏళ్ల తప్పిదానికి సరదాగా కవర్ డ్రైవ్ ఇచ్చారు!జాలి పడ్డ జడ్జి గారు!ప్రభుత్వ తరపు న్యాయవాది ఆనంద్ సుఖదేవే గారు మాత్రం ‘అయ్యో! ఇదో పెద్ద నేరం, 48 ఏళ్లు ట్రయల్ని ఆలస్యం చేసింది ఈయనే! మళ్లీ పారిపోవచ్చు!’ అని గట్టిగా అభ్యంతరం చెప్పారు. కానీ, న్యాయమూర్తి అవినాష్ పి.కులకర్ణి గారు.. మన తాతగారి వయసు, ఆయన ‘కచ్చితంగా కోర్టుకు వస్తాను’ అని ఇచ్చిన హామీని చూసి జాలి పడ్డారు. చివరికి, బెయిల్ మంజూరు చేసేశారు! తాతగారు హ్యాపీస్..ప్రేమించి, పొడిచి, పారిపో యి... వయసు మీరి పట్టుబడిన చంద్రశేఖర్ మధుకర్ కాలేకర్ గారు, ఇప్పుడు బెయిల్పై దర్జాగా ఉన్నారు. 48 ఏళ్ల తర్వాత.. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆయనపై విచారణ మొదలవుతుంది! ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి ఆ రోజుల నాటి పోలీసులు, సాక్షులు ఎవరైనా బతికి ఉన్నారో లేదో?, అసలు ఆ ప్రేయసి ఏమైందో.. దేవుడికే తెలియాలి! ఇంతకాలం ఈ కేసును ఫైల్లోంచి తీయకుండా ఉంచిన ఆ న్యాయస్థానం సిబ్బందికి మాత్రం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో మంచి స్థానం దక్కుతుంది! మరి, ఈ ట్రయల్ ఇంకో 48 ఏళ్లు సాగకుండా ఉంటుందా? మీరేమంటారు?– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరోగ్యానందాలు
ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే మంచి పోషకాహారం, ధ్యానం వంటి వాటితోపాటు కొన్ని చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టాలి. వీటి ‘సైడ్ ఎఫెక్ట్స్’ జీవితాన్ని మార్చేస్తాయి అంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా చేసిన అనేక పరిశోధనలు, అధ్యయనాలు. ‘చిన్నగా మొదలుపెట్టి.. వాటిని కొనసాగించడం’.. ఇదే ఆరోగ్యవంతమైన జీవితానికి కొత్త సూత్రం అంటున్నారు వైద్యులు, మానసిక నిపుణులు.రాత్రి నిద్రకు అలారంసాధారణంగా అందరూ ఉదయం లేవడానికి అలారం పెట్టుకుంటారు. కానీ, రాత్రి ఎప్పుడు పడుకుంటాం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వరు. స్మార్ట్ఫోన్లు, ఓటీటీ వేదికలు, స్నేహితులు లేదా బంధువులతో పిచ్చాపాటీ.. ఇవన్నీ ప్రాధాన్యతలుగా మారిపోయి నిద్రా సమయం వెనక్కిపోతోంది. అందుకే, ఎన్ని గంటలకు నిద్ర పోవాలనుకుంటున్నారో అలారం పెట్టుకోవాలి. అలారం మోగగానే.. ఏ పనిచేస్తున్నా ఆపేసి నిద్రకు ఉపక్రమించాలి. అలా అలారం పెట్టుకుని పడుకున్నవాళ్లకు ప్రశాంతమైన నిద్ర పట్టడమే కాకుండా.. మర్నాడు రోజంతా చురుగ్గా ఉన్నారని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనం వెల్లడించింది.ప్రకృతిని పలకరించండిప్రతిరోజూ కనీసం 10–20 నిమిషాలు ప్రకృతిని ఆస్వాదించండి. దగ్గరలోని పార్కుకు వెళ్లండి. అలా రోడ్డుమీదకు వెళ్లి చుట్టూ ఉన్న చెట్లు, మొక్కలు, పక్షులను చూడండి. దగ్గరిలోని చెరువుకు లేదా నదికి వెళ్లండి. మేడమీదకు వెళ్లి పరిసరాలు, మేఘాలు అన్నింటినీ ప్రశాంతంగా చూడండి. 2019లో యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ నిర్వహించిన అధ్యయనం.. ప్రకృతిని మాత్రగా (నేచర్ పిల్) అభివర్ణించింది.స్నాక్టివిటీ.. వర్కవుట్ స్నాక్స్!ఆరోగ్యం కోసం రోజూ జిమ్లో కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. రోజులో వీలు చిక్కినప్పుడల్లా శరీరానికి ‘వర్కవుట్ స్నాక్స్’ ఇవ్వండి. చిన్న చిన్న వ్యాయామాలుగా పిలిచే ఈ ‘స్నాక్టివిటీ’ చేస్తే చాలు. మీకు తెలియకుండానే వారానికి ‘150 నిమిషాల వ్యాయామం’ కింద పోగుపడతాయి. ఎక్సర్సైజ్ స్నాక్స్ అనే పదాన్ని హార్వర్డ్ మెడికల్ స్కూల్కి చెందిన కార్డియాలజిస్టు డాక్టర్ హోవర్డ్ హార్ట్లీ మొట్టమొదట ఉపయోగించారు. ఫోన్ మాట్లాడేటప్పుడు కూర్చుని కాకుండా.. అలా నడుస్తూ మాట్లాడండి. అన్ని సార్లూ లిఫ్ట్లో వెళ్లకుండా రోజులో రెండు మూడుసార్లు.. మీరుండే ఫ్లోరును బట్టి మెట్లు ఎక్కి, దిగండి. మీకు నచ్చిన పాట చూస్తూ 5–10 నిమిషాలు మామూలుగా డ్యాన్స్ చేయండి. రోజువారీ జీవితంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇలాంటివి ఎవరికి వారే వెతుక్కోవాలి.భోజనం చేశాక నడవండిభోజనం పూర్తయిన కాసేపటి వరకు కూర్చుంటే ఫర్వాలేదు గానీ.. ఎక్కువ సమయం కూర్చోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తిన్న కాసేపటి తర్వాత కనీసం ఓ 10 నిమిషాల పాటు అలా నెమ్మదిగా నడిస్తే మంచిదట. రాత్రుళ్లు టీవీల ముందు కూర్చుని భోజనం చేసే సంస్కృతి పెరిగాక భోజనం అయిపోయినా కుర్చీలోంచి లేవడం లేదు.. చూస్తున్న కార్యక్రమం అయ్యాకే లేస్తున్నారు. ఇది మంచిది కాదు.నైట్ టైమ్.. నో ఫోన్రాత్రిపూట బెడ్రూముల్లో టీవీలు చూస్తూ లేదా స్మార్ట్ఫోన్లు చూస్తూ పడుకోవడం పెరిగిపోయింది. ఇది కంటికి మంచిది కాదనీ, వీటివల్ల ‘నాణ్యమైన నిద్ర’ ఉండటం లేదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. 2024లో అమెరికాలో జరిగిన ఒక అధ్యయనంలో స్మార్ట్ఫోన్లు, టీవీలు చూడకుండా పడుకున్నవారు రాత్రుళ్లు వేగంగా నిద్రపోవడమే కాదు, ఉదయాన కూడా త్వరగా లేస్తున్నారని తేలింది. చాలామందికి అర్ధరాత్రి నీళ్లు తాగడానికో బాత్రూముకో వెళ్తారు. అలా లేవగానే స్మార్ట్ఫోన్నే చూస్తుంటారు. అక్కడితో వదిలేయరు. లేచిన పని పూర్తయ్యాక మళ్లీ ఫోన్ అందుకుంటారు. ఇది కూడా కంటికి, నిద్రకు మంచిది కాదు.బ్రష్ చేసే చేతిని మార్చండిమనం రోజూ చేసే పనుల్లో కొన్నింటిని.. నెలకో రెండు నెలలకో ఒకసారి వినూత్నంగా చేయడం మన మెదడును మరింత చురుగ్గా పనిచేసేలా చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరానికి వ్యాయామాలు ఎలా అవసరమో.. మెదడుకూ అలాగే అవసరం. అలాంటి వాటిలో ఒకటి.. బ్రష్ చేసే చేతిని మార్చడం. మీరు ఇప్పటివరకూ చేస్తున్న చేతితో కాకుండా.. రేపటి నుంచి రెండో చేతితో చేయడం ప్రాక్టీస్ చేయండి. -
వాహ్..'తాజ్'
సాక్షి, అమరావతి: తాజ్మహల్ అనగానే ప్రేమకు చిహ్నమైన అపురూప కట్టడం మదిలో మెదులుతుంది. ఈ చారిత్రక అద్భుతాన్ని చూసి అబ్బురపడని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల మనసు దోచింది తాజ్ మహల్. కేంద్ర పర్యాటక శాఖ 2024–25 సంవత్సరాలకు విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ ఏడాది స్వదేశీ, విదేశీ పర్యాటకుల ఆకర్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఆగ్రా పోర్టు రెండో స్థానంలో నిలవగా స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో కోణార్క్ సూర్య దేవాలయం రెండో స్థానంలో నిలిచింది. 2024–25లో తాజ్మహల్ను 6.45 లక్షల విదేశీ పర్యాటకులు సందర్శించగా స్వదేశీ పర్యాటకులు 62.64 లక్షల మంది సందర్శించారు. కోణార్క్ సూర్య దేవాలయాన్ని 35.71 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు సందర్శించారు. ఆగ్రా కోటను 2.24 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 2024–25లో దేశానికి మొత్తం 95,51,722 మంది విదేశీ పర్యాటకులు వచ్చినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా టాప్ 15 దేశాల నుంచే 76.70 లక్షల మంది విదేశీ పర్యాటకులు దేశానికి వచ్చినట్లు పేర్కొంది. అత్యధికంగా అమెరికా నుంచి తరువాత బంగ్లాదేశ్ నుంచి విదేశీ పర్యాటకులు వచ్చినట్లు గణాంకాలు తెలిపాయి. అంతకు ముందు ఆరి్థక ఏడాదితో పోలిస్తే 2024–25లో విదేశీ పర్యాటకుల సంఖ్య 4.30 లక్షలు పెరిగారు. 2024–25లో భారత దేశానికి 99.51 లక్షల విదేశీ పర్యాటకులు రాకతో రోజూ సగటున 27,000 కంటే ఎక్కువ మంది దేశానికి వచ్చారు.6.45 లక్షలు 2024-25లో తాజ్ మహల్ను సందర్శించిన విదేశీ పర్యాటకులు 62.64 లక్షలు 2024 -25లో సందర్శించిన స్వదేశీ పర్యాటకులు2.24 లక్షలు 2024-25లో ఆగ్రాకోటను తిలకించిన విదేశీ పర్యాటకులు 35.71 లక్షలు 2024-25లో కోణార్క్ సూర్య దేవాలయానికి వచ్చిన స్వదేశీ పర్యాటకులు -
కొత్త ముసుగులో ‘జంగిల్రాజ్’
పట్నా: బిహార్లో ‘జంగిల్రాజ్’కొత్త ముసుగు ధరించి మళ్లీ వచ్చిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సూచించారు. విపక్ష ఆర్జేడీపై విరుచుకుపడ్డారు. ఆర్జేడీ పాలనలో అరాచక శక్తులు చెలరేగిపోయాయని ఆరోపించారు. ఇప్పుడు అవే శక్తులు మరో రూపంలో వస్తున్నాయని దుయ్యబట్టారు. అప్పటి రాక్షస పాలన మళ్లీ రావడాన్ని ప్రజలు అంగీకరించబోరని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ‘ఇండియా’కూటమిని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. శనివారం బిహార్ రాజధాని పట్నాలో ఓ వార్తా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘బిహార్ సమాగం’లో అమిత్ షా మాట్లాడారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులు కొనసాగాలంటే ఎన్డీయేను గెలిపించాలని చెప్పారు. బెంగాల్లో చొరబాటుదారులకు రెడ్ కార్పెట్ బీజేపీ పాలిత అస్సాంలో అక్రమ చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లు అమిత్ షా తెలిపారు. అస్సాం పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లోకి చొరబాట్లు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమ వలసదారులకు బెంగాల్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోందని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగించడానికే ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రారంభించినట్లు స్పష్టంచేశారు. ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీ జరుగుతోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. జమ్మూకశ్మీర్కు సరైన సమయలో రాష్ట్ర హోదా జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పారు. అలాగే లద్దాఖ్ ప్రజల డిమాండ్లకు తగిన పరిష్కార మార్గం చూపుతామని అన్నారు. ఆరి్టకల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూకశ్మీర్లో అభివృద్ధి వేగం పుంజుకుందని తెలిపారు. అక్కడ ప్రజాస్వామ్యం బలోపేతం అయ్యిందని స్పష్టంచేశారు. -
2028 నాటికి దేశీయ 7 నానోమీటర్ చిప్ సిద్ధం
న్యూఢిల్లీ: కంప్యూటర్ చిప్లను దేశీయంగానే అభివృద్ధి చేసుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో డిజైన్ చేస్తున్న మొట్టమొదటి 7 నానోమీటర్ కంప్యూటర్ చిప్ ‘శక్తి’2028 నాటికి సిద్ధమవుతుందని ఐఐటీ–మద్రాసు బృందం శనివారం అశ్వినీ వైష్ణవ్కు తెలియజేసింది. ఈ మేరకు ఆయన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్థానికంగా అభివృద్ధి చేయనున్న చిప్ ప్లాంట్లోనే ఈ నానోమీటర్ చిప్ను ఉత్పత్తి చేయనున్నట్లు తెలియజేశారు. ఐటీ సర్వర్లలో ఉపయోగించే నానో చిప్లను దేశీయంగానే తయారు చేసుకోవడానికి చర్యలు చేపట్టామని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఐఐటీ–మద్రాసు బృందానికి అనుమతి ఇచి్చనట్లు పేర్కొన్నారు. ఆర్థిక, సమాచార, రక్షణ వంటి కీలక రంగాల్లో నానో చిప్ల ప్రాధాన్యత నానాటికీ పెరుగుతోందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, సర్వర్లలో 3 నుంచి 7 నానోమీటర్ల చిప్లను ఉపయోగిస్తున్నారు. వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటే దిగుమతుల భారం తగ్గుతుందని ప్రభుత్వం నిర్ణయానికొచి్చంది. -
మొజాంబిక్ తీరంలో పడవ ప్రమాదం..
కొచ్చి: మొజాంబిక్లో బెయిరా తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు చనిపోగా ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనలో మరో ఐదుగురిని సిబ్బంది కాపాడారని అక్కడి భారత దౌత్య కార్యాలయం తెలిపింది. గురువారం సముద్రంలో నిలిపి ఉన్న ఓడలో మెయింటెన్స్ పనికోసం కొందరిని పడవలో పంపించారు. పడవ నుంచి ఓడను చేరుకునేందుకు ప్రయతి్నస్తుండగా తీవ్రమైన అలల తాకిడికి పడవ బోల్తా పడిందని భారత ఎంబసీ తెలిపింది. ఘటన సమయంలో పడవలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని వివరించింది. అయితే, ప్రమాద బాధితుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనలో గల్లంతైన వారిలో ఇద్దరు మలయాళీలు కూడా ఉన్నట్లు కేరళ ఎమ్మెల్యే అనూప్ జాకబ్ శనివారం తెలిపారు. వీరిలో ఒకరు ఎర్నాకులం జిల్లా పిరవోమ్కు చెందిన ఇంద్రజిత్(22) కాగా, మరొకరు కొల్లమ్కు చెందిన వ్యక్తి అని ఆయన వివరించారు. -
రెచ్చగొడితే నిర్ణయాత్మక ప్రతిస్పందన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి నోరుపారేసుకున్నారు. భారత్ తమను ఏమాత్రం రెచ్చగొట్టినా నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. తాము ఎవరికీ భయపడబోమని చెప్పారు. బెదిరింపులతో తమను లొంగదీసుకోలేరని వ్యాఖ్యానించారు. తమను రెచ్చగొడితే వెంటనే తగిన బుద్ధి చెప్తామని వెల్లడించారు. నేటి అణ్వాయుధాల వాతావరణంలో యుద్ధాలకు తావులేదని, ఈ విషయంలో భారత సైనికాధికారులు తెలుసుకోవాలని సూచించారు. శనివారం పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో అసిమ్ మునీర్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం భారత్తో జరిగిన సైనిక ఘర్షణలో అద్భుతమైన సామర్థ్యాలు ప్రద ర్శించామని, లక్ష్యాలను ఛేదించామని అన్నారు. కేవలం అంకెల్లో గొప్పగా కనిపిస్తున్న ప్రత్యరి్థపై విజయం సాధించామని స్పష్టంచేశారు. భారత్ను అస్థిరపర్చడానికి భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుటోందని అసిమ్ మునీర్ ఆరోపించారు. పిడికెడు మంది ఉగ్రవాదులు తమను ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు. అఫ్గానిస్తాన్ గడ్డపై నుంచి పాకిస్తాన్పై దాడులు చేస్తున్నవారిని మట్టిలో కలిపేస్తామని పరోక్షంగా తెహ్రీక్–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)ని హెచ్చరించారు. -
పాక్లో ప్రతి అంగుళం ‘బ్రహ్మోస్’ పరిధిలోనే..
లక్నో: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ను గట్టిగా హెచ్చరించారు. పాకిస్తాన్లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని అన్నారు. భారత్పై మరోసారి కయ్యానికి కాలుదువి్వతే అసలు సినిమా చూపించక తప్పదని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణుల శక్తిసామర్థ్యాలు ఏమిటో ప్రపంచం చూసిందన్నారు.యుద్ధంలో భారత్ విజయం సాధించడం యాదృచ్చికం కాదని, అదొక అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులను రాజ్నాథ్ సింగ్ శనివారం సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నానాటికీ బలీయమైన స్వదేశీ శక్తిగా ఎదుగుతున్న భారత్కు ఈ క్షిపణులు ఒక ప్రతీక అని అభివరి్ణంచారు. బ్రహ్మోస్ అంటే కేవలం మిస్సైల్ కాదని, భారతదేశ వ్యూహాత్మక విశ్వాసానికి ఆధారమని చెప్పారు. త్రివిధ దళాలకు ఇదొక మూలస్తంభంగా మారిందన్నారు. ‘‘ఆపరేషన్ సిందూర్లో జరిగినదంతా ట్రైలర్ మాత్రమే. ఒక కొత్త పాకిస్తాన్ను భారత్ సృష్టించగలదని పాకిస్తాన్కు తెలిసొచ్చింది. కానీ, ‘సమయం వచ్చినప్పుడు’.. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మీరంతా తెలివైనవాళ్లని నాకు తెలుసు. చెప్పకుండానే అర్థం చేసుకోగలరు’’ అని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి ఆపరేషన్ సిందూర్ భారతీయుల్లో నూతన విశ్వాసాన్ని నింపిందని రక్షణ శాఖ మంత్రి ఉద్ఘాటించారు. ఈ విశ్వాసాన్ని ఇలాగే కొనసాగించడం మనందరి సమ్మిళిత బాధ్యత అని పిలుపునిచ్చారు. మన దేశ శక్తిని ప్రపంచమంతా గుర్తిస్తోందని, కలలను నెరవేర్చుకోగలమన్న విశ్వాసాన్ని బ్రహ్మోస్ క్షిపణులు మరింత బలోపేతం చేశాయని చెప్పారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మనకు అవసరమైన ఆయుధాలు, రక్షణ పరికరాలను మనమే తయారుచేసుకోవాలని సంకల్పించామని తెలిపారు. రక్షణ తయారీ రంగంలో పెరుగుతున్న మన విశ్వాసానికి, సామర్థ్యానికి బ్రహ్మోస్ మిస్సైల్స్ ఉత్పత్తి కేంద్రం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. లక్నో అంటే పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే కాదని, ఈ నగరం తన హృదయంలో ఉందని చెప్పారు. సంస్కృతి సంప్రదాయాలతోపాటు ఆధునిక టెక్నాలజీ, పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారిందని ఆనందం వ్యక్తంచేశారు. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణు లు ఉత్పత్తి కావడం చూస్తే ఒకనాటి స్వప్నం నేడు నెరవేరినట్లు తేటతెల్లమవుతోందని ఉద్ఘాటించారు. సహనం, కఠోర శ్రమ, అంకితభావానికి ఈ ప్రాజెక్టును ఒక ప్రతీకగా భావించవచ్చని వివరించారు. ఇక్కడ ప్రతిఏటా దాదాపు 100 క్షిపణులను ఉత్పత్తి చేయొచ్చని, వందలాది మందికి ప్రత్యక్షంగా ఉపా ధి లభిస్తుందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ యూనిట్ టర్నోవర్ రూ.3,000 కోట్లకు చేరుతుందని, తద్వారా జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.బ్రహ్మాస్త్రమే → బ్రహ్మోస్ క్షిపణి సూపర్సానిక్ క్రూయిజ్ మిస్సైల్ రకానికి చెందినది. → దాదాపు 300 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. → పొడవు 8.4 మీటర్లు. వ్యాసం 0.6 మీటర్లు. బరువు 3 టన్నులు → భూ ఉపరితలంపైనుంచి ప్రయోగించే క్షిపణి పరిధి 290 కిలోమీటర్లు. నౌకలపైనుంచి ప్రయోగించి క్షిపణి పరిధి 450 కిలోమీటర్లు. ఈ పరిధిని 800 కిలోమీటర్లకు పెంచడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. → జీపీఎస్ రాడార్ గైడెన్స్ సిస్టమ్ ఆధారంగా దూసుకెళ్తుంది. → బ్రహ్మోస్ మిస్సైల్లో ఘన ఇంధన బూస్టర్, ద్రవ ఇంధనం క్రూయిజ్ దశ ఉంటాయి. → గంటకు 3,400 నుంచి 3,700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. → భూఉపరితలంతోపాటు యుద్ధ విమానాల నుంచి, నౌకల నుంచి, జలాంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. → 2005 నుంచి బ్రహ్మోస్ క్షిపణులు భారత సైన్యంలో సేవలందిస్తున్నాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్లో ఉగ్రవాదుల స్థావరాలను, శిక్షణ కేంద్రాలను, పాక్ వైమానిక దళం ఎయిర్బేస్లను ధ్వంసం చేశాయి. ఆర్థిక రంగానికీ లబ్ధి దేశీయంగా బ్రహ్మోస్ క్షిపణుల తయారీతో మన రక్షణ రంగంతోపాటు ఆర్థిక రంగానికి సై తం ఎంతో లబ్ధి చేకూరుతుందని రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. రెండు దేశాలకు క్షిపణులు ఎగుమ తి చేయడానికి మన బ్రహ్మోస్ టీమ్ ఒప్పందాలు కుదుర్చుకుందని, వీటి విలువ రూ.4,000 కోట్లు అని వెల్లడించారు. శుభప్రదమైన ధన త్రయోదశి రోజే క్షిపణులను సైన్యానికి అప్పగిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. లక్ష్మీదేవి ఆశీస్సులు రక్ష ణ రంగంపై, ఆర్థిక రంగంపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ఈ ఏడాది మే 11న ప్రారంభమైంది. -
బెంగుళూరులో దారుణం.. సీసీ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు
బెంగుళూరు: ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం.. బెంగుళూరులో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. గత నెల సెప్టెంబర్ 13న గణేష్ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాకు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి.. నగలు దోచుకున్నారు. నిందితులను ప్రవీణ్, యోగనందగా పోలీసులు గుర్తించారు. బైక్పై ఆ మహిళల వద్దకు వచ్చి వారి బంగారు గొలుసులను లాక్కోవడానికి ప్రయత్నించారు.భయపడిన ఉష తన గొలుసును వారికి ఇచ్చేసింది. కానీ మరొక మహిళ వరలక్ష్మి, ప్రతిఘటించింది. దీంతో యోగానంద ఆమెపై కత్తితో క్రూరంగా దాడి చేసి.. రెండు వేళ్లను నరికాడు. ఆ తర్వాత నిందితులు 55 గ్రాముల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి పారిపోయారు. సెప్టెంబర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది.ఈ ఘటనపై పోలీసులు వారాల తరబడి దర్యాప్తు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్టు చేసింది. వారు దొంగిలించిన బంగారాన్ని, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత యోగనంద పుదుచ్చేరి, ముంబై, గోవా వంటి నగరాలకు పారిపోయి.. ఆ తర్వాత కర్ణాటకలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అతనికి గతంలో నేర చరిత్ర ఉందని, ఒక హత్య కేసులో కూడా ప్రమేయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు వరలక్ష్మి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.On camera: Two men on a bike wielding machetes rob women in Bengaluru, chop off two fingers and snatch their gold chain. Arrested after a month, police have now recovered 74g of gold and the weapons.https://t.co/ymRnB0fF5t pic.twitter.com/ElKFdlFKH2— Deepak Bopanna (@dpkBopanna) October 18, 2025 -
అడవి విడిచిన ఆయుధం…
మావోయిస్టు పార్టీలో శిఖర సమానులైన ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. తమ బలగంతో సహా ముఖ్యమంత్రుల ఎదుట సరెండర్ అయ్యారు. ఆయుధం వదిలి రాజ్యాంగ ప్రతిని చేతబట్టారు. తుపాకీ వదిలి ప్రజాస్వామ్య ప్రతిన బూనారు. రెండు రోజుల్లో దాదాపు 300లకు పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. భారత దేశ సాయుధ పోరాట చరిత్రలో ఇదో కీలక మైలురాయి. అర్థ శతాబ్దపు నక్సల్బరీ పోరాట చరిత్రలో అతిపెద్ద కుదుపు. ఇది సైద్ధాంతిక భావాజాలనికి ఎండ్ పాయింట్ అని కొందరంటుంటే… పోరాట పంథాలో మార్పు మాత్రమే అని మరికొందరంటున్నారు. కాలమాన పరిస్థితులను ఎదుర్కొన్న మావోయిస్టు సిద్దాంతాన్ని… మరో రూపంలో రాబోయే తరానికి అందించడానికే… అన్నలు అస్త్రసన్యాసం చేస్తున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఒకరు సిద్ధాంత కర్త… మరొకరు గెరిల్లా వీరుడుమావోయిస్టు పార్టీలో ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత ఘర్షణ ఉంది.ముఖ్యంగా ఆయుధం వదలాలనే వర్గం ఇప్పటికే మూటా ముల్లే సర్దుకుని… అడవీని వీడుతున్నారు. దాదాపు 300మంది మావోలు అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్ఘడ్ సర్కార్ల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ సర్వోన్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, మరో కేంద్రకమటీ సభ్యుడు ఆశన్న ఉన్నారు. వీరిద్దరు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక రూపకల్పన, సాహిత్య రచనా విభాగంలో ఎంతో పనిచేశారు. మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో ఆమోదించిన ఎన్నో సైద్ధాంతిక పత్రాలకు రూపకల్పన చేసింది కూడా మల్లోజుల వేణుగోపాల్ రావే. సాధన పేరుతో ఎన్నో పుస్తకాలు రాసిన చరిత్ర మల్లోజుల వేణుగోపాల్ది. మావోయిస్టు పార్టీ మేధావి వర్గంలో ఎలాంటి శశభిషలు లేకుండా అత్యున్నతుడు అనే పేరు తెచ్చుకుంది కూడా మల్లోజుల వేణుగోపాలే. సల్వాజుడుం వల్లే మావోయిస్టు పార్టీ బలోపేతం అయింది అంటూ థాంక్స్ టు సల్వాజుడుం పేరుతో పేరుతో మల్లోజుల వేణుగోపాల్ పుస్తకం రాశారు. ఒక దశలో గణపతి తరువాత బాధ్యతలు మల్లోజుల వేణుగోపాల్కు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఆశన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు మావోయిస్టు పార్టీ మిలటరీ విభాగంలో ఆరితేరిన యుద్ధవీరుడు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారు కింద క్లైమోర్మెన్లు పెట్టింది కూడా ఆశన్నే. దండకారుణ్యంలో ఎన్నో అంబుష్లకు నేతృత్వం వహించిన ఆశన్న మావోయిస్టు పార్టీలోనే నెంబర్-1 ఆర్మీ కమాండర్గా ఎదిగాడు. మావోయిస్టు పార్టీ అబూజ్మఢ్లో నిర్వహించిన చాలా ఆంబుష్లకు నేతృత్వం వహించింది కూడా ఆశన్ననే. 2013లో ఛత్తీస్ఘడ్లోని ఝీరమ్ ఘాటి దాడిలో మహేంద్రకర్మతో పాటు పదిమందిని హత్యచేసిన సంఘటనలోనూ ఆశన్న ప్లానింగ్ ఉందని చెబుతారు. ఇక 2011లో మావోయిస్టు పార్టీ సుక్మా జిల్లాలో 75మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేసిన సంఘటన ప్లానింగ్ కూడా ఆశన్నదే అని చెప్తారు. అందుకే మావోయిస్టు పార్టీలో సైద్ధాంతికంగా అత్యంత బలమైన మల్లోజుల… యుద్ధవిద్యలో ఆరితేరిన గెరిల్లా ఆశన్నలు ఆయుధాలు వదిలివేయడం ఇప్పుడు ఓ సంచలనం. లేఖలతో యుద్ధం… మావోయిస్టు పార్టీకి చెందిన సాయుధ క్యాడర్ వందల సంఖ్యలో ఆయుధాలతో లొంగిపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీని విభేదించి బయటకు వచ్చిన మల్లోజుల, ఆశన్నలది ద్రోహం అని కొందరు మావోయిస్టు సానుభూతిపరులు చెబుతున్నారు. పార్టీకి ద్రోహం చేసి వీరంతా బయటకు వచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది ఇప్పటికైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడం మంచి పరిణామం అంటూ వీరికి మద్దతునిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడమే పోరాటంగా మారినప్పుడు లొంగిపోవడంలో తప్పులేదని చెబుతున్నారు. తెలుగు ప్రజల్లో మావోయిస్టుల సరెండర్పై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇక చాలాకాలం నుంచి మావోయిస్టులను అరాచకశక్తులు అని తిట్టిపోసే… ఛత్తీస్ఘడ్ మీడియా మాత్రం లొంగిపోయిన మావోలను హీరోలుగా కీర్తిస్తోంది. మొత్తానికి మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా ఉన్నట్లుగానే బయట కూడా లొంగుబాటుపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. దాదాపు రెండు నెలలుగా మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే… ఈ లొంగుబాటుకు కారణాలు అర్ధమవుతాయి. గత నెలలో మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలి బయటకు వచ్చే విషయంపైనా పెద్ద ఎత్తున లేఖల పర్వం కొనసాగింది. ముఖ్యంగా అభయ్ పేరుతో మల్లోజుల రాసిన లేఖలు పార్టీలో ప్రకంపణలు సృష్టించారు. మావోయిస్టు పార్టీ సైద్ధాంతికంగా తప్పులు చేసిందని.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని అందువల్లే ఇంతటి నిర్బంధం ఎదుర్కోవాల్సి వస్తుందని మల్లోజుల 21పేజీల లేఖను విడుదల చేశాడు. దీనికి రూపేష్ పేరుతో దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటి హెడ్ ఆశన్న మద్దతు పలికాడు. అయితే మల్లోజుల రాసిన లేఖపై మావోయిస్టు పార్టీలోని మరో వర్గం తీవ్రంగా స్పందించింది. ఇటీవలే ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరు కేంద్రకమటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డిలు సైతం దీనిని ఖండిస్తూ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణా విభాగం సైతం దీనిని వ్యతిరేకించింది. పైగా మల్లోజుల పార్టీకి ద్రోహం చేస్తున్నాడని… అతను తన ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పజెప్పాలని లేదంటే బలవంతంగా లాక్కుంటామని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. దీంతో మావోయిస్టు పార్టీలో చీలిక తప్పదని తేలిపోయింది. దీనికి అనుగుణంగానే మావోయిస్టు పార్టీలో మల్లోజుల వర్గం వరుస లొంగుబాట్లకు తెరతీసింది. తెలుగు మావోయిస్టుల్లో విభేదాలుమావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీలోని తెలుగు నక్సలైట్లలో వచ్చి విభేదాలే ఈ లొంగుబాటుకు కారణం అనే చర్చ వేగం పుంజుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది మే నెలలో మావోయస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందిన తరువాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభం అయ్యాయని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ చీఫ్గా మల్లోజుల వేణుగోపాల్కు పగ్గాలు ఇవ్వకపోవడం పట్ల ఆయన వర్గం పార్టీతో విభేదించింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముప్పాళ్ల లక్ష్మణరావు తరువాత పార్టీ పగ్గాలు మల్లోజులకు ఇస్తారనే చర్చ జరిగింది. అయితే అప్పుడు నంబాళ కేశవరావు వైపే కేంద్రకమిటీ మొగ్గుచూపింది. ఇక నంబాళ అలియాస్ బసవరాజు తరువాతనైనా మల్లోజులను చీఫ్గా ఎన్నుకుంటారని భావించారు. అకస్మాత్తుగా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ పేరు తెరమీదకు వచ్చింది. దీంతో మల్లోజుల వర్గం పూర్తిగా పార్టీ కేంద్రకమిటీలోని ఇతర నాయకత్వంతో విభేదాలు పెంచుకుందనే చర్చ జరుగుతోంది. దీనివల్లే మల్లోజుల వర్గం ఆయుధాలు వీడాలనే నిర్ణయానికి వచ్చిందని పార్టీలోని ఓ వర్గం చెబుతోంది. ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయిన తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం ఎవరు ప్రధాన కార్యదర్శి లేరని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. అసలు కేంద్రకమిటీ సమావేశమే జరగలేదని ఆశన్న స్పష్టం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే తిప్పరి తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా మల్లోజుల వర్గం అంగీకరించడం లేదని స్పష్టమవుతోంది. అయితే మల్లోజుల వేణుగోపాల్ను వ్యతిరేకించే వారిలో కేంద్రకమిటీకి చెందిన మల్లా రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి, పాక హనుమంతుతో పాటు గోండి మావోయిస్టు నాయకుడు హిడ్మా పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణా మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్న దామోదర్ అలియాస్ జగన్ దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకున్నారనే విషయం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే మల్లోజుల లేఖను వ్యతిరేకించిన వారిలో దామోదర్ కూడా ఉండటంతో… మల్లోజులను సపోర్ట్ చేసే నాయకత్వం పెద్దగా మావోయిస్టు పార్టీలో మిగల్లేదని అర్ధమవుతోంది. లొంగుబాటలో మరికొంతమందిభారతదేశ చరిత్రలోనే అతిపెద్ద నక్సలైట్ లొంగుబాటుగా భద్రతా బలగాలు కీర్తిస్తున్న ఈ సరెండర్స్ ప్రభావం ఎలా ఉండబోతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన దాదాపు 310మంది మావోయిస్టులు లొంగిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. లొంగిపోయిన వారిలో మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న పాటు చాలామంది దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వీరిలో డీకేఎస్జెడ్సీ మెంబర్ భాస్కర్, టెక్నికల్ టీమ్లో పనిచేసిన సరోజ మరికొంత మంది కమాండర్లు ఉన్నారు. దాదాపు 20 వరకు ఏకే-47 తుపాకులు, 40వరకు ఆటోమెటిక్ వెపన్స్ మొత్తానికి 200 ఆయుధాలను మావోయిస్టులు లొంగుబాటు సమయంలో పోలీసులకు అప్పగించారు. అయితే మొత్తం మావోయిస్టు పార్టీ కేడర్లో ఇది ఎంత భాగం అనేది ఇప్పుడ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. కేంద్ర నిఘా వర్గాల లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టుల సంఖ్య వేయిలోపే ఉందని తెలుస్తోంది. అయితే వివిధ వర్గాల ద్వారా వస్తున్న సమాచారంతో పాటు లొంగిపోయిన మావోయిస్టులు చెబుతున్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి 2500మంది సాయుధ సైన్యం ఉన్నట్లు అంచనా. గణాంకాల పరంగా చూసుకుంటే ప్రస్తుతం లొంగిపోయిన వారి సంఖ్య మొత్తం సాయుధ మావోయిస్టులలో దాదాపు 15శాతంగా చెప్పుకోవచ్చు. దీంతో మిగిలిన మావోయిస్టుల సంగతేంటనే చర్చ జరుగుతోంది. ఒకవేళ మిగిలిన వారు కూడా ఇదే బాట పడితే దాదాపు వేయి మంది వరకు లొంగపోవచ్చని పోలీసులు అంచనా వేస్తన్నారు. వచ్చే వారంరోజుల్లో లొంగుబాట్లకు సంబంధించి స్పష్టమైన ముఖచిత్రం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ దారిలోనే మావోయిస్టు పార్టీకి చెందిన ఉదంతి ఏరియా కమిటీ కూడా లొంగుబాటు వైపు మొగ్గు చూపింది. దీనికి అనుగుణంగా తమ మావోయిస్టు కామ్రెడ్లకు ఉదంతి ఏరియా కమిటి కార్యదర్శి సునీల్ లేఖ రాశారు. ఈ నెల 20వ తేదీన మద్యాహ్నం 12గంటల ముప్పై నిమిషాలకు ఎక్కడ కలువాలో కూడా తన లేఖలో సునీల్ స్పష్టం చేశారు. దీంతో పాటు తాము ఎక్కడ కలవాలో కూడా లేఖలో స్పష్టంగా మావోయిస్టులు పేర్కొన్నారు. దీనిని బట్టి ఒక విధంగా ప్రభుత్వం ఛత్తీస్ఘడ్లో కూంబింగ్ ఆపేసినట్లు సంకేతాలు వస్తున్నాయి. మావోయిస్టులు స్వేచ్ఛగా అడవి నుంచి లొంగుబాటు కోసం బయటకు వచ్చే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టుల కోసం ప్రభుత్వం నది దాటేందుకు వీలుగా బోట్లు కూడా ఏర్పాటు చేసింది. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ కాలపరిమితిలో మావోయిస్టులు లొంగిపోతారా… లేక మరో ఎత్తుగడతో వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివాసీలు ఎటువైపు…మావోయిస్టు పార్టీకి ఇది సంధికాలం. ఓ వైపు లొంగుబాట్లు పెరుగుతుంటే ఆ పార్టీలో ఉన్న మిగిలిన నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయడం లేదు. లొంగిపోతున్న వారిది తప్పని కాని… ఎవరూ ఈ ట్రాప్లో పడొద్దు అనే మాట కూడా మావోయిస్టు పార్టీ నాయకత్వం నుంచి రావడం లేదు. చాలామందిలో అసలు మావోయిస్టు పార్టీకి ఇంకా నాయకత్వం మిగిలి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు పార్టీ కార్యదర్శి తిప్పరి తిరుపతి పేరుతో ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు లొంగుబాటు అవుతున్న వారు స్వేఛ్చగా అడవి నుంచి వస్తున్న క్రమంలో మిగిలిన వారి పరిస్థితిపై ఆశన్న చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. తమతో పాటు రావడానికి కొంతమంది నిరాకరించారని… వారికి కావాల్సిన సామాగ్రి ఇచ్చి జాగ్రత్తలు చెప్పి మరీ వారిని ఇతర దళాల కాంటాక్ట్లోకి పంపించామని ఆయన చెప్పారు. పార్టీ ఫండ్తో పాటు మిగిలిన ఆయుధాలను డంప్లను సాయుధ పోరాటం చేస్తున్న వారికే అప్పజెప్పామని ఆశన్న చత్తీస్ఘడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంటే ఓ వర్గం ఇంకా దీనిని వ్యతిరేకిస్తోందననేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వర్గం ఎంత బలంగా ఉందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఓ అంచనా ప్రకారం మావోయిస్టు పార్టీ గత రెండున్న దశాబ్దాలుగా బస్తర్లో జనతన సర్కార్ను నిర్వహిస్తోంది. అంటే ప్రభుత్వానికి సమాతంరంగా మరో ప్రభుత్వం లాంటింది అన్న మాట. ఒక తరం మొత్తం మావోయిస్టు పార్టీ పాలనలో ఎదిగిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 10లక్షల మంది జనాభా మావోయిస్టు పార్టీ పాలన కింద ఉందనేది ఆ పార్టీ ప్రకటనల ద్వారా అర్ధమవుతున్న మాట. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇది 5లక్షల వరకు ఉండవచ్చనేది అంచనా. ఇందులో దాదాపు 25వేల మంది మిలిషియా సభ్యులుగా ఉన్నట్లు ఛత్తీస్ఘడ్ పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిలో ఎంతమంది ఇప్పుడు లొంగుబాటు వైపు నిలుస్తారు. మావోయిస్టు పార్టీ ఏకమొత్తంగా నిర్ణయం తీసుకుంటే తప్ప వీరు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించే అవకాశం లేదు. రాబోయే కాలంలో వీరు ఏవిధంగా ప్రభుత్వ పాలన కిందికి వస్తారు. ఎంత వరకు కొత్త ప్రభుత్వంతో వీరికి సయోధ్య కుదురుతుంది. పాత కొత్తల ఘర్షణ వల్ల ఎలాంటి కొత్త సామాజిక ఆర్ధిక పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనే అనుమానాలు ఉన్నాయి. మేధావుల మౌనం…మావోయిస్టు పార్టీ నిజంగానే తన పంథా మార్చుకుని జనజీవనంలోకి రావాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ తరువాత పిట్టల్లా రాలిపోతున్న మావోయిస్టులపై జనాల్లో సానుభూతి పెరుగుతోంది. ఎందుకు ఈ పోరాటం… ఎవరి కోసం ఈ ఆరాటం అనే భావన మావోయిస్టుల్లోనూ పెరిగిపోయింది. ముఖ్యంగా కేవలం తాము తయారు చేసుకున్న జనతన సర్కార్ తప్ప బయట ఎక్కడా తమ అవసరం లేదనే వాస్తవం వారికి అర్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన సామాజిక, ఆర్ధిక పరిస్థితులు మారిని విషయాన్ని మావోయిస్టులు విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మేధావి వర్గం కూడా మావోయిస్టులు లొంగిపోతే తప్పులేదని చెబుతోంది. చాలా వరకు మావోయిస్టులను సపోర్ట్ చేసిన తెలుగు మేధావులు అందుకే ఇప్పుడ మౌనం వహిస్తున్నారు. ఇక మావోయిస్టులు అడవిలోనే ఉండాలనే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పుడు జరుగుతున్న లొంగుబాట్లపై కొందరు విమర్శలు చేస్తున్నా… 40ఏళ్లు పోరాటం చేసిన వారిని విమర్శించే నైతికత ఎంతమందికి ఉంటుంది. అడవిలో ఆదివాసీల కోసం పోరాడిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, భాస్కర్లాంటి వారి కంటే ఎక్కువ సామాజిక స్పృహ ఎవరికి ఉంది. నమ్ముకున్న ఆదివాసీలను వదిలేసి రావడం ద్రోహం అనే వారు… ఎవరిని ప్రశ్నిస్తున్నారో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలని లొంగిపోయిన మావోయిస్టులు చెబుతున్నారు. గట్టుపై కూర్చోని సిద్ధాంతాలు చెప్పేవారు… అడవిలో గంజి తాగి పోరాటం చేసిన వారిపై రాళ్లు వేయడం ఎంత వరకు కరెక్టు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు అధికారికంగా మాట్లాడటానికి… మేధావులు సైతం వెనుకంజ వేస్తున్నారు. మొత్తానికి ఇది మావోయిస్టులు తేల్చుకోవాల్సిన వివాదం. ఆయుధాలు వదిలివేయాలా లేక సాయుధ పోరాటంలో కొనసాగాలా అనే విషయంలో లోకస్ స్టాండి కేవలం సాయుధ మావోయిస్టులకు మాత్రమే ఉంది. అంతమా… మరో ఆరంభమా…మావోయిస్టుల లొంగుబాటు పూర్తయితే ఇక దేశంలో నక్సలిజం పూర్తిగా మాయమవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మావోయిస్టు పార్టీ పుట్టినిల్లు అయిన తెలంగాణా చరిత్రను కాస్త వెతికితే దీనికి సమాధానం దొరికే అవకాశం ఉంది. తెలంగాణా సాయుధ పోరాటం అందించిన నాయకత్వం… సైద్ధాంతిక భావజాలమే తరువాతి క్రమంలో తెలంగాణాలో నక్సల్ ఉద్యమానికి ఊపిరిలూదింది. తొలి తెలంగాణా ఉద్యమంతో పాటు మలి దశ పోరాటానికి అదే పోరాట స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు లొంగిపోతున్న మావోయిస్టులు… తమ వెంట ఎన్నో సైద్ధాంతిక సూత్రీకరణలు, సామాజిక అనుభవాలతో అడవిని వీడి జనారణ్యంలోకి తీసుకువస్తారు. ఈ డిజిటల్ యుగంలో వారి అనుభవాలు, ఆలోచనలు అన్నీ ఇంటర్వ్యూల రూపంలో, పుస్తకాల మార్గంలో మళ్లీ ప్రజలను తాకే అవకాశం లేకపోలేదు. ఈ మొత్తం భావజాలాన్ని ఎవరు కంస్యూమ్ చేస్తారు. వందల వేల యూట్యూబ్ చానెల్స్లో వీరి ఇంటర్వ్యూలు.. రానున్నాయి. ఇందులో మంచి ఎంత చెడు ఎంత అని ఆలోచించే కన్నా… ఇదంతా తరువాతి తరాలకు ట్రాన్స్ఫర్ అవుతుందనేది సుస్పష్టం. సాయుధ పోరాట భావజాలం మరో రూపంలో… మరో తరానికి బదిలీ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం లొంగిపోయిన మావోయిస్టు నేత భాస్కర్ తన ఇంటర్వ్యూలో మా అనుభవాలు, పోరాటాలు రాబోయే తరాలకు చెప్పాలన్నా మేము బతకాలి కదా అని అన్నారు. మావోయిస్టు పార్టీ గత నాలుగు దశాబ్దాల్లో చేసిన పోరాటం ఇప్పటికే చాలా వరకు పుస్తకాల్లో రికార్డు అయింది. అయితే ఛత్తీస్ఘడ్ పోరాటాలు మాత్రం అడవిని వదలి వస్తున్న మల్లోజుల, ఆశన్న, బాస్కర్, సరోజలాంటి వారు చెబితేనే తెలుస్తాయి. అందుకే ఇప్పుడు వీరంతా ఏంచేస్తారు. ప్రజా పోరాటాలను నిర్మిస్తారా. రాజకీయాల్లోకి వస్తారా. లేక పుస్తకాలు రాస్తారా అనే చర్చ జరుగుతోంది. వీరు చేయబోయే పనులే … మావోయిస్టు పార్టీ భావజాలం ఎలా ఉండబోతుందనే విషయాన్ని నిర్దేశించబోతోంది. అయితే ఇదంతా భవిష్యత్తు… దీనిని ఎవరూ నిర్దేశించలేరు. చివరి మాట… లొంగుబాటు విషయంలో ఎవరెన్ని మాటలన్నా… మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటన వస్తేనే దీనిపై క్లారిటీ రానుంది. అయితే మావోయిస్టు పార్టీ గురించి ప్రతీ ఒక్కరు ఆతృతగా చూస్తున్న మరో అంశం మావోయిస్టు పార్టీ కీలక నేత గణపతి ఎక్కడున్నారు అనేది. గణపతి బతికే ఉన్నారా ఉంటే ఆయనెందుకు స్పందించడం లేదు. ఆయనకు అల్జీమర్స్ వచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ గణపతి బతికి ఉంటే… ఆయన ప్రకటన చేస్తే ఈ కన్ఫ్యూజన్ పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు మావోయిస్టులు అడవిని వీడుతున్నారు. మేము లొంగిపోవడం లేదు కేవలం ఆయుధాలను ప్రజల ముందు ప్రభుత్వాల ముందు వదిలేస్తున్నాం అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆయుధం ఇప్పుడు అడవిని వీడింది. ఈ ప్రయాణం చీకటి దారుల్లోకా లేక వెలుగు రేఖల వైపా అనేది కాలమే నిర్ణయిస్తుంది. - ఇస్మాయిల్, సాక్షి టీవీ -
Maharashtra: లోయలో పడిన పికప్ వ్యాన్.. ఎనిమిదిమంది దుర్మరణం
నందూర్బార్: మహారాష్ట్రలోని నందూర్బార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులను తీసుకెళ్తున్న పికప్ వాహనం లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం.. పికప్ వాహనం అస్తంబ దేవి యాత్ర ముగించుకుని వస్తున్న భక్తులను తీసుకెళుతోంది. ఇంతలో ఘాట్ మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో, బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను చేపట్టింది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. Maharashtra: 8 dead after vehicle falls into a valley at Chandshaili GhatRead @ANI Story | https://t.co/QJOc5iOuif#Maharashtra #death #vehicle #valley #ChandshailiGhat pic.twitter.com/aWT4EHMtjB— ANI Digital (@ani_digital) October 18, 2025ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అస్తంబ దేవి యాత్రకు హాజరైన భక్తులు తమ గ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. బోల్తా పడిన వాహనం కింద పలువురు చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. -
చిమ్మ చీకటిలో ఢిల్లీ..!
చీకటి.. ఢిల్లీ నగరానికి బాగా అలవాటైపోయింది. ఎన్ని చర్యలు చేపట్టినా ఢిల్లీలో ‘చీకటి’ని తగ్గించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. దీనికి కారణం గాలి కాలుష్య తీవ్రత అదుపులో లేకపోవడమే. దాంతో మరొకసారి ఢిల్లీని చిమ్మ చీకటి అల్లేసింది. దీపాల పండుగ దీపావళి రాకముందే దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి దిజారిపోవడంలో ప్రజలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) వ్యాప్తంగా వాయు కాలుష్యం 'చాలా ప్రమాదకరం' కేటగిరీకి చేరింది. ఈ పరిస్థితి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వాయు కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 301 నుంచి 400 మధ్య ఉన్నప్పుడు దానిని ‘చాలా ప్రమాదకరం’గా పరిగణిస్తారు. ప్రస్తుతం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 మార్కును దాటేసింది. ఘజియాబాద్లోని లోనిలో అత్యధికంగా 339గా నమోదయ్యింది. నోయిడా సెక్టార్ 125లో 358కి చేరింది. అలాగే ఆనంద్ విహార్ (335), వజీర్పూర్ (337) ప్రాంతాల్లో కూడా వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) తొలి దశను అమలులోకి తెచ్చారు. ఈ దశలో నిర్మాణ, కూల్చివేతల పనులను నిలిపివేయాల్సి ఉంటుంది. అలాగే డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం లాంటి ఆంక్షలు విధించారు. కాలుష్యం మరింత పెరిగిన పక్షంలో రెండో దశ కింద అధికారులు మరిన్ని కఠినమైన చర్యలను చేపట్టనున్నారు.#WATCH | Delhi | The Air Quality Index (AQI) around Akshardham was recorded at 369 this morning, in the 'Very Poor' category in Delhi as per the Central Pollution Control Board (CPCB). pic.twitter.com/aPVJ2SZ9ID— ANI (@ANI) October 17, 2025 ఓజోన్, పీఎం10 రేణువుల సాంద్రత వాతావరణంలో పెరగడమే ఈ కాలుష్యానికి ప్రధాన కారణమని నిపుణులు తెలిపారు. గాలి వేగం తక్కువగా ఉండటానికి తోడు ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా కాలుష్య కారకాలు గాలిలోనే నిలిచిపోతున్నాయని వారు చెబుతున్నారు. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చడం వల్ల చిన్నారులు, వృద్ధులతో పాటు శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్రమైన ఆనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లకూడదని, ఒకవేళ తప్పని సరిగా వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్లు వాడాలని చెబుతున్నారు. -
Karnataka: ఆర్ఎస్ఎస్ మార్చ్కు హాజరైన పంచాయతీ అధికారి సస్పెండ్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)నిర్వహించిన మార్చ్లో పాల్గొన్న అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. కర్నాటకలోని రాయ్చూర్ జిల్లాలోగల సిర్వార్ తాలూకాలో ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న కేపీ ప్రవీణ్ కుమార్ను గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ (ఆర్డీపీఆర్) విభాగం సస్పెండ్ చేసింది. ఆయన లింగ్సుగూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది రూట్ మార్చ్లో ఆ సంస్థ యూనిఫారం ధరించి పాల్గొన్నారు. ఫలితంగా ఆయన సస్పెన్షన్కు గురయ్యారు.ఐఏఎస్ అధికారిణి అరుంధతి చంద్రశేఖర్ జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులో కేపీ ప్రవీణ్ కుమార్.. కర్ణాటక సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నియమాలు, 2021లోని మూడవ నియమం ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వ అధికారులు రాజకీయ తటస్థత, క్రమశిక్షణ, తగిన ప్రవర్తనను కలిగివుండాలి. కుమార్పై డిపార్ట్మెంటల్ విచారణ జరిగే వరకు ఆయనకు జీవనాధార భత్యం అందిస్తారు.కర్ణాటక ప్రభుత్వం- ఆర్ఎస్ఎస్ మధ్య ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ క్రమశిక్షణా చర్య తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ సంస్థలలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని,సంస్థతో సంబంధం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐటీ, ఆడీపీఆర్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల ముఖ్యమంత్రిని కోరారు. కేపీ ప్రవీణ్ కుమార్పై సస్పెన్షన్ వేటువేయడాన్ని మంత్రి ఖర్గే సమర్థించారు. ఏ మతాన్నీ లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొన్నారు. కాగా బీజేపీ ఈ సస్పెన్షన్ను ఖండించింది. ఇది రాజకీయ ప్రేరేపితమని, హిందూ సంస్థలపై కాంగ్రెస్ అసహనాన్ని కలిగి ఉందని ఆరోపించింది. -
ఢిల్లీ: ఎంపీల నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీ: ఎంపీల నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. చిన్నారులు టపాసులు కాలుస్తుండగా ఫర్నీచర్కి మంటలు అంటుకోవడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం. బీడీ మార్గ్లోని ఈ అపార్ట్మెంట్.. పార్లమెంట్ హౌస్కు కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్లో మూడు అంతస్తులు దగ్ధమయ్యాయి. ప్రాణ నష్టం తప్పింది. పలువురికి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదం ఫోన్ కాల్ తర్వాత 40 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నట్లు తెలిసింది. ఆలస్యంగా రావడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు అంటున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా బాణాసంచా కారణమని స్థానికులు చెబుతున్నారు. పార్కింగ్ ఏరియాలో ఫర్నిచర్ ఉంచడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని అపార్ట్మెంట్ వాసులు అంటున్నారు. సీపీడబ్ల్యూడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అపార్ట్మెంట్ వాసుల ఆరోపిస్తున్నారు. #WATCH | A fire broke out at Brahmaputra Apartments in New Delhi. Six vehicles have been dispatched to the spot. Efforts are underway to put out the fire. https://t.co/QfqJWbteUi pic.twitter.com/0RY9JOzGbq— ANI (@ANI) October 18, 2025 -
పాక్కు రాజ్నాథ్ సింగ్ బిగ్ వార్నింగ్
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దాయాది దేశం పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమేనన్న ఆయన.. పాక్ భూభాగంలోని ప్రతీ అంగుళం ఇప్పుడు మన బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. శనివారం లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ మిస్సైళ్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి రాజ్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది భారత రక్షణ పరిశ్రమకు ఒక మైలురాయి. శత్రువులు ఇప్పుడు మన పరిధిలోనే ఉన్నారు. .. బ్రహ్మోస్ నుంచి తప్పించుకోవడం శత్రువులకు ఇక అసాధ్యం. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే. దీని ద్వారా భారత సైన్యం తన శక్తిని నిరూపించింది. ఆ ట్రైలర్నే చూసి పాకిస్తాన్కి అర్థమై ఉంటుంది. భారత్ పాకిస్తాన్ను సృష్టించగలిగితే, ఇంకేమి చేయగలదో చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు విజయం మనకు అలవాటైపోయింది. బ్రహ్మోస్ కేవలం శక్తి ప్రదర్శన కాదని.. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే అడుగు’’ అని ఆయన అభివర్ణించారు. బ్రహ్మోస్ మిస్సైల్స్ను భారత్ ఆపరేషన్ సిందూర్ టైంలో ప్రయోగించింది. Fire and Forget టెక్నాలజీతో పని చేయడం దీని ప్రత్యేకత. అంటే.. లక్ష్యాన్ని చేరిన తర్వాత మానవ ప్రమేయం లేకుండానే దాని పని అది చేసుకుపోతుంది.భారత్ డీఆర్డీవో-రష్యా ఎన్పీఓఎం సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట సంయుక్తంగా వీటిని డెవలప్ చేస్తున్నాయి. త్రివిధ దళాలు దీనిని ఉపయోగించుకుంటున్నాయి. హైదరాద్, తిరువనంతపురం, నాగ్పూర్లలో వీటి విడిభాగాలు తయారు అవుతున్నాయి. తాజాగా లక్నోలోనూ ఓ యూనిట్ను ప్రారంభించారు. తాజా వివరాల ప్రకారం.. బ్రహ్మోస్కు 75% వరకు స్వదేశీ భాగాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అందుకే రాజ్నాథ్ దీనిని ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే కీలక అడుగు అని అన్నారు. -
రైతులకు బ్యాంకులు రుణాలు ఎందుకు ఇవ్వవంటే..
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, గ్రామీణ అభివృద్ధిని పెంచడానికి వ్యవసాయ రుణాలు చాలా ముఖ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను వ్యవసాయ రుణాలు పెంచాలని తరచుగా ఆదేశిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సకాలంలో రుణం అందడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవనోపాధికి కీలకం. అయితే ఈ దిశగా కేంద్రం చేస్తున్న కృషికి అనుగుణంగా బ్యాంకులు వీటి పంపిణీని ఆశించినంతగా పెంచడం లేదు. అందుకు కొన్ని సవాళ్లను ఎదురవుతున్నాయనే వాదనలున్నాయి.నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్(NPA) భయంవ్యవసాయ రంగంలో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వాల రుణమాఫీ పథకాల ప్రకటన కారణంగా రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. దీని ఫలితంగా బ్యాంకులకు మొండి బకాయిలు (NPA) పెరిగే అవకాశం ఉంది. పెద్ద పరిశ్రమల మొండి బకాయిలతో పోలిస్తే రైతుల మొండి బకాయిలు తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులకు ఇది ఆందోళనగా మిగిలిపోతుంది.రుణాల దుర్వినియోగంకొందరు రుణగ్రహీతలు వ్యవసాయం పేరుతో బంగారం తాకట్టు రుణాలు తీసుకుని వాటిని రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం (ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో) బ్యాంకు అధికారులు తనిఖీల్లో గుర్తిస్తున్నారు. దీనివల్ల రుణం పొందిన ప్రయోజనం నెరవేరకపోవడం, రాయితీ వడ్డీ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ కఠిన మార్గదర్శకాలు తీసుకువచ్చింది.పూచీకత్తు సమస్యలుచిన్న, సన్నకారు రైతులకు, కౌలు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. కౌలు రైతుల విషయంలో సరైన ధ్రువీకరణ వ్యవస్థ లేకపోవడంతో వారికి రుణాలు అందడం లేదు.వ్యవసాయ క్షేత్రాల పరిశీలన సవాళ్లుగ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల పంపిణీ తర్వాత అవి నిజంగా వ్యవసాయ అవసరాలకు వాడుతున్నారా లేదా అని తనిఖీ చేయాలి. అందుకు బ్యాంకులకు తగినంత మానవ వనరులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక సమస్యగా ఉంది.రుణమాఫీ జాప్యంగత ప్రభుత్వాల హయాంలో రుణమాఫీ పథకాలు ప్రకటించినప్పటికీ వాటి అమలులో జాప్యం జరుగుతుంది. దానివల్ల రైతులు పాత రుణాలను రెన్యూవల్ చేసుకోలేకపోతున్నారు. దీని ఫలితంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.ఇదీ చదవండి: భారత రైల్వేలో అపార అవకాశాలు -
రోడ్లపై కిరణ్ మజుందార్ షా విమర్శలు.. డీకే స్ట్రాంగ్ కౌంటర్
బెంగళూరు: ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల (Bengaluru Roads) పరిస్థితిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, చర్చ నడుస్తోంది. ఓ విదేశీ విజిటర్.. బెంగళూరు నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. దీంతో, ఆమె పోస్టుపై బయోకాన్ (Biocon) లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా(Kiran Mazumdar-Shaw) విమర్శలు చేయడం తీవ్ర చర్యనీయాంశమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) స్పందించారు.తాజాగా డీకే శివకుమార్ రోడ్లపై పెడుతున్న పోస్టులపై కౌంటరిచ్చారు. ఘాటుగా బదులిస్తూ... మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చు అని డీకే పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే.. ఆ గుంతలు పూడ్చేందుకు రోడ్లను కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. బెంగళూరులో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. మౌలిక సదుపాయాలకు అవసరమైనవన్నీ చేస్తున్నామన్నారు.అంతకుముందు, కర్ణాటక రాజధాని బెంగళూరులో అస్తవ్యస్త పరిస్థితులను బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ట్విట్టర్ వేదికగా..‘చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాల్టీ కూడా దీనిని పరిష్కరించడం లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ చెత్త సమస్య చాలా చాలా దయనీయంగా ఉంది’ అని పేర్కొన్నారు.Kiran Mazumdar Shaw has not spoken to me. But I will invite her for discussion & whatever the complaints, let her give it in writing. If she wants to develop roads, ready to hand over them for development: K’taka DyCM DK Shivakumar responding to Shaw’s recent tweets. pic.twitter.com/Pr8B0Qk7bt— TOI Bengaluru (@TOIBengaluru) October 18, 2025అయితే, బెంగళూరులో పరిస్థితుల్లో గతంలో కూడా ‘బ్లాక్బక్’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజీ కూడా గతంలో ఓ పోస్టు పెట్టారు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తాజాగా బయోకాన్ పార్క్కు వచ్చిన ఓ విదేశీ విజిటర్.. నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని పోస్టులో వెల్లడించారు. దీంతో, ఆమె పోస్టు వైరల్ అయ్యింది. Garbage is a serious malaise countrywide n no municipality of big cities has managed to solve it. Indore n Surat seemed to have cracked it but mumbai delhi Bengaluru etc haven’t. Very very pathetic which shows citizens lack of civic sense n huge apathy by both citizens n… https://t.co/rpBf0rZlaL— Kiran Mazumdar-Shaw (@kiranshaw) October 16, 2025 -
భారత రైల్వేలో అపార అవకాశాలు
భారతీయ రైల్వే వ్యవస్థ ప్రస్తుతం గణనీయమైన పరివర్తన దశలో ఉంది. భారత రైల్వే కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన లక్ష్యాల ప్రకారం.. 2047 నాటికి 7,000 కిలోమీటర్ల మేర హై-స్పీడ్ కారిడార్లను విస్తరించడం, వందేభారత్, అమృత్ భారత్ రైళ్లను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు ప్రతిపాదించారు. దాంతో అంతర్జాతీయ, దేశీయ కంపెనీలకు భారత రైల్వే మార్కెట్లో అపారమైన అవకాశాలు లభిస్తాయనే అంచనాలున్నాయి.ప్యాసింజర్ల అవసరాలకు అనువుగా..అంతర్జాతీయ కంపెనీలతోపాటు దేశీయ సంస్థలు భారతీయ ప్యాసింజర్ల అవసరాలు తీర్చడానికి కొన్ని విధానాలు అనుసరించాల్సి ఉంటుంది. హై-స్పీడ్, ప్రీమియం విభాగం (వందేభారత్ వంటివి) అవసరమే అయినప్పటికీ మెజారిటీ ప్రయాణీకులకు సరసమైన ప్రయాణం(అమృత్ భారత్ వంటివి) అవసరం. ధరల విషయంలో భారతదేశ మార్కెట్కు ప్రత్యేకంగా సరిపోయే భాగాలను, రైళ్లను ఉత్పత్తి చేయాలి. భారతీయ రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేసే విధంగా కోచ్ డిజైన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. సీటింగ్, లగేజీ స్థలం వంటివి దృష్టిలో ఉంచుకోవాలి.దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని భారతీయ భాగస్వాములకు బదిలీ చేయాలి. రైల్వే విడి భాగాలు, వ్యవస్థలను భారతదేశంలోనే తయారుచేయడానికి తయారీ యూనిట్లను నెలకొల్పాలి. తద్వారా స్థానిక ఉపాధి కల్పన పెరుగుతుంది. ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేయాలనే లక్ష్యం ‘మేక్ ఇన్ ఇండియా’ కేంద్రాల నుంచే ప్రారంభమైతే అంతర్జాతీయ కంపెనీలకు భారత ప్రభుత్వ సహకారం మరింత లభించే అవకాశం ఉంటుంది.భద్రత ప్రమాణాలు కీలకంరైళ్ల వేగం పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు అత్యంత కీలకం. కవచ్ వంటి స్వదేశీ సాంకేతికతలతో అనుసంధానం అయ్యే అత్యాధునిక సిగ్నలింగ్, ట్రాకింగ్ నిర్వహణ వ్యవస్థలను అందించాలి. రైలు ఆలస్యాలను, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి అత్యంత విశ్వసనీయత కలిగిన డివైజ్లను అందించాలి. దాంతోపాటు రైళ్లలో మెరుగైన సౌకర్యాలు (ఉదా: పరిశుభ్రమైన మరుగుదొడ్లు, మెరుగైన సీటింగ్, వినోద వ్యవస్థలు) అందించడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా కోచ్ డిజైన్లను అభివృద్ధి చేయాలి.కంపెనీలకు వాణిజ్య అవకాశాలుభారత రైల్వే విస్తరణలో హై-స్పీడ్ కారిడార్లు, వందే భారత్, అమృత్ భారత్ వంటి రైళ్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాంతో కంపెనీలకు అనేక వాణిజ్య అవకాశాలున్నాయి.మౌలిక సదుపాయాలుప్రభుత్వం 2047 వరకు 7,000 కి.మీ.ల హై-స్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేయాలని తలపెట్టిన నేపథ్యంలో అధిక నాణ్యత కలిగిన ట్రాక్ మెటీరియల్స్, వెల్డింగ్ సాంకేతికతలు, ట్రాక్ నిర్వహణ యంత్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల నిర్మాణ నైపుణ్యం అవసరం. హై-స్పీడ్ రైళ్లకు అత్యాధునిక ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ (OHE), ప్రపంచ స్థాయి సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ముఖ్యం. కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు.వందేభారత్ స్లీపర్ వెర్షన్లు, మెట్రో రైళ్లు, అమృత్ భారత్ (నాన్-ఏసీ జనరల్ క్లాస్) రైళ్లను పెద్ద సంఖ్యలో తయారు చేయాల్సి ఉంటుంది. కంపెనీలు కోచ్ డిజైన్, ప్రొపల్షన్ సిస్టమ్స్, బ్రేకింగ్ సిస్టమ్స్ వంటి అత్యంత కీలక భాగాలను సరఫరా చేయవచ్చు. భారత రైల్వేతో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి ప్రారంభించవచ్చు.ఎగుమతి ఉత్పత్తి కేంద్రాలుభారతదేశాన్ని రైల్వే భాగాల తయారీ కేంద్రంగా ఉపయోగించుకోవడానికి కంపెనీలకు ఇదో అవకాశం. ఇక్కడ తక్కువ ఖర్చుతో తయారైన రైల్వే భాగాలను ఆఫ్రికా, ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిర్వహణ వ్యవస్థలు, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత ట్రాక్ పర్యవేక్షణ, ప్రయాణీకుల సమాచార వ్యవస్థలను అందించడంలో అవకాశాలు ఉన్నాయి. కొత్త రైళ్లను, సాంకేతికతలను నిర్వహించడానికి ప్రస్తుత రైల్వే వర్క్షాప్లను ఆధునీకరించడానికి అత్యాధునిక యంత్రాలు, నైపుణ్యం అవసరం.అమృత్ భారత్ స్టేషన్ పథకంఈ పథకం కింద వేల సంఖ్యలో స్టేషన్లను పునరుద్ధరిస్తున్నారు. కంపెనీలు స్టేషన్ డిజైన్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, లాంజ్ సౌకర్యాలు, రిటైల్ స్పేస్ల అభివృద్ధిలో పాలుపంచుకోవచ్చు. ఇందులో భారీ పెట్టుబడులు అవసరం కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) నమూనాల ద్వారా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో కంపెనీలు ముఖ్య పాత్ర పోషించవచ్చు.ఇదీ చదవండి: పలుచబడిన ఐపీఎల్ మార్కెట్! కారణాలివే.. -
‘నన్ను చూస్తూ వెలికిగా నవ్వాడు, అందుకే కోపంతో..’ సారీ చెప్పిన దీపిక
ఏకంగా ప్రొఫెసర్పై.. అదీ పోలీసుల సమక్షంలో చెయ్యి చేసుకుంది ఓ విద్యార్థి సంఘం నాయకురాలు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. ఆమె క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునేది లేదని లెక్చరర్ల సంఘం ఆందోళనకు దిగింది. ఈ తరుణంలో ఆమె వివరణ ఇచ్చుకుంది. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ జాయింట్ సెక్రటరీ, ఏబీవీపీ సభ్యురాలు దీపిక ఝా(Deepika Jha) ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో ప్రొఫెసర్ సుజీత్ కుమార్పై ఆమె చెయ్యి చేసుకున్నారు. క్రమశిక్షణా కమిటీ భేటీలో.. అందునా అక్కడ ఉన్న పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. శుక్రవారం క్షమాపణలు చెబుతూ దీపికా ఝా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆయన (సుజీత్ కుమార్) నన్ను తదేకంగా చూశారు. నోటికొచ్చినట్లు తిట్టారు. బెదిరించారు. వెటకారంగా నవ్వారు. తట్టుకోలేకపోయా. అందుకే అలా చేయాల్సి వచ్చింది అని తన చర్యను సమర్థించుకున్నారామె. This is what happens when authority abuses power and impulse overtakes discipline.A drunk, politically biased DU professor misbehaved with students — police intervened but made no arrest.DUSU JS Deepika Jha reacted wrongly.This is not ABVP’s way.pic.twitter.com/d53LetxRiP— Gaurav (@gjha88) October 17, 2025బహిరంగంగా సిగరెట్ కాల్చడంతో విద్యార్థులు పాడైపోతారని ఆయన్ని మేం ఆపే ప్రయత్నం చేశాం. దీంతో ఆయన క్రమశిక్షణా కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో నాతో అనుచితంగా వ్యవహరించాడు. కోపంతో అలా చేయాల్సి వచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని చెబుతూనే జరిగిందానికి టీచర్స్ కమ్యూనిటీకి క్షమాపణలు తెలియజేశారామె. అయితే.. ఈ ఘటనపై కామర్స్ ప్రొఫెసర్ సుజీత్ కుమార్ వెర్షన్ మరోలా ఉంది. కాలేజీ స్టూడెంట్ కౌన్సిల్లో మూడు పోస్టులకు జరిగిన ఎన్నికల వ్యవహారమే దీనంతటికి కారణమని అంటున్నారాయన. ఈ ఎన్నికకు సంబంధించిన ఎన్ఎస్యూఐ(కాంగ్రెస్ విద్యార్థి విభాగం) సభ్యులపై ఏబీవీపీ సభ్యులు దాడి చేశారని.. దీంతో వాళ్లను సస్పెండ్ చేశామని.. ఆ వ్యవహారంపై చర్చించే సమయంలో కమిటీ ముందు కూడా మరోసారి దాడి జరిగిందని అన్నారాయన. ఈ వ్యవహారంలో తనను రాజీనామా చేయాలంటూ ఎబీవీపీ సభ్యులు ఒత్తిడి చేశారని, ఆ టైంలో దీపిక వచ్చి తనపై దాడి చేసిందని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారాయన. #WATCH | Delhi: On being slapped by DUSU Joint Secretary, Professor Sujeet Kumar says, "...I am the convener of the discipline committee in my college and it is my responsibility to maintain law and order in college... The day before yesterday, we had a fresher's function at our… pic.twitter.com/2scFkzg3kx— ANI (@ANI) October 17, 2025ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోషియేషన్(DUTA) భగ్గుమంది. దీపికా ఝాతో ఆ ప్రొఫెసర్కు క్షమాపణలు చెప్పించాల్సిందేనని పట్టుబడుతోంది. మరోవైపు.. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI) సైతం ఘటనను తీవ్రంగా ఖండించింది. తీవ్ర దుమారం రేపడంతో ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ నీతా సెహగల్ నేతృత్వంలోని కమిటీ రెండు వారాల్లో నివేదికను వీసీ యోగేష్ సింగ్కు సమర్పించనుంది. -
Amritsar: ‘గరీబ్ రథ్’లో అగ్నిప్రమాదం..
సిర్హింద్: పంజాబ్లోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం అమృత్సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ (రైలు నం. 12204)లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రైలులోని ఎయిర్ కండిషన్డ్ కోచ్లలో ఒకదానిలో నుండి పొగలు రావడంతో ప్రయాణికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ రోజు ఉదయం 7:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో వందల మంది ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వీరంతా అమృత్సర్ నుంచి సహర్సాకు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి తీవ్ర గాయాలయ్యాయి.రైల్వే అధికారుల కథనం ప్రకారం.. రైలులోని జీ-19 కోచ్ నుండి పొగలు రావడాన్ని తొలుత ప్రయాణికులు గమనించారు. వెంటనే వారిలోని ఒకరు అత్యవసర గొలుసును లాగారు. రైలు ఆగిపోయింది. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ కోచ్లోని ప్రయాణికులను తరలించే ప్రయత్నం చేశారు. నిమిషాల వ్యవధిలో మంటలు పక్కనే ఉన్న రెండు కోచ్లకు వ్యాపించాయి. దీంతో అధికారులు ఆ మూడు కంపార్ట్మెంట్లను రైలు నుంచి వేరు చేశారు. ఈ మూడు బోగీలు దెబ్బతిన్నాయి. ఒక ప్రయాణికురాలికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. రైల్వే బోర్డు ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. VIDEO | Sirhind, Punjab: A major train accident was averted near Sirhind railway station when a fire broke out in the Garib Rath Express travelling from Amritsar to Saharsa, just half a kilometre ahead of Ambala. The train was halted immediately after smoke was seen billowing… pic.twitter.com/vXwHoqTEJB— Press Trust of India (@PTI_News) October 18, 2025ప్రయాణికులు వెంటనే అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు.. అగ్నిమాపక సిబ్బంది, రైల్వే, స్థానిక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే 32 ఏళ్ల మహిళా ప్రయాణికురాలు గాయాలపాలు కాగా, ఆమెను ఫతేఘర్ సాహిబ్ సివిల్ ఆసుపత్రికి తరలించామని రైల్వే అధికారి రతన్లాల్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
Vande Bharat: బెల్టులతో కొట్టుకున్న క్యాటరింగ్ సిబ్బంది .. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ క్యాటరింగ్ సిబ్బంది మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించిన వీడియో వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఖజురహో వందే భారత్ ఎక్స్ప్రెస్లోని క్యాటరింగ్ సిబ్బంది పరస్పరం కొట్టుకున్నారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.క్యాటరింగ్ సిబ్బంది కొట్లాటకు సంబంధించిన 30 సెకన్ల ఈ వీడియోను చూస్తే, ఈ ఘటన ప్లాట్ఫారమ్ నంబర్ 7లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు ప్యాంట్రీ సిబ్బంది(పురుషులు) పరస్పరం అందిన వస్తువులు విసురుకోవడం, బెల్టులతో కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రైలు లోపల వాటర్ బాక్స్ ఉంచడం విషయంపై తలెత్తిన వివాదం భౌతిక ఘర్షణలకు దారితీసింది. IRCTC staffers serving onboard Vande Bharat settle an altercation with dustbin, belt and punches at Nizamuddin station in Delhi. pic.twitter.com/tldenRsRMz— Piyush Rai (@Benarasiyaa) October 17, 2025ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియో ‘ఎక్స్’ ప్లాట్ఫారంలో వైరల్గా మారింది. దీనిని చూసిన కొందరు యూజర్లు దీనిని ‘బాగ్పత్ యుద్ధం’తో పోల్చారు. ఈ ఘటన అనంతరం నలుగురు సిబ్బందిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎప్)తదుపరి దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకుంది. వారి ఐడీ కార్డులను రద్దు చేశారు. -
‘రోడ్డొక నరకం.. చావనివ్వండి’: ప్రధాని మోదీకి గ్రామస్తుల లేఖ
ముంబై: మహారాష్ట్రలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్-48)అధ్వాన్నస్థితికి చేరడం, తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడటం, దీనికితోడు పరిపాలనా అధికారుల నిర్లక్ష్యానికి విసిగివేసారిన నైగావ్, చించోటి, వాసాయి ప్రాంతాలకు పలువురు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి రోడ్డుపై అధ్వాన్న పరిస్థితులను ఎదుర్కొనేకన్నా.. చావడమే మేలు అంటూ, తమకు చనిపోయేందుకు అనుమతినివ్వాలంటూ వారంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.ఎన్హెచ్-48 వెంబడి ఉన్న ససునావ్ఘర్, మల్జిపడ, ససుపడ, బోబత్ పడ,పథర్పడ తదితర గ్రామాలకు చెందిన ప్రజలు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఒకప్పుడు ఈ మార్గంలో ఒక గంట ప్రయాణం చేసే సమయం ఇప్పుడు విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఐదు నుంచి ఆరు గంటలకు పెరిగిందని వారు మీడియాకు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జీవించడం కంటే చనిపోవడమే మంచిదని నిరసనలకు నాయకత్వం వహిస్తున్న స్థానిక ఎన్జీఓ కార్యకర్త సుశాంత్ పాటిల్ అన్నారు. ఆయన ప్రధాన మంత్రికి రాసిన లేఖలో.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇతర అధికారుల నిర్లక్ష్యం కారణంగా స్థానికుల దైనందిన జీవితం అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. ఈ సమస్య గురించి అధికారులకు తెలియజేసినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని, వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని లేఖలో ఆయన కోరారు.ఎన్హెచ్-48 మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండటమే కాకుండా, గుంతలతో నిండిన రహదారి మరింత అస్తవ్యస్తంగా మారిందని, దీనికితోడు ట్రాఫిక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో నరకం కనిపిస్తున్నదని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు కారణమైన అధికారులపై చర్య తీసుకునే వరకు గ్రామస్తులు నిరసన కొనసాగిస్తారని పాటిల్ తెలిపారు. థానేలోని గైముఖ్ ఘాట్ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనుల కారణంగా ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ సంబంధితన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీటిని స్థానిక అధికారులు విస్మరించారని పాటిల్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నిరసనల అనంతరం ఎంబీవీవీ పోలీసు కమిషనర్ నికేత్ కౌశిక్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. చించోటి ట్రాఫిక్ బ్రాంచ్ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హైవే ట్రాఫిక్ నిర్వహణ విధులను వాసాయి, విరార్ ట్రాఫిక్ బ్రాంచ్లకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. -
బీసీసీఐ, కేంద్రం.. ఆప్ఘన్ను చూసైనా సిగ్గుపడాలి: ప్రియాంక చతుర్వేది
ముంబై: పాకిస్తాన్ సైన్యం వైమానిక దాడుల కారణంగా ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు మృతిచెందారు. దీంతో వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంక జట్లతో తలపడబోయే ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏసీబీ నిర్ణయంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఏసీబీని చూసి బీసీసీఐ, భారత ప్రభుత్వం నేర్చుకోవాలి అని ఘాటు విమర్శలు చేశారు.శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పాకిస్తాన్ వ్యవస్థలో అమాయక బాధితుల రక్తం తాగే కొందరు వ్యక్తులు సరిహద్దుల్లో ఉన్నారు. వారంతా సిగ్గుపడాలి. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్తో తమ సిరీస్ మ్యాచ్లను రద్దు చేసుకోవడం సరైన చర్య. బహుశా బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం క్రీడల కంటే దేశానికి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో ఆప్ఘన్ నుంచి నేర్చుకోవాలంటూ విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు సంఘీభావంగా శ్రీలంక జట్టు కూడా సిరీస్ నుండి కూడా వైదొలగాలని ఆశిస్తున్నాను. 2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు వారి జట్టుపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారని మర్చిపోకూడదు. బీసీసీఐ లాగా కాకుండా పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇతర ఆసియా జట్లు సంఘీభావంగా నిలుస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.Pakistan establishment is made up of a bunch of cowards who thrive on the blood of their innocent victims and get thrashed at the borders. Shame on them. Good to see Afghanistan Cricket Board call off their series matches with Pakistan, maybe BCCI and GoI can take tips on how to… https://t.co/VzAvFcUOwi— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 18, 2025రాజకీయాలకు క్రీడలను దూరంగా ఉంచాలి. ఇక్కడ పోరాటం కేవలం రాజకీయల గురించి మాత్రమే కాదు. దుష్ట దేశం పాకిస్తాన్ గురించి. పాక్ ఉగ్రవాదం కారణంగా ఇప్పటికే పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ ప్రభావితమైంది. దేశం అంతా బాధపడుతోంది. కాబట్టి ఇది రాజకీయాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి’ అంటూ హితవు పలికారు. ఇక, అంతుకుముందు కూడాప్రియాంక బీసీసీఐ, కేంద్రం తీరును తప్పుబట్టారు. ఆసియా కప్లో పాకిస్తాన్తో భారత జట్టు మ్యాచ్లు ఆడటమేంటని ప్రశ్నించారు. Keep Politics out of sports is something that gets thrown around so easily by apologists of the government and the BCCI. This isn’t politics but about terrorism. Lives are lost, families are impacted, economy is affected, country suffers all of it because of one rogue nation. So…— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 18, 2025ఇదిలా ఉండగా.. క్రికెటర్ల మరణంపై ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘అత్యంత విషాదకరమైన ఘటన. అనైతికం, అనాగరిక చర్య. పాకిస్తాన్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. విషాద ఘటనలో మహిళలు, పిల్లలు, క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జాతీయజట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటోన్న యువ ప్లేయర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది. పౌరులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలని కోరుతున్నా. పాక్తో తలపడబోయే ట్రై సిరీస్ నుంచి వైదొలుగుతున్నామని మా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం సరైందే. క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తాం. మాకు దేశ సమగ్రత అత్యంత ముఖ్యమైన అంశం’ అని పేర్కొన్నాడు. -
ఉమ్మడిగా సాగుదాం
న్యూఢిల్లీ: భారత్–శ్రీలంక దేశాల ఉమ్మడి అభివృద్ధి ప్రయాణంలో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. భారత పర్యటనలో ఉన్న శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ‘విద్య, మహిళా సాధికా రిత, ఆవిష్కరణలు, అభివృద్ధి సహకారం, భారత మత్స్యకారుల సంక్షేమం వంటి అంశాలపై విస్తృత చర్చలు జరిపాం. సన్నిహిత ఇరుగుపొరుగు దేశాలైన భారత్, శ్రీలంకల మధ్య సహకారం ఈ ప్రాంతానికి, రెండు దేశాల ప్రజల వికాసానికి ఎంతో ముఖ్యమైంది’అని ప్రధాని మోదీ అనంతరం ఎక్స్లో పేర్కొన్నారు. ఈజిప్టు విదేశాంగ మంత్రితో మోదీ భేటీఈజిప్టు విదేశాంగ మంత్రి డాక్టర్ బదర్ అబ్దెలట్టీతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. గాజా శాంతి ఒప్పందం కార్యరూపం దాల్చడంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. -
అలుపెరగని సహకారం
నాసిక్: హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశంలో వివిధ వైమానిక స్థావరాల్లో ఉన్న యుద్ధ విమానాలకు అవసరమైన తోడ్పాటును నిర్విరామంగా అందించిందని ప్రశంసించారు. ఫలితంగా ఫైటర్ జెట్లు, హెలికాప్టర్ల సమర్థవంతమైన నిర్వహణ, సన్నద్ధత సాధ్యమైందన్నారు. నాసిక్లోని హెచ్ఏఎల్ కేంద్రంలో మంత్రి రాజ్నాథ్ శుక్రవారం తేజస్ తేలికపాటి యుద్ధ విమానం(ఎల్సీఏ)ఎంకే1ఏ తయారీ విభాగాన్ని, శిక్షణ విమానం హెచ్టీటీ–40 ప్రత్యేక తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. నాసిక్ విభాగంలో తయారైన తేజస్ ఎల్సీఏ ఎంకే1ఏ మొట్టమొదటిసారిగా రివ్వున ఆకాశంలోకి దూసుకెళ్లడాన్ని మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సుఖోయ్–30 ఎంకేఐ జెట్ విమానాలకు బ్రహ్మోస్ క్షిపణుల అనుసంధానంలో హెచ్ఏఎల్ నాసిక్ విభాగం కృషి మరువలేమన్నారు. తేజస్ ఎంకే1ఏ తయారీ కేంద్రంలో ఇకపై ఏటా కనీసం 24 ఎల్సీఏలు తయారవుతాయని వివరించారు. మిగ్–21, మిగ్–27 వంటి ఫైటర్ జెట్ల నుంచి సుఖోయ్–30 ఎంకేల వరకు తయారు చేస్తూ నాసిక్ కేంద్రం ఉత్పత్తి హబ్గా మారిందని చెప్పారు. -
రివాబా జడేజాకు మంత్రి పదవి
గాందీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. సీఎం సహా మొత్తం 26 మందితో నూతన కేబినెట్ కొలువుదీరింది. కొత్తగా 19 మందికి చోటుదక్కింది. తాజా మాజీ మంత్రుల్లో ఆరుగురికి మరోసారి అవకాశం లభించింది. ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాను మంత్రి పదవి వరించడం విశేషం. నిన్నటిదాకా హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన హర్ష్ సంఘవి ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. మంత్రివర్గ సభ్యులతో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 27 మందిని మంత్రిగా నియమించేందుకు వీలుంది. సీఎం భూపేంద్ర పటేల్ 26 మందితో కేబినెట్ను ఏర్పాటు చేశారు. 2027లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. సరిగ్గా రెండేళ్ల ముందు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం గమనార్హం. అలాగే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను సైతం దృష్టిలో పెట్టుకొని కేబినెట్లో మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. సీఎం మినహా మొత్తం 25 మందిలో తొమ్మిది మందికి కేబినెట్ ర్యాంకు, ముగ్గురికి స్వతంత్ర హోదా, 13 మందిని సహాయ మంత్రులుగా నియమించారు. గత కేబినెట్లో మహిళా మంత్రి ఒక్కరే ఉండగా, ఈసారి ముగ్గురికి స్థానం దక్కింది. నాలుగేళ్ల తర్వాత డిప్యూటీ సీఎం సూరత్ జిల్లాలోని మజూరా ఎమ్మెల్యే హర్ష్ సంఘవి గుజరాత్ కేబినెట్లో నంబర్ టూ స్థానానికి చేరుకున్నారు. సహాయ మంత్రిగా వ్యవహరించిన ఆయనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిని నియమించడం గత నాలుగేళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2021లో విజయ్ రూపానీ ప్రభుత్వంలో నితిన్ పటేల్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. భూపేంద్ర పటేల్ కేబినెట్లోని మొత్తం 16 మంది మంత్రులు గురువారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఆరుగురు మళ్లీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా, 2024 మార్చిలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పోర్బందర్ ఎమ్మెల్యే మోధ్వాడియాకు మంత్రిగా అవకాశం దక్కింది. ఆయన గతంలో గుజరాత్ పీసీసీ అధ్యక్షుడిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న రివాబా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు మంత్రి పదవి కట్టబెట్టడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆమెను కేబినెట్లో చేర్చుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రమాణ స్వీకారానికి రవీంద్ర జడేజాతోపాటు వారి కుమార్తె సైతం హాజరయ్యారు. రివాబా 1990 నవంబర్ 2న జని్మంచారు. 2022లో జరిగిన ఎన్నికల్లో జామ్నగర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శ్రీ మాతృశక్తి చారిటబుల్ ట్రస్టును స్థాపించారు. -
కుటుంబానికో ఉద్యోగం ఎలా సాధ్యం?
పట్నా: ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఎలా సాధ్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విపక్ష ఆర్జేడీ ఇస్తున్న హామీ ఆచరణలో సాధ్యం కాదని అన్నారు. ఓట్ల కోసం విచ్చలవిడిగా హామీలు ఇస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే వారికి వేతనాలు చెల్లించడానికి నిధులు ఎక్కడి తీసుకొస్తారని ప్రశ్నించారు. 2.6 కోట్ల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి వేతనాలు ఇవ్వాలంటే రూ.12 లక్షల కోట్లు కావాలన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్కు అది నాలుగు రెట్లు అని చెప్పారు. శుక్రవారం బిహార్ రాజధాని పట్నాలో మేధావులు, వివిధ రంగాల నిపుణులతో జరిగిన సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. బిహార్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అది చొరబాటుదారులను కాపాడే యాత్ర అని విమర్శించారు. దేశంలోకి అక్రమ వసలదారులను అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. భారత్ ధర్మశాల కాదని స్పష్టంచేశారు. చొరబాటుదారులను కూడా ఓటర్ల జాబితాలో చేర్చాలని రాహుల్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల నుంచి చొరబాటుదారుల పేర్లను కచి్చతంగా తొలగిస్తామన్నారు. కుటుంబ వారసత్వ రాజకీయాలను నమ్ముకుంటున్న కాంగ్రెస్, ఆర్జేడీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని అమిత్ షా పిలుపునిచ్చారు. అభివృద్ధికే పెద్దపీట వేస్తున్న బీజేపీని గెలిపించాలని కోరారు. బిహార్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలన్నారు. ఎన్డీయే ప్రభుత్వం సాధించిన ఘనతలను ఆయన ప్రస్తావించారు. బిహార్ క్షేమంగా ఉండొద్దా? కరడుగట్టిన గ్యాంగ్స్టర్ మొహమ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామాకు బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ టికెట్ ఇవ్వడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి దిగితే ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బిహార్ క్షేమంగా ఉండాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. సారణ్ జిల్లాలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. నేరగాళ్లకు టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఆర్జేడీ లాంటి పారీ్టల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. లాలూ–రబ్రీ హయాంలో బిహార్ రాష్ట్రం జంగిల్రాజ్గా మారిందని ఆరోపించారు. జంగిల్ రాజ్ నుంచి సీఎం నితీశ్ కుమార్ విముక్తి కల్పించారని అమిత్ షా ప్రశంసించారు. అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీయేను మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. -
సుప్రీం పేరుతో డిజిటల్ స్కాం
సాక్షి, న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం పేరుతో ఉత్తుత్తి ఉత్తర్వులు చూపించి వృద్ధ దంపతుల నుంచి రూ.కోటికి పైగా డబ్బు కాజేసిన ఘటనపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా న్యాయస్థానాల పేర్లతో జరిగే డిజిటల్ నేరాలతో ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతామని పేర్కొంది. వ్యవస్థ గౌరవం దెబ్బతింటుందని తెలిపింది. ఇవి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. డిజిటల్ స్కాంలపై తక్షణ ప్రతిస్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జాయ్మాల్య భాగ్చీల ధర్మాసనం నోటీసులు పంపింది. తమను డిజిటల్ అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన ఆదేశాల ఫోర్జరీ పత్రాలను బాధిత పిటిషనర్లు చూపించారు. కేటుగాళ్లు సెప్టెంబర్ 3 నుంచి 16వ తేదీ మధ్యలో సీబీఐ, ఈడీ అధికారులుగా, జడ్జీలుగా నటిస్తూ ఆడియో, వీడియో కాల్స్ ద్వారా కోర్టు నకిలీ ఉత్తర్వులను చూపించి, అరెస్టు, నిఘా అంటూ బెదిరించారని బాధితులు కొన్ని పత్రాలను చూపారు. వీటితో పలు దఫాలుగా రూ.1.05 కోట్లు కాజేశారన్నారు. హరియాణాలోని అంబాలాకు చెందిన వృద్ధ దంపతులు ఇటీవల ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్కి ఈ మోసంపై సెప్టెంబర్ 21న లేఖ రాశారు. వృద్ధ దంపతులకు జరిగిన అన్యాయంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. బాధితుల ఫిర్యాదుపై సుమోటోగా విచారణ చేపట్టింది. విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నమిది..న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థల పేరిట సృష్టించిన ఫోర్జరీ పత్రాలతో న్యాయస్థానంపై ప్రజలకు గల విశ్వాసం దెబ్బతింటుందని ధర్మాసనం ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జీల సంతకాలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారి సంతకాలు, కోర్టు స్టాంప్ కూడా వేయడం తీవ్రమైన అంశమని పేర్కొంది. ‘జడ్జీ్జల సంతకాలతో సృష్టించిన ఫోర్జరీ పత్రాలు న్యాయస్థానంపై ప్రజల విశ్వాసంతోపాటు, వ్యవస్థ మూలాలు దెబ్బ తింటాయి. ఇటువంటి క్రిమినల్ చర్యలను సాధారణ మోసం, సైబర్ క్రైమ్గా పరిగణించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భవిష్యత్లో న్యాయస్థానాల పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలను ఉపేక్షించరాదని పేర్కొంది. త్వరగా ప్రతిస్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. ఈవ్యవహారంలో తాము భారత అటార్నీ జనరల్ సహాయం కోరుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఇది ఈ వృద్ధ దంపతుల సమస్య మాత్రమే కాదని, యావత్ దేశ ప్రజానీకం సమస్య అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం పోలీసులను దర్యాప్తు వేగవంతం చేయమని చెప్పి వదిలేయడానికి వీలు లేదని పేర్కొంది. కేవలం ఇదొక్క కేసు మాత్రమే కాదు. ఇటువంటి నేరాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా జరిగినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇటువంటి విస్తృత ప్రభావం కలిగిన నేరపూరిత చర్యలను పూర్తిగా దర్యాప్తు జరిపి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులు సమన్వయంగా కృషి చేయాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో సాయం అందించాలని అటార్నీ జనరల్ను కోరిన ధర్మాసనం, వృద్ధ దంపతుల కేసు దర్యాప్తు పురోగతిని తెలియజేయాలంటూ హరియాణా ప్రభుత్వం, అంబాలా సైబర్ క్రైమ్ విభాగాలను ఆదేశించింది. -
దళితుడిగా పుట్టడమే నేరమా?
కాన్పూర్: అధికార బీజేపీపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ పాలనలో దళితులపై అణచివేత నానాటికీ పెరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరియాణాలో దళిత ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో దళితుడైన హరిఓం వాల్మీకిని దారుణంగా హత్య చేశారని, ఈ హత్యాకాండ మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని బెదిరించి గొంతు నొక్కేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తోందని ఆరోపించాచారు. రాహుల్ గాంధీ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హరిఓం తండ్రి, సోదరుడు, సోదరితో మాట్లాడారు. సంతాపం ప్రకటించారు. అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాను ఇక్కడికి రాకుండా ఉత్తరప్రదేశ్ అధికారులు అడ్డంకులు సృష్టించారని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆయన తొలుత మీడియాతో మాట్లాడారు. అనంతరం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఆ దేశంలో దళితుడిగా జని్మంచడమే నేరమా? అనే ప్రశ్న బాధితుల కళ్లల్లో కనిపిస్తోందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో దళితులపై అకృత్యాలకు పాల్పడిన నేరగాళ్లను కాపాడడం, బాధితులనే శిక్షించడం బీజేపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. న్యాయాన్ని గృహ నిర్బంధంలో ఉంచలేరని తేల్చిచెప్పారు. హరిఓం వాల్మీకి కుటుంబాన్ని వేధించడం ఇకనైనా మానుకోవాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. హరిఓం వాల్మీకి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దేశంలో ప్రతి బాధితుడికి, అణగారిన వర్గాలకు తన అండదండలు ఉంటాయన్నారు. ఈ పోరాటం కేవలం హరిఓం కోసం కాదని.. అన్యాయానికి తలవంచని ప్రతి గొంతుక కోసం పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. 40 ఏళ్ల హరిఓం వాల్మీకిని ఈ నెల 2న రాత్రిపూట గ్రామస్థులు కొట్టిచంపారు. అతడిని దొంగగా భావించి దాడిచేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. -
హిజాబ్ వివాదం.. వేరే పాఠశాలకు విద్యార్థిని
కొచ్చి: ఇక్కడి చర్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలో హిజాబ్ ధారణకు యాజమాన్యం అభ్యంతరం తెలపడంతో, ఆ విద్యార్థినిని మరో పాఠశాలలో చేర్చాలని ఆమె తల్లిదండ్రులు నిర్ణయించారు. కాగా, పాఠశాల నిబంధనలకు కట్టుబడితే విద్యార్థిని తిరిగి చదువు కొనసాగించడానికి స్వాగతిస్తామని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది. పల్లూరుత్తిలోని సెయింట్ రీటాస్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని తండ్రి.. తన కుమార్తెను తిరిగి అదే పాఠశాలకు పంపబోమని స్పష్టం చేశారు. ఈ వివాదం తర్వాత తన కుమార్తె తీవ్ర ఒత్తిడికి లోనైందని, తిరిగి అదే పాఠశాలకు వెళ్లడం తనకిష్టం లేదని చెప్పిందన్నారు. వివాదం మొదలైనప్పటి నుండి పాఠశాల ఉపాధ్యాయులు లేదా యాజమాన్యం తమను సంప్రదించలేదని తెలిపారు. ‘నా కూతురు గత రెండు రోజులుగా తరగతులకు హాజరు కావడం లేదు, మాకు స్కూల్ నుండి ఎలాంటి సమాచారం అందలేదు’అన్నారు. ఈ వివాదంపై విద్యార్థినికి మద్దతు పలికిన కేరళ విద్యాశాఖ మంత్రి వి.శివన్కుట్టి మాట్లాడుతూ.. హెడ్స్కార్ఫ్ ధరించే ఉపాధ్యాయిని (నన్) ఒక విద్యార్థినిని హిజాబ్ ధరించనివ్వకపోవడం ఆశ్చర్యకరం, విడ్డూరమని వ్యాఖ్యానించారు. మరోవైపు, పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ హీలీనా ఆల్బీ మాట్లాడుతూ.. విద్యార్థిని పాఠశాల నియమాలను పాటిస్తే.. ఆమె యధాప్రకారం చదువుకోవచ్చని తెలిపారు. ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. తమ పాఠశాలలో భారతీయ సాంస్కృతిక, సంప్రదాయ విలువలను సమ్మిళితం చేస్తూ విద్యను అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. స్కూల్ డ్రెస్ కోడ్కు విరుద్ధంగా.. బాలిక హిజాబ్ ధరించడంపై యాజమాన్యం అభ్యంతరం చెప్పడంతో ఈ వివాదం మొదలవడం తెలిసిందే. దీనిపై అక్టోబర్ 10న, విద్యార్థిని తల్లిదండ్రులు ఇతరులతో కలిసి పాఠశాలను సందర్శించి యాజమాన్యాని నిలదీశారు, దీంతో పాఠశాల రెండు రోజుల సెలవు ప్రకటించింది. తర్వాత కేరళ హైకోర్టు పాఠశాలకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది. -
భారతీయులకు థాయ్ వెలుగుల ఆహ్వానం
భారత పర్యాటకులను భారీగా ఆకర్షించడం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా థాయిలాండ్ వ్యూహరచన చేసింది. ఇందుకు వెలుగుల పండుగ దీపావళిని వేదికగా చేసుకుంది. ‘గ్రాండ్ దివాళిృ2025’ వేడుకలను భారీగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 16 నుంచి 31 వరకు ప్రతిష్టాత్మకంగా థాయ్ - భారత్ సాంస్కృతిక మేళవింపులతో వెలుగుల పండుగకు ఏర్పాట్లు చేస్తోంది. అద్భుత లైటింగ్ ప్రదర్శనలకు తోడు సాంస్కృతిక కార్యక్రమాల్లో లీనమయ్యే ప్రత్యేక అనుభవాలను పర్యాటకులకు అందించేలా షెడ్యూల్ను ప్రకటించింది. భారతదేశం వెలుపల అతిపెద్ద దీపావళి వేడుకను ‘ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’గా పిలుస్తోంది. ఈ ఘట్టానికి ‘ఐకానిక్ ఓంగ్ ఆంగ్ కెనాల్, ఫహురత్ ప్రాంతాలను కేంద్ర బిందువులుగా మారుస్తోంది. - సాక్షి, అమరావతిఈ నెల 16 నుంచి 31 వరకు థాయిలాండ్లో గ్రాండ్ దివాళి వేడుక భారత పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళిక తద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వచ్చేలా వ్యూహ రచన లైట్ షోలు, స్థానికృభారతీయ మేళవింపుతో సాంస్కృతిక ప్రదర్శనలు విమానాశ్రయాల నుంచే పర్యాటక సేవలపై రాయితీల జల్లు కృత్రిమ మేధ కెమెరాలు, వాహనాలతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు దీపావళి వెలుగుల వేడుక ఇలా.. మధురానుభూతి మిగిలిపోయేలా.. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫహురత్, ఓంగ్ ఆంగ్ కెనాల్ ప్రాంతాల్లో వేడుకలు రాత్రిళ్లు ఆకర్షణీయమైన సౌండ్ అండ్ లైటింగ్ షోలు. కమ్యూనిటీ ఈవెంట్లు రాత్రిళ్లు ఆకర్షణీయమైన సౌండ్ అండ్ లైటింగ్ షోలు. కమ్యూనిటీ ఈవెంట్లు ప్రధాన ఆకర్షణగా థాయ్-ఇండియన్ రామాయణ ప్రదర్శన లాంతర్ నృత్యాలు, భరత నాట్యం, అసోం నుంచి బిహు జానపద నృత్యం, బాలీవుడ్ నృత్యం, భారత సమకాలీన నృత్య ప్రదర్శనలుసహా రెండు దేశాల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు గోరింట (మెహందీ), లాంతరు పెయింటింగ్, పూసలుృబుట్ట నేయడం వంటి ఆటవిడుపు వర్క్షాపుల నిర్వహణ ప్రాన్ బిర్యానీ, మసాలా దోస, పానీపూరిసహా నోరూరించే ఇతర భారతీయ వంటకాలు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించే లక్ష్మీదేవి, గణేశుడి ఆరాధన కార్యక్రమాలు ఓంగ్ ఆంగ్ కెనాల్ తీరంలో రంగోలి, నీటిపై తేలియాడేనూనె దీపాల ప్రదర్శనలు లక్ష మంది హాజరు! ‘అమేజింగ్ థాయిలాండ్ గ్రాండ్ దీపావళి ఫెస్టివల్’కు లక్ష మందికిపైగా హాజరవుతారని థాయ్ టూరిజం అథారిటీ ప్రకటించింది. ఈ ఒక్క వేడుక ద్వారానే ఆ దేశానికి 650 మిలియన్ బాట్ల (దాదాపు 20 మిలియన్ డాలర్లు) రెవెన్యూ వస్తుందని అంచనా వేసింది. దీనికి తోడు పర్యాటకులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. డాన్ ముయాంగ్, సువర్ణభూమి విమానాశ్రయాల నుంచి వేడుక నిర్వహించే వేదికల వరకూ కీలక ప్రదేశాల్లో పర్యాటక సేవల వ్యయాలపై రాయితీలు కురిపిస్తోంది. భద్రతను దృష్టిలో పెట్టుకుని కృత్రిమ మేధ కెమెరాలు, వాహనాలను వినియోగించనుంది. ఒక్క ఈ నెలలోనే భారతీయ సందర్శకుల సంఖ్య 30 శాతం పెరుగుతుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. 60 రోజుల పాటు వీసా మినహాయింపు కల్పిం చింది. వ్యక్తికి రూ.90 వేల వరకు వ్యయం! ప్రతి ఏటా థాయిలాండ్ను సందర్శిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్లో ఇప్పటి వరకు థాయిలాండ్లో దాదాపు 18 లక్షల మంది భారతీయులు పర్యటించారు. థాయ్కు అత్యధికంగా వచ్చే సందర్శకుల సంఖ్యలో మొదటి మూడు దేశాల్లో భారత్ ఒకటి. బ్యాంకాక్, ఫుకెట్, క్రాబీ, కో స్మామ్యూయ్ వంటి థాయ్ గమ్యస్థానాలు భారతీయ పర్యాటకుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. దీనిని మరింత విస్తృతం చేసుకోవడం ద్వారా ఈ ఏడాది నాటికి 25 లక్షల మంది భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా థాయ్ ప్రణాళికలు రూపొందిస్తోంది. థాయ్కి వచ్చే భారతీయ సందర్శకులు సాధారణంగా సగటున ఒక వ్యక్తికి రూ.90 వేల వరకు ఖర్చు చేస్తారని, దాదాపు 6–7 రాత్రులు బస చేస్తారని తేలింది. -
'ప్రతిమ'దిలో రామాయణం
అయోధ్య: శ్రీరాముడి జన్మభూమి అయోధ్య.. మరో అద్భుత ఘట్టానికి సిద్ధమవుతోంది! ప్రపంచంలోనే మొట్టమొదటి రామాయణ ఇతివృత్తంతో కూడిన భారీ వ్యాక్స్ మ్యూజియం (మైనపు బొమ్మల ప్రదర్శన శాల) త్వరలో ఇక్కడ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో.. దీపోత్సవం–2025 సందర్భంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీరామ జన్మభూమి మందిరం సమీపంలోని ’పరిక్రమ మార్గ్’లో 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. దాదాపు రూ.7.5 కోట్లతో నిర్మితమవుతున్న ఈ మ్యూజియం.. అయోధ్యలో మత పర్యాటకాన్ని మరింత పెంచడానికి దోహదపడుతుంది. 50 జీవం ఉట్టిపడే బొమ్మలు: మ్యూజియంలో మొత్తం 50 మంది రామాయణ ప్రధాన పాత్రల మైనపు బొమ్మలను ప్రదర్శించనున్నారు. వీటిలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు, విభీషణుడు తదితర విగ్రహాలున్నాయి. ప్రతి బొమ్మా.. పాత్రల దుస్తులు, ముఖ కవళికలు, భంగిమల్లో జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. గ్రౌండ్ ఫ్లోర్: రాముని బాల్యం, సీతాదేవి స్వయంవరం వంటి తొలి ఘట్టాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. మొదటి అంతస్తు: 14 ఏళ్ల వనవాసం, సీతాపహరణం, లంకా దహనం, రామ–రావణ యుద్ధం వంటి కీలక ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించారు. సెల్ఫీ పాయింట్: భక్తులు.. బాల రాముడి మైనపు విగ్రహం వద్ద సెలీ్ఫలు తీసుకునేందుకు ప్రత్యేక పాయింట్ను ఏర్పాటు చేశారు. తాదాత్మ్యం చెందేలా..: త్రీడీ లైటింగ్ ఎఫెక్ట్స్, వినసొంపైన సౌండ్స్కేప్స్ మ్యూజియాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తాయి. దివ్య సుగంధం: మ్యూజియం లోపల త్రేతాయుగాన్ని గుర్తుకు తెచ్చే దివ్య సుగంధంతో పాటు, నిరంతరం ‘రామ తారక మంత్రం’పఠనం, రామ భజనలు వినిపిస్తాయి. నిర్మాణ శైలి: కేరళకు చెందిన ‘సునీల్ వ్యాక్స్ మ్యూజియం’సంస్థ ఈ ప్రాజెక్ట్ను సంప్రదాయ దక్షిణ భారత నిర్మాణ శైలిలో తీర్చిదిద్దుతోంది. ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ.100. ఒకేసారి 100 మంది సందర్శకులకు మాత్రమే ప్రవేశం కలి్పస్తారు. సౌకర్యాలు: పూర్తిగా ఎయిర్ కండిషన్ చేసిన ఈ మ్యూజియం వెలుపల పార్కింగ్, స్నాక్ జోన్లు, కాఫీ హౌస్, దక్షిణ, ఉత్తర భారతీయ వంటకాలతో ఫుడ్ కోర్టు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. భద్రత: ఇరవై నాలుగ్గంటలూ సీసీటీవీ నిఘా, అగ్నిమాపక భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేశారు.దీపోత్సవానికల్లా పూర్తి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, దీపోత్సవం నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు. ఈ వ్యాక్స్ మ్యూజియం అయోధ్య సాంస్కృతిక వైభవానికి కొత్త మెరుగులు దిద్దనుంది. -
ఇదీ నా గ్యారంటీ
న్యూఢిల్లీ: మావోయిస్టుల బెడదను పూర్తిగా అంతం చేసే రోజు ఇక ఎంతోదూరంలో లేదని తాను గ్యారంటీ ఇస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహించాయని ఆరోపించారు. నక్సలైట్లు విచ్చలవిడిగా హింసకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా కళ్లు మూసుకున్నాయని ఆరోపించారు. గత 75 గంటల్లో 303 మంది నక్సలైట్లు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారని తెలిపారు. వీరు సాధారణ నక్సలైట్లు కాదని, వారిపై లక్షలాది రూపాయల రివార్డు ఉందని చెప్పారు. నేడు దేశంలో కేవలం మూడు జిల్లాల్లోనే వామపక్ష తీవ్రవాద ప్రభావం బలంగా ఉందన్నారు. 11 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా 125 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేదని వెల్లడించారు. ఆ సంఖ్య ఇప్పుడు 11కు పడిపోయిందన్నారు. వీటిలో మూడు జిల్లాల్లోనే వారి ఉనికి అధికంగా ఉందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. గత దశాబ్ద కాలంలో వేలాది మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి లొంగిపోయారని పేర్కొన్నారు. గత 50–55 ఏళ్ల కాలంలో నక్సలైట్లు వేలాది మందిని హత్య చేశారని, పాఠశాలలు, ఆసుపత్రులను కూల్చివేశారని వివరించారు. మావోయిస్టు తీవ్రవాదం అనేది యువతకు జరిగిన అన్యాయమేనని అభివర్ణించారు. మొదటిసారిగా తన మనసులోని బాధను బయటకు వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. నక్సలిజం, మావోయిస్టుల హింస నుంచి దేశం విముక్తి పొందే రోజు అతి దగ్గర్లలోనే ఉందని, ఇదీ నా గ్యారంటీ అని తేల్చిచెప్పారు. నక్సలిజం వల్ల నష్టపోయిన ప్రాంతాలు దాదాపు 60 ఏళ్ల తర్వాత మొదటిసారిగా దీపావళి పండుగ నిర్వహించుకోబోతున్నాయని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోసం సంస్కరణలు దేశ ప్రగతే లక్ష్యంగా సంస్కరణల విషయంలో తమ ప్రభుత్వం దృఢచిత్తంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలు కేవలం కొన్ని అవసరాల రీత్యా సంస్కరణలు తీసుకొచ్చాయని అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం పూర్తి అంకితభావం, బలమైన విశ్వాసంతో దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు అమలు చేస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి సంస్కరణను ఒక విప్లవంగా మారుస్తున్నామని స్పష్టంచేశారు. ఉగ్రవాద దాడులు జరిగితే ఇప్పుడు భారత్ నిశ్శబ్దంగా ఉండడం లేదని, ముష్కర మూకలపై భీకరస్థాయిలో ప్రతిదాడులు చేస్తోందని తెలిపారు. సర్జికల్ దాడులు, వైమానిక దాడులతో విరుచుకుపడుతోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. యుద్ధాలు జరిగినప్పుడు ఆర్థిక ప్రగతి క్షీణిస్తుందని నిపుణులు చెబుతుంటారని, కానీ, అది అబద్ధమని తాము నిరూపించామన్నారు.అవరోధాలు, స్పీడ్బ్రేకర్లు ఏమీ చేయలేవు ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నాయని, యుద్ధాలు, సంక్షోభాలు కనిపిస్తున్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారతదేశ అభివృద్ధి పరుగులు ఆగడం లేదన్నారు. ప్రపంచ దేశాలు భారత్ గురించి చర్చించుకుంటున్నాయని చెప్పారు. అవరోధాలు, స్పీడ్బ్రేకర్లు తమను ఏమీ చేయలేవన్నారు. ఈ ప్రగతి పరుగును ఆపే మూడ్లో దేశం లేదన్నారు. -
ఇన్ఫోసిస్ అంటే బృహస్పతినా?
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య సర్వేపై ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి చేసిన విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తిప్పికొట్టారు. ఈ సర్వే వెనుకబడిన తరగతులకు సంబంధించినది కాదని పదేపదే చెప్పినా నారాయణమూర్తి దంపతులకు అర్థంకాలేదని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఇది (సర్వే) వెను కబడిన కులాలకు సంబంధించినదనే అపోహ కొందరిలో ఉంది. ఇది వెనుకబడిన కులాల సర్వే కాదు. దీని గురించి రాసేవాళ్లు ఏమై నా రాసుకోనీయండి. ఈ సర్వే ఎందుకోసమనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలు. వాళ్లకు (నారాయణమూర్తి దంపతులకు) దీనిగురించి అర్థంకాకపోతే నేనేం చేయాలి?’అని ప్రశ్నించారు.వాళ్లు సర్వజ్ఞులా?ప్రభుత్వ సర్వేపై నారాయణమూర్తి దంపతులు గురువారం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వారి ఇంటికి సర్వే కోసం వెళ్లిన ఎన్యూమరేటర్లకు వారు సహకరించలేదని తెలిసింది. తాము వెనుకబడిన వర్గానికి చెందినవారము కాదని, అందువల్ల సర్వేలో పాల్గొనబోమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నారాయణమూర్తి దంపతుల తీరుపై సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. ‘ఇన్ఫోసిస్ అంటే ఏమైనా బృహస్పతినా (మేధావి)? ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదని, అందరి సర్వే అని మేం 20 సార్లు చెప్పాం. మా ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి శక్తి పథకాన్ని ప్రారంభించింది. గృహలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2,000 ఇస్తున్నాం. శక్తిపథకాన్ని వినియోగించుకుంటున్నవారిలో అగ్రకుల మహిళలు, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు లేరా? గృహలక్ష్మి పథకంలో అగ్రకుల మహిళలు లేరా? కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేపడుతోంది. మూర్తి దంపతులు ఆ సర్వేలో ఏం చెప్తారు? బహుషా తప్పుడు సమాచారం ఇస్తారేమో! నేను మళ్లీమళ్లీ చెప్తున్న ఇది వెనుకబడిన వర్గాల సర్వే కాదు. ఏడు కోట్లమంది కన్నడిగులకు సంబంధించిన సర్వే’అని స్పష్టంచేశారు.మార్పు అనేది విప్లవం కాదురాష్ట్రంలో సీఎం మార్పుపై కూడా ఆయన స్పందించారు. ‘కొందరు నవంబర్ క్రాంతి అంటున్నారు. అది క్రాంతి కాదు. క్రాంతి అంటే విప్లవం. మార్పు అనేది విప్లవం కాదు’అని పేర్కొన్నారు. నాయకత్వ మార్పు అంశం సమయం సందర్భం లేకుండా చర్చకు వస్తోందని, దీనిని పెద్దగా పట్టించుకోవా ల్సిన అవసరం లేద ని అన్నారు. ప్రభుత్వ భూములు, స్కూళ్లు, కాలేజీల్లో ఆరెస్సెస్ కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. ‘ఇది ఒక్క ఆర్ఎస్ఎస్కు సంబంధించిన నిర్ణ యం కాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ సంస్థ కూడా కార్యకలాపాలు నిర్వహించటం కుదరదు. నిజా నికి ఈ నిర్ణయం గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగదీశ్ షెట్టర్ సర్కారు తీసుకుంది’అని పేర్కొన్నారు. -
ముంబై కా హీరో..ప్లాట్ఫారమ్పై పురుడు పోశాడు!
ముంబై: అమిర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సినిమా చూసే ఉంటారు కదా. అందులో ఓ సన్నివేశం మీకందరికి గుర్తుండే ఉంటుంది. హీరోయిన్ అక్కకు హీరో ర్యాంచో డెలివరీ చేసి ఆడియన్స్ను కంటతడి పెట్టించాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది అలాంటి నిజజీవిత హీరో గురించే..ఈ హృదయ విదారక సంఘటనను ప్రత్యక్ష సాక్షి మంజీత్ ధిల్లాన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారుముంబై ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రసవవేదనతో బాధపడతోంది. తోటి ప్రయాణికులు చోద్యంగా చూస్తున్నారే తప్పా ఎవరూ ముందుకు వచ్చే సహాయం చేసే ప్రయత్నం చేయలేదు. అదిగో అప్పుడే వందలో ఒక్కడిగా వికాశ్ బింద్రే ముందుకు వచ్చాడు. మహిళను ప్రసవం గురించి ఆరా తీశారు. ఆ తల్లి అప్పటికే ప్రసవ ప్రయత్నంలో ఉందని, సగం బిడ్డ లోపల.. మిగితా సగం శరీరం బయటకు ఉందని గుర్తించాడు. వెంటనే వేగంగా సాగుతున్న ట్రైన్ చైన్లాగాడు. ట్రైన్లో నుంచి ఫ్లాట్ఫారమ్ మీదకు తెచ్చాడు. స్థానికంగా ఆస్పత్రికి సమాచారం అందించాడు. ఆ ఆస్పత్రి వాళ్లు ఆ మహిళకు ప్రసవం చేసేందుకు ముందుకు రాలేదు. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ఫోన్ తీసుకుని మహిళా డాక్టర్కు (గైనకాలజిస్ట్)కు వీడియో కాల్ చేశాడు. పరిస్థితి వివరించారు. వీడియో కాల్లో అవతలి నుంచి డాక్టర్ చెప్పినట్లు చేశాడు. ప్లాట్ఫారమ్ మీదనే మహిళకు పురుడు పోశాడు. శభాష్ అనిపించుకున్నాడు. తల్లితో పాటు బిడ్డ సురక్షితంగా ఉన్నారు’ అంటూ మంజీత్ ధిల్లాన్ తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వికాశ్కు వైద్య పరిజ్ఞానం లేదు. కానీ మానవత్వం ఉంది. భయపడలేదు. సంకోచించలేదు. ఒక జీవితాన్ని కాపాడాడు. ఇది కేవలం సహాయం కాదు. మానవత్వానికి మచ్చుతునక. అందరూ హీరోలు యూనిఫాంలు ధరించరు. కొందరు మానవత్వం ధరిస్తారు. వికాశ్ బింద్రే అలాంటి వ్యక్తి అంటూ నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "Pata nahi kis roop mein aake Narayan mil jayega"We have seen in a bollywood movie " 3 idiots " how a delivery of a woman made possible through video call. It is now in reality a brave man helps a woman to have a safe delivery at a railway station on video call at 1 am.Salute… pic.twitter.com/VSTE4KWJKo— Vishwas (Proud Sanatani & Bhartiya) (@Vishwas1228) October 16, 2025 -
‘రాబోయే కాలమంతా భారత్ది.. ఆ దేశ ప్రధానిది.. అటు తర్వాతే ఎవరైనా’
న్యూఢిల్లీ: రాబోయే కాలమంతా భారత్దే అంటున్నారు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్. ఈ 21 శతాబ్దం అనేది కచ్చితంగా భారత్దేనని అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కనీసం నాలుగు నుంచి ఐదు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందన్నారు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్-2025లో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన టోనీ అబాట్.. మాట్లాడుతూ.. భారత్పై, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. స్వేచ్ఛా ప్రపంచం అనే మాటకు భారత్ను సరైన నిర్వవచనంగా మారుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు నుంచి స్వేచ్ఛా ప్రపంచ నాయకుడు అనే బాధ్యతను భారత ప్రధాని తీసుకోవచ్చని అబోట్ అభిప్రాయపడ్డారు. ఈ 21వ శతాబ్దంలో చైనా ఎలాగైతే ఎదిగిందో అలాగే భారత్ కూడా ఎదుగుతుందన్నారు. కనీసం 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పాటు ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందన్నారు. భారత్ సూపర్పవర్గా ఆవిష్కృతం కావడానికి ఎంతో సమయం పట్టదన్నారు. ప్రపంచంలో భారత్ సరికొత్త సూపర్పవర్ కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు బలమైన ప్రత్యర్థిగా, తమకు నమ్మకమైన భాగస్వామిగా భారత్ కీలక పాత్ర పోషించాలన్నారు. చైనాను ఆర్థికంగా, సైనిక పరంగా అధిగమించే క్రమంలో బారత్ మూడు అతిపెద్ద ప్రయోజాలను కల్గి ఉందన్నారు. అది భారతదేశంలో ప్రజాస్వామ్యం, చట్ట పాలన, ఇంగ్లిష్ అనే ఈ మూడు అంశాలు భారత్ వేగంగా ఎదగడానికి, చైనాను దాటిపోవడానికి కీలకం కాబోతున్నాయన్నారు.ఇదీ చదవండి:‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’ -
‘వారిది ఇన్ఫోసిన్.. అలా అంటే మనం ఏం చేస్తాం?’
బెంగళూరు: కర్ణాటకలో చేపట్టిన సామాజిక, విద్యా సర్వేను వ్యతిరేకించిన కారణంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తిపై కర్ణాటక ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీరికి(నారాయణమూర్తి దంపతులకు) వెనుకబడిన వర్గాలన్నా, కుల గణన అన్నా చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నారు. ఇదే వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం తన నోటికి పని చెప్పారు. వారికి అన్ని తెలుసంటూనే. వారికి మనం ఏం చెబుతామంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.‘ ఇది కేవలం సామాజిక మరియు విద్యా సర్వే. అంతే కానీ వెనుకబడిన వర్గాల సర్వే కానే కాదు.. ఇది జనాభా గణాంకాల కోసం నిర్వహించే సర్వే మాత్రమే. ఈ విఫయాన్ని చాలాసార్లు చెప్పాం కూడా. ఇప్పటి వరకూ కనీసం 20 సార్లు అయినా ఇది జనాభా లెక్కల సర్వే అని చెప్పాం. అయినా వారు వెనుకబడిన వర్గాల గణాంకాల సర్వే అనుకుని అందులో పాల్గొనమని చెప్పారు. అది వారికే వదిలేద్దాం. ఈ విసయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతే మనం చేస్తాం. వారిది ఇన్ఫోసిన్.. వారికంతా తెలుసు’ అంటూ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాగా, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) చేపట్టిన సామాజిక సర్వే, కులగణన అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. రూ. 420 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నివేదిక అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇదీ చదవండి:మూర్తిగారూ.. ఇదేంటండీ? -
దేశంలో మగాడికి కష్టమొచ్చింది!
హర్యానా కేడర్కు చెందిన సీనియర్ IPS అధికారి పూరన్ కుమార్ ఈనెలలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తనను వేధించిన కస్టమ్స్, అధికారులు పేర్లు 8-పేజీల సూయిసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ముంబయిలో టీసీఎస్ మేనేజర్ మానవ్ శర్మ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య వేధింపులతో ఆత్మాహుతి పాలయ్యాడు. ‘‘ఆడవాళ్ల బాధపై అందరూ ఉద్యమిస్తారు. పురుషుల కష్టం ఎవ్వరు చూడరు’’ అని తన చివరి వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. మరొక స్టార్టప్ టెకీ ఈ ఏడాది మార్చిలో మెంటల్ డిస్ట్రెస్ కు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, స్టార్ట్-అప్ బిజినెస్లో నష్టాలతో బెంగళూరులో 12వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడుఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. వాస్తవాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. దేశంలో ప్రతి ఏడాది వేలాదిమంది పురుషులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. 2004లో 51,623 మంది వివాహిత పురుషులు ఆత్మహత్య చేసుకోగా, 2021 నాటికి ఈ సంఖ్య 81,063కి పెరిగింది.అదే సమయంలో వివాహిత మహిళల సంఖ్య మాత్రం 28,045 నుండి 28,680 వరకు మాత్రమే ఉంది. అంటే వివాహిత మహిళల సంఖ్య అలాగే ఉండగా, పురుషుల సంఖ్య 50శాతం పెరిగింది. ఇవి కేవలం గణాంకాలు కాదు, మన సమాజంలో పురుషుల మానసిక ఆరోగ్యం కూలిపోతుందనడానికి సంకేతం. దీనికి కారణాలు తెలుసుకుని, పరిష్కారాలు అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదట కారణాలు తెలుసుకుందాం.1. కుటుంబ సంబంధాల ఒత్తిడిఈ మధ్య మా క్లినిక్ కు కౌన్సెలింగ్ కు వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘‘సర్, నా జీతం సరిపోవడంలేదని నా భార్య తిట్టింది. మరోవైపు అమ్మ, తన మాట వినడంలేదని ఎత్తిపొడుస్తోంది. ఇద్దరినీ సంతోషపెట్టాలనుకున్నా, కానీ ఎవ్వరూ సంతోషంగా లేరు. చచ్చిపోవాలనిపిస్తుంది” అని వాపోయాడు.మగాడు కుటుంబానికి ‘రక్షకుడు’ అనే భావన బలంగా ఉంది. దీంతో పిల్లల భవిష్యత్తు, ఇంటి భారం, తల్లిదండ్రుల బాధ్యతలన్నీ పురుషులు మోస్తారు. వీటిలో విఫలమైనప్పుడు తీవ్రమైన అపరాధభావనకు, నిస్సహాయతకు, ఆత్మన్యూనతకు లోనవుతారు. ఇంటి సమస్యలు, భార్యతో విభేదాలు, వృత్తి ఒత్తిడి... ఇవన్నీ బయటకు చెప్పుకోలేని స్థితిలో, ఆ ఒత్తిడి ఆత్మహత్యవైపు నడిపించే ప్రమాదం ఉంది.2. మానసిక సమస్యలపై మౌనంమగాళ్లు ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి, సమస్యలను తనలోనే దాచుకోవాలనే సామాజిక కట్టుబాట్లు పురుషులకు అతిపెద్ద శత్రువులు. ఈ భావనను టాక్సిక్ మాస్క్యులినిటీ అంటారు. దీనివల్ల పురుషుడు తమ ఎమోషన్స్, బాధ, భయం, ఆందోళన వంటి వాటిని మనసులోనే తొక్కిపెడతాడు. డిప్రెషన్, యాంగ్జయిటీలాంటి సమస్యలున్నా సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లడాన్ని బలహీనతగా భావిస్తారు. ‘నేను బలహీనుడిని కాను’ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ అణచివేత చివరకు మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసి తీవ్ర నిర్ణయాలవైపుకు నెడుతుంది.3. ఆర్థిక ఒత్తిళ్లు... కరోనా తర్వాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొంతమంది అప్పుల్లో కూరుకుపోయారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వారి గుర్తింపు ఉద్యోగం, సంపాదనతో ముడిపడి ఉండటమే దీనికి కారణం. అందరిముందూ తల దించుకోవాల్సిన పరిస్థితి, అవమాన భారం, భవిష్యత్తుపై అభద్రతాభావం వారిని నిరాశలోకి నెట్టేస్తాయి. ఇటీవల బెంగళూరులో ఒక టెకీ ఉద్యోగం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నట్లు వచ్చిన వార్త దీనికి నిదర్శనం.4. చట్టపరమైన ఒత్తిళ్లు...మరికొంతమంది పురుషులు వివాహ సంబంధిత చట్టాలు, కుటుంబ వివాదాలు, లేదా తప్పు ఆరోపణలు వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. “నేను తప్పు చేయలేదు, కానీ ఎవరూ నమ్మలేదు” అని కొద్ది నెలల క్రితం బెంగళూరులో ఒక టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు మన సమాజంలో మగాళ్ల బాధను ఎవరూ వినడం లేదనే భావనను పెంచుతున్నాయి.5. మత్తు పదార్థాలు... చాలామంది పురుషులు మద్యం లేదా డ్రగ్స్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందాలని ప్రయత్నిస్తారు. కానీ అది ఒక్కరోజు సాంత్వన మాత్రమే. మరుసటి రోజు మళ్లీ అదే బాధ, అదే శూన్యత, మళ్లీ మద్యం. అలా అలా దానికి బానిసలవుతారు. ఈ విషవలయం చివరకు స్వీయ విధ్వంసానికి దారి తీస్తుంది.6. ఒంటరితనం... మహిళలకు కష్టమొస్తే వెంటనే ఎవరో ఒకరితో పంచుకుంటారు. కానీ పురుషులు మాత్రం మౌనంగా భరిస్తారు. కాఫీ లేదా స్క్రీన్తో మాట్లాడతారు. ఓసారి ఒక 42 ఏళ్ల వ్యక్తి ఏమన్నాడో తెలుసా? ‘‘నాకు స్నేహితులు ఉన్నారు. వాళ్లు అడిగేది... జీతం ఎంత? కారు కొత్తదా? అని. నిజంగా నా మనసులో ఏముందో విన్నవాడు లేడు’’ అని చెప్పాడు. అదీ పరిస్థితి.గణాంకాలు చెబుతున్నది ఏమిటి?• భారతదేశంలో మొత్తం ఆత్మహత్యలలో 70% కంటే ఎక్కువ పురుషులవి.• 18–45 ఏళ్ల మధ్య వయసు గలవారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. • వివాహిత మహిళల కంటే వివాహిత పురుషులు 1.8 రెట్లు ఎక్కువగా ప్రాణాలు తీసుకున్నారు.• కుటుంబ సమస్యలు పురుషుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా ఉంది.పరిష్కార దిశలు1. మానసిక సమస్యల గురించి మాట్లాడాలి. పురుషుడికి కూడా సహాయం అవసరం అవుతుందని అంగీకరించాలి.2. కౌన్సెలింగ్ను మొదటి అడుగుగా చూడాలి, చివరి ప్రయత్నంగా కాదు.3. ‘మగాడు ఏడవకూడదు’ అన్న మాట మార్చాలి. ఎమోషన్స్ కు జెండర్ తో సంబంధం లేదని గుర్తించాలి. 4. తండ్రులు, భర్తలు, సోదరులు మాట్లాడుకునే సపోర్ట్ గ్రూపులు ఏర్పాటు చేయాలి. 5. మీడియా పురుషుల బాధను నాటకీయంగా కాకుండా, అవగాహనతో చూపించాలి.ఒక పురుషుడు చనిపోవడమంటే, ఒక తండ్రి, ఒక కుమారుడు నిశ్శబ్దంగా మాయమవ్వడం. ఒక కుటుంబం కష్టాల్లో, దు:ఖంలో పడటం. ఆత్మహత్యలు కేవలం వ్యక్తిగత వైఫల్యాలు కాదు, అవి సామాజిక వైఫల్యాలు. పురుషులు కూడా మనుషులే, వాళ్లకు కూడా అర్థం చేసుకునే హృదయం అవసరం.-సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్-జీనియస్ మ్యాట్రిక్స్ హబ్, 8019 000066, www.psyvisesh.com -
గుజరాత్లో నూతన మంత్రివర్గం కొలువు దీరింది
గాంధీనగర్: గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేయడంతో శుక్రవారం నూతన క్యాబినెట్ ఏర్పాటు అయింది.ఈ సందర్భంగా 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా కూడా ఉన్నారు. ఈ పునర్వ్యవస్థీకరణలో గుజరాత్ హోంమంత్రి నేత హర్ష్ రమేష్భాయ్ సంఘవీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని లక్షకు పైగా ఓట్లతో ఓడించి ఘన విజయం సాధించారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతున్నారు.కమలం అధిష్టానం క్యాబినెట్లో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చింది. 7 మంది పాటిదార్లు, 8 మంది ఓబీసీలు, 3 మంది ఎస్సీలు, 4 మంది ఎస్టీలు, 3 మంది మహిళా నేతలు ఉన్నారు. కొత్త క్యాబినెట్లో ఎక్కువ మంది కొత్తవారికే అవకాశం లభించింది. గత క్యాబినెట్లో ఉన్న మంత్రుల్లో కేవలం ఆరుగురు మాత్రమే తిరిగి పదవులు చేపట్టారు. #WATCH | BJP MLA Rivaba Jadeja takes oath as Gujarat Cabinet minister in Gandhinagar pic.twitter.com/mJzv53J2C0— ANI (@ANI) October 17, 2025 -
మూర్తిగారూ.. ఇదేంటండీ?
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి తాజా నిర్ణయంపై కర్ణాటక మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనేందుకు మూర్తి దంపతులు నిరాకరించడంతో కన్నడ మంత్రులు ఫైర్ అవుతున్నారు. కాగా ప్రతిపక్ష బీజేపీ.. సుధామూర్తి దంపతులకు మద్దతుగా నిలిచింది. అసలేం జరిగింది?ప్రభుత్వ సామాజిక సర్వే, కులగణనలో తాము పాల్గొనబోమని అంటూ తమ ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లతో మూర్తి దంపతులు చెప్పారు. తాము అగ్రకులానికి చెందిన వారమని, వెనుకబడిన కులాలకు కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వే తమకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో (DK Shivakumar) పాటు పలువురు మంత్రులు స్పందించారు. ''సర్వేలో పాల్గొనమని మేము ఎవరినీ బలవంతం చేయడం లేదు. అది స్వచ్ఛందంగా జరగాల''ని డీకే కామెంట్ చేశారు. వెనుకబడిన కులాల సంక్షేమంపై మూర్తి దంపతులకు ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ ఎస్. తంగడగి వ్యాఖ్యానించారు.మాటకు కట్టుబడతారా?సర్వేలో పాల్గొనాలని తాము ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ (Santosh Lad) అన్నారు. "ఒక ప్రభుత్వంగా, మేము ఎవరినీ సర్వేలో పాల్గొనమని బలవంతం చేయడం లేదని" అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేపట్టనున్న జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేయనుందని, అప్పుడు కూడా మూర్తి దంపతులు ఇదే వైఖరికి కట్టుబడతారా'' అని ప్రశ్నించారు. సర్వేలో పాల్గొనకూడదన్న వారి నిర్ణయం మిగతా వాళ్లపై ఎటువంటి ప్రభావం చూపబోదని మంత్రి సంతోష్ అభిప్రాయపడ్డారు.అలా చెప్పడం కరెక్ట్ కాదుప్రభుత్వం చేపట్టిన సర్వేలో పాల్గొనబోమని నారాయణ మూర్తి లాంటి వారు చెప్పడం సమంజసంగా లేదని ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే (priyank kharge) అన్నారు. మూర్తి దంపతుల నిర్ణయం చూస్తుంటే ఇతర బీజేపీ నాయకుల నుంచి ప్రేరణ పొందినట్టు స్పష్టంగా కనబడుతోంది. ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచిన నారాయణమూర్తి లాంటి వారి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ప్రభుత్వ సర్వేలో పాల్గొనబోమని వారు చెప్పడం కరెక్ట్ కాదని ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానించారు. గోప్యంగా ఉంచుతామని.. మూర్తి దంపతుల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారశైలిని బీజేపీ నాయకుడు సురేశ్ కుమార్ (Suresh Kumar) తప్పుబట్టారు. సర్వే వివరాలను గోప్యంగా ఉంచుతామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కానీ మూర్తి దంపతులు తమ అభిప్రాయాలతో రాసిన నోట్ను బహిర్గం చేయడం ద్వారా కాంగ్రెస్ సర్కారు మాట తప్పి ఉల్లంఘనకు పాల్పడిందని ఆయన విమర్శించారు. కాగా, రచయిత్రి, పరోపకారి అయిన సుధామూర్తిని గతేడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.అక్టోబర్ 19 వరకు సర్వేకాగా, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) చేపట్టిన సెప్టెంబర్ 22న సామాజిక సర్వే, కులగణన అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. ₹420 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నివేదిక అందుతుందని భావిస్తున్నారు. సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేయడానికి.. బలహీన వర్గాలకు మరింత సమర్థవంతంగా సాధికారత కల్పించడంలో ఈ డేటా సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. చదవండి: నన్ను కలవొద్దని ఆ కుటుంబాన్ని బెదిరించారు -
ఇంజనీరింగ్ కాలేజీ ఘటనలో విస్తుపోయే విషయాలు
ఆ ఇద్దరూ క్లాస్మేట్స్. అయితే బ్యాక్లాగ్స్తో అతగాడు ఆమెకు ఓ సెమిస్టర్ జూనియర్ అయిపోయాడు. అయినా వాళ్ల మధ్య స్నేహం కొనసాగింది. ఇదే అదనుగా.. అదీ కాలేజీ క్యాంపస్లో.. అందులోనూ మెన్స్ టాయ్లెట్లో ఆమెపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడిని జీవన్ గౌడ(21)గా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం అతనితో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కీలక విషయాలు వెల్లడించారు. బాధితురాలు(20), జీవన్ ఒకేసారి కాలేజీలో చేరారు. ఈ క్రమంలో జీవన్ ఓ సెమిస్టర్ తప్పడంతో వెనకబడిపోయాడు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం కాలేజీకి బాధితురాలికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని జీవన్ రిసీవ్ చేసుకుని ఆ వంకతో యువతిని కలిసి అందించాడు. దానిని అందుకుని ఆమె అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. అయితే.. మధ్యాహ్నాం లంచ్ సమయంలో ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలంటూ ఏడో ఫ్లోర్లో ఉన్న అర్కిటెక్ట్ బ్లాక్ దగ్గరకు రావాలంటూ పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెకు ఎవరూ లేనిది చూసి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో భయానికి గురైన యువతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. అయితే.. లిఫ్ట్లో ఆమెతో పాటే కిందకు వెళ్లి.. ఆమె నోరు మూసేసి ఆరో ఫ్లోర్లో ఉన్న మెన్స్ టాయ్లెట్లోకి లాక్కెల్లాడు. అక్కడ వాష్రూంలో తలుపు బిగించి 20 నిమిషాలపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన తరవాత ఆమె హాస్టల్కు పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పింది. ఆ సమయంలో మరోసారి కాల్ చేసిన నిందితుడు పిల్ కావాలా సీనియర్?( ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర) అంటూ వెటకారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అయితే.. ఇదంతా మాములు విషయమని, పెద్దది చేయొద్దంటూ తోటి రూమ్స్మేట్స్కు ఆమెకు సలహా పడేశారు.అయితే.. జరిగిన విషయాన్ని రెండు రోజుల తర్వాత పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వాళలు బెంగళూరు వచ్చి.. అక్టోబర్ 15వ తేదీన హనుమంత నగర పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన క్యాంపస్ ఫ్లోర్లో సీసీకెమెరాలు లేకపోవడంతో.. ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు జీవన్ నేరానికి పాల్పడింది నిర్ధారించుకుని.. అరెస్ట్ చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 64 ప్రకారం.. రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ఘటనతో రుజువైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించగా.. ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.ఇదీ చదవండి: వెనక నుంచి వచ్చి.. యామిని మెడపై కత్తి పెట్టి! -
నన్ను కలవొద్దని ఈ కుటుంబాన్ని బెదిరించారు: రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్ రాయ్బరేలీలో గాంధీ జయంతి నాడు దొంగ అనే అనుమానంతో హరీఓం వాల్మీకి అనే దళితుడ్ని కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన అక్కడ తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం ఫతేపూర్లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనను కలవొద్దని ఈ ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని బెదిరించిందని.. అది కుదరకపోవడంతో ఫేక్ ప్రచారానికి దిగిందని మండిపడ్డారాయన. దేశంలో దళితులపై దాడులు, హత్యలు, అఘాయిత్యాలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ కుటుంబం ఎలాంటి నేరం చేయలేదు. ఇది ఒక బాధిత కుటుంబం. కానీ వీళ్లేదో నేరస్తులన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. నన్ను కలవొద్దని వీళ్లను పోలీసులు బెదిరించారు. వీళ్లను కనీసం ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదు. హరీఓం కుమార్తెకు శస్త్రచికిత్స అవసరం. వీళ్ల ఆంక్షలతో ఆమెకు కనీస వైద్యసేవలు అందడం లేదు. చర్యలు తీసుకోవాల్సింది నేరస్తుల మీద. వీళ్ల మీద కాదు. నేరస్తుల రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అని యోగి సర్కార్పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. మాకు మీ పరామర్శ అక్కర్లేదు.. ప్రభుత్వం తగినంత సాయం చేసింది అనే పోస్టర్లు అక్కడ వెలిశాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పోస్టర్లను చించేయగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంకోవైపు.. హరీఓం సోదరుడు, ఆ కుటుంబం పేరిట కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యింది. मृतक हरिओम वाल्मीकि के भाई ने Rahul Gandhi को Expose कर दिया।शर्मा आनी चाहिए कांग्रेस को।pic.twitter.com/UnKZrN1Tlf— Unfileterd Rencho (@UnfileterdR) October 17, 2025రాష్ట్ర మంత్రులు మా ఇంటికి వచ్చి పరామర్శించారు. మా సోదరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చారు. నేరస్తులు జైల్లో ఉన్నారు. ప్రభుత్వ చర్యలతో మేం సంతృప్తిగానే ఉన్నాం. రాహుల్ గాంధీ సహా నేతలెవరూ మా ఇంటి వైపు రావొద్దు అంటూ ఆయన చెప్పడం అందులో ఉంది. పైగా బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయానే వాటిని పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ వీడియోలపై మీడియా నుంచి రాహుల్ గాంధీకి ప్రశ్న ఎదురైంది.ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతీసారి బీజేపీ ఇలానే చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. అది బలవంతంగా తీయించిన వీడియో అని, ఆ వీడియోను మోదీ అనుకూల మీడియా(Godi Media), బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తున్నాయని అన్నారాయన. అయితే కాసేపటికే రాహుల్ను కలవడం సంతోషంగా ఉందంటూ మరో వీడియో ఆ కుటుంబం పేరిట బయటకు రావడం గమనార్హం.Whenever you think that BJP can’t stoop lower than this, they set a new parameter. Hariom Valamiki family told Rahul Gandhi Ji that they were threatened by the BJP govt to not meet him and they were forced to say this on camera. That video was made viral by Godi media and BJP. pic.twitter.com/q42JsYrBxc— Shantanu (@shaandelhite) October 17, 2025అక్టోబర్ 2వ తేదీన జమునాపూర్ వద్ద హరీఓం వాల్మీని దొంగగా అనుమానించి కొందరు కొట్టి చంపారు. ఈ ఘటన యూపీ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. విమర్శల నేపథ్యంలో కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయించింది యోగి ప్రభుత్వం. అక్టోబర్ 11వ తేదీన బాధిత కుటుంబాన్ని యోగి పరామర్శించారు. ఆ కుటుంబం కార్చిన ప్రతీ కన్నీటి బొట్టుకు ప్రభుత్వం సమాధానం చెబుతుందని ఆ సమయంలో భరోసా ఇచ్చారాయన. అంతేకాదు.. హరీఓం సోదరికి కాంట్రాక్ట్ బేస్ మీద స్టాఫ్ నర్స్గా ఉద్యోగం ఇప్పించారు. राहुल गांधी जी आज हमसे मिलने आए। वे हमारे लिए मसीहा हैं, हम चाहते हैं कि वे हमें न्याय दिलाएं। - हरिओम वाल्मिकी जी का परिवारअब बिलकुल चुप रह तू ।pic.twitter.com/wr7DkBZW5Y— Surbhi (@SurrbhiM) October 17, 2025ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిని అక్టోబర్ 10న ఎన్కౌంటర్లో పట్టుబడ్డాడు. ఇప్పటిదాకా 14 మందిని పోలీసులు ఇప్పటిదాకా అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి విమర్శల నేపథ్యంలో.. ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. జాతి కోణంలో ఈ ఘటనను చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా.. సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఆగడం లేదు. -
శబరిమల బంగారం కేసు.. ప్రధాన నిందితుడు అరెస్ట్
తిరువనంతపురం: శబరిమల(Sabarimala) ఆలయంలో విగ్రహాల బంగారం తాపడం విషయంలో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తాజాగా ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని(Unnikrishnan Potti) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ముందు ఉన్నికృష్ణన్ను హాజరుపరచనున్నారు.కాగా, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టిని ఆయన ఇంట్లో (పులిమత్లో) అదుపులోకి తీసుకున్నట్లు (సిట్) అధికారులు తెలిపారు. అనంతరం, తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారించారని సిట్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ముందు ఆయన్ను హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం సిట్ ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ఇంజనీర్ కె.సునీల్ కుమార్ను ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ గతంలో సస్పెండ్ చేశారు. కాగా, ఈ వివాదంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న రిటైర్డ్ అధికారులకు షోకాజ్ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.#WATCH | Thiruvananthapuram, Kerala | Unnikrishnan Potti, the prime accused in the Sabarimala gold theft case, has been arrested after over ten hours of questioning by the Special Investigation Team (SIT). The arrest was officially recorded at 2:30 a.m. on Friday. Unnikrishnan… pic.twitter.com/AMqUBpLric— ANI (@ANI) October 17, 2025జరిగింది ఇదీ.. శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించడం జరిగింది. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ పేర్కొంది.అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ఉన్నట్లుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. అలాగే ముందుస్తు అనుమతి తీసుకోకుండా ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడం పైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వివాదంపై ఇప్పటికే న్యాయస్థానం సిట్ ఏర్పాటు చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. -
భార్య నరికివేత
కర్ణాటక: కుటుంబ కలహాలతో భార్యను భర్త నరికి చంపిన ఘటన చిక్కమగళూరు జిల్లాలో జరిగింది. అజ్జంపుర తాలూకా చిక్కనావంగళ గ్రామానికి చెందిన తను (25) హతురాలు. వివరాలు ఇలా ఉన్నాయి.. తనుతో రమేశ్కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే భర్తతో తరచూ గొడవలు రావడంతో ఆమె రెండేళ్ల నుంచి వేరేగా ఓ వక్కతోటలోని ఇంటిలో నివసిస్తోంది. బుధవారం రాత్రి మద్యం మత్తులో రమేశ్ తను ఇంటికి వెళ్లాడు. ఆమెను కొడవలితో నరికి చంపాడు. తరువాతన తన చేతిని కోసుకొని.. భార్యే నన్ను చంపడానికి యత్నించినట్లు గ్రామస్థులకు చెప్పాడు. ఏమి జరిగిందో చూద్దామని ఆమె ఇంటికి గ్రామస్థులు వెళ్లగా రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. రమేశ్ను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. భర్త, అతని అక్క, చెల్లెలు, అత్తమామలతో పాటు 9 మందిపై తను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 9 మందినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. -
లొంగిపోనున్న మరో కీలక దళం నేత! ఎవరంటే..
వరుస బెట్టి అన్నలు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. కేంద్ర హోం శాఖ ఆపరేషన్ కగార్ ప్రభావంతో.. కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఈ ఏడాది మే 21న సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ చత్తీస్గఢ్లోని అబుజ్మాద్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే పార్టీ అంతర్గతంగా గందరగోళానికి లోనవుతూ వస్తోంది. ఆపరేషన్ కగార్(Operation kagar)తో మావోయిస్టు శిబిరాల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. బస్వరాజ్ మరణం తర్వాత CPI (మావోయిస్టు)లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ ఆంతర్గత విభేదాలు బయటపడడం, కీలక నేతల ఆరోగ్య సమస్యలు లొంగుబాటుకు కారణాలవుతున్నాయి. దీనికి తోడు భద్రతా దళాల ఒత్తిళ్ల కారణంగా అగ్రనేతలు వరుసగా లొంగిపోతున్నారు. తాజాగా కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న ఆశన్న ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట శుక్రవారం లొంగిపోయారు. జగదల్పూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో 208 మావోయిస్టులతో కలిసి ఆయన ఆయుధాలు అప్పగించారు. మొత్తం 153 తుపాకులు అగప్పించగా.. లొంగిపోయినవాళ్లలో 110 మంది మహిళా మావోయిస్టులు ఉండడం గమనార్హం. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆశన్న(రెడ్ సర్కిల్లో)ఆశన్న అసలు పేరు తక్కపల్లి వాసుదేవరావు. ములుగు జిల్లా వెంకటాపురం ఆయన స్వస్థలం. బైరంగూడా అడవుల్లో దశాబ్దాలుగా అండర్గ్రౌండ్గా జీవనం కొనసాగిస్తూ వచ్చారు. 2003లో చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి, మాజీ మంత్రి మాధవరెడ్డి, IPS అధికారి ఉమేశ్ చంద్ర హత్యలకు ప్రధాన సూత్రధారిగా ఆయనకు పేరుంది. అలాంటి కీలక నేత లొంగుబాటును మావోయిస్టులకు భారీ దెబ్బ అనే చెప్పొచ్చు. లొంగిపోవాలని నిర్ణయించుకున్న వాళ్లు తనను సంప్రదించవచ్చని తన చివరి ప్రసంగంలో ఆయన దళ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే..మల్లోజుల, ఆశన్న.. రేపు ఎవరా? అనే చర్చ నడుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మావోయిస్ట్ పార్టీకి మరో ఝలక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్(Bandi Prakash) లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి ద్వారా లొంగుబాటు యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, అశోక్, క్రాంతి.. స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్ తండ్రి సింగరేణి కార్మికుడు. 1982–84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) తరఫున పోరాడారు. ఆపై మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అయితే అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేదా డీజీపీ లేకుంటే స్థానిక పోలీసుల ఎదుట బండి ప్రకాశ్ లొంగిపోయే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. 2026 మార్చి కల్లా మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్ను ఉధృతం చేశారు. గత రెండేళ్లలో దేశంలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలి ఉండగా.. అందులో 8 మంది తెలంగాణ నుంచే ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: ఆ ఒక్కడి లెక్క తేలిస్తే మావోయిస్టు పార్టీ ఖతమైనట్లే! -
అదే జరిగితే బెంగాల్లో రాష్ట్రపతి పాలనే.. సువేందు అధికారి హెచ్చరిక
జల్పాయ్గురి: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి 2026లో జరగనున్న ఎన్నికలతో ప్రభుత్వం మారనుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి జోస్యం చెప్పారు. సకాలంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.జల్పాయ్గురి జిల్లా నగ్రాకటలో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తికాని పక్షంలో ఎన్నికలు జరగవన్నారు. ‘వచ్చే ఏడాది మే 4వ తేదీకల్లా ఎస్ఐఆర్ పూర్తి చేయాల్సి ఉంది. లేకుంటే ఆ తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ఎన్నికల ముందు సెమీఫైనల్స్ వంటిది. ఎన్నికల్లో టీఎంసీకి ఓటమి తప్పదు’ అని సువేందు వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో ‘2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, బీజేపీలు పొందిన ఓట్లలో తేడా 42 లక్షలు మాత్రమే. అప్పట్లో అక్రమంగా చేర్చిన 2.4 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఎస్ఐఆర్లో తొలగిస్తారు. అక్రమ వలసదారులు, ఇతరత్రా అనర్హుల పేర్లు సైతం ఉండవు. భవానీపూర్లో సీఎం మమతా బెనర్జీకి తన చేతిలో ఓటమి తప్పదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
లొంగిపోయే ముందు ఆశన్న చివరి ప్రసంగం.. ఏమన్నారంటే?
భద్రాద్రి కొత్తగూడెం: లొంగిపోయే ముందు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చివరిసారిగా తన సహచర మావోయిస్టులకు భావోద్వేగ ప్రసంగం ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలు వదిలిపెడుతున్నామని.. ఇది లొంగుబాటు కాదు.. జనజీవన స్రవంతిలో కలుస్తున్నామని ప్రభుత్వం ఒప్పుకుందని ఆయన అన్నారు. ఎవరికి వారే తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు.‘‘ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నన్నుకాంటాక్ట్ చేయండి. సహచరులందరూ ఎక్కడవాళ్లు అక్కడే లొంగిపోవడం మంచిది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజల కోసం పోరాటం చేస్తాం. ఉద్యమంలో అమరులైన వారందరికీ జోహార్లు’’ అంటూ ఆశన్న ప్రసంగించారు.కాగా, అడవిని వీడి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆశన్న ఛత్తీస్గఢ్ మీడియాతో మాట్లాడారు. ఇకపై తమ పోరాటం రాజ్యాంగానికి లోబడి కొనసాగుతుందన్నారు. తాము సాయుధ పోరాటానికి మాత్రమే విరమణ ఇచ్చామని, ఇకపై శాంతియుగ మార్గంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘శాంతి చర్చల కోసం ప్రజా సంఘాలు, మేధావులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో సాయుధ పోరాటానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.ఈ సందర్భంగా మేము పెట్టిన ప్రధాన షరతుల విషయంలో ప్రభుత్వ స్పందన సానుకూలంగా ఉంది. గతంలో మా పార్టీ, అనుబంధ సంఘాల్లో పని చేశారనే ఆరోపణలపై పోలీసులు జైళ్లలో పెట్టిన వారిని వెంటనే విడుదల చేయాలి. దీంతోపాటు మూలవాసీ బచావో మంచ్ సంస్థపై నిషేధాన్ని ఎత్తివేయాలి. ఆ సంస్థలో పనిచేస్తున్నారనే ఆరోపణలతో పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఇకపై మూలవాసీ బచావో మంచ్ వంటి సంస్థల ద్వారా చట్టబద్ధంగా మా పోరాటం కొనసాగిస్తాం. మేము కేవలం సాయుధ పోరాటానికే విరమణ ఇచ్చాం తప్పితే లొంగిపోలేదు. మా పోరాటం ఆపేది లేదు. జనజీవన స్రవంతిలో కలిసినవాళ్లు ప్రభుత్వ పోలీసు విభాగమైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ)లో చేరబోమని స్పష్టం చేశాం’అని ఆయన వెల్లడించారు. -
నితీశ్ మళ్లీ సీఎం.. డౌట్ కామెంట్స్ చేసిన అమిత్ షా!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార ఎన్డీయే కూటమిలో లుకలుకలు నడుస్తున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అలాగే.. బీహార్ సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపైనా ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓ స్పష్టత ఇచ్చారు.బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు(Amit Shah On Bihar CM Candidate). బీహార్ ఎన్డీయే కూటమిలో పార్టీల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు పనికి మాలినవని తోసిపుచ్చారు. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోనే బీహార్ ఎన్నికలకు వెళ్తున్న విషయాన్ని షా ప్రస్తావించారు. అయితే.. బీహార్ ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు.. అంత తొందర ఎందుకంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నితీశ్ కుమార్ మళ్లీ సీఎం అవుతారా? కారా?(Will Nitish Kumar CM Again) అనేది నేను ఒక్కడినే నిర్ణయించే అంశం కాదు. ప్రస్తుతానికి ఆయన సారథ్యంలోనే మేం ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలయ్యాక.. మిత్రపక్షాలన్నీ కూర్చుని అప్పుడు సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తాయి అని షా స్పష్టత ఇచ్చారు. గత ఎన్నికల్లో(2020) జేడీయూ కంటే బీజేపీ అత్యధిక స్థానాలు నెగ్గింది. ఆ టైంలో నితీశ్ కుమార్ ప్రధాని మోదీని కలిసి బీజేపీ నుంచే ముఖ్యమంత్రి ఉండడం సబబని అన్నారు. కానీ, మా మిత్రపక్షానికి మేం ఎప్పుడూ గౌరవం ఇస్తాం. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఆయన్ని సీఎం చేశాం అని షా అన్నారు.నితీశ్ తరచూ పార్టీలు మారుతున్న సందర్భాన్ని ప్రస్తావించగా.. షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1974లో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణన్ సారథ్యంలో జరిగిన ఆందోళనతో నితీశ్ రాజకీయ ప్రయాణం ప్రారంభమైందని, అది అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సందర్భాన్ని గుర్తు చేశారు. పైగా నితీశ్ రెండున్నరేళ్లు మాత్రమే కాంగ్రెస్తో అనుబంధం కొనసాగించారని.. ఎక్కువ కాలం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇక..నితీశ్ ఆరోగ్యం, పబ్లిక్లో ఆయన ప్రవర్తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా అమిత్ షా స్పందించారు. వయసు కారణంగా చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. కానీ, ముఖాముఖిగా, ఫోన్ ద్వారానూ నితీశ్ సుదీర్ఘంగా, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారని షా అన్నారు. అంతేకాదు.. సీఎంగా ఆయన సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని అన్నారు.ఇక.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections 2025) ఎన్డీయే కూటమి మునుపెన్నడూ చూడని ఘన విజయం సాధిస్తుందని.. నవంబర్ 14న వెల్లడయ్యే ఫలితాలతో గత రికార్డులను బద్దలు కొడతామని షా ధీమా వ్యక్తం చేశారు.74 ఏళ్ల వయసున్న నితీశ్కుమార్ ఇప్పటికే 9 సార్లు(2000 సంవత్సరంలో తొలిసారి) బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ మధ్య ఆయన బీహార్ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని, గవర్నర్గానో, రాజ్యసభకో వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. అంతెందుకు మొన్నీమధ్యే ఉప రాష్ట్రపతి పదవి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కూడా. అయితే నితీశ్ 10వ సారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని జేడీయూ అంటోంది.ఇదీ చదవండి: కరూర్ ఘటన తర్వాత.. విజయ్ క్రేజ్ మరింత పెరిగిందా? -
అవినీతి తిమింగళం.. డీఐజీ ఇంట్లో నోట్ల కట్టలు, కిలోన్నర బంగారం..
చండీగఢ్: పంజాబ్లో అవినీతి తిమింగలం బయటపడింది. పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ)(DIG Harcharan Bhullar) ఆఫ్ పోలీస్ హర్చరణ్ భుల్లార్ను లంచం ఆరోపణలపై సీబీఐ(CBI) అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఎనిమిది లక్షల రూపాయల లంచం కేసులో సీబీఐ.. భుల్లార్కు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు చేయగా విస్తుపోయే దృశ్యాలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. మండి గోబింద్గఢ్కు చెందిన తుక్కు వ్యాపారి ఆకాశ్ బట్టాపై 2023లో కేసు నమోదైంది. ఈ కేసును మాఫీ చేసేందుకు, నెలవారీ మామూళ్లతోపాటు రూ.8 లక్షల లంచం ఇవ్వాలని డీఐజీ భుల్లార్ డిమాండ్ చేశారు. ఇందుకుగాను కిషన్ అనే మధ్యవర్తితో వ్యవహారం నడిపారు. ఈ మేరకు వ్యాపారి ఆకాశ్ నుంచి సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. గురువారం చండీగఢ్లో ఆకాశ్ నుంచి డీఐజీ తరఫున రూ.8 లక్షలు తీసుకుంటుండగా కిషన్ను పట్టుకున్నామని సీబీఐ తెలిపింది. Images from DIG Ropar (Punjab) Harcharan Singh Bhullar's residence.CBI raid unearthed ₹5Cr cash, Merc, Audi, 22 Expensive watches, 1.5kg gold..He was part of anti-drug campaign as well.Routine news of highly corrupt clans of India — IAS and IPS officers. pic.twitter.com/P8HEo0o1Jh— The Hawk Eye (@thehawkeyex) October 17, 2025ఈ సందర్భంగా డీఐజీ, మధ్యవర్తి కిషను, వ్యాపారి ఆకాశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా డీఐజీని అరెస్ట్ చేశామని పేర్కొంది డీఐజీ కార్యాలయం, నివాసంలో జరిపిన సోదాల్లో రూ.5 కోట్ల నగదు, కిలోన్నర బరువున్న ఆభరణాలు, ఆస్తి పత్రాలు, మెర్సిడెజ్, ఆడి కార్లు, 22 ఖరీదైన గడియారాలు, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్ గన్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వివరించింది. ఇద్దరు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రోపర్ రేంజ్ DIGగా భుల్లార్ విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.Recovery from DIG Harcharan Bhullar Ropar of #PunjabPolice from his house by @cbic_india today.What a corruption it would be very small amount of items? 😂😂😂😂 pic.twitter.com/jRd3tHUOlI— Thomas 🇮🇳🇷🇺🇮🇱🕊️✌️ (@Thomas11P) October 16, 2025 -
అయ్యో.. యామిని!
కర్ణాటక రాజధాని నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది జరిగింది. ఓ యువతిని వెనక నుంచి వచ్చిన ఓ యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటనలో.. గిలగిలా కొట్టుకుంటూ ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం మధ్యాహ్నాం శ్రీరాంపుర ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హోస్కెరెహళ్లి ಹೊಸಕೆರೆಹಳ್ಳಿలో యామిని ప్రియ(20) కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బీఫార్మసీ చదువుతున్న ఆమె గురువారం పరీక్ష కోసమని ఉదయం 7.గంకే ఇంటి నుంచి బయల్దేరింది. అయితే.. మధ్యాహ్నాం 3గం. సమయంలో మంత్రిమాల్ వద్ద శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై ఓ యువకుడు దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో యామిని ప్రియ కుప్పకూలిపోగా.. ఊహించని ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. శ్రీరాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.ప్రియా యామిని ఆ నిందితుడి బైక్ మీదే వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రేమ కోణం ఉందనే చర్చ నడుస్తోంది. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.A 20 year old college student, Yamini Priya,was murdered by a known individual who slit her throat near the railway tracks in Srirampura,#Bengaluru.The victim was returning from college when she was attacked.Police have launched a manhunt to apprehend the accused..@DCPNorthBCP pic.twitter.com/3zMrcVEx1s— Yasir Mushtaq (@path2shah) October 16, 2025ఇదీ చూశారా?.. యువకుడి టైమింగ్తో తల్లీబిడ్డా సేఫ్! -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్కు అదిరిపోయే గుడ్న్యూస్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు(టీవీకే), సినీ నటుడు విజయ్కు(TVK Vijay) ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వేలో వెలుగు చూసింది. ఆయనకు తాజాగా 23 శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కరూర్లో(Karur Stampade) ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆ పార్టీ(Tamil nadu) వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది. విజయ్ సైతం తీవ్ర మనోవేదనలో పడ్డారు.తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం వెలువడింది. ఈ సమావేశాలు, సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పు, చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది.ఈ పరిస్థితులలో విజయ్కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. ఇటీవల ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికలలో విజయ్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా జరిపిన సర్వేలో కరూర్ ఘటనతో విజయ్కు ప్రజాదరణ మరింతగా పెరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23 శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. -
బీహార్లో ఓటర్ల సవరణ సర్వేలో తప్పుల్లేవు: ఈసీ
న్యూఢిల్లీ: బీహార్లో(Bihar Assembly Elections) నెలల తరబడి కొనసాగిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో ఎలాంటి తప్పులు దొర్లలేదని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. ఈ సర్వే విశ్వసనీయతను దెబ్బతీసేందుకే కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయని ఈసీ(Election Commission Of India) పేర్కొంది.తుది ఓటర్ల జాబితా ప్రచురించాక తమ పేరు తొలగించాలని కనీసం ఒక్క ఓటరు(Bihar Voter List) కూడా ఫిర్యాదు రాలేదని ఈసీ గుర్తుచేసింది. ముస్లింల ఓట్లను అసహ జరీతిలో తొలగించారన్న ఆరోపణల్లో నిజంలేదు. ఇలా మతపర ఆరోపణలకు అడ్డుకట్ట పడాలి’’ అని ఈసీ వ్యాఖ్యానించింది. అయితే తుది జాబితా లోనూ ఓటర్ల పేర్లలో తప్పులు దొర్లడంపై ఈసీ అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘‘టైపింగ్ తప్పులు ఉండకుండా చూసుకుంటే బాగుండేది. ఇలాంటి వాటికి తగు స్వల్ప పరిష్కారాలు చూపిస్తే మంచిది’’అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీల ధర్మాసనం అభిప్రాయపడింది. -
కాంగ్రెస్, జేడీయూ అభ్యర్థుల ప్రకటన.. కూటమిలో ట్విస్ట్!
న్యూఢిల్లీ: బీహార్ (Bihar Assembly Election) అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ (Congress Party) శుక్రవారం 48 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ రామ్ కుటుంబా స్థానం నుంచి... కాంగ్రెస్ శాసనసభా పక్షం నేత షకీల్ అహ్మద్ ఖాన్కు కద్వా నుంచి బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ చీఫ్ ప్రకాశ్ గరీబ్ దాస్కు బెచ్వాడా సీటు కేటాయించారు.బగాహాలో జయేశ్ మంగళ్ సింగ్, నౌతన్లో అమిత్ గిరి, చన్పటియాలో అభిషేక్ రంజన్, బెట్టియాలో వాసి అహ్మద్, రక్జౌల్లో శ్యామ్ బిహారీ ప్రసాద్ పోటీ చేయనున్నారు. గోవింద్గన్ స్థానం నుంచి శశి భూషణ్ రాయ్ అలియాస్ గప్పు రాయ్, రిగా నుంచి అమిత్ కుమార్ సింగ్ పోటీకి దిగనున్నారు. కాగా, ఆర్జేడీ సహా మహా ఘఠ్బంధన్ పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి రాకమునుపే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ కూటమి పక్షాల మధ్య సీట్ల పంపిణీ చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ నామినేషన్ల దాఖలుకు ఈ నెల 17వ తేదీ ఆఖరు. రెండో దశ పోలింగ్కు నామినేషన్లకు ఈ నెల 20వ తేదీతో గడువు ముగియనుంది.101 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన జేడీయూమరోవైపు.. బీహార్లో అధికార ఎన్డీఏ (NDA) కూటమిలో కీలక భాగస్వామ్య పార్టీ జనతాదళ్(యునైటెడ్) తాము పోటీచేయబోయే మొత్తం 101 స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 57 మందితో తొలిజాబితా విడుదలచేయగా గురువారం మిగతా 44 మంది అభ్యర్థులతో చివరి జాబితాను వెల్లడించింది. చాలా మంది అభ్యర్థులు వెనువెంటనే తమ నామినేషన్లు దాఖలుచేస్తూ బిజీగా కనిపించారు. మొత్తం 101లో ఓబీసీలకు 37, ఈబీసీలకు 22, అగ్రవర్ణాలకు 22 చోట్ల అవకాశం కల్పించింది. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తన రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇచ్చారు. విజయ్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, జామా ఖాన్, షీలా మండల్, లేశీ సింగ్, సుమిత్ సింగ్, విభా దేవి, చేతన్ ఆనంద్, శ్వేతా గుప్తా ఈసారి బరిలో దిగనున్నారు. -
శ్రీలంకను భారత భద్రతకు ముప్పుగా మారనివ్వను
న్యూఢిల్లీ: శ్రీలంక గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకుని తీరతానని శ్రీలంక మహిళా ప్రధాని హరిణి అమరసూర్య వ్యాఖ్యానించారు. ఢిల్లీలో డిగ్రీ చదువుకున్న రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. 1991–94కాలంలో ఢిల్లీ వర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో సోషియాలజీలో డిగ్రీ చదువుకున్న నేపథ్యంలో గురువారం ఆమె పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘శ్రీలంక నిరంతరం ఒకే నిబంధనకు కట్టుబడి ఉంటుంది. పొరుగున ఉన్న మిత్రదేశం భారత్కు ముప్పు వాటిల్లేలా మా భూభాగాన్ని ఎలాంటి భారతవ్యతిరేక కార్యకలాపాలకు నెలవు కానివ్వను. ఈ నియమాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తాం’’అని అన్నారు. తమ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి గత ప్రభుత్వం కూలిపోవడంపై ఆమె మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యం అనేది ప్రేక్షకులు ఆస్వాదించే క్రీడ కాదు. అతి నిరంతర అవిశ్రాంత కృషి. అంటే మన సమాజంతో ఎల్లప్పుడూ మమేకం కావాలి. న్యాయం కోసం పోరాడాలి. ప్రతి ఒక్కరూ తమతమ స్థాయిలో అందరి సంక్షేమం కోసం పాటుపడాలి. శ్రీలంక దేశ చరిత్రలో భారత్ శాశ్వత భాగస్వామిగా కీర్తికిరీటం పొందింది. ద్వీపం అయిన మా దేశంలో ఆర్థికసంక్షోభం తలెత్తినప్పుడు భారత్ నిజమైన నేస్తంలా ఆపన్న హస్తం అందించింది’’అని ఆమె అన్నారు. జయసూర్య తెలుసా? ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని భారత్, శ్రీలంకలో చూడొచ్చు. నాలాంటి సాధారణ వ్యక్తులను సైతం సమాజంలోని సమస్యలు, విద్యావ్యవస్థ రాటుదేలేలా చేస్తాయి. దేశసేవ చేసే స్థాయికి ఎదగనిస్తాయి. పాక్ జలసంధి కేవలం 22 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే సముద్రం వెంట భారత్, శ్రీలంకలను విడదీస్తోంది. కానీ ఇరుదేశాల నాగరికత, సాంస్కృతి, మత, ప్రాచీన బంధం ఏకంగా 2,000 సంవత్సరాల క్రితమే బలపడింది. ఇప్పుడు క్రికె ట్ సైతం ఈ బంధాన్ని పెనవేస్తోంది. 1991 లో ఇక్కడ డిగ్రీ ఆనర్స్ చదివేందుకు హిందూ కాలేజీలో తొలిసారి అడుగు పెట్టినప్పుడు నా పేరు చెప్పా. నాది శ్రీలంక అని తెలిసి చాలా మంది ఒక్కటే ప్రశ్న వేశారు. నీకు క్రికెటర్ జయసూర్య తెలుసా?’’అని ఆమె అన గానే పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ అంజూ శ్రీవాస్తవసహా నాటి ఆమె స్నేహితులు పక్కున నవ్వారు. ‘‘భారత్, శ్రీలంకలు ఒకే సంప్రదాయ వారసత్వం, విలువలు, పరస్పర గౌరవాలతో ఎదిగాయి. ఈ సంస్కృతి బంధం పోగులే ఇరు దేశాల సమాజ సౌభ్రాత్వాన్ని పెనవేసేలా చేశాయి. కొన్ని విషయాల్లో మనలో మనకు కొన్ని పొరపొచ్చాలు రావొచ్చు. కానీ చివరకు అందరం ఇరుగుపొరుగున కలిసే జీవిస్తున్నాం. కలిసి పనిచేస్తున్నాం. చివరకు ఒకరినొకరం గౌరవించుకుంటున్నాం. శ్రీలంక ఆర్థిక పురోభివృద్ధికి భారత్ ఎంతగానో సాయపడుతోంది. కష్టకాలంలో మా ఆర్థిక స్థిరత్వం, ప్రగతికి భారత్ అండగా నిలబడింది. 2022లో తీవ్ర ఆర్థికసంక్షోభంలో మేం కూరుకుపోతే భారత్ రుణసాయం చేసింది. ఈ సాయాన్ని మేం ఏనాటికీ మరువం. ఇరుదేశాల భాగస్వామ్యం నేటి తాత్కాలిక అగత్యం కాదు. రేపటి శాశ్వత అవసరం. గత డిసెంబర్లో మా దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె ఢిల్లీలో పర్యటించడం, ఏప్రిల్లో లంకలో మోదీ పర్యటన బలపడుతున్న ఇరుదేశాల బంధానికి గుర్తులు’’అని ఆమె అన్నారు. -
కూచిపూడి నర్తకి అరుణిమకు అరుదైన గౌరవం
లండన్: భారతీయ నృత్యరూపకం కూచిపూడికి బ్రిటన్లో ఎనలేని గుర్తింపు తెస్తూ దేశవ్యాప్తంగా భారతీయ కళకు మరింత వన్నె తెచ్చిన ప్రముఖ నాట్యకళాకారిణి అరుణిమ కుమార్ను యూకే సర్కార్ అరుదైన గౌరవంతో సత్కరించింది. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 ‘గౌరవ బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం)’తో అరుణిమను గౌరవించారు. ఒక కూచిపూడి కళాకారిణి ఈ మెడల్ను సాధించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా ప్రదర్శిస్తూ భారత్, బ్రిటన్సహా పలు దేశాల మధ్య సాంస్కృతి సంబంధాల బలోపేతానికి ఆమె తన కూచిపూడి కళ ద్వారా కృషిచేశారని బ్రిటన్ రాజకుటుంబం పేర్కొంది. యూకేలో పౌర, సైనిక కార్యకలాపాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు బ్రిటన్ రాజు ప్రతిఏటా ఈ పురస్కారాన్ని ప్రదానంచేస్తారు. అరుణిమ ఇప్పటికే బ్రిటన్ సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాత సాధించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 వర్ధంతి వేడుకల్లో, బకింగ్హామ్ ప్యాలెస్లో, లండన్లోని యూకే ప్రధాని కార్యాలయం 10, డౌనింగ్ స్ట్రీట్లో అరుణిమ ఎన్నోసార్లు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ నృత్యరూపం అంబాసిడర్గా, ఇన్ఫ్లూయన్సర్గా, సాంస్కృతిక సారథిగా అరుణిమకు మంచి పేరుంది. తనకు బ్రిటిష్ ఎంపైర్ మెడల్ రావడంపై అరుణిమ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘రాజు నుంచి గౌరవ పురస్కారం పొందడం నిజంగా ఎంతో గర్వంగా, సముచితంగా గౌరవంగా అనిపిస్తోంది. కళలో నా కృషిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఇది నా వ్యక్తిగత గుర్తింపుగా భావించట్లేను. అంతర్జాతీయ వేదికపై భారతీయ శాస్త్రీయ నాట్యానికి దక్కిన గౌరవం. కూచిపూడి నాకు జీవితాంతం తోడుంటుంది. నా భావాల వ్యక్తీకరణకు మాధ్యం కూచిపూడి’’అని ఆమె అన్నారు. ఈమెకు చెందిన ‘అరుణిమ కుమార్ డ్యాన్స్ అకాడమీ’50కిపైగా దేశాల్లో 3,000కుపైగా నృత్య ప్రదర్శనలు ఇచి్చంది. ఐదేళ్ల చిన్నారి మొదలు 75 ఏళ్ల వృద్దుల దాకా ఈమె వద్ద కూచిపూడి నేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఈమెకు వందలాది మంది శిష్యులు ఉన్నారు. పద్మ భూషణ్ శ్రీమతి స్వప్నసుందరి, పద్మశ్రీ జయరామారావు వద్ద అరుణిమ శిష్యరికం చేసి కూచిపూడిలో నైపుణ్యం సాధించారు. -
రైల్వేప్లాట్ఫాం పైనే మహిళకు పురుడు పోసిన యువకుడు
ముంబై: ఆ మధ్య వచ్చిన త్రీ ఇడియట్స్ సినిమాలో అత్యవసర సమయంలో ఓ డాక్టర్ వీడియోకాల్లో సూచనలు ఇస్తుండగా ఓ మహిళకు హీరో పురుడు పోసే సన్నివేశం ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే నిజజీవితంలో ముంబైలో జరిగింది. గత మంగళవారం రాత్రి ముంబై లోకల్ రైళ్లో వికాస్ బిద్రే అనే వీడియో కెమెరామెన్ ప్రయాణిస్తుండగా అదే రైళ్లో 24 ఏళ్ల అంబికా ఝా పురుటి నొప్పులతో బాధపడటం గమనించాడు. చుట్టూ మరికొందరు ఉన్నా వికాస్ మెరుపులా స్పందించి అత్యవసర స్విచ్ నొక్కి రైలును రామ్మందిర్ స్టేషన్లో ఆపేశాడు. అప్పటికే అంబికాకు ప్రసవం కావటం ప్రారంభమైంది. శిశువు సగంవరకు బయటకు వచి్చంది. దీంతో ప్లాట్ఫాంపై ఉన్న దుకాణాల వద్దకు పరుగెత్తి పరుపుల్లాంటివి పట్టుకొచ్చి ఆమెను పడుకోబెట్టారు. వికాస్ వెంటనే తన స్నేహితురాలైన దేవిక అనే డాక్టర్కు ఫోన్చేసి విషయం చెప్పాడు. ఆమె వీడియోకాల్ చేసి సూచనలు ఇస్తుండగా అంబికకు వికాస్ డెలివరీ చేశాడు. అంతకుముందు ప్లాట్ఫాం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా పరిస్థితి తీవ్రతను గుర్తించి డెలివరీ చేసేందుకు వారు ముందుకు రాలేదు. దీంతో ఆమె బంధువులు మళ్లీ ప్లాట్ఫాం వద్దకు తీసుకురావటంతో వికాస్ ధైర్యం చేసి తన స్నేహితురాలి సహకారంతో పురుడు పోశాడు. అనంతరం తల్లి, బిడ్డను ప్రైవేటు అంబులెన్స్లో కూపర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంజీత్ థిల్లాన్ అనే వ్యక్తి ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేయటంతో వికాస్పై ప్రశంసలు కురుస్తున్నాయి. కజ్రత్ జమ్ఖేడ్ ఎమ్మెల్యే రోహిత్ పవార్ కూడా ఈ ఘటనపై స్పందించారు. వికాస్ చేసిన పని మహారాష్ట్రకు గర్వకారణమని పేర్కొన్నారు. దేవిక సూచనలతోనే తాను పురుడు పోయగలిగానని వికాస్ తెలిపాడు. -
కుల గణనలో పాల్గొనబోం
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనబోమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి ప్రకటించారు. తాము వెనుకబడిన కులాలకు చెందిన వారం కాదన్నారు. ఇటీవల తమ నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లతో వారు.. ‘మా ఇంట్లో సర్వే చేపట్టవద్దు’అని తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా, ఎన్యుమరేటర్లకిచ్చిన ప్రొఫార్మాలో సుధామూర్తి..‘మేం వెనుకబడిన కులాలకు చెందిన వారము కాదు. అందుకే, ఆ గ్రూపుల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మేం పాల్గొనడం లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తంగదాడి స్పందిస్తూ.. వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. ఈ పరిణామంపై సుధామూర్తి దంపతులు, ఇన్ఫోసిస్ అధికారులు స్పందించలేదు. -
తయారీ కేంద్రంగా భారత్: ప్రధాని మోదీ
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘21వ శతాబ్దం భారత్ది.. 140 కోట్ల మంది భారతీయులది.. ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ను ఓ తయారీ కేంద్రంగా చూస్తోంది.. భారత దేశ సామర్థ్యాన్ని మొత్తం ప్రపంచం గమనిస్తోంది.. దేశాభివృద్ధికి పునాది పడింది ఆత్మ నిర్భర్ భారత్తోనే.. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాం. ఓకల్ ఫర్ లోకల్ పేరుతో ప్రజలు మన తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రతీ రంగంలో దేశం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలు సమీపంలోని నన్నూరు వద్ద ఎన్డీఏ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వాహనం 16 నెలలుగా వేగంగా కదులుతోందని, డబుల్ ఇంజన్ సర్కారు వేగంగా నడుస్తోందని చెప్పారు. ఢిల్లీ, అమరావతి రెండూ వేగవంతంగా అభివృద్ధి వైపు పయనిస్తున్నాయన్నారు. రోడ్లు, విద్యుత్, రైల్వే, హైవే, వాణిజ్యం, పరిశ్రమలతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించి రూ.13,400 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం పరిశ్రమలకు ఊతమిచ్చి ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తోందని, ఈ ప్రాజెక్టులతో కర్నూలు, పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. 2047కు భారత్కు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లవుతుందని, అప్పటికి భారత్ ‘వికసిత్ భారత్’గా తయారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభలో ప్రధాని ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే..ఇంధన రంగంలో విప్లవాత్మక అభివృద్ధిఏదేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత కీలకం. రూ.3 వేల కోట్ల విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. దీంతో దేశ ఇంధన సామర్థ్యం పెరగబోతోంది. వేగవంతమైన అభివృద్ధి మధ్య గతాన్ని మరవొద్దు. 11 ఏళ్ల కిందట కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు తలసరి విద్యుత్ వినియోగం (ఏటా) వెయ్యి యూనిట్లలోపు ఉండేది. అప్పుడు దేశం తరుచూ విద్యుత్ కోతలు, సవాళ్లు ఎదుర్కొంది. వేల గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా వేయలేని దుస్థితి. నేడు భారతదేశంలో క్లీన్ ఎనర్జీ నుంచి పూర్తి విద్యుత్ ఉత్పత్తి వరకూ ప్రతి రంగంలో దేశం కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ప్రతి గ్రామంలో విద్యుదీకరణ జరిగింది. తలసరి విద్యుత్ వినియోగం 1,400 యూనిట్లకు పెరిగింది. దేశంలో ఇంధన విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం. శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు సహజ వాయువు పైపు లైన్ ప్రారంభించాం. దీంతో 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా అవుతోంది. చిత్తూరులో కూడా రోజుకు 20 వేల సిలిండర్లు నింపే సామర్థ్యంతో ఎల్పీజీ ప్రాజెక్టు నిర్మించాం. దీనివల్ల ప్రజలకు సేవలతో పాటు కొత్త ఉద్యోగాలు వస్తాయి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగంగా సాధించే మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చేస్తున్నాం. గ్రామాల నుంచి నగరాలు, నగరాల నుండి పోర్టుల వరకూ కనెక్టివిటీ చేశాం. విశాఖలో సబ్బవరం నుంచి షీలానగర్ వరకు కొత్త హైవే నిర్మాణంతో కనెక్టివిటీ మరింత మెరుగు పడుతుంది. కొత్త రైల్వే లైన్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయి.కనెక్టివిటీ హబ్గా విశాఖఆంధ్రప్రదేశ్ యువత టెక్నాలజీలో చాలా ముందుంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో ఈ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాం. రెండు రోజుల కిందట గూగుల్ సంస్థ పెద్ద పెట్టుబడి ప్రకటించింది. గూగుల్ కంపెనీ యాజమాన్యం వారు నాతో మాట్లాడారు. ‘అమెరికా కాకుండా చాలా దేశాల్లో గూగుల్ పెట్టుబడులు ఉన్నాయి కానీ, అన్నింటి కంటే ఎక్కువ పెట్టుబడి ఆంధ్రలో పెడుతున్నామని చెప్పారు. ఈ కొత్త గూగుల్ ఏఐ హబ్లో శక్తివంతమైన ఏఐ సాంకేతిక పరిజ్ఞానం, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఉండబోతున్నాయి. గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కొత్త అంతర్జాతీయ గేట్వే తయారవుతోంది. అంతర్జాతీయంగా తూర్పు తీరంలోని విశాఖ నగరం కనెక్టివిటీ హబ్గా, ప్రపంచానికే ఏఐ హబ్గా మారబోతోంది.దేశాభివృద్ధికి ఆంధ్ర.. ఆంధ్ర అభివృద్ధికి ‘సీమ’ కీలకందేశాభివృద్ధికి ఆంధ్ర అభివృద్ధి చాలా అవసరం. అలాగే ఆంధ్ర అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి అంతే ముఖ్యం. కర్నూలులో ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి. రాయలసీమ అభివృద్ధికి సరికొత్త ద్వారాలు తెరుస్తాయి. ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక వాడల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ విజన్ సాధించడంలో ఆంధ్ర కీలకంగా మారబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టాన్ని మిగిల్చాయి. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఆంధ్రప్రదేశ్కు ఉంటే, ఆంధ్ర మాత్రం సొంత అభివృద్ధి కోసం పోరాటం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఎన్డీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారుతోంది. నిమ్మలూరులో అడ్వాన్స్ నైట్ విజన్ ఫ్యాక్టరీ ప్రారంభించాం. మన దేశ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర భారత్ సాధించడానికి ముందడుగు పడింది. ఈ ఫ్యాక్టరీ దేశ నైట్ విజన్ పరికరాలు, క్షిపణుల కోసం సెన్సార్లు, డ్రోన్ గార్డు వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచబోతోంది. ఇక్కడ తయారయ్యే పరికరాలు భారత దేశ రక్షణ ఎగుమతులను కొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు దోహదపడతాయి. భారత రక్షణ రంగం శక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్తో ప్రత్యక్షంగా చూశాం.దేశానికి డ్రోన్ హబ్గా కర్నూలుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలును డ్రోన్ హబ్గా చేయాలని సంకల్పించడం సంతోషం. తద్వారా వచ్చే సాంకేతికతతో కర్నూలుతో పాటు ఆంధ్రప్రదేశ్లో అనేక కొత్త రంగాలు అభివృద్ధి చెందుతాయి. ఆపరేషన్ సింధూర్లో మన డ్రోన్లు కూడా అద్భుతాలు సృష్టించాయి. ఆ అద్భుతాలు చూసి ప్రపంచం అబ్బుర పడింది. రాబోయే రోజుల్లో కర్నూలు దేశానికి డ్రోన్ హబ్గా మారుతుంది. మా ప్రభుత్వ లక్ష్యం ‘సిటిజన్ సెంట్రిక్ డెవలప్మెంట్’. ఈ లక్ష్యంతో కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలను సులభతరం చేయడం మా లక్ష్యం. దేశంలో రూ.12 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి పన్నులు లేకుండా చేసిన ప్రభుత్వం ఇది. తక్కువ ధరకే మందులు, మెరుగైన చికిత్స, ఆయుష్మాన్ భారత్ కార్డులతో ప్రజల జీవన విధానం సౌకర్యవంతంగా చేస్తూ కొత్త అధ్యాయాన్ని మనం ప్రారంభించాం.ఆత్మగౌరవానికి, గొప్ప సంస్కృతికి ఏపీ నిలయంఅహోబిలం లక్ష్మీ నరసింహస్వామి, మహానందీశ్వరుడు, మంత్రాలయం రాఘవేంద్రుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నా. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమనాథ ఆలయం మొదటిదైతే, రెండోది శ్రీశైలం. సోమనాథుడు కొలువున్న గుజరాత్ భూమిపై జన్మించిన నాకు కాశీ విశ్వనాథుడికి సేవ చేసే అవకాశం లభించింది. ఇప్పుడు శ్రీశైల మల్లికార్జునుడి ఆశీస్సులు కూడా పొందాను. స్వామి దర్శనం తర్వాత ఛత్రపతి శివాజీ కేంద్రాన్ని సందర్శించి నివాళులు అర్పించాను. ఈ వేదికపై నుంచి కూడా మరోసారి శివాజీ మహారాజ్కు నివాళులు అర్పిస్తున్నా. మహా శివభక్తులైన అక్క మహాదేవుళ్లను స్మరించుకుంటున్నా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, హరిసర్వోత్తమరావు లాంటి స్వాతంత్య్ర సమరయోధులకు కూడా నా నివాళులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆత్మ గౌరవానికి, గొప్ప సంస్కృతికి, సైన్స్, పరిశోధనలకు నిలయం. ఇక్కడ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. యువతకు అపారశక్తి ఉంది. ఆంధ్రకు ఇంకా ఏదైనా అవసరం ఉందంటే అది సరైన నాయకత్వం మాత్రమే. ఇప్పుడు శక్తివంతమైన నాయకత్వం ఉంది. దీనికి తోడు ఆం్ర«ధాకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంది.స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించండి⇒ దసరా నవరాత్రుల మొదటి రోజు నుంచి ప్రజలపై జీఎస్టీ భారాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఆంధ్రలో జీఎస్టీ పొదుపు ఉత్సవాన్ని పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జీఎస్టీ ద్వారా రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్లు ఆదా అవుతోందని తెలిసింది. ఈ పొదుపుతో పండుగ సీజన్ ఆనందాన్ని మరింత పెంచబోతోంది. ఓకల్ ఫర్ లోకల్ పేరుతో స్థానిక తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని మీ అందరికీ నా అభ్యర్థన. వికసిత్ ఆంధ్రప్రదేశ్తోనే వికసిత్ భారత్ కల నెరవేరుతుంది.⇒ ఈ సభలో ఇద్దరు చిన్న పిల్లలు ఫొటోలను మోదీకి ఇవ్వాలని ప్రయత్నిస్తుండటం చూసిన మోదీ.. వాటిని తన వద్దకు చేర్చాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, బీసీ జనార్దన్రెడ్డి, కందుల దుర్గేశ్, పార్థసారథితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.భారత్ సూపర్ పవర్ మోదీ నాయకత్వంతోనే సాధ్యంసూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్తో భవిష్యత్లో మరిన్ని సంస్కరణలు చూడబోతున్నాం. 21వ శతాబ్ధ్దం మోదీది. దేశానికి మోదీ లాంటి నాయకుడి అవసరం చాలా ఉంది. ఇలాంటి నాయకుడిని నేను చూడలేదు. భారత్ ప్రపంచంలో సూపర్ పవర్గా అవతరించాలంటే మోదీ నాయకత్వంతోనే సాధ్యం. 11 ఏళ్ల కిందట 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్.. ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. 2028కి మూడో స్థానానికి వస్తాం. 2038కి రెండో ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి మోదీ. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి రూ.15 వేలు ఆదాయం కలిగింది. యుద్ధాలు, టారిఫ్లు ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమయంలో మోదీ చెప్పిన స్వదేశీ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం. కేంద్రం సహకారంతో అమరావతిని నిలబెట్టాం. పోలవరాన్ని గాడిన పెట్టాం. విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. ఏపీ యంగ్ స్టేట్. ఎక్కువ పెట్టుబడులు సాధిస్తోంది. గూగుల్, మిట్టల్.. బీపీసీఎల్, సెమీ కండక్టర్ యూనిట్, క్వాంటమ్ వ్యాలీతో సత్వర రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. కర్నూలుకు తొందర్లోనే హైకోర్టు బెంచ్ వస్తుంది. అన్ని ఎన్నికల్లో మోదీ గెలవాలి. అదే భారత్ విజయం. – చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రికనీసం మరో 15 ఏళ్లు కూటమి నిలబడాలిప్రధానమంత్రిని కర్మయోగి అని పిలుస్తా. ఏ ఫలితం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆలోచిస్తూ ధర్మాన్ని పట్టుకుని దేశాన్ని నడిపిస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మన అదృష్టం. మోదీ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు. పుట్టే బిడ్డలకు కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు. భారత్ను ప్రపంచ పటంలో నిలబెట్టారు. పన్నులు ఎప్పుడూ పెరగడమే కానీ తగ్గవు. మోదీ వచ్చాక జీఎస్టీ తగ్గించారు. తద్వారా అన్ని వర్గాలకు మేలు జరిగింది. రాష్ట్రంలో కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని నిలబడాలి. సమష్టిగా పని చేయాలి. – పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారుగుజరాత్ను పవర్ ఫుల్ స్టేట్గా మార్చింది నమో. దేశాన్ని సూపర్ పవర్గా మార్చింది నమో. గతంలో ఉగ్ర దాడి జరిగితే ఇతర దేశాల సాయం అడిగే ప్రభుత్వాలు ఉండేవి. కానీ మోదీ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. అమెరికా టాక్స్లు పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికి పోయాయి. కానీ మోదీ గుండె ధైర్యం ఆత్మ నిర్భర్ భారత్. ప్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు.. అని ధైర్యంగా నిలబడ్డారు. పేదరికం లేని దేశం నమో కల. కేంద్రంలో నమో.. రాష్ట్రంలో సీబీఎన్.. ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు. ప్రధాని మోదీ 16 నెలల్లో రాష్ట్రానికి 4 సార్లు వచ్చారు. ఆంధ్ర అంటే అపారమైన ప్రేమ. కోరిన కోర్కెలన్నీ తీరుస్తున్నారు.– నారా లోకేశ్, విద్యాశాఖ మంత్రి -
భావ ప్రకటనా స్వేచ్ఛకు మేం వ్యతిరేకం కాదు
న్యూఢిల్లీ: భావ ప్రకటనా స్వేచ్ఛ, మాట్లాడే హక్కు అనేవి ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసేలా, నిజాయితీని శంకించేలా ఉండకూడదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సోషల్ మీడియాకు నియంత్రణ లేకపోవడం ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్పై లాయర్ రాకేశ్ కిశోర్ బూటు విసిరేందుకు ప్రయత్నించిన ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. డబ్బుల కోసం సోషల్ మీడియాలో దిగజారి పోస్టులు పెడుతున్నారని మండిపడింది. సీజేఐపై ఈ నెల 6న బూటు విసిరేందుకు ప్రయత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్(71)పై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ ధర్మాసనం గురువారం స్పందించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంది. కానీ, అది ఇతరులను అగౌరవపర్చేలా ఉండకూడదని స్పష్టంచేసింది. రాకేశ్ కిశోర్ ఏమాత్రం పశ్చాత్తాపం చెందడం లేదని, పైగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని, అవి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయని వికాస్ సింగ్ చెప్పారు. సుప్రీంకోర్టు సమగ్రతను దెబ్బతీసేలా ప్రచారం సాగుతోందని అన్నారు. రాకేశ్ కిశోర్ ఇంటర్వ్యూలను ప్రసారం చేయకుండా సోషల్ మీడియాను కట్టడి చేయాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ... రాకేశ్ కిశోర్పై అత్యవసరంగా విచారణ చేపట్టలేమని పేర్కొంది. అలా చేస్తే సోషల్ మీడియాకు మరింత మేత అందించినట్లు అవుతుందని స్పష్టంచేశారు. దీపావళి తర్వాత విచారిస్తామని వెల్లడించింది. సహజ మరణంలాగే ఈ కేసు దానంతట అదే ముగిసిపోతుందని ధర్మాసనం వివరించింది. రాకేశ్ కిశోర్పై చర్యలకు అటార్నీ జనరల్ అంగీకారం లాయర్ రాకేశ్ కిశోర్పై క్రిమినల్ నేరం కింద చర్యలు చేపట్టేందుకు అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి గురువారం అంగీకారం తెలియజేశారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు లాయర్పై కంటెంప్ట్ ఆప్ కోర్ట్స్ చట్టం–1971లోని సెక్షన్ 2(సీ) ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్ గవాయ్ పట్ల రాకేశ్ కిశోర్ ప్రవర్తించిన తీరు అత్యంత గర్హనీయమని ఆర్.వెంకటరమణి స్పష్టం చేశారు. -
పరారీ నేరస్థుల కోసం రాష్ట్రానికో ప్రత్యేక సెల్
న్యూఢిల్లీ: బ్యాంక్ల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన బడా పారిశ్రామికవేత్తలు సహా ఉగ్రవాదం, డ్రగ్స్, మనీలాండరింగ్కు పాల్పడిన వారిని భారత్కు రప్పించేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ‘‘పారిపో యిన నేరస్థులను రప్పించడం: సవాళ్లు, వ్యూహా లు’’అని అంశంపై ఏర్పాటుచేసిన సమావేశాన్ని అమిత్షా ప్రారంభించి ప్రారంభోపన్యాసంచేశారు. ఈ సందర్భంగా రాష్ట్రాలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాళ్లు మొదలు ఉగ్రవాదం, మనీలాండరింగ్, మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడిన వాళ్లు భారతీయ కఠిన న్యాయవ్యవస్థకు భయపడి విదేశాలకు పారిపోయారు. వీళ్లు భారత ఆర్థికాభివృద్ధి, సార్వభౌమత్వానికి ప్రతిబంధకాలుగా తయారయ్యారు. భారతీయ చట్టం ముందు వీళ్లను నిలబెట్టేందుకు మనం నిర్ధయగా నిర్ణయాలు తీసుకోవాలి. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి భారతీయ దర్యాప్తు సంస్థల అభ్యర్థనలతో విదేశాల్లో వీళ్లను అక్కడి దర్యాప్తు అధికారులు ఎలాగోలా అరెస్ట్చేసినా భారత్కు రప్పించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. భారత్కు అప్పగిస్తే అధ్వానంగా నెట్టుకొస్తున్న, చీకటి కొట్టాల్లాంటి జైలు గదుల్లోపడేస్తారని, తమ జీవన, మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందని నేరస్తులు అక్కడి న్యాయస్థానాల్లో వాదిస్తున్నారు. ఇలాంటి వాదన చేసే అవకాశం మనం వాళ్లకు ఎందుకివ్వాలి? ఇకపై ఇలాంటి ఆరోపణలకు చరమగీతం పాడుదాం. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఇలాంటి నేరస్థుల కోసం ప్రత్యేక జైలు సెల్ను నిర్మించండి. ధారాళంగా గాలి, వెలుతురు ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త జైళ్లను కట్టాలి. దాంతో భారతీయ కారాగారాలు దుర్భర స్థితిలో ఉంటాయనే వాదన అక్కడి న్యాయస్థానాల్లో తుడిచిపెట్టుకుపోతుంది. ప్రతి రాష్ట్ర రాజధాని నగరంలో ఇలాంటి అంతర్జాతీయ ప్రమాణాలతో జైలు ఉండాల్సిందే’’ అని అమిత్షా అన్నారు. మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ సహా ఆర్థిక నేరాలు, ఉగ్రవాదం, డ్రగ్స్, మనీలాండరింగ్ నేరాలకు సంబంధించి భారత్ ఇప్పటికే 338 మంది నేరస్థులను వెనక్కి రప్పించేందుకు శతథా ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. ‘‘కొత్త సాంకేతికతతో నేరస్థుల ఆట కట్టించవచ్చు. భారత్ నుంచి పారిపోయిన నేరస్థులపై అంతర్జాతీయంగా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయిన వెంటనే వాళ్ల పాస్పోర్ట్ను రద్దుచేయాలి. అప్పుడు ఆయా నేరస్తుల అంతర్జాతీయ ప్రయాణాలకు అడ్డుకట్ట పడుతుంది’’ అని రాష్ట్రాల పోలీస్ బాస్లకు అమిత్ సూచించారు. సదస్సులో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఇంటెలిజెన్స్బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా తదితరులు సదస్సులో పాల్గొన్నారు. -
కులగణనకు రెడీ
న్యూఢిల్లీ: దేశంలో జన గణనకు రంగం సిద్ధమవుతోంది. 2027లో జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయబోతున్నారు. జన గణనలో మొదటి దశకు సంబంధించిన ప్రి–టెస్టు ఎక్సర్సైజ్ను ఈ ఏడాది నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన చోట్ల ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 1 నుంచి 7వ తేదీ దాకా సెల్ఫ్–ఎన్యూమరేషన్కు కూడా అవకాశం కలి్పస్తున్నట్లు రిజి్రస్టార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ చెప్పారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 దాకా దేశవ్యాప్తంగా జన గణనను చేపట్టబోతున్నారు. ఇది రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో హౌస్లిస్టింగ్ ఆపరేషన్, హౌసింగ్ షెడ్యూల్(హెచ్ఎల్ఓ) ప్రక్రియ, రెండో దశలో జన గణన చేపడతారు. మొదటి దశకు సంబంధించి ప్రి–టెస్టు ఎక్సర్సైజ్లో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇళ్ల సంఖ్యను ప్రయోగాత్మకంగా లెక్కిస్తారు. ఆయా ఇళ్ల స్థితిగతులు, వసతుల వివరాలు సేకరిస్తారు. ఈసారి జన గణనతోపాటు కుల గణన కూడా చేపట్టబోతున్నారు. ఇది పూర్తిగా డిజిటల్ సెన్సెస్ కావడం విశేషం. ప్రతి పౌరుడి కులం, సామాజిక–ఆర్థిక పరిస్థితుల వివరాలను నమోదు చేస్తారు. జన గణన, కుల గణన అనేది మహా యజ్ఞమే. 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతోపాటు 1.3 లక్షల మంది సిబ్బందిని నియమిస్తున్నారు. దేశంలో జన గణన ప్రక్రియ మొదలైన తర్వాత ఇది 16వ జన గణన, స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఎనిమిదో జన గణన. -
ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై పరోక్షంగా ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర కేబినెట్ గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక సర్క్యులర్ను జారీచేసింది. ఆర్ఎస్ఎస్ వంటి ప్రైవేట్ సంస్థల కార్యక లాపాలపై కేబినెట్ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, సాంకేతికత శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే మీడియాకు వెల్లడించారు. ‘‘మేం ఎలాంటి సంస్థ(ఆర్ఎస్ఎస్) కార్యకలాపాలను నియంత్రించబోము. కానీ ఏ సంస్థ అయినా రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో కవాతులు, కార్యక్రమాలు చేపట్టాలంటే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఆయా అభ్యర్థనల తర్వాత ఈ కార్యక్రమాలకు అనుమతి మంజూరు చేయాలా వద్దా అనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇకపై స్థానిక పాలనా యంత్రాంగానికి ఊరకే ముందస్తు సమాచారం ఇచ్చేసి రహదారులపై కర్రలు ఊపుతూ కవాతులు, మార్చ్లు, పథ సంచలన వంటి కార్యక్రమాలు చేస్తామంటే కుదరదు. బహిరంగ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వరంగ సంస్థలు, అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో కొత్త నియమ నిబంధనలు అమలు చేయబోతున్నాం’’ అని ప్రియాంక్ చెప్పారు.పాత నిబంధనలే కొత్తగా..‘‘వాస్తవానికి గతంలో హోం శాఖ, న్యాయ విభాగం, విద్యా శాఖ జారీచేసిన ఉత్తర్వులనే గుదిగుచ్చి ఏకీకృత నిబంధనావళిగా మారుస్తున్నాం. వచ్చే రెండు, మూడ్రోజుల్లో ఈ కొత్త నియమావళి అమల్లోకి రానుంది. ఇది రాజ్యాంగంలోని చట్టాల మేరకే అమలవుతుంది’’ అని మంత్రి ప్రియాంగ్ స్పష్టంచేశారు. కర్ణాటక వ్యాప్తంగా ఆరెస్సెస్ కార్యకలా పాలను నిషేధించాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మంత్రి ప్రియాంక్ లేఖ రాసిన రెండు వారాలకే కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తుండటం గమనార్హం. ‘‘ బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్న అంశం కేబినెట్ భేటీలో చర్చకొచ్చింది. విద్యాసంస్థలు సహా ప్రభుత్వ స్థలాల వినియోగంపై నియంత్రణ కోసం హోంశాఖ ఉత్తర్వులు జారీచేయనుంది. ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల సద్వినియోగం, దుర్విని యోగంపై సంబంధిత విభాగాలకు ఆదేశాలు వెళ్లనున్నాయి’’ అని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్కే పాటిల్ చెప్పారు. -
మోదీ మాటిచ్చారు..!
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడిచమురు కొనుగోలు చేస్తుండడం పట్ల చాలా రోజులుగా అసహనంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ తన మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని స్పష్టంచేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని నిలిపివేసే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అవుతుందని అన్నారు. చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని, తద్వారా ఉక్రెయిన్పై దండయాత్ర ఆగిపోతుందని ఉద్ఘాటించారు. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తుండడం తమకు ఎంతమాత్రం సంతోషం కలిగించడం లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి కొనుగోళ్ల వల్ల రష్యాకు ఆర్థికంగా మేలు జరుగుతోందని, అంతిమంగా ఆ సొమ్మంతా ఉక్రెయిన్పై యుద్ధానికే ఖర్చవుతోందని తెలిపారు. ఎవరైనా సరే రష్యాకు ఆర్థికంగా సాయం అందించడం మానుకోవడం మంచిదని హితవు పలికారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న మతిలేని యుద్ధంలో లక్షల మంది బలైపోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రష్యా నుంచి చమురు కొనడం నిలిపివేస్తామంటూ ఈరోజు తన మిత్రుడు మోదీ మాట ఇచ్చారని పేర్కొన్నారు. ఇక చైనా సైతం అదే దారిలో నడుస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలియజేశారు. చైనా ప్రభుత్వం రష్యా నుంచి చమురు దిగుమ తి చేసుకోవడం ఆపేస్తే మంచిదని సూచించారు. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ ప్రశంసించారు. తానంటే మోదీకి ఎంతో ప్రేమ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రేమ అనే పదాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. మోదీ రాజకీయ జీవితానికి ఇబ్బందులు సృష్టించాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘‘భారత్ను చాలా ఏళ్లుగా గమనిస్తున్నా. అదొక నమ్మశక్యంకాని దేశం. ప్రతి సంవత్సరం ఒక కొత్త నాయకుడు అధికారంలోకి వస్తుంటారు. కొందరైతే కొన్ని నెలలపాటే ఉండొచ్చు కూడా. కానీ, నా స్నేహితుడు మోదీ చాలాఏళ్లుగా వరుసగా అధికారంలో కొనసాగుతున్నారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ ఆయన నాకు మాట ఇచ్చారు. నిజంగా నాకు తెలియదు గానీ అదొక బ్రేకింగ్ స్టోరీ కావొచ్చు! మోదీ వెంటనే ఆ పని చేయకపోవచ్చు. నా అంచనా ప్రకారం కొంత సమయం పట్టొచ్చు. కానీ, త్వరలోనే ఆ ప్ర క్రియ పూర్తవుతుంది. ఉక్రెయిన్పై యుద్ధం ముగిసిన తర్వాత రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్ పునరుద్ధరించుకోవచ్చు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పాక్ను అనబోయి..భారత్లో ఏడాదికొక పాలకుడు అధికారంలోకి వస్తాడంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ పరిస్థితిని ట్రంప్ పొరపాటున భారత్కు అన్వయించి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగతోంది. ట్రంప్ మానసిక ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయని జనం పోస్టులు చేస్తున్నారు. నిజానికి భారత్లో ఏడాదికొక ప్రధానమంత్రి మారిపోయిన సందర్భాలు లేవు. పాకిస్తాన్లోనే అలాంటి పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే.అంతా అబద్ధం‘మోదీ, ట్రంప్ ఫోన్ సంభాషణ జరగలేదు’ రష్యా చమురు విషయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ గురువారం ఖండించింది. బుధవారం మోదీ, ట్రంప్ మధ్య ఫోన్లో ఎలాంటి సంభాషణ జరగలేదని తేల్చిచెప్పింది. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేసింది. దేశ అవసరాలు, ప్రయోజనాల కోణంలోనే రష్యా నుంచి ముడిచమురు కొంటున్నామని, ఇందులో మరో మాటకు తావులేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఇంధన విధాన నిర్ణయాలకు స్థిరమైన ధరలు, నిరంతరాయమైన సరఫరానే పతిప్రాదిక అని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన దిగుమతుల్లో మార్పులుచేర్పులు చేసుకుంటున్నామని ఉద్ఘాటించింది. ఇంధన వనరుల్లో వైవిధ్యం కొనసాగిస్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది. ట్రంప్ను చూస్తే మోదీకి భయం: రాహుల్ న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలను మోదీ అమెరికాకు ఔట్సోర్సింగ్కు ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ పాలనలో విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిందని మండిపడ్డారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ మిత్రుడు మోదీ మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించడంపై రాహుల్ గురువారం తీవ్రంగా స్పందించారు. రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం తరఫున నిర్ణయాలు తీసుకొని, ప్రకటనలు చేసే అధికారాన్ని ట్రంప్కు మోదీ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ వల్ల తరచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ అభినందన సందేశాలు పంపిస్తున్నారని ప్రధానమంత్రిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. భారత ఆర్థిక శాఖ మంత్రి అమెరికా పర్యటనను ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించే విషయంలో ఈజిప్టులోని షెర్మ్ ఎల్–õÙక్లో జరిగిన భేటీకి ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందంటూ డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్ గాంధీ నిలదీశారు. -
50 శాతం మించొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ దాఖలుచేసిన పిటిషన్ను కొట్టివేసింది. గురువారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించలేదు. రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు కేవలం షెడ్యూల్డ్ ఏరియాల్లోనే ఉన్నాయని గుర్తుచేస్తూ, 50 శాతం పరిమితిని మించరాదని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రభుత్వం వాదన ఇదీ.. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, రిజర్వేషన్లను నిర్ణయించుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అత్యంత శాస్త్రీయంగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల సర్వే నిర్వహించామని తెలిపారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ‘ట్రిపుల్ టెస్ట్’నిబంధనలకు అను గుణంగా, డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసి, ఇంటింటికీ తిరిగి సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సమగ్రంగా, శాస్త్రీయంగా సర్వే జరిపామని తెలిపారు. 94 వేల ఎన్యూమరేషన్ బ్లాక్లలో లక్షలాది మంది సమాచారాన్ని సేకరించి, బీసీ జనాభా డేటా ఆధారంగానే కమిషన్ సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు పెంచామని వివరించారు. ఈ సందర్భంగా ఇందిరా సహానీ కేసులో తీర్పును సింఘ్వీ ఉటంకించారు. డేటా బేస్ ఆధారంగా, అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% మించి పెంచుకునే సౌలభ్యం ఉందని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. వికాస్ కృష్ణారావ్ గవాలి కేసు తీర్పు కూడా ఇదే విషయాన్ని బలపరుస్తోందన్నారు. అంతేగాక ఈ వ్యవహారంలో రాజకీయ ఏకాభిప్రాయం సాధ్యమైందని చెప్పారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని, అయితే గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్లో ఉండటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. బిల్లును సవాల్ చేయకుండా, దాని ఆధారంగా జారీ చేసిన జీవోను సవాల్ చేయడం సరికాదని సింఘ్వీ వాదించారు. ఇంతటి విస్తృత కసరత్తు తర్వాత, ఎలాంటి సహేతుక కారణాలు చూపకుండా హైకోర్టు స్టే విధించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కోటా 50% పరిమితి దాటరాదు: ప్రతివాదుల వాదన ప్రతివాది మాధవరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ ప్రభుత్వ వాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్పష్టం చేసిందన్నారు. కృష్ణమూర్తి కేసు తీర్పును ఉటంకిస్తూ ‘షెడ్యూల్డ్ ఏరియాలు, గిరిజన ప్రాంతాల్లో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఉంది. జనరల్ ఏరియాల్లో ఈ పరిమితిని దాటడానికి వీల్లేదు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు. కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పును వెల్లడించింది’అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ట్రిపుల్ టెస్ట్లో కూడా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనేది ఒక కీలకమైన షరతు అని, దాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల ఉదంతాలను ప్రస్తావిస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ల్లో కూడా రిజర్వేషన్ల పెంపును సుప్రీంకోర్టు తిరస్కరించి, 50 శాతం పరిమితికి లోబడే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో విభేదించింది. ‘ఎస్టీ ప్రాంతాల్లోనే రిజర్వేషన్ల పెంపునకు మినహాయింపులు ఉన్నాయి కదా?’అని పేర్కొంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను, ముఖ్యంగా కృష్ణమూర్తి కేసులో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై నిర్దేశించిన 50 శాతం పరిమితిని ధర్మాసనం పునరుద్ఘాటించింది. ఈ అంశం హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనబడటం లేదంటూ తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తమ ఆదేశాలతో సంబంధం లేకుండా కేసు మెరిట్స్ ఆధారంగా తదుపరి విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రస్తుతమున్న రిజర్వేషన్ల విధానం ప్రకారమే జరగనున్నాయి. -
లొంగిపోయేందుకు వస్తున్న.. 140 మంది మావోయిస్టులు
బీజాపూర్: మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోగా... అదే బాటలో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కూడా ఇవాళ లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్లో కీలక నేతలు రూపేష్, రనిత సహా 140 మంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. రేపు(శుక్రవారం, అక్టోబర్ 17న జగదల్పూర్లో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్, హోం మంత్రి విజయ్ శర్మ ఎదుట అధికారికంగా లొంగిపోనున్నారు.కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత, ఇద్దరు DKSZC సభ్యులు, 15 మంది DVC సభ్యులు సహా మొత్తం 140 మంది మావోయిస్టులు లొంగిపోవడానికి భైరామ్గఢ్ వైపు వెళుతున్నారు. వారు ఇంద్రావతి నది అవతలి వైపుకు చేరుకుంటారు. నక్సలైట్లందరూ లొంగిపోవడానికి 70కి పైగా ఆయుధాలను తీసుకువస్తున్నట్లు సమాచారం. భైరామ్గఢ్ నుండి ఇంద్రావతి నదిపై ఉన్న ఉస్పారి ఘాట్ వరకు భద్రతా దళాలు గట్టి భద్రతను మోహరించాయి. దంతేవాడ, బీజాపూర్ సరిహద్దుల్లోని అడవుల నుంచి మావోయిస్టులు ఈ నదిని దాటి జగదల్పూర్కు చేరుకుంటున్నారు. ఉస్పారి ఘాట్ మార్గంలో బయటి వ్యక్తులెవరినీ ప్రయాణించడానికి అనుమతించడం లేదు.రూపేష్.. ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ మావోయిస్టు నేత. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKZC) లోని మాడ్ డివిజన్లో లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, శిక్షణ బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర కమిటీ మరియు స్థానిక జోనల్ నిర్మాణం మధ్య సంబంధాల వారధిగా పనిచేశారు. రనిత.. DKZC మాడ్ డివిజన్ ఇన్చార్జ్గా పనిచేసిన సీనియర్ మహిళా కమాండర్. బస్తర్ జిల్లాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వరుస ఆపరేషన్లతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. లొంగుపోక తప్పడం లేదు. కేంద్రంతో చర్చలు జరపాలని పదే పదే యత్నించినా అది విఫలం కావడంతో ఇక లొంగుబాటు ఒక్కటే సరైన మార్గమని ఎంచుకున్న వందల సంఖ్యలో మావోయిస్టులు.. జన జీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నారు. గత రెండు రోజులుగా అగ్రనేతలతో సహా 283 మంది మావోయిస్టులు తాము చేతపట్టిన తుపాకులను, నమ్ముకున్న అడవుల్ని వదిలి సాధారణ జీవితం గడపడానికి సిద్ధమవుతున్నారు. -
మావోయిస్టు అగ్రనేత ఆశన్న లొంగుబాటు
బీజాపూర్: మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెడుతున్నారని హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా, మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం(అక్టోబర్ 15) లొంగిపోగా... అదే బాటలో మరో అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం ఇవాళ లొంగిపోయారు. నిన్న (బుధవారం) ఛత్తీస్గఢ్లోని వేర్వేరు జిల్లాల్లో మొత్తం 78 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో 27 మంది లొంగిపోగా, ఇందులో పది మంది మహిళా మావోలు ఉన్నారు. కాంకేర్ జిల్లాలో 32 మంది మహిళా మావోయిస్టులతో కలిపి మొత్తంగా 50 మంది అజ్ఞాతం వీడారు.ఇందులో మావోయిస్టు పార్టీలో కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన రాజమన్ మండావి అలియాస్ రాజ్మోహన్, రాజు సలామ్ అలియాస్ శివప్రసాద్ కూడా ఉన్నారు. 50 మంది మావోయిస్టుల బృందాన్ని ప్రత్యేక బస్సులో కాంకేర్ తరలించి అక్కడ లొంగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ 7 ఏకే 47లతో పాటు మరో 17 ఇతర ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇక కొండగావ్ జిల్లాలో మరో మహిళా మావోయిస్టు లొంగిపోయింది.శాంతిచర్చలపై ముందుగా అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖ మార్చి 28న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నార్త్ వెస్ట్ సబ్జోనల్ బ్యూరో ఇన్చార్జిగా రూపేశ్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ నుంచి వరుసగా మూడు లేఖలు విడుదలయ్యాయి. అంతేకాక ఒక యూట్యూబర్కు వీడియో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అన్ని లేఖల్లోనూ ‘శాంతి చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొందాం. తుపాకీ కంటే చర్చల ద్వారానే సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుంది’అనే అభిప్రాయాన్నే ఆశన్న వ్యక్తంచేశారు. దీంతో మల్లోజుల, ఆశన్న ఒకేదారిలో ఉన్నారనే అభిప్రాయం ఏర్పడింది. అందుకు తగ్గట్టే మల్లోజుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే ఆశన్న సైతం లొంగిపోవడం గమనార్హం.తక్కెళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట. హæన్మకొండలో పాలిటెక్నిక్ చదువుతూ రాడికల్ ఉద్యమాల వైపు ఆకర్షితుడై 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ) చేపట్టిన పలు కీలక యాక్షన్లలో సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో 1999 సెపె్టంబర్ 4న ఐపీఎస్ అధికారి ఉమేశ్చంద్రను దారికాచి కాల్చి చంపిన ఘటన, ఆ తర్వాత 2000 మార్చి 7న అప్పటి ఉమ్మడి ఏపీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని ఘట్కేసర్ దగ్గర బాంబు పేల్చి చంపిన టీమ్లోనూ ఆశన్న ఉన్నారు. అంతేకాక 2003 అక్టోబర్లో తిరుపతి సమీపంలోని అలిపిరి దగ్గర సీఎం నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని క్లెమోర్ మైన్స్ పేల్చిన తొమ్మిది మంది సభ్యుల బృందానికి ఆశన్నే నాయకత్వం వహించారు. -
గుజరాత్లో కీలక పరిణామం.. మంత్రులంతా రాజీనామా
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మిగిలిన మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:39 గంటలకు నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుంది. "ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని శుక్రవారం మధ్యాహ్నం విస్తరించనున్నారు" అని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మంత్రివర్గంలో దాదాపు 10 మంది కొత్త వారికి అవకాశం లభించవచ్చని బీజేపీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉన్న మంత్రుల్లో దాదాపు సగం మందిని మార్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గుజరాత్ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంకు మంత్రులు కాగా, మిగిలిన వారు సహాయ మంత్రులుగా కొనసాగుతున్నారు. -
Bihar Election: స్ఫూర్తినిస్తున్న ‘జన్ సురాజ్’ అభ్యర్థి నీరజ్
పట్నా: అతను ఢిల్లీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. అంచలంచలుగా ఎదుగుతూ రూ. 400 కోట్ల టర్నోవర్ గల కంపెనీని నడిపేస్థాయికి చేరుకున్నారు. అతనే బీహార్ పారిశ్రామికవేత్త నీరజ్ సింగ్. అతని జీవన ప్రయాణం సినిమా స్క్రిప్ట్ను తలపిస్తుంది.38 ఏళ్ల నీరజ్ సింగ్ రాబోయే బీహార్ ఎన్నికల్లో షియోహార్ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు.బీహార్లోని షియోహార్ జిల్లాలోని మధురాపూర్ గ్రామంలో జన్మించిన నీరజ్ సింగ్ పదవ తరగతి పూర్తిచేశాక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఉద్యోగాల వేటలో పడ్డారు. ఎటువంటి ఉద్యోగం దొరక్క, గ్రామంలో పెట్రోల్, డీజిల్ విక్రయించడం మొదలుపెట్టాడు. తరువాత ఢిల్లీకి వెళ్లి, సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరారు. అనంతరం పూణేకు చేరుకుని, ఒక ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ అటెండెంట్గా చేరారు. 2010లో ధాన్యం వ్యాపారాన్ని ప్రారంభించారు. అది కలసివచ్చింది. దీంతో ఇటుకలు, బిల్డింగ్ బ్లాక్స్, టైల్స్, ఇతర సిరామిక్ వస్తువులను విక్రయించే ఉషా ఇండస్ట్రీస్ను స్థాపించారు. తదనంతర కాలంలో సింగ్ తన వ్యాపారాన్ని రోడ్డు నిర్మాణ రంగానికి కూడా విస్తరించారు. ఇటీవలే సొంత పెట్రోల్ పంపును ప్రారంభించారు. నీరజ్ సింగ్ స్థాపించిన కంపెనీ ప్రస్తుతం రూ. 400 కోట్ల టర్నోవర్తో, రెండువేల మంది సిబ్బందికి ఉపాధిని అందిస్తోంది. ఒకప్పుడు సైకిల్ కూడా లేని నీరజ్ సింగ్ దగ్గర నేడు అర డజనుకు పైగా లగ్జరీ కార్లు ఉన్నాయి. సింగ్ తన ఇద్దరు సోదరులు, భార్య, ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులతోపాటు ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. పేద మహిళలకు వివాహాలు చేయడం, సీనియర్ సిటిజన్ల కోసం ఉచిత ఆరోగ్య శిబిరాలు, వృద్ధుల కోసం తీర్థయాత్రలను నిర్వహించడం లాంటి సేవాకార్యక్రమాలను నీరజ్ సింగ్ నిర్వహిస్తున్నారు. -
170 మంది మావోయిస్టుల లొంగుబాటు: అమిత్ షా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెడుతున్నారని హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈరోజు(గురువారం, అక్టోబర్ 16వ తేదీ) చత్తీస్గఢ్లో 170 మంంది మావోయిస్టులు లొంగిపోయిన విషయాన్ని ఆయన తెలిపారు. నిన్న (బుధవారం, అక్టోబర్ 15వ తేదీ) 27 మంది మావోయిస్టులు లొంగిపోయారన్నారు. గత రెండు రోజుల్లో చూస్తే 258 మంది మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు అమిత్ షా ప్రకటించారు. నక్సలిజంపై పోరులో ఇదొక అరుదైన మైలురాయి అని అమిత్ షా స్పష్టం చేశారు. ఈ మేరకు తన ’ఎక్స్’ హ్యాండిల్లో మావోయిస్టులు లొంగుబాటు విషయాన్ని అమిత్ షా చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగంపై నమ్మకం ఉంచి హింసను త్యజించాలనే వారి నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. ప్రధానమంత్రి నిరంతర ప్రయత్నాల కారణంగా నక్సలిజం తుది శ్వాస విడిచిందని విషయం దీని ద్వారా రుజువైందినక్సలిజాన్ని అంతం చేయడానికి ప్రభుత్వం నాయకత్వం వహిస్తుంది. మా విధానం స్పష్టంగా ఉంది: లొంగిపోవాలనుకునే వారికి స్వాగతం, తుపాకీని ప్రయోగించడం కొనసాగించే వారు మా దళాల ఆగ్రహానికి లోనుకాక తప్పదు. నక్సలిజం మార్గంలో ఇప్పటికీ ఉన్నవారు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. 2026 మార్చి 31 లోపు నక్సలిజాన్ని నిర్మూలించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.A landmark day in our battle against Naxalism.Today, 170 Naxalites have surrendered in Chhattisgarh. Yesterday 27 had laid down their arms in the state. In Maharashtra, 61 returned to the mainstream, yesterday. In total, 258 battle-hardened left-wing extremists have abjured…— Amit Shah (@AmitShah) October 16, 2025 ఇదీ చదవండి:న్యాయం కోసం సుప్రీంకోర్టుకు పైలెట్ తండ్రి.. -
Air India Crash Case: న్యాయం కోసం సుప్రీం కోర్టుకు పైలెట్ తండ్రి
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో విశ్వసనీయత, పారదర్శకత లోపించిదని ఆరోపిస్తూ దివంగత కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 241 మంది ప్రయాణికులతో సహా 260 మంది మృతి చెందిన ఘటనపై న్యాయ నిపుణుల పర్యవేక్షణలో విచారణ జరగాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు.పుష్కరాజ్ సభర్వాల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ)అక్టోబర్ 10న సంయుక్తంగా దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్లో ఏఐ 171 ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు కోర్ట్ మానిటర్డ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) నిర్వహించిన అన్ని ముందస్తు దర్యాప్తులను మూసివేసినట్లుగా పరిగణిస్తూ, స్వతంత్ర విమానయాన,సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉన్న రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని న్యాయ నిపుణుల కమిటీ పర్యవేక్షణలో విచారణ చేయాలని వారు కోరారు.ప్రమాదంపై దర్యాప్తులో విశ్వసనీయత, పారదర్శకత లేకపోవడంపై పుష్కరాజ్ సభర్వాల్తో పాటు ఎఫ్ఐపీ సభ్యులు ఆవేదన చెందుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. బోయింగ్ 787 డిజైన్ స్థాయి లోపాలను పరిశోధించడంలో వైఫల్యం చెందారని, ఇంధన స్విచ్ కదలిక అంటూ పైలట్పై నింద మోపారని ఆరోపించారు. ఆరోగ్యం, మానసిక స్థితి లోపం అంటూ కెప్టెన్ సుమీత్ సభర్వాల్ ప్రతిష్టను ప్రతిష్టను దెబ్బతీశారని పేర్కొన్నారు. జూలై 12 నాటి ఏఏఐబీ ప్రాథమిక నివేదిక లోపభూయిష్టంగా ఉందని పుష్కరాజ్ సభర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు.తన కుమారుని మానసిక ఆరోగ్యం గురించి వచ్చిన కథనాలను తోసిపుచ్చుతూ పుష్కరాజ్ ఇలా అన్నారు. కెప్టెన్ సభర్వాల్ దాదాపు 15 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారని, కెప్టెన్ సభర్వాల్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడానికి కారణం గల కారణం అతని తల్లి మరణమని, ఆమె మూడేళ్ల క్రితం మృతిచెందారని పుష్కరాజ్ తెలిపారు. ఆ తర్వాత కెప్టెన్ సభర్వాల్ 100 కి పైగా విమానాలను ఎటువంటి ప్రమాదం లేకుండా నడిపారని, బోయింగ్ 787-8 విమానంలో 8,596 గంటలు సహా దాదాపు 15,638.22 గంటల విమాన ప్రయాణ అనుభవం కెప్టెన్ సుమీత్ సభర్వాల్కు ఉన్నదన్నారు. -
Bihar Election: లాలూకు రాహుల్ ఫోన్.. సీట్ల ఒప్పందంపై మంతనాలు
న్యూఢిల్లీ: బీహార్లో నవంబర్లో జరగనున్న ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో రాజకీయపార్టీల్లో సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష కూటమిలో సీట్ల కేటాయింపు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీనిని పరిష్కరించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గురువారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో నేరుగా మాట్లాడారని పార్టీ వర్గాలు తెలిపాయి. పోటీ విషయంలో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరు పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని సమాచారం.బీహార్ ఎన్నికలకు సంబంధించి మొదటి దశ నామినేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ కీలక మిత్రపక్షాలైన ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఇంతవరకూ సీట్ల కేటాయింపు విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. తొలుత ఆర్జేడీ తన మిత్రపక్షం కాంగ్రెస్కు 52 సీట్లు ఇచ్చింది. అయితే దానిని కాంగ్రెస్ తిరస్కరించింది. కనీసం 60 నియోజకవర్గాలు కావాలని పట్టుపట్టింది. ఈ నేపధ్యంలో రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతలు- ఆర్జేడీ మధ్య చర్చలు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో రెండు పార్టీల జాతీయ నాయకత్వం సీట్ల ప్రతిష్టంభనను తొలగించేందుకు రంగంలోకి దిగింది. అయితే ఆర్జేడీ నేతలు కాంగ్రెస్ 61 సీట్ల డిమాండ్ను నెరవేర్చడానికి ముందుకు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పట్టుబట్టిన కొన్ని కీలక నియోజకవర్గాలపై విభేదాలు మొదలయ్యాయని సమాచారం. నర్కటియగంజ్, వాసాలిగంజ్, కహల్గావ్ స్థానాలలో పోటీ విషయంలో ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. చైన్పూర్, బచ్వారాలలో ఇదే పరిస్థితి నెలకొన్నదని సమాచారం. కాగా రాహుల్ గాంధీ తాను చేపట్టిన ఓటరు అధికార్ యాత్ర రాష్ట్రంలో తమకు అవకాశాలను పెంచుతుందని నమ్ముతూ మరిన్ని సీట్లు కోరుతున్నారని తెలుస్తోంది. మీడియాకు ప్రాధమికంగా తెలిసిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 61 సీట్లతో సరిపెట్టుకునేందుకు అంగీకరించింది. ఇది 2020లో పోటీ చేసిన 70 సీట్ల కంటే తొమ్మిది సీట్లు తక్కువ. ఆ సమయంలో కాంగ్రెస్ 19 సీట్లను మాత్రమే గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయగా, 75 మంది అభ్యర్థులు గెలిచారు. ఇదిలా ఉండగా సీట్ల కేటాయింపు ఇంకా జరగకముందే బుధవారం రాత్రి కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బుధవారం రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కాంగ్రెస్ తమ అభ్యర్థులను తొలి జాబితాను ప్రకటించడం గమనార్హం. -
రాకేష్ కిషోర్పై చర్యలు.. సుప్రీం కోర్టులో ఆసక్తికర చర్చ
తనపై షూ విసిరిన లాయర్(సస్పెండెడ్) రాకేష్ కిషోర్ను భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ క్షమించినా.. న్యాయ వ్యవస్థ మాత్రం వదిలిపెట్టడం లేదు. ఆయనపై కోర్టు ధిక్కరణ కింద క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని తాజాగా అటార్నీ జనరల్ అనుమతిచ్చారు. అయితే.. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే మంచిదంటూ సుప్రీం కోర్టు గురువారం అభిప్రాయపడింది. అటార్నీ జనరల్ ఈ చర్యకు చట్టపరమైన అనుమతి ఇచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితోనే ఆపేస్తే దానంతట అదే ఆగిపోతుంది. లేకుంటే.. సోషల్ మీడియాలో చర్చలతో సాగుతుంటుంది. పైగా ఈ అంశాన్ని పదే పదే చర్చించడం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది అని జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 6వ తేదీన కేసు లిస్టింగ్లు జరుగుతున్న టైంలో.. అడ్వొకేట్ రాకేష్ కిషోర్ తన షూను సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మీదకు విసిరారు. అయితే అది ఆయన దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. దీంతో అప్రమత్తమైన తోటి లాయర్లు కిషోర్ను అడ్డగించి.. కోర్టు సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించారు. ఆ సమయంలో సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం ఊరుకోదు అంటూ కిషోర్ నినాదాలు చేశాడు. అయితే ఈ ఘటనను పట్టించుకోకుండా ప్రొసీడింగ్స్ కొనసాగించాలని జస్టిస్ గవాయ్ అక్కడున్నవాళ్లకు సూచించారు. ఇలాంటివి తనని ప్రభావితం చేయబోవని ఆ టైంలో అన్నారాయన.అటుపై చీఫ్ జస్టిస్ సూచనతో ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాకుండా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ చూసుకుంది. దీంతో రాకేష్ను మూడు గంటలపాటు ప్రశ్నించి.. షూ, ఆయన ఫైల్స్ను అందించి ఢిల్లీ పోలీసులు వదిలేశారు. ఈలోపు.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయన లాయర్ లైసెన్స్ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. అయితే తాను చేసిన పనికి పశ్చాత్తపం చెందడం లేదంటూ కిషోర్ పలు ఇంటర్వ్యూల్లో వ్యాఖ్యానించాడు. ఆ వెంటనే సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్.. ఆయన్ని సుప్రీం కోర్టు ఆవరణలోకి అడుగుపెట్టనివ్వకుండా నిషేధం విధించింది. అయితే.. ఏజీ ఆదేశాల నేపథ్యంలో రాకేష్ కిషోర్పై క్రిమినల్ కంటెప్ట్ ఆఫ్ కోర్టుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు.. సీనియర్ లాయర్ వికాస్ సింగ్ ఇవాళ ద్విసభ్య ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఇది రాజ్యాంగ వ్యవస్థను అవమానించే ఘటన అని, తీవ్రంగా పరిగణించి ఈ అంశాన్ని రేపు విచారణ జరపాలని బెంచ్ను కోరారు. అయితే.. ఈ అంశం సోషల్ మీడియాలో కొనసాగుతోందని వికాస్ సింగ్ అనగా.. కొంతమంది ఈ చర్యను సమర్థించారని, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ గౌరవాన్ని దెబ్బ తీసే అంశమని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్ వద్ద అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుని.. ఈ ఘటనలో సీజేఐ చాలా ఉదారంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు సంస్థను ప్రభావితం చేయవని హుందాగా అన్నారు. అయితే.. ఆయన స్పందన గౌరవప్రదంగానే ఉన్నా సోషల్ మీడియాలో ఈ చర్యను సమర్థించడం ఆందోళన కలిగిస్తోందని తుషార్ మెహతా చెప్పారు. ఈ వ్యవహారంలో John Doe injunction(కోర్టు నుంచి ముందస్తుగా తీసుకునే నిషేధ ఉత్తర్వు) జారీ చేయాలని లాయర్ వికాస్ సింగ్ కోర్టును కోరారు. ఆ సమయంలో జస్టిస్ బాగ్చీ కలుగజేసుకుని.. ‘‘ఇది కొత్త వివాదాలకు దారితీయవచ్చు. కోర్టులో మన ప్రవర్తనే ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తుంది. ఓ బాధ్యతలేని పౌరుడి చర్యగా పరిగణించి సీజేఐ దీనిని పట్టించుకోలేదు. అలాంటి అంశాన్ని మళ్లీ తవ్వడం అవసరమా? అని అన్నారు. పైగా ఎన్నో ముఖ్యమైన అంశాలు పెండింగ్లో ఉన్నాయని, దీనిని పైకి తేవడం సమయాన్ని వృధా చేయడమేనన్న అభిప్రాయమూ ఆయన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని మరింత పెద్దది చేయడం తన ఉద్దేశం కాదని, ఇక్కడితో నిలువరించమే తన అభిమతమని వికాస్ సింగ్ స్పష్టత ఇచ్చారు. ఆపై జస్టిస్ కాంత్ మాట్లాడుతూ.. నా సహ న్యాయమూర్తి చెబుతోంది మీరు కూడా అర్థం చేసుకున్నారు. మీరు ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించిన వెంటనే, మీడియాలో కథనాలు కొనసాగుతాయి అని అన్నారు. ఆ టైంలో..‘దురదృష్టవశాత్తు, మనం డబ్బు సంపాదించే వ్యాపారాలుగా మారిపోయాం…" అని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో సాలిసిటర్ జనరల్ ఏకీభవించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారాలు అల్గోరిథమ్స్ ఆధారంగా పనిచేస్తాయి. ప్రజలు వాటికి బానిసలుగా మారిపోయారు. ఆ బానిసత్వాన్ని ఈ ప్లాట్ఫారాలు డబ్బుగా మార్చుకుంటున్నాయి. మనం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నామనుకుంటాం, కానీ నిజానికి మనమే ఆ ప్లాట్ఫారాల ఉత్పత్తులం’’ అని మెహతా అన్నారు. ఆ సమయంలో జస్టిస్ కాంత్ కలుగజేసుకుని మనం ఉత్పత్తులమే కాదు.. వినియోగదారులం కూడా అని అన్నారు. సోషల్ మీడియా మనుషుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దాని అల్గోరిథమ్స్ ద్వారానే.. ద్వేషం, కోపం, కామం లాంటి భావనలకు గురవుతున్నాం. సోషల్ మీడియా మన ఈ వ్యసనాన్ని మానిటైజ్ చేస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అది మళ్లీ మానిటైజ్ అవుతుంది. కాబట్టి దీనిని సహజంగా ముగియనివ్వడమే మంచిది అని జస్టిస్ కాంత్ అన్నారు. పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని.. అలాగే న్యాయస్థానం కూడా బార్ (న్యాయవాదుల సంఘం) ఆవేదనను అర్థం చేసుకోవాలని లాయర్ వికాస్ సింగ్ కోరారు. ‘‘బార్ (న్యాయవాదుల సంఘం) ఎప్పుడూ న్యాయ వ్యవస్థకు అండగా నిలిచింది. మీరు న్యాయాన్ని కోరే ప్రజలతో కోర్టును కలిపే వంతెన. మీ పరిస్థితిని, మీ భావోద్వేగాలను మేము అర్థం చేసుకుంటున్నాం’’ అని జస్టిస్ కాంత్ అన్నారు. ఈ అంశాన్ని శుక్రవారం విచారణకు తీసుకురావాలని వికాస్ సింగ్ మరోసారి కోరారు. అయితే.. దీపావళి తర్వాతే విచారించే అవకాశం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. ఒక వారం తర్వాత ఇది ఇంకా 'సేలబుల్' అంశంగా ఉంటుందేమో చూద్దాం అని జస్టిస్ కాంత్ సున్నితంగా వ్యాఖ్యానించారు. ఈలోపు.. అల్గోరిథమ్ కోసం కొత్త అంశం వస్తుందేమో చూడాలి అని జస్టిస్ బాగ్చీ అన్నారు. దీనికి సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. ఇలాంటి అంశాలకు 24–48 గంటల లైఫ్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి వస్తుంది అనడంతో నవ్వులతో విచారణ వాయిదా పడింది. -
Bihar Elections: తేజస్వి ఆస్తులెంత? బెరెట్టా పిస్టల్ వివాదమేంటి?
పట్నా: దేశంలో ఎక్కడ చూసినా బీహార్ ఎన్నికలకు సంబంధించిన ముచ్చట్లే వినిపిస్తున్నాయి. నవంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం మొదలయ్యింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన అధికారిక అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇప్పుడిది ఎంతో ఆసక్తికరంగా మారింది.ఆర్జేడీ కోట నుండి వరుసగా మూడవసారి విజయం సాధించాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగిన తేజస్వి యాదవ్.. బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏపై పలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో బెరెట్టా పిస్టల్తో పాటు రూ. 8.98 కోట్ల విలువైన కుటుంబ ఆస్తులను వెల్లడించారు. అలాగే తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని కూడా తెలిపారు. ఆ వివరాలు..తేజస్వి యాదవ్ ఆస్తులు- రూ 1.88 కోట్లు (స్థిరచరాస్తులు) భార్య రాజ్శ్రీ యాదవ్ ఆస్తులు- రూ 59.69 లక్షలు(స్థిరచరాస్తులు)ఇద్దరు పిల్లల ఆస్తులు- రూ. 40 లక్షలు(స్థిరచరాస్తులు)మొత్తం కుటుంబపు చరాస్తులు- రూ. 6.12 కోట్లుబంగారం, వెండి- రూ. 85.9 లక్షలు- (980 గ్రాముల బంగారం, 3.5 కిలోల వెండి)ఆయుధాలు- రూ.1.05 లక్షలు ఇటాలియన్ బెరెట్టా ఎన్పీబీ 380 బోర్ పిస్టల్, 50 రౌండ్లుఎలక్ట్రానిక్స్- రూ. 85 లక్షలు డెస్క్టాప్, ల్యాప్టాప్మొత్తంగా ప్రకటించిన కుటుంబ ఆస్తులు రూ. 8.98 కోట్లుఈ అఫిడవిట్లో తేజస్వి యాదవ్ పేరు మీద ఏ వ్యక్తిగత వాహనం లేదా రియల్ ఎస్టేట్ వివరాలు లేవు. ఇది తేజస్వి సామాన్యుడనే ఇమేజ్ను బలోపేతం చేస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే జాబితాలోని ఎలక్ట్రానిక్స్ , ఆయుధం విలువ అతని సామాన్య జీవనశైలికి విరుద్ధంగా ఉన్నాయనే వాదన విపిస్తోంది. కాగా అఫిడవిట్లో ఇటాలియన్ బెరెట్టా ఎన్పీబీ 380 బోర్ పిస్టల్, 50 బుల్లెట్లను చేర్చడం, దాని విలువ రూ. 1.05 లక్షలుగా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. 1984 నుండి దేశంలో పౌర ఆయుధాల దిగుమతిని నిషేధించారు. ఆయుధ చట్టం- 1959 ప్రకారం అధికారం కలిగిన భారతీయ డీలర్ నుండే ఆయుధాన్ని కొనుగోలు చేయాలి. అయితే తేజస్వి బెరెట్టా పిస్టల్ కలిగివుండటంపై పలు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇది అక్రమంగా వచ్చిన ఆయుధమనే వాదన వినిపిస్తోంది.తేజస్వి యాదవ్ తన అఫిడవిట్లో తనపై 18 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిలో నాలుగు అప్పీల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులు రాజకీయ ర్యాలీలు, నిరసనలు, వివాదాస్పద ప్రకటనల కారణంగా నమోదయ్యాయి. తాజగా అక్టోబర్ 13న ఢిల్లీ కోర్టు.. ఆయనతో పాటు ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీ దేవిలపై ఐఆర్సీటీసీ హోటళ్ల అవినీతి కుంభకోణం, ల్యాండ్-ఫర్-జాబ్స్ స్కామ్లో అధికారికంగా అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఇది ఎన్నికలకు ముందు తేజస్వికి ఎదురుదెబ్బగా మారింది.రాఘోపూర్ నియోజకవర్గం ఆర్జేడీకి ఎంతో కీలకమైనది. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ఇద్దరూ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతమిది. తేజస్వి 2015, 2020లలో ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఇక్కడి ఓటర్లలో యాదవులు 25 శాతం, ముస్లింలు 20 శాతం, ఈబీసీలు 30 శాతం ఉన్నారు. ఇది ఆర్జేడీ విజయానికి కీలకమైన జనాభాగా పరిగణిస్తుంటారు. హాజీపూర్ కలెక్టరేట్లో తేజస్వి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశాక తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన ‘ఎక్స్’ ఖాతాలో ‘ఈ నామినేషన్ తేజస్వి ఒక్కడికే కాదు.. బీహార్ అంతటా మార్పు కోసం’ అని పేర్కొన్నారు. -
‘ఓఆర్ఎస్’ అనొద్దు: ఫుడ్ కంపెనీలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో ఫుడ్ ప్రొడక్టులను అమ్మే కంపెనీలకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నూతన హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్ లు, ఎనర్జీ డ్రింకులపై ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ (ఓఆర్ఎస్) అని రాయడాన్ని పూర్తిగా నిషేధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న ఈ విధానాన్ని నిషేధిస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది.ఫుడ్ ప్రొడక్ట్ బ్రాండ్ పేరులో, లేదా ట్రేడ్ మార్క్ లో ఓఆర్ఎస్ అనే పదాన్ని వినియోగించడం ఇకపై చట్టవిరుద్ధమని వెల్లడించింది. ఈ నూతన నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని బుధవారం జారీ చేసిన ఒక ప్రకటనలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. డీహైడ్రేషన్ నివారణ కోసం మార్కెట్లో ఓఆర్ఎస్ పేరుతో పలు డ్రింకులు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటితో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్న ఫార్ములాతో తయారైనదే అసలైన ఓఆర్ఎస్గా గుర్తించాలి.అయితే మార్కెట్లో పలు రకాల ఆహార, పానీయాల తయారీ కంపెనీలు తమ పండ్ల రసాలు, పానీయాలకు ఓఆర్ఎస్ అనే పదాన్ని తగిలించి అమ్ముతున్నాయి. ఫలితంగా వినియోగదారులు సాధారణ డ్రింకులను కూడా వైద్యానికి వినియోగించే ఓఆర్ఎస్ అని భ్రమపడి కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే‘డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసిన ఓఆర్ఎస్ ఫార్ములా కాదు’ అనే హెచ్చరికతో ఓఆర్ఎస్ పదాన్ని వాడేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతిచ్చింది.ఈ విధంగా 2022 జూలై, 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా వినియోగదారులు వీటిని ఒరిజినల్ ఓఆర్ఎస్ అని భ్రమపడుతున్నారని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించింది. ఈ నేపధ్యంలో పాత ఉత్తర్వులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. ఇకపై తప్పుదోవ పట్టించే లేబులింగ్తో విక్రయాలు జరపడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లు ఈ నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. -
షుగర్ ఉన్నట్లు చెప్పలేదని భార్య హత్య
బెంగళూరు: ఆ దంపతులు ఇద్దరూ వైద్యులు. అనారోగ్యం పాలైన భార్యకు వైద్యం చేయించడానికి బదులు ఏకంగా ఆమె ప్రాణమే తీశాడు ఆ భర్త. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భార్యను హతమార్చి.. సహజ మరణంగా కుటుంబ సభ్యులను నమ్మించాడు. కానీ చివరకు నిజం బయట పడింది. బెంగళూరు నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డి (32), డాక్టర్ కృతికారెడ్డి (28) 2024 మే 26న పెద్దలు వైభవంగా పెళ్లి చేశారు. ఇద్దరూ మారతహళ్లిలో నివాసం ఉన్నారు. డాక్టర్ కృతికారెడ్డి బెంగళూరు ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో చర్మ రోగ నిపుణురాలుగా పనిచేసే వారు. అదే ఆసుపత్రిలో భర్త జనరల్ సర్జన్. కాగా, కృతికారెడ్డి గ్యాస్ట్రిక్, షుగర్ వంటి సమస్యలతో బాధ పడుతోంది. పెళ్లి సమయంలో ఈ సమస్యలు ఉన్నట్లు భార్య కుటుంబం తనకు చెప్పలేదని మహేంద్రరెడ్డి ఆగ్రహంతో ఉన్నాడు. రోజూ వాంతులు, ఇతరత్రా రుగ్మతలతో ఇబ్బందులు పడే భార్యను హత్య చేసి, అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 21న ఆరోగ్యం (Health) సరిగా లేదని కృతికారెడ్డి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, మహేంద్రరెడ్డి ఆమెకు ఎక్కువ మోతాదులో మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇలా రెండు రోజులు వరుసగా ఇవ్వడంతో ఆమె ఏప్రిల్ 23వ తేదీన మరణించింది. ఆపై తన భార్య అనారోగ్యంతో బాధ పడుతోందని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికతో గుట్టురట్టు ఆసుపత్రి నుంచి సమాచారం అందడంతో మారతహళ్లి పోలీసులు వెళ్లి పరిశీలించారు. వారి ఇంట్లో నుంచి ఇంజెక్షన్, ఐవీ సెట్ వంటి ఉప కరణాలను సీజ్ చేశారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె మృతదేహం నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. చదవండి: బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి.. గలీజు పనులుఈ నెల 13వ తేదీన అందిన రిపోర్టులో కృతికారెడ్డి దేహంలో ఎక్కువ మొత్తంలో మత్తు మందు ఆనవాళ్లు కనిపించాయని ఉంది. దీంతో అల్లుడే కూతురిని హత్య చేశాడని మృతురాలి తండ్రి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు డాక్టర్ మహేంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆమె భర్త తప్పుడు ఉద్దేశంతో కావాలనే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు గుర్తించామని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. -
భార్యను చంపి బోరు బావిలోపాతిపెట్టి..పార్టీ ఇచ్చాడు!
కర్ణాటక: భార్యను హత్య చేసి బోరు బావిలో పాతిపెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా అలఘట్ట గ్రామంలో నెలన్నర క్రితం విజయ్ తన భార్య భారతిని హత్య చేశాడు. ఎవరికీ తెలియకుండా తోటలోని బోరు బావిలో శవాన్ని పాతి పెట్టాడు. భార్య పీడ తప్పిందని మూడు జంతువులను బలిచ్చి బంధువులకు విందు భోజనం పెట్టాడు. రేకుపై భార్య పేరు రాసి దెయ్యం, పీడ, పిశాచి పట్టకూడదని రాసి పూజలు చేయించాడు. అనంతరం తన భార్య మానసిక అస్వస్థతతో ఇల్లు వదలి వెళ్లినట్లు బంధువులు, గ్రామస్తులను నమ్మించాడు. అదృశ్యమైన తన భార్య ఆచూకీ కనిపెట్టాలంటూ కడూరు పోలీసులకు విజయ్ ఫిర్యాదు చేశాడు. భారతి తల్లిదండ్రులు కూడా కుమార్తె అదృశ్యంపై పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. భర్త విజయ్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఘటనకు సంబంధించి భర్త విజయ్తో పాటు అత్తమామలు తాయమ్మ, గోవిందప్పను అరెస్ట్ చేశారు. మృతురాలు భారతి తన అవ్వను చూడటానికి శివమొగ్గకు వెళ్లారు. తిరిగి వాపస్ రాలేదని సెపె్టంబర్ 5న భర్త విజయ్.. కడూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నెలన్నర తరువాత భారతి తల్లి, ఎమ్మెదొడ్డి పరదేశీహాళ్కు చెందిన లలితమ్మ కడూరు పోలీసులకు మళ్లీ అక్టోబర్ 13న ఫిర్యాదు చేశారు. ‘6 ఏళ్ల క్రితం భారతిని విజయ్కి ఇచ్చి వివాహం చేశాం. అనేక సార్లు కట్నం కావాలని విజయ్ వేధించేవాడని భారతి తల్లిదండ్రులు ఫిర్యాదులో వివరించారు. దీంతో పోలీసులు విజయ్ను విచారించగా అసలు విషయం బయట పడింది. లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అల్లుడు విజయ్, అతడి తలి తాయమ్మ, తండ్రి గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ట్రంప్ ప్రకటన.. రాహుల్ విమర్శలు.. స్పందించిన కేంద్రం
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తోందని, ఇందుకుగానూ భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంప్ను చూసి మోదీ భయపడ్డారని రాహుల్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంధన దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ నోట్ రూపేణా స్పందించింది. అస్థిర పరిస్థితుల నడుమ.. వినియోగదారుల ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం ఉంటుందని అందులో కేంద్రం స్పష్టం చేసింది(India Reacts On Trump Russia Oil Comments).మీడియా ప్రశ్నలకు బదులుగా.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ తాజా పరిణామాలపై ఒక నోట్ విడుదల చేశారు. చమురు సంబంధిత దిగుమతులు భారత్కు ఎంతో కీలకం. మార్కెట్ అస్థిరతల మధ్య ఇక్కడి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం మా ప్రధాన ధ్యేయం. అందుకే దిగుమతుల విధానాలు ఆ దిశగా రూపొందించబడ్డాయి.... స్థిరమైన ఇంధన ధరలు, భద్రతతో కూడిన సరఫరా.. ఇవే మా ద్వంద్వ లక్ష్యాలు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఇంధన వనరుల విస్తరణ, వివిధ దేశాల నుంచి సరఫరా పొందడం జరుగుతోంది అని అందులో పేర్కొన్నారాయన. అలాగే..Our response to media queries on comments on India’s energy sourcing⬇️🔗 https://t.co/BTFl2HQUab pic.twitter.com/r76rjJuC7A— Randhir Jaiswal (@MEAIndia) October 16, 2025అమెరికాతో సంబంధం గురించి మాట్లాడుతూ.. గత దశాబ్దంగా ఇంధన సహకారం పెరుగుతోంది. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం భారత్తో సహకారం మరింతగా అభివృద్ధి చేయాలనే ఆసక్తి చూపుతోంది. చర్చలు కొనసాగుతున్నాయి అని జైస్వాల్ అందులో తెలిపారు. తద్వారా.. అంతర్జాతీయ ఒత్తిడులకు కాకుండా దేశ ప్రయోజనాల ఆధారంగా భారత్ ముందుకు వెళ్తుందని మరోసారి భారత్ స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం(Ukraine Crisis) ముగింపు దిశగా కీలక అడుగు పడిందని, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయబోతోందని, మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఈ ప్రకటనపై రాహుల్ గాంధీ భగ్గుమన్నారు. ట్రంప్ నుంచి సానుకూల స్పందన లేకపోయినా తరచూ అభినందన సందేశాలు ఎందుకంటూ మోదీని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ తరుణంలో కౌంటర్గా కేంద్రం నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.ఇదీ చదవండి: మోదీ నన్ను ప్రేమిస్తారు.. అంటే మరోలా కాదు! -
30 ఏళ్లుగా భారత్లో ‘బంగ్లా’ ట్రాన్స్.. నకిలీ పత్రాలతో హల్చల్
ముంబై: భారత్లో అక్రమంగా ఉంటున్న విదేశీయుల ఏరివేతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో పలువురు అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబై పోలీసులు ‘గురు మా’ పేరుతో గుర్తింపు పొందిన జ్యోతి అనే బంగ్లాదేశ్కు చెందిన ట్రాన్స్ జెండర్ను అరెస్టు చేశారు.ట్రాన్స్ జెండర్ జ్యోతి గత 30 ఏళ్లుగా నకిలీ ధృవపత్రాలతో భారత్లో ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతి అసలు పేరు బాబు అయాన్ ఖాన్. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ వచ్చి, ఇక్కడ ఉంటున్న వలసదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే జ్యోతితో పాటు ఆమె సహచరులను ముంబైలోని శివాజీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇతర ధృవీకరణ పత్రాలు ఉండటంతో తొలుత వదిలేశారు. అయితే ఆ తరువాత జ్యోతికి సంబంధించిన ధృవపత్రాలను మరోమారు తనిఖీ చేయడంతో అవి నకిలీవని తేలింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.శివాజీ నగర్, నార్పోలి, డియోనార్, ట్రోంబే, కుర్లాతో సహా ముంబై పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో జ్యోతిపై ఇప్పటికే పలు నేర సంబంధిత కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. జ్యోతికి ముంబైలోని పలు ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో జ్యోతిని ‘గురు మా’ పేరుతో పిలుస్తారు. జ్యోతికి పలువురు అనుచరులు కూడా ఉన్నారు. జ్యోతి అలియాస్ ‘గురు మా’ను పాస్పోర్ట్ చట్టంలోని వివిధ సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని పలు నిబంధనల కింద అరెస్టు చేశారు.ఇదిలావుండగా ఢిల్లీలోని షాలిమార్ బాగ్, మహేంద్ర పార్క్ ప్రాంతాలలో నిర్వహించిన వరుస ఆపరేషన్లలో ఢిల్లీ పోలీసులు దేశంలో అక్రమంగా నివసిస్తున్న పది మందికి పైగా బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. వీరంతా మహిళలుగా కనిపించేందుకు సంబంధిత శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, భిక్షాటన చేస్తుంటారని పోలీసులు దర్యాప్తులో తేలింది. ‘హైదర్పూర్ మెట్రో స్టేషన్, న్యూ సబ్జీ మండి ప్రాంతాలలో అనుమానిత బంగ్లాదేశీయుల గురించి అందిన సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదర్పూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఎనిమిది మందిని, న్యూ సబ్జీ మండి సమీపంలో ఇద్దరిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారు చెబుతున్న భారత పౌరసత్వ వాదనలపై సందేహాలు తలెత్తాయని ఒక పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. -
ప్రభుత్వం కీలక నిర్ణయం.. 35 మార్కులు రాకున్నా పాస్..
పదో తరగతి.. లేదా ఎస్ఎస్ఎల్సీ.. విద్యార్థి జీవితంలో ఉన్నత చదువులకు ఇది మొదటి మెట్టు. టెన్త్ పాసైతే పీయూసీ, ఆపై చదువులకు తలుపులు తెరుచుకుంటాయి. లేదా చిన్నా చితకా ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ఇందుకోసం ప్రతి సబ్జెక్టులో 35 శాతం మార్కులను తెచ్చుకోవాలి. కానీ చాలామంది విద్యార్థులు, పేదరికం, చదువు అర్థం కాక తదితర సమస్యలతో ఒకటీ అరా మార్కులతో పరీక్షలు తప్పి శాశ్వతంగా చదువుల తల్లికి దూరం కావడం అన్నిచోట్లా జరుగుతోంది. టెన్త్ ఫెయిల్ అనేది ఒక శాపంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గుణాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణతకు 33 శాతం మార్కులు చాలని కుదించింది. శివాజీనగర: రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) పరీక్షల్లో 33 శాతం మార్కులు వస్తే చాలు పాసైపోయినట్లే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. 35 శాతం మార్కులు పొందేందుకు అవస్థలుపడే అనేకమంది విద్యార్థులకు ఇది చాలా అనుకూలం కానుంది. ఈ సంవత్సరం నుంచే అమలు చేస్తామని, ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. 206 మార్కులు చాలు బుధవారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి మధు.. ఈ విద్యా సంవత్సరం నుంచి 33 శాతం మార్కులు పొందితే ఎస్ఎస్ఎల్సీ పాస్ అయినట్లేనని తెలిపారు. మొత్తం మార్కులు 625 కాగా, 206 మార్కులు వస్తే చాలు విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని చెప్పారు. అంతర్గత మార్కులు, బాహ్య మార్కులు రెండు కలిపి 33 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. ఒక మార్కు, రెండు మార్కుల్లో పరీక్షలు తప్పిపోయే వేలాది మంది విద్యార్థులకు ఈ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. పారదర్శకంగా పరీక్షలు రాష్ట్రంలో ఎస్ఎస్ఎల్సీలో పరీక్షల వ్యవస్థ మెరుగుపరిచేందుకు మూడంచెల విధానాన్ని అమలు చేస్తామని మంత్రి చెప్పారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామని, ఉత్తమ రీతిలో పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. ఉత్తీర్ణత వృద్ధి కోసం 33 శాతం పాసింగ్ మార్కులను నిర్ధారించామన్నారు. ఆయా సబ్జెక్టుల మార్కుల్లో 30 మార్కులు పొంది, అంతర్గత, బాహ్య మార్కులు కలిపి మొత్తం 33 శాతం మార్కులు వచ్చినా ఉత్తీర్ణులవుతారని తెలిపారు. రెగ్యులర్, ప్రైవేటు, రిపీటర్స్కు ఇది వర్తిస్తుందని చెప్పారు. -
తెగని సీట్ల పంచాయితీ! ఢిల్లీ పెద్దలను ఉరికించిన కాంగ్రెస్ కార్యకర్తలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండే రోజులు మిగిలి ఉంది. ఇప్పటికీ బీహార్లో విపక్ష మహాఘట్ బంధన్లో సీట్ల పంపిణీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అయోమయం, గందరగోళం నడుమే ఆర్జేడీ 35 మందితో తన జాబితాను విడుదల చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 10 మంది పేర్లను ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది.పది మంది అభ్యర్థులకు సింబల్ పంపిణీ చేసింది కాంగ్రెస్. ఆ ఫొటోలను బీహార్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో అధికారికంగా పోస్ట్ చేశారు. అయితే.. సీట్ల పంపిణీ లెక్కలు తేలకుండానే కాంగ్రెస్ ఈ జాబితాను ప్రకటించిందా? లేదంటే ఒప్పందం ప్రకారమే చేసిందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈలోపు.. గత అర్ధరాత్రి పాట్నా ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర కలకలం రేగింది.బీహార్ కాంగ్రెస్ ఇంచార్జి కృష్ణ అల్లవరు, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజేష్ రామ్, సీనియర్ నేత షకీల్ అహ్మద్ ఖాన్లు ఢిల్లీలో సీట్ల పంపిణీపై చర్చలు జరిపిన అనంతరం పాట్నా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సంగతి తెలిసి.. బిక్రమ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా.. అది ఘర్షణకు దారి తీసింది.బీహార్లో బిక్రం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధార్థ్ సౌరభ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. తాజాగా.. కాంగ్రెస్ ప్రకటించిన పది మంది అభ్యర్థులలోఈ స్థానం కూడా ఉంది. ఇక్కడి నుంచి అనిల్ కుమార్ పోటీ చేయబోతున్నారు. అయితే.. विधानसभा क्षेत्र - बिक्रम सेINDIA गठबंधन समर्थित कांग्रेस उम्मीदवार श्री अनिल कुमार जी को अनंत बधाई एवं शुभकामनाएं!जीत रहा है INDIA ✊ pic.twitter.com/au4idsuiOm— Bihar Congress (@INCBihar) October 15, 2025ఈ పరిణామంపై ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు పాట్నా ఎయిర్పోర్టు వద్దకు చేరుకుని తమ పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు రూ.5 కోట్లకు సీటు అమ్ముకున్నారంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో పూర్నియా ఎంపీ పప్పు యాదవ్ మద్దతుదారుడు మనీష్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అలజడి రేగింది.దీంతో ఆ ముగ్గురు పెద్దలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. షకీల్ అహ్మద్ ఖాన్ను కార్యకర్తలు రౌండప్ చేయగా.. అతి కష్టం మీద తప్పించుకుని కారులో వెళ్లిపోయారు. తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో ఈ సీటు అభ్యర్థికి మార్పు తప్పదా? అనే చర్చ జోరందుకుంది.Congressmen clash at Patna airport, causing uproar over ticket dispute #Patna #Airport #Congress बिहार कांग्रेस के कार्यकर्ता पटना एयरपोर्ट पर टिकट बंटवारे से नाराज़! कृष्णा अल्लावरू, राजेश राम के सामने पहुंचे, लेकिन पप्पू यादव समर्थकों से भिड़ंत। गोली नहीं चली, यही बड़ी बात! pic.twitter.com/cpMcx35U5C— DVN TV (@dvntvnews) October 16, 2025ఇదిలా ఉంటే.. సీట్ల పంపిణీపై చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దఫా చర్చలు ఇవాళ ఓ కొలిక్కి వచ్చాక.. అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్జేడీ 130, కాంగ్రెస్ 60, వీఐపీ 18, వామపక్ష పార్టీలు 35 స్థానాలలో పోటీ చేస్తాయని జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్! -
జడ్జీ కక్కుర్తి.. విచారణ లైవ్లో మహిళతో రాసలీలలు..
ఉన్నత వృత్తిలో ఉండి పలువురికి మార్గదర్శకంగా ఉండాల్సిన కొందరు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన కారణంగా సోషల్ మీడియాలో, వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే, వీరు చేస్తే పనుల కారణంగా ఆ వృత్తికే చెడ్డ పేరు వస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా ఓ జడ్జీ.. లైవ్లోనే ఒక మహిళతో రాసలీలలు(Judge Viral Video) చేసిన వీడియో బయటకు వచ్చింది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన చండీగఢ్లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియో ప్రకారం.. ఆన్లైన్లో కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. కేసుల విచారణలో భాగంగా కోర్టుకు లాయర్లు, పోలీసులు వస్తున్నారు. ఈ జడ్జీ కూడా ఆన్లైన్లో కోర్టుకు హజరయ్యారు. తన కేసు విచారణ కంటే ముందే వచ్చి లైవ్లో రెడీగా కూర్చున్నాడు. అయితే, ఆయన తన లాప్ టాప్లో వీడియో మోడ్ను ఆన్ చేసిన సంగతి మర్చిపోయాడు.ఇంతలో ఒక మహిళ.. సదరు జడ్జీ వద్దకు రాగానే.. కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. అనంతరం, ఆయన ముద్దులాటకు దిగాడు. మహిళను బలవంతంగా తనవైపునకు లాగి.. ముద్దుపెట్టాడు. వీళ్ల రాసలీలలు.. లైవ్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో మిగత వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతలో కొంత మంది ఆయనకు ఫోన్ చేసి అలర్ట్ చేసినట్లు సమాచారం. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. జడ్జీలే ఇలా చేస్తే.. ఇంకా న్యాయం కోసం ఎక్కడకు వెళ్లాలని కామెంట్లు చేస్తున్నారు. -
ఆ ఒక్కడి లెక్క తేలిస్తే కగార్ ముగిసినట్లే!
నిన్న మల్లోజుల, నేడు ఆశన్న.. రేపు ఎవరో?. వరుస పరిణామాలతో యాభై ఏళ్ల మావోయిస్టు పార్టీ ఉద్యమం చివరి అంకానికి చేరుకుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్(Operation Kagar)తో పార్టీ కేడర్ కకావికలం కాగా.. అదే సమయంలో కీలక నేతలు వరుసగా లొంగిపోతుండడమూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 2026 మార్చికల్లా మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. లెక్కలు చూస్తే.. ఆయన చెప్పినట్లు నిజంగానే గత పదేళ్లలో ఉద్యమం తీవ్రంగా క్షీణించింది కూడా. మరీ ముఖ్యంగా.. మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు( Nambala Keshava Rao) ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అయ్యింది.గత రెండేళ్లలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతుండగా.. చేసేదేం లేక కింది స్థాయిలో కేడర్ కూడా పార్టీని వీడుతోంది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో మరో విశేషం ఒకటి ఉంది. ఆ పన్నెండు మందిలో.. 8 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలే ఉన్నారు. హనుమంతు, గణపతి, తిరుపతి, చంద్రన్న, సంగం వీళ్లంతా ఇక్కడి వాళ్లే. ఇక కీలకంగా ఉన్న ఒకే ఒక్కడు మడావి హిడ్మా. ఛత్తీస్గఢ్కు చెందిన ఈయన పలు రాష్ట్రాలకు మోస్ట్వాంటెడ్. ఆయన కోసం స్పెషల్ ఆపరేషన్ ఏడాది కాలంగా ఉదృతంగా సాగుతోంది. ఆయన ‘లెక్క తేలిస్తే’.. మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోం శాఖ బలంగా భావిస్తోంది. ఇదీ చదవండి: మడావి హిడ్మా ఎక్కడ?మావోయిస్టు ఉద్యమం 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి గ్రామంలో ప్రారంభమైంది.మార్క్సిజం–లెనినిజం–మావోయిజం సిద్ధాంతాల ఆధారంగా ప్రభుత్వ వ్యవస్థను కూల్చి.. సమసమాజాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఇంతకాలం సాగింది.ఉద్యమం కాలక్రమంలో.. CPI (ML) పీపుల్స్ వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్(MCC) విలీనంతో 2004లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఏర్పడింది.ఉద్యమం ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని భావించింది. కానీ హింసా మార్గం వల్ల పోను పోను ప్రజల మద్దతు తగ్గుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ ఉద్యమం తీవ్రంగా క్షీణించగా.. 2026 నాటికి పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంతో ఉంది. -
‘తెర’ వెనుక తెగిపోయిన కల
న్యూఢిల్లీ: అది ఢిల్లీలోని శాంతి నగర్, ఆ రోజు అక్టోబర్ 12. ఆ మధ్య తరగతి కుటుంబంలో ఎప్పుడూ ఉండే ఆనందం, నవ్వులు.. ఆరోజు భయంకరమైన నిశ్శ బ్దంలో కొట్టుకుపోయాయి. తండ్రి ఒక రియల్ ఎస్టేట్ డీలర్, తల్లి గృహిణి, 12వ తరగతి చదువుతున్న కుమార్తె, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు.. ఇంతే ఆ కుటుంబం. పద్నాలుగేళ్ల ఆ బాలునికి ఈ తరం పిల్లల్లాగే సోషల్ మీడియాపై ఆసక్తి ఉంది. తన గదిలోనే ఏదో కొత్త వీడియో తీయాలనే ఉత్సాహంతో ఉన్నా డు. అప్పుడు తెలియదు, ఆ ఉత్సాహమే తన జీవితంలో చివరి క్షణం అవుతుందని.. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని వేళ, తన గదిని ఓ చిన్న స్టూడియోలా మార్చుకున్నాడు. మొబైల్ ఫోన్ను ఒక చోట పెట్టి, ’ఆత్మహత్యను అనుకరించే’ దృశ్యాన్ని రికార్డు చేయడం మొదలు పెట్టాడు. తెరపై చూపించే ఉత్కంఠను తానూ అనుభూతి చెందాలనుకున్నాడు. కానీ, ఆ ప్రయత్నంలో, బాలుడు నిల్చున్న కుర్చీపై నుంచి కాలు జారింది. అంతే.. క్షణాల వ్యవధిలో అంతా మారిపోయింది. బాలుడికి ఊపిరి అందలేదు. కొద్దిసేపటి తరువాత, తల్లిదండ్రులు గదిలోకి వచ్చి చూడగానే.. వారి గుండెలు బద్దలయ్యా యి. ఆందోళనతో వెంటనే దగ్గర్లోని ఆసు పత్రికి తీసుకెళ్లినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ఈ సంఘటనలో ఎలాంటి కుట్ర లేదు. ఆ బాలుడు వీడియో షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపోయి ఉండవచ్చు. వీడియో ఫుటేజీ లోని బాలుని హావభావాలు చూస్తే అతను ఆత్మహత్యకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది’.. అని పేర్కొన్నారు. బీజేఆర్ఎం ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిర్వహించి బాలుని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమా దవశాత్తు జరిగిన సంఘటనగా కేసు నమోదు చేశారు. -
భారత పాస్పోర్టుకు 85వ ర్యాంకు
సింగపూర్: భారత పాస్పోర్టు స్థానం గత ఏడాదితో పోలిస్తే పడిపోయింది. 2025 హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్లో 85వ ర్యాంకు దక్కించుకుంది. భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌలభ్యం ఉంది. గత ఏడాది ఇదే ఇండెక్స్లో 80వ ర్యాంకు లభించింది. అప్పట్లో 62 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌకర్యం ఉండేది. ఏడాది కాలంలో 5 స్థానాలు పడిపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా సింగపూర్ పాస్పోర్టు తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ పాస్పోర్టు ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఈ జాబితాలో దక్షిణ కొరియా పాస్పోర్టుకు రెండో ర్యాంకు దక్కింది. దీంతో 190 దేశాలకు వీసాతో నిమిత్తం లేకుండా వెళ్లే వీలుంది. మూడో స్థానంలో ఉన్న జపాన్ పాస్పోర్టుతో 189 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. జర్మనీ, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ పాస్పోర్టులు నాలుగో ర్యాంకు దక్కించుకున్నాయి. వీటితో 188 దేశాలకు వీసా–ఫ్రీ సౌలభ్యం ఉంది. -
పోస్టుకార్డులతో గిన్నిస్ బుక్ రికార్డు
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ గుజరాత్ సహకార రంగానికి సంంధించిన ప్రజలు ఏకంగా 1.11 కోట్లకుపైగా లేఖలు రాశారు. పోస్టుకార్డులు పంపించారు. ఒకేసారి ఒకే వ్యక్తికి భారీసంఖ్యలో పోస్టుకార్డులు రాయడం గిన్నిస్ బుక్ ప్రపంచ రికార్డులోకి చేరిందని అధికారులు బుధవారం చెప్పారు. జీఎస్టీ సంస్కరణతోపాటు ఇతర చర్యలు చేపట్టినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,11,75,000 పోస్టుకార్డులు పంపించడం గమనార్హం. ఈ అరుదైన ఘట్టాన్ని గిన్నిస్బుక్ ప్రపంచ రికార్డు ప్రతినిధులు గుర్తించారు. ఆయా పోస్టుకార్డులను లెక్కించారు. ప్రపంచ రికార్డు సృష్టించినట్లుగా సంబంధిత ధ్రువపత్రాన్ని మంగళవారం అధికారులకు అందజేశారు. ఇప్పటిదాకా 6,666 పోస్టుకార్డులే అతిపెద్ద రికార్డు. గతంలో స్విట్లర్లాండ్లో ఈ ఘనత సాధించారు. ఈ రికార్డును గుజరాత్ ప్రజలు తిరగరాశారు. -
నిందితుల విచారణ వేళ లాయర్ ఉండాలా?
న్యూఢిల్లీ: నేరారోపణలు ఎదుర్కొంటున్న పిటిషనర్పై పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలు కేసు విచారణలో భాగంగా ప్రశ్నల వర్షం కురిపించే వేళ పిటిషనర్ తరఫు న్యాయవాదులు అక్కడే ఉండొచ్చా? అనే ప్రశ్నకు సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం రాబట్టదల్చుకుంది. ఇందుకోసం ఈ అంశంలో మీ స్పందన తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాజ్యాంగంలోని 20(3), 21, 22 అధికరణాల ప్రకారం సంక్రమించిన హక్కులమేరకు కేసుల విచారణ సందర్భంలో వ్యక్తులు తమ న్యాయవాదులను పోలీసులు, ఇంటరాగేషన్ అధికారుల సమక్షంలో హాజరుపర్చవచ్చని, ఈ మేరకు అనుమతి మంజూరుచేయాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యం న్యాయవాది షరీఫ్ మధార్ వేశారు. ఈ పిల్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం బుధవారం విచారించింది. లాయర్ మధార్ తరఫున సీనియర్ మహిళా న్యాయవాది మేనకా గురుస్వామిని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రన్ ప్రశ్నించారు. ‘‘పోలీసులు, దర్యాప్తు సంస్థలు ప్రశ్నించేటప్పుడు నేరారోపణలు ఎదుర్కొంటున్న పిటిషనర్లు భౌతికంగా హింసకు గురైన ఘటనలు ఉన్నాయా? దర్యాప్తు వేళ లాయర్లు తప్పనిసరిగా ఉండాలా?’’అని ప్రశ్నించారు. దీంతో లాయర్ ‘ఇండియా: హింసా సంబంధ 2019 వార్షిక నివేదిక’ను గుర్తుచేశారు. ‘‘పోలీస్, దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉన్నప్పుడు పిటిషనర్లు ఎదుర్కొంటున్న ఒత్తిడి, వేదన అంశాలను నివేదిక సవివరంగా వివరించింది. నేరాన్ని ఒప్పుకునేలా చేసేలా ప్రశ్నలు వేస్తే వాటిని లాయర్ సాయంతో పిటిషినర్ గుర్తించేందుకు, చేయని నేరాన్ని పొరపాటున ఒప్పుకున్నట్లు సమాధానాలు ఇచ్చే ప్రమాదకర స్థితిని లాయర్ తప్పించగలరు. ప్రస్తుతం లాయర్లను చాలా వరకు విచారణవేళ నిరాకరిస్తున్నారు. ఒకవేళ అనుమతించినా దూరంగా కూర్చోబెడుతున్నారు. తమ పిటిషనర్ను ఎలాంటి ప్రశ్నలను అడుగుతున్నారనేది లాయర్ వినిపించట్లేదు. పోలీసులు చేసే స్వీయ నేరాంగీకార ప్రయత్నాన్ని అడ్డుకునేలా పౌరులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ద్వారా సంక్రమించిన హక్కు ఉల్లంఘనకు గురవుతోంది. ఆర్టికల్ 22(1) ప్రకారం తన లాయర్ ద్వారా తనను తాను రక్షించుకునే, లాయర్ సలహాలు తీసుకునే హక్కులూ ఉల్లంఘనకు గురవుతున్నాయి’’అని లాయర్ వాదించారు. -
కాలం మారుతున్నా ప్రభుత్వం మారదా?
న్యూఢిల్లీ: దేశంలో మరణ శిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరణ శిక్ష పడిన దోషులకు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా శిక్ష అమలు చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆక్షేపించింది. కాలానుగుణంగా మారడానికి సిద్ధంగా లేదని తప్పుపట్టింది. దోషులకు ఉరిశిక్ష విధించడాన్ని రద్దు చేయాలని, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మరణ శిక్ష అమలు చేయాలని కోరుతూ సీనియర్ అడ్వొకేట్ రిషీ మల్హోత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. మరణ శిక్ష ఎలా అమలు చేయాలన్న సంగతి దోషికే వదిలివేయాలని పిటిషనర్ వాదించారు. ఉరిశిక్షా? లేక ప్రాణాంతక ఇంజెక్షనా?.. రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకొనే అవకాశం దోషికి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాంతక ఇంజెక్షనే సరైన విధానమని పేర్కొన్నారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉండగా, 49 రాష్ట్రాల్లో ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్ష అమలు చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఉరిశిక్ష అత్యంత క్రూరమైనది, అనాగరికమైనదని, దోషి ప్రాణం పూర్తిగా పోవడానికి మృతదేహాన్ని దాదాపు 40 నిమిషాలపాటు ఉరికొయ్యకు వేలాడదీస్తారని చెప్పారు. ఉరిశిక్షతో పోలిస్తే ఇంజెక్షన్ విధానంలో ప్రాణం త్వరగా పోతుందని, ఇది మానవీయంగా, గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అది ప్రభుత్వ విధాన నిర్ణయం మరణ శిక్ష అమలు చేసే విషయంలో అడ్వొకేట్ రిషీ మల్హోత్రా సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదికి జస్టిస్ సందీప్ మెహతా స్పష్టంచేశారు. సదరు న్యాయవాది స్పందిస్తూ... శిక్ష విషయంలో దోషికి ఆప్షన్ ఇవ్వడం సాధ్యం కాదని కోర్టుకు ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్లో స్పష్టంచేశామని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మెహతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలం మారుతున్నా ప్రభుత్వం మారదా? అని ప్రశ్నించారు. కాలానుగుణంగా ప్రభుత్వం మారకపోవడమే అసలు సమస్య అని అన్నారు. దోషికి ఉరి ద్వారా మరణ శిక్ష అమలు చేయడం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అఫిడవిట్లో ప్రస్తావించామని న్యాయవాది గుర్తుచేశారు. ఈ విషయంలో 2023 మే నెలలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును ప్రస్తావించారు. మరణశిక్ష ఎలా అమలు చేయాలన్నదానిపై సమీక్ష కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి పేర్కొన్నట్లు ఆ ఉత్తర్వులో కోర్టు వెల్లడించింది. కమిటీ ఏర్పాటు అంశం ఏమైందన్న సంగతిని ప్రభుత్వం వద్ద ఆరా తీస్తానని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. దాంతో తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వాన్ని ఆదేశించలేంఅడ్వొకేట్ రిషీ మల్హోత్రా 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉరిశిక్ష రద్దుకు లా కమిషన్ మొగ్గుచూపిందని పేర్కొన్నారు. 187వ నివేదికలో ఇదే అంశాన్ని ప్రస్తావించిందని తెలిపారు. ఇప్పుడున్నర ఉరిశిక్ష స్థానంలో తక్కువ నొప్పితో కూడిన శిక్ష విధానాలను అమల్లోకి తీసుకురావాలని వాదించారు. ప్రాణాంతక ఇంజెక్షన్ లేదా తుపాకీతో కాల్చడం లేదా విద్యుత్ షాక్ ఇవ్వడం లేదా గ్యాస్ చాంబర్లోకి పంపించడం విధానాలను సూచించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అఫిడవిట్ సమర్పించింది. ఉరిశిక్షను రద్దు చేయలేమని తేల్చిచెప్పింది. ఈ కేసులో తాజాగా మరోసారి విచారణ జరిగింది. మరణశిక్షను అమలు చేసే విషయంలో ఒక కచ్చితమైన విధానం పాటించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించలేమని ధర్మాసనం వెల్లడించింది. -
నేడు కర్నూలుకు వస్తున్నా: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: గురువారం(నేడు) ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. ‘ఈనెల 16న నేను ఆంధ్రప్రదేశ్లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తా. ఆ తర్వాత కర్నూలులో విద్యుత్, రైల్వే, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలు, తదితర రంగాలకు సంబంధించిన రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు నిర్వహించే శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాల్లో పాల్గొంటాను’ అని ప్రధాని తెలిపారు. -
సార్ను కాదు.. మీ సోదరుడిని
న్యూఢిల్లీ: మహిళా శక్తే దేశానికి బలం, రక్షణ కవచం, స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తనను సార్ అని పిలవొద్దని, సోదరుడిగా సంబోధించాలని బిహార్కు చెందిన బీజేపీ బూత్ స్థాయి మహిళా కార్యకర్తకు సూచించారు. బిహార్లో నవంబర్ 14న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయని, అదేరోజు ప్రజలు మరో దీపావళి నిర్వహించుకోబోతున్నారని స్పష్టంచేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. తమ కూటమి విజయంలో మహిళలే కీలకపాత్ర పోషించబోతున్నారని తెలిపారు. బిహార్ బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోదీ బుధవారం వర్చువల్గా సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి నమో యాప్ ద్వారా వారితో సంభాషించారు. ప్రజాస్వామ్య వేడుకలో మహిళలంతా ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ గుంపులుగా వెళ్లి ఓటు వేయాలని, పాటలు పాడుతూ, థాలీలు(గిన్నెలు) మోగిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. బిహార్ ప్రజలకు ఈసారి డబుల్ దీపావళి వస్తోందని వ్యాఖ్యానించారు. సోదరీమణులు, ఆడబిడ్డల ఆశీస్సులతో మరోసారి అధికారంలోకి రాబోతున్నామని స్పష్టంచేశారు. నా తరఫున గ్యారంటీ ఇవ్వండి భాయి దూజ్ పండుగ సందర్భంగా ఈ నెల 23న సోదరీమణుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. లఖ్పతీ దీదీలను, డ్రోన్ దీదీలను గౌరవించుకోవాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు తెలియజేయాలని, వారికి అవగాహన కల్పించాలని కోరారు. ‘ఏక్జుట్ ఎన్డీఏ, ఏక్జుట్ బిహార్(ఐక్య ఎన్డీఏ, ఐక్య బిహార్)–ఇసే బనేగీ సుశాసన్ కీ సర్కార్’ అనే నినాదాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చారు. మరోసారి సుపరిపాలన అందిస్తామన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ఎన్నికల్లో కచ్చితంగా విజయం లభిస్తుందన్నారు. ప్రతి బూత్ స్థాయి కార్యకర్త ఒక మోదీయేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తన తరఫున ప్రజలకు గ్యారంటీ ఇవ్వాలని సూచించారు. పథకాలకు సంబంధించిన వీడియోలను అందరికీ చూపించాలన్నారు. బిహార్లో గతంలో జంగిల్రాజ్ రాజ్యమేలిందని, అప్పటి పరిస్థితుల గురించి నేటి యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్జేడీ పాలనపై విరుచుకుపడ్డారు. బిహార్లో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మళ్లీ నక్సలైట్ల చేతికి అప్పగించవద్దని ప్రజలను కోరారు. ఆర్జేడీ, కాంగ్రెస్ల నుంచి బిహార్ను రక్షించుకొనే బాధ్యత ప్రజలపైనే ఉందని మోదీ ఉద్ఘాటించారు. బిహార్లో నవంబర్ 6, 11న అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
‘ఓటుకు కోట్లు’పై నేడు సుప్రీం తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో దాఖలైన ‘ఓటుకు కోట్లు’కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద విచారణ చేపట్టాలని కోరుతూ 2021 జూలై 22న రేవంత్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ అంతకుముందు ఏప్రిల్ 13న సండ్ర వెంకట వీరయ్య కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లపై తాజాగా బుధవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని గతంలో బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి వారి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం తొలుత వాదనలు వినిపించారు. అనంతరం రేవంత్రెడ్డి తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహిత్గీ సుమారు గంటకుపైగా వాదనలు వినిపించారు. ఏసీబీ కేసు అక్రమం: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై గతంలో దాఖలైన కేసు చెల్లుబాటు కాదని రోహత్గీ వాదించారు. ఈ కేసులో ముందుగా రేవంత్రెడ్డిని ట్రాప్ చేసిన తర్వాతే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎఫ్ఐఆర్ను నమోదు చేసిందని చెప్పారు. ఏసీబీ ట్రాప్ అక్రమమని పేర్కొన్నారు. 2015లో అమలుల్లో ఉన్న అవినీతి నిరోధక చట్టాలను అనుసరించి లంచం ఇవ్వడం నేరం కూడా కాదన్నారు. తమ కేసు 2015లో దాఖలైనందున, ఆనాటి చట్టాలే వర్తిస్తాయని చెప్పారు. మరోవైపు.. అప్పట్లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన రేవంత్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు కాబట్టి మరోసారి తమ వైపు వాదనలు వినాలని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం ధర్మాసనాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. గురువారం వాదనల అనంతరం తీర్పును వెలువరించనుంది. -
మందులు నాసి..ప్రాణాలు తీసి!
విషపూరిత దగ్గు మందు సేవించి మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో పిల్లల మరణాలు సంభవించిన ఘటనతో నాణ్యత లేని మందుల గురించి దేశవ్యాప్తంగా చర్చ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఈ ఏడాది జనవరి – ఆగస్టు మధ్య నిర్వహించిన నాన్–స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్స్ (ఎన్ఎస్క్యూడీ) పరీక్షల్లో 1,184 మందులు నాణ్యత లేనివిగా తేలింది. వీటిలో ట్యాబ్లెట్స్ 51%, ఇంజెక్షన్లు 18%, సిరప్స్ 11% ఉన్నాయి. నియంత్రణ సంస్థలు నిర్దేశించినట్టుగా నాణ్య త, భద్రత, సామర్థ్య ప్రమాణాలు లేని ఔషధాలను ఎన్ఎస్క్యూడీగా పరిగణిస్తారు. 2019తో పోలిస్తే ఎన్ఎస్క్యూడీ పరీక్షల్లో నాసిరకమైనవని తేలిన ఔషధాల సంఖ్య దాదాపు మూడింతలు కావడం ఆందోళన కలిగించే అంశం. మనదేశంలో తయారైన దగ్గు సిరప్స్ 2023లో గాంబియాలో డజన్ల కొద్దీ పిల్లల మరణాలకు కారణమై వివాదానికి దారితీసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టులో లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 5 ఏళ్లలో నాణ్యత లేని ఔషధాల సంఖ్య పెరుగుతోంది. 2024–25లో మొత్తం 1.16 లక్షలకుపైగా ఔషధాల శాంపిళ్లు పరీక్షించగా.. 3,104 నాణ్యత లేనివిగా తేలాయి. నకిలీ / కల్తీగా గుర్తించినవి 245. కల్తీ మందులపై పెడుతున్న కేసులు కూడా ఏటా పెరుగుతున్నాయి. నకిలీ మందులను అరికట్టడానికి.. కేంద్ర ప్రభుత్వం బార్ కోడ్ / క్యూఆర్ కోడ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఔషధాల లేబుళ్లు లేదా వీలున్న చోట బార్ కోడ్ ద్వారా.. ఆ ఔషధానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలి. పశ్చిమ బెంగాల్లో ఎక్కువకేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) నివేదిక ప్రకారం.. గత మూడేళ్లలో నాణ్యత లేని మందులకు సంబంధించి కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రం పశ్చిమబెంగాల్. అత్యధిక కేసులు (శాతాల్లో) నమోదైన రాష్ట్రాలు.. -
నిన్న మల్లోజుల.. నేడు ఆశన్న
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ హైదరాబాద్: మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోగా... అదే బాటలో మరో అగ్రనేత,కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ముందు లొంగిపోనున్నట్లు తెలిసింది. ఆయనతోపాటు దాదాపు 60 మంది వరకు లొంగిపోతారని సమాచారం. వీరంతా ఇప్పటికే జగదల్పూర్కు చేరుకున్నట్లు చెబుతున్నారు. కీలక మహిళా మావోయిస్టు రణిత కూడా లొంగిపోయే వారిలో ఉన్నట్టు తెలుస్తోంది. తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించి వీరంతా జనజీవన స్రవంతిలో కలవనున్నారు. మరోవైపు బుధవారం ఛత్తీస్గఢ్లోని వేర్వేరు జిల్లాల్లో మొత్తం 78 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా జిల్లాలో 27 మంది లొంగిపోగా, ఇందులో పది మంది మహిళా మావోలు ఉన్నారు. కాంకేర్ జిల్లాలో 32 మంది మహిళా మావోయిస్టులతో కలిపి మొత్తంగా 50 మంది అజ్ఞాతం వీడారు. ఇందులో మావోయిస్టు పార్టీలో కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన రాజమన్ మండావి అలియాస్ రాజ్మోహన్, రాజు సలామ్ అలియాస్ శివప్రసాద్ కూడా ఉన్నారు. 50 మంది మావోయిస్టుల బృందాన్ని ప్రత్యేక బస్సులో కాంకేర్ తరలించి అక్కడ లొంగుబాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ 7 ఏకే 47లతో పాటు మరో 17 ఇతర ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇక కొండగావ్ జిల్లాలో మరో మహిళా మావోయిస్టు లొంగిపోయింది. మల్లోజుల మార్గంలో.. శాంతిచర్చలపై ముందుగా అభయ్ పేరుతో మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖ మార్చి 28న వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నార్త్ వెస్ట్ సబ్జోనల్ బ్యూరో ఇన్చార్జిగా రూపేశ్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ నుంచి వరుసగా మూడు లేఖలు విడుదలయ్యాయి. అంతేకాక ఒక యూట్యూబర్కు వీడియో ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అన్ని లేఖల్లోనూ ‘శాంతి చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొందాం. తుపాకీ కంటే చర్చల ద్వారానే సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుంది’అనే అభిప్రాయాన్నే ఆశన్న వ్యక్తంచేశారు. దీంతో మల్లోజుల, ఆశన్న ఒకేదారిలో ఉన్నారనే అభిప్రాయం ఏర్పడింది. అందుకు తగ్గట్టే మల్లోజుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించిన మరుసటి రోజే ఆశన్న సైతం లొంగిపోతుండట గమనార్హం.యాక్షన్లలో దిట్ట తక్కెళ్లపల్లి వాసుదేవరావు స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట. హæన్మకొండలో పాలిటెక్నిక్ చదువుతూ రాడికల్ ఉద్యమాల వైపు ఆకర్షితుడై 1989లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ) చేపట్టిన పలు కీలక యాక్షన్లలో సభ్యుడిగా ఉన్నారు. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో 1999 సెపె్టంబర్ 4న ఐపీఎస్ అధికారి ఉమేశ్చంద్రను దారికాచి కాల్చి చంపిన ఘటన, ఆ తర్వాత 2000 మార్చి 7న అప్పటి ఉమ్మడి ఏపీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డిని ఘట్కేసర్ దగ్గర బాంబు పేల్చి చంపిన టీమ్లోనూ ఆశన్న ఉన్నారు. అంతేకాక 2003 అక్టోబర్లో తిరుపతి సమీపంలోని అలిపిరి దగ్గర సీఎం నారా చంద్రబాబునాయుడిని లక్ష్యంగా చేసుకుని క్లెమోర్ మైన్స్ పేలి్చన తొమ్మిది మంది సభ్యుల బృందానికి ఆశన్నే నాయకత్వం వహించారు. వేర్వేరు లొంగుబాట్లు.. ప్లాన్లో భాగమే దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ పూర్తిగా బలహీనపడిందనే అభిప్రాయం కలిగించడానికే అగ్రనేతల లొంగుబాటు కార్యక్రమాలను వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ ఏపీ, తెలంగాణలో ఉనికి కోల్పోయింది. ఏఓబీలో వరుస ఎన్కౌంటర్లలో చలపతి, గాజర్ల గణేశ్, మోడెం బాలకృష్ణ వంటి కేంద్ర కమిటీ సభ్యులతో పాటు చైతే వంటి మహిళా అగ్రనేతలు చనిపోయారు. ఇక ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో సుధాకర్, మైలారపు ఆడేళ్లు చనిపోయారు. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లలో ప్రయాగ్ మాంఝీ, అంజు సోరేన్ మృతి చెందారు. దీంతో దండకారణ్యం అందునా అబూజ్మడ్, దక్షిణ బస్తర్కే మావోయిస్టు పార్టీ పరిమితమైంది. ఇక్కడ కూడా ఆ పార్టీ పట్టు కోల్పోయిందనే విషయం ప్రపంచానికి చాటేందుకే అబూజ్మాడ్లో మహారాష్ట్ర కేడర్కు చెందిన మావోలంతా మల్లోజుల వెంట లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇదే మాడ్ ఏరియాలో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన మావోయిస్టులంతా ఆశన్నతో కలిసి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయ్ ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అంతకు మూడు రోజుల ముందు దక్షిణ బస్తర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అగ్రనేతలు హైదరాబాద్లో లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు కీలక నేతలంతా మాడ్ అడవుల్లోనే తలదాచుకు న్నారు. అక్కడి నుంచి సురక్షితంగా లొంగిపోవాలంటే వారి ముందున్న ప్రత్యామ్నాయాలు మహరాష్ట్ర, ఛత్తీస్గఢ్ మాత్రమేనని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. -
‘చెత్త రోడ్లు..మేమెందుకు కట్టాలి ట్యాక్స్’.. భీష్మిస్తున్న నగర వాసులు
సాక్షి,బెంగళూరు: భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు నగరం మరోసారి మౌలిక సదుపాయాల సమస్యలతో చర్చకు దారితీసింది. నగరంలోని అధ్వాన్న రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే పలు మార్లు ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా, మౌలిక సదుపాయాలు లేకపోతే తాము ఆస్తిపన్ను ఎందుకు చెల్లించాలి అంటూ పౌరులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.నగరంలో గుంతలు పడిన రోడ్ల విషయంలో ప్రభుత్వ చర్యలు వేగవంతం చేసింది. రోడ్లను గుర్తించి మరమత్తులు కూడా చేపట్టింది. అయినా నగర వాసులు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోతే ఆస్తిపన్ను కట్టబోమని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. అలా ఇప్పటి వరకు 13వేల గుంతలు పూడ్చినట్లు తెలిపారు. అలాగే, 550 కిలోమీటర్ల ప్రధాన రహదారుల అభివృద్ధికి వెయ్యి కోట్ల యాక్షన్ ప్లాన్ను రూపొందించమని అధికారులను ఆదేశించారు.బెంగళూరులోని రోడ్ల దుస్థితిపై వ్యక్తిగత పన్ను చెల్లింపు దారుల ఫోరం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసింది. లేఖలో, గ్రేటర్ బెంగళూరు మునిసిపల్ సంస్థలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే, ఆస్తిపన్ను వసూలు చేయకుండా ఉండాలని సూచించారు.వర్తూర్-బలగేరె-పనతూర్ ప్రాంతాల్లో అసంపూర్ణ, శాస్త్రీయతలేని రోడ్ల పనులు, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షాకాలంలో వరదలు, డ్రైనేజ్ పూర్తికాకముందే రోడ్ల పనులు ప్రారంభించడం, కొత్త రోడ్లు త్వరగా దెబ్బతినే ప్రమాదం, వైట్ టాపింగ్, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ పనులు ప్రజల జీవితాలను ప్రభావితం చేయడం వంటి అంశాలను హైలెట్ చేశారు. మౌలిక సదుపాయాలు లేకుండా ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయడం అన్యాయం. బెంగళూరు ఐటీ హబ్గా గుర్తింపు పొందినప్పటికీ ‘గుంతలరోడ్లు, ట్రాఫిక్ జామ్, గార్బేజ్ సిటీ’ వంటి పేర్లు నగర గౌరవాన్ని తగ్గిస్తున్నాయని వాపోయారు. -
జాక్పాట్ కొట్టేసింది..ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్కు ఎమ్మెల్యే సీటు!
పాట్నా: ప్రముఖ ఫోక్ సింగ్ మైథిలీ ఠాకూర్ జాక్ పాట్ కొట్టేశారు. బుధవారం బిహార్ బీజేపీ అభ్యర్థుల జాబితాలో స్థానం సంపాదించారు. 12 మంది అభ్యర్థులు, వారు పోటీ చేసే నియోజక వర్గాలను బీజేపీ బుధవారం ప్రటించింది. రెండోసారి విడుదల చేసిన బిహార్ బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ (Maithili Thakur), మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు ఉన్నారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ పోటీ చేయనుండగా, బక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా పోటీ చేస్తారు. బిహార్ బీజేపీ రెండవ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 12 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించగా, అలీనగర్ నియోజకవర్గం నుంచి ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్కు అవకాశం కల్పించారు. అత్యంత కీలకమైన అలీనగర్ స్థానాన్ని మైథిలీ ఠాకూర్కు కట్టబెట్టే విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. మిథిలాంచల్ ప్రాంతానికి చెందిన మైథిలీ ఠాకూర్ ఈ ప్రాంతపు సాంస్కృతిక ప్రతినిధిగా గుర్తింపు పొందారు. మిథిలాంచల్ అనేది భారత్–నేపాల్ మధ్య విస్తరించిన సాంస్కృతిక ప్రాంతం. సీతమ్మతల్లి జన్మస్థలంగా ఈ ప్రాంత స్థల పురాణాలు చెబుతున్నాయి. అలీనగర్ నియోజకవర్గం, దర్భంగా జిల్లాలో ఉంది. ఇది కూడా మిథిలాంచల్లో భాగమే. అందుకే మైథిలీ ఠాకూర్ను ‘మిథిలా కుమార్తె’గా అభివర్ణిస్తూ, ప్రాంతీయ గౌరవాన్ని, యువతలో ఆదరణను ఆకర్షించేందుకు బీజేపీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించింది.మైథిలీ ఠాకూర్ ఇంటర్ చదువుకున్న తర్వాత, చిన్న వయస్సులోనే ఫోక్ సింగర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. భోజ్పురి, మైథిలీ, హిందీ భక్తి పాటలతో ప్రజల్ని ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె పాడిన పాటలకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ద్వారా యువతను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం జేడీయూ చేతిలో ఉండగా, ఈసారి పొత్తు కారణంగా బీజేపీకి దక్కింది. #WATCH | Ahead of #BiharElection2025, folk and devotional singer Maithili Thakur joins the BJP in Patna, Bihar. pic.twitter.com/qkY1ocUsIZ— ANI (@ANI) October 14, 2025క్లాసికల్, ఫోక్ సంగీతంలో శిక్షణ పొందిన ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ బిస్మిల్మా ఖాన్ యువ పురస్కారం పొందారు. ఓవైపు ఫోక్ సింగర్గా రాణిస్తూనే రాజకీయాల్లో రాణించాలని కోరికగా ఉందంటూ పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా, ఆమె తన అభిరుచులకు అనుగుణంగా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ,బిహార్ సీఎం నితీష్ కుమార్ అంటే తనకెంతో ఇష్టమన్నారు. వారిలాగే తానుకూడా సమాజానికి సేవ చేయడానికి, బిహార్ అభివృద్ధికి తోడ్పడటానికి నేను ఇక్కడ ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు.కాగా,మైథిలీ ఠాగూర్ గతంలో ప్రధాన మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2024 జనవరిలో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాడిన ‘మా శబరి’పాటను ప్రధాని ప్రశంసించారు. अयोध्या में प्राण-प्रतिष्ठा का अवसर देशभर के मेरे परिवारजनों को प्रभु श्री राम के जीवन और आदर्शों से जुड़े एक-एक प्रसंग का स्मरण करा रहा है। ऐसा ही एक भावुक प्रसंग शबरी से जुड़ा है। सुनिए, मैथिली ठाकुर जी ने किस तरह से इसे अपने सुमधुर सुरों में पिरोया है। #ShriRamBhajan…— Narendra Modi (@narendramodi) January 20, 2024 -
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. సీఎం ఎదుట లొంగిపోనున్న ‘ఆశన్న’
ముంబై: మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బ. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. గురువారం (అక్టోబర్ 16) ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట సరెండర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మావోయిస్టు ఉద్యమానికి ఓ కుదుపేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మావోయిస్టు అగ్రనేత ఆశన్న (వాసుదేవ్ రావు) నేతృత్వంలోని 70 మంది మావోయిస్టులు జగదల్పూర్ చేరుకుని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని జాతీయ మీడియా కథనాలు ధృవీకరిస్తున్నాయి. తమ ఆయుధాలను సైతం అప్పగించే ఈ బృందంలో డీకేఎస్డ్సీ సభ్యులు రాజమన్, రనితలతో సహా ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన పలువురు. డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ పార్టీ కమిటీల సభ్యులు ఉన్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే బుధవారం ఉదయం మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అత్యంత మేధావి, ఆలోచన పరుడిగా పేరుపొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మల్లోజులతో పాటు ఆయన నాయకత్వంలో 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. -
Tamil Nadu: హిందీ హోర్డింగులు, సినిమాలపై నిషేధం!
చెన్నై: త్రిభాషా సూత్రంపై తమిళనాట కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిందీ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు నడుంబిగించింది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీలో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి.న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశంఇండియా టుడే వెల్లడించిన వివరాల ప్రకారం తమిళానాడు అంతటా హిందీ బోర్డులు, హోర్డింగ్లు, హిందీ సినిమాలు, హిందీ పాటల ప్రదర్శనను త్వరలో నిలిపివేయనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనిని చూస్తుంటే త్రిభాషా సూత్రం అమలుపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య నెలకొన్న విభేదాలు మరింత తీవ్రం అయ్యేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో హిందీ భాషను నిషేధించే లక్ష్యంతో అసెంబ్లీలో ఒక బిల్లును త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రతిపాదిత చట్టం రూపకల్పనలోని న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు న్యాయ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.హిందీని రుద్దడానికి వ్యతిరేకంగా..ఈ బిల్లును భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని డీఎంకేతో సహా అనేక రాజకీయ పార్టీలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. దీనిని అడ్డుకోవడంలో భాగంగానే డీఎంకే ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతున్నదని సమాచారం. హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా శాసనసభ ఇటీవల ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.తమిళ భాషను కాపాడటమే లక్ష్యంగా..ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతూ, రాష్ట్రపతికి పార్లమెంటరీ కమిటీ నివేదించిన సిఫారసులు తమిళం సహా ఇతర రాష్ట్రాల భాషలకు, వాటిని మాట్లాడే ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. అప్పట్లో ప్రధాని నెహ్రూ ఇచ్చిన హామీ ప్రకారం హిందీయేతర రాష్ట్రాలు కోరుకునేంత వరకు ఆంగ్లం అధికారిక భాషగా కొనసాగుతుందని తెలిపారన్నారు. ఈ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. ప్రతిపాదిత బిల్లులోని వివరాల ప్రకారం బహిరంగ ప్రదర్శనలలో అంటే హోర్డింగులు, బోర్డులు, వినోద ప్రదర్శనలు, సినిమాలు పాటలు ఈ తరహా మాధ్యమాలలో హిందీ వాడకాన్ని నిషేధించనున్నారు. ఈ బిల్లు రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటుందని, తమిళ భాష గుర్తింపును కాపాడటమే లక్ష్యంగా బిల్లును రూపొందించనట్లు అధికారులు తెలిపారు. -
Bihar Election: ఎన్నికల బరిలో ప్రముఖ గాయకుని భార్య?
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ నేతలతో పాటు పలువురు గాయనీగాయకులు, నటులు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా భోజ్పురి గాయకుడు, నటుడు ఖేసరి లాల్ యాదవ్ ఈ ఎన్నికల్లో తన పాత్రపై ఏమిటనేది వెల్లడించారు. తాను ఆర్జేడీ తరపున ప్రచారం చేయనున్నానని, తన భార్యను ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టాలని అనుకుంటున్నానని తెలిపారు. #WATCH | Patna: On the Bihar Assembly elections, Bhojpuri singer and actor Khesari Lal Yadav says, "I want my wife to contest the election, I have been trying to convince her for the last 4 days. If she agrees, we will file the nomination; otherwise, I will only campaign and try… pic.twitter.com/EjzOgdduS3— ANI (@ANI) October 15, 2025భోజ్పురి నటుడు ఖేసరి లాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తన భార్య చేత పోటీ చేయించాలని అనుకుంటున్నానని, ఇందుకోసం ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఒకవేళ ఆమె ఇందుకు అంగీకరిస్తే, తమ నామినేషన్ దాఖలు చేస్తామని, లేనిపక్షంలో తాను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. ఇటు తేజస్వి యాదవ్, అటు అఖిలేష్ యాదవ్తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, పోటీ చేసే విషయంలో రెండు పార్టీల నుండి తనపై ఒత్తిడి ఉన్నదని ఖేసరి లాల్ యాదవ్ పేర్కొన్నారు. తన భార్య అంగీకరిస్తే, ఆమె చేత ఖచ్చితంగా పోటీ చేయిస్తానని తెలిపారు. -
ఎయిర్ బ్యాగ్.. పిల్లాడి ప్రాణం తీసింది!
ప్రమాదాలు ఎప్పుడు, ఎలా సంభవిస్తాయో చెప్పలేం. అందుకే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలంటారు పెద్దోళ్లు. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లల విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం. బైకులు, కార్లలో పిల్లలను ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తుండడం ఇటీవల కాలంలో పెరిగింది. ఇదిలావుంచితే కారులో తండ్రి ఒడిలో కూర్చున్న బాలుడు ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని ఆలత్తూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కారులో హఠాత్తుగా ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ఆరేళ్ల పిల్లాడు చనిపోయాడు.వివరాల్లోకి వెళ్తే.. కల్పకం (Kalpakkam) సమీపంలోని పుదుపట్టిణం గ్రామానిక చెందిన వీరముత్తు, తన భార్య, కుమారుడు, మరో ఇద్దరితో కలిసి సోమవారం రాత్రి రెంటల్ కారులో చెన్నైకి బయలు దేరారు. విఘ్నేష్(26) అనే డ్రైవర్ కారు నడుపుతున్నాడు. వీరముత్తు తన ఆరేళ్ల కొడుకు కవిన్ను ఒళ్లో పెట్టుకుని ముందు సీట్లో కూర్చుకున్నాడు.తిరుపోరూర్ సమీపంలోని ఆలత్తూర్ (Alathur) పెట్రోల్ బంక్ వద్ద వీరికి కారుకు ప్రమాదం సంభవించింది. ముందెళున్న కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా కారులోని ఎయిర్బ్యాగ్ (airbag) కవిన్ ముఖంపై వేగంగా తెరుచుకోవడంతో అతడు కుప్పకూలిపోయాడు. బాలుడిని వెంటనే తిరుపోరూర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పాడు. కుమారుడి ఆకస్మిక మరణంతో వీరముత్తు, అతడి భార్య హతాశులయ్యారు.ముందు వెళ్లిన కారు ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా సడన్గా కుడివైపు తిరగడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు గుర్తించారు. ఇందులో ఉన్న వ్యక్తిని తిరుపోరూర్ సమీపం పయ్యనూర్ గ్రామానికి చెందిన సురేష్ (48)గా గుర్తించారు. అతడు కారులో పయ్యనూర్ నుంచి తిరుపోరూర్ వెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపి బాలుడి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలతో సురేష్పై తిరుపోరూర్ (Thiruporur) పోలీసులు కేసు నమోదు చేశారు.నివేదిక వచ్చాకే..బాలుడి మృతదేహానికి చెంగల్పట్టు మెడికల్ కాలేజీలో పోస్ట్మార్టం నిర్వహించారు. కవిన్ మరణానికి గల వాస్తవ కారణాలు పోస్ట్మార్టం నివేదిక వచ్చాక వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. అతడి ఒంటిపై కనిపించే గాయాలేవీ లేవన్నారు. షాక్, అంతర్గత రక్తస్రావం కారణంగా మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కారుతో ఓవరాక్షన్.. వీడియో వైరల్ -
విజయ్ మౌనం.. అయోమయంలో టీవీకే, అభిమానులు!
కరూర్ తొక్కిసలాట ఘటన.. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్ గేమ్ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి. ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది. కట్ చేస్తే.. తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ. అయితే.. కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జితో సిట్ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
Bihar Polls: 57 మంది అభ్యర్థులతో జేడీయూ తొలి జాబితా
పట్నా: బీహార్లో నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్ఎడీఏ)లో తర్జన భర్జనలు జరుగుతుండగా, ఇదే సమయంలో సీఎం నితీష్ కుమార్కు చెందిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)బుధవారం 57 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది.రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే కీలక అభ్యర్థుల్లో సోన్బార్సా నుండి రత్నేష్ సదా, మోర్వా నుండి విద్యాసాగర్ నిషాద్, ఎక్మా నుండి ధుమల్ సింగ్, రాజ్గిర్ నుండి కౌశల్ కిషోర్ ఉన్నారు. ఈ జాబితాలో పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విజయ్ కుమార్ చౌదరి.. సరాయ్ రంజన్ నుంచి పోటీ చేయనున్నారు. Janata Dal United (JDU) releases the first list of candidates for the Bihar Assembly Elections. pic.twitter.com/Zb2G7PZvv0— ANI (@ANI) October 15, 2025ఆలంనగర్ నుంచి నరేంద్ర నారాయణ్ యాదవ్, బీహారీగంజ్ నుంచి నిరంజన్ కుమార్ మెహతా, సింగేశ్వర్ నుండి రమేష్ రిషి దేవ్, మాధేపురా నుండి కవితా సాహా, మహిసి నుండి గండేశ్వర్ షా, కుశేశ్వరస్థాన్ నుంచి అతిరెక్ కుమార్ ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇతర ప్రముఖ అభ్యర్థుల విషయానికొస్తే అనంత్ కుమార్ సింగ్ (మొకామా), శ్యామ్ రజక్ (ఫుల్వారీ), కౌశల్ కిషోర్ (రాజ్గిర్), ధుమల్ సింగ్ (ఎక్మా), మహేశ్వర్ హజారీ (కళ్యాణ్పూర్), రత్నేష్ సదా (సోన్బర్సా), సంతోష్ కుమార్ నిరాలా (రాజ్పూర్), మదన్ సాహ్ని (బహదూర్పూర్), శ్రీష్వా సింఘ్పూర్పూర్), (గైఘాట్) విద్యా సాగర్ సింగ్ నిషాద్.. మోర్వా నుంచి పోటీ చేస్తున్నారు. -
దీపావళి సెలవులు: ఏ రాష్ట్రాల్లో ఎన్ని రోజులు?.. తెలంగాణ, ఏపీల సంగతేంటి?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సందడి మొదలయ్యింది. దీపాల పండుగను దేశమంతటా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పాఠశాలలకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటిస్తుంటారు. దీపావళి వేళ ఏ రాష్ట్రంలో ఎన్నిరోజులు సెలవులు ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.ఢిల్లీలో..దేశ రాజధాని ఢిల్లీలోని దీపావళి వేడుకలను అక్టోబర్ 20న జరుపుకుంటున్నారు. గోవర్ధన్ పూజకు అక్టోబర్ 22న జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కాగా దీపావళి సందర్భంగా నోయిడాలోని పాఠశాలలను అక్టోబర్ 20 నుండి 23 వరకు మూసివేయనున్నారు. గురుగ్రామ్లో అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 23 వరకూ సెలవులు ప్రకటించారు.ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని పాఠశాలలకు అక్టోబర్ 20 నుండి 23 వరకు దీపావళి సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 24న పాఠశాలలను తిరిగి తెరవనున్నారు. అక్టోబర్ 19 ఆదివారం కావడంతో యూపీలోని విద్యార్థులు ఐదు రోజుల సెలవులు ఎంజాయ్ చేయనున్నారు. ఈ సారి చిన్నారులకు దీపాల పండుగను జరుపుకునేందుకు తగినంత సమయం దొరికింది.హర్యానా హర్యానాలోని పాఠశాలలకు అక్టోబర్ 19 నుండి 23 వరకు దీపావళి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.రాజస్థాన్రాజస్థాన్లోని పాఠశాలలకు దీపావళి సందర్భంగా అక్టోబర్ 13 నుండి 24 వరకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మొత్తం 12 రోజుల పాటు దీపావళి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.బీహార్ దీపావళి,ఛట్ పూజల సందర్భంగా బీహార్లోని పాఠశాలలు అక్టోబర్ 18 నుండి 29 వరకు మూసివేయనున్నారు. ఈ సెలవులను ఇంకా పొడిగించనున్నారని తెలుస్తోంది.పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోని పాఠశాలలను అక్టోబర్ 24 వరకు మూసివేయనున్నారు. స్థానిక విద్యార్థులు ఇటీవలే దుర్గా పూజ సెలవులను ఎంజాయ్ చేశారు.కర్ణాటకరాష్ట్ర సామాజిక, విద్యా సర్వేలో ఉపాధ్యాయులు పాల్గొనేందుకు వీలుగా కర్ణాటకలోని పాఠశాలలు అక్టోబర్ 18 వరకు మూసివేశారు ఇప్పుడు అదనంగా అక్టోబర్ 20 (నరక చతుర్దశి), అక్టోబర్ 22 (బలిపాడ్యమి/ దీపావళి) తేదీలలో పాఠశాలలు మూసివేయనున్నారు.జమ్ముకశ్మీర్ జమ్ముకశ్మీర్లోని అధికారులు వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. జమ్ము డివిజన్లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి పాఠశాల కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల ఆధారంగా పాఠశాలకు సెలవులు ప్రకటించనున్నారు.ఒడిశాదీపావళి, కాళి పూజ వేడుకల కోసం ఒడిశాలోని పాఠశాలలను అక్టోబర్ 20న మూసివేయనున్నారు.అసోందీపావళి, కాళి పూజ వేడుకల కోసం అక్టోబర్ 20న అసోంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.తెలుగు రాష్ట్రాలలో..రాబోయే దీపావళికి.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో ఒకేరోజు(అక్టోబర్ 20 సోమవారం) అధికారిక సెలవు ప్రకటించారు. అయితే దానికి ముందు రోజు ఆదివారం రావడంతో రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. -
హైవేపై ట్రాఫిక్ జామ్.. 500 మంది విద్యార్థులకు 12 గంటల నరకం..
ముంబై: మహారాష్ట్రలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై దాదాపు 12 గంటల పాటు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, దాదాపు 500 మంది విద్యార్థులు హైవేపై ట్రాఫిక్లో చిక్కుకుని అల్లాడిపోయారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుమజాము వరకు ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే, థానేలోని ఘోడ్బందర్ హైవేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. పాల్ఘర్ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం నుంచి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే సమయంలో పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు తమ ఇళ్లకు బయలుదేరారు. దీంతో, 5-10 తరగతులు విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. థానే, ముంబై వైపు నుంచి వస్తున్న వాహనాల రద్దీ కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విద్యార్థులంతా ట్రాఫిక్లోనే చిక్కుకుపోయారు.I challenge the gov. of Maharashtra Ministers to make a travel from Bhiwandi to Wada. The Mumbai Ahmedabad highway for all the reasons is always with hours of traffic snarls. Should even Industries function in Maharashtra any more? @AjitPawarSpeaks @mieknathshinde @Dev_Fadnavis pic.twitter.com/xSyeAoarJi— Vedang Dongre (@VedangDongre) October 14, 2025మంగళవారం సాయంత్రం నుంచి దాదాపు 12 గంటల పాటు ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో విద్యార్థులంతా ట్రాఫిక్లోనే ఉన్నారు. దీంతో, స్థానికులు వారికి ఆహారం అందించారు. చాలా మందికి ఆహారం, నీరు అందకపోవడంతో ఆవేదన చెందారు. విద్యార్థులంతా బిక్కుబిక్కుమంటూ రాత్రంతా రోడ్డుమీదే ఉన్నారు. ఈ కారణంగా వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ట్రాఫిక్లో చిక్కుకున్న విద్యార్థుల చివరి బస్సు బుధవారం ఉదయం బయటకు వచ్చినట్టు పిల్లల పేరెంట్ ఒకరు చెప్పుకొచ్చారు.वसई, मुंबई: मुंबई-अहमदाबाद महामार्ग पर, घोड़बंदर से लेकर वसई फाटा तक, आज भारी ट्रैफिक जाम की स्थिति देखी गई। मार्ग पर वाहनों की लंबी कतारें लगी हुई हैं, जिससे यात्रियों को भारी असुविधा का सामना करना पड़ रहा है। pic.twitter.com/a0mRI6VxFr— मुकेश त्रिपाठी- Mukesh Tripathi/✍️ (@mukesht37) October 13, 2025వాహనాల రద్దీ కారణంగా పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే, థానేలోని ఘోడ్బందర్ హైవేలో జరుగుతున్న మరమ్మతు పనుల కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. భారీ వాహనాలను మళ్లించడం వల్ల ఈ జామ్ ఏర్పడిందని.. దీని ఫలితంగా ముంబై-అహ్మదాబాద్ మార్గంలో అధిక ట్రాఫిక్ భారం ఏర్పడిందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. NH46, NH30, NH19, NH49...Every day you wake up, a new NH is in the news for construction quality issues, and that too usually within months of being built. Shri @nitin_gadkari, please give petrol a break from ethanol and sort out your dept first. pic.twitter.com/hvZMGHM4sy— THE SKIN DOCTOR (@theskindoctor13) October 14, 2025 -
Goa: గుండెపోటుతో మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
పణజీ: గోవా వ్యవసాయ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్(79) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పీటీఐ తెలిపిన వివరాల పణజీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని స్వస్థలం ఖడ్పబంద్లో మంత్రి రవి నాయక్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను పోండాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.అనంతరం కుటుంబ సభ్యులు నాయక్ మృతదేహాన్ని పోండాలోని ఖడ్పబంద్లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. మంత్రి రవి నాయక్కు నివాళులు అర్పించేందుకు పలువురు నేతలు, అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మంత్రి రవి నాయక్కు భార్య, ఇద్దరు కుమారులు, కోడలు, ముగ్గురు మనవరాళ్లు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. Saddened by the passing away of Shri Ravi Naik Ji, Minister in the Goa Government. He will be remembered as an experienced administrator and dedicated public servant who enriched Goa’s development trajectory. He was particularly passionate about empowering the downtrodden and…— Narendra Modi (@narendramodi) October 15, 2025ప్రధాని మోదీ సంతాపం‘గోవా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రవి నాయక్ మరణం బాధాకరం. గోవా అభివృద్ధి పథాన్ని సుసంపన్నం చేసిన అనుభవజ్ఞుడైన నేతగా, అంకితభావంతో కూడిన ప్రజా సేవకునిగా ఆయనను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంపై ఆయన ఆసక్తి చూపారు. ఓం శాంతి’ అని ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు.Saddened by the passing away of Shri Ravi Naik Ji, Minister in the Goa Government. He will be remembered as an experienced administrator and dedicated public servant who enriched Goa’s development trajectory. He was particularly passionate about empowering the downtrodden and…— Narendra Modi (@narendramodi) October 15, 2025గోవా ముఖ్యమంత్రి సంతాపంగోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. మంత్రి రవి నాయక్ మృతికి విచారం వ్యక్తం చేశారు. అతని నాయకత్వం, ప్రజా సేవ పట్ల అంకితభావం ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయన్నారు. ‘మన సీనియర్ నేత, క్యాబినెట్ మంత్రి రవి నాయక్ మరణం విచారకరం. గోవా రాజకీయాల్లో ప్రముఖునిగా, ముఖ్యమంత్రిగా దశాబ్దాలుగా ఆయన అంకితభావంతో పనిచేశారు. కీలక శాఖల్లో మంత్రిగా పనిచేసిన ఆయన ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన నాయకత్వం, వినయం ప్రజా సంక్షేమానికి చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం’ అని సావంత్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
బీహార్ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు
న్యూడిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత 48 గంటల వరకు(సైలెన్స్ పీరియడ్) ఎలాంటి బల్స్ ఎస్ఎంఎస్లు, ఆడియో మెసేజ్లు పంపరాదని ఈసీ హెచ్చరించింది. అలాగే టీవీ, కేబుల్ నెట్వర్క్లు, రేడియోల్లో, సినిమా హాల్లో ఎన్నికలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. అలాగే.. పోలింగ్నాడు ఆయా ప్రాంతంలో ఆడియో, విజువల్డిస్ప్లేలు నిషేధించినట్లు పేర్కొంది. సోషల్మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేటప్పుడు వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల వివరాలను పొందుబరచాలని ఆదేశించింది. ముందస్తు అనుమతులు తప్పనిసరి: రాజకీయ ప్రచార ప్రకటనలకు పార్టీలు తప్పనిసరిగా ముందుస్తు అనుమతులు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అభ్యర్థులు సోషల్ మీడియాతో సహా ఎల్రక్టానిక్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఏదైనా రాజకీయ ప్రకటనలు ప్రచురించడానికి లేదా ప్రసారం చేయడానికి ముందు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నుంచి ముందస్తు ధృవీకరణ పొందడం తప్పనిసరి అని తెలిపింది. ధృవీకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జిల్లా, రాష్ట్రస్థాయిలో పలుమీడియా సర్టిఫికేషన్, ఎంసీఎంసీలను ఏర్పాటు చేసినట్లు ఈసీ పేర్కొంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్కు ఇప్పటికే నామినేషన్లు స్వీకరిస్తున్నారు(అక్టోబర్ 10వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది). అక్టోబర్ 17వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ. నవంబర్ 6వ తేదీన ఫస్ట్ ఫేజ్లో భాగంగా 121 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అంత కంటే 48 గంటల ముందు ప్రచారం ముగుస్తుంది. ఇందులో పాట్నా, ముజఫర్పూర్, గోపాల్గంజ్, దర్భంగా, బక్సర్, బీహార్ షరీఫ్ లాంటి కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. మిగిలిన 123 స్థానాల రెండో ఫేజ్ పోలింగ్కు అక్టోబర్ 16న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అక్టోబర్ 23 దాకా నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 9వ తేదీన ప్రచారానికి చివరి తేదీ. నవంబర్ 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. నవంబర్ 14వ తేదీన.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది. -
నక్సల్స్పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా?
భారతదేశంలో నక్సల్స్/ మావోయిస్టులు లొంగిపోవడం అనేది నిరంతర ప్రక్రియ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాలు, ఇతర కొన్ని కారణాల వల్ల చాలా మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. అయితే ముఖ్య నేతలపై ఉండే భారీ నజరానా (రివార్డు)ను లొంగిపోయిన తర్వాత వారికి అందిస్తారు. ఈ నేపథ్యంలో లొంగిపోయిన నక్సల్స్కు ఇచ్చే నజరానాపై ఆదాయపు పన్ను (Income Tax) ఉంటుందా? అనే అనుమానం సహజంగా ఉత్పన్నమవుతుంది. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. తొలితరం మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను గడ్చిరోలి(మహారాష్ట్ర) పోలీసులకు లొంగిపోయారు. ఆయనపై రూ.6 కోట్ల వరకు రివార్డు ఉంది. తనతోపాటు మరో 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు.నక్సల్స్ లొంగుబాటు, నజరానానక్సల్స్కు ప్రభుత్వాలు ప్రకటించే లొంగుబాటు విధానంలో భాగంగా సాయుధ దళాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలనుకునే వారికి పునరావాసం కల్పిస్తారు. ఈ విధానంలో లొంగిపోయిన నక్సల్స్కు, ముఖ్యంగా కీలక స్థానాల్లో ఉండి లొంగిపోయేవారికి వారి స్థాయి, హింసాత్మక చర్యల తీవ్రత ఆధారంగా ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతి (నజరానా/రివార్డు) ఇస్తుంది. లొంగిపోయిన తర్వాత సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు, ఇల్లు కట్టుకోవడానికి, వృత్తిపరమైన శిక్షణ పొందడానికి వారికి ఇది ఆర్థిక సాయంగా ఉంటుంది.ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది?భారతదేశ ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం ప్రభుత్వాల నుంచి పొందే కొన్ని రకాల అవార్డులు లేదా నజరానాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.సెక్షన్ 10(17A): ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(17A) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా సంస్థ ద్వారా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన అవార్డు లేదా నజరానా కింద నగదు రూపంలో, ఇతర రూపంలో పొందిన ఏదైనా చెల్లింపులపై పన్ను మినహాయింపు ఉంటుంది.ప్రభుత్వ లక్ష్యం: నక్సల్స్ లొంగుబాటు అనేది ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన ఒక కార్యక్రమం. నక్సలిజాన్ని అంతం చేయడానికి, శాంతిని పునరుద్ధరించడానికి, హింసను విడిచిపెట్టినవారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఈ రివార్డులు, పునరావాస విధానాలు రూపొందించారు. ఈ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే నక్సల్స్ లొంగుబాటుపై ఇచ్చే నజరానా ప్రజా ప్రయోజనం కిందకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పునరావాస విధాన మార్గదర్శకాలు, కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారిక నోటిఫికేషన్లను పరిశీలించవలసి ఉంటుంది.ఇదీ చదవండి: ధన త్రయోదశికి ముందే అంతులేని ధరలు