ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీల నిరసన | YSRCP MPs Protest In Delhi Against Medical Colleges Privatization | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీల నిరసన

Dec 15 2025 6:46 PM | Updated on Dec 15 2025 7:52 PM

YSRCP MPs Protest In Delhi Against Medical Colleges Privatization

ఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరసన బాట పట్టారు. ఈరోజు(సోమవారం,  డిసెంబర్‌ 15వ తేదీ) పార్లమంట్‌ సమావేశాల్లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. అనంతరం ఏపీలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి మకరద్వారం వద్ద ఫ్లకార్డులతో నిరసనకు దిగారు.  

ఎంపీలు సుబ్బారెడ్డి ,మిథున్ రెడ్డి, గురుమూర్తి, అవినాష్ రెడ్డి, తనుజ రాణి, అయోధ్య రామిరెడ్డిలు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘ ఏపీలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసాం. రాష్ట్రంలో కోట్లాది సంతకాలు సేకరించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో గవర్నర్‌ను కలిసి కోటి సంతకాలు చేస్తాం. ప్రైవేటీకరణ వెనక్కి తీసుకేనేంతవరకూ పోరాటం కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. 

ఇవీ చదవండి:

కోటి సంతకాలు.. కోట్ల గళాలు

విజయవాడకు వైఎస్‌ జగన్‌

ఇది కదా ప్రజా ఉద్యమం అంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement