బావ చూపిన బాటలో.. | H New police arrested three drug peddlers | Sakshi
Sakshi News home page

బావ చూపిన బాటలో..

Dec 15 2025 3:26 AM | Updated on Dec 15 2025 3:26 AM

H New police arrested three drug peddlers

డ్రగ్‌ పెడ్లర్‌గా మారిపోయిన సమీప బంధువు

పాలు, గ్రానైట్స్‌ వ్యాపారంలో విఫలం కావడంతో డ్రగ్స్‌ దందాలోకి

ఇద్దరితో కలిసి గుట్టుగా వ్యవహారం

ముగ్గురినీ అరెస్టు చేసిన హెచ్‌–న్యూ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగిగా మారిన బావమరిదిని డ్రగ్‌ పెడ్లర్‌గా మార్చాడో బావ. ఏపీలోని ప్రకాశం జిల్లా కేంద్రంగా ఎండీఎంఏ మాదకద్రవ్యాల దందా ప్రారంభించిన ఇత­గాడు హైదరా­బాద్‌కు చెందిన ఇద్దరిని సబ్‌– పెడ్లర్స్‌గా మా­ర్చుకున్నాడు. వీరితో కలిసి కొన్నాళ్లుగా  వ్యవహారాలు నడు­పు­తున్నాడు. 

దీనిపై సమాచారం అందుకున్న హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారు­లు ముగ్గురికీ చెక్‌ చెప్పారు. మాసబ్‌ట్యాంక్‌ పోలీసులతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో వీరిని అరెస్టు చేయడంతోపాటు 11 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ ఆదివారం వెల్లడించారు. 

ఆ రెండింటిలో సక్సెస్‌ కాకపోవడంతో...
ప్రకాశం జిల్లా పేర్నమిట్టకు చెందిన ఉప్పుటూరి కార్తీక్‌ ఆర్థిక ఇబ్బందులతో చదువు పూర్తి చేయలేకపోయాడు. సొంతూ­రిలో పాల కేంద్రం, గ్రానైట్స్‌ వ్యాపారం చేసినా సఫలీకృతం కాలేదు. దీంతో దురలవాట్లకు బానిసగా మారాడు. రూ.2 కోట్ల వరకు అప్పులు చేశాడు. నెల్లూరు నుంచి వచ్చి నేరేడ్‌­మెట్‌లో స్థిరపడిన సీహెచ్‌ బాలాజీ ఇతడికి బావ అవుతాడు. 2022లో తండ్రి చనిపోవడంతో బాలాజీ డెయిరీ వ్యాపా­రా­న్ని నిర్వహిస్తూ నెలకు రూ.22 వేల వరకు సంపాదిస్తు­న్నా­డు. 

సిగరెట్‌తో మొదలుపెట్టి ఎండీఎంఏ వినియోగం వరకు వెళ్లిన ఇతగాడు ఆ డ్రగ్‌కు ఉన్న డిమాండ్‌ను కార్తీక్‌కు చెప్పా­డు. దీంతో కార్తీక్‌ కూడా ఈ దందా ప్రారంభించాలని నిర్ణ­యించుకున్నాడు. తొలినాళ్లలో బెంగళూరు వరకు వెళ్లి నైజీరి­యన్ల నుంచి ఈ డ్రగ్‌ ఖరీదు చేసి తెచ్చేవాడు. కొన్నాళ్లుగా నైజీరియన్లు నేరుగా ఇవ్వకుండా తమ ఏజెంట్ల ద్వారా పంపిస్తుండటంతో బెంగళూరుతోపాటు ఆదిలాబాద్‌కూ వెళ్లి తే­వ­డం మొదలెట్టాడు. 

దీన్ని ఒక గ్రాము చొప్పున రీప్యాక్‌ చేసి ఎక్కువ ధరకు అమ్మేవాడు. ఇతడి నుంచి బాలాజీ కూడా క్రమం తప్పకుండా డ్రగ్‌ ఖరీదు చేసేవాడు. ఈ దందాలో ది­గి­న కార్తీక్‌ తన పేరును అలెక్స్‌గా మార్చుకున్నాడు. ఓ దశలో బాలాజీ ఇతడికి సబ్‌–పెడ్లర్‌గా మారిపోయాడు. బీటెక్‌ చదు­వుతున్న జీడిమెట్లకు చెందిన టి.దీపక్‌ పార్ట్‌టైమ్‌గా టెక్నికల్‌ సపోర్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు కూడా ఎండీఎంఏ వినియోగం నుంచి విక్రేతగా మారాడు. 

డెడ్‌ డ్రాప్‌ విధానంలో సరఫరా...
ఈ ముగ్గురూ తమ ఉనికి బయటపడకుండా ఎండీఎంఏను విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్, సోషల్‌మీడియా కస్టమర్లతో రేటు ఖరారు చేసుకుంటారు. ఆపై వారికి క్యూఆర్‌ కోడ్‌ పంపి డ­బ్బు బదిలీ చేయించుకుంటారు. ఆపై ఏదైనా ఓ ప్రాంతంలో డ్రగ్‌ పెట్టి దాని ఫొటోతోపాటు లొకేషన్‌ను వినియోగదా­రుడికి షేర్‌ చేస్తారు. మిగిలిన ఇద్దరూ అలెక్స్‌ నుంచే సరుకు తీసుకుని పరిచయస్తులైన కస్టమర్లకు అధిక ధరలకు అమ్ము­తున్నారు. 

వీళ్లు ఒక్కో గ్రాము రూ.నాలుగు వేల నుంచి రూ.ఐదు వేలకు కొని... రూ.ఎనిమిది వేల నుంచి రూ.10 వేలకు విక్రయిస్తు­న్నారు. వీరి దందాపై సమాచారం అంద­డంతో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.బాలస్వామి నేతృత్వంలో ఎస్సై బి.మనోజ్‌కుమార్‌తో కూడిన బృందం మాసబ్‌ట్యాంక్‌లో వలపన్నింది. ఎండీఎంఏ సరఫరా చేయడానికి వచ్చిన అలెక్స్‌తోపాటు తీసుకోవడానికి వచ్చిన మిగిలిన ఇద్దరినీ పట్టుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement