‘42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలి’ | Communities of BC hold a grand dharna at Jantar Mantar in Delhi | Sakshi
Sakshi News home page

‘42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలి’

Dec 15 2025 4:43 PM | Updated on Dec 15 2025 6:56 PM

Communities of BC hold a grand dharna at Jantar Mantar in Delhi

ఢిల్లీ:  తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని బీసీ సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీపీసీ చీఫ్‌ మహేష్‌  గౌడ్‌ మాట్లాడుతూ.. ‘ బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది. కోర్టు గడువు వల్ల పంచాయతీ ఎన్నికలకు వెళ్లాం. బీసీ రిజర్వేషన్ల  చట్టబద్ధత కోసం పోరాడుతున్నాం’ అని తెలిపారు. 

 ఈ మేరకు సోమవారం(డిసెంబర్‌ 15వ తేదీ) ఢిల్లీలోని జంతర్‌మంతర్‌  వద్ద  బీసీ సంఘాల జేఏసీ ధర్నా నిర్వహించింది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్లు 42%కు పెంపు చట్టానికి ఆమోదం కోరుతూ ఆందోళన చేపట్టింది జేఏసీ. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్‌ చేసింది. 

సామాజిక రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేయాలని డిమాండ్‌ చేసింది. ఈ ధర్నాలో మహేష్‌గౌడ్‌తో పాటు వి. హనుమంతరావు, విల్సన్ ఎంపీ (డిఎంకే), కే. నారాయణ (సిపిఐ), వి. శ్రీనివాస్ గౌడ్, వద్దిరాజు రవిచంద్ర ఎంపీ, మల్లు రవి ఎంపీ, అనిల్ కుమార్ యాదవ్‌లు హాజరయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement