ఏడేళ్ల తర్వాత జోర్డాన్‌లో ప్రధాని మోదీ | PM Narendra Modi In Jordan Tour After 7 Years | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల తర్వాత జోర్డాన్‌లో ప్రధాని మోదీ

Dec 15 2025 7:46 PM | Updated on Dec 15 2025 8:18 PM

PM Narendra Modi In Jordan Tour After 7 Years

అమాన్‌: భారత ప్రధాని విదేశీ పర్యటనలో భాగంగా సోమవారం(డిసెంబర్‌ 15వ తేదీ) జోర్డాన్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పాటు జోర్డాన్‌లో పర్యటించనున్న మోదీకి అక్కడ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది.  ఆ దేశ ప్రధాని జాఫర్‌ హసన్‌ సాదరంగా స్వాగతం పలికారు. ఆపై హోటల్‌కు చేరుకున్న మోదీకి ఎన్నారైలు సైతం ఘన స్వాగతం పలికారు. దీనిలో భాగంగా ప్రవాస భారతీయులతో పాటు భారత సంతతికి చెందిన వారితో మోదీ సమావేశమయ్యారు.   పలువురు కళాకారులతో సాంస్కతిక ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 

ప్రధాని మోదీ జోర్దాన్‌ పర్యటనలో జోర్డాన్ రాజు అబ్దుల్లాతో  హుస్సేనియా ప్యాలెస్‌లో సమావేశం కానున్నారు. జోర్డాన్‌ రాజు ఆహ్వానం మేరకే ప్రధాని మోదీ.. . ఆ దేశ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. .జోర్డాన్‌ రాజుతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్నారు.  ప్రధాని మోదీ జోర్డాన్‌ పర్యటనతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు బలపడనున్నాయి. 

ప్రధాని మోదీ జోర్డాన్‌ పర్యటనకు వెళ్లడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2018లో జోర్డాన్‌ను సందర్భించిన ప్రధాని మోదీ..  ఆ తర్వాత ఇంతకాలానికి అక్కడకు వెళ్లారు.ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు కావడం,  అదే సమయంలో ఆ దేశ రాజు ఆహ్వానాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ అక్కడకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

కాగా, ప్రధాని వాస్తవానికి సోమవారం(డిసెంబర్‌ 15వ తేదీ) ఉదయం 8:30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, దట్టమైన పొగమంచు కారణంగా దృశ్యమానత (విజిబిలిటీ) గణనీయంగా పడిపోవడంతో ఆయన పర్యటనలో ఆలస్యం చోటుచేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement