Fashion
-
ఐపీఎల్ ఫైనల్లోమెరిసిన అనుష్క, స్పెషల్ లగ్జరీ వాచ్, ధర ఎంతో?
ఐపిఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయం సాధించిన వేళ నటి, స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి ఆకర్షణీయంగా నిలిచారు. గుజరాత్లోని అహ్మదా బాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్లో అనుష్క శర్మ స్టాండ్స్ నుండి ఆర్సీబీని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ముఖ్యంగా ఆమె చేతి రూ. 28 లక్షల విలువైన 'కార్టియర్ పాంథర్' (Cartier Panthère) లగ్జరీ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సింపుల్ అండ్ లగ్జరీ స్టైల్, ఫ్యాషన్ ప్రియులకు తెగ నచ్చేసింది.సెజాన్ లియోనార్డ్ వైట్ టాప్, వైడ్ లెగ్ ట్రౌజర్ల ధరించి సింపుల్ అండ్ క్లాసీ లుక్లో కనిపించింది. దీని ధర విలువ దాదాపు 25 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఆమె లుక్ సింపుల్గా ఉన్నప్పటికీ, చేతికి పెట్టుకున్న వాచ్ మాత్రం హైలైట్గా నిలిచింది. అభిమానులు అది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ 'కార్టియర్ పాంథర్' వాచ్ అని గుర్తుపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఈ ఐకానిక్ వాచ్ ధర దాదాపు రూ. 28 లక్షల వరకు ఉంటుందని అంచనా. స్క్వేర్ డయల్, రోమన్ అంకెలు, బ్రాస్లెట్ స్టైల్తో ఉండే ఈ వాచ్ సెలబ్రిటీలలో చాలా ఫేమస్. నీతా అంబానీ లాంటి ఫ్యాషన్ ఐకాన్లతో ప్రజాదరణ పొందింది.కాగా ఆర్సీబీ ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలవడంతో కోహ్లీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత విరాట్, అనుష్క కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీకి అనుష్క ఎల్లప్పుడూ అండగా నిలిచే 'సపోర్ట్ సిస్టమ్' అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో విరాట్ కోహ్లీ 'One felt nice, we did twice' (ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ రెండుసార్లు గెలిచాం) అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి అనుష్కతో కలిసి డాన్స్ చేయడం విశేషం. మొత్తానికి ఆర్సీబీ విజయోత్సవాల్లో అనుష్క లగ్జరీ వాచ్ ఒక అనూహ్యమైన ఫ్యాషన్ హైలైట్గా నిలిచింది. ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే! -
తెలంగాణ ఇక్కత్ చీరలో రాధికరాజే గైక్వాడ్ ! ఏకంగా నాలుగేళ్లు..
పూర్వపు బరోడా (వడోదర) రాచరిక రాష్ట్ర మహారాణి సాంప్రదాయ భారతీయ నేత కళల పునరుద్ధరణ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారామె. అంతేగాదు ఒకప్పుడు కేవలం మరాఠా రాజ కుటుంబాల కోసం మాత్రమే నేయబడి..ఇప్పుడు కనుమరుగైన చారిత్రాత్మక బరోడా శాలు పునరుద్ధరణ కోసం, రాజమాత శుభాంగిని రాజేతో కలిసి నాయకత్వం వహించారు కూడా. ఆమె వద్ద 100 ఏళ్లకు ముందు ఉండే పురాతనమైన వారసత్వపు చీరలతో సహా, అబ్బురపరిచే చీరల సేకరణ కూడా ఉంది. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రసిద్ధ నేత చీరలను ధరించి, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అవి నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆమె ఇన్స్టాగ్రామ్ పురాతన చీరలకు నిధిలా ఉంటుంది. అవి మనకు రకరకాల నేతలు, వాటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నట్లుగా ఉంటుంది. అలానే తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమంలో సంచలనంగా మారింది. ఆ చీరకు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలిస్తే విస్తుపోతారు. మరి అవేంటో సవివరంగా తెలుసుకుందామా.!.మహారాణి రాధికరాజే గైక్వాడ్ తాజా ఇన్స్టాగ్రామ్లో సికింద్రాబాద్కు చెందిన వరశ్రీ వారు రూపొందించిన తెలంగాణ సుప్రసిద్ధ ఇక్కత్ చేనేత చీరలో కనిపించారు. ఆ చీరపై డబుల్ ఇక్కత్, కంబైన్డ్ ఇక్కత్ పద్ధతులు అరుదైన సమ్మేళ్లనంతో 30 రంగులలో నేసిన 108 అసలైన తేలియా రుమాల్ జ్యామితీయ నమూనాలు ఉన్నాయి. ఆమె ఆ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. తెలంగాణ ఇక్కత్లలో ఒక అద్భుతమైన కొత్త భాష ఉంటుంది. ఇది సాంప్రదాయ నైపుణ్యం, గణితం, సహనం, సృజనాత్మకత, ఆవిష్కరణల కలయిక. ఈ కళ సంక్లిష్టత మాత్రమే తనని ఆకట్టుకోలేదని, దాని వెనుకున్న అంకితభావం, నెలల తరబడి పరిశోధన, మరచిపోయిన నమునాల సంగ్రహాలు, అంతులేని గ్రాఫ్ పేపర్లు, 60 రంగులద్దే సెషన్లు, నిపుణులైన సమిష్ట స్ఫూర్తి తదితరాలు ఎంతగానో ఆకట్టుకుంటాయని అన్నారామె. అందువల్ల తనకు ఆ చీర అత్యంత గొప్పదిగా కనిపిస్తుందని అన్నారు. ఇక్కడ రాధికారాజే ధరించిన చీర ఏకంగా నాలుగు నెలలపాటు నేశారట. ఇంద్రధనుష్గా పిలిచే ఈ చీరలో మోటీఫ్ల మధ్య ఇంద్రధనుస్సుని తలపించే రంగులు, డబుల్ ఇక్కత్ మోటిఫ్లలో చదరంగం గళ్ల వంటి నిర్మాణాలు, తెలంగాణ ఇక్కత్ కోసం కొత్తగా అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్ టెక్స్చర్ తదితరాలు కూడా ఉన్నాయి. ఇలాంటి చీరలు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఈ చీర అరుదైన కలెక్షన్స్కి చెందిన శారీగా పేర్కొనవచ్చు అని రాధికారాజే అంటున్నారు.తెలియా రుమాల్ చరిత్రతెలియా రుమాల్ అనేది తెలంగాణలోని నల్గొండ జిల్లా పుట్టపాక, ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ చేనేత వస్త్ర కళ. ఈ కళలో నూలును నువ్వుల నూనె, ఆముదం తదితర మూలికలతో శుద్ధి చేసి, డబుల్ ఇక్కత్ పద్ధతిలో జ్యామితీయ నమూనాలతో నేస్తారు. ఇది 19వ శతాబ్దానికి చెందిన కళ. దీనికుండే జిడ్డు స్పర్శ, వాసన వాటన్నింటిని సూచిస్తుంది. సాధారణంగా ఇలాంటి ఫ్యాబ్రిక్ని తల లేదా మెడ, నడుము కట్టుకునే వస్త్రాలుగా ఉపయోగించేవారు. దీన్ని 'ఆసియా రుమాల్' గా వాణిజ్య ఎగుమతి చేసేవారు. గుజరాత్కు చెందిన పటోలా లాగా, చేనేత మగ్గంపై నేయడానికి ముందు వార్ప్, వెఫ్ట్ దారాలు రెండింటికీ రెసిస్ట్-డైయింగ్ చేసే డబుల్ ఇకాట్ పద్ధతిలో నేయబడిన కొన్ని దక్షిణాసియా వస్త్రాలలో ఇది ఒకటి. ఈ తేలియా రుమాల్లోని నూనె దుమ్మును దూరంగా ఉంచడం తోపాటు వాష్బుల్ కానీ విధంగా ధరించేవారట.ఇక డబుల్ ఇక్కత్ అనేది ఒక సంక్లిష్టమైన నేత పద్ధతి, దాని ఫలితంగా, తేలియా రుమాల్ వస్త్రంలో ఉపయోగించే మూలాంశాలు మొదట్లో "వజ్రాలు, నక్షత్రాలు, చతురస్రాలు, చుక్కలు, చారలు, గడులు వంటి సరళమైన జ్యామితీయ ఆకారాలుగా ఉండేవి, ఇవి తరచుగా మొజాయిక్ పనిని పోలిన కలయికలలో అమర్చబడేవి. అయితే, 1920, 1930ల మధ్య, అవి మార్పులు చోటు చేసుకోవడంతో మనుషుల నమూనాలను, విమానాలు, గ్రామఫోన్లు, గడియారాలు వంటి కొన్ని సమకాలీన మూలాంశాలను కూడా చేర్చడం మొదలైంది. అంతేగాదు 2020లో తెలంగాణకు చెందిన తేలియా రుమాల్కు భౌగోళిక గుర్తింపు (GI ట్యాగ్) కూడా లభించింది. View this post on Instagram A post shared by Radhikaraje Gaekwad (@radhikaraje) (చదవండి: Tai Chi walking: ‘తాయ్ చి’ వాకింగ్ ట్రెండ్..! ఇది పెద్దలకు మంచిదా?) -
1500 గంటలు, వేలాది క్రిస్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ!
కాన్స్ క్వీన్, మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ దివా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మరోసారి ఫ్రెంచ్ రివేరా రెడ్ కార్పెట్పై తన అద్భుతమైన లుక్తో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ప్రతిష్టాత్మక 79వ గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి దశలో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య లుక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అభిమానుల ఆశలను ఐష్ ఏమాత్రం వమ్ము చేయలేదు. లారియల్ (L'Oreal) బ్రాండ్ అంబాసిడర్గా హాజరైన ఆమె, ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన కస్టమ్ స్కల్ప్చరల్ గౌన్లో మెరిసి అందర్నీ మెస్మరైజ్ చేశారు.డిజైనర్ అమిత్ అగర్వాల్ ఐశ్వర్య కోసం ప్రత్యేకంగా రూపొందించిన అబిస్-బ్లూ గౌన్ హాట్ టాపిక్గా నిలిచింది. ఈ అబిస్-బ్లూ (Abyss-Blue) గౌను "లుమినారా" (Luminara) కేవలం ఒక గౌను మాత్రమే కాదు. అందాల ఐశ్వర్యం చుట్టూ ఒక కాంతి వలయం (Energy field) ఉన్నట్లుగా కనిపించేలా డిజైన్ చేయడం దీని స్పెషల్. అంతరిక్షంలో కాంతి ప్రయాణించే అనంతమైన తీరును ప్రతిబింబించేలా రెడ్ కార్పెట్ పై ఉన్న కాంతికి, కెమెరా ఫ్లాష్ లైట్కి గౌన్ లోపల ఏదో లిక్విడ్ (ద్రవం) కదులుతున్నట్లుగా ఒక విజువల్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ కేన్స్ వేదికపై అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ అద్భుతమైన శాఫైర్-బ్లూ గౌన్కు మ్యాచ్ అయ్యేలా ఐశ్వర్యారాయ్ మెడలో డైమండ్-శాఫైర్ కాలర్ నెక్లెస్ ధరించారు. సిల్కీ ఓపెన్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్తో ఆమె రెడ్ కార్పెట్పై ఒక దేవకన్యలా మెరిసిపోయారు. దీన్ని రూపొందించేందుకు 1500 (62 రోజుల 12 గంటలు) గంటలు పట్టిందట.1500 గంటల కష్టంఈ గౌను తయారీ వెనుక అమిత్ అగర్వాల్కి చెందిన సిగ్నేచర్ 'క్రిస్టల్ వీన్' ఎంబ్రాయిడరీ టెక్నిక్ ఉంది. దీనికోసం కళాకారులు ఏకంగా 1500 గంటలకు పైగా శ్రమించి, వేలాది క్రిస్టల్స్ చేత్తో అమర్చడం విశేషం. ఇంకా ఐశ్వర్య భుజాల భాగంలో వింగ్స్ (రెక్కలు) తరహాలో డిజైన్ చేసిన నిర్మాణం ఈ గౌనుకు ఒక ప్రత్యేకమైన, ఫ్యూచరిస్టిక్ (భవిష్యత్ కాలపు) లుక్ను తీసుకొచ్చింది. మొదటి లుక్తోనే ఇంతలా అదరగొట్టిన 'కాన్స్ క్వీన్', ముగింపు వేడుకలో (Closing Ceremony) ఎలాంటి దుస్తుల్లో కనిపిస్తారోనని ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ ఐకానిక్ లుక్ వెనుక డిజైనర్ అమిత్ అగర్వాల్తో పాటు ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్పై ప్రశంసలు కురుస్తున్నాయి.ఫ్యాషన్ ఇన్నోవేషన్ను సమపాళ్లలో మిక్స్ చేస్తూ ఈ లుక్ను ప్లాన్ చేశారంటూ అభినందిస్తున్నారు. రెండో లుక్కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో తన రెండోలుక్లో తనదైన ఫ్యాషన్ స్టైల్న చాటుకున్నారు. ఈసారి, ఈ నటి లేత గులాబీ రంగు దుస్తులతో రొమాన్స్ , పురాతన గ్లామర్ను ప్రదర్శిస్తూ, ఈ ఉత్సవానికి మరింత గ్లామర్ జోడించారు. వర్ధమాన మహిళా చిత్రనిర్మాతలను గౌరవించడానికి లోరియల్ పారిస్ నిర్వహించే వార్షిక కార్యక్రమం 'లైట్స్ ఆన్ ఉమెన్స్ వర్త్'కు ఐశ్వర్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా పాల్గొన్నారు. ఆమె రూబీ-ఎరుపు రంగు గౌను, దానికి సరిపోయే కేప్తో చాలా అందంగా కనిపించారు. -
దళపతి విజయ్ హెయిర్స్టైల్ వెనుక సీక్రెట్ ఇదే..! అదే ఆయన్ను..
ఓ వ్యక్తి ఆహార్యంలో హుందాతనం, స్టైలిష్ని కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసే వాటిలో కురులది ప్రధాన పాత్ర. ఆ హెయిర్స్టైలే పెద్ద మనిషిలా హుందాగా చూపించడం, అలాగే పాతికేళ్ల కుర్రాడి లుక్ చూపించడంలోనూ కీలకంగా ఉంటుంది. ఆ విషయంలో దళపతి, తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ చాలా ప్రత్యేకతను చాటుకున్నారు. హీరోగా ఉన్నప్పుడు ఆయన ఫాలో అయిన హెయిర్స్టైల్స్ యువతను ఎంతలా ఆకర్షించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి రాగానే తన ఆహార్యం మొత్తం మార్చుకుని ఓ పెద్ద తరహా లుక్తో కనిపించే హెయిర్స్టైల్తో ముందుకొచ్చి ప్రజల మనసుని గెలుచుకున్నారు. ఇంతలా హీరో దళపతిని అందంగా హెయిర్ని స్టైల్ చేసి చూపించే వ్యక్తి ఎవరంటే..తమిళనాడులో తమిళగ వెట్రి కజగం (టీవీకే)పార్టిపెట్టిన రెండేళ్లకే ఎన్నికల్లో విజయదుందుబి మోగించి చర్రిత సృష్టించారు దళపతి విజయ. హీరోగా మొదలై..ఓ రాష్ట్రాన్ని పాలించే నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం యువతకు స్ఫూర్తి కూడా. నటనలోనూ నాయకుడిగా తనదైన మార్కుని చూపిస్తూ..ప్రజలకు మంచి పాలన అందించే దిశగా దూసుకుపోతున్నారు. ఒక నాయకుడిగా పెద్దతరహాలో కనిపించే ఆయన ఆహార్యంలో ప్రధాన పాత్ర పోషించేది హెయిర్. అంత అందంగా ఆయన హెయిర్ని తీర్చిదిద్దే వ్యక్తి జగదీష్ అవస్థి. 30 ఏళ్ల ఈ హెయిర్ స్టైలిస్ట్ దళపతి అభిమానులను అలరించేలా రకరకాల హెయిర్ని తీర్చిదిద్దడంలో దిట్ట. బిగిల్' సినిమా నుంచి 'లియో', 'గోట్ (GOAT)' వరకు విజయ్కి హెయిర్ స్టైలింగ్గా వ్యవహరిస్తున్నాడు. జగదీస్ విజయ్తో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన్ను సీఎంగా చూడటం తన జీవితంలో అత్యంత అద్భుతమైన క్షణాల్లో ఒకటిగా పేర్కొన్నాడు. తనకు పదోతరగతి నుంచే సినిమాల్లో నటించాలని ఉండేది. ఆ నేపథ్యంలోనే సెలూన్కి సంబంధించిన కోర్సులు పూర్తి చేసి, ఒక సెలూన్లో పనిచేసినట్లు చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిన హెయిర్స్టైలిస్ట్ల ద్వారా విజయ్ బిగిల్ మూవీ కొత్త హెయిర్స్టైల్ కోరుకుంటున్నారని తెలిసింది. అలా ఆయన్ను తనకు కలిసే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ప్రతీ మూవీకి తనే హెయిర్స్టైలిస్ట్గా పనిచేశానని చెప్పుకొచ్చాడు. ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జననాయగన్కు కూడా ఆయనతో కలిసి పనిచేసినట్లు తెలిపాడు. విజయ్ హెయిర్స్టైల్లో బాగా పాపులర్ అయ్యింది 'బీస్ట్' స్టార్ హెయిర్స్టైల్. అయితే హీరో విజయ్ది సహజంగా ఒత్తుగా హెల్దీగా ఉండే జుట్టు కావడంతో ఈ హెయిర్స్టైల్ బాగా నప్పిందని చెప్పుకొచ్చాడు. అదీగాక సులభంగా రకరకాల హెయిర్స్టైల్లోకి మార్చగలమని చెప్పుకొచ్చాడు. అంతేగాదు ప్రతి మూవీలోని ఆయన పాత్రకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆయన జుట్టుకు మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందని తెలిపాడు. 'మాస్టర్' సినిమా షూటింగ్ పూర్తయినప్పుడు బాగా చేశావ్ అబ్బాయ్ అని ప్రశంసించన క్షణం ఇప్పటికీ మరువలేను అంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇక 2023లో లియో జుట్టుతో చేసిన వైరల్ లుక్ గురించి మాట్లాడుతూ..ఆ లుక్ల సాల్ట్-అండ్-పెప్పర్ (ఉప్పు-మిరియాల) జుట్టు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ స్టైల్లో నుదుటిపై జుట్టు పడే స్టైల్ మాత్రం ఆయన ఆలోచననే అని క్రెడిట్ మొత్తం హీరో విజయ్కే ఇచ్చాడు. అంతేగాదు ఆయ హెయిర్ని సరిచేస్తున్నప్పుడు కూడా చాలా ఓపికగా ఉంటారని అన్నాడు. అలాగే సెట్లో ప్రతిఒక్కర్ని శ్రద్ధగా చూసుకుంటారని, అందరితోటి చాలా సౌమ్యంగా మాట్లాడతారని చెప్పుకొచ్చాడు. చివరగా యవతరం హెయిర్స్టైలిస్ట్లకు చక్కటి చిట్కాలే కూడా సూచించాడుకేవలం హెయిర్స్టైల్స్ మాత్రమే నేర్చుకోకండి , మనుషులను అర్థం చేసుకోవడం, వారి వ్యక్తిత్వం, కెమెరా కోణాలు, ఫ్యాషన్ ఉనికిని క్యాచ్ చేయడం వంటి వాటిపై పట్టు తెచ్చుకుంటేనే మన నైపుణ్యం అందర్నీ ఆకర్షిస్తుందని చెప్పుకొచ్చాడు. ప్రతీ సీజన్లో ట్రెండ్లు మారుతుంటాయి కానీ మీ ప్రత్యేకత, వృత్తి నైపుణ్యమే మిమ్మల్ని చిరస్థాయిగా నిలబెట్టేలా పేరుని తెచ్చుపెడుతుందని అన్నాడు. (చదవండి: ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..! వైరల్గా విదేశీ మహిళ పోస్ట్) -
కేన్స్కు అందాల సుందరీ రాక ..! నల్లటి బ్లేజర్, లక్షల విలువైన..
ఫ్రాన్స్లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల మే 12న అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రెడ్కార్పెట్పై పలువురు ప్రముఖులు,సెలబ్రిటీలు తమదైన డిజైనర్ వేర్లో అలరించారు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ఈ ప్రపంచ వేదికపై చూపారు. అయితే ఇంత గ్రాండ్గా జరుగుతున్న ఈ వేడుకల్లో అందరి మదిలో ప్రశ్నం అందాల రాణి ఐశ్వర్య ఎక్కడ అని ఒకటే చర్చ. కేన్స్ వేడుకల్లో ఆమె హాజరు సోషల్మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ చర్చలకు తెరదించేలా నిన్న రాత్రి(మే 21 రాత్రి) కూతురు ఆరాధ్య బచ్చన్తో కలసి కేన్స్కు బయలు దేరుతూ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఈ కేన్స్ వేడుకలకు బయలు దేరుతున్నప్పుడే ఈ తల్లి కూతుళ్లు సేమ్ డిజైనర్వేర్లతో అందర్నీ ఆకర్షించారు. ఇద్దరు నలుపురంగు దుస్తుల్లో ఒకేలా కనిపించారు. అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు కొన్ని క్షణాల పాటు పోజిలిస్తూ ఎయిర్పోర్టుకి తరలి వెళ్లిపోయారు. ఇక ఐశ్వర్య ధ్రువ్ కపూర్ ఫాల్/వింటర్ 2026-27 కలెక్షన్కు చెందిన నలుపు రంగు బ్లేజర్, దానికి జతగా అదే కలెక్షన్కు చెందిన నలుపు రంగు ప్యాంటును ధరించారామె. తాను ధరించిన పూర్తి నలుపు రంగు థీమ్కు అనుగుణంగా తన లుక్ను మలిచుకున్నారామె. అలాగే ఈ డిజైనర్వేర్కి అనుగుణంగా బూట్లు, గూచీ డయానా బ్యాగ్తో మెరిశారామె. ఆమె ధరించిన బూట్లు సుమారు రూ. రూ. 1.78 లక్షలు కాగా ఐశ్వర్య చేతిలో ఉన్న గూచీ బ్యాగ్ ధర ఏకంగా రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. మాములుగా సెకండ్హ్యండ్ మార్కెట్లోనే ఈ గూచీ బ్యాగ్ ధర సుమారు రూ. 2 లక్షలు పైమాటే పలుకుతుందట. కాగా, కేన్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఐశ్వర్య ఎక్కడ అంటూ అందరు ఆరా తీయడం ప్రారంబించారు. అలాగే లోరియల్ పారిస్ పోస్టర్లో సైతం ఆమె కనపించకపోవడంతో సర్వత్ర ఆ బ్రాండ్పై విమర్శులు వెల్లువెత్తాయి. చివరికి స్పందించిన సదరు బ్రాండ్ పోస్టర్ కేన్స్లో ఐశ్వర్య ఆగమనం తప్పక ఉంటుందని, ఆమె కాలాతీతమైన వ్యక్తి అని అభివర్ణించింది. (చదవండి: -
కాన్స్లో మెరిసిన ఇక్కత్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై ఈసారి సెలబ్రిటీలు మాత్రమే నడవలేదు. రెండు వందల ఏళ్ల తెలంగాణ చేనేత చరిత్ర నడిచింది! గ్రామీణ భారతీయ కళాకారుల ప్రతిభ ప్రపంచాన్ని తాకింది. గ్రామీణ మగ్గం నుంచి కాన్స్ రెడ్ కార్పెట్ వరకు సాగిన ఈ ప్రయాణం తెలంగాణ చేనేతకు కొత్త దారులు తెరిచింది. ప్రపంచ సినీ రంగం తాలూకు అత్యంత ప్రతిష్టాత్మక వేదికగా గుర్తింపు పొందిన కాన్స్ ఫెస్టివల్లో తెలంగాణకు చెందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు తొలిసారిగా మెరిశాయి. ఆ చారిత్రాత్మక సమయానికి ప్రతీకగా, సాక్షిగా నిలిచారు మిస్ ఆసియా ఇంటర్నేషనల్, అంతర్జాతీయ ఇక్కత్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ రష్మీఠాకూర్...భారత ప్రభుత్వ జౌళీ మంత్రిత్వ శాఖ, చేనేత అభివృద్ధి కమిషనర్ కార్యాలయం, హైదరాబాద్ వీవర్స్ సర్వీస్ సెంటర్, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ మద్దతుతో పాటు పోచంపల్లికి చెందిన 30 మందికి పైగా మాస్టర్ నేతన్నలు కలిసి వందల గంటల శ్రమతో కాన్స్ ఫెస్టివల్ కోసం ప్రత్యేక దుస్తులను రూపొందించారు.ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో జరుగుతున్న 79వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై గురువారం పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరించి రష్మీ ఠాకూర్ ర్యాంప్ వాక్ చేశారు. దీంతో పోచంపల్లి నేత కార్మికులు చేతితో నేసిన ఎఐ ట్యాగ్ పొందిన డబుల్ ఇక్కత్, తెలియా రుమాల్ నైపుణ్యాలతో రూపొందించిన ఆ వస్త్రం ప్రపంచ ఫ్యాషన్ రంగాన్ని ఆకర్షించింది. ‘పోచంపల్లి టు కాన్స్’ అనే కాన్సెప్ట్తో రూపొందించిన ఈ కౌచర్ కాస్ట్యూమ్లో తెలంగాణ చేనేత వైభవం, భారతీయ హస్తకళ ప్రతిభ, సంప్రదాయం, ఆధునికతలు ఆల్ ఇన్ వన్ ఫ్రేమ్గా నిలిచాయి. పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన భగత్సింగ్, ప్రసన్నలక్ష్మీల దంపతుల కూమారై రష్మీ ఠాకూర్ ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన అడుగులు వేస్తూ మిస్ ఏషియా ఇంటర్నేషనల్, నేషనల్ అంబాసిడర్ ఫర్ హ్యాండ్లూమ్గా ఎన్నికయ్యారు.ప్రపంచ వేదికపై మన రాజసంకాస్ట్యూమ్స్కు జతగా రష్మీ ధరించిన ప్రసిద్ధ హైదరాబాదీ ముత్యాలు ఆ అందాన్ని మరింత రాజసంగా మార్చాయి. నిజాం రాజుల వారసత్వాన్ని గుర్తు చేసే ఆ ముత్యాలు ఇక్కత్ నమూనాలతో అద్భుతంగా కలిసిపోయి భారతీయ కళాసంపదకు ప్రపంచ వేదికపై సరికొత్త గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా నాలుగువేల మందికి పైగా జర్నలిస్టులు, కోట్లాది మంది ప్రేక్షకులు చూసే కాన్స్ వేదికపై తెలంగాణ చేనేత ప్రతిష్టాత్మకంగా నిలవడం చేనేత రంగానికి చారిత్రాత్మక ఘట్టంగా మారింది. ప్రపంచ మార్కెట్లలో పోచంపల్లి ఇక్కత్కు మరింత గుర్తింపు, డిమాండ్, గౌరవం తీసుకురావడంలో ఈ ప్రదర్శన కీలక పాత్ర పోషించనుంది.ఇది తెలంగాణ అరంగేట్రం!ఇది నా ఒక్కరి అరంగేట్రం కాదు. ఇది తెలంగాణ అరంగేట్రం. పోచంపల్లిలో వందల గంటలు మగ్గం ముందు కూర్చుని కష్టపడిన ప్రతి నేతన్న కల ఇది. మన దారం ఇప్పుడు ప్రపంచ దారం అయింది. తెలంగాణ చేనేతను ప్రపంచ లగ్జరీ ఫ్యాషన్ వేదికపై నిలబెట్టడం నా లక్ష్యం. ఇక్కత్ వస్త్రాల కీర్తిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తాను. – రష్మీ ఠాకూర్– గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి -
కేన్స్ రెడ్కార్పెట్పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్..!
బాలీవుడ్ బుల్లి తెర నటి మౌనీరాయ్ కూడా ఫ్రెంచ్ రివేరాలో జరుగుతున్న 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెరిశారు. ఇప్పటి వరకు అలియా భట్, అదితిరావు హైదరి, డయానా పెంటీ, నటి రుచి గుజ్జర్ తదితర తారాగణం అద్భుతమైన డిజైనర్వేర్లతో, అందచందాలతో ఆకట్టుకున్నారు. తాజాగా వారి సరసన మౌనీరాయ్ కూడా చేరారు. చెప్పాలంటే ఈ వేదికపై భారతీయ సాంప్రదాయ వారసత్వ కళలు తళక్కుమనడం విశేషం. మన దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ వారసత్వాలు తరతరాలు తెలుసుకునేలా అత్యద్భతంగా ప్రదర్శించారు పలువురు సెలబ్రిటీలు. ఇక మౌనీరాయ్ కూడా ఈ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో పటోలా ప్రింట్ గౌనుతో తుళుక్కుమంది. View this post on Instagram A post shared by mon (@imouniroy)ఈ ప్రపంచ వేదికపైనే ఆమె సినిమా పోస్టర్ టీజర్ని కూడా విడుదల చేశారు . గుజారాతీ పటోలా ఎండ్రాయిడరీ వర్క్ చేసిన ఈ గౌనులో మౌనీరాయ్ అత్యంత స్టైలిష్గా కనిపించారు. దీన్ని డిజైనర్ పూజా షా రూపొందించారు. ఈ డ్రైస్పై ఎంబ్రాయిడరీ చేయడానికి కళాకారులకు ఏకంగా 300 గంటల సమయం పట్టిందట. ఈ డ్రెస్ ‘ది హౌస్ ఆఫ్ పటోలా’ అనే దుస్తుల లేబుల్కు చెందినది. వీపు భాగం లేకుండా పూర్తి నిడివి గల గౌనుని చేతులు లేని సిల్హౌట్ శరీరానికి హత్కుకుపోయే ఫిట్, స్క్వేర్ నెక్లైన్తో కలర్ఫుల్గా ఎంబ్రాయిడరీ చేశారు. అందుకు తగ్గట్టుగా కాటుక కళ్లు, స్మడ్జ్ చేసిన వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలు, గూలాబీ రంగు లిప్ షేడ్తో అందంగా కనిపించింది. (చదవండి: కేన్స్లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్ లుక్..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?) -
కేన్స్లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్ లుక్..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?
ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్!. పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్ కానీ ఈ ప్రపంచ వేదికపై లింగ సమానత్వం, శరీర సౌందర్యం పట్ల సానుకూల దృక్పథం నుంచి రాజకీయ సందేశాలు, సంస్కృతి వరకు చర్చలకు దారితీసేలా వెలుగులోకి వస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఫ్యాషన్ అనేది ఉద్దేశ్యంతో కూడిన వ్యక్తిగ భావప్రకటనగా మారింది. ఈ ఏడాది చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ వేదికపై భారతీయతను చాటిచెప్పేలా దుస్తులను ధరించి అదర్నీ ఆకర్షించారు. తాజాగా ఆ జాబితాలోకి మరో బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ కూడా చేరిపోయారు.ఈ రెడ్కార్పెట్పై ఆమె రాజస్థానీ సాంప్రదాయ దుస్తులతో మెరిసే అందర్నీ ఆశ్చర్యపరిచడం విశేషం. రుచి రాజస్థానీ మహిళలా 'ఘూంఘట్' ధరించే వచ్చింది. నిజానికి ఈ ఘూంఘట్'ని రాజస్థాన్లో మహిళలు తమ ముఖాన్ని లేదా తలని కప్పుకోవడానికి ఉపయోగించే ముసుగు లేదా వస్త్రాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ నటి రుచి సరికొత్త సందేశం ఇచ్చేలా ధరించడం విశేషం. ఆ స్టైలింగ్ వెనుక ఉన్న అర్థం..రాజస్థాన్ సాంస్కృతిక మూలాలకు సంబంధించిన స్టైలింగ్ వచ్చిన రుచి ఒక లోతైన సందేశాన్ని అందించేందుకు ఇలా రెడ్కార్పెట్పైకి వచ్చారట. రాజస్తాన్లోని అనేక గ్రామీణ ప్రాంతాలలో బలవంతపు ఘూంఘట్ పద్ధతులపై దృష్టిని ఆకర్షించడానికి ఈ ఆహార్యంలో వచ్చారామె. రుచి తన రూపం ద్వారా మనం సంప్రదాయాన్ని ఎంచుకోవడానికి, సామాజిక ఒత్తిడి కారణంగా బలవంతంగా పాటించాల్సి రావడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారామె. రుచి దుస్తులను రూపా శర్మ డిజైన్ చేశారు. ఇవి వారసత్వాన్ని, ప్రతికాత్మకతను సమతుల్యం చేశాయి. ఇక్కడ రుచి వీటిని ప్రతిఘటనకు చిహ్నంగా ధరించింది. ఒక మహిళ గౌరవం, సమానత్వం, ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ నుంచి రావాలే తప్ప ముఖం దాచుకోవడం నుంచి కాదని చెప్పేందుకే ఇలా ఆ వేదికపైకి వచ్చినట్లు పేర్కొందామె. ఈ కేన్స్ వేడుకలో తన ఉనికి ఒత్తిడిలో చిక్కుకున్న మహిళల గురించి ఒక్క చర్చనైనా ప్రారంభించగలిగితే, అప్పుడు ఈ నడకకు ఫ్యాషన్కు మించిన అర్థం ఉంటుందని అంటోందామె. తన ఘూంఘట్ లొంగిపోవడం కాదని, ఇది నిరసన అని తేల్చి చెప్పారామె. రాజస్థాన్కు చెందిన రుచి ఈ సమస్య తనకు వ్యక్తిగతంగా సంబంధించినదని అన్నారామె. సంస్కృతి మహిళలకు సాధికారత కల్పించాలి, వారిని తుడిచిపెట్టకూడదు. సంప్రదాయం కాలంతో పాటు పరిణామం చెందాలి. గౌరవం ఎప్పటికీ అదృశ్యం కావాలని కోరకూడదు అని అన్నారామె. కాగా రుచి గుజ్జర్ కేన్స్ ఇలా ప్రత్యేకమైన లుక్తో రావడం తొలిసారి కాదు. గతేడాది మెరిసే బంగారు, అద్దాలతో కూడిన లెహంగానూ, దానికి జతగా బరువైన కుందన్ ఆభరణాలతో కూడిన మోదీ చిత్రంతో ఉన్న లాకెట్లను ధరించి అందర్నీ విస్తుపోయేలా చేసిందామె. View this post on Instagram A post shared by Ruchi Gujjar (@ruchigujjarofficial) (చదవండి: 'కూతురు' అత్తారింటికి అప్పగించే వస్తువా? గాయని చిన్మయి శ్రీపాద ఫైర్) -
కేన్స్లో ప్రజక్తా మాలి ట్రెడిషనల్ లుక్! సగర్వంగా భారతీయత..
ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ‘కేన్స్’ సీజన్! పేరుకి ఫిల్మ్ ఫెస్టివల్... కానీ ప్రపంచమంతా సెలెబ్రిటీల దుస్తులు, రెడ్ కార్పెట్ మీద వారి లుక్స్ తదితరాలే హాట్టాపిక్గా నిలుస్తుంటాయి. అందుకోసం తారలు, సెలబ్రిటీలు తల నుంచి పాదాల వరకు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. చూపుతిప్పుకోని విధంగా రెడి అయ్యేందుకు కొన్ని నెలల ముందు నుంచే సన్నద్ధమవుతుంటారు. అయితే ఈ ప్రపంచ వేదిక కేన్స్ రెడ్ కార్పెట్పై మెరిసే లాంగ్ గౌనులు, పాశ్చాత్య స్టైలిష్ వేర్లే సందడి చేస్తుంటాయి. అలాంటిది ఈసారి భారతీయ డిజైనర్లు మన భారతీయ సంప్రదాయ వారసత్వానికే పెద్దపీట వేశారు. ఒక్కో ప్రాంతంలో ఉన్న సంప్రదాయ చీరలు, ఆభరణాలతో తారలు, ప్రముఖులు సందడి చేయడం విశేషం. తాజాగా ఆ కోవలోకి మరాఠి నటి ప్రజక్తా మాలి కూడా చేరిపోయారు. ఆమె ఈ ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ రెడ్ కార్పెట్పై మహారాష్ట్ర సంస్కతిని సగర్వంగా చూపించారామె. తన మూలాలను చాటి చెప్పేలా సాంప్రదాయ నీలి రంగు నౌవారీ చీరలో మెరిశారామె. రిచ్ బ్లూ, పర్పుల్ రంగుల మేళవింపుతో ఉన్న మహారాష్ట్రలో చీరలో వయ్యారంగా నడుస్తూ..అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచం మొత్తాన్ని తనవైపుకి తిప్పుకునేలా ప్రత్యేకంగా కనిపించింది. ఆమె రూపం సంప్రదాయ సాంస్కృతికి గర్వాన్ని ఎలుగెత్తి చాటింది. ఆఖరికి తన ఆహార్యానికి తగ్గట్టుగా చక్కగా జుట్టు ముడివేసి, సాంప్రదాయ బిందీ, ప్రత్యేకమైన నాథ్, చోకర్, గాజులు, కమర్బంద్ వంటి యాక్సెసరీలు ధరించారామె. మరాఠి సంప్రదాయలో రాజసమైన లుక్లో ఆకర్షించారామె. అంతేగాదు ప్రజక్తా కెమెరాలకు చేతులు జోడించి అభివాదం చేస్తూ ఇచ్చిన ఫోజులు ఆత్మీయత, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పుతున్నట్లుగా ఉంది. ఇలా ప్రపంచ వేదికపై సగర్వంగా భారతీయతను చాటడం ముఖ్యంగా మరాఠీ ప్రేక్షకులను ఎంతోగానో అలరించడం కాదు, గర్వించే క్షణంగా మారింది. కాగా, ప్రజక్తా మాలి, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్కార్పెట్పై అరంగేట్రం చేసిన దృశ్యాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..సాంప్రదాయ నౌవారీ చీర, మరాఠీ నాథ్తో కేన్స్లో నడవం ఎంతో గర్వంగా ఉందని పోస్ట్లో తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. View this post on Instagram A post shared by Prajaktta Mali (@prajakta_official) (చదవండి: బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !) -
వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్
ఫ్యాషన్ ప్రపంచంలో అంబానీ వారసురాలు, వ్యాపారవేత్త ఇషా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ స్టైల్ను చాటుకున్నారు. ఆధునిక హంగులతో వింటేజ్ గ్లామర్ను ప్రదర్శిస్తూ, కార్ల్ లాగర్ఫెల్డ్ 1996 కలెక్షన్కు చెందిన అరుదైన ఆర్కైవల్ షానెల్ హాట్ కౌచర్ దుస్తులలో అద్భుతమైన లుక్తో అందరి దృష్టిని ఆకర్షించారు.వ్యాపార ప్రపంచం నుండి అంతర్జాతీయ కార్యక్రమాలలో రెడ్ కార్పెట్ దాకా, ఇషా అంబానీ శైలి ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె తన విలక్షణమైన ఫ్యాషన్ అభిరుచికి మాత్రమే కాకుండా, తన రాజసం ఉట్టిపడే శైలికి కూడా ప్రసిద్ధి చెందారు. ఇటీవల, ఇషా అంబానీ ధరించిన ఒక దుస్తులు చూసి అందరూ 'వావ్' అన్నారు. తాజాగా 90వ దశకపు హాలీవుడ్ గ్లామర్ను గుర్తుచేసే ఒక అందమైన బంగారు రంగు వింటేజ్ దుస్తులను ధరించి మోడ్రన్ మహారాణిలా మెరిసారు.2026లో ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సరికొత్త మార్పు కనిపిస్తోంది. పాత తరం నాటి క్లాసిక్ డిజైన్లు (Vintage Couture) మళ్లీ రెడ్ కార్పెట్స్ పైకి వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఇషా అంబానీ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్ రూపొందించిన 'చానెల్ (Chanel) ఆటమ్/వింటర్ 1996 హాట్ కోట్యూర్' కలెక్షన్ నుండి గోల్డ్ కలర్ వింటేజ్ దుస్తులను ధరించారు.ఆమె హిప్స్ వరకు సాగే పూర్తి చేతుల బంగారు రంగు (Gold) 'బంధ్గలా' సూట్ను ధరించారు. నడుము భాగంలో రత్నాలతో పొదిగిన బెల్ట్తో దీనిని స్టైల్ చేశారు. బంగారు రంగు లేస్ క్విల్టెడ్ ప్యాంట్సూట్. దీనికి ఆమె టాబ్వింటేజ్ వారి సిగ్నేచర్ గ్రిపాయిక్స్ బెల్ట్ను జతచేసింది. ఈ బెల్ట్ ధర సుమారు రూ.31,56,800 ఉంటుంది ఈ లుక్లో దాని అద్భుతమైన ఎంబ్రాయిడరీ మరియు ఆకర్షణీయమైన డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ దుస్తులకు బంగారు రంగు డీటైలింగ్తో పాటు, రంగురంగుల రాళ్లను అమర్చారు. ఈ లుక్ కోసం ఆమె చానెల్ క్రూయిజ్ 2025/26 కలెక్షన్కు చెందిన స్వెడ్ మినీ పౌచ్, మనోలో బ్లాహ్నిక్ శాండల్స్, సెయింట్ లారెంట్ సన్గ్లాసెస్ను ధరించారు. మేకప్ విషయానికి వస్తే బేక్డ్ న్యూడ్-టోన్డ్ మేకప్, వింగ్డ్ ఐస్, లూజ్ హెయిర్తో సింపుల్గా కనిపించారు. 2011లో లేడీ గాగా 1996 నాటి అరుదైన షానెల్ గోల్డ్ ప్యాంట్సూట్ను ధరించారు. అంతేనా సెయింట్ లారెంట్ వారి SL M161 సన్గ్లాసెస్ మరో ప్రత్యేకత. వీటి ఖరీదు సుమారు దాదాపు రూ. 32,000 ఉంటుందని అంచనా. షానెల్ బ్రాండ్కు చెందిన క్రూజ్ 2025/26 కలెక్షన్లోని ఒక స్టైలిష్ స్వెడ్ మినీ పౌచ్ను ధరించారు. తన లుక్ను పూర్తి చేయడానికి, ఆమె లగ్జరీ బ్రాండ్ మనోలో బ్లానిక్కు చెందిన కల్లాస్లీ 90 లెదర్ స్లింగ్బ్యాక్ శాండల్స్ను ధరించారు. సుమారు రూ. 1,29,156 ఖరీదు చేసే ఈ స్టైలిష్ హీల్స్, ఆమె మొత్తం లుక్కు మరింత రాజసం ఉట్టిపడేలా చేశాయి.రాజసం ఉట్టిపడే, ఆకర్షణీయమైన లుక్ను చాలా హుందాగా తీర్చిదిద్దుకోవడంతోపాటు, తన మొత్తం లుక్కు మరింత క్లాసీ లుక్ను జోడించారు. ఇషా తన గ్లామరస్ దుస్తులకు తగ్గట్టుగాఎంచుకున్న తేలికపాటి మేకప్ ఆమె లుక్కు చక్కగా సరిపోయింది. ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది? View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset) -
కేన్స్లో తొలిసారిగా భక్తి సందేశం..!
ఫ్రాన్స్లో జరుగుతోన్న కేన్స్ చిత్రోత్సవంలో భారత్తో పాటు పలు దేశాలకు చెందిన సినీ తారలు పాల్గొని, తమ అందచందాలతో అదరగొడుతున్నారు. మంగళవారంతో ఆరంభమైన ఈ ఫెస్టివల్ ఈ నెల 23తో ముగుస్తుంది. ఇప్పటికే భారత్ నుంచి బాలీవుడ్ నటి అలియా భట్ రెడ్ కార్పెట్పై మెరిసింది. మరో నటి ఊర్వశీ రౌతేలా కూడా క్రిస్టల్ గౌనుతో అదరహో అనిపించారు. కానీ తొలిసారిగా ఈ ప్రపంచ వేదికపై భారతీయ ఆధ్యాత్మికత వెల్లివెరిసింది. ప్రముఖ గాయని, నటి, మోడల్ ఆర్తి ఖేతర్పాల్ కేన్స్ రెడ్ కార్పెట్పైకి బృందావన్ భక్తి స్ఫూర్తిని తీసుకువచ్చారు. ఆమె డిజైనర్ సులక్షణ మోంగా రూపొందించిన ప్రత్యేక బృందావన్ లెహంగాను ధరించారు. పైగా ఆ డిజైనర్ వేర్కి జతగా శ్రీకృష్ణుడి చిత్రంతో కూడిన జపమాల సంచి, తులసీ కంఠి మాలను జతచేశారు. ఆ సంప్రదాయ లెహంగాకు అనుగుణంగా పోల్కీ బ్రాస్లెట్, రాళ్ల నెక్లెస్, చెవిపోగులను ధరించారు. ఆమె తన వెంట చిన్న పవిత్ర భగవద్గీత ప్రతిని కూడా తీసుకువచ్చారు. ఈ ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో తొలిసారి ఇలా సనాతన ధర్మాన్ని గర్వంగా చూపించడం. ఆ క్రెడిట్ నటి ఆర్తి ఖేతర్పాల్కే దక్కుతుంది. తన భక్తి మేళవింపుతో ఉన్న తన ఫ్యాషన్ స్టైల్ దేవుడిని విశ్వసించే ప్రతి మానవునికి, జపం నేర్పే గురువులు, సాధువులందరికీ, భగవద్గీతను రచించిన వేదవ్యాసునికి, అలాగే వేద గ్రంథాలను భవిష్యత్తుతరాలకు అందేలా చేస్తున్న ప్రచురణ సంస్థలకు, అలాగే ఫ్యాషన్లోకి భక్తి విశ్వాసాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న డిజైనర్లకు అంకితం అని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారామె. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకున్నారామె. కాగా, ఈ నటి 'సౌండ్స్ ఆఫ్ కుంభ' అనే ఆల్బమ్లో కనిపించారు, ఇది 2026 గ్రామీ అవార్డులకు నామినేషన్ పొందింది. ఈ ఏడాది ప్రారంభంలో, కూడా ఆర్తి ఇదే విధంగా గ్రామీ అవార్డులకు బృందావన అంశాలను తీసుకువచ్చారు. ఆ వేడుకలో ఆమె లడ్డూ గోపాల్, లేదా బాలకృష్ణుడు ఉన్న నెక్లెస్ ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. డిజైనర్లకు పురాణాలు, ఆధ్యాత్మికత అనేవి రోజురోజుకూ ప్రజాదరణ పొందిన ఇతివృత్తాలుగా మారడం విశేషం. ప్రముఖులు హిందూ దేవతల చిత్రాలను, భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలలోని శ్లోకాలను ధరించి కనిపిస్తున్నారు. రామ నవమి నాడు, నీతా అంబానీ కూడా ఇలానే భక్తిని స్ఫురించేలా ఇకాత్ చీరను ధరించారు. ఆ చీరపై రామ శిల స్ఫూర్తితో రూపొందించిన మొజాయిక్ ఉంది, అలాగే "రామ్" అనే పదం అనేక భాషలలో లిఖించి ఉంది.(చదవండి: కేన్స్లో అందమైన గులాబీలా అలియా భట్) -
కేన్స్లో అందమైన గులాబీలా అలియా భట్
ఫ్రాన్స్లోని కేన్స్ నగరంలో 79వ కేన్స్ చలన చిత్రోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆరంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 23 వరకు జరుగనున్నాయి. ఇప్పటికే అలియా ఫ్రాన్స్ చేరుకున్నారు. ఓ బ్యూటీ ప్రాడెక్ట్కి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆమె అందులో భాగంగానే అక్కడకి వెళ్లారు. తొలి రోజు రెడ్ కార్పెట్పై నడిచే ముందు ఆలియా ఫ్రెంచ్ రివెరా దగ్గర ఫ్లోరల్ ప్రింట్ ఫ్రాక్లో అద్భుతంగా కనిపించి ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్గా మారాయి. తాజాగా కాన్స్ రెడ్కార్పెట్లపై అలియా అందర్నీ కట్టిపడేసింది. ఈ బ్యూటీ గతేడాది తర్వాత ఇలా మళ్లీ ఇలా కేన్స్లో సందడి చేయడం రెండోసారి. రెడ్కార్పెట్పై అలియా గులాబీలా హోయలు ఒలికిస్తూ నడిచిన తీరు అందర్నీ అమితంగా ఆకర్షించింది. తమారా రాల్ఫ్ రూపొందించిన లేత గులాబీ బ్లష్-టోన్డ్ బస్టియర్ గౌన్లో అత్యద్భుతంగా కనిపించింది. దీనికి మరిన్ని హంగులు చేర్చి భారతీయ లుక్ని అందించారు బాలీవుడ్ నిర్మాత రియాకపూర్. అలియా తన లుక్కి ఒక స్టేట్మెంట్ జెమ్స్టోన్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులను జతచేసి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేశారామె. చెప్పాలంటే కాన్స్లో అలియా ఫ్యాషన్ సందడే ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. రెడ్ కార్పెట్పై కనిపించడానికి ముందే అలియా ఫ్యాషన్ ప్రియులను ఇంప్రెస్ చేసింది. Alia Bhatt at Cannes Film Festival 📸 pic.twitter.com/NitpbocSJN— Alia's nation (@Aliasnation) May 12, 2026రెండోసారి రెడ్కార్ప్ట్పై ముగ్ధమనోహరంగా కనిపించి మరింతగా ఆకట్టుకుంది. కాగా, ఈ ఏడాది కాన్స్ వేడుకల్లో వివిధ సినీ పరిశ్రమలు తోపాటు ప్రాంతీయ సినిమా రంగాల నుంచి కూడా గణనీయంగా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అలియా తోపాటు ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా లోరియల్ పారిస్కు గ్లోబల్ అంబాసిడర్గా మరోసారి సందడి చేయనున్నారు. ఇక చిత్రనిర్మాత అశుతోష్ గోవారికర్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ హోదాలో భారతదేశ అధికారిక ప్రతినిధి బృందంలో భాగంగా హాజరుకానున్నారు. అలాగే చిత్రనిర్మాత కరణ్ జోహార్తో పాటు, నటీమణులు తారా సుతారియా, మౌనీ రాయ్, పూజా బాత్రా తదితరులు కూడా సందడి చేయనుననారు. (చదవండి: గోల్డ్ డిజైనర్వేర్లో రాధికా మర్చంట్ స్టన్నింగ్ లుక్!) -
అవార్డుల వేడుకలో హాట్టాపిక్గా టీవీ స్టార్ 'బ్రెడ్ డ్రెస్'..!
"వెర్రి వేయి రకాలు - పిచ్చి పలు రకాలు" అంటే ఇదేనేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. క్రియేటివిటీ ఉండోచ్చు మరి అధ్వాన్నమైన సృజనాత్మకతను తట్టుకోవడం చాలా కష్టం. ఇక్కడో ఓ టీవీ స్టార్ క్రియేటివిటీ కూడా అలానే ఉంది. వెరైటిగా కనపడాలని అనుకుందో లేక కొత్తగా ఆలోచించాలనుకుందో గానీ ఆమె ధరించిన డ్రెస్ మాత్రం ఒక్కసారిగా అందరికీ ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకునేలా చేసింది. అసలే పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోలు సంక్షోభం, తోపాటు తర్వలో ఆహార సంక్షోభం వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో ఆ స్టార్ డ్రెస్ అందరికి కోపం తెప్పించడమే కాదు..ఏమనుకుంటున్నావ్ అంటూ తింట్ల దండకం అందుకున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..ఆఫ్రికా మ్యాజిక్ వ్యూయర్స్ ఛాయిస్ అవార్డ్స్ (AMVCA) వేడుకలో, రియాలిటీ టీవీ స్టార్ క్వీన్ మెర్సీ అటాంగ్ సుమారు 500 బ్రెడ్లతో తయారు చేసిన గౌనులో దర్శనమిచ్చింది. ఆమె రెడ్కార్పెట్ పైకి రావడంతో ఒక్కసారిగా నెట్టింట హాట్టాపిక్గా మారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ దుస్తులను డిజైన్ చేసింది టియానాస్ ఎంపైర్కు చెందిన డిజైనర్ టోయిన్ లవానీ. ఆ టీవీ స్టార్ అటాంగ్ బేకరీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసే నిమిత్తం వాళ్లు ఇలా రూపొందించారట. అంతేగాదు సదరు టీవీ స్టార్ అటాంగ్ సైతం తన వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకునేందుకు ఇంతకన్న మంచి ప్రదేశం ఏముంటుంది అని ప్రశ్నించడం శేషం. బ్రెడ్ డ్రెస్పై వెల్లువెత్తిన వ్యతిరేకత..ఆ లుక్ సృజనాత్మకతకు నిదర్శనంగా ఉన్నా..సోషల్ మీడియాలో మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆహారాన్ని ఫ్యాషన్గా ఉపయోగిస్తారా..?, కనీసం నైతికత కూడా లేదా? అంటూ నిలదీస్తున్నారు నెటిజన్లు. అంతేగాదు ఇది చాలా అసభ్యకరం, అసలు ఆ దుస్తులు రూపొందించిన డిజైనర్లు నిజంగా ఫ్యాషన్ డిజైనర్లేనా? అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు.This is so crass.Honestly, this is the kind of thing people should actually be fixating on tonight and asking real questions about.Is that real bread? Is it dummy bread? Because even if it turns out to be fake, the visual alone is still deeply tone deaf.Bread is one of the… pic.twitter.com/3NxxfwjJOp— AFTER HOW MANY CHILDREN (@tomisin_ms) May 9, 2026 (చదవండి: Tara Sutaria: బ్లేజర్ జస్ట్ రూ. 65 వేలు..కానీ హ్యాండ్ బ్యాగ్ మాత్రం అన్ని లక్షలా..!) -
బ్లేజర్ జస్ట్ రూ. 65 వేలు..కానీ హ్యాండ్ బ్యాగ్ మాత్రం అన్ని లక్షలా..!
79వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) ఈ నెల మే 12, 2026 నుంచి ము 23, 2026 వరకు ఫ్రాన్స్లోని కేన్స్ నగరంలో జరగనుంది. ఈ వేడుకలో అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉంది బాలీవుడ్ నటి తారా సుతారియా. తన స్టైలిష్ లుక్తో ఆ వెంట్లో ఎలా కనిపించనుందో ముందుగానే చిన్న హింట్ ఇచ్చేసిందామె. ఎయిర్పోర్ట్ నుంచే పవర్ డ్రెస్సింగ్ అవుట్ఫిట్తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. లగ్జరియస్ ఫ్యాషన్ని ఎలా నిశబ్దంగా సింపుల్గా ప్రదర్శించాలో తన లుక్తో అద్భుతంగా చూపించారామె. తారా సుతారియా ఎయిర్పోర్ట్లో అసాధారణ దుస్తుల సముదాయంతో మెరిసింది. నల్లటి సూట్లో అద్వితియంగా కనిపించింది. ఈ సూట్ జర్మనీకి చెందిన 'హెల్సా' అనే ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎంపిక చేసుకుంది. మ్యాచింగ్గా అదే బ్రాండ్కు చెందిన బ్యాగీ ప్యాంట్తో స్టైలిష్గా కనిపించింది. అయితే ముందు వైపు బటన్ క్లోజర్, ప్యాడెడ్ షోల్డర్స్, హెవీవెయిట్ ట్విల్ ఫ్యాబ్రిక్తో కూడిన ఈ ముదురు బూడిద రంగు చారల బ్లేజర్ ధర రూ. 65,789. బటన్ క్లోజర్తో కూడిన జిప్-ఫ్లై ఉన్న బ్యాగీ ప్యాంట్ ధర దగ్గర దగ్గర రూ. 37 వేలు పలుకుతుందట. ఆ స్టైలిష్ డ్రెస్కి అనుగుణంగా నలుపు రంగు జిల్ లెదర్ హైహిల్స్ని ధరించింది తారా. తన లుక్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మినీ లేడీ డియోర్ బ్యాగ్. దీని ధర వింటే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఎంతంటే సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. నల్లటి గొర్రె చర్మంతో తయారు చేసిన ఈ లెదర్ బ్యాగ్ అత్యంత అద్భుతమైన వస్తువుగా నిలిచింది. ఈ బ్యాగ్కు తీసివేయగల చైన్ షోల్డర్ స్ట్రాప్, లోపల జిప్ పాకెట్ వంటివి ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ధరించి సన్గ్లాసెస్ కూడా తారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. అంతేకాదండోయ్ ఆ గాగుల్స్ ధర కూడా ఏకంగా రూ. 8 వేలు పైనే పలుకుతుందట. ఈ బ్యూటీ తన లగ్జరీయస్ అవుట్ఫిట్ లుక్తో ఈ కేన్స్ వేడుకలో తనెంత విలాసవంతమైన గ్లామరస్ కనిపించనుందో పరోక్షంగా చెప్పేసింది కదూ..!. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: గోల్డ్ డిజైనర్వేర్లో రాధికా మర్చంట్ స్టన్నింగ్ లుక్!) -
గోల్డ్ డిజైనర్వేర్లో రాధికా మర్చంట్ స్టన్నింగ్ లుక్!
భారతదేశ జాతీయ పెవిలియన్ ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడానికి అంబానీ కుటుంబం అంతా ఇటలీలోని వెనిస్కు చేరి అత్యంత అద్భుతమైన కళాత్మక దుస్తుల్లో కనిపించి అబ్బరుపరిచారు. తాజాగా ఈ 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శన – లా బినాలే డి వెనిజియాలో అంబానీ చిన్న కోడలు సరికొత్త లుక్కి సంబంధించిన ఫోటోలు సన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఎప్పటిలాగే రాధికా ఈ వేడుకలో తన గ్లామర్ లుక్తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను రియా కపూర్ మే 11న ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో రాధికా ఫ్యాషన్ను భారతీయ హస్తకళలను మేళవించిన డిజైనర్వేర్ ఆధునిక కాలపు అందగత్తెలా మెరిశారామె. కస్టమ్ ఎర్డెమ్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులలో రాధికా లుక్ అదుర్స్ అనిపించింది. యూరోపియన్ కౌంచర్ సౌందర్యాన్ని, భారతీయ వస్త్రాల గొపతనాన్ని మేళవించేలా డిజైన్ చేసింది. భారతీయ ఫ్యాబ్రిక్పై పూల మోటిఫ్లతో అలంకరించిన మెటాలిగ్ గోల్డ్ బ్రోకేడ్ ప్రధాన ఆకర్షణగా ఉంది. ఒక రకంగా ఈ డ్రెస్ ప్రపంచ వేదికపై భారతీయ నేత కార్మికుల నైపుణ్యాన్ని అందంగా ప్రదర్శించింది. ఈ డిజైనర్వేర్ ఆఫ్-షోల్డర్ డ్రేప్డ్ కార్సెట్ విత్ నేలవరకు జాలువారే కేప్ని కలిగి ఉంది. దాంతో రాధికా లుక్ని రాజసం ఉట్టిపడేలా చేసింది. దీనికి మ్యాచింగ్గా స్ట్రెయిట్-కట్ బేజ్ రంగు ప్యాంటుతో జతచేసి,ఆధునిక ఫ్యాషన్తో కలగలిసిన భారతీయ వారసత్వ సంప్రదాయాన్ని ప్రదర్శించింది. అందుకు తగ్గట్టుగా రాధికా మెరిసే ఐషాడో, వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలతో తన రూపాన్ని తీర్చిదిద్దుకుంది. హెయిర్ని కూడా పాపిడి తీసి మొత్తాన్ని కర్ల్స్లో వదిలేయడంతో మరింత గ్లామరస్గా కనిపించింది. కాగా రాధికా శిక్షణ పొందిన భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. అలాగే ఆమె తల్లిదండ్రులతో కలిసి ఎన్కోర్ హెల్త్కేర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సభ్యురాలిగా కార్పొరేట్ ప్రపంచంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) (చదవండి: వెనిస్లో స్పెషల్ అట్రాక్షన్గా నీతా అంబానీ కుటుంబం) -
అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?
వాషింగ్టన్, డి.సి.లోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, ప్రసిద్ధ విమానాలు , అంతరిక్షయానానికి సంబంధించి పరికరాల ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచింది. అయితే తాజాగా ఆ ప్రదర్శనలో ఒక సాధారణ భారతీయ మహిళా శాస్త్రవేత్త చీర దర్శనమిస్తోంది. ఆ చీర భూ వాతారణాన్ని దాటి వెళ్లకపోయినా..ఆ శారీని ధరించిన మహిళ భారతదేశం మరో గ్రహాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించింది. ఈ చీర ఇస్రోకి చెందిన ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ది. ఎవరామె అంటే..భారతదేశపు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళ్యాన్)లో నందిని నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఆమె తండ్రి గణిత ఇంజనీర్ కాగా, తల్లి గణిత ఉపాధ్యాయురాలు. ఇస్రోలో చేరడానికి ముందు ఇంజనీరింగ్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. భారత అంతరిక్ష సంస్థలో 20 ఏళ్లకు పైగా సాగిన కెరీర్లో ఆమె 14కు పైగా మిషన్లకు మద్దతునిచ్చారు. ఒక ఇంటర్వ్యూలో నందిని తన మిషన్ల గురించి మాట్లాడుతూ.. "తాము పనిచేసే ప్రతి మిషన్ అత్యంత ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. అయితే వాటిలో మంగళ్యాన్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఒక్కసారిగా మావైపు చూశారు. అది మా నైపుణ్యానికి, లభించిన గుర్తింపుగా, గర్వంగా అనిపిస్తుందని అన్నారు. అంతేగాదు ఆ మిషన్ విజయవంతం అవ్వడంతో సాక్షాత్తు ప్రధాని మంత్రి కరచాలనం చేసి అభినందించారు. అలాగే నాసా కూడా మమ్మల్ని అభినందించింది. అంతేగాదు ఈ గెలుపు కారణంగా నాసాతో మాతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చింది. పైగా సోషల్ మీడియాలో కూడా చాలామంది మమ్మల్ని ఫాలో అవుతున్నారంటూ". సంతోషంగా చెప్పుకొచ్చారామె.ఆ సీరియల్ కారణంగానే..అంతరిక్ష పరిశోధనలంటే ఎందుకు నందిని ఇష్టమో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వివరించారు. ఒక ప్రముఖ టీవీ సీరియల్ చూడటం ద్వారా తనకు అంతరిక్షంపై ఆసక్తి మొదలైందన్నారు. అప్పట్లో టీవీలో 'స్టార్ ట్రెక్' అనే చాలా ప్రజాదరణ పొందిన సీరియల్ ఒకటి ఉండేది, దాని కారణంగానే అంతరిక్ష ఫరిశోధనాలంటే ఇష్టం ఏర్పడిందని ఈటీ ఎంటర్ప్రైజ్ ఏఐ 'మేకింగ్ ఏఐ వర్క్ సమ్మిట్ 2025'లో చెప్పారామె. తమ కుటుంబం మొత్తం ఆ సీరియల్కి వీరాభిమానులమని, ఒక్క ఎపిసోడ్ని మిస్ అయ్యేవాళ్లం కాదంటు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారామె. అలాగే తాను పదేపదే ఇష్టంగా చూసే సినిమా అపోలో 13 అని, అందులో టీమ్గా పనిచేసి విజయం సాధించడం తదితరాలు తన మదిలో శాశ్వతంగా నిలిచిపోయానని అన్నారామె.ఆ చీర ఎందుకు?భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చెందిన మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి సహాయపడ్డారు. ఇస్రో మంగళయాన్ మిషన్ని నవంబర్ 5, 2013న ప్రారంభించింది. సెప్టెంబర్ 24, 2014న విజయవంతంగా భూమికక్ష్యను విడిచిపెట్టి విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అంటే సుమారు 300 రోజుల ప్రయాణాన్ని విజయంవతం చేసేందుకు ఆమె ఈ చీరను ధరించి పనికి వచ్చారని స్మిత్సోనియన్ మ్యూజియం ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది అంతేగాదు ఆ పోస్ట్లో.."ఒక రాకెట్ శాస్త్రవేత్తగా, మార్స్ ఆర్బిటర్ మిషన్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా నందిని హరినాథ్ మిషన్ ప్రణాళిక, కార్యకలాపల్లో కీలక పాత్ర షోషించారు. దాదాపు ఆరు నుంచి పది నెలల కాలపరిమిత గల తన మిషన్ను ఏకంగా ఎనిమిదేళ్లు అంగారక కక్ష్యలో గడిపి అక్కడి ఉపరితల వాతావరణ పరిస్థితుల్ని నమోదు చేయడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ మిషన్లోని మహిళా నాయకులు ధరించిన చీరలు వారి జాతీయ గుర్తింపు, అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచాయి" అని సదరు మ్యూజియం పేర్కొంది. అంతేగాదు ఆ చీరకు సంబంధించిన వీడియో, ఫోటోలను కూడా మ్యూజియం పంచుకుంది. ఈ చీరలో నీలం రంగు జాకెట్, ఎరుపు-నీలంతో కలగలసిన డ్రేప్డ్ ఫాబ్రిక్ ఉన్నాయి. View this post on Instagram A post shared by Smithsonian (@smithsonian) (చదవండి: జేఈఈలో రెండుసార్లు ఫెయిల్, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్..! చివరికి..) -
వెనిస్లో స్పెషల్ అట్రాక్షన్గా నీతా అంబానీ కుటుంబం
ఇటలీలోని వెనిస్లో జరుగుతున్న లా బియెన్నాలే డి వెనిజియా 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో అంబానీ కుటుంటం భారత జాతీయ పెవిలియన్ను ప్రారంభించింది. ఇది ఫ్యాషన్తో కూడిన భారతీయ వారసత్వ సమ్మేళనానికి అద్భుతమైన సాక్ష్యంగా నిలిచింది. ఈ మేరకు మే 7న సాయంత్రం అంబానీ కుటుంబం వెనిస్లో ఒక ఆత్మీయ వేడుకని నిర్వహించింది. ఆ వేడుకలో అంబానీ కుటుంబం ఆధునిక శైలులు, సాంప్రదాయ భారతీయ వైభవాన్ని సంపూర్ణంగా సమతుల్యం చేసేలా పలు రకాల లుక్స్లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకలో నీతా అంబానీ కుటుంబం భారతీయ కళ, ఫ్యాషన్ వైభవాన్ని ఎలా మిళితం చేసిందంటే..గోల్డ్ శారీలో నీతా అంబానీ..సాంస్కృతిక కార్యక్రమాల వెనుక దార్శనికురాలిగా, నీతా అంబానీ ఒక క్లాసిక్ గోల్డ్ టిష్యూ చీరలో అందానికి కేరాఫ్గా కనిపించారు. ఈ కార్యక్రమంలో నీతా తన కుటుంబంతో కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తున్నప్పుడు, ఆమె ధరించిన చీర మిరిమిట్లుగొల్పేలా కాంతిని వెదజల్లింది. సాంప్రదాయ భారతీయ వస్త్రధారణ విలాసానికి అంతిమ చిహ్నంగా నిలుస్తుందని ఆమె ఆహార్యం నిరూపించింది. నీతా తన లుక్ని ఒక భారీ వజ్రాలు-పచ్చల నెక్లెస్ సెట్, ఒక చిన్నబన్తో జత చేశారు.పుదీనా రంగులో రాధికా మర్చంట్ రాధికా మర్చంట్, సున్నితమైన పుదీనా నీలం రంగులో ఉన్న ఒక అందమైన వన్-షోల్డర్ గౌనులో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిసింది. ఈ గౌను నడుము వద్ద ముడుచుకుని, గ్రీకు శైలిలో క్లిష్టమైన డ్రేపింగ్ను కలిగి ఉంది. మెడ భాగంలో మెరుస్తున్న, స్ఫటికాకార అంచు, దానికి సరిపోయే ఆర్మ్ కఫ్, ఈ గౌనుకు ఆధునిక మెరుపును జోడించి మరింత శోభను చేకూర్చింది. రాధిక తన జుట్టును నునుపైన, ఒత్తుగా ఉన్న పోనీటెయిల్తో స్టైల్ చేశారు. దీంతో ఆమె ప్రకాశవంతమైన మేకప్, ప్రత్యేకమైన వజ్రాల చెవిపోగులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.వైన్ గౌనులో మెరిసిపోతున్న ఇషా అంబానీఇషా అంబానీ అధునాతన ముదురు వైన్ రంగులో ఉన్న ఫ్లోర్-లెంగ్త్ గౌనును ధరించారు. ఈ గౌను పాశ్చాత్య ఫ్యాషన్ శైలిలో కనిపిస్తూ..సాంప్రదాయ చీర కట్టుతో మేళవించింది. గౌను పైభాగంలో ఉన్న అద్భుతమైన బంగారు ఎంబ్రాయిడరీ, పూల డిజైన్లు భుజాల మీదుగా జాలువారుతూ, ముదురు రంగు వస్త్రానికి గొప్ప కాంట్రాస్ట్ను అందించాయి. ఇషా తన జుట్టును మృదువైన, రొమాంటిక్ అలల రూపంలో వేసుకుని, ముదురు ఎరుపు రంగు లిప్స్టిక్, పచ్చలు పొదిగిన ఆభరణాలతో తన రూపాన్ని పూర్తిచేశారు.ఆకర్ణణీయమైన లుక్లో ఆనంద్ పిరమాల్, అనంత్ అంబానీలు..వెనిస్లో, అంబానీ కుటుంబం వారసత్వ సంప్రదాయాన్ని, ప్రపంచ ఫ్యాషన్తో మేళవించి, పవర్ డ్రెస్సింగ్ను పునర్నిర్వచించారు. ఆ సాయంత్రం కేవలం భారతీయ కళల వేడుకగా మాత్రమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతీయ వస్త్రధారణ నైపుణ్యానికి ఒక ప్రదర్శనగా నిలిచింది. ఇకఇషా అంబానీ భర్త, వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్, రాజసం ఉట్టిపడేలా అలంకరించిన వెండి బ్రోచ్తో కూడిన నల్లటి వెల్వెట్ జాకెట్లో ఆకర్షణీయంగా కనిపించగా, అనంత్ అంబానీ, తమ కుటుంబం మెచ్చే సూక్ష్మమైన హస్తకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే అలంకారమైన లాపెల్ పిన్తో కూడిన నల్లటి సూట్లో అద్భుతంగా కనిపించారు. View this post on Instagram A post shared by Vogue Arabia (@voguearabia)(చదవండి: Met Gala 2026: రూ. 142 కోట్ల నెక్లెస్తో మెరిసిన సుధా రెడ్డి..!) -
మెట్ గాలాలో రూ. 142 కోట్ల నెక్లెస్తో మెరిసిన సుధా రెడ్డి..!
న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో మెట్గాలా 2026 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో సెలబ్రెటీలు, ప్రముఖులు, ఇతరులు తమదైన శైలితో కళాత్మకంగా మెరిశారు. ఈసారి మన హైదరాబాద్ బిలియనీర్, MEIL(Megha Engineering and Infrastructures Limited) గ్రూప్ డైరెక్టర్లో ఒకరైన సుధారెడ్డి అద్భుతమైన లుక్లో అలరించారు. ఈ వేడుకలో ఆమె మనీష్ మల్హోత్రా దుస్తులను ఎంచుకున్నారు. ఆమె ఈ ఈవెంట్లో 'కాస్ట్యూమ్ ఆర్ట్' అనే థీమ్కు అనుగుణంగా ధరించిన మిలియన్ డాలర్ల నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ నెక్లెస్ ఆమె వ్యక్తిగత ఆభరణాల కలెక్షన్లలో ఒకటి. దీని ఖరీదు వచ్చేసి దాదాపు 142 కోట్లు పైనే పలుకుతుందట. ఈ ఆభరణం త్రిభుజాకార రోజ్-కట్ వజ్రాలతో కూడిన విక్టోరియన్-ఫినిష్ చైన్తో రూపొందించారు. పూల గుత్తులలో పొదిగిన ఈ రత్నాలు, నెక్లెస్ మధ్యలో ఉన్న 550 క్యారెట్ల ముదురు ఊదా-నీలం రంగు టాంజనైట్ ఈ నెక్లెస్ అందాన్ని మరింత హైలెట్ చేశాయి. ఈ నెక్లెస్ని 'క్వీన్ ఆఫ్ మెరెలానీ' అని పిలుస్తారట. ఈ ఆభరణంతోపాటు 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ వజ్రపు ఉంగరం, 40 క్యారెట్ల అస్చెర్-కట్ కొలంబియన్ పచ్చ ఉంగరంతో సుధారెడ్డి తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. ఇక మనీస్ మల్హోత్రా డిజైన్ చేసినా ఆమె డ్రెస్ 'జీవ వృక్షం', కాలం, జ్ఞాపకం, నిరంతర ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచింది. ఇందులోని ప్రతిదారం చరిత్రలో ఒక భాగాన్ని వివరించే అద్భుతమైన కళ. అన్నింటకంటే ఆ డిజైనర్వేర్లో ఏకంగా మూడువేల ఏళ్ల వస్త్ర సంప్రదాయాన్ని అల్లికలు, ఎంబ్రాయిడరీ ద్వారా చూపించినట్లు పేర్కొన్నారు మల్హోత్రా. అందులో పాలపిట్ట, జమ్మి చెట్టు, కల్పవృక్ష, టాంగేడు, సూర్య, చంద్ర తదితర మూలాంశాలన్నీ ఈ డ్రెస్ను మరింత అందంగా కనిపించేలా చేశాయి. కాగా సుధారెడ్డి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన మెట్ గాలా లుక్ గురించి ఇలా షేర్ చేసుకున్నారు. "హైదరాబాద్ కేవలం తన పుట్టినిల్లు మాత్రమే కాదు, అది తనలో భాగమైన జీవన విధానం. తాను ఈ వేడుకలో ప్రపంచ వేదికపై దక్షిణ భారతీయతను కళ్లకు కట్టినట్లు చూపించేలా..అత్యంత ఆకర్షణీయంగా కనిపించాలని ఆకాంక్షించినట్లు వెల్లడించారు". కాగా, సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official)(చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
మెట్ గాలా 2026 అనన్యా బిర్లా లుక్ : ఫ్యాషన్ వరల్డ్ షాక్!
ప్రముఖ వ్యాపారవేత్త వారసురాలు, గాయని, స్వయంగా వ్యాపారవేత్త అనన్య బిర్లా తన తొలి మెట్ గాలా 2026 ఈవెంట్ అరంగేట్రంలో ఫ్యాషన్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. స్టెయిన్లెస్ స్టీల్ డ్రెస్తో అదర గొట్టేశారు. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, సరికొత్త అర్థాన్నివ్వడం విశేషంగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు మరింత వైరల్గా మారాయి. రెడ్ కార్పెట్ అనగానే సాధారణంగా సిల్క్ , వెల్వెట్ గౌన్లతో నిండి ఉంటాయి. కానీ అనన్య బిర్లా మెట్ గాలా 2026లో ఈ ట్రెండ్ను మార్చేశారు. ఏకంగా స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన గౌను ధరించి అందరినీ షాక్కు గురిచేశారు. అందుకే ఆ డ్రెస్ హాట్ టాపిక్గా నిలిచింది. ఫ్యాషన్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదని, అది ఒక శక్తివంతమైన భావప్రకటనా రూపమని ఆమె లుక్ నిరూపించింది.స్టెయిన్లెస్ స్టీల్ డ్రెస్ ప్రత్యేకతఅనన్య ధరించిన ‘ధరించగలిగే శిల్పం’ (Wearable Sculpture) ఒక అద్భుతమైన కళాఖండంగా నిలిచింది. దీనికి స్టెయిన్లెస్ స్టీల్ను ఉపయోగించి 'క్రోమ్ ఫినిషింగ్' తో తయారు చేశారు. దీంతో ఆమె ఒక ఆధునిక దేవతలా లేదా శక్తివంతమైన యోధురాలిలా మెరిసిపోయారు.ఈ డ్రెస్ భుజాల భాగం ఎంతో ధీమాగా, ఆర్కిటెక్చరల్ శైలిలో రూపొందించబడింది. ఇది ఆమె వ్యక్తిత్వంలోని బలాన్ని ప్రదర్శిస్తోంది.ఈ మెటల్ డ్రెస్ ఒక 'కవచం' (Armor) లాగా కనిపిస్తూ.. ఒక వ్యక్తి తన అస్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచం నుండి ఎలా కాపాడుకుంటారో తెలియజేస్తుంది. View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)ఈ డ్రెస్ డిజైనర్లుబాలీవుడ్ ప్రముఖ స్టైలిస్ట్ రియా కపూర్ (Rhea Kapoor) దార్శనికతతోనే ఈ అవుట్ఫిట్ ఇంత పవర్ఫుల్గా తయారైందట. అంతర్జాతీయంగా పేరు గాంచిన ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రాబర్ట్ వున్ (Robert Wun), నిత్యావసర వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను సృష్టించే భారతీయ సమకాలీన కళాకారుడు సుబోధ్ గుప్తా (Subodh Gupta) సమన్వయంతో దీన్ని రూపొందించారు.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకా View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)అనన్య బిర్లా గురించి క్లుప్తంగాఅనన్య బిర్లా ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా కుమార్తె. అనన్య ఆర్సిబి ఫ్రాంచైజీ కొత్త యజమాని ఆర్యమాన్ బిర్లా సోదరి కూడా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్, మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశారు. 17 ఏళ్ల వయసులో 'స్వతంత్ర'ను స్థాపించి, గ్రామీణ మహిళలకు అండగా నిలుస్తున్నారు. బిర్లా గ్రూప్ కంపెనీల బోర్డులలో కూడా ఉన్నారు. 'లివిన్ ది లైఫ్', 'మీంట్ టు బి' వంటి ప్రసిద్ధ ఆల్బమ్లతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన గాయని. మానసిక ఆరోగ్యంపై అవగాహన, ఆ సమస్యలతో బాధపడుతోన్న వారికి నిపుణులచే కౌన్సెలింగ్ ఇప్పించే లక్ష్యంతో అమ్మతో కలిసి ‘Mpower’ అనే సంస్థ ని స్థాపించి సేవలందిస్తున్నారు. ఇటీవల ‘బిర్లా స్టూడియోస్’ పేరుతో సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వేదికగా యువ ప్రతిభను ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటున్నారు.ఆమె నికర విలువసుమారు రూ.1,800 కోట్లు ఉంటుందని అంచనా. ఇదీ చదవండి: విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా? -
మెట్ గాలాలో గోల్డ్ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్లో మొత్తం అమ్మ..
మెట్ గాలా 2026లో భారతీయ ఫ్యాషన్, కళలకు మద్దతు ఇవ్వాలనే తన వాదనను బలంగా వినిపించారు ఇషా అంబానీ. ఈ వేడుకలో ఆమె డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరలో తళుక్కుమన్నారు. ఈ చీరలో చేతితో చిత్రించిన పిచ్వాయి ప్రేరేపిత నమునాలు ఉన్నాయి. కేవలం కళాకారుల కోసం మాత్రమే పనిచేసే రిలయన్స్ రిటైల్ బ్రాండ్ స్వదేశ్కు చెందని కళాకారులు ఈ చీరను స్వచ్ఛమైన బంగారు దారాలతో డిజైన్ చేశారు. ఆఖరికి బ్లౌజ్ కూడా స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే ఈ బ్లౌజ్ మొత్తం తన అమ్మ నీతా అంబానీ ఆభరణాలతో నిండి ఉందని వోగ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది ఇషా. దాదాపు 1800 క్యారెట్ల వజ్రాల తోపాటు పచ్చలు, పోల్కీ, కుందన్లను ఈ వస్రం(బ్లౌజ్)లో పొదిగి దాని వారసత్వ రూపాన్ని సజీవంగా మార్చామని డిజైనర్ గౌరవ్ గుప్తా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇషా అద్భుతమైన చీర, ఆభరణాల తోపాటు క్రోచెట్ బ్యాగ్లో సుబోధ్ గుప్తా రూపొందించిన మామిడి శిల్పాన్ని కూడా రెడ్కార్పెట్పైకి తీసుకువచ్చారామె. ఇది భారతదేశ వారసత్వానికి నిదర్శనంగా ఉండటమే కాకుండా చేతి కళకు నిదర్శనంగా నిలిచింది. సింపుల్గా చెప్పాలంటే ఈ ఏడాది మెట్గాలా 2026 థీమ్ 'ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్'కు అనుగుణంగా ఉంది. అలాగే ఆమె తన జుట్టుని గజ్రా స్ఫూర్తితో రూపొందించిన కాగితం, రాగి ఇత్తడి కలయికతో రూపొందించిన ఆభరణంతో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిశారామె. దీన్ని బ్రూక్లిన్కు చెందిన సౌరబ్ గుప్తా అనే కళాకారుడు రూపొందించారు. ఈ వేడుకకు ముందు మే1 న్యూయార్క్ నగరంలో జరిగిన వేడుకలో భారతదేశాన్ని అక్షరాలా చిత్రించిన ఒక అద్భుతమైన బ్యాండేజ్ డ్రెస్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ డ్రెస్ని 26 రకాల అంచులతో రూపొందించడం విశేషం. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) (చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..
MEIL గ్రూప్ డైరెక్టర్లో ఒకరైన భారతీయ వ్యాపారవేత్త, హైదరాబాదీ సుధా రెడ్డి, న్యూయార్క్లో జరిగే మెట్ గాలా2026లో మెరవనున్నారు. ఆమె మెట్ గాలాలో ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఏడాది మెట్ గాలా సుమారు 400 ప్రత్యేకమైన కళాత్మక వస్తువులతో.. ఏకంగా ఐదువేల ఏళ్ల నాటి శైలిని చాటిచెప్పే 'కాస్ట్యూమ్ ఆర్ట్' ప్రదర్శనను ఇతివృత్తంగా "ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్" అనే డ్రెస్ కోడ్ను ఎంచుకుంది. ఈ మెట్గాలా కార్యక్రమంలో పాల్గొనే అతిరథమహులంతా తమ దుస్తులను సజీవ కళాఖండాలుగా కనిపించేలా మానవ శరీరం, కళాత్మక వ్యక్తీకరణ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని ప్రతిబింబించాలని ఆశిస్తోంది. గతంలో సుధా ప్రఖ్యాత భారతీయ డిజైనర్లు ఫల్గుణి షేన్ పీకాక్, తరుణ్ తాహిలియాని రూపొందించిన అద్భుతమైన దుస్తులను ధరించారు. ఈ ఏడాది ఫ్యాషన్ను ఒక కళారూపంగా పరిగణించే ఇతివృత్తం నేపథ్యంలో ఆమె సబ్యసాచి ముఖర్జీ లేదా మనీష్ మల్హోత్రా వంటి ప్రముఖ భారతీయులతో కలిసి పనిచేయనున్నట్లు అంతరంగిక వర్గాల సమాచారం. పారిస్ ఒలింపిక్స్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వంటి అనేక ఉన్నత స్థాయి అంతర్జాతీయ కార్యక్రమాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బిజీగా ఉండే ఆమె ఈ ఏడాది న్యూయార్క్లో జరగనున్న గాలా ఈవెంట్ల్ భారత్కి ప్రాతినిథ్యం వహించనున్నారు.ఇక సుధా అందం, దాతృత్వ పరంగా ఆమెకు సాటిరారెవ్వరూ. ఆమె మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)లో డైరెక్టర్గా ఉన్నారు. అలాగే సుధా రెడ్డి ఫౌండేషన్కు కూడా నాయకత్వం వహిస్తున్నారు, దీని ద్వారా ఆమె స్వచ్ఛంద ప్రాజెక్టులు, సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం వంటివి చేస్తుంటారు.ఆమె ఎవరంటే..సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆమె 2024 మెట్ గాలాలో 200 క్యారెట్లకు పైగా వజ్రాలు ధరించి వార్తల్లో నిలవడమే కాదు రెడ్ కార్పెట్పై తన ఉనికిని చాటిచెప్పేలా ప్రపంచ దృష్టిని మరింతగా ఆకర్షించారు.ఆమె పుట్టి పెరిగింది విజయవాడలోనే. 19 ఏళ్లకే కృష్ణారెడ్డిని వివాహం చేసుకున్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం తమ బంధానికి సహాయపడిందని, తామిద్దరూ కలిసే పెరిగామని రెడ్డి గతంలో చెప్పారు.2026, మే 4, సోమవారం నాడు జరగనున్న మెట్ గాలా, ఈ ఈవెంట్లో అత్యధిక తారలు పాల్గొనే కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది సహ-అధ్యక్షులుగా బియాన్స్, నికోల్ కిడ్మన్, వీనస్ విలియమ్స్ ఉండగా, జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ బెజోస్ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా, న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక వేడుక,. ఇది కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం నిధుల సేకరణ కార్యక్రమం. దీనిని ప్రతి ఏడాది మే మొదటి సోమవారం నిర్వహిస్తారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official) (చదవండి: హాట్టాపిక్గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..) -
హాట్టాపిక్గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..!
త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అదీగాక ఇవాళ త్రిష పుట్టిన రోజు కూడా కావడం ఈ సందర్శన మరింత హాట్టాపిక్గా మారింది. ఇక్కడ నటి త్రిష కలియుగ దైవమైన ఆ తిరుపతి వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన విధానం అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. త్రిష అజా ఫ్యాషన్స్కు చెందిన వైట్సూట్తో అలరించింది. దీని ధర రూ. 12000 పైనే పలుకుతుందట. వినెక్తో కూడిన ఐవరీ కలర్ చేనేత వస్త్రం. ముఖ్యంగా ఈ వేసవి వేడికి ఆహ్లాదకరమైన హాయినిచ్చే కాటన్ కూడా ఇది. దీనికి తేలికపాటి ఫ్లోరల్ దుపట్టా ఈ డిజైనర్వేర్ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆలయాన్ని సందర్శించిన అనంతరం, త్రిష కృష్ణన్ చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడు,పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల రోజు త్రిష ఆమె ఆలయ సందర్శన రెండూ ఏకకాలంలో జరగడం కూడా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అదీగాక పోల్ ట్రెండ్స్ ప్రకారం, విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలన విజయాన్ని నమోదు చేయడం విశేషం.తిరుమల ఆలయం విశిష్టత..ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఉన్న వెంకటేశ్వర ఆలయం, వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. పైగా శేషాచలం కొండలపై ఉన్న అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన ప్రముఖ క్షేత్రం. ఏడు కొండలపైన కొలువైన శ్రీనివాసుడు, కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటూ, ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. ఇక్కడ మూలవిరాట్టు స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం.#WATCH | Andhra Pradesh: Actor Trisha Krishnan had the darshan of Lord Sri Venkateswara Swamy at Tirumala Tirupathi Devasthanam earlier this morning. pic.twitter.com/mhiaHMOu5l— ANI (@ANI) May 4, 2026 (చదవండి: 46 దేశాలు పర్యటించా..కానీ భారత్ పర్యటన..!) -
చీరకు జెండర్ లేదు!
నారీ వార్డ్రోబ్ లిస్ట్లో ఉండే ఎవర్గ్రీన్ డ్రెస్.. శారీ. ఇప్పుడిక మగవారి అలంకరణలోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది. సంప్రదాయ దుస్తులలో ఈ కళ కొత్తగా మెరిసిపోతోంది. ధోతీగా మారి దావత్లలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. జెండర్ పరిమితులు లేని ఈ స్టైల్కి జనాల నుంచి కితాబులూ అందుకోవచ్చు.ఆరు గజాల చీర ఆడవారి ఆహార్యానికే కాదు, మగవారి రాజసానికి కూడా అలంకరణగా మారింది. యూనీసెక్స్ డిజైన్స్లో మేటిగా నిలిచింది. సంప్రదాయ వేడుకలలో స్టైలిష్గా నిలుస్తోంది. పట్టు, కాటన్, ఆర్గంజా., శారీస్ లేదా దుపట్టాలతో షర్ట్, ఓవర్ కోట్లను డిజైన్ చేయవచ్చు.. బ్లేజర్ కోసం చీర పల్లూను వాడచ్చు. డిజైన్ బట్టి ఒకే చీరను కుర్తా, పైజామా సెట్గా మార్చుకోవచ్చు. ఇందుకు దళసరిగా ఉండే పట్టు, కాటన్ శారీస్లో అందమైన డిజైన్స్ ఉన్నవి ఎంచుకోవాలి. చీర కొంగును షర్ట్ కాలర్, కఫ్ట్, పాకెట్స్ డిజైన్ చేయడానికి ఉపయోగించవచ్చు. అంతగా ఉపయోగించని, మంచి డిజైన్ ఉన్న శారీస్తోనూ మెన్ అండ్ ఉమెన్ సంప్రదాయ దుస్తులను రూపొందించవచ్చు.కట్టులో ఎన్నో వైవిధ్యాలుఈ రోజులను గమనిస్తే 40 ఏళ్ల లోపు మెన్ అండ్ ఉమెన్ వేర్, యాక్ససరీస్ చాలా వరకు ఒకే మోడల్స్లో ఉంటున్నాయి. హారమ్ ప్యాంట్స్/ ధోతీ అమ్మాయిలు ఉపయోగిస్తున్నారు, అబ్బాయిలు కూడా వాడుతున్నారు. వీటిమీదకు ఇద్దరూ టీ షర్ట్స్, షార్ట్ కుర్తీలూ, షర్ట్స్ వేసుకుంటున్నారు.→ బ్లేజర్స్, టీ షర్ట్స్, ధోతీ, టులిప్ ప్యాంట్స్... ఇలా జెండర్ లేకుండా యూనీసెక్స్ డిజైన్ మంచి ట్రెండింగ్లో ఉంది. ఇది డ్రెస్సులకే కాదు కళ్లద్దాలు, వాచీ, ఫుట్వేర్ విషయంలో కూడా ఇద్దరి డిజైన్స్ ఒకేలా ఉంటున్నాయి. → చీరలను కట్ చేసి, కుట్టడం అనే ఆలోచన కూడా దూరమై చీరలనే ధోతీలుగా, లుంగీలుగా కట్టుకుంటున్నారు. ఇందుకు కాటన్, ప్రింటెడ్, సిల్క్... ఇలా ఏ శారీ అయినా ధోతీలాగా మార్చుకుంటున్నారు. ఇలా సంప్రదాయ వేడుకలు, పండుగలలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. వీటి మీదకు షార్ట్, లాంగ్ కుర్తీలు, బ్లేజర్లు వేసుకోవచ్చు. → సాధారణంగా ఆడవాళ్లు నాలుగుసార్లు కట్టాక ఆ చీరను మళ్లీ కొన్నాళ్ల పాటు కట్టరు. అలాగని, ఆ చీరను కట్ చేసి, కుట్టడం అనే దానిని ఆడవాళ్లు ఇష్టపడరు. అందుకని, చీరను ధోతీ, ప్యాంట్లాగా విభిన్న పద్ధతులలో కట్టుకుంటున్నారు. చీరను ధోతీలాగా ఎలా కట్టుకోవచ్చో సోషల్మీడియాలో చూసి, తెలుసుకోవచ్చు. దీనికి నడుము భాగంలో బెల్ట్ సెట్ చేసుకుంటే సేఫ్టీ ఉంటుంది.బెనారస్ చీరతో ధోతీఇటీవలి నా వివాహానికి రెడీమేడ్గా ఉండే కుర్తా పైజామా, ధోతీ డ్రెస్సులను షాపుల్లోనూ, బొటిక్లలోనూ చూశాను. ఏదైనా స్పెషల్గా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచించాను. పెళ్లికి మా అమ్మ కొన్న చీరలను చూసినప్పుడు బ్లూ బెనారస్ శారీ భలే ఆకర్షణీయంగా అనిపించింది. ఆ చీరతో ఏమైనా స్పెషల్ చేయవచ్చా... అని ఆలోచించాను. ఆన్లైన్లో కనిపించే సంప్రదాయ దుస్తుల డిజైన్స్ చూశాను. టైలర్ని కలిసి, నా ఆలోచనను చెప్పాను. ధోతీ, కండువా చేయడానికి టైలర్ ఒప్పుకున్నారు. అలా చీర మిడిల్ పార్ట్తో ధోతీ చేయించాను. పల్లూ, బార్డర్ వంటివి ఉపయోగించి దుపట్టా డిజైన్ చేయించాను. కుర్తా కోసం కాంబినేషన్ క్లాత్ కోసం వెతికితే ఆ కలర్ మార్కెట్లో దొరకలేదు. దీంతో వైట్ క్లాత్ తీసుకొని, లైట్ షేడ్ వచ్చేలా డై చేయించాను. ఆ క్లాత్తో కుర్తా పూర్తయ్యింది. ఈ సెట్కి లైనింగ్ వేయించడం వల్ల డ్రెస్కి మంచి ఫాలింగ్ వచ్చింది. సాధారణంగా పెళ్లికి మెన్ ట్రెడిషనల్ వేర్కి 50 వేల రూపాయల నుంచి బడ్జెట్ అవుతుందని చెప్పా,రు. నేను ఇలా డిజైన్ చేయించుకోవడం వల్ల పాతిక వేల రూపాయలలో డ్రెస్ పూర్తయ్యింది. పెళ్లిలో ఈ యునిక్ డిజైన్ గురించి చాలా మంది అడిగారు. – కృష్ణ సందీప్ -
ఐడెంటిటీకి మరింత బ్యూటీ
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూవాగం ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన అందాల పోటీలో కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి విజేతగా నిలిచారు. తమిళనాడులోని విళ్లుపురంలో అట్టహాసంగా జరిగిన ఈ ట్రాన్స్ వేడుకలో ఆమె ‘మిస్ కూవాగం 2026’ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్ జెండర్లను ఏకం చేసే ఈ సాంస్కృతిక వేదికపై సూర్యకుట్టి సాధించిన విజయం, ఆ కమ్యూనిటీ ఐడెంటిటీకి, ఆత్మవిశ్వాసానికి, కళాత్మక ప్రతిభకు అద్దం పడుతోంది.ట్రాన్స్ జెండర్ల ఆరాధ్య దైవమైన కూతాండవర్ వెలసిన కూవాగం గ్రామంలో ప్రతి ఏటా కూవాగం ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మహాభారతంలోని అరవాన్ (కూతాండవర్) బలి ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 14న ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలను సౌత్ ఇండియన్ ట్రాన్స్ జెండర్ అసోసియేషన్, తమిళనాడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ, తమిళనాడు ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంయుక్తంగా నిర్వహించాయి. అందులో భాగంగా కోయంబత్తూరుకు చెందిన సూర్య కుట్టి మిస్ కూవాగం 2026 టైటిల్ను గెలుచుకుని అందరినీ ఆనందంలో ముంచెత్తారు.ప్రథమ స్థానంలో సూర్యతమిళనాడు విళ్లుపురం మున్సిపాలిటీ మైదానంలో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 25 మంది పోటీదారులు మూడు దశల్లో తమ ఆత్మవిశ్వాసం, ప్రతిభను ప్రదర్శించారు. ర్యాంప్ వాక్లో, జడ్జిల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో సూర్య కనబరచిన చాకచక్యం ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టింది. రెండో స్థానాన్ని మలేసియాకు చెందిన నిషా నిలబెట్టుకుంటే, పుదుచ్చేరికి చెందిన అనన్య మూడోస్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మరో ఏడుగురు ట్రాన్స్ జెండర్లకు ‘యంగ్ అచీవర్స్’ పురస్కారాలను కూడా అందజేశారు. అంతకుముందు జరిగిన ‘మిస్ తిరునంగై 2026’ పోటీలో చెన్నైకి చెందిన ఓమన మొదటి బహుమతి గెలుచుకోగా, సాయి శ్రీ, సుఖి తర్వాతి స్థానాల్లో నిలిచారు.దేశ విదేశాల నుంచి తమిళనాడులోని కూవాగం గ్రామంలో ఉన్న కూతాండవర్ దేవాలయంలో జరిగే ఈ ఉత్సవం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా, ట్రాన్స్ జెండర్ల సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా సింగపూర్, హాంగ్ కాంగ్ వంటి దేశాల నుంచి వేల సంఖ్యలో ట్రాన్స్జెండర్లు ఇక్కడికి చేరుకుని తమ ఆరాధ్య దైవాన్ని పూజిస్తారు.ఉనికిని చాటే వేదిక కూతాండవర్ ఆలయ ఉత్సవాల్లో భాగమైన ఈ మిస్ కూవాగం పోటీ కేవలం అందానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ట్రాన్స్ జెండర్ల ఉనికిని చాటే ఒక గొప్ప వేదిక. ఈ వేదిక సూర్య కుట్టి సాధించిన విజయానికి, పట్టుదలకు కోయంబత్తూరు కీర్తికి నిదర్శనంగా నిలిచింది. ప్రముఖ సినీ నటులు, గాయకుల సమక్షంలో ఆమెకు ఈ గౌరవం లభించడం విశేషం. కుటుంబ మద్దతే మా బలంట్రాన్స్ జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలంటే ముందుగా కుటుంబం నుంచి మద్దతు లభించాలి. నా ఈ విజయం మరికొంత మంది ట్రాన్స్జెండర్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని అనుకుంటున్నాను. ప్రభుత్వం ప్రతిపాదించే చట్టాలు మా హక్కులను కాపాడేలా ఉండాలి. ట్రాన్స్ జెండర్ సమాజం పట్ల ఉన్న వివక్షను తొలగించి, హక్కుల కోసం పోరాడుతూ.. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలవడమే లక్ష్యం. -
క్రీమ్ కలర్ సిల్క్ చీరలో రష్మిక మందన్న గ్లామరస్ లుక్..!
టాలీవుడ్ నటి రష్మిక మందన్న, విజయ దేవర కొండల పెళ్లి ఫిబ్రవరి 26,2026న ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయ శైలిని ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దాలో పాఠాలు నేర్పుతూనే ఉంది. తన పెళ్లి వేడుక కోసం కిలోల కొద్దీ బంగారు ఆభరణాల నుంచి రిసెప్షన్లో ధరించి కూర్గీ శైలి చీర వరకు ప్రతి సందర్భంలోనూ ఫ్యాషన్ ప్రియులను గ్లామరస్ లుక్తో కట్టిపడేస్తోంది. ఒక అవార్డుల వేడుకు కోసం రష్మిక క్రీమ్ కలర్ సిల్క్ చీరలో తళుక్కుమంది. ఇన్స్టాగ్రామ్లో అందుకు సంబంధించిన ఫోటోలను రష్మిక షేర్ చేశారు. ఆమె స్టైలిస్ట్ గౌర్వి ప్రత్యర్తి మృణాలినీ రావు కలెక్షన్ల నుంచి ఎంపిక చేసుకున్నారు ఈ చీరను. ఈ సిల్క్ పట్టు మాదిరి చీరకు క్లిష్టమైన పూల జర్దోజీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ చీరకు ఎరుపు రంగులోని ఎంబ్రాయిడరీ బ్లౌజ్ని జత చేశారు. దాంతో ఈ చీర అత్యంత హైలెట్గా నిలిచి అందరి చూపులను ఆకర్షించింది. అంతేగాదు ఈ చీర ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 1.68 లక్షలు పైనే పలుకుతుంది. అందుకు తగ్గట్టుగా చాలా నేచురల్ మేకప్, హెయిర్ స్టైల్ కోసం మధ్యలో పాపిడి తీసిన పోనీటెయిల్తో తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. అలాగే తన శారీకి అనుగుణంగా మధ్యలో పచ్చరాయితో మెరుస్తున్న స్టేట్మెంట్ చెవిపోగులు, చిన్న నెక్చైన్, మంగళ సూత్రంతో సాంప్రదాయబద్దమైన మహిళలా అద్భుతంగా కనిపించారామె. అంతేగాదు రష్మిక బ్యూటీఫుల్ ఫోటోలను రీపోస్ట్ చేస్తూ సదరు బ్రాండ్ ఇలా రాసింది. "మృణాలినీ రావు దుస్తులలో మిమ్మల్ని చూడటం మాకు ఎల్లప్పుడూ ఇష్టమే! ఈ చీరలో అద్భుతంగా కనిపిస్తున్నారు." అని పేర్కొంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) (చదవండి: విమానం గాల్లో ఉండగానే ప్రసవం..! అయితే..) -
ఎరుపు రంగు డ్రెస్లో ఇషా అంబానీ స్టన్నింగ్ లుక్..!
అంబానీ కుటుంబం ముంబైలోని తమ నివాసం ఆంటిలియాలో రిహానాకు ఆతిథ్యం ఇచ్చింది. తన బ్యూటీ బ్రాండ్ ఫెంటీ బ్యూటీ ప్రారంభోత్సవం కోసం ఈ గాయని భారతదేశంలో ఉన్నారు. రిహానా ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీలతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఆషా అంబానీ ఆకర్షణీయమైన ఎరుపు రంగు చానెల్ డ్రెస్లో తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఆకర్షణీయమైన ముదురు ఎరుపు రంగు దుస్తులలో సున్నితమైన పూసల పనితో కూడిన పారదర్శకమైన పైపొర, నేల వరకు జారే ప్లీటెడ్ స్కర్ట్ ఉన్నాయి. ఈ డిజైనర్వేర్ని మాథ్యూ బ్లేజీ రూపొందించారు. చానెల్ స్ప్రింగ్ సమ్మర్ 2026 కౌచర్ షో నుంచి తీసుకున్న ఒక సరికొత్త డిజైనర్వేర్. ఈ దుస్తులలో నడుము వరకు పొడవున్న అంచు, పూర్తి పొడవు చేతులు, ఓపెన్ ఫ్రంట్, గుండ్రని మెడ, అంచులపై సున్నితమైన పూసల ఎంబ్రాయిడరీ, చేతులపై రఫుల్స్తో కూడిన ప్రకాశవంతమైన ఎరుపు రంగు షీర్ ష్రగ్ ఉంది. అలాగే ఆమె రాశిచక్రం వృశ్చికం కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉండటం విశేషం. ఇషా ఈ జాకెట్ను దానికి సరిపోయే ఎరుపు రంగు డ్రెస్ పైన ధరించి సరొకొత్త స్టైలిష్ లుక్ని పరిచయం చేశారామె. అందుకు తగ్గట్టుగా ఇషా తన డ్రెస్ మెటీరియల్తోనే తయారు చేసిన బంగారు గొలుసు బ్యాగ్, బ్లాక అండ్ వైట్ మేరీ జేన్స్ స్లిప్పర్స్, సున్నితమైన వజ్రాలు పొదిగిన చెవిపోగులతో సహా, తల నుంచి కాలి వరకు షానెల్ యాక్సెసరీలతో స్టైల్ చేసింది. ఆ డ్రెస్కి తగ్గట్టుగా పాపిడి తీసిన వదులైన జుట్టు, ముదురు రంగు కనుబొమ్మలు, మస్కారా పూసిన కనురెప్పలు, మౌవ్ రంగు లిప్ షేడ్, బ్లష్ పూసిన బుగ్గలతో హీరోయిన్ రేంజ్లో తళుక్కుమన్నారామె. మరీ ఈ డ్రెస్ ఖరీదు వచ్చేసి రూ. 70 లక్షలు పైనే పలుకుతుందట.(చదవండి: జస్ట్ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!) -
బహుభాషావేత్త... సోలో ట్రావెలర్ అందం బహుముఖం
ముప్పై రాష్ట్రాల అందాల ప్రతినిధులతో భువనేశ్వర్లో జరిగిన ‘మిస్ ఇండియా వరల్డ్ 2026’ పోటీలో విజేతగా నిలిచిన గోవా అమ్మాయి సాధ్వీ సతీష్ విశేషాలు తెలుసుకునేకొద్దీ ఆశ్చర్యపోతున్నారు అంతా. ఆమె రెండు చేతులతోనూ రాస్తుంది. చాలా స్పీడ్గా కారు నడుపుతుంది. ఏడు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. కెనెడాలో ఎకనామిక్స్ చదివి సోలో ట్రావెలర్గా దేశాలు తిరుగుతుంది. ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలిచి, గోవా ఘనతను చాటింది. ఈ కాలపు అమ్మాయంటే సాధ్వీ సతీషే.‘చిన్నప్పటి నుంచి నేను కొంచెం తేడా. నలుగురితో పెద్దగా కలిసే దాన్ని కాదు. చిన్నప్పుడు ఖాళీ టైమ్ దొరికితే రెండు చేతులతో ఒకేసారి రాయడం ప్రాక్టీసు చేసేదాన్ని’ అంటోంది గోవా అందాల బరిణె సాధ్వీ సతీష్. గోవా ఇసుక తీరాల్లో ఆడుకున్న ఈ అమ్మాయి ‘మిస్ ఇండియా 2026 వరల్డ్’ టైటిల్ గెలుచుకొని 2027లో జరగనున్న ‘మిస్ వరల్డ్’ పోటీలలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.→ మొదటి గోవా అమ్మాయిభువనేశ్వర్లోని ‘కె.ఐ.ఐ.టి. విశ్వవిద్యాలయం’లో ఏప్రిల్ 18న వైభవంగా జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026’ ఫైనల్స్లో 25 ఏళ్ల సాధ్వీ సతీష్ విజేతగా గెలిస్తే, మొదటి రన్నరప్గా మహారాష్ట్రకు చెందిన రజ్నందిని పవార్, రెండో రన్నరప్గా జమ్మూ కశ్మీర్కు చెందిన శ్రీఅద్వైత నిలిచారు. న్యాయనిర్ణేతలుగా జీనత్ అమన్, నేహా ధూపియా, మధుర్ భండార్కర్, ఒలింపిక్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. సాధ్వీ సతీష్ ఈ టైటిల్ను గెలవడం వల్ల ‘మిస్ వరల్డ్’కు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న తోలి గోవా అమ్మాయి అయ్యింది. స్వాధ్వీ సతీష్ కర్ణాటకలోని కార్వార్లో పుట్టినా తను పెరిగిన గోవానే∙ఊపిరిగా భావిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి గోవా సంస్కృతి, సముద్రం ఇష్టం. బెంగళూరులోని అమృత విద్యాలయంలో చదివి, ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డబుల్ మేజర్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్లో ప్రవేశించి అందాల పోటీ వరకూ ఎదిగింది.→ నాన్న ప్రోత్సాహంఅమ్మా నాన్నల ప్రోత్సాహం లేకుండా పిల్లలకు ఏ విజయమూ సిద్ధించదు. సాధ్వీ సతీష్ విజయం వెనుక తండ్రి సతీష్ కృష్ణ సెయిల్, తల్లి ప్రియాంక సెయిల్ ఉన్నారు. ముఖ్యంగా తండ్రి సతీష్ కూతురి కలలకు రెక్కలు తొడిగిన వ్యక్తి. ‘ఆడపిల్ల అయినా ప్రపంచం చుట్టి రావాలి’ అని కెనడా చదువుకు, సోలో ట్రావెలింగ్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లి ప్రియాంక గోవా సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను సాధ్వీలో నింపింది. ‘నాన్న నన్ను ఆకాశానికి ఎగిరేలా చేశారు. అమ్మ నా కాళ్లు నేల మీద ఉంచింది. మిస్ ఇండియా కిరీటం నాది కాదు, మా అమ్మా నాన్నలది’ అంది సాధ్వీ.→ సోలో ట్రావెలర్‘కెనెడాలో చదువు పూర్తయ్యాక మెక్సికోకు మొదటి సోలో ట్రావెల్ చేశాను’ అని తెలిపింది సా«ధ్వీ. లోకం చూడటానికి ఇష్టపడే సాధ్వీ మూడేళ్లలో పది దేశాలు ఒంటరిగా తిరిగింది. కొత్త సంస్కృతులు, కొత్త మనుషులు, కొత్త సవాళ్లు అన్నింటినీ ఆహ్వానించింది. ఈ ప్రయాణాలే తనకు స్వతంత్రంగా ఆలోచించడం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పాయి అంటుందామె. మరో విశేషం ఏమిటంటే సాధ్వీకి తేనెటీగలంటే విపరీతమైన భయం. ఫోబియా. ఆ ఫోబియాను జయించడానికి సర్టిఫైడ్ బీకీపర్గా శిక్షణ తీసుకుంది. భయాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే.→ బ్యూటీ విత్ ఏ పర్పస్మిస్ ఇండియా పోటీకి కేవలం మూడు నెలల ముందే సిద్ధమైన సాధ్వీ క్రమశిక్షణతో పది కిలోలకు పైగా బరువు తగ్గి ‘టాప్ 5 బెస్ట్ బాడీ’లో నిలిచింది. తర్వాత కిరీటం గెలుచుకుంది. కానీ ఆమె లక్ష్యం కిరీటం కంటే పెద్దది. వినికిడి, మాటల లోపం ఉన్న పిల్లలకు మెరుగైన పోషకాహారం, సమాన అవకాశాలు కల్పించడం ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్. టాంజానియా వేదిక కానున్న ‘మిస్ వరల్డ్ 2027’ పోటీలో భారత్ తరపున ఇలాగే విజయం సాధించాలని కోరుకుందాం. -
మౌన్ జారో పెళ్లికూతురు
పెళ్లి పీటలెక్కే ముందు నాజూగ్గా కనిపించాలన్న ఆకాంక్ష కొత్తది కాదు. కానీ ఇప్పుడు ఆ ఆకాంక్ష ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’. ‘మౌన్ జారో’ అనే టైప్ 2 డయాబెటిస్ ఇంజెక్షన్లను ఇస్తూ ఢిల్లీలోని వెల్నెస్ క్లినిక్లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.క్షేమకరం కాని ఈ ట్రెండ్ పై కథనం.అదేమిటో... పెళ్లంటే అమ్మాయే అందంగా కనిపించాలని సామాజిక చట్టం. అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు. అమ్మాయి రూపానికి సంబంధించి ఎన్నో పట్టింపులు, ఆరాలు, నఖశిఖ పర్యంత పరీక్షలు. కాబట్టే పెళ్లంటే ఈ కాలంలో కూడా అమ్మాయిలు టెన్స్ అయ్యే పరిస్థితి ఉంది. వీరి కోసమని ‘మేకోవర్’లూ, ‘బ్రైడల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్యాకేజీ’లు మార్కెట్లో బయలుదేరాయి. ఈ పరిస్థితి ఢిల్లీలో కొత్త రూపం తీసుకుంది. దాని పేరే ‘మౌన్ జారో పెళ్లికూతురు’.‘మౌన్ జారో’ అనేది టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు వాడే ఔషధం. దీనిలోని ‘టిర్జెపటైడ్’ అనే పదార్థం ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. ఈ ఔషధం పేరుతోనే ఇప్పుడు ఢిల్లీలోని వెల్నెస్ క్లినిక్లు, బరువు తగ్గించే కేంద్రాలు పెళ్లికూతుళ్ల కోసం ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.ఎందుకు ఈ ట్రెండ్?పెళ్లికి మూడు నుంచి ఆరునెలల ముందు 10నుంచి 15 కిలోలు తగ్గాలని చాలామంది యువతులు కోరుకుంటున్నారు. జిమ్, డైట్తో సాధ్యం కాని ఫలితాలు త్వరగా కావాలనుకునే వారు ఈ ప్యాకేజీల వైపు మొగ్గుతున్నారు. పెళ్లికి అవసరమైన లెహంగా ఫిట్టింగ్, ఫొటో షూట్, సోషల్ మీడియా ఒత్తిడి కూడా దీనికి కారణమవుతున్నాయి.ప్యాకేజీల్లో ఏముంది?ఢిల్లీలోని క్లినిక్లు ‘బ్రైడల్ ట్రాన్స్ఫర్మేషన్’, ‘వెడ్డింగ్ రెడీ’ పేర్లతో ప్యాకేజీలు ఇస్తున్నాయి. వీటిలో వైద్యుల పర్యవేక్షణలో మౌన్ జారో ఇంజెక్షన్లు, డైట్ కౌన్సెలింగ్, బాడీ కాంటూరింగ్ (నిర్దిష్ట శరీర భాగం సన్నబరచడం) సెషన్లు కలిపి అందిస్తున్నారు. వీటి ధర 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉంటోంది. పెళ్లి డేట్ చెప్పగానే ఆ డేట్కు టార్గెట్ బరువు సెట్ చేసి ప్లాన్ ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.వైద్యుల హెచ్చరికఅనన్య లాంటి కేసులపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌన్ జారో అనేది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడని ఔషధం. వికారం, వాంతులు, ప్యాంక్రియాటైటిస్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కేవలం కాస్మెటిక్ కారణాలతో, వైద్య అవసరం లేకుండా దీన్ని వాడడం ప్రమాదకరమని ఎండోక్రై నాలజిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గిన తర్వాత జీవనశైలి మార్చుకోకపోతే తిరిగి బరువు పెరిగే అవకాశం 80 శాతం వరకు ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.నా రూపమే నా సౌందర్యంఇలాంటి ట్రెండ్ సమాజంపై ఒత్తిడిని పెంచుతోందనీ సాదాసీదా అమ్మాయిల ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తోందని సామాజికవేత్తలు అంటున్నారు. పెళ్లంటే సన్నగా ఉండాలనే భావన బలపడేలా చేస్తున్న సౌందర్య సాధనాల సంస్థల ప్రచారాన్ని నిరోధించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ‘మౌన్ జారో పెళ్లికూతురు’ ట్రెండ్ యథాతథ రూపంలోని ఒరిజినాలిటీని సవాలు చేస్తోంది. ‘నా రూపమే నా సౌందర్యం’ అనే ఆత్మవిశ్వాసాన్ని పెళ్లగిస్తోంది. ‘ఆరోగ్యంగా ఉండటమూ అందంగా ఉండటమే’ అనే సంగతిని ఆడపిల్లలు మర్చిపోతున్నారు. పెళ్లిరోజున అందంగా కనిపించాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ ప్రయత్నంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సరైనదేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరిని మర్చిపోవద్దు. అలాగే నకిలీ వెల్నెస్ క్లినిక్ల బారిన పడొద్దు. పెళ్లిలో బాగా కనిపించాలని..ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల అనన్య శర్మ (పేరు మార్చబడింది) అనుభవం ఈ ట్రెండ్కు అద్దం పడుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన అనన్యకు 2026 ఆగస్టులో వివాహం నిశ్చయమైంది. ఆమె బరువు 78 కిలోలు. డిజైనర్ లెహంగా సెట్ అవ్వాలంటే కనీసం 65 కిలోలకు రావాలని బోటిక్ వారు సూచించారు. జిమ్లో చేరినా ఉద్యోగ ఒత్తిడి వల్ల క్రమం తప్పకుండా వెళ్లలేకపోయింది. దీంతో స్నేహితురాలి సలహాతో సౌత్ ఢిల్లీలోని ఒక ప్రముఖ స్లిమ్మింగ్ క్లినిక్లో ‘బ్రైడల్ మౌన్ జారో ప్యాకేజీ’ తీసుకుంది. నాలుగు నెలల ప్యాకేజీ ఖరీదు 1.4 లక్షలు. వారానికి ఒకసారి టిర్జెపటైడ్ ఇంజెక్షన్, నెలకు రెండుసార్లు డైటీషియన్ కన్సల్టేషన్, 8 సెషన్ల బాడీ కాంటూరింగ్ ఇందులో భాగం. ‘మొదటి నెలలోనే ఆకలి బాగా తగ్గింది. 4 కిలోలు తగ్గాను’ అని అనన్య చెప్పింది. నాలుగు నెలలు పూర్తయ్యేసరికి ఆమె 12 కిలోలు తగ్గి 66కిలోలకు చేరింది. అయితే ఈ క్రమంలో తరచూ వికారం, నీరసం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపింది. ‘పెళ్లి అయ్యాక మందు ఆపేస్తే మళ్లీ బరువు పెరుగుతానేమో అనే భయం ఉంది. కానీ పెళ్లి రోజు ఫోటోల్లో బాగా కనిపించడం నాకు ముఖ్యం’ అని ఆమె అంది. -
అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్..! ఆ శారీ ప్రత్యేకతలివే..
సెలబ్రిటీల కారణంగా అంతరించిపోతున్న కొన్ని అరుదైన వస్త్రాలు, నేతలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా వారివల్ల రానున్న తరాలు మన హస్తకళాకారుల వైభవం, నాటి రాజుల వస్త్రాలంకరణ గురించి తెలుసుకునే అవకాశం దక్కుతోంది. అలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న అరుదైన చీర గురించి నటి కంగనా రనౌత్ పుణ్యమా అని అందరూ తెలుసుకునే అవకాశం దొరికింది. ఇంతకీ ఆమె ఎలాంటి చీర ధరించారు, దాని ప్రత్యేకలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఒకప్పుడు తంజావురు రాజకుటుంబీకులు కోసం మాత్రమే ప్రత్యేకించి హస్తకళకారులు నేసేవారట. అవే కొడాలి కరుప్పూర్ చీరలు. చిత్రలేఖనం , రెసిస్ట్ డైయింగ్ల కలయికలతో ఉంటుంది ఈ శారీ. ఇది 800 ఏళ్లనాటి చరిత్ర కలిగిన అరుదైన వస్త్రం అట. ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని పునరుద్ధరిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని చీరల నమునాలను మ్యూజియంలో భద్రపరిచారు కూడా. దీని గురించి భారతదేశ చేనేత, హస్తకళలపై కంటెంట్ సృష్టించే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రాయ్ చౌధురి ఈ అరుదైన చీరను గురించి నెట్టింట షేర్ చేయడంతో మరోసారి ఈ శారీ వెలుగులోకి వచ్చింది. ఆమె నటి ఎంపీ కంగనా రనౌత్ తమిళనాడుకు చెందిన కొడాల కరుప్పూర్ చీరను ధరించడం గురించి మాట్లాడారు. ఈ చీరలు 1787 నుంచి 1832 మధ్య మరాఠా పాలకుడు సర్ఫోజీ రాజా భోంస్లే చత్రపతిII పోషణలో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. 19వ శతాబ్దం వరకు తంజావురు రాణుల కోసం నేసేవారట ఈ చీరలను. "వీటిని తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలో ఉన్న కోడాలి కరుప్పూర్ గ్రామంలో ఉత్పత్తి చేసేవారు. ఆ నేత కార్మికుల పూర్వీకులు సౌరరాష్ట్ర, మధురై, సేలం, కాంచీపురానికి వలస వచ్చిన సుమారు 400 నుంచి, 500 కుటుంబాలకు చెందినవారు. దీనిని 'ఖిల్లాత్' లేదా "గౌరవ వస్త్రాలు"గా కూడా ఉపయోగించేవారు. ఇది ఆలయ ఆచారాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేదట. ఒకే వస్త్రాన్ని నేయడంలో బహుళ పద్ధతులను ఉపయోగించడమే ఈ వస్త్రాన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. "కరుప్పూర్ వస్త్రాల నమూనా ప్రక్రియలో మొదటి దశ బంగారం లేదా వెండి జరీతో జందానీ నేత. దానిపై కలంకారి మాదిరిగా మైనపు నిరోధక రంగు, మోర్డెంట్రంగు చిత్రలేఖనాన్ని ఉపయోగించి నమునాను సృష్టిస్తారని పోస్ట్లో వెల్లడించారు రాయ్.స్పెషాల్టీ..కేవలం నేతపై ఆధారపడే కాంచీపురం పట్టుకు లేదా ప్రధానంగా చిత్రలేఖనంతో కూడిన కలంకారికి భిన్నంగా, ఈ కొడాలి కరుప్పూర్ చీర ఒకే వస్త్రంలో నేత, నిరోధక రంగు అద్దకం, చేతి చిత్రలేఖనాన్ని ప్రత్యేకంగా మిళితం చేస్తుంది. వాస్తవానికి వీటిని స్వచ్ఛమైన పత్తితో నేసేవారు. అయితే మ్యూజియంలో భద్రపరిచినవి మాత్రం 'దొరుఖా' రకానికి చెందినవట, అంటే రెండు వైపులా ఒకేలా కనిపించే కళ ఇది. కొన్ని చీరల్లో రంగు చిత్రలేఖనానికి బదులుగా ముద్రణ కోసం బ్లాకులను కూడా ఉపయోగిస్తారట. బ్రిటిష్ వారు తంజావూరును స్వాధీనం చేసుకున్న తర్వాతే ఈ చీర ఉత్పత్తి క్షీణించడం మొదలైందని చెబుతున్నారు చరిత్రకారులు. సంక్లిష్టమైన రెసిస్ట్ డైయింగ్ పద్ధతి, కష్టతరమే నేత ప్రక్రియ దీనికి తోడు ఆయా హస్తకళాకారుల లేకపోవడం వంటి కారణంగా ఈ చీరలు అంతరించిపోయాయని అంటున్నారు. అసలైన కొడాలి కరుప్పూర్ చీర కేవలం మ్యూజియంలోనే చూడగలమట. ఇప్పుడు వస్తున్న కరుప్పూర్ చీరలు దాని మాదిరి నేత చీరలే తప్ప అసలైనవి కావట. ఈ అరుదైన వస్త్రం మరింతగా రావాలంటే..హస్తకళాకారులు దీనిపై దృష్టిసారించి నాటి చీరల్లా రూపొందించాలి, అలాగే ఉత్పత్తికి తగ్గట్టుగా మంచి ఆదాయం వారికి లభిస్తే ఈ అరుదైన చీరలకు మళ్లీ నాటి వైభవం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు సాంస్కృతిక నిపుణులు. ఇక కంగనా చీర తమిళనాడులోని చెన్నైలో ఉన్న అక్ష్ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్కు చెందినది. కళాక్షేత్ర ఫౌండేషన్లోని క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ చీరను పరిరక్షించడానికి కృషి చేస్తోంది. అయితే అవి నాటి తంజావురు రాజవంశికులు ధరించిన చీరల మాదిరిగా ఉండవనేది చాలామంది అభిప్రాయం. View this post on Instagram A post shared by Diya Roychowdhury (@vastrakathaxdiya) (చదవండి: 40 వేల మంది విద్యార్థులు అలా..! భావోద్వేగంలో నికితా పోర్వాల్) -
అక్కాచెల్లెళ్లు తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్ ఇదే..!
దిగ్గజ నేపథ్య గాయని ఏప్రిల్ 12, ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఏ తరానికి చెందినవారైన ఆశా మధురమైన గాత్రానికి ఫిదా అవ్వాల్సిందే. ట్రెండ్కి తగ్గట్టుగా ఆలపిస్తూ..అభిమానుల మనసును దోచుకునే దిగ్గజ గాయని. ఆ సంగీత నైపుణ్యం ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి కూడా. అక్క లతా మంగేష్కర్ అడుగుజాడల్లోనే నడుస్తూ..సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి పాటలైన ఆశా స్వరంతో జత కలిస్తే ఓ అద్భుతం అనేలా పేరుతెచ్చుకున్నారామె. అలాంటి పాటలరాణి మనముందు లేరు అన్నమాటే బాధగా అనిపిస్తున్నా..ఆమె జ్ఞాపకాలు, స్మృతులు మనకళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. వాటిలో ఒకటి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకే విధమైన రంగు చీరలతో కనిపించిన అద్భుతమైన దృశ్యాలు. ఇద్దరు ఎక్కువగా తెలుపు రంగునే ఎంచుకునేవారు. దీంతో అభిమానులు ఇద్దరూ ఇలా ఎందుకు ధరిస్తారనే దానిపై చాలా కుతుహలంగా ఉండారు. ఒక షాడ్కాస్ట్లో దివంగత గాయని ఆశా భోంస్లేనే ఆ విషయాన్ని పంచుకున్నారు. ఎందుకు ఆ రంగే ఇష్టం అంటే..గతేడాది ఆర్జే అన్మోల్, అతని భార్య నటి అమృతరావు హోస్ట్ చేసిన 'కపుల్ ఆఫ్ థింగ్స్' అనే పాడ్కాస్ట్తో భోస్లే అరంగేట్రం చేశారు. ఆ సంభాషణలో తన సోదరి వృత్తిపరమైన ప్రత్యర్థి అయినప్పటికీ ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారామె. అంతేగాదు ఆ ఇంటర్వ్యూలో ఆశా తన సోదరి ఇద్దరూ తెలుపు రంగుకే తొలి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చేవారో చెప్పారు. View this post on Instagram A post shared by Lata Mangeshkar (@lata_mangeshkar) "నేను దీదీ(లతా మంగేష్కర్) ఎల్లప్పుడూ తెల్ల చీరలే ధరించేవాళ్లం. తెలుపు రంగు మా చర్మ ఛాయకు బాగా నప్పుతుందని మేము భావించేవాళ్ళం. ఇతర రంగులు ధరిస్తే, మేము మరింత నల్లగా కనిపించేవాళ్ళం. ఆ తర్వాత, నేను గులాబీ రంగు చీరలు ధరించడం మొదలుపెట్టాను, దీదీ నన్ను వింతగా చూసేవారు, కానీ నేను నెమ్మదిగా గులాబీ రంగుతో పాటు ఇతర రంగులను కూడా జోడించడం ప్రారంభించాను." అని నవ్వతూ చెప్పారామె. కాగా, ఆశా భోంస్లే తన దుస్తుల విషయంలో రంగులను ఇష్టపడటం మొదలుపెట్టారు. కానీ లతా మంగేష్కర్ అడపాదడపా కనిపించే ప్రకాశవంతమైన ఎరుపు రంగు బ్రోకేడ్ పల్లు లేదా షెవ్రాన్ ప్రింటెడ్ బహుళ-రంగుల అంచు మినహా, తెలుపు, లేత తెలుపు వంటి ఐవరీ దుస్తులకే పరిమితమయ్యారు. భోంస్లే కాలక్రమేణా తన జీవిత ఉత్సాహాన్ని వ్యక్తపరిచేలా రంగుల దుస్తులతో తన ఇమేజ్ను పెంచుకున్నారు. ఆమె ఎక్కువగా చందేరి, బనారసి, చేనేత వస్త్రాలు, కాంజీవరం చీరలు, షిఫాన్ ప్రింట్లు వంటి రకరకాల రంగురంగుల చీరలతో తళుక్కుమనేవారు. గాత్రంలోనే కాదు..వేషధారణలోనూ ఆశా ఎవర్గ్రీన్ అన్నట్లుగా తన మార్కును చూపించేవారామె. View this post on Instagram A post shared by RJ Anmol 🇮🇳 (@rjanmol27) (చదవండి: Asha Bhosle: నిశబ్దంగా ఆ మధుర స్వరం.. కానీ ఆమె జ్ఞాపకాలు చిరస్మణీయం!) -
ఎన్నడూ చూడని అద్భుతమైన దృశ్యం ఆశాజీ..!
బాలీవుడ్ దిగ్గజ గాయని ఆశాభోంస్లే ఎనిమిది దశాబ్దాలుగా సాగిన నేపథ్య గాన వృత్తికి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఎందరో అభిమానుల మనసు దోచుకున్న ఆ మధుర స్వరం 92 ఏళ్ల వయసులో ఏప్రిల్ 12, 2026న నిశబ్దంగా మారిపోయింది. బహుళ అవయవాల వైఫల్యం కారణంగా గాయని ఆశా మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఒక్కసారిగా యావత్తు ప్రపంచం నుంచి పెద్ద ఎత్తున నివాళులు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆ గాయని మిగిల్చిన కొన్ని మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుందామా..79 ఏళ్ల వయసులో ఆశా మనీష్ మల్హోత్రా కోసం ర్యాంప్పై నడచి తనదైన శైలి, హుందాతనంతో అందర్నీ ఆశ్చర్యపరించారామె. దాని గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసని అంటున్నారు మనీష్ మల్హోత్రా నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ. తన షోలలో ఒకదానిలో ఆమె నడిచిన తీరును గుర్తుచేసుకుంటూ, ఆయన సోషల్ మీడియా పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. నా ఫ్యాషన్ వీక్ షోలో మీరు ఉన్నప్పటి చిత్రాలు ఇవి అంటూ నాటి ఫోటోలను షేర్ చేస్తూ..ర్యాంప్పై ఒక్కసారైన నడవాలన్నదే నా కోరిక అని నాతో చెప్పారు.ఆ నిమిత్తమై మేము మిమ్మల్ని సాధరంగా అడిగినప్పుడూ.. మీరు వెంటనే అంగీకరించిఎంతో హుందాగా, స్టైలిష్గా సంతోషంగా నడిచారు. మీరు అలా ర్యాంప్పై నడవగానే..ప్రేక్షకులంతా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. అది నేనెప్పుడూ చూడని అద్భుతమైన దృశ్యం ఆశాజీ. మీరు ఎప్పటికీ మా హృదయలో పదిలంగా ఉంటారు అంటూ మల్హోత్రా తన పోస్ట్ని ముగించారు. కాగా, ఆశా భోంస్లే పార్థివ దేహాన్ని ముంబైలోని లోయర్ పరేల్లో ఉన్న ఆమె ఇంటికి తీసుకెవెళ్లారు. పార్థివ దేహాన్ని సోమవారం(ఏప్రిల్ 13, 2026) మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచుతారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) (చదవండి: Asha Bhosle: 'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!) -
'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!
92 ఏళ్ల వయసులో ఆశా భోంస్లే కన్నుమూశారు. ఆమె మరణంతో, ప్రపంచం వేలాది పాటలు పాడిన ఒక గాత్రాన్ని మాత్రమే కోల్పోలేదు, హుందాతనానికి, ఫ్యాషన్ శైలికి కంచుకోట అయినా ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయాం అంటున్నారు ఫ్యాషన్ నిపుణుల. 'పియా తు అబ్ తో ఆజా', 'దిల్ చీజ్ క్యా హై', 'దమ్ మరో దమ్' వంటి అనేక హిట్ పాటలతో ప్రసిద్ధి చెందిన ఆమె ఆహార్యం పరంగా నిరంతరం కొత్తదనాన్ని కోరుకునేవారని చెబుతున్నారు. మరి ఆశా ఫ్యాషన్ పరంగా ఎలాంటివి ఇష్టపడేవారు, చీరల సెలక్షన్ తదితర విశేషాల గురించి తెలుసుకుందామా..!.రూపం పరంగా రాజీపడని విధంగా రెడీ అయ్యేవారట. వాటిలో అత్యంత హైలెట్ అయ్యేవి ఆమె చీరలు. ఆమె వార్డ్రోబ్ మొత్తం మహారాష్ట్ర సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఆమె తరుచుగా మందపాటి బంగారు జరీ అంచులతో కూడిన ఐవరీ క్రీమ్ లేదా పాస్టల్ రంగులో ఉండే బరువైన పట్టు లేదా కాటన్ సిల్క్ చీరలనే ఇష్టపడేవారట. ముక్కుపుడక..ఇక ఆశాలో మరో ప్రత్యేకత ముక్కుపుడక. ఆమె సాంప్రదాయ మహారాష్ట్ర ముక్కుపుడక లేకుండా అలంకరణ పూర్తి చేసేవారు కాదట. ఇది ఆమె మూలాల నేపథ్యాన్ని, హుందాతనానికి ప్రతీకగా నిలిచేవని చెబుతున్నారు ఫ్యాషన్ ప్రియులు. ఇలా ఆమె పండుగలు, పర్వదినాల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై సైతం మహారాష్ట్ర శైలి ముక్కుపుడకనే ధరించేవారట. ముఖాన కచ్చితంగా ఎర్రటి బొట్టు గుండ్రంగా పెద్దదిగా ఉండాల్సిందేనట. ఇది ఆమె వ్యక్తిత్వానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేగాదు గాయని ఆశ అనేక వరుసల ముత్యాల హారాలు, బరువైన బంగారు లేదా వజ్రాల ఆభరణాలు లేకుండా బయటకు వచ్చేవారు కాదట. సింపుల్గా చెప్పాలంటే సాంప్రదాయన్ని, ఆధునికతను మేళవించేలా ఆభరణాలను ఎంచుకునేవారట. అంతేగాదు ఆమెను అభిమానులు ఎక్కువగా సొగసైన చీరలు, చక్కగా చుట్టిన కొప్పులోనే గుర్తించుకుంటారు. చెప్పాలంటే అభిమానుల హృదయంలో తన వేషధారణ నాటుకుని పోయేలా ఆహార్యాన్ని మెయింటైన్ చేసేవారు. పైగ మహారాష్ట్ర ప్రజలు ఆమెను ముద్దుగా 'ఆశా తాయ్'(తాయ్ అంటే మహారాష్ట్రలో అక్క అని అర్థం) అని పిలుచుకుంటుంటారు. అంతేగాదు ఆమె ప్రసిద్ధ పాప్ సంగీతం.. 1997లో లెస్లే లూయిస్తో కలిసి 'జనం సంఝా కరో' అనే విలక్షణమైన పాటను విడుదల చేసే టైంలో కూడా పాశ్చాత్య దుస్తులను ధరించడానికి ఒప్పుకోలేదు. మ్యూజిక్కి వేషధారణతో పనిలేదని, జనాల మనసుకు హత్తుకుందా లేదా అనేది ముఖ్యం అని అన్నారు. చివరి వరకు ఆశా తన సంగీత కచేరీలలో ఎర్రటి బొట్టు, అందమైన మహారాష్ట్ర చీరలతోనే విలక్షణంగా కనిపించారామె. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) (చదవండి: ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..) -
కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..!
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ సందర్భానికి తగ్గట్టు స్టైలిష్ రెడీ అవ్వడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా హస్తకళలు, భారతీయ సంప్రదాయ వారసత్వ విలువ తెలిపేలా నీతా అలంకరణ ఉంటుంది. తాజాగా ఆమె తన తల్లి పూర్ణిమ దలాల్తో కలిసి కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి విశేష పూజలు చేసి, ఆమె ఆవీర్వాదం కోరారామె. ఆలయ దర్శనం కోసం నీతా గులాబీ రంగులోని కుర్తాతో ఎంతో హుందాగా వచ్చారామె. పొడవాటి చేతులతో చుట్టు దుప్పటా దానిపై బంగారు ఎంబ్రాయిడరీ ఆమె లుక్ని మరింత హైలెట్ అయ్యేలా చేసింది. దానికి బంగారు బ్రోకేడ్తో అంచు ఎంబ్రాయిడరీ చేయబడిన స్ట్రెయిట్-ఫిట్ ప్యాంటుతో జత చేసింది. అందుకు తగ్గట్టుగా వదులుగా జుట్టుని వదిలేసి, చక్కటి పాపిడి బొట్టుతో సంప్రదాయంతో మిళితమైన ఆధునిక మహిళలా తళుక్కుమంది. సరళమైన సంప్రదాయ దుస్తులకు అనుగుణంగా మల్టీ-క్యారెట్ కాక్టెయిల్ రింగ్, స్టేట్మెంట్ డైమండ్ చెవిపోగులు ధరించారామె. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆలయం విశిష్టత..మా కామాఖ్య, లేదా కామేశ్వరి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారు. ఈ ఆలయం గౌహతిలో ఉంది. భూమిపై ఉన్న 51 శక్తి పీఠాలలో ఇది అత్యంత పవిత్రమైనది, పురాతనమైనది కూడాతన భద్రతా సిబ్బందితో కలిసి వచ్చిన నీతా అంబానీ, ఈ ఆలయాన్ని సందర్శించి, పూజారుల మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. ఆమె అమ్మవారికి ప్రార్థనలు చేయడం, పూజారులతో మాట్లాడటం, పూజలు నిర్వహించడం, ఆలయంలో ఉన్న భక్తులను పలకరించడం వీడియలో స్పష్టంగా కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Learner (@decodingeliteclass) (చదవండి: మొట్టమొదటి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగ్..! ధర ఎంతో తెలుసా..) -
మొట్టమొదటి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగ్..! ధర ఎంతో తెలుసా..
డైనోసార్లు 66 మిలియన్ సంత్సరాల క్రితమే అంతరించిపోయాయి కదా మరి దాని తోలుతో హ్యాండ్ బ్యాగ్ ఎలా సాధ్యం. బతికే ఉన్న జంతవుల తోలు నుంచి తయారు చేశారంటే అవునా అని అనొచ్చుగానీ, అస్సలు భూమ్మీద మనుగడ లేని ఆ జంతువుల తోలుతో చేసిన లేదర్ వ్యాండ్ బ్యాగ్ ఏంటి అని సందేహించకండి. ఎందుకంటే ఇది ముమ్మాటికి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగే. దాని ధర తెలిస్తే విస్తుపోతారు. అసలు దీన్నెలా రూపొందించారు, ఎందుకంత ఖరీదు తదితర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఒక ప్రాజెక్టులో భాగంగా నెదర్లాండ్ శాస్త్రవేత్తలు, డిజైనర్లు టైరన్నోసారస్ రెక్స్ శిలాజాలల(డైనోసార్ శిలాజాలు) నుంచి సేకరించిన కొల్లాజెన్ను ఇతర జంతువుల కణాలతో కలిపి ల్యాబ్లో కృత్రిమంగా పెంచారు. ఈ ప్రాజెక్ట్లో మొత్తం మూడు కంపెనీలు భాగస్వామ్యమయ్యాయి. ది ఆర్గానాయిడ్ కంపెనీ, జెనోమిక్ ఇంజనీరింగ్ సంస్థ ఆర్గానాయిడ్, క్రియేటివ్ ఏజెన్సీ VML అనే మూడు కంపెనీలు 2023లో ఉన్ని మామత్ DNAను గొర్రెల కణాలతో కలిపి ఒక భారీ మీట్బాల్ను తయారు చేసేందుకు పనిచేశాయి. మళ్లీ తాజాగా ఈ బృందం డైనోసార్ అవశేషాల నుంచి పురాతన ప్రోటీన్ శకలాలను సేకరించి, వాటిని ఒక గుర్తుతెలియని జంతువు కణాలలోకి ప్రవేశపెట్టి కొల్లాజెన్ను ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత దానిని తోలుగా మార్చారు. అయితే చాలామంది దీనిపై సందేహం వ్యక్తం చేయడంతో..డచ్ శిలాజ శాస్త్రవేత్త ఇలా వివరణ ఇస్తూ.. వారి అనుమానాలను పటాపంచలు చేశారు. డైనోసార్ ఎముకలలో కొల్లాజెన్ కేవలం శకలాల రూపంలో మాత్రమే మిగిలి ఉంటుందని, దానిని ఉపయోగించి టి-రెక్స్ చర్మాన్ని పునఃసృష్టించలేమని అన్నారు. అలాగే సరిపోలిన ప్రోటీన్లలో కూడా, నిజమైన జంతు తోలుకు దాని విశిష్ట లక్షణాలను ఇచ్చే ఫైబర్ నిర్మాణం లోపిస్తుందని చెప్పారు. సరికొత్త ప్రయోగం చేసేటప్పుడే ఇలాంటి సందేహాలు మాములేనని, అయినా ఇంతవరకు డైనోసార్ చర్మం అనేలా ఎవ్వరూ అంత స్థాయిలో ప్రయోగం చేయలేకపోయారని కూడా అన్నారు. అదీగాక సంప్రదాయ లెదర్ బ్యాగ్లతో పోలిస్తే, ల్యాబ్ తో చేసిన టి. రెక్స్ లెదర్ అత్యంత విలాసవంతమైన వస్తువుగా నిలుస్తుందన్నారు. ఈ డైనోసర్ లెదర్ బ్యాగ్ని మే 11న ఆమ్స్టర్డామ్లోని ఆర్ట్ జూ మ్యూజియంలో సందర్శనకు ఉంచనున్నారట. అంతేగాదు దీన్ని వేలం వేయనున్నట్లు సమాచారం. పైగా దీని ప్రారంభ ధరే రూ. 4 కోట్లు అని చెబుతున్నారు పరిశోధకులు.(చదవండి: Kerala Techie: సాహసమా..? నాటకమా..?: కావాలనే చేసిందా ఆ టెకీ..) -
మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్ ధర తెలిస్తే విస్తుపోతారు!
ఫ్యాషన్ ఐకాన్గా విలక్షణంగా ఉంటారు బాలీవుడ్ నటి కియారా అద్వానీ. ఏ సందర్భమైన ఆమె ఫ్యాషన్ స్టైలే వేరేలెవెల్. ధరించే డిజైనర్ వేర్ నుంచి ఆభరణాలు, హ్యాండ్ బ్యాగ్ వరకు ప్రతిదీ అత్యంత ప్రత్యేకంగా ఉంటాయి. మ్యాగజైన్ షూట్ అయినా పండుగైనా..కియారా స్టన్నింగ్ లుక్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా, అనుకరించేలా ఉంటాయి. అలానే ఈసారి కూడా అత్యంత ఆకర్షణీయంగా మెరిశారు కియారా. ఆమె గత రాత్రి తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె ధరించిన అద్భుతమైన చీర, మసబా వారి మహారాణి నెక్లెస్తో ఆకట్టుకున్నారు. సిల్క్ క్రేప్తో రూపొందించిన 'గుల్పోష్' చీరపై ఉన్న సున్నితమైన బుటా వర్క్, ఆమె మొత్తం రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆ చీర పల్లు మరింత హైలెట్గా నిలిచింది. బంగారు ఎంబ్రాయిడరీతో గులాబీ, ఆకుపచ్చ ఆర్గాంజా ప్యాచ్వర్క్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పాంఖ్ బాగ్, గుల్ఝురోఖా మెటిఫ్లు చీరకు రాజససం ఉట్టిపడేలా చేయగా, ఫ్యాన్ ఆకారపు అంచులు ఈ చీర డిజైన్ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. ఎంత అందమైన చీరకైనా మ్యాచింగ్ ఆభరణాలనేవి అత్యంత కీలకమైనవి. అందుకే కియారా మసబా వారి స్టేట్మెంట్ మహారాణి-శైలి నెక్లెస్ను ఎంచుకుంది. బంగారం, వజ్రాలు, ముత్యాలతో పొదగబడిని నెక్లెస్ని పొరలు పొరలుగా డిజైన్ చేశారు. ఇంతకీ కియారా ధరించిన చీర, నెక్లెస్ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. చీర ధర వచ్చేసి రూ. 1.30 లక్షలు, నెక్లెస్ ధర రూ. 1.85 లక్షలు. అలాగే నటి సింపుల్ మ్యాకప్తో ఉంగారాల జుట్టుతో తన ఆహార్యాన్ని పూర్తి చేసింది. అంతేగాదు చేతిలో బ్రౌన్ రంగు హెర్మెస్ మినీ కెల్లి పోచెట్ బ్యాగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దీని ధర సైతం దగ్గర దగ్గర రూ. 33 లక్షల పైనే పలుకుతుందట. View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset)(చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!
కళలు, సంస్కృతికి నిలయమైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) మూడో వార్షికోత్సవం ఏప్రిల్ 3, 2026న ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఆరుగజాల మెటాలిక సిల్క్ చీర, దానికి మ్యాచింగ్గా ఆభరణాలను ధరించి రాజసం ఉట్టపడే ఆహార్యంతో కట్టిపడేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖ తారలంతా విచ్చేశారు. ముఖ్యంగా షాహిద్ కపూర్, మీరా కపూర్, రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, సిద్ధార్ధ్ మల్హోత్ర, కియార అద్వానీ తదితర తారాగణం హాజరయ్యారు. ఈ వేడుకలో నీతా అంబానీ రాజసం ఉట్టిపడే పట్టుచీరలో ధగధగ మెరిసిపోయారామె. సాంప్రదాయ భారతీయ హస్తకళకు అద్భుతమైన నిదర్శనంగా నిలిచింది ఆమె ధరించిన చీర. బంగారు, ముదురు ఎరుపు రంగుల ప్రకాశవంతమైన కలయికతో కూడిన చరీపై క్లిష్టమైన జరీ పని అద్భుతంగా ప్రతిబింబిస్తూ..ద్రవరూపంలో ఉన్న మెరుపని సృష్టిస్తోంది. సాంప్రదాయ పైస్లీ నమూనాలతో కూడిన వెడల్పాటి అంచు, చీరకు చక్కటి రూపాన్ని ఇవ్వగా పల్లుపై సూక్ష్మమైన నమూనాలు మరింత హైలెట్గా నిలిచాయి. దానికి మ్యాచింగ్గా మెరూన్ గోల్డ్ రంగులో పొట్టిచేతులతో కూడిన బ్లౌజ్ చీర లుక్ని అమాంతం పెంచేసింది. ఆ పట్టుచీరకు తగ్గట్టుగా ప్రకాశవంతమైన పచ్చులు, కెంపులతో పొదిగిన నెక్లెస్, చేతులకు బంగారు గాజులు, చెవులకు స్టేమెంట్ రింగులతో.. పండుగ వాతావరణాన్ని తలపించే రాయల్ లుక్లో ఆకర్షణీయంగా కనిపించారు నీతా. సాంప్రదాయ మహిళలా మధ్యపాపిడి చక్కటి కొప్పు, తేలికైన మేకప్తో హుందాగా మెరిశారామె. సింపుల్గా చెప్పాలంటే ఆమె మొత్తం రూపంలో సాంస్కృతికత ప్రతిధ్వనించింది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి, మాృతృత్వం కోసం బ్రేక్ ఇచ్చి..మళ్లీ..!) -
రాధిక మర్చంట్ లైలాక్ వాచ్..! ప్రపంచంలోనే..
మార్చి 29న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో రాధికా మర్చంట్ తళుక్కుమన్నారు. ఆమె నీతా అంబానీ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. ఆమె సింపుల్ దుస్తుల్లో నిరాడంబరంగా కనిపించినప్పటికీ..తన చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. చోటి బాహుగా పేరుగాంచిన ఆమె లైలాక్ రిచర్డ్ మిల్లే వాచ్తో తన లుక్ను హైలెట్ కనింపిచేలా చేశారామె. ఈ వాచ్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 మాత్రమే ఉన్న అత్యంత అరుదైన వాచ్. దీని ధర వింటే కళ్లుబైర్లుకమ్మడం ఖాయం. రాధిక మణికట్టుపై ఉన్న ప్రత్యేక ఆకర్షణగా ఉన్న రిచర్డ్ మిల్లే వారి అత్యద్భుతమైన RM 75-01 ఫ్లయింగ్ టోర్బిల్లాన్ సఫైర్ వాచ్ ఇది. సముద్ర స్ఫటికపు పారదర్శకత, గోతిక్ వాస్తుశిల్ప వైభవంతో మిళితమైన వాచ్. అద్భుత కళారూపానికి నిలయం ఈ వాచ్. దీన్ని అసాధారణంగా మార్చేది దాని పూర్తిగా ట్రాన్స్పరెంట్గా కనింపిచేలా చేసే డిజైన్. ఇది లోపల ఉన్న క్లిష్టమైన మెకానిజంను ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసే వీలు కల్పిస్తుంది. దీని పారదర్శక కేస్, రంగు, కాంతిని సున్నితంగా వెదజల్లుతూ, ఒక మృదువైన, ఛాయతో ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేకతలు..వాచ్ తయారీకి 40 రోజుల నిరంతర గ్రైండింగ్తో సహా, వెయ్యి గంటలకు పైగా మెషీనింగ్ సమయం పడుతుంది. దీనిలోని భాగాలను అత్యంత సూక్షంగా ఉంటాయట, వాటిని ఎంతో సహనంతో అమర్చాల్సి ఉంటుందట. ఈ వాచ్ని టైటానియం స్క్రూలు, టైటానియం బేస్ప్లేట్ మెకానిజంతో రూపొందిస్తారు. అదే సమయంలో 6 గంటల వద్ద ఉన్న ఫ్లయింగ్ టూర్బిల్లాన్ ప్రతి 60 సెకన్లకు ఒక పూర్తి భ్రమణం చేస్తుంది. అంతేగాదు ఈ వాచ సుమారు 65 గంటల వరకు ఫుల్ చార్జ్ ఉంటుందట. ఈ వాచ్ ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 21 కోట్లు. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology) (చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!) -
శ్రీరామ నవమి : రామ నామాలతో నీతా అంబానీ చీర
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కళలు, సంస్కృతిపై ప్రేమను చాటుకోవడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. భక్తిని, వారసత్వాన్ని అందంగా ప్రతిబింబించే అందమైన చీరలో స్పెషల్గా మెరిసారు. శ్రీరామ నవమి పవిత్ర సందర్భాన, భక్తిని, భారతీయ వారసత్వాన్ని అద్భుతంగా చాటిచెప్పే ఒక చీర గురించి అంటూ నీతా లుక్కుసంబంధించిన ఫోటోలను ఎన్ఎంఏసీసీ ఇన్స్టాలో షేర్ చేసింది.హస్తకళల ద్వారా ఒక సంస్కృతిని గౌరవించడం అనేది ఆ కళాకారుల శ్రమకు నిజమైన గుర్తింపు నివ్వడంలో నీతా అంబానీ ఎపుడూ ముందుంటారు. ఇటీవల ఒడిశాలోని కేఐఐటీ (KIIT)లో నీతా గౌరవ డాక్టరేట్ అందుకున్నప్పుడు, ఆమె ఆ ప్రాంతపు కాలాతీత హస్తకళలను గౌరవించారు. ఈ ప్రత్యేక సందర్భం కోసం, ఆమె మట్టి రంగులలోని ఒక సుందరమైన ఇక్కత్ (Ikat) చీరను ఎంచుకున్నారు. స్వదేశ్ నేత కళాకారుడు హరిశంకర్ మెహర్ దీన్ని రూపొందించారు. ఈ ప్రత్యేకమైన చీరను రూపొందించడానికి ఆయనకు రెండేళ్లు పట్టింది. ఒడిశాలోని గొప్ప నేత వారసత్వానికి ప్రతిబింబమైన ఈ చీరను నీతాకు ఆయన బహూకరించారు.సహజమైన రంగులను ఉపయోగించి, సాంప్రదాయ బంధ (Bandha)పద్ధతిలో నేసిన ఈ చీర, భక్తిని,డిజైన్ మేళవింపుగా అందంగా రూపొందింది. దీని ప్రధాన భాగంలో రామ శిల స్ఫూర్తితో రూపొందించిన మొజాయిక్ ఉంది. దానిపై సార్వజనీన విశ్వాసానికి ప్రతీకగా "రామ్" అనే పదం అనేక భాషలలో లిఖించారు. కొంగుపై ఒడియా లిపిలో పవిత్ర మంత్రాలు, సాంప్రదాయ ఇక్కత్ నమూనాలలో నేయడం విశేషం.ఇదీ చదవండి: ఐపీఎల్ టికెట్ల రచ్చ : ప్రతీ ఎమ్మెల్యేకు 5 టికెట్లు! View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india)నీతా చీర ప్రత్యేకతలుసహజ సిద్ధమైన రంగులలతో సాంప్రదాయ 'బంధ' (Bandha) ప్రక్రియలో ఈ చీరను నేశారు. పవిత్రమైన పల్లు, రామనామాలు ఈ చీర ప్రత్యేకతలు.చీర మధ్య భాగంలో (Body) 'రామ శిల' స్ఫూర్తితో కూడిన డిజైన్ ఉంది. ఇందులో "రామ్" అనే పదం వివిధ భాషలలో లిఖించబడి, విశ్వవ్యాప్తమైన భక్తిని చాటిచెబుతోంది. చీర పల్లూ భాగంలో పవిత్రమైన మంత్రాలను ఒడియా లిపిలో, క్లాసిక్ ఇక్కత్ నమూనాలతో కలిపి అత్యంత నైపుణ్యంతో నేశారు.ఇదీ చదవండి: కస్టమర్లకు షాక్ : పెట్రోలు రూ. 5 , డీజిల్ రూ. 3 పెంపుకేవలం ఇదొక వస్త్రంగానే కాకుండా, ఈ చీర సంప్రదాయం, ఆధ్యాత్మికత మరియు కథాకౌశలానికి ప్రతీకగా నిలుస్తుంది. మన వస్త్రాలు మన సంస్కృతిని, భక్తిని , కాలాతీత జ్ఞానాన్ని ఎలా మోసుకెళ్తాయో చెప్పడానికి ఇది ఒక చక్కని నిదర్శనం.ఇదీ చదవండి: క్లాస్రూంలోనే ప్రొఫెసర్ లవ్ ప్రపోజ్..కట్ చేస్తే, వీడియో వైరల్ -
ఆస్కార్ రెడ్ కార్పెట్పై మెరిసిన భారత డిజైనర్ వేర్లు, ఆభరణాలు..!
సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మక భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మకమైన వేడుకలో హాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు పాలుపంచుకుంటారు. అయితే ఈసారి జరిగిన ఆస్కార్ వేడుకలో రెడ్కార్పెట్పై మన భారతీయ ఢిజైనర్వేర్, ఆభరణాలు తళుక్కుమనడం విశేషం. హాలీవుడ్ ప్రముఖులు మన దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్లు రూపొందిచిన దుస్తులు, ఆభరణాలను ధరించి ఈ వేడకలో కనిపించడం అత్యంత హైలెట్గా నిలిచింది. మన భారతీయ ష్యాషన్ శైలిని ధరించిన ఆ ప్రముఖులు ఎవరంటే..ప్రముఖ బ్రిటిష్-అమెరికన్ ఫ్యాషన్ జర్నలిస్ట్, స్టైలిస్ట్,జన్నా రాబర్ట్స్ రాస్సీ ఈ ఆస్కార్ వేడుకలో అబుజాని, సందీప్ ఖోస్లా రూపొందించిన కోచర్ని ధరించారు. భారతీయ వస్త్ర నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే కోచర్లో కనిపించారామె. ఈ కోచర్ని వేలాది బగల్ పూసలు, రాళ్ళు, స్ఫటికాలతో ఎంబ్రాయిడరీ చేసిన విలాసవంతమైన క్రాప్ టాప్. సిల్క్ బ్రోకేడ్ కాన్వాస్పై ఈ డిజైన్ని రూపొందించారు. దీన్ని డిజైన్ చేయడానికి దారాలను కట్టి రంగులు వేసే సాంప్రదయా సాంకేతికతతో రూపొందిస్తారు. ఇది ఏకంగా రెండు వేల గంటలు శ్రమతో చేసిన చేతి ఎంబ్రాయిడరీ బ్లౌజ్.జాంబియన్ పచ్చ వజ్రంఅంతర్జాతీయ మోడల్, బ్యూటీ ఎంటర్ప్రెన్యూర్ ప్రీతికా స్వరూప్ ఈ వేడుకలో అద్భుతమైన భారతీయ నెక్లెస్తో మెరిశారు. ఆమె భారతీయ ఆభరణాల నైపుణ్యాన్ని వ్యక్తరిచేలా ఆస్కార్ రెడ్కార్పెట్పై తళుక్కుమన్నారు. జిప్ మాదిరి నెక్లైన్తో మధ్యలో జాంబియన్ పచ్చ వజ్రం ఆ నెక్లస్ని హైలెట్గా కనిపించేలా చేసింది. ఈ ఆభరణానికి రూపొందించడానికి దాదాపు 160 గంటల శ్రమతో చేతితో రూపొందిస్తారట.తెలంగాణ హస్తకళాకారులు రూపొందించిన..బ్రాందీ కార్లైల్ బంగారం, వజ్రాలతో చేతితో రూపొందించిన ప్రిజం బ్రూచ్ను ధరించారు. బ్రూచ్ ఓపెన్-సెట్టింగ్ టెక్నిక్ ద్వారా అమర్చబడిన పావ్-సెట్ వజ్రాలతో డిజైన్ చేశారు. ఇది రాళ్ల ద్వారా కాంతి స్వేచ్ఛగా కదలడానికి వీలు కల్పిస్తోంది. దీన్ని తెలంగాణలోని నిపుణులైన స్వర్ణ హస్తకళాకారులు సుమారు 100 గంటలు శ్రమింది డిజైన్ చేస్తారట. ఈ వజ్రాల నెక్లెస్ మన భారతదేశ హస్త కళా వారసత్వ నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం.(చదవండి: ఆస్కార్ ఫుడ్ మెనూ..! 600 పిజ్జాలు, 24-క్యారెట్ల 'ద్రవ బంగారం..) -
చక్కని గాజులు.. చెక్కిన చేతులు..
సాక్షి, హైదరాబాద్: అమ్మాయిల అలంకరణల్లో ఎన్ని రకాల నగలున్నా.. గాజుల స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అయితే, ఒకప్పటిలా నిండుగా కాకుండా.. ఆఫీసుకైనా, కాలేజీకైనా సింపుల్గా ఓ గాజు వేసుకుంటే చాలనుకుంటున్నారు. దీంతో పాటు కస్టమైజేషన్ గాజులంటే మరింతగా ఇష్టపడుతున్నారు. దీంతో చార్మినార్ ప్రాంతంలోని లాడ్ బజార్లో ‘లైవ్ బ్యాంగిల్ మేకింగ్’ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. అక్కడ కస్టమర్ల అభిరుచి మేరకు వారి కళ్ల ఎదుటే, నచి్చన డిజైన్లలో గాజులు తయారు చేయించుకుంటున్నారు. ఈ ప్రక్రియను పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాగా సోమవారం ఓ యువతి కళాకారుడి సూచనల మేరకు స్వయంగా గాజులు తయారుచేయించుకుంది. -
సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!
సచిన్ టెండూల్కర్ అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండూల్కర్ల వివాహం గత గురవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు, పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు విచ్చేసి వధువరులు ఆశ్వీరదించారు కూడా. అయితే ఈ వేడుకలో అర్జున్ అక్క సారా కుందనపు బొమ్మలా అందరి కళ్లను ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన మీనాకారి నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. సునీతా షెఖావత్ కలెక్షన్కి సంబంధించిన ఈ నెక్లెస్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారట. ఇందులో హస్తకళ, సంప్రదాయ కుందన్ సెట్ పోల్కీలు, పూల మోటిఫ్లు తరతరాల సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. ప్రముఖ ఆభరణాల నిపుణురాలు ప్రియంషు గోయెల్ జైపూర్కి చెందిన సునీతా షెఖావత్ తయారు చేసిన ఈ నెక్లెస్ ధర దగ్గర రూ. 40 నుంచి రూ. 60 లక్షలు పైన ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెక్లెస్లో కొలంబియన్ ఎమరాల్డ్లు, సౌత్ సీ ముత్యాలను పొందుపరిచారు. అద్భుతమైన వారసత్వ ఆభరణాలు.. మన దేశ సంస్కృతిని, గత వైభవాన్ని కళ్లముందు కదలాడలే చేసింది ఈ ఆభరణం. అంతేగాదు దీన్ని తయారు చేసేందుకు 360 గంటలు పైనే పట్టిందట. ఈ ఆభరణం ప్రత్యేకతలను వివరిస్తూ నెట్టింట షేర్ చేశారు ప్రియంషు గోయెల్. View this post on Instagram A post shared by Sunita Shekhawat (@sunita_shekhawat_jaipur) (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..) -
అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో కుందనపు బొమ్మలా సారా..!
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజాల నుంచి బాలీవుడ్ తారలు, పలువురు ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. తమ్ముడి పెళ్లిలో అక్క సారా కుందనపు బొమ్మలా మెరిసింది. మొత్తం వేడుకలో సారా లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయతను ఆధునికతను కలగలసిన స్టైలిష్ లుక్లో కనిపించింది. సింపుల్గా చెప్పాలంటే దివి నుంచి భువికి వచ్చిన దేవతాలో అత్యద్భుతంగా ఉంది సారా. తల్లి అంజలి సైతం గులాబీ రంగు చీరనే ఎంచుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సారా, అంజలీలు పెళ్లి వేడుకలో ధరించిన చీరలు, ఆభరణాల స్పెషాల్టీ గురించి సవివరంగా చూద్దామా..!.సారా తన తమ్ముడి పెళ్లి వేడుక కోసం పింక్ బంధానిని ఎంచుకుంది. అద్భుతమైన జర్దోజి రేషమ్ ఎంబ్రాయిడరీకి తగ్గా కట్వర్క్ రోసెట్ బోర్డర్. జ్యువెల్డ్ టాసెల్స్తో డెకరేట్ చేసిన హాట్పింక్ సిల్క్ బ్లౌజ్తో మరింత అందంగా కనిపించింది. ఆ చీరపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ అత్యంత హైలెట్గా కనిపించడమే గాక ఆ శారీ అందాన్ని రెట్టింపు చేసింది. ఆ చీరకు దగ్గ భారీ సాంప్రదాయ ఆభరణాలు సారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆకుపచ్చ పూసల బహుళ స్టెప్స్ ఎంబెడెడ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, పాపిడి బొట్టు, ఆమె లుక్ని మరింత హైలెట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే మేకప్ కూడా చాలా నేచురల్గా కనిపించిన తీరు..సహజత్వానికి ప్రతిక సారా అని చెప్పకనే చెబుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)ఇక కూతురు సారా అందానికి తగ్గట్టుగా తల్లి అంజలి ఈ వేడుకలో రాజరికపు గులాబీ రంగు చేనేత పట్టు చీరను ఎంచుకుంది. ఆమె అత్యంత విలాసవంతమైన లగ్జరీని అంతగా ఇష్టపడరు. సచిన్ భార్య అంజలి ధరించిన చీరను డిజైనర్ జుహి షా రూపొందించారు. ఇక అంజలిని అందంగా తీర్చిద్దింది సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ నిషి సింగ్. సచిన్ సైతం ఆ మేకప్ ఆర్టిస్ట్ నైపుణ్యాన్ని కొనియాడారు. మీరు అంజలి లుక్ని చాలా అందంగా చూపించారని మెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Nishi Singh (@nishisingh_muah)ఇక అంజలీ కూడా మేకప్ ఎప్పుడూ హెవీగా ఉండకూడదని సహజత్వాన్ని అందంగా చూపిస్తే చాలని, అందుకే తాను మినిమల్ లైట్ మేకప్నే ఎంచుకుంటానని అన్నారామె. ఇక ఈ వేడుకలో సచిన్ క్రీమ్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో కనిపించగా, వధువరులు అర్జున్ సానీయాలు ఎరుపు రంగును ఎంచుకున్నారు. అర్జున్ టెండూల్కర్ దుస్తులను మనీష్ మల్హోత్రా, సానియా లెహంగాను తరుణ్ తహిలియానిలు రూపొందించారు. (చదవండి: తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..) -
అర్జున్-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్ లుక్..!
సచిన్- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండుల్కర్, యువ వ్యాపారవేత్త సానియా చందోక్ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు క్రికట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకలో అంబానీ కుటుంబ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంత్-రాధిక మర్చంట్ల వివాహవేడుక జరిగిన అదే ప్రదేశంలో అర్జున్ సానియాల వివాహం జరగడం విశేషం. ఆ నేపథ్యంలో ఆ సచిన్ టెండూల్కర్ ఇంట జరిగే పెళ్లి తంతుకి సంబంధించిన ప్రతీది అంబానీ కుటుంబమే స్వయంగా చూసుకుంది. అందుకు సచిన్ కూడా సభా ముఖంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. కాగా ఈ వేడుకలో ఫ్యాషన్కి ఐకాన్గా ఉండే రిలయన్స్ ఛైర్మన్, తన సిగ్నేచర్స్టైల్తో మెరిశారు. వేడుకుకు తగిన విధంగా తన ఆహార్యాన్ని ప్రతిబింబించేలా కేర్ తీసుకుంటారు నీతా. ఆమె ఈ వేడుకకి రిలయన్స్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అతడి భార్య శ్లోకా మెహతాలతో కలిసి విచ్చేశారు. ఈ వేడుకలో ఆయు ధరించిన చీర, ధగ ధగ మెరిసిపోతున్న నెక్లెస్ అత్యంత హైలెట్గా నిలిచాయి. నీతా ఈ వేడుక కోసం రాచరికపు స్టైల్ ఐవరీ బంగారు సిల్క్ చీర ఎంచుకున్నారు. ఈ ఆరుగజాల చీరలో నీతా బంగారపు బొమ్మలా ముగ్ధమనోహరంగా కనిపించారు. బంగారు మోటీఫ్లతో అలకరిచిన ఆ ఫ్యాబ్రిక్ ప్రకాశవంతమైన ఆకృతిని ఇచ్చింది. నిలువు జరీ చారలతో ఎంబ్రాయిడరీ స్లీవ్ బోర్డర్లు చీర లుక్ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆ చీరకు సింపుల్గా స్టేట్మెంట్ డైమండ్ నెక్లస్ చీర అందాన్ని అమాంతం రెట్టింపు చేసింది. చెవికి కూడా డైమండ్ స్టడ్ పోగులు ధరించి స్టైల్ పరంగా నీతాకు సాటిరారెవ్వరూ అనేంతగా ఉంది ఆమె ఆహార్యం. ఇక ముఖేశ్ అంబానీ కూడా క్లాసిక్ బ్లాక్ బంధ్ గలా సూట్లో హుందాగా కనిపించారు. అంతేగాదు ఈ జంట ఆధునాతన సంప్రదాయంతో కలగలసిన స్టైలిష్ లుక్లో అందరి మనసులను దోచుకున్నారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) (చదవండి: 'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా) -
బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..
ఫ్యాషన్ డిజైనర్ అవ్వడం అంత ఈజీకాదు. ఆ రంగం ఎంత ఇష్టమైనా.. దానిలోని మెళుకువలపై పట్టు సాధించేది మాత్రం టీనేజ్ వయసుకే. అంతకంటే చిన్న వయసులో అంత సులభం కాదు..పైగా క్లాత్ని పట్టుకుని కుట్టుగల నేర్పరితనం, క్రియేటివిటీ ఉండదు. కానీ ఈ బుడతడు..పిట్ట కొంచెం కూత ఘనంలా అలవోకగా పలు రకాల ఫాబ్రిక్లను అందమైన డిజైనర్వేర్లా తీర్చిదిద్దుతుండటం విశేషం. అంతేకాదండోయ్ ఏకంగా ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్లో దిగ్గజ డిజైనర్ల మధ్య..తన ఫ్యాషన్వేర్ని ప్రదర్శించనున్నాడు కూడా. ఇలా అత్యంత పిన్నవయసులో ఫ్యాషన్ డిజైనర్గా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించనున్న చిన్నారిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఆ చిన్నారి ఎవరంటే..ఆ చిచ్చర పిడుగే మాక్స్ అలెగ్జాండర్. ఆ చిన్నారి తల్లిదండ్రులు జాక్ అలెగ్జాండర్, షెర్రీ మాడిసన్ దంపతులు. పూర్తిగా భాషై పట్టు రాని ఆ వయసుకే ఈ బాలుడు మాక్స్ స్కెచ్ పట్టుకుని డిజైన్లు, సూది దారం సాయంతో చక్కటి కళ్లు చెదిరిపోయే ఫ్యాషన్వేర్లను క్రియేట్ చేసేస్తాడు. తనలోని ఫ్యాషన్ క్రియేటివిటీ తన సోదరి సమంత కారణంగా బయటకు వచ్చిందట. ఆమెకు ప్రస్తుతం 14 ఏళ్లు. తాను తయారు చేసిన డిజైనర్వేర్లన్నీ తన అక్క కోసమేనని, ఆమె వాటిని ధరించి చూడటం నిజంగా చాలా ఆనందాన్నిస్తుందని చెబుతున్నాడు మాక్స్. అతడి క్రియేటివిటీ అత్యంత విభిన్నం..ఫ్యాషన్ డిజైనర్లు ముందుగా తమ క్రియేటివిటీ లేదా ఆలోచనను కాగితంపై స్కెచ్తో పని చెబితే..మాక్స్ మాత్రం ముందుగా దాన్ని మడతలతో కట్టి చూస్తాడు. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి కుట్టేస్తాడు. తనకు డ్రేపింగ్ అంటే ఇష్టమని, ముందుగా ధరిస్తేనే..క్రియేటివిటీ తళుక్కుమని బుర్రలో ప్రత్యక్షమవుతుందని చెబుతున్నాడు మాక్స్. అలా ఇప్పటివరకు ఈ చిన్నారి 150కి పైగా డిజైనర్వేర్లు రూపొందించాడు. వాటిలో దుస్తులు, జాకెట్లు, స్కార్ఫ్లు, బ్యాగులు, కిమోనోలు, సూట్లు, స్టఫ్డ్ యానిమల్స కూడా ఉన్నాయి. అంతేగాదు తన సొంత రన్వే షోను ప్రదర్శించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పాడు. 2024లో ఎనిమిదేళ్ల వయసులో ఐక్యరాజ్యసమితలో ఫ్యాషన్ స్థిరత్వంపై ప్రసంగించాడు. వ్యర్థాలను పునర్వినియోగం చేసి.. దుస్తులుగా ఎలా మలచొచ్చో ఆలోచనాత్మకంగా వివరించాడు. పైగా దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేలా కాఫీ బీన్ బ్యాగ్ల నుంచి రూపొందించిన డిజైనర్వేర్లలో మెరిశారు మోడళ్లు. అలాగే ఆ చిన్నారి మాక్స్ చదువుకుంటూనే ఫ్యాషన్ వీక్లలో తన ప్రదర్శనలను ఇస్తుంటాడు. ఇదేగాక మాక్స్కి పలు స్కిల్ కూడా ఉన్నాయి. అవేంటంటే వంట చేస్తాడు, పికిల్బాల్, టెన్నిస్ వంటివి ఆడతాడు, కథలు రాస్తాడు. అలాగే తనకొక రెస్టారెంట్, కారు వాష్ని ఉండాలని కలలుకంటుంటాడు. పైగా ఇంజనీర్ కావలన్నిది అతడి ధ్యేయం కూడా. ఇక మాక్స్ తన పాఠశాల చదువుకి ఆటంకం లేకుండా వారాంతాల్లో ఫ్యాషన్కి సంబంధించిన స్కిల్స్లో నిమగ్నమవుతుంటాడట. నిజంగా పెన్సిల్ పట్టుకుని కుదురుగా బొమ్మలు వేయని ఆ చిరుప్రాయంలో ఇంత అసామాన్య ఫ్యాషన్ డిజైనర్ ప్రతిభ మాటలకందనిది కదూ..!.వీడియోపై క్లిక్ చేయండి(చదవండి: తనకు తాను ఓటు వేసుకుని మేయర్ అయిన మహిళ..! ఎక్కడంటే..) -
రష్మిక మందన్న మేలి ముసుగుపై శక్తిమంతమైన ఆ పదాలు..!
టాలీవుడ్ సెలబ్రిటీ జంట రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫిబ్రవరి26, 2026న గురువారం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయపూర్ వెలుపల 50 కి.మీ దూరంలో ఉన్న అద్భుతమైన ఐటీసీ మెమెంటోస్లో వీరి వివాహం జరిగింది. అయితే వీరిద్దరు తమ పెళ్లిలో ఎంచుకున్న కాస్ట్యూమ్స్ మొత్తం సాంస్కృతిక వారసత్వానికి అర్థం పట్టేలా ఎంచుకున్నారు. ఆధునికతను జోడిస్తూ..సాంప్రదాయ విలువలకు అనుగుణంగా తీర్చిద్దిన డిజైనర్ వేర్లో ముగ్ధమనోహరంగా మెరిశారు. అయితే పెళ్లిలో దాంపత్య విలువను తెలియజేసే పెళ్లి మంత్రాల మాదిరిగా తాను ధరించిన చీరలో సైతం దాన్ని ప్రదర్శించింది రష్మిక. అది ఆ వేడుకనే నిశబ్దంగా హైలెట్ చేసింది. ఇక్కడ రష్మిక ధరించిన ముసుగుపై ఉన్న మూడు శక్తిమంతమైన పదాలు వైవాహిక బంధం గొప్పతనం తెలియజేసేలా చాలాచక్కగా పొందుపరిచారు. ఇంతకీ అక్కడ ఏమని రాశారంటే..రష్మిక పెళ్లివేడుకలో లేత ఎరుపు గోల్డ్ అంచు చీరలో మెరిశారు. మొత్తం చీరపై ఆలయ ప్రేరేపిత ఎంబ్రాయిడరీలు, తోరణాలు, స్థంబాలు, పవిత్రమైన మోటీఫ్లతో చాలా వివరణాత్మకంగా తీర్చిదిద్దారు. వాటిలో హైదరాబాద్ చారిత్రాత్మక వాస్తుశిల్పం నుంచి గర్భగుడులు, ఆధ్యాత్మికతకు సంబంధించి.. ఆలయ గృహనమునాలతో ఎంబ్రాయిడరీ చేశారు. బంగారు జరీ వర్క్తో డిజైన్ చేశారు. దానికి తగ్గట్టుగా బ్లౌజ్ సైతం బంగారు థ్రెడ్వర్క్తో చక్కటి ఎంబ్రాయిడరీతో హుందాగా ఉంది. దానికి రాయల్టీ లుక్క్ఇచ్చేలా ధరించిన బంగారు మేలి ముసుగు అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. చూపురులను ఆ ముసుగు బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దానిపై ఉన్న బంగారు ఎంబ్రాయిడరీతో రాసిన ఆ " ప్రతి జీవితకాలంలో" అనే పద బంధం అందర్నీ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. అంటే.. జీవితాంతం ఒకరికొకరు మనం వేరు కాదు, ఇది జన్మజన్మల బంధం అని చెబుతూ భావోద్వేగంగా అందరి హృదయాలను తాకింది. వైవాహిక జీవిత గొప్పదనాన్ని ఈ చిన్న పద బంధంతో చాలా అద్భుతంగా హైలెట్ చేసి చెప్పారు. ఒకరకంగా ఇది ఆ డిజైనర్ నైపుణ్యాన్ని నొక్కి చెప్పింది కూడా. ఇక రష్మిక అందుకు తగ్గట్టు ధరించిన ఆభరణాలు గజిబిజి కాకుండా చాలా చక్కగా పెట్టిన తీరు చాలా బాగుంది. నెక్లైన్ నుంచి లేయర్డ్ ఆభరణాలు, చోకర్లు ఆ చీర లుక్ని మరింత హైలెట్ చేశాయి.అలాగే తలపై ధరించిన పాపిడి బొట్టు సైతం చెదరకుండా చక్కగా అమర్చారు. రష్మిక మొత్తం ఆహార్యం దివి నుంచి భువికి వచ్చిన దేవ కన్యలా అబ్బురపరిచింది. ఇక హీరో విజయ్ దేవరకొండ అనామిక ఖన్నా డిజైనర్ వేర్ ఐవరీ ధోతీ సిల్హౌట్ ధరించి అద్భుతమైన వెర్మిలియన్ అంగవస్త్రంతో రాజకుమారుడిలా కనిపించారు. ఆయన ధరించి ధోతి హైదరాబాద్ వారసత్వం వనసింగారం నేత, దానిపై అడవి, ఆలయ మూలాంశాలతో కూడిన ఎంబ్రాయిడరీ మన సాంస్కృతిక వారసత్వ శక్తిని హైలెట్ చేశాయి.(చదవండి: నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్..! ఈ చీరకట్టు స్పెషాల్టీ ఇదే..) -
నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్..!
నటి రష్మిక మందన్న పెళ్లి గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో, సాయంకాలం కొడగు (కూర్గి) సంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరిగింది. తన సంప్రదాయ మూలాలను మర్చిపోకుండా కొడగు స్టైల్ కట్టును వివిధ సందర్భాలలో ధరించడం మనం చూశాం. వివాహం, ఇతర వేడుకలలో కొడగు సంప్రదాయ చీరకట్టుదే ప్రత్యేక ఆకర్షణ.రష్మిక వివాహ వేడుక సందర్భంగా కొడగు చీరకట్టు ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశ సంప్రదాయ డ్రేపింగ్ శైలిలో విలక్షణంగా కనిపించే కొడగు కట్టును రీ క్రియేషన్ చేసి, బాలీవుడ్ క్లాసిక్ సినిమాలలోనూ కనువిందు చేశారు తారలు. కొడగు స్టైల్ డ్రేప్ ట్రెండ్ గురించి..కర్నాటకలోని కొడగు జిల్లాలో మగువల చీరకట్టులో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ శారీ డ్రేపింగ్. కొండ ప్రాంతంలో పుట్టిన సంప్రదాయ శైలి ఇది. కొడగు లేదా కొడవ లేదా కూర్గి అని పిలిచే కమ్యూనిటీలోని వివాహ సమయంలో అక్కడి వధువు జరీ అంచుతో ఉన్న పట్టు చీరను వారి సంప్రదాయ శైలిలో ధరిస్తుంది. ఇది కేవలం ఒక శైలి కాదు ఒక తరం నుండి మరొక తరానికి అందివస్తున్న వారసత్వం. ఈ చీరకట్టు కొడవ మహిళల బలం, అందం, స్వాతంత్య్రాన్ని ప్రతిబింబింపజేస్తుంది. వేడుకలలో సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ, బంగారు రంగులలో .. జరీ అంచుతో ఉండే కాంతిమంతమైన పట్టు చీరలను ఎంచుకుంటారు. ఇవి శుభాన్ని, శ్రేయస్సును తీసుకువస్తాయని వారి నమ్మకం.నడుము వద్ద చీరను పెట్టికోట్ లోపలికి టక్ చేస్తారు. సాధారణ చీరకట్టుకు భిన్నంగా ముందు వైపు కాకుండా కూర్గి శారీ డ్రేప్కు వెనకవైపు కుచ్చిళ్లు పెడతారు.చీరను రెండుసార్లు శరీరం చుట్టూ తిప్పుతూ, చీర పల్లూ ఛాతీ మీదుగా ఎడమ భుజం కింద నుంచి, కుడి భుజం పై నుంచి ముందుకు తీస్తారు.కుడి భుజం నుంచి తీసిన పల్లూని బ్లౌజ్తో కలిపి పిన్తో అటాచ్ చేస్తారు. పల్లూ అలంకరణ కొంత వరకు బెంగాలీ స్టైల్ను పోలి ఉంటుంది. కొడవ సంప్రదాయ ఆభరణాలలో చంద్రవంక, నాగాభరణం.. వంటి పొడవాటి హారాలతోపాటు ఇతర సంప్రదాయ నగలను అలంకరించుకుంటారు.కొడవ యువతులు షిఫాన్, జార్జెట్, ఆర్గంజా చీరలతో డ్రేపింగ్లో వివిధ రకాల ప్రయోగాలు చేస్తారు.యువతుల కోసం రెడీమేడ్ కొడవ కట్టు శారీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక ఆకర్షణతో ఉండే బెల్టులు, బ్రోచ్లు ఈ కట్టుకు ఇప్పుడు ఫ్యూజన్ ట్విస్ట్ను తీసుకువస్తున్నాయి. View this post on Instagram A post shared by राशि रमा शर्मा (@_wearyourstory__) (చదవండి: ఆ పాదాలకు నమస్కారం..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..) -
ఐడియా అదుర్స్..! ఫ్యాషన్ని ఇలా కూడా చూపించొచ్చా..!?
సోషల్ మీడియా పుణ్యమా అని..చాలామంది ఓవర్నైట్ స్టార్లుగా, సెలబ్రిటీ హోదాను పొందుతున్నారు. ఆ జాబితాలోకి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు చేరి.. సక్సెస్ని అందుకోవడం విశేషం. అయితే ఫ్యాషన్ వద్దకు వచ్చేటప్పటకీ.. మనలోపల టాలెంట్ మొత్తం తీసి ..రీల్స్ చేసినా..క్లిక్ అవ్వడం కొంచెం కష్టమే. ముఖ్యంగా అందరికి చేరువవ్వాలంటే అంత సులభమైన టాస్క్ కాదు. ఫ్యాషన్ అనగానే బాగా డబ్బున్నవాళ్లకే చెల్లుతుందనే అభిప్రాయం బాగా ఎక్కువ జనాల్లో. కానీ దాన్ని సామాన్యుల చెంతకు చేర్చి..అది మన లైఫ్లో భాగమనిపించేలా అందంగా చూపించింది ఈ అమ్మాయి. ఈ ఒక్క రీల్తో సెన్సేషన్గా స్టార్గా మారి.. ప్రపంచ వేదికపై నిలిచింది. అంతేగాదు ఎవరా ఆ అమ్మాయి అంత కూల్గా, చాలా క్యాజువల్గా ఫ్యాషన్ని ఎంత బాగా పరిచయం చేసింది.. అని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరంటే ఆమె..ఆ అమ్మాయే దియా జౌకానీ. వృత్తిరీత్యా ఆమె హై-ఎండ్ ఫ్యాషన్ డిజైనర్. ఇన్స్టాగ్రామ్లో"కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" అనే క్యాప్షన్తో ఆమె షేర్ చేసిన ఫ్యాషన్ వీడియో నెట్టిం ప్రభంజనం సృష్టించింది. ఎవరీ కూల్గర్ల్ అని చర్చలకు తెరతీసేలా..హాట్టాపిక్గా మారిందామె. ఆ రీల్లో ఆమె ధరించిన దుస్తులు కూడా స్వయంగా ఆమె డిజైన్ చేసినవేనట. సోషల్ మీడియాను ఆమె తన ఫ్యాషన్ ప్రదర్శనకు ఫ్లాట్ఫామ్గా ఉపయోగించుకుంటూ..తన డిజైన్లను ఇలా రీల్స్ ద్వారా నిశబ్దంగా ప్రదర్శించింది. తన డిజైనర్వేర్లతో చాలా స్మార్ట్గా మార్కెటింగ్ చేస్తోందామె. ఆ వీడియోలో దియా హై ఫ్యాషన్ను సరదాగా ధరించగలిగేలా ఆకర్షించింది. అంతేగాదు దియా ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఆమె ఫ్యాషన్ ప్రపంచాన్ని చూడొచ్చు. తన కంటెంట్ మొత్తం చాలా నిరాడంబరంగా ప్రజెంట్ చేస్తుండటంతో..ప్రజలు ఒక్క క్షణం వేచి వీక్షించగలిగేలా ఆకట్టుకుంటున్నాయి ఆ వీడియోలు. ప్రస్తుతం దియా చేసిన "కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" ఎంత ట్రెండీగా మారిందంటే..అందురు ఆమెలా అనుకరించే యత్నం చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు..ఆ వీడియో ఎంతగా నెటిజన్ల మనసులను తాకిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోల బ్యాగ్రౌండ్లో క్లాసిక్ ఫ్రాంక్ ఓషన్స్ నైట్స్ ప్లే అవుతూ ఉంటే.. దియా చక్కటి ఫ్యాషన్వేర్లో చాయ్ తాగుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత నగర వీధుల గుండా నడవడం ప్రారంభిస్తుంది. కొద్ది సెకన్లలో గుర్రపు స్వారీ చేస్తూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండటం లేదా ఆమె వ్యక్తిగత రైడ్ లాగా JCB పారపై కూర్చోవడం..ఇలా విలక్షణంగా కనబడుతుంది ఆయా వీడియోలలో. అయితే వాటి అన్నింటిలోనూ దియా వివరణాత్మక, హై-ఫ్యాషన్ దుస్తులను ధరించడం స్పష్టంగా చూడొచ్చు. View this post on Instagram A post shared by 🪔 (@diyajoukani)ఈ వీడియో ఇంతలా క్లిక్ అవడానికి కేవలం ప్రజెంటేషన్ చేసిన విధానమే ఆమెను ఐకానిక్గా మార్చేసింది. ఇక్కడ దియా విలాసవంతమైన దుస్తులను ధరించింది కానీ..స్టూడియో లేదా లగ్జరీ నేపథ్యం ఎంచుకోకుండా..ఇలా సాధారణ వీధుల గుండా వెళ్తూ..హై ఫ్యాషన్ మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ఎలాగో నేర్పుతున్నట్లుగా ఉంది. అందుకే ఇది ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అయ్యి..అంతలా వ్యూస్, లైక్లు వచ్చాయి ఆ వీడియోకి. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అన్నట్లుగా ఒక్క రీల్తో దియా సెన్సేషన్గా మారింది కదూ..!. View this post on Instagram A post shared by 🪔 (@diyajoukani) (చదవండి: అరుదైన పెళ్లి: ట్విన్ సిస్టర్స్ని పెళ్లాడిన ట్విన్ బ్రదర్స్..!) -
ఆరు గజాల అద్భుతం జిగ్ జిగ్ జమ్దాని
దక్షిణ భారతదేశంలో కంచిపట్టు ఒక సాంస్కృతిక సంప్రదాయం. కంచిపట్టును ఇష్టపడే ప్రతివారూ జమ్దానీని ఇష్టపడతారు. జమ్దానీ అనేది అత్యంత క్లిష్టమైన ఒక ప్రాచీన నేత పద్ధతి. బంగ్లాదేశ్ భౌగోళిక గుర్తింపు ఉన్న జమ్దానీ చీర మన దేశంలోనే విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఈ డిజైన్ల ప్రత్యేకతతోనే శతాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉంది జమ్దానీ చీర. పదివేల రూపాయల నుంచి 4–5 లక్షల వరకు ధర పలుకుతోంది. ఇంతటి ప్రాధాన్యత గల జమ్దానీ నేత చీర గురించి...సన్నని దారాలను గట్టి దారానికి జోడించి క్లిష్టమైన జమ్దానీ డిజైన్స్ను సృష్టిస్తారు. వీటిని నేరుగా మగ్గంపై నేస్తారు. మొదట్లో మస్లిన్ క్లాత్ మీద నేసేవారు. ప్రతి చీరకు ఇద్దరు నేత కార్మికులు చేస్తారు. ప్రకృతి నుండి ప్రేరణ పొందిన డిజైన్లు, రేఖాగణిత ఆకారాలు వీటిలో ఉంటాయి. ఇటీవల ఢిల్లీలోని నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం అండ్ హస్తకళా అకాడమీలో జరిగిన ప్రదర్శనలో జమ్దానీ నేత చీర సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచింది. ప్రదర్శన ప్రారంభోత్సవంలో దర్శకుడు ముజఫర్ అలా మాట్లాడుతూ ‘ఉమ్రావ్ జాన్’ సినిమాలో రేఖ కోసం జమ్దానీని ఎందుకు ఎంచుకున్నాడో తెలియజేశాడు. 60ల కాలంలో వచ్చిన సినిమాలలోనూ హీరోయిన్ల క్లాసిక్ లుక్ కోసం జమ్దానీ చీరలను ఎంచుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.జమ్దానీ అనేది రెండు పర్షియన్ పదాల కలయిక. ‘జామ్’ అంటే పువ్వు, ‘దాని’ అంటే వేజ్ అని అర్ధం. చీరపైన ఫ్లవర్వేజ్ డిజైన్లు ఉంటాయి. బంగ్లాదేశ్లోని నారాయణగంజ్ జిల్లాలో గల శీతలాక్షయ నది ఒడ్డున యునెస్కో గుర్తింపు పొందిన జమ్దానీ పరిశ్రమ ఉంది. దాదాపు 2,500 కుటుంబాలు జమ్దానీని సృష్టించడంలో నిమగ్నమై ఉన్నాయి. దీనిని బట్టి జమ్దానీది వేల ఏళ్ల క్రితం నాటిదిగా చెప్పవచ్చు. ఒకప్పుడు జమ్దానీలను హిందూ నేతకారులైన బసక్ అనే గ్రూప్వాళ్లు నేసేవారు. వారు బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లినప్పుడు స్థానిక మత్స్యకారులకు, ముస్లిమ్ నేత కార్మికులకు జమ్దానీ నేతలో శిక్షణ ఇచ్చినట్టుగా చెబుతారు. జమ్దానీ డిజైన్స్ కాటన్, హాఫ్ సిల్క్, మస్లిన్ క్లాత్పై వచ్చేలా నేస్తారు. నేత పనిలో ఉపయోగించే దారాల సంఖ్యను బట్టి ఆ చీర మృదువుగా ఉంటుందని చెబుతారు. పవర్లూమ్లోనూ ఈ తరహా చీరల తయారీ రావడంతో అన్ని వర్గాల వారికీ జమ్దానీ అందుబాటులోకి వచ్చింది. అయితే, నాణ్యత నేత చీర ద్వారానే తెలుస్తుంది.నటి, రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్ బంగ్లాదేశ్ సందర్శించినప్పుడు ఆమె దేశంలోని ప్రముఖ జమ్దానీ చీర నేతకారులైన సోదరులు సాజిబ్, నషిదుల్ రసల్ లను కలిసింది. వారి దగ్గర నాలుగు అందమైన జమ్దానీ నేత చీరలను ఎంచుకుందని వారు చెబుతుంటారు. -
డ్యామేజ్ని కూడా ఫ్యాషన్గా మార్చేశారు..!
ఫ్యాషన్లో కొన్ని వింత పోకడలు పిచ్చెక్కించేలా ఉంటాయి. నీ క్రియేటివిటీ పాడు కాను అని తిట్టుకునేలా ఉంటాయ్. ఇటీవల కాలంలో కొన్ని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లు ఇలాంటే పనులే చేసి అభాసుపాలయ్యాయి. కొత్తగా క్రియేట్ చేసే సామర్థ్యం తప్పిందో లేక జనాలను తక్కువ అంచనా వేస్తున్నారో తెలియదు గానీ..పొరపాటున డ్యామేజ్ అయ్యే వాటినే లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్ అంటూ పరిచేయం చేయడం బాధకరం. పైగా వాటి ధర కూడా కనివినీ ఎరుగుని రేంజ్లో ప్రకటించి..ఆయా బ్రాండ్ విలువలను దిగజార్చుకుంటున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలాంటిదే జరిగింది. 'వెట్మెంట్స్' అనే లగ్జరీ ఫ్యాసన్ బ్రాండ్ 'ఐరన్ బర్న్' గుర్తు ఉన్న సాదా తెల్లచొక్కాను మార్కెట్లోకి విడుదల చేసి..దీని ధర ఏకంగా రూ. 1లక్ష అని ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా ఇదేం ఫ్యాషన్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. క్రియేటివిటీ రాకపోతే కామ్గా ఉండు..మరి ఇలానా అంటూ తిట్టిపోస్తున్నారు జనాలు. చూడాలంటే మనం ఐరన్ చేసేటప్పుడు పొరపాటు షర్ట్ జేబు కాలిన గుర్తులా ఉంది అది. ఏదో లేటెస్ట్ ఫ్యాషన్ షర్ట్ అంటూ మార్కెట్లోకి వదలడమే కాక..అంత ఖరీదు ప్రకటించి జనాలను పిచ్చివాళ్లను చేయాలనుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు నెట్టింట. అంతేగాదు ఫ్యాషన్ కళాత్మకంగా కనుమరుగై..జోక్గా మారిపోయింది అని సెటైర్లు వేస్తు పోస్టులుపెట్టారు కూడా. VETEMENTS made a graphic shirt with an “iron burn” print that retails $1,139 pic.twitter.com/F5e9pkLQ8j— STAYGROUNDEAD TV (@staygroundeadtv) February 16, 2026 (చదవండి: ఏఐ సదస్సు లంచ్ మెనూ ఇదే..! పాలు, గోధుమలు..) -
అంబానీల ఆడపడుచు కోడలు.. లెహంగా ధర తెలిస్తే షాక్!
అంబానీల వంశంలోకి కొత్త సభ్యురాలుగా శ్వేనాపోయ్ చేరిన సంగతి తెలిసిందే. ఇటీవలే రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ మేనల్లుడు విక్రమ్ సల్గావ్కర్, శ్వేనపోయ్లు ఈ నెల(ఫిబ్రవరి) 12న ముంబైలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు మొత్తం అంబానీల కుటుంబం హాజరై సందడి చేశారు. ఈవేడుక అంబానీల రేంజ్కి తగ్గట్టుగా అత్యంత విలాసవంతంగా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకలో శ్వేనాపోయ్ ధరించిన లెహంగా నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఎందుకంటే ఆ లెహంగా ఖరీదు ఊహకందని రేంజ్లో ఉంది. ఇంత ధరపలికే లెహంగాలు కూడా ఉంటాయా అని విస్తుపోయేలా ఉంది. ఆ ఫ్యాబ్రిక్ని డిజైన్ చేసిన విధానంలో కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా..!.ముఖేశ్ అంబానీ మేనల్లుడు, దివగంత ధీరూభాయ్ అంబానీ మనవడు విక్రమ్ సల్గావ్కర్ని పెళ్లాడి శ్వేనా అంబానీ కుంటుంబంలోకి అడుగుపెట్టింది. ఆమె తన పెళ్లివేడుకలో ధరించిన లెహంగా అత్యంత హైలెట్గా నిలిచింది. ఈ లెహంగా సాంప్రదాయ ఫ్యాబ్రిక్తో తయారు చేసినది మాత్రం కాదు. చాలా స్పెషాల్టీ ఉంది ఈ లెహంగాకి. లోహదారాలతో తయారు చేశారట. దీన్ని జేఏడీఈ(JADE)కి చెందిన మోనికా షా డిజైన్ చేశారట. ఈ లెహంగాని డిజైన్ చేయడానికే దాదాపు 1500 గంటలపైనే పట్టిందట. చాణిక్య ఇంటర్నేషనల్ బ్రాండ్కి చెందిన 40 ఏళ్ల నాటి వారసత్వానికి నిదర్శనం ఈ లెహంగా. అరుదైన మొఘల్-యుగ కసబ్ టెక్నిక్ను పునర్జీవింప చేసేలా ఈ లెహంగాను తీర్చిదిద్దారు. చెప్పాలంటే ఇదోక కవచంలా ఉంటుంది. ఈ మొఘల్-యుగ కసబ్ టెక్నిక్ ఎంబ్రాయిడరీ గుజరాజ్, రాజస్థాన్ వంటి ప్రాంతాలలో ఉద్భవించిందని అంటుంటారు. అక్కడ చేతివృత్తులు వారు వెల్వేట్, బ్రోకేడ్తో సహ పలు రకాల విలాసవంతమైన దుస్తులను బంగారం లేదా వెండి లోహ దారాలతో తయారు చేస్తారట. వీటిని పట్టు లేదా కాటన్ కోర్ చుట్టూ ఈ డిజైన్ని రూపొందిస్తారు. చాలా సందర్భాల్లో మెటాలిక్ పాలిస్టర్ని కూడాఉపయోగిస్తారు. అంతేగాదు ఈ ఎంబ్రాయిడరీ అభ్యసించే కళాకారులకు చాలా నైపుణ్యం, ఓపిక తప్పనిసరిగా ఉండాలట. కసబ్ ఎంబ్రాయిడరీలో అత్యంత కష్టమైనది.. ఫ్రాబ్రిక్ ఉపరితలంపై లోహదారాలను అత్యంత జాగ్రత్తతో, నైపుణ్యంతో కుట్టాల్సి ఉంటుందట. అంతేగాదు ఈ డిజైన్లు ప్రాంతీయ సౌందర్యం, సంప్రదాయలను ప్రభావితం చేసేలా కళాత్మకంగా రూపొందిస్తారు. దీనిలో కసబ్ జర్దోజీ, గోటా పట్టి వంటి విభిన్న శైలులు కూడా ఉంటాయట. అచ్చం ఇలాంటి లెహంగానే మినావాలా కేన్స్ 2025లో అర్పితా మెహతా ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. మళ్లీ శ్వేనా కారణంగా ఈ ఎంబ్రాయిడరీ గొప్పదనం మరోసారి వెలుగులోకి వచ్చి హెలెట్గా నిలిచింది. దీని ధర సుమారు రూ. 1 కోటి రూపాయలు పైనే పలుకుతుందట. View this post on Instagram A post shared by WeddingSutra.com (@weddingsutra) (చదవండి: వధువుపై కోట్ల రూపాయల నగదు వర్షం..! ఎక్కడంటే..) -
అంతర్జాతీయ మోడల్గా సివిల్ ఇంజనీర్..! ఒక్క రోజుకే..
ఇంజనీరింగ్ చదువుకుంటూనే ఫ్యాషన్ ప్రపంచం వైపుకి అడుగులు వేశాడు ఈయువకుడు. ఒక పక్క చదువుని, అభిరుచిని..రెండిటిని సమతుల్యం చేస్తూ..మోడలింగ్లో మంచి సక్సెస్ని అందుకున్నాడు. అంతేగాదు ఇంజనీర్గా ఒక్క ఏడాదిలో సంపాదించే మొత్తం మోడల్గా ఒక్కరోజులోనే ఆర్జిస్తూ..గ్లామర్కున్న క్రేజ్ని చాటి చెప్పాడు. అంతేగాదు రెండు విభిన్న రంగాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ని విజయవంతంగా నిర్మించుకోవచ్చని నిరూపించి, స్ఫూర్తిగా నిలిచాడు. అతడే శుభమ్ వైద్కర్. 24 ఏళ్ల ఈ యుకువడు సివిల్ ఇంజనీర్ గ్రాడ్యేయేట్. కానీ ఇవాళ అంతర్జాతీయ మోడల్గా లక్షలు ఆర్జిస్తున్నాడు. అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ కోసం చాలాసార్లు ర్యాంప్పై నడిచాడు. ముంబైలో పుట్టి పెరిగిన శుభమ్ అక్కడే సివిల ఇంజనీరింగ్ని పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే మోడలింగ్ ప్రారంభించాడు. ఇన్స్టాగ్రామ్లోని ఒక రీల్ చూసి దీనిపై ఆసక్తి పెరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే అప్పడు తన బరువు 83 నుంచి 84 కిలోలు వరకు ఉండేవాడినని అన్నాడు. మోడల్ వైపుకి వచ్చానే కానీ..ఎలా అనేది అంతగా తెలియదు. అందుకోసం అని గూగుల్లో వెతకగా..మనకు ప్రాతీనిధ్యం వహించడానికి ఏజెన్సీలు అవసరమని తెలుసకున్నానని అంటున్నాడు శుభమ్. దాతో తన ఫోటోలు ఏజెన్సీలకు పంపాను..వాటిలో ఒక ఏజెన్సీ తనను మీటింగ్కి పిలిచి..నేరుగా బరువు తగ్గాలని సూచించారని తెలిపాడు. అందుకు ఒక నెల సమయం ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అయితే వెంటనే శుభమ్ టైం వేస్ట్ చేయకుండా వెయిట్లాస్ అయ్యే పనిలో పడ్డాడట. అప్పటి నుంచే చక్కెర, జంక్ పదార్థాలు, నూనె పదార్థాలకు చాలా దూరంగా ఉండేవాడట. అలా మోడల్గా మారేందుకు కష్టబడుతున్న తరుణంలో 2024 జనవరిలో అర్మానీ షో కోసం ఇటలీలోని మిలన్కు వెళ్లే అవకాశం తనకు మొదటిసారి లభించిందని చెప్పుకొచ్చాడు. అంతకుమందు భారత్లో మోడలింగ్గా చేశానని, కానీ విదేశాలకు వెళ్లే ఛాన్స్ మాత్రం రాలేదని అంటున్నాడు. ఆ ఏడాదే జూన్లో రెండోసారి మిలన్ నుంచి పారిస్కి ప్రయాణించినట్లు తెలిపాడు. జూన్లో తన గ్రాడ్యుయేషన్ పరీక్షలు పూర్తిచేసుకుని మరి వెళ్లినట్లు పేర్కొన్నాడు. మిలన్లో రెండు నెలలు ఉన్నట్లు తెలిపాడు. అయితే మోడలింగ్ అనేది స్థిరంగా పనిదొరికే రంగం కాదు. ఈవెంట్లను బట్టి వర్క్ అనేది ఉంటుంది. దాంతో శుభమ్ వెంటనే భారత్కి వచ్చేసి..తన డిగ్రీకి తగిన ఉద్యోగం వెతుక్కుని మరి జాయిన్ అయ్యిపోయాడు. నెలకు రూ. 30 వేల వేతనం చెల్లించేది. అయితే మోడలింగ్ని పూర్తి సమయం కొనసాగించే నిమిత్తం జాబ్లో జాయిన్ అయ్యిన ఆరునెలలకే రాజీనామా చేసేశాడు. మోడల్గా సంపాదన..సివిల్ ఇంజనీర్గా నెలకు రూ. 30 వేలు సంపాదిస్తే..మోడల్గా ఒక్కరోజు షూట్ కోసం లక్షల్లో డబ్బు సంపాదించడం విశేషం. మిలన్లో జరిగే రన్వే షో కోసం దాదాపు లక్ష నుంచి రెండు లక్షలకు వరకు సంపాదించొచ్చని చెబుతున్నాడు. అడ్వర్టైస్మెంట్లకే బాగా వేతనం లభిస్తుందని అంటున్నాడు శుభమ్. ఒక్కోసారి ప్రాజెక్ట్ని బట్టి..రూ. 5 లక్షలు పైనే ఆర్జించొచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. అయితే ఇక్కడ మొత్తం మోడళ్ల చేతికి వెళ్లదని, ఏజెన్సీ 30% కోత విధిస్తుందని చెప్పుకొచ్చాడు. కేవలం 70% తాము ఉంచుకుంటామని అన్నాడు. ఇక మోడలింగ్ పైకి ఆకర్షణీయంగా కనిపిస్తున్నా..తెరవెనుక చాలా కష్టం ఉంటుందని చెబుతున్నాడు శుభమ్. తన గ్లామర్ లుక్ కోసం చాలా ఖర్చు చేయాల్సి కూడా ఉంటుందని అంటున్నాడు. అలాగే ఈవెంట్ల గురించి ఒకరోజు ముందు మాత్రమే తెలుస్తుందట. అక్కడ వసతికి సంబంధించి..ఏజెన్సీనే చూసుకుంటుంది. గానీ ఇతర ఖర్చులు మనమే భరించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ రంగంలో ఒక్కోసారి ప్రదర్శన సమయంలో చివరి క్షణంలో మనల్ని తొలగించే అవకాశం కూడా ఉంటుందట. ఆ టైంలో మానసికంగా స్థైర్యంగా ఉండటం అంత ఈజీ కాదని అంటున్నాడు శుభమ్. అంతేగాదు మోడల్గా రాణించాలంటే బరువుని కూడా అదుపులో ఉంచుకోవడమే గాక, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి కూడా. చివరగా శుభమ్ ఈ గ్లామర్ ఫీల్డ్లో నిలదొక్కుకోవాలంటే..తిరస్కరణలను తట్టుకోవాలి, ఓపికతో ఉండాలని అంటున్నాడు. ఎందుకంటే ఒక్కోసారి అసలు పనే ఉండదు..అయినప్పటికీ..అవకాశం కోసం చాలా నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. View this post on Instagram A post shared by Shubham Vaidkar (@shubham_vaidkar) (చదవండి: 'రెండు రకాల తల్లులు'..! థైరోకేర్ వ్యవస్థాపకుడి పేరెంటింగ్ పాఠాలు..) -
దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ
మన వస్త్రధారణ, సంస్కృతి విదేశీయలును ఎంతగా ఆకట్టుకుట్టుందో పలు ఘటనల్లో చూశాం. వాళ్లు మన సంస్కృతి, వేషధారణని ఇష్టపడి మరి ఇక్కడే ఉండిపోతున్న వాళ్లు ఉన్నారు. ఇంకొందరు మన దుస్తులను ఇష్టపడటమేగాక..వారి ఆహార్యాన్ని కూడా మార్చుకుంటున్నారు. పైగా మనలా నిండుగా కప్పుకునే దుస్తులే వేసుకునేందుకు ఇష్టపడటం విశేషం. ఇక్కడొక యూఎస్ మహిళ ఆ విషయమే చెబుతూ..ధన్యవాదాలని చెబుతోంది. ఇంతకీ దేనికి ఈ ధన్యవాదాలంటే..భారత సాంప్రదాయ వస్త్రమైన దుపట్టాపై తన ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ కేమి అను అమెరికన్ మహిళ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఆ వీడియోలో భారత ప్రజలారా మీకు చాలా చాలా ధన్యవాదాలు. స్కార్ఫ్ లాంటి దుపట్టాను వారు తమ భుజం లేదా ఛాతీపై కప్పుకుంటారు. అది తన దుస్తులను అక్షరాల పదిరెట్లు మెరుగుపరిచిందంటూ సంబరపడింది. తాను ఈ దుపట్టాను భారతీయులే కనిపెట్టారని నమ్ముతున్నా..ఒకవేల్ల తప్పు అయితే రిచేయండి అని పేర్కొంది కేమి. నెటిజన్లు కూడా అవును మీరు చెప్పింది నిజమే. దీనిని భారతీయులే కనుగొన్నారు. కానీ దక్షిణాసియా అని ఏడుస్తున్నవారు ఉన్నారు. అయితే వాళ్లు భారతదేశంలో భాగమేనని మర్చిపోవడం బాధకరం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by KEMI (@eczema.bread) (చదవండి: weight loss Tips: సాంప్రదాయ తమిళ ఆహారం తింటూనే..22 కిలోలు తగ్గాడు..!) -
జీవనశైలిపై చెరగని ముద్ర: టాటూ ట్రెండ్
ఒకప్పుడు సంప్రదాయానికి, ఆచారాలకూ పరిమితమైన పచ్చబొట్టు (టాటూ) నేడు ఆధునిక జీవనశైలిలో ఫ్యాషన్, వ్యక్తిగత గుర్తింపు, భావ వ్యక్తీకరణకు ప్రతీకగా నిలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో టాటూ అనేది శరీరంపై వేసుకునే డిజైన్ మాత్రమే కాదు.. ఇది ‘లైఫ్స్టైల్ చాయిస్’. కాలేజీ విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల వరకు, సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వరకు అందరిలోనూ టాటూ పట్ల ఆసక్తి పెరుగుతోంది. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనే ఆకాంక్ష అందరిలోనూ పెరుగుతోంది. ఈ కారణంగా ఓ వ్యక్తి ఏకంగా తన రెండు కళ్లలోనూ టాటూ వేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నప్పటికీ.. ప్రస్తుత జీవనశైలిలో ఇది స్టైల్ స్టేట్మెంట్గా మారింది. మన సంస్కృతిలో పచ్చబొట్టు అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. గిరిజన తెగలు, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ, ఆధ్యాతి్మక విశ్వాసాలకు ప్రతీకగా పచ్చబొట్లు వేసుకునేవారు. కాలక్రమేణా ఈ సంప్రదాయం ఆధునికతను సంతరించుకుని ‘స్టైల్ స్టేట్మెంట్’గా మారింది. నేడు టాటూ అంటే ప్రేమ, స్నేహం, కుటుంబం, నమ్మకం, స్వీయ భావనం ఇలా ఎన్నో భావోద్వేగాలకు ప్రతిరూపం. అయితే ఈ టాటూ ఆర్ట్కు ఎన్నో రూపాలు ఉన్నాయి. ప్రస్తుత తరంలో మరింత వినూత్నత్వాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విభిన్న శైలి మోడ్రన్ ఫ్యాషన్లో భాగమౌతోంది. బ్లాక్ అండ్ గ్రే టాటూలు క్లాసిక్గా ఉంటే, కలర్ టాటూలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇందులో చిన్న డిజైన్లు, సూక్ష్మ అక్షరాలతో మినిమలిస్ట్ టాటూలు, మనుషులు, జంతువుల ముఖాలు, ప్రకృతి దృశ్యాలతో రియలిస్టిక్ టాటూలు రూపుదిద్దుకుంటున్నాయి. సంప్రదాయ గిరిజన శైలితో ట్రైబల్ టాటూలు, విభిన్న ఆకృతులు, రేఖల సమ్మేళనంతో జియోమెట్రిక్ టాటూ.., అంతేకాకుండా రంగుల మేళవింపుతో వాటర్కలర్ టాటూలు సందడి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో 3డీ టాటూలు, గ్లో ఇన్ ద డార్క్ టాటూలు ట్రెండ్గా మారుతున్నాయి.కెరీర్గా.. టాటూ ఆర్టిస్ట్! నగరంలో టాటూ కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచి్చ»ౌలి వంటి ప్రాంతాల్లో హైఎండ్ టాటూ స్టూడియోలు ఉన్నాయి. సెలబ్రిటీలు, యూత్ ప్రభావంతో లాభదాయక వ్యాపారంగా మారింది. టాటూ ఆరి్టస్ట్ ఓ ప్రత్యేక కెరీర్గా మారింది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో టాటూ ఒక కీలక భాగంగా మారింది. ర్యాంప్ వాక్లు, ఫొటోషూట్లు, బ్రాండింగ్లో టాటూలు వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తున్నాయి. టాటూ అంటే స్వీయ వ్యక్తీకరణకు ఒక మాధ్యమంగా మారింది. సున్నితమైన ప్రదేశాల్లో సేఫేనా..?! టాటూ వేసుకోవడంలో చేతులు, భుజాలు, వెన్ను, మెడ వంటి ప్రదేశాలు సాధారణం. కానీ ఇటీవల కాలంలో కళ్లలో (ఐబాల్ టాటూ), నాలుక, పెదాలు, చెవుల వెనుక.. ఇలా అత్యంత సున్నిత ప్రాంతాల్లోనూ టాటూలు వేయించుకుంటున్నారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం సున్నిత ప్రదేశాల్లో టాటూ వేయించుకోవడం తీవ్ర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. దృష్టి కోల్పోవడం, ఇన్ఫెక్షన్లు, నరాల సమస్య వంటి ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.. టాటూ రంగంలో ఆధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచి్చంది. స్కిన్ ఫ్రెండ్లీ ఇంక్స్, డిజిటల్ డిజైన్ ప్రివ్యూలు, నొప్పి తగ్గించే టెక్నిక్స్ టాటూలను మరింత సురక్షితంగా మార్చాయి. కొన్ని స్టూడియోలు పూర్తి మెడికల్ స్టాండర్డ్స్తో పనిచేస్తుండటం విశేషం. ఇటీవల ఒక వ్యక్తి కంట్లోనే టాటూ వేయించుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైద్యుల సలహాతో అధునాతన పద్ధతిలో నేపాల్ వెళ్లి మరీ టాటూ వేయించుకున్నాడు. అతను స్వయంగా టాటూ ఆరి్టస్టు కావడం గుర్తించాల్సిన అంశం.సరి్టఫైడ్ టాటూ ఆర్టిస్ట్లు.. టాటూ వేయించుకునే ముందు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టాటూ ఫ్యాషన్ అయినా, జీవితాంతం ఉండే గుర్తు. టాటూ వేసుకునే ముందు ముఖ్యంగా సర్టిఫైడ్, అనుభవజ్ఞుడైన టాటూ ఆరి్టస్ట్ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. స్టెరిలైజ్డ్ సూదులు, సేఫ్ ఇంక్ ఉపయోగిస్తున్నారా అనేది ప్రధానం. స్కిన్ అలర్జీ టెస్ట్ చేయించుకోవడం మంచిది. టాటూ తర్వాత ఇచ్చే ఆఫ్టర్ కేర్ సూచనలు తప్పక పాటించాలి.నచ్చకుంటే లేజర్ రిమూవల్.. అప్పుడెప్పుడో వేసుకున్న టాటూ ప్రస్తుతం నచ్చకపోతే..? దీనికి పరిష్కారం లేజర్ టాటూ రిమూవల్. లేజర్ టెక్నాలజీ ద్వారా టాటూను దశలవారీగా తొలగిస్తారు. అయితే ఇది పూర్తిగా రిస్క్ ఫ్రీ కాదు. స్కిన్ డార్కెనింగ్, మచ్చలు వంటి సమస్యతో పాటు ఖర్చుతో కూడినది. డాక్టర్ సలహాతో మాత్రమే చేయించుకోవాలి. నగర జీవనంలో స్టైల్ స్టేట్మెంట్గా మారినప్పటికీ ఈ ట్రెండ్ అనుసరించే ముందు సరైన జాగ్రత్తలు పాటించాలని, ఎందుకంటే ఫ్యాషన్ క్షణికం, కానీ టాటూ జీవితాంతం అంటున్నారు నిపుణులు. -
లేటెస్ట్ లంగా ఓణి..! బుట్టబొమ్మల్లా అమ్మాయిలు..
ఫ్యాషన్లో ఎన్నో డిజైన్స్ మనల్ని పలకరిస్తుంటాయి. అంతే వేగంగా ఆ డిజైన్స్ కనుమరుగవుతుంటాయి. కానీ, మనదైన సంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిల అలంకరణలో భాగమైన హాఫ్ శారీ అబ్బాయిల అలంకరణలో ధోతీ ఎప్పటికీ ఎవర్గ్రీన్గా నిలిచే ఉంటాయి. హాఫీ శారీ వేడుక టీనేజ్ను దాటేస్తూ ముందుకు వెళ్లి అమ్మాయి జ్ఞాపకాలలో నిలిచే అందమైన రోజవుతుంది. హైదరాబాద్ డిజైనర్ భార్గవి కూనమ్ హాఫ్ శారీస్ డిజైన్స్లో వస్తున్న గ్రాండ్లుక్ని ఇటీవల మరింత ఆకర్షణీయంగా ఆవిష్కరించారు. ‘‘తెలుగింటి సంప్రదాయంలో పెళ్లి ముఖ్యమైన వేడుక. అంతే వేడుకగా ఒకమ్మాయి జీవితంలో కుటుంబసభ్యులందరూ కలిసి పండగలా జరుపుకునేది హాఫ్ శారీ ఫంక్షన్. ఇటీవల పెళ్లికి చేసిన విధంగానే హాఫ్శారీ ఫంక్షన్ను హల్దీ, మెహందీ .. అంటూ నాలుగు రోజుల పాటు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. పన్నెండేళ్ల లోపు అమ్మాయిలకు చేసే ఈ వేడుకలో బుట్టబొమ్మలా కనిపించే అమ్మాయిలపైనే అందరి దృష్టి ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా తమ కూతుళ్లను ఆ విధంగా చూసుకోవడానికి చాలా సంతోషిస్తుంటారు. మన చేనేతలుబెనారస్, కంచి, పైథాని పట్టు, చికంకారి జరీ కోటా .. తో చేసిన హాఫ్ శారీ, ధోతీ డిజైన్స్ ఇవి. లైట్ కలర్స్కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పట్టు, కోటా ఫ్యాబ్రిక్ ఉపయోగించాం. జరీ వర్క్తో చేసిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేనేతలకు మరింత గ్రాండ్ లుక్ వచ్చింది. అంటే చేనేతలు – ఎంబ్రాయిడరీ– ఆభరణాలతో కలిపి చేసిన క్రియేటివ్ జర్నీ ఇది. ఆభరణాల మార్క్హాఫ్ శారీస్కు ఆభరణాల కాంబినేషన్ కూడా అత్యంత ముఖ్యమైనది. ఆకర్షణీయమైన లుక్ క్రియేట్ చేయడానికి పట్టు– జ్యువెలరీతో కలిసి చేసిన కాంబినేషన్ వర్క్ ఇది. లంగాఓణీ కాంబినేషన్ డ్రెస్ మనదైన సంప్రదాయ డ్రెస్ కాబట్టి, దీనికి మన సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ బాగా నప్పుతుంది. ఎంబ్రాయిడరీని మ్యాచ్ చేస్తూ పెద్ద పెద్ద హారాలు, డైమండ్ జ్యువెలరీతో మరిన్ని హంగులను తీసుకువచ్చాం’’ అని వివరించారు భార్గవి కూనమ్. (చదవండి: బనారసీ పట్టు చీరలో నీతా అంబానీ..! 50 ఏళ్ల నాటి..) -
బనారసీ పట్టు చీరలో నీతా అంబానీ..! 50 ఏళ్ల నాటి..
ఎన్ని ఫ్యాషన్ ట్రెండ్లు వచ్చినా.. భారతీయ వారసత్వానికి మించింది లేదు. సాంప్రదాయ దుస్తుల్లోని అందమే వేరు. బంగారు మోటీఫ్లతో ఉండే బనారీసి చీర లుక్కే ఎవర్గ్రీన్. ఆ విషయాన్ని రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా తన ఆహార్యంతో చెప్పకనే చెప్పారామె. తరచుగా బెనరసీ చీరలతో తళుక్కుమనే నీతా ఈసారి సంప్రదాయ ఎరుపు బనారసీ చీరతో పండుగ వాతావరణం తెప్పించారు. యాభైఏళ్ల క్రితం నాటి ఈ ఫ్యాషన్ నేటికి అద్భుతమే అని చాటిచెప్పారు. ఎరుపు రంగు బంగారు జరీతో ఉన్న ఈ బనారసీ చీర ..చేనేత కళాకారుల నైపుణ్యాన్ని హైలెట్ చేసింది. అందుకు తగ్గట్టుగా ధరించిన మ్యాచింగ్ బ్లౌజ్ వెనుక భాగం రాజదర్పంలా లేదా ఆలయ చిహ్నంలాంటి క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ స్పెషల్ ఎట్రాక్షన్ని ఇచ్చింది. ఈ చిహ్నం శ్రేయస్సుకి సంకేతం కూడా. ఇంతలా వివరణాత్మకంగా డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ ఈ దుస్తుల ప్రాధాన్యతను, భారతీయ సంస్కృతిని మరింత హైలెట్ చేసింది. నీతా ఈ కాస్ట్యూమ్కి తగ్గట్టుగా కాంట్రాస్ట్గా పచ్చని డైమండ్ నెక్లెస్ ధరించి.. తన లుక్ని మరి ఆకర్షణీయంగా కనిపించేలా చేశారామె. ఆ ఎరుపు పట్టు చీరకు ఆ పచ్చని నెక్లెస్ మరింత అందం. నిండుదనం ఇచ్చింది. View this post on Instagram A post shared by Ritika kadam (@ritikahairstylist) (చదవండి: Strawberry: స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం..అందం కూడా..) -
Parliament session: స్టైలిష్ సిల్క్ చీరలో మెరిసిన కంగనా..!
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ యాక్టింగ్ పరంగా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి వేలాది అభిమానులను సొంతం చేసుకున్న అందాల నటి. ఫ్యాషన్ పరంగాను ఆమె సాటిలేరవ్వరూ అన్నంతగా హుందాగా, స్టైలిష్గా ఉంటారామె. ఈనెల ఫిబ్రవరి 04న జరిగిన పార్లమెంట్ సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఒక్కసారిగా ఆమె అభిమానులు రాజకీయనాయకురాలిగా హుందాగా కనిపించడంలో నీకు సాటిరావెవ్వరూ అని ప్రశంసిస్తూ పోస్టులు ముంచెత్తారు. ఆమె ఆధునిక మహిళలా బ్రోకెడ్ ఎంబ్రాయిడరీతో కూడిన పట్టు చీర విత్ ట్రెంచ్ కోట్-శైలి జాకెట్తో అత్యంత అందంగా కనిపించారామె. అచ్చం సాంప్రదాయ శైలి చీర కట్టుతో చక్కగా మడత పెట్టిన పల్లు, ఫుల్హ్యాండ్స్ జాకెట్తో పార్లమెంట్ రేంజ్కి తగినట్లుగా అత్యంత హుందాగా ఉంది ఆమె ఆహార్యం. అలాగే లైట్ మేకప్, బ్యాక్సన్గ్లాస్, చేతిలో హెర్మెస్ బ్యాగ్తో అత్యంత ముగ్దమనోహరంగా ఉందామె. సింపుల్గా చెప్పాలంటే ఆత్మవిశ్వాసంతో కూడిన రాజకీయ నాయకురాలిలా అందరి దృష్టిని ఆకర్షించేలా ప్రత్యేకంగా కనిపించారామె. View this post on Instagram A post shared by Ecnopolis India (@ecnopolis.india) (చదవండి: 70 ఏళ్ల మహిళకు అంతుపట్టని సమస్య..! కంగుతిన్న వైద్యులు) -
ఆకుపచ్చని చీరలో మెరిసిపోతున్న మాధురి దీకిత్..!
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహ సీజన్ని తలంపుకి వచ్చేలా ఆమె లుక్ మెస్మరైజ్ చేస్తోంది. ఆరు గజాల బాటిల్ గ్రీన్ షేడ్ సిల్క్ చీరలో ఈ ఐదు పదుల బ్యూటీ ముగ్దమనోహరంగా ఉంది. కనుచూపుని తిప్పుకోనివ్వనంత ఆకర్షణీయమైన లుక్తో ఆకర్షిస్తోంది. జనవరి 31న, మాధురి ఇన్స్టాగ్రామ్లో “పియా తోసే నైనా లాగే రే (1965 చిత్రం గైడ్ నుండి లతా మంగేష్కర్ పాట)” అనే క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో తన బ్యూటీఫుల్ ఫోటోలను షేర్ చేశారామె. ఆ పచ్చదనం మాధురికి రాచరికపు లుక్ని అందించింది. ఈ చీర అంచుల వెంబరడి జర్దోజీ ఎంబ్రాయిడరీ చీర విలాసవంతమైన లుక్ని హైలెట్ చేసింది. ఆ చీరకు సరిపోయేలా అదే కలర్లోని ఎంబ్రాయిడరీ బ్లైజ్ ఈ వివాహ వేడుకలకు లేటెస్ట్ ఫ్యాషన్స్టైల్గా నిలిచింది. స్టైలిష్గా కూర్చొన్న తీరు..జాలు వారుతున్న ఆ శారీ పల్లు రాజదర్బారులో కూర్చొన్న మహారాణిలా హుందాగా కనిపించింది మాధురి. జయంతి రెడ్డి లేబుల్ నుంచి వచ్చిన ఈ ఆకుపచ్చని చీర ధర వింటే నోరెళ్లబెడతారు. ఎంతంటే..అక్షరాలు రూ. 1,39,900లు పలుకుతుంది. ఆ చీరకు తగ్గట్టు మాధురి ఎంచుకున్న మేకప్, హెయిర్స్టయిల్ ఆమె లుక్ని మరింత గ్రాండ్గా కనబడేలా చేసింది. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) (చదవండి: కిచెన్పై బడ్జెట్ ప్రభావం..ఏం తగ్గనున్నాయంటే..!) -
ఆ నటి ధరించిన డైమండ్ నెక్లెస్ ..రూ. 72 కోట్లా..!? ఏకంగా షాజహాన్..
సెలబ్రిటీలు ధరించే ప్రతి కాస్ట్యూమ్, నగలు ప్రత్యేక ఆకర్షణ తోపాటు అత్యంత విలాసవంతమైనవి కూడా. వాళ్ల స్టేటస్కి తగ్గ ఫ్యాషన్వేర్లే అయినా..ఇక్కడ ఈ నటి ధరించిన డైమండ్ నెక్లెస్ అత్యంత ప్రత్యేకం. ఈ నెక్లెస్ వెనుకున్న ఆసక్తికర స్టోరీలు చూస్తే..ఇంత చరిత్ర ఉందా ఈ ఆభరణానికి అని విస్తుపోవడం ఖాయం. ఎందరి చేతులు మారి ఆ నెక్లస్ ఆమె వద్దకు చేరిందంటే..ఆస్ట్రేలియన్ నటి మార్గోట్ రాబీ తన రాబోయే చిత్రం వూథరింగ్ హైట్స్ ప్రమోషన్లో భాగంగా రెడ్ కార్పెట్పై తన గ్లామ్ లుక్తో అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారామె. ఈ మూవీలో హీరో జాకబ్ ఎలోర్డి కూడా నటించారు. రాబీ లాస్ ఏంజిల్స్లోని చైనీస్ థియేటర్లో జరిగిన వరల్డ్ మూవీ ప్రీమియర్కు హాజరయ్యారు. అక్కడ ఆమె షియాపరెల్లి కోచర్ గౌనుతో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకొంది. ముఖ్యంగా ఆమె మెడలో ధరించిన నెక్లెస్ అమితంగా అందరి మనసులను దోచుకుంది. ఎందుకంటే ఈ డైమండ్ నెక్లెస్ హాలీవుడ్ ఐకాన్ ఎలిజబెత్ టేలర్ది. దీని ధర భారత కరెన్సీ ప్రకారం.. సుమారు రూ. 74 కోట్లు పలుకుతుంది. ఆమె ధరించే ప్రతి ఆభరణం ఆలోచనాత్మకంగానూ, ఇంట్రస్టింగ్ కథ దాగుంటుంది. హాలీవుడ్ ఐకాన్ నటి ఎలిజబెత్ టేలర్ 40వ పుట్టిన రోజున తన ఐదో భర్త ఈ నెక్లెస్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఈ ఇద్దరు రోమ్లో నిర్మిస్తున్న క్లియోపాత్రా చిత్రంలో పనిచేశారు. అప్పుడే ఇద్దరూ ఒకరికొకరు పరిచయమై ప్రేమలో పడ్డారు. ఆ టైంలో వీరి ప్రేమకథ వార్తల్లో నిలిచి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది కూడా. రియల్ స్టోరీ ఏంటంటే..గుండె ఆకారంలో ఉన్న టేబుల్-కట్ వజ్రంపై "ప్రేమ శాశ్వతమైనది" అని రాసి ఉన్న పార్సీ శాసనం ఉంది. దానిపై నూర్జహాన్ పేరు కూడా చెక్కి ఉంటుంది. ఈ రత్నాన్ని నూర్జహాన్ భర్త మొఘల్ చక్రవర్తి షాజహాంగీర్ ఇచ్చాడని, తరువాత వారి కుమారుడు షాజహాన్కు అందజేశాడని నమ్ముతారు. చరిత్రకారుల ప్రకారం..షాజహాన్ తన భార్య ముంతాజ్కు ఆభరణాలను బహుకరించాడు. మొఘలులతో దాని లోతైన అనుబంధం కారణంగా, ఈ నెక్లెస్ను "తాజ్ మహల్ వజ్రం" అని కూడా పిలుస్తారు.1971 నాటికి, ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ తాజ్ మహల్ వజ్రాన్ని సొంతం చేసుకుంది, ఎరుపు రత్నాలు టేబుల్-కట్ వజ్రాలతో అలంకరించబడి, భారతీయ ఆభరణంలా రూబీ హారంలా డిజైన్ చేశారు. దీన్ని ఇలా నెక్లెస్లా తీర్చిదిద్దింది ప్రఖ్యాత నగల డిజైనర్ ఆల్ఫ్రెడ్ డ్యూరాంటే.. అంత చరిత్ర కలిగిన ఈ నెక్లెస్ని ఆస్ట్రేలియన్ నటి రాబీ మెడలో ధరించడంతో అక్కడున్న వారందరిలో ఆసక్తి, కుతుహలం వెల్లువెత్తింది. అక్కడ అందరి చూపు ఆ ఆభరణంపైనే. ఎన్నో ప్రేమకథలను పొందుపర్చుకున్న ఈ హారంతో రాబీ ఆ వేడుకలో పురాతన వైబ్స్ సృష్టించింది.(చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?) -
భారతీయ అవుట్ఫిట్లో ఈయూ చీఫ్ ఉర్సులా ..!
భాతర 77వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఉర్సులా వాన్ డెర్ లేయన్ హాజరయ్యిన సంగతి తెలిసిందే. ఆమె ఈ వేడుకలో తన వేషధారణతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో సిగ్నేచర్ టైలర్డ్ ప్యాంట్సూట్లకు పేరుగాంచిన ఈయూ చీఫ్ ఉర్సులా మెరూన్-అండ్-గోల్డ్ బ్రోకేడ్ బంద్గాలా విత్ ఆఫ్-వైట్ ప్యాంట్లో కనిపించారు. భారతీయ శైలిలో వచ్చి..ఈ వేడుకను మరింత అందంగా మార్చారామె. భారతీయ సంస్కృతిపట్ల గౌరవాన్ని, అలాగే ఈ వేడుక ప్రాముఖ్యతన ఉర్సులా తన ఆహార్యంతో చెప్పకనే చెప్పారామె. సాంప్రదాయపు గుర్రపు బగ్గీలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియోలస్ శాంటోస్ డా కోస్టాతో కలిసి కర్తవ్య పథ్కు చేరుకోవడానికి కొన్ని క్షణాల ముందు, చీఫ్ ఉర్సులా సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చారు. "ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉండటం అనేది తన జీవితకాల గౌరవం. విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా చేస్తుంది. తద్వారా మనందరం ప్రయోజనం పొందుతాం." అని పోస్ట్లో పేర్కొన్నారు. కాగా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, 2019లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. ఆమె జూలై 2024లో రెండవసారి ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. 2029లో జరిగే యూరోపియన్ ఎన్నికల వరకు కమిషన్కు నాయకత్వం వహిస్తారు. పైగా యూరోపియన్ కమిషన్లో తన పదవీకాలానికి ముందు, వాన్ డెర్ లేయెన్ 2005 నుంచి 2019 వరకు జర్మనీ సమాఖ్య ప్రభుత్వంలో పనిచేశారు. ఈ సమయంలో ఆమె కుటుంబం, యువజన, కార్మిక, రక్షణ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించి, పాలన, ప్రజా సేవలో విస్తృతమైన అనుభవాన్ని పొందారు.77th #RepublicDay🇮🇳 | President Droupadi Murmu, along with President of the European Council, António Luís Santos da Costa and President of the European Commission, Ursula Von Der Leyen, arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the paradePrime Minister… pic.twitter.com/5Snpohoa5m— ANI (@ANI) January 26, 2026 (చదవండి: వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్: ఆ ప్రమాదం ఆకాశం నుంచి..) -
అబుదాబిలో కరీనా లుక్స్ అద్బుతః..! ఆ జాకెట్ అంత ఖరీదా..
బాలీవుడ్ నటి కరీనా కపుర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరీన తన అందం, అభినయంతో వేలాది అభిమానులను సొంతం చేసుకున్నారామె. ఇప్పటికీ ఐదు పదుల ఏజ్లోనూ యువ హీరోయిన్లకు తీసిపోని ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆమె ఫ్యాషన్పరంగా కరీనా రేంజ్ వేరేలెవెల్ అన్నట్లు ఉంటుంది ఆమె స్టైల్. అబుదాబిలో ఓ ప్రముఖ్య జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో కరీనా లుక్ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది.ముఖ్యంగా ఆమె ధరించిన జాకెట్ హాట్టాపిక్గా మారింది.ఓజీ స్టైల్ ఐకాన్ కరీనా కపూర్ ఖాన్ అబుదాబిలో విలాసవంతమైన లగ్జరీ ఫ్యాషన్కి కేరాఫ్గా నిలుచారు. ఆమె స్టన్నింగ్ లుక్ కళ్లుతిప్పుకోనివ్వనంతగా హైలెట్గా నిలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలో కరీనా తన స్టైల్ స్టేట్మెంట్ ఇది అన్నట్లుగా అత్యంత అందంగా కనిపించారామె. ఈ మేరకు ఆమె శ్వేతా కపూర్ నేతృత్వంలోని ఫ్యాషన్ బ్రాండ్ బృందంతోపాటు మెరిశారామె. బ్రాండ్ బైడల్ కలెక్షన్ నుంచి బెబో తెల్లటి దుస్తులు విత్ చేతితో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి జాకెట్ని ధరించింది కరీనా. నిజానికి డ్రెస్ని ఒపాల్ సెట్ అని పిలుస్తారట. దీని ధర వచ్చేసి సుమారు రూ. 5 లక్షలు పైనే పలుకుతుందట. తెల్టి శాటిన్పై ఆ జాకెట్ లుక్ అదిరిపోగా..ఈ జాకెట్ని వెండి దారలతో ఎంబ్రెయిడ్ చేసి, మేలుజాతి స్టోన్లతో తీర్చిదిద్దారు. ఇక ఆమె చెవిపోగులు, ఉంగరంగ డైమండ్ని ఎంచుకుని తన లుక్ మరింత ప్రకాశంతంగా కనిపించేలా జాగ్రత్త పడ్డారామె. ఇక జడను బన్ స్టైల్ వేసుకుని..ఆ డ్రెస్కి పూర్తి న్యాయం చేశారామె. అలాగే ఆ ప్రకాశవంతమైన డ్రెస్కి అనుగుణంగా పెదవులకు,బుగ్గలకు లేతరంగు గులాబీ, కనురెప్పలకు మస్కారా, స్మోకీ ఐషాడోను ఎంచుకుని స్టైల్కి సరికొత్త అర్థం ఇచ్చేలా కరీనా ఆహార్యం అదుర్స్. View this post on Instagram A post shared by Faisal AK (@_faisal_akf) (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్కి..హడలెత్తించేలా బిల్లు..!) -
ట్రెండీగా అక్షరాల అలంకరణ..
తెల్లని కాగితం మీద రాసే అక్షరమాల వేడుకలలో ఆధునిక మహిళల అలంకరణగా ఆకట్టుకుంటోంది.పెళ్లి, పుట్టినరోజు, సీమంతం.. వేడుకకు తగినట్టు తమ ప్రియమైన వారి పేర్లు హెయిర్ యాక్సెసరీస్లలోనూ, గాజులు, ఇతర ఆభరణాలలోనూ వచ్చేటట్టు ప్రత్యేకంగా డిజైన్ చేయించడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా చిన్నపిల్లల కేశాలంకరణలో నేమ్ క్లిప్స్ చూస్తుంటాం. ఇప్పుడు వెస్ట్రన్ లేదా ఇండియన్ వేడుకలకు తగినట్టు అన్ని వయసుల వారు తమ కేశాలంకరణలోనూ, ఇతర ఆభరణాలలోనూ అక్షరమాలను అందంగా కూర్చుతున్నారు.నెక్లెస్... హ్యాంగింగ్స్ గానూ...చెవులకు జూకాలు, మెడన హారాలలో తమ ప్రియమైన వారి పేర్లు మెరుస్తూ కనిపిస్తున్నాయి. వేడుక అర్థం తెలిసేలా కూడా అక్షరాలమాలను ధరిస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, థ్రెడ్ జ్యువెలరీలలో సందర్భానికి తగిన అక్షరాలు కనిపిస్తుంటాయి. హల్దీ, మెహెందీ వివాహ వేడుకలలో వధూవరుల పేర్లు కలిసివచ్చేలా డిజైన్ చేసిన ఆభరణాలను కొత్త పెళ్లికూతురు ధరిస్తుండటం కనిపిస్తోంది.కేశాల అలంకరణలో...ఎ నుంచి జెడ్ వరకు ఇంగ్లిష్ అక్షరాలతో తయారు చేసిన వివిధ లోహపు, బీడ్స్ హెయిర్ జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. వరుడి పేరు వచ్చేలా లేదా సందర్భానికి తగిన అర్థం వచ్చేలా, ఫన్ని క్రియేట్ చేసే విధంగానూ అక్షరాలను తలకెక్కించుకుంటున్నారు. వీటిలో స్వరోస్కి, గోల్డ్, ఎంబ్రాయిడరీ, వివిధరకాల పూసల అందాలు అక్షరాల చుట్టూ చేరుతున్నాయి. జడ ΄÷డవును బట్టి కూడా లోహపు అక్షరాల క్లిప్స్ వేల రూ΄ాయల ధర పలుకుతున్నాయి.గాజుల్లో..డ్రెస్కు మ్యాచ్ అయ్యేలా రంగు రంగులతో ఉండే చిన్నా పెద్ద గాజుల ఎంపిక సాధారణమే. అయితే వేడుకలలో మాత్రం స్పెషల్గా కనిపించేలా అమ్మాయిలు తమ పేర్లతో తయారు చేయించుకున్న గాజులను ధరిస్తున్నారు. వీటి డిజైన్కి ఆర్డర్పై కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ చేయించుకోవడంపై బాగా ఆసక్తి చూపుతున్నారు.వివిధ భాషలలో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవాలి అంటే అందుకు తగిన జ్యువెలరీ నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి ఆన్లైన్ ΄ోర్టల్స్ బాగా సహాయపడుతున్నాయి. అల్ఫాబెట్ అక్షరాల మాల క్లిప్పుల సెట్ వందల రూ΄ాయల నుంచి నాణ్యత, డిజైన్ను బట్టి వేల రూ΄ాయల వరకు ధర పలుకుతోంది. (చదవండి: అందుకేనా జపాన్ అంత క్లీన్గా ఉంటోంది..!) -
ట్రెండీగా పవర్ఫుల్ చీరకట్టు స్టైల్..!
చీరకట్టు ఆత్మవిశ్వాసానికి, హుందాతనానికి ప్రతీకగా చూపుతూ సెలబ్రిటీలు రోల్మోడల్స్గా నిలుస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగమైనా పార్టీలో ప్రత్యేకత కోరుకున్నాచీరకట్టుకు బిగ్ బెల్ట్ జత చేసి బ్రైట్గా వెలిగిపోతున్నారు. తమదైన మార్క్ను పవర్ఫుల్గా చూపుతున్నారు. ఇటీవల అంబానీ కుటుంబ సభ్యుల నివాసంలో జరిగిన ఓ వేడుకలో క్రికెట్ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ వేడుకలో డిజైనర్లు శంతను అండ్ నిఖిల్ చేసిన కస్టమైజ్డ్ శారీ డ్రేప్లో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కొత్తగా మెరిశారు. చీర కట్టు కూడా ఆమెనో క్రీడాకారిణిగా ఆత్మవిశ్వాసం తొణికిసలాడేలా చూపుతోందా అనిపించేలా ఉంది. నారింజ, నలుపు రంగు కాంబినేషన్లో గల చీరను ఫిటెడ్, హైనెక్ మోడర్న్ బ్లౌజ్తో స్టైల్ చేసింది. నల్లని కార్సెట్ బెల్ట్తో లుక్ని శక్తిమంతంగా మార్చింది. జుట్టును బన్గా సెట్ చేసి, ఆభరణాలను తక్కువగా ధరించి లుక్ను పూర్తి చేసింది. ఈ లుక్ ఆధునిక పవర్ డ్రెస్సింగ్లో ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. (చదవండి: అందానికే అందం ప్రియాంక చోప్రా బ్యూటీటిప్స్..!) -
విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి..రోమ్ టూర్లో రష్మిక ఫ్యాషన్ వైబ్..!
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ వారు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే హైదరాబాద్లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. తాజాగా ఇప్పుడు వారి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ జంట ఫిబ్రవరి 26, 2026న విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్. ఇదెంత వరకు వాస్తవం అన్నది తెలియదు కానీ రష్మిక, హీరో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఆమె స్నేహితులతో కలిసి రోమ్ టూర్లో ఉంది. ఆ యూరోపియన్ విహారయాత్రలో తన అభిమానులను ఫ్యాషన్ లుక్స్తో అలరిస్తోంది. లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్లో ఫ్యాషన్ ఐకానిక్గా..గోధుమ రంగు లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్లో వింటర్ ఫ్యాషన్ ఐకాన్గా మెరిసింది రష్మిక. ఆ కోట్ సరికొత్త ఫ్యాషన్ వైబ్స్ని సృష్టించింది. నిట్టెడ్ టాప్లో రష్మిక మందన్నరష్మిక మందన్న ధకించిన బూడిద రంగు అల్లిన టాప్లో సరికొత్తగా కనిపించింది. ముఖ్యంగా చేతిలో పువ్వుల గుత్తితో స్టన్నింగ్ లుక్తో ఆకట్టుకుంది. అందుకు తగ్గట్టు డార్క్ ఫ్రేమ్డ్ గ్లాసెస్, మెటల్ బ్యాండ్తో స్టైలిష్ రిస్ట్ వాచ్తో లుక్ను అలంకరించింది. బ్రౌన్ స్వెటర్లో వ్యాపారవేత్తలా..అల్లిన గోధుమ రంగు స్వెటర్, చంకీ బ్లాక్ గ్లాసెస్లో అదరహో అనిపించేలా ఉంది ఆమె ఆహార్యం.రష్మిక మందన్న రోమ్ వార్డ్రోబ్తో ఫ్యాషన్ ప్రియులను అలరించింది. నటి క్రీమ్ స్వెటర్, డెనిమ్ జీన్స్పై పొరలుగా ఉన్న మరొక నల్ల ట్రెంచ్ కోటును స్టైలిష్ ఐకాన్గా కనిపించింది. ఎక్కడ మేకప్ లేకుండా..చాలా సింపుల్గా సాదాసీదాగా నేచురల్ లుక్లో కనిపించి నేచరల్ స్టార్ అంటే సహజసిద్ధమైన అందం అని ఎలుగెత్తి చాటింది.(చదవండి: వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..) -
సల్మాన్ ఖాన్ ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
బాలీవుడ్ ప్రముఖ నటుడు భాయిజాన్ సల్మాన్ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కండల వీరుడు సల్మాన్కి ఎంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. 60లలో సైతం యువ హీరోలను కూడా వెనక్కి నెట్టి తన హ్యాండ్సమ్ లుక్, వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు బాయిజాన్. ఆయనకు సంబంధించిన ప్రతి విషయం అభిమానులకు ఆసక్తిని, కుతుహలాన్ని రేకెత్తిస్తుంటుంది. తాజాగా ఆయన చేతికుండే వెండి బ్రాస్లెట్ గురించే అందరి అటెన్షన్. అది సాధారణ బ్రాస్లెట్లా కాకుండా ఒక రత్నంతో చాలా పెద్ద బ్రాసెలెట్. అంద పెద్దిది బాయిజాన్ ఎందుకు ధరిస్తారు అనేది అందరి మదిని తొలిచ్చే సందేహం ఇది. దీని వెనుకున్న కథను సల్మానే స్వయంగా వివరించి అభిమానుల అనుమానాలకు చెక్పెట్టారు. అంతేగాదండోయ్ దాని ధర, ప్రాముఖ్యత రెండు అత్యంత స్పెషాల్టీనే. సికిందర్ భాయ్గా పిలిచే మన సల్లూ భాయ్ చేతికి ఉండే వెండి బ్రాస్లెట్ని ఎట్టిసమయంలో స్కిప్ చేయరు. ప్రతి ఫంగ్షన్లో ఆయన చేతికి అది తప్పనిసరిగా ఉంటుంది. బిగ్బాస్కి హోస్ట్గా ఉన్నప్పుడూ, పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడూ ఎప్పుడు దాన్ని అస్సులు బయటకు తీయడు. దబాంగ్ వంటి చిత్రాల షూటింగ్ సమయంలో మాత్రమే దాన్ని ధరించలేదు. ఆ మూవీ క్యారెక్టర్కి నప్పదు కాబట్లి సల్లూభాయ్కి తీయక తప్పలేదు. దీన్ని ఐకానిక్ ఫిరోజా బ్రాస్లెట్గా పిలుస్తారట. దీని ధర దగ్గర దగ్గర రూ. 80,000/- పైనే పలుకుతుందట.అదంటే ఎందుకంత ఇష్టం..సల్మాన్కి ఆ బ్రాస్లెట్ అత్యంత విలువైన వస్తువుల్లో ఒకటి. దానిని మణిక్టు నుంచి తీయడం అత్యంత అరుదు. ఇది సుల్తాన్ నటుడు సల్మాన్ తండ్రి సలీంఖాన్ వద్ది ఇదే బ్రాస్లెట్ ఉండేది. తాను చిన్నప్పుడు దానితో ఆడుకునేవాడినని పంచుకున్నారు. అయితే తాను సినీఫీల్డ్లోకి వచ్చినప్పుడూ అచ్చం అలాంటి బ్రాస్లెట్నే బహుమతిగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ రాయిని ఫిరోజా అంటారు. దీనిని సజీవరాయిగా పిలుస్తారు. అయితే సల్మాన్ దీన్ని ఫ్యాషన్ కోసం కాదు, ప్రశాంతత, ఆశావాద దృక్పథన్ని ఇచ్చే సెంటిమెంట్ బ్రాస్లెట్గా విశ్వసిస్తాడు. అందువల్లే మన సల్లుభాయ్ చేతికి ఆ బ్రాస్లేకుండా అస్సలు కనిపించడు. స్పెషాల్టీ ఏంటంటే..మనపై వచ్చే ప్రతికూలతలను ఇది గ్రహిస్తుంది. ఆ తర్వాత ఇది పగిలిపోవడం జరుగుతుంది. అలా ఇప్పటి వరకు ఏడు రాళ్లు మార్చినట్లు సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు. ఇది ఆకాశ నీలం-ఆకుపచ్చ షేడ్లలో ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..బృహస్పతి గ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. View this post on Instagram A post shared by Salman Khan (@salmankhanfanclub) (చదవండి: ధురంధర్ మూవీ క్రేజ్తో వైరల్గా 'దూద్ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?) -
ఫ్యాషన్ ఫార్వర్డ్.. జెండర్ రూల్స్ను బ్రేక్ చేస్తూ..
టైమ్లెస్ ఇండియన్ గార్మెంట్గా పేరున్న చీరకు యువతరం కొత్త లుక్ ఇస్తోంది. ప్రీ–డ్రేప్డ్ శారీస్, డెనిమ్–ఇన్ఫ్యూజ్డ్ ఫ్యాబ్రిక్స్, బాంబర్ జాకెట్లతో జత చేసే చీరలు... మొదలైనవి యువతరం ఫ్యాషన్లో కొన్ని. సంప్రదాయం, సమకాలీన నైపుణ్యాలను మిశ్రమం చేసిన ట్రెండ్ ఇది.సంప్రదాయ దుస్తులతో జత చేసిన కోర్సెట్లు ఆకట్టుకుంటున్నాయి. కుర్తాలతో జత చేసిన డెనిమ్ కోర్సెట్ నుండి షరారాలపై ధరించే ఎంబ్రాయిడరీ డిజైన్ల వరకు... ఈ ట్రెండ్ మోడ్రన్ ఇండియన్ ఫ్యాషన్ క్రియేటివిటీకి అద్దం పడుతుంది.‘హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ మోడ్రన్ సిల్హవుటీ’ ట్రెండ్ మొదలైంది. ఖాదీ, ఇకత్, లినెన్లాంటి చేనేత వస్త్రాలను జంప్సూట్లు, వోవర్సైజ్డ్ కోట్స్, కో–ఆర్డర్ సెట్స్గా రూపొందించే ధోరణి పెరిగింది. ఈ ట్రెండ్ స్థానిక కళాకారులకు వృత్తిపరంగా సహాయపడుతోంది. ఎకో–ఫ్రెండ్లీ (Eco Friendly) ఛాయిసెస్గా యువతరానికి అవకాశం కల్పిస్తోంది.సంప్రదాయ జెండర్ రూల్స్ను బ్రేక్ చేస్తూ న్యూట్రల్–కలర్డ్ కుర్తాలు, పఠానీ సూట్స్, యునీసెక్స్ ధోతీలు యువతరంలో ప్రాచుర్యం పొందుతున్నాయి. సెల్ఫ్–ఎక్స్ప్రెషన్స్కు అవకాశం ఇస్తున్నాయి.చదవండి: లేత రంగుల లేటెస్ట్ చీరల ట్రెండ్ఇంజినీరింగ్ వైపు మ్యూజిక్ స్టూడెంట్స్ మొగ్గువిద్యలు వేటికవి విడి విడి ద్వీపాలు కావు. అంతర్గతంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ... ఇంజినీరింగ్ స్టూడెంట్స్ (Engineering Students) మ్యూజిక్పై ఆసక్తి ప్రదర్శించడం. మ్యూజిక్ స్టూడెంట్స్ ఇంజినీరింగ్పై ఆసక్తి చూపడం. సంగీత నేపథ్యం ఉన్న విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని ఐఐటీ, మద్రాస్ డైరెక్టర్ప్రొఫెసర్ వి.కామకోటి అన్నారు. మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. ఐఐటీ, మద్రాస్లో ‘ఇళయరాజా సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ మ్యూజిక్’ ఏర్పాటు చేయడం ద్వారా కళలతో, ఇంజినీరింగ్ విద్యను అనుసంధానించే పనికి శ్రీకారం చుట్టారు. -
ఆ దుప్పటాతో పెళ్లికూతురిలా శోభితా ధూళిపాళ..!
టాలీవుడ్ నటి, అక్కినేని వారి కోడలు శోభితా ధూళిపాళ ఇటీవల పలు కార్యక్రమంలో స్టైలిష్ల లుక్లో కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. అంతేగాదు ఆమె ధరించే డిజైనర్ వేర్లు, ఆభరణాలు ఆమె ఫ్యాషన్ అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి. పైగా ఫ్యాషన్ ఐకాన్గా ప్రతి వేడుకలో ఆమె ఆహార్యం, లుక్ హైలెట్గా నిలవడం విశేషం. అక్కినేని వారి కోడలు అంటే రేంజ్ ఇది అన్నట్లుగా లగ్జరీ ఫ్యాషన్ వేర్లతో అదరహో అనేలా తళుక్కుమంటోంది. అంతేగాదు శోభితా అంటే అత్యంత శోభాయమానం అని చెప్పకనే చెబుతోంది తన స్టైలిష్ లుక్తో. ఈసారి ఓ ప్రముఖ లగ్జీరి మేకప్ ప్రొడక్ట్స్కి సంబంధించిన షార్లెట్ టిల్బరీ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా గోల్డ్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిపోయింది. అంతేగాదు ఆ లెహంగాకి బుర్గుండి దుపట్టా జత చేయడంతో అలనాటి రాణుల వైభవంలోకి తీసుకుపోయింది శోభితా స్టన్నింగ్ లుక్. చూపు తిప్పుకోనివ్వనంత ఆకర్షణీయమైన లుక్తో మెస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset) స్లీవ్లెస్ బ్లౌజ్తో అత్యంత బరువైన బుర్గుండి దుప్పటా మహారాణి మాదిరి రాజదర్పాన్ని అందించింది. అంతేగాదు ఆ దుస్తులు డిజైన్ చేసిన విధానం కారణంగా ఆభరణాలతో పనిలేదనిపించేలా ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దారు వాటిని. ఇక ఈ బుర్గుండి దుప్పటా డీప్ వెల్వెట్ టోన్డ్ కలర్ దానిపై బంగారు ఎంబ్రాయిడరీ అంచు..ఆ గోల్డెన్ కలర్ లెహంగా అందాన్ని మరింత పెంచేసింది. ఈ ఒక్క దుప్పట కారణంగా రాయల్టీ లుక్ వచ్చింది ఆ లెహంగాకి. అంతేగాదు శోభితా ఈ లెహంగాలో మహారాణి మాదిరిగా, పెళ్లికూతురిలా ధగధగ మెరిసిపోయారామె. నార్మల్ మేకప్తో, ఆ లెహంగాకి సరిపడా చోకర్, చెవిపోగులతో చాలా సింపుల్గా ఉన్నా..హెవీ డిజైన్తో రూపొందిన ఈ లెహంగా మిగతా లోటుని భర్తించేసిందా అనేలా నిండైన అందాన్ని అందించింది. ఇక ఈ గోల్డెన్ లెహంగాను జిగర్ మాలి రూపొందించారు. ఇక రిచ్ బుర్గుండి దుప్పటాను డిజైనర్ నైషా తీర్చిదిద్దారు. కాగా అంతకుముందు శోభితా ఒక ముంబై కార్యక్రమంలో ఇలానే గోల్డెన్ లెహంగాతో పెళ్లికూతురిలా మెరిసిపోగా ఈసారి రాజుల కాలం గుర్తుకుతెచ్చేలా మరో గోల్డెన్ లెహంగాతో మంత్రముగ్ధుల్ని చేసింది. View this post on Instagram A post shared by Nykaa (@mynykaa) బుర్గండీ రంగు దుపట్ట ప్రత్యేకత.. ఇది గాఢ ఎరుపు వైన్ షేడ్లో రిచ్గా కనిపించే రంగులో ఉండటమే దీని ప్రత్యేకత. ఇది సంప్రదాయ దుస్తులతో జత చేస్తారు. ఎక్కువగా చీర సల్వార్, లెహంగాలతో జత చేస్తే ఒక్కసారిగా రాయల్టి లుక్ వచ్చేస్తంఉది. ఇక్క వెస్ట్రన్ అవుట్ఫిట్కి జతచేస్తే..స్టైలిష్గా ఉంటుంది. పార్టీవేర్కి సిల్క్ లేదా జార్జెట్, డైలీవేర్కి కాటన్ లేదా లినెన్, వింటర్లో అయితే శోభితా ధరించినట్లుగా వెల్వెట్ ఫ్యాబ్రిక్లో ధరిస్తే లుక్ అదుర్స్.(చదవండి: నటాషా పూనవాలా అరుదైన పింక్ డైమండ్ రింగ్..ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?) -
నటాషా పూనవాలా అరుదైన పింక్ డైమండ్ రింగ్..ఇన్ని ప్రత్యేకతలా?
బిలియనీర్ అదర్ పూనవాలా భార్య నటాషా పూనవాలా వ్యాపారవేత్త, ఫ్యాషన్ ఐకాన్ కూడా. ఆమె హై-ఎండ్ డిజైనర్ దుస్తులు, అత్యంత లగ్జరీ ఆభరణాలనే ధరిస్తూ ప్రత్యేకంగా కనిపిస్తారామె. ఇటీవల ఆభరణాల నిపుణుడు, ఫ్యాషన్ కంటెంట్ సృష్టికర్త ధ్రుమిత్ మెరులియా ఆమె అరుదైన పింక్ డైమండ్ రింగ్పై ఫోకస్ పెట్టడమే గాక దాని ప్రత్యేకత, వెనకున్న ఆసక్తికర కథనుకూడా వివరించారు. View this post on Instagram A post shared by Natasha Poonawalla (@natasha.poonawalla) ఆ రాణికి చెందినది..ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో ఈ ఉంగరాన్ని మేరీ-థెరెస్ పింక్ డైమండ్ రింగ్ అని పిలుస్తారు అని ధ్రుమిత్ వెల్లడించారు. ఈ ఉంగరం ఫ్రాన్సక్వీన్ మేరీ ఆంటోయినెట్కు చెందినదని తెలిపారు. ఆ ఉంగరం కేంద్ర భాగం పది క్యారెట్ల విలువ చేసే పర్పుల్ అండ్ పింక్ డైమండ్ మోడిఫైడ్ కైట్ బ్రిలియంట్-కట్ డైమండ్. దీని చుట్టూ గుండ్రని 17 వజ్రాలతో అలకరించి నల్లటి ప్లాటినం బ్యాండ్లో ఉంది. అంతేగాదు ఆ మధ్యలోని వజ్రం 18వ శతాబ్దం కాలం నాటిదట. దీనిని క్వీన్ మేరీ ఆంటోయినెట్ కుమార్తె డచెస్ మేరీ-థెరిస్ డి'అంగోలేమ్ వారసత్వంగా పొందారు. ఈ ఉంగరం 1996లో విక్రయించబడే వరకు చాలా ఏళ్లు రాజకుటుంబం ఆభరణాల కలెక్షన్స్లో ఉండేదట.అంత ఖరీదా..?అయితే ప్రఖ్యాత ఆభరణాల డిజైనర్ జోయెల్ ఆర్థర్ రోసెంతల్ వజ్రం కోసం కొత్త బ్యాండ్ను రూపొందించారు. జూన్ 17, 2025న, ఈ ఉంగరాన్ని న్యూయార్క్లోని క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్లో దాదాపు రూ.125 కోట్లు పైనే అమ్ముడుపోయిందట. ఫ్రెంచ్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ఉంగరంగా వార్తల్లో నిలిచింది కూడా. కాగా, బిలియనీర్ అదర్ పూనవాలాను వివాహం చేసుకున్న నటాషా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అంతేగాదు ఆమె విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం విల్లూ పూనవల్లా ఛారిటబుల్ ఫౌండేషన్కు కూడా అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే నెదర్లాండ్స్లోని పూనావాలా సైన్స్ పార్క్ డైరెక్టర్గా, బ్రిటిష్ ఏషియన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్ చైర్గా కూడా వ్యవహరిస్తున్నారు. View this post on Instagram A post shared by Dhrumit Merulia (@dhrumitmerulia) (చదవండి: వ్యాపారంలో 14 కోట్లు నష్టపోయి..చివరికి ర్యాపిడో డ్రైవర్గా! మనసు మెలిపెట్టే భావోద్వేగ కథ) -
అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..
చీర గొప్పతనం గురించి మన తెలుగు పాటలతో.. ఎంతో మంది గాయకులు, రచయితలు అద్భుతం వర్ణించి రాశారు, పాడారు. అలాంటి చీర అత్యంత ఖరీదైనదిగా, కళఖండంగా రికార్డు సృష్టించింది ఆ చీరలో దాగున్న విశేషాలు చూస్తే..కంగుతింటారు. అడుగడుగున ఓ కళా ప్రతిరూపం, ఓ ప్రత్యేకత, ఓ ప్రసిద్ధ చిత్రకారుడు కుంచె నుంచి జాలువారిని చిత్రాలు, అమూల్యమైన ఆభరణాలు, నగలు కనిపిస్తాయి. అంతేగాదు చీరను చూడగానే "సరికొత్త చీర ఊహించినాను" అన్న పాట స్పురణకు వస్తుంది. అంత గొప్పగా తీర్చిదిద్దారు ఈ శారీని. దీని ఖరీదు లక్షలు పైమాటే..అంటే ఈ చీర ధరతో పల్లెటూరిలో ఓ మోస్తారు ఇల్లు కట్టేయొచ్చు లేదా ఓ మారుమూల ప్రాంతంలో సింగిల్ బెడ్రూం ధర అని కూడా చెప్పొచ్చు.ప్రపంచం చీరల దినోత్సవం సందర్భంగా..అత్యంత ఖరీదైన వివాహ పట్టు చీర, కళలకు నిలయమైన చెన్నై సిల్క్ కంజీవరం పట్టు చీర విశేషాలు గురించి తెలుసుకుందామా. ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది. దీన్ని డబుల్ వార్ఫ్ పద్ధతిని ఉపయోగించి చేతితో నేసిన చీర. దీనిలో 64 రంగుల షేడ్స్, పది ప్రత్యేకమైన డిజైన్లు ఉంటాయి. ఈ చీర బరువు వచ్చేసి దగ్గర దగ్గరగా ఎనిమిది కిలోగ్రాములు.దీనిలో బంగారం, వజ్రం, ప్లాటినం, వెండి, కెంపు, పచ్చ, నీలమణి, ముత్యాలు వంటి విలువైన రాళ్లను పొందుపరిచారు. నివేదికల ప్రకారం.. 59.7 గ్రాముల బంగారం, 3.9 క్యారెట్ల వజ్రం, 5 క్యారెట్ల నీలమణిని వినియోగించారు. అంత విలువైన వజ్రాలు, కళాఖండాలకు నిలయం కావడంతోనే ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇది జనవరి 05, 2008న సుమారు రూ. 39 లక్షలు పైచిలుకే అమ్ముడుపోయింది. ఈ చీర తయారీకే దాదాపు 4 వేలు గంటలు పనైనే పట్టిందట. మొత్తం 36 మంది నేత కార్మికుల కృషి ఫలితం ఈ చీర. మరో విశేషం ఏంటంటే..ఇందులో ప్రఖ్యాత భారతీయ కళాకారుడు రాజా రవి వర్మ 11 చిత్రాల ప్రతిరూపాలు ఉన్నాయి. ఆ శారీ పల్లులో 'గెలాక్సీ ఆఫ్ మ్యూజిషియన్స్' ప్రతిరూపం ఉంటుంది. ఇది సంగీత ప్రదర్శనలో నిమగ్నమైన 11 మంది మహిళలను వర్ణిస్తుంది. ఇందులో ప్రతి స్త్రీ ఒక ప్రాంతం లేదా కమ్యూనిటికి సంబంధించిన విభిన్న దుస్తులను ధరించి కనిపించడం మరింత విశేషం. కుడివైపు ఒక ముస్లీం మహిళ, ఎడమవైపు ఒక స్త్రీ నాయర్ ముండు దుస్తులను(కేరళ నాయర్ సామాజికి వర్గానికి సంబంధించిన స్త్రీలు) ధరించి చేతిలో వీణ వాయిస్తూ కనిపిస్తుంది. మధ్యలో ఆకుపచ్చ గాజులతో మరాఠీ శైలి చీర ధరించిన స్త్రీ కనిపిస్తుంది. ఇంతలా వివవరణాత్మక పెయింటింగ్ చీరపై చిత్రించడంతనే ఈ చీర అత్యంత హైలెట్గా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ చీరను రెండు వెర్షన్లలో తయారు చేసినట్లు సమాచారం. ఒకటి బెంగళూరుకి చెందిన ఒక వ్యాపారవేత్త తన పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొనుగోలు చేయగా, మరొకటి 2009లో కువైట్కు చెందిన ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేశారట.(చదవండి: Nita Ambani: ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్లో నీతా అంబానీ మెస్మరైజ్ లుక్..!) -
లైట్ వెయిట్... రిచ్ లుక్
ఏ సీజన్ అయినా ఏ వేడుకైనా చాలా సులువుగా ఎంపిక చేసుకునే జాబితాలో ఈ ఏడాది ముందు వరుసలో ఉంది క్రేప్. సంప్రదాయ పెళ్లి వేడుకలోనూ ఆధునిక కాక్టెయిల్ పార్టీలోనూ ప్రత్యేకంగా వెలిగిపోయే క్రేప్ విత్ డిజిటల్ ప్రింట్స్ చేస్తున్న హంగామా గురించి హైదరాబాద్లో ఉంటున్న డిజైనర్ అభిజ్ఞ చెబుతున్న విశేషాలు ఇవి..ఇప్పుడు చాలావరకు ఐదు రోజుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వీటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి మెహందీ, హల్దీ, రిసెప్షన్స్కి.. పువ్వుల ప్రింట్లున్న చీరలు, లెహంగాలు ధరించడం చూస్తున్నాం. అలాగే కుటుంబ సభ్యులు ఒకచోట కలిసి చేసుకున్న పార్టీలు, బయట జరిగే కాక్టెయిల్స్కు ఫ్లోరల్స్ కనువిందు చేస్తున్నాయి. డ్రెస్ ఆధునికమైనా, సంప్రదాయం అయినా కట్, డ్రేప్లో చిన్న చిన్న మార్పులు తీసుకు వస్తున్నారు. ఇదంతా క్రేప్, జార్జెట్ పైన ఫ్లోరల్స్ చేసే సందడి వల్లే సాధ్యం అవుతుంది అని చెప్పచ్చు.డిజిటల్ ప్రింటింగ్ త్రీ డీ డిజైన్స్ ఎక్కువ శాతం ఫ్లోరల్స్ ఉంటాయి. కొన్ని ప్రయోగాత్మకంగా ఫ్రూట్ డిజైన్స్ చేశాం. ఫ్యాబ్రిక్ మేనికి మృదువుగా ఉంటుంది. ఇరవై ఏళ్ల వారినీ సీతాకోక చిలుకల్లా చూపితే, యాభై ఏళ్ల వారినీ హుందాగా చూపుతున్నాయి. సంప్రదాయ చీరకట్టుకు ఆధునిక డిజిటల్ కళ ఈ ఇయర్ బాగా నడిచింది. పెద్ద పెద్ద పువ్వులు, జామెట్రి నమూనాలు, తేలికగా ఉండే ఫ్యాబ్రిక్పైన అన్ని రకాల డిజైన్లు అందంగా కనువిందు చేస్తున్నాయి.లేత రంగుల ట్రెండ్ఈ ఏడాది లేత, ప్లెయిన్ కలర్స్ని బాగా ఇష్టపడ్డారు. ఇలా ప్లెయిన్గా ఉండే ఫ్యాబ్రిక్ పైన పెద్ద పూల నుండి అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ వరకు చూపు తిప్పుకోనివ్వని ఆర్ట్ వీటి సొంతం. మరిన్ని హంగుల కోసం డిజిటల్ డిజైన్స్ను అనుసరిస్తూ ఎంబ్రాయిడరీ లేదా స్వీక్వెన్స్ వర్క్తో ఇంకాస్త బ్రైట్గా డిజైన్ చేస్తున్నాం. ఈ డిజైన్లు సెమీ క్రేప్, మైసూర్ సిల్క్పైనా అందంగా అమరుతున్నాయి. ప్రత్యేకమైన డిజైన్లు ఆర్డర్ల మీద చేస్తాం కాబట్టి, ఏ ఎంపిక అది స్టేట్మెంట్ పీస్గా ఉంటుంది. ఏ సందర్భంలోనైనా ప్రత్యేకత చాటుతుంది.డిజైన్కే ప్రాముఖ్యంసాధారణంగా స్కిన్ టోన్ బట్టి ఫ్యాబ్రిక్ రంగుల ఎంపిక చేసుకునేవారు గతంలో. నేడు డిజైన్కే ప్రాముఖ్యం పెరిగింది. లేత రంగులు ఉండటం వల్ల ఏ స్కిన్టోన్ కైనా ఇవి బాగా నప్పుతున్నాయి. ఫ్యాబ్రిక్ మృదువుగా, తేలికగా ఉండటం, రిచ్ లుక్ ని ఇవ్వడం ఈ క్రేప్ శారీ ఎంపికలో ప్రధానమైనవి. గ్రాండ్గా జరిగే వివాహ వేడుకలు, పండగలు, కాక్టెయిల్ పార్టీలకూ నప్పడంతో వీటి ఎంపికలో మరో ఆప్షన్కు వెళ్లడం లేదు.ఇరవై నుంచి 30 ఏళ్ల లోపు అయితే బ్లౌజ్ ప్యాటర్న్స్లో వెస్ట్రన్ స్టైల్ వి–నెక్స్, స్లీవ్లెస్.. వంటివి కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఏజ్ గ్రూప్ హై నెక్స్ ఎంపిక చేసుకుంటున్నారు. చూడండి: ఎరుపు చీర, ముత్యాల నెక్లెస్లో నీతా అంబానీఫ్యాబ్రిక్ నాణ్యత, డిజైన్లో ప్రత్యేకతను అనుసరించి వీటి ధరలు ఉంటున్నాయి. ఈ ఫ్లోరల్ ప్రింట్ శారీస్ లేదా డ్రెస్సులకు ఆభరణాల అవసరం అంతగా పడదు. సన్నటి చైన్లు లేదా ముత్యాలు లేదా బీడ్స్ నెక్పీస్లు బాగుంటున్నాయి. కేశాలంకరణలో ఎక్కువగా లూజ్ హెయిర్, ఫిష్టెయిల్, బన్స్.. కూడా సెట్ అవుతాయి. చిన్న పాటి కేశాలంకరణతోనూ ఈ ఫ్లోరల్ శారీస్కి మరింత అందాన్ని తీసుకురావచ్చు.- అభిజ్ఞ, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్లో నీతా అంబానీ మెస్మరైజ్ లుక్..!
ధీరూభాయ్ ఇంటర్నెషనల్ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ అద్భుతమైన లుక్లో కనిపించారు. కార్యక్రమానికి తగ్గట్టుగా ఆమె ఫ్యాషన్ శైలి ఉండటం నీతా స్పెషాలిటీగా పేర్కొనవచ్చు. ఈవెంట్ని బట్టి తన డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఇక ఈ స్కూల్ వార్షికోత్సవంలో సంప్రదాయ ఎరుపు ఎంబ్రాయిడరీ చీర విత్ అరుదైన బాస్రా ముత్యాల ఆభరణాలతో తుళ్కుమన్నారు. ఈ లుక్ ఆమె ఫ్యాషన్ అభిరుచిని ప్రతిబింబిస్తోంది. స్టైలిష్గా ఉండటం కాదు..ఆ వేడుకకు పూర్తి న్యాయం చేసేలా మన ఆహార్యం ఉంటేనే ఆ కార్యక్రమం అత్యంత జయప్రదంగానూ ఆకర్షణీయంగా ఉంటుందని తన వేషధారణతో చెప్పకనే చెప్పారు నీతా అంబానీ. ఈసారి ఆమె స్టన్నింగ్ లుక్ దటీజ్ నీతా.. ఏ వేడుకైనా ఆమెదే ప్రధాన ఆకర్షణ అని మరోసారి ప్రూవ్ చేశారామె. చేతులుకు ఎర్ర గాజులు, ముత్యాల గాజులు కలిపి ధరించి ఆధునికత, నాటి సంప్రదాయన్ని కలగలిపి తన లుక్ని ప్రజెంట్ని చేశారు నీతా. ఈ కార్యక్రమంలో ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ అయిన నీతా అంబానీ అందరికీ చేతులు జోడించి "జై శ్రీ కృష్ణ" అని పలకరిస్తూ కనిపించడం విశేషం. ఈ వార్షిక దినోత్సవ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్, క్రికెటర్ రోహిత్ శర్మ తదితరులు పాల్గొనన్నారు. బాస్రా ముత్యాల ప్రత్యేకత..హైదరాబాద్ నిజాంలచే ప్రాచుర్యం పొందిన బాస్రా ముత్యాలను మనకు అందుబాటులో ఉన్న ముత్యాలకెల్లా అత్యంత అరుదైనవి, విలువైనవి కూడా. చారిత్రాత్మకంగా, అరేబియా గల్ఫ్ దక్షిణ భాగం, ప్రస్తుత ఖతార్, బహ్రెయిన్లోని నుంచి వీటిని సేకరిస్తారట. ఈ తీరం వెంబడి శతాబ్దాలుగా ముత్యాల పెంపకం ఒక సాంప్రదాయ వృత్తిగా ఉంది. అలాగే ఆర్థిక వ్యవస్థ ప్రధాన కేంద్రం కూడా. ప్రస్తుత ఇరాక్ బాస్రా ఓడరేవు నుంచే ఆసియా, యూరప్ కొనుగోలుదారులకు ఈ ముత్యాలను విక్రయిస్తారట. భారత్ కూడా ఈ ముత్యాలను అధికంగా కొనుగోలు చేస్తుందట. మనదేశంలోని రాజకుటుంబాల కారణంగా ఈ ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువట. ఇక ఈ బాస్రా ముత్యాలు తరుచుగా తెలుపు, క్రీమ్, గులాబీ, వెండి రంగుల కలయికలో లభిస్తాయట. అయితే ప్రస్తుత కాలుష్య కారణాల రీత్యా వీటి సంఖ్య తక్కువ అవ్వడంతో ఈ ముత్యాలు అరుదైనవి, అమూల్యమైనవిగా మారాయని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Zoom TV (@zoomtv) (చదవండి: ఆర్మీ లెఫ్టినెంట్గా మిడ్ డే మీల్ వర్కర్ కుమారుడు..! ఏకంగా ఎనిమిది సార్లు ఓటమి) -
గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా శోభితా ధూళిపాళ..!
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు నాగచైతన్య భార్య, అక్కినేని వారి కోడలు శోభిత ధూళలిపాళ బంగారు లుక్ అందర్నీ అబ్బురపిచింది. పెళ్లి దుస్తులను తలపించే ఆమె బంగారు రంగు లెహంగాలో కొత్త పెళ్లికూతురిలా మెరిసిపోయారామె. ఆ చీర తగ్గట్టు ధరించిన రూబి నెక్లెస్ ఆమె లుక్ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. లెహంగా మెరిసే సీక్వెన్స్, పూసల అలంకరణ తోపాటు ఎంబ్రాయిడరీ, మెర్మెడ్ సిల్హౌట్లు లెహంగాకి గ్రాండ్ లుక్ని తెప్పించాయి. నేలను తాకేలా పొడవుగా ఉన్న ఈ లెహంగా రాయల్టీ లుక్కి దర్పణంలా నిలిచింది. ఆ లెహంగాకి మ్యాచింగ్ సీక్విన్డ్ టల్లే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ లెహంగాను మరింత హైలెట్గా కనిపించేలా చేసింది. అలాగే దానికి సీత్రూ దుపట్టా, దానిచుట్టూ ఉన్న మిర్రర్ బోర్డర్తో కూడిన ఎంబాలిష్మెంట్ శోభితాను బంగారంలా మెరిసిపోయేలా చేసింది. పుత్తడి లెహంగా శోభిత ధగధగ మెరిపోతూ.. అందరి చూపులు ఆమె వైపుకే తిప్పుకునేలా చేసింది. ఇక్కడ శోభితా దరించిన ఆభరణాలు, జుమ్కీలు, స్టేట్మెంట్రింగులు, బ్యాంగిల్స్ తదితరాలన్ని శోభిత ఫ్యాషన్ స్టైల్ని హైలెట్ చేశాయి. మొత్తంగా ఆ కార్యక్రమంలో శోభితా లుక్ ఎవర్గ్రీన్గా నిలవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by HT City (@htcity) (చదవండి: Meher Castelino: భారత్ తొలి మిస్ ఇండియా..!ఫ్యాషన్ జర్నలిజంకి ఐకాన్ కూడా..) -
భారత్ తొలి మిస్ ఇండియా..!ఫ్యాషన్ జర్నలిజంకి ఐకాన్ కూడా..
భారత్లో అంతగా ఫ్యాషన్ , అందాల పోటీలకు ప్రాచుర్యం లేని సమయంలో ముంబైకి చెందిన మెహర్ కాస్టెలినో మోడల్గా ఎంట్రీ ఇచ్చి ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అంతేగాదు ఈ ఘనత సాధించిన తొలిభారతీయ మహిళ నిలిచింది. ఆడవాళ్లు ధైర్యంగా తమకు నచ్చిన రంగంలో ధైర్యంగా దూసుకుపోవచ్చు అనేందుకు స్ఫూర్తిగా నిలిచారామె. ఈ రోజు ఇంతలా అందాల పోటీలకు క్రేజ్ వచ్చిందంటే అందుకు కాస్టలినోనే కారణమని చెప్పొచ్చు. అలాంటి శక్తిమంతమైన మహిళ 81 ఏళ్ల వయసులో అనారోగ్యంతో డిసెంబర్17న(బుధవారం) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కోడలు నిషా, మనవరాలు క్రిస్టినా ఉన్నారు. ఫ్యాషన్ ప్రపచంలో భారతీయ మహిళలకు మార్గదర్శకురాలిగా ఉన్నా ఆమె ప్రస్థానం, సాధించిన విజయాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.భారత్కు ఫ్యాషన్ జర్నలిజాన్ని నేర్పించిన ఐకాన్, మొదటి మిస్ ఇండియా మెహర్ కాస్టెలినో(Meher Castelino). 1964లో మిస్ ఇండియాగా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. దీని తర్వాత కూడా ఈమె మిస్ యూనివర్స్, మిస్ యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ అందాల పోటీలలో భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహించారు. తొలి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ హోల్డర్గా, ఆమె విజయం భారత అందాల పోటీల చరిత్రలో ఒక నిర్ణయాత్మక క్షణాన్ని సూచిస్తుంది. కాస్టెలినోని నిశ్శబ్ద బలానికి చిహ్నంగా అభివర్ణిస్తూ, భారతదేశంలో ప్రారంభ ఫ్యాషన్, అందాల పోటీల దృశ్యాన్ని రూపొందించడంలో సహాయపడిన మార్గదర్శకురాలిగా ఫ్యాషన్ ప్రపంచం ఆమెను సదా కీర్తిస్తుంది.తొలితరం ఫ్యాషన్ జర్నలిస్టు కూడా..!మోడలింగ్, టైటిల్ విన్నింగ్ తర్వాత మెహర్ ఫ్యాషన్ జర్నలిజంలోకి అడుగు పెట్టారు. 1973లో ఈవ్స్ వీక్లీ లో తన మొదటి కథనాన్ని ప్రచురించారు. చాలా కొద్ది టైమ్ లోనే మెహర్ ఫ్యాషన్ కాలమిస్ట్ గా ఎదగి..160 జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్లలో వ్యాసాలు రాశారు. మ్యాన్స్టైల్’, ‘ఫ్యాషన్ కెలిడోస్కోప్’ వంటి పుస్తకాలు కూడా ఆమె రచించారు. సింపుల్గా చెప్పాలంటే..భారత్లో ఫ్యాషన్ జర్నలిజానికి మెహర్ కాస్టెలినో ఐకాన్గా పేర్కొనవచ్చు. లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి అనేక ప్రధాన ఫ్యాషన్ ఈవెంట్లకు ఆమె అధికారిక ఫ్యాషన్ రైటర్గా పనిచేశారు. ఫ్యాషన్ను కేవలం సెలబ్రిటీల గ్లామర్గా కాకుండా, ఒక పరిశ్రమగా విశ్లేషించిన తొలితరం జర్నలిస్టులలో ఆమె ఒకరు. భారతదేశంలో ఫ్యాషన్ రంగం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఒక మహిళగా ప్రభంజనం సృష్టించి చాలామంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి మార్గదర్శకురాలిగా, స్ఫూర్తిగా నిలిచారామె. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..! మన తెలుగమ్మాయి కారణంగా..) -
ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్..!
భారతీయ చేనేత సంప్రదాయం వేల ఏళ్ల నాటిది. అవి విలాసవంతమైనవి, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినవి కూడా. కొన్నిటికి వాటి చారిత్రక నేపథ్యం కారణంగా యావత్తు ప్రపంచం మెచ్చేలా ప్రజాదరణ సైతం ఉంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన చేనేత వస్త్రాల్లో ఒకటి గుజరాత్కి చెందిన పటాన్ పటోలా ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అందానికి రాజీకీయ నాయకుల నుంచి బాలీవుడ్ నటుల వరకు అందరూ ఫిదా. అంతలా ఆదరణ పొందుతున్న ఈ పటాన్ పటోలా చేనేత వస్త్రం ఎలా కళాకారుల చేతులో రూపుదిద్దుకుంది..? ఎలా పుట్టుకొచ్చింది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.విభిన్న రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే ఈ పటోలా డబుల్ ఇకాట్ టెక్నిక్ ఉపయోగించి నేస్తారు. వీటిలో రేఖాగణిత మోటీప్లు కూడా ఉంటాయి. అదోక విస్తృత కథాఖండం. ఇందులో పూల నుంచి జంతువుల మోటీఫ్లు కూడా ఉంటాయి. ప్రతి డిజైన్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.900 ఏళ్ల నాటి చరిత్ర..12వ శతాబ్దంలో రాజు కుమార్పాల ఈ పటోలాను ఇష్టపడ్డాడు. చాలా క్లిష్టంగా ఉండే చేతిపని. ఆయన జైన మతాన్ని స్వీకరించాడు. అందువల్ల ఆలయాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా..అక్కడకు వచ్చే ప్రజలంతా పటోలా వస్త్రాల్లో కనిపించాలని హుకుం జారీ చేసేవాడు. ఈ వస్త్రం మహారాష్ట్రలోని జల్నా నగరం రవాణా అయ్యేది. అయితే ఒకసారి రాజు కుమార్పాల ఒక ఆయానికి వెళ్తే..అక్కడ పూజారి మీ దుస్తులు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ లోపలికి వెళ్లనివ్వలేదు. ఒక్కసారిగా అతడి మాటలకు హుతాశుడై ఇలా ఎందుకన్నాడు. అత్యంత విలాసవంతమైన పటోలా పట్టు వస్త్రాలు మాములు దుస్తుల్లా ఎలా కనిపించాయని విచారించగా, అసలు విషయం బయటపడింది. జల్నా రాజు పటోలా బట్టలను బెడ్షీట్లుగా ఉపయోగించేవాడని, వాటిని రాజకుటుంబాలకు బహుమతిగానూ లేదా విక్రయించేవాడని తెలుస్తుంది. దాంతో కుమారపాల్ రాజు అతడితో యుద్ధం చేసి గెలిచాక..దాదాపు 700 మంది సాల్వి కళాకారులను, వారి కుటుంబాలను పటాన్ తీసుకువచ్చి పటోలా వస్త్రాల్లో కల్తీ లేని నాణ్యమైనవి వచ్చేలా చూశాడు. తన పాలనలో ఆ బట్ట ఉత్పత్తి బాగుండేలా కేర్ తీసుకున్నాడు. అలా దీని గురించి తరతరాలకు తెలిసేందుకు దారితీసింది. View this post on Instagram A post shared by Salvi Nirmal (@patola_bynirmalsalvi)నేయడానికి వ్యవధి కూడా ఎక్కువే..నిజానికి ఆరు నెలల కాలానికి గానీ ఒక చీర ఉత్పత్తి అవ్వదట. అంత సంక్లిష్టమైన చేతి పనితో కూడిన చేనేత వస్త్రం ఇది. అందుకు సంబంధించిన ఆధారాలు అజంతాలోని ఫ్రెస్కోలు, పద్మనాభపురం రాజభవనాల మీద లిఖిత పూర్వకంగా చెక్కబడి ఉన్నాయట కూడా. ముఖ్యంగా కేరళ గోడ చిత్రాల్లో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుందట. అంటే ఈ పటోలా చీరలు దగ్గర దగ్గర వెయ్యి ఏళ్ల నాటివిగా పేర్కొనవచ్చు. సాల్విస్, సోనిస్ అనే రెండు వర్గాల వారికే ఈ పటోలా చేనేత నైపుణ్యం తెలుసట. గుజరాతీలోని పాత స్మారక చిహ్నాలలో ఉన్న క్లిష్టమైన గోడ డిజైన్ల ద్వారా ప్రేరణ పొందిన చతురస్రాకార నమూనాల్లో కూడా ఈ పటోలా వస్త్రాల్లో చూడొచ్చు. ఈ చేనేత వస్త్రంలోని చిహ్నాలు చాలామటుకు సంతానోత్పత్తి, శక్తి, అదృష్టం, శ్రేయస్సుతో ముడిపడి ఉండటం విశేషం. అందుకే గుజరాతీ మహిళలు శుభ సందర్భాల్లో తప్పనిసరిగా ఈ వస్త్రాలను ధరిస్తారట. డిజైన్ రూపొందించడానికే మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందట. ఇక నేయడానికి ఏకంగా 40 నుంచి 50 రోజుల పడుతుందట. కనీసం ఇద్దరు కార్మికులు ఈ చీరపై ఎనిమిది నుంచి 9 గంటలు కూర్చొంటే గనుక ఇది పూర్తవ్వుతుందట. ఇప్పటకీ ఒక సాధారణ పటోలాను పూర్తిచేయాలన్న కనీసం ఐదు నెలల వ్యవధి పడుతుందట. అందుకే అంత ఖరీదు..అందువల్లే ఈ పటోలా చీరలు అంత ఖరీదు పలుకుతాయట. మార్కెట్లో అచ్చం అలాంటి నకిలీ ఫ్యాబ్రిక్ పటాన్ పటోలా వచ్చేస్తున్నాయి. అయితే అవి రూ. 2000 నుంచి రూ. 3000లు పలుకుతాయి. నాణ్యమైన ఒరిజనల్ పటోలా పట్టు చీర మాత్రం రూ. 1,50,000 నుంచి దగ్గర దగ్గర 3,50,000 వరకు పలుకుతుందట. అంతేగాదు వీటిని మలైకా అరోరా, స్మృతి ఇరానీ, దీపికా పదుకొనే, సోహా అలీ ఖాన్, కరిష్మా తన్నా, కంగనా రనౌత్, భూమి పెడ్నేక్కర్, మాధురి దీక్షిత్లు ఎంతో ఇష్టంగా ధరిస్తారట. అలాగే మన ప్రధాని మోదీ సైతం దీన్ని ఇష్టపడతారు. ఆయన జూలై 2022 లో పటోలా స్కార్ఫ్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. View this post on Instagram A post shared by Salvi Nirmal (@patola_bynirmalsalvi) (చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!) -
చీరలకు సహజ రంగులను అందించే నది..!
చీరలకు రంగులు అద్దడం అంటే కచ్చితంగా రసాయనాలు ఉపయోగించాల్సిందే. ముఖ్యంగా చేనేత వస్త్రాలు, రకరకాల ప్రింట్ ఫ్యాబ్రిక్ చీరలైన అద్దిన రంగు నిలబడాలంటే..కచ్చితంగా రసాయనాలు జోడించాల్సిందే. అయితే ఈ గ్రామ ప్రజలు అందుకు విరుద్ధం. వాళ్లు చీరలకు నదిలోని నీటి సాయంతోనే రంగులు శాశ్వతంగా ఉండేలా చేస్తారు. చీరలకు అద్దే రంగులను సైతం పర్యావరణహితంగానే ఉపయోగిస్తారు. ఎక్కడా.. రసాయనాలు వాడరు. కేవలం నది నీటితో తడపగానే..ఈ చీరకు అద్దిన రంగు శాశ్వతంగా నిలిచిపోతుంది. అదెలా సాధ్యం..ఆ కళాకారుల చేతుల్లో దాగున్న మ్యాజిక్ ఏంటి తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.మధ్యప్రదేశ్లోని బాఘి అనే గ్రామం పర్యావరణహిత సాంస్కృతిక చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రవహించే బాఘి నది రసాయనాలు వాడకుండా చీరలకు సహజరంగుని అందిస్తోంది. ఈగ్రామం బాఘి ప్రింట్ చీరలు, డ్రెస్లకు ఫేమస్. అక్కడ ఉండే స్థానికులంతా చేతి కళాకారులే. వారంతా ఈ పనే చేస్తుంటారు. ఎక్కడైన రసాయనాలు కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తే..వీళ్లు ప్రకృతి వరంలా ప్రసాదించిన బాఘి నది నీటితోనే శాశ్వత రంగుని అద్దుతారు. ఆ నది సాయంతోనే అక్కడి గ్రామస్తులు ఈ అద్భుతాన్ని సృష్టిస్తున్నారు. ఎందువల్ల ఇలా అంటే..బాఘిని నది నీటిలో అధిక ఖనిజ పదార్థాం అయిన ఐరన్ కంటెంట్ ఎక్కువ. ఫలితంగా రంగు వేసే ప్రక్రియలో ఇది సహజ ఉత్ప్రేరకం లేదా మోర్డెంట్గా పనిచేస్తుంది. ఫలితంగా సింథటిక్ రసాయనాలు లేకుండా రంగులు దీర్ఘకాలంపాటు మన్నికగా ఉంటాయి. నదికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..దాదాపు 400 సంవత్సరాల క్రితం పంజాబ్లోని సింధ్ నుంచి మధ్యప్రదేశ్లోని బాగ్ అనే గ్రామానికి వలస వచ్చిన ఖత్రిస్ సమాజం బాఘ్ ప్రింట్స్ ముద్రణను ప్రారంభించిందని చెబుతారు. నది చుట్టూ ఉన్న దట్టమైన అడవులు, పులుల (‘బాగ్’) కారణంగా దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు గ్రామస్తులు. ఎలా చేస్తారంటే..ఈ సహజ ప్రక్రియ ఖారాతో ప్రారంభమవుతుంది. అంటే నది రాళ్లపై బట్టను కడిగి స్టార్చ్ని తొలగిస్తారు. తర్వాత బట్టను ఐరన్ అధికంగా ఉంటే బాఘిని నదిలో ముంచి రంగు కోసం సిద్ధం చేస్తారు. ఈ బాఘిప్రింట్లలో అత్యంత ప్రసిద్ధి భాగం హ్యాండ్-బ్లాక్ ప్రింటింగ్.రంగులద్దడం కోసం చింతపండు, దానిమ్మ తొక్క, ఇనుప తుప్పు, ఆకుల నుంచి సేకరించిన సహజ రంగులను వినియోగిస్తారు. చివర్లో ఆ వస్త్రాన్ని నదిలో అనేకసార్లు కడుగుతారు. అలా చేయడం వల్ల రంగు అవశేషాలు పోయి..రసాయన ఫిక్సర్లు లేకుండా రంగులు ప్రకాశవంతంగా, మన్నికగా ఉంటాయి.(చదవండి: అందమైన అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..!) -
వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..!
మన హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్లిన భవిత మండవ అనే అమ్మాయి మోడలింగ్లో సంచలనాలు సృష్టిస్తోంది. న్యూయార్క్ సిటీలో జరిగిన షనెల్ మెతీర్స్ దార్-2026 కలెక్షన్లో ర్యాంప్ను ఓపెన్ చేసి ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త స్టార్గా నిలిచింది. ర్యాంప్ను ఓపెన్ చేయడం అంటే.. షోను ప్రారంభించే స్టార్ మోడల్గా అందరు మోడళ్ల కంటే ముందుగా వాక్ చేయడం. ఒక తెలుగమ్మాయి ఈ ఘనతను సాధించడంతో ఒక్కసారిగా ఏంటీ షనెల్ మోతీర్స్ దార్ షో, దాని స్పెషాలిటీ గురించి ఆరాలు మొదలయ్యాయి. ఈ నేఫథ్యంలో ప్రఖ్యాతిగాంచిన దిగ్గజ ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందామా..మెతీర్స్ దార్ (Métiers d'Art) అంటే ఫ్రెంచ్ భాషలో దీని అర్థం "కళల లేదా హస్తకళలు". ఈ ఫ్యాషన్ షోను షనెల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్యాషన్ షో ప్రత్యేకత..సంప్రదాయ హస్తకళల నైపుణ్యాలను, వాటిని సృష్టించే కళాకారుల గురించి ప్రపంచానికి పరిచయం చేయడం, వాటికి గుర్తింపు తీసుకురావడమే ఈ షో ప్రధాన ముఖ్యోద్దేశం. ఇక ఈ షోలో అత్యంత క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, ఫెదర్ వర్క్, జ్యువెలరీ, లెదర్ వర్క్ వంటి కలెక్షన్లను ప్రదర్శిస్తారు. View this post on Instagram A post shared by Bhavitha Mandava (@bhavithamandava) వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన బ్రాండ్..షనెల్ అనేది 1910లో ఫ్రెంచ్ మహిళా ఫ్యాషన్ డిజైనర్ గాబ్రియెల్ కోకో షనెల్ స్థాపించిన లగ్జరీ ఫ్యాషన్ హౌస్. ఇది మహిళల శైలిలో చక్కదనం, సరళత, కాలాతీత డిజైన్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం తదితరాలకు సంబంధించి ప్రసిద్ధి చెందింది. దీన్ని 1910లో పారిస్, ఫ్రాన్స్ దేశాలలో ఈ షెనల్ బ్రాండ్ని స్థాపించారు ఫ్రెంచ్ మహిళా డిజైనర్ కోకో. దీని ప్రధాన కార్యాలయం లండన్. దీనికి ప్రపంచవ్యాప్తంగా బోటిక్లు కూడా ఉన్నాయి. ఇది హాట్ కోచర్ , రెడీ టు వేర్ దుస్తులు, హ్యాండ్ బ్యాగులు, పలు ఫ్యాషన్ ఉపకరణాలు, వాచ్లు, చక్కటి ఆభరణాలు, పెర్ఫ్యూమ్ తదితర సౌందర్య సాధానాలను ప్రమోట్ చేస్తుంది. ఈ బ్రాండ్ ఐకానిక్ క్రియేషన్స్..చానెల్ నం. 5 పెర్ఫ్యూమ్ (1921) - ఇప్పటివరకు అత్యంత ప్రసిద్ధ సువాసనలలో ఒకటి.చానెల్ సూట్ - మహిళలకు ఆధునిక చక్కదననానికి సింబల్ది లిటిల్ బ్లాక్ డ్రెస్ - ఫ్యాషన్లో ప్రధానమైనదిగా మారిన కోకో చానెల్ ఆవిష్కరణ.2.55 హ్యాండ్బ్యాగ్ - చైన్ స్ట్రాప్తో క్విల్టెడ్ లెదర్, ఇప్పటికీ ప్రపంచం మెచ్చిన హ్యాండ్బ్యాగ్గా పేరుతెచ్చుకుంది.ప్రత్యేకతలు..ఫ్యాషన్లో పలు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మహిళలను స్వేచ్ఛగా తమ ఫ్యాషన్ను వ్యక్తపరిచే అవకాశాన్ని ఇచ్చింది. అలాగే సౌకర్యవంతంగా దుస్తులన ధరించడాన్ని పరిచయం చేసింది. ఇది ఆధునాతనకు పెద్దపీట వేస్తూనే..సంప్రదాయ కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే గాక సాధికారతను కూడా సూచించింది. అంతేగాదు ఎంబ్రాయిడీరీ, ప్లీటింగ్ నగల తయారీతో కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సుమారు 500కుపైనే బోటిక్లతో త్వరితగతిన అత్యంత గుర్తింపు పొందిన లగ్జరీ బ్రాండ్లలో ఒకటిగా పేరుతెచ్చుకుంది. ఈ బ్రాండ్ సీఈవో లీనా నాయర్ మన భారతీయ మూలాలకు చెందినవాడు కావడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ బ్లేజీ తన సృజనాత్మక ఫ్యాషన్ ఆవిష్కరణలతో ఈ షనెల్ ప్రభావాన్ని మరింత విస్తరింప చేస్తూనే ఉన్నారు. View this post on Instagram A post shared by @ideservecouture (చదవండి: అంతర్జాతీయ మోడల్గా హైదరాబాదీ.. ట్రెండింగ్లో భవితా మండవ) -
యోధుడా.. నీకు సెల్యూట్ ..!
మిలట్రీ వాళ్లను చూసినా, మిలట్రీ డ్రెస్ను చూసినా సెల్యూట్ కొట్టాలని అనిపించేంతగా భావావేశానికి లోనవుతాం. అదీ మిలట్రీ పవర్! సాధ్యం కాదు కానీ, అందరికీ దేశ రక్షణ దళాలలో పని చేయాలనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్యాషన్లన్నీ మిలట్రీ నుంచి వచ్చినవే. దేశాధి నేతలు మొదలు సామాన్య పౌరుల వరకు ఏదో ఒక సందర్భంలోమిలట్రీ దుస్తులు మన ఒంటిపై కవాతు చేస్తూ కనిపిస్తాయి. అంతగా స్ఫూర్తిని ఇస్తున్న సైనిక వస్త్ర, శస్త్ర విశేషాలు.. క్లుప్తంగా మీ కోసం!కార్గో ప్యాంట్లు1930లలో, బ్రిటిష్ సైన్యం కార్గో ప్యాంట్లను యుద్ధ దుస్తులలో భాగంగా ప్రవేశపెట్టింది. తూటాలు, ఇతర మందుగుండు సామగ్రి అమర్చుకోవటానికి సదుపాయంగా ఆ ప్యాంట్లకు ఇరువైపు ‘పక్క తొడ’ల పైన, నడుముకు ముందువైపు రెండు వైపులా జేబులు ఉండేలా డిజైన్ చేశారు. బ్రిటన్ తర్వాత కార్గో ప్యాంట్లను క్రమంగా యూఎస్ సైన్యం కూడా ఉపయోగించటం మొదలుపెట్టింది. 1990ల నాటికి ఇది సాధారణ పౌరుల ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారింది. యువతీ యువకులు స్టెయిల్ కోసం వీటిని ధరించటం మొదలు పెట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తరచు కార్గో ప్యాంట్స్లో కనిపిస్తుంటారు. మూడేళ్లుగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ ఘర్షణల సమయంలో జెలెన్స్కీ వస్త్రధారణ కూడా ఒక ప్రతీకగా మారింది! త్రిశూలం గుర్తు ఉన్న నల్లటి, లేదా ఆలివ్ ఆకుపచ్చ టాప్తో, కార్గో ప్యాంట్స్ ధరించే జెలెన్స్కీ, ఉక్రెయిన్పై రష్యా దాడులను ఆపించే విషయమై ప్రపంచ దేశాధినేతలతో చర్చిస్తున్నప్పుడు దేశాధ్యక్షుడిగా కాక, కార్గో ప్యాంట్లలో ఒక సైనిక యోధుడిని తలపిస్తుంటారు. మన దగ్గర బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ కార్గో ప్యాంట్స్ని ఎక్కువగా ధరిస్తుంటారు.ఏవియేటర్ సన్గ్లాసెస్హాలీవుడ్లోకి ఏవియేటర్ సన్గ్లాసెస్ రావటానికి ముందే, యూఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు వాటిని ధరించారు. అంతకుముందు వరకు పైలట్లు పాతకాలపు బరువైన గాగుల్స్ వాడేవారు. ఆ తర్వాత వాటికి బదులుగా ఏవియేటర్ సన్గ్లాసెస్ను కనిపెట్టారు. ‘పైలట్’ను ‘ఏవియేటర్’ అని కూడా అంటారు. ఆ పేరు మీదే ఏవియేటర్ సన్గ్లాసెస్ వాడుకలోకి వచ్చాయి. ఎండ తాకిడి నుంచి అవి బలమైన రక్షణను ఇస్తాయి.ఏవియేటర్ సన్గ్లాసెస్కు అధునాతన రూపమే ‘రే–బాన్’ కళ్లద్దాలు. ‘రే’ అంటే సూర్యకిరణాలు. ‘బ్యాన్’ అంటే తెలిసిందే, నిషేధం అని. సూర్యకిరణాలు పడకుండా అడ్డుకుంటాయి కనుక అవి రే–బాన్ సన్గ్లాసెస్ అయ్యాయి. సంపన్నుల ఫ్యాషన్లో ఇప్పుడు ముఖ్య భాగం అయ్యాయి. అమెరికా పూర్వపు అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ, రెండో ప్రపంచ యుద్ధపు అమెరికన్ టాప్ కమాండర్ జనరల్ డగ్లస్ మాక్ఆర్థర్, వియత్నాం విప్లవ నాయకుడు హో చి మిన్.. రే–బాన్ గ్లాసులు ధరించేవారు. ప్రస్తుత నాయకులలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అప్పుడప్పుడు రే–బాన్లో దర్శనం ఇస్తుంటారు టీ–షర్ట్టీ–షర్ట్ నమూనాను తొలిసారిగా అమెరికా నావికాదళం డిజైన్ చేసినట్లు చరిత్ర చెబుతోంది. బహుశా 1898 స్పెయిన్–అమెరికా యుద్ధ సమయంలో షర్ట్ కింద వేసుకునే అండర్ షర్ట్గా దీనికి రూపకల్పన చేశారని అంటారు. టీ షర్ట్ క్రమేణా సైన్యంలో తప్పనిసరి ధారణగా మారింది. అక్కడి నుండి 1950ల నాటికి పాప్ సంస్కృతిలో భాగమైంది. ఆ తర్వాత దాదాపు ప్రతి వార్డ్రోబ్లోకీ ప్రవేశించింది. దేశాధినేతలు అధికారిక కార్యక్రమాలలో టీ షర్ట్ను ధరించటం ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించదు. అదే విధంగా, దాదాపు అన్ని కార్యాలయాలలో టీ షర్ట్పై అనధికార నిషేధం ఉంటుంది. విధి నిర్వహణలో కాకుండా ఉల్లాసంగా గడిపే సమయాలలోనే సాధారణంగా ఎవరైనా టీ షర్ట్ను ధరించి ఉండటం కనిపిస్తుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా మాజీ ప్రధాని ఇప్పుడంటే టీ–షర్ట్లో దర్శనం ఇస్తున్నారు కానీ, పదవిలో ఉండగా వాళ్లేనాడూ టీ షర్ట్లో అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు. గ్రీకు రాజ్యమైన మేసిడోనియా రాజు ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ (క్రీ.పూ.356–323) టీ షర్ట్లను పోలిన పై వస్త్రాన్ని ధరించేవారని అనుకోవటానికి కొన్ని పోలికలు కనిపిస్తాయి.20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం అంతటా నావికులు, కార్మికులు, సౌకర్యవంతమైన లోదుస్తులుగా టీ షర్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. దేశాధినేతలు అధికారిక కార్యక్రమాలలో టీ షర్ట్ను ధరించటం ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించదు. అదే విధంగా, దాదాపు అన్ని కార్యాలయాలలో టీ షర్ట్పై అనధికార నిషేధం ఉంటుంది. విధి నిర్వహణలో కాకుండా ఉల్లాసంగా గడిపే సమయాలలోనే సాధారణంగా ఎవరైనా టీ షర్ట్ను ధరించి ఉండటం కనిపిస్తుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా మాజీ ప్రధాని ఇప్పుడంటే టీ–షర్ట్లో దర్శనం ఇస్తున్నారు కానీ, పదవిలో ఉండగా వాళ్లేనాడూ టీ షర్ట్లో అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు. గ్రీకు రాజ్యమైన మేసిడోనియా రాజు ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ (క్రీ.పూ.356–323) టీ షర్ట్లను పోలిన పై వస్త్రాన్ని ధరించేవారని అనుకోవటానికి కొన్ని పోలికలు కనిపిస్తాయి.20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం అంతటా నావికులు, కార్మికులు, సౌకర్యవంతమైన లోదుస్తులుగా టీ షర్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. కార్డిగన్కార్డిగన్ ధరించినప్పుడు హాయిగా, సౌఖ్యంగా ఉండే కార్డిగన్ దుస్తులను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధంలో రష్యన్లపై దాడి చేసిన సమయంలో బ్రిటిష్ సైన్యం ధరించింది. నిజానికి ‘కార్డిగన్’ అనేది ఒక బిరుదు. ‘ఎర్ల్ ఆఫ్ కార్డిగన్’ అంటే కార్డిగన్ అనే బిరుదు కలిగిన గొప్ప వంశానికి చెందిన వ్యక్తి. అప్పటి బ్రిటిష్ అశ్విక దళానికి నాయకత్వం వహించిన 7వ ‘ఎర్ల్ ఆఫ్ కార్డిగన్’ జేమ్స్ థామస్ బ్రూడెనెల్ ఆనాటి క్రిమియన్ యుద్ధానికి ఈ దుస్తులను ధరించి సారథ్యం వహించారు కనుక ఆ దుస్తులకు కార్డిగన్ అని పేరు పెట్టారు. కార్డిగన్ డిజైన్, దానిని ధరించిన వారి కార్యాచరణలు బ్రిటిషర్ల దేశభక్తికి ప్రతీకలుగా నిలిచిపోయాయి. కాలర్ లేని స్వెట్టర్ లేదా జాకెట్ను ‘కార్డిగన్’ అంటారు. ఫ్రెంచి ఫ్యాషన్ డిజైనర్ కోకో చానల్ 1920లలో మహిళలు ధరించే కార్డిగన్లను ప్రాచుర్యంలోకి తెచ్చారు. పురుషుల కార్డిగన్లను ధరించేటప్పుడు తన జుట్టు చెదిరిపోతుండటం నచ్చకపోవటంతో ఫ్రంట్ ఓపన్ కార్డిగాన్లను మహిళల కోసమే ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒక బల్గేరియన్ రేడియో ఎడిటర్నైతే కార్డిగన్ ఏకంగా ఒక హత్యాయత్నం నుండే కాపాడింది! అతను ధరించిన మందపాటి ఉన్ని కార్డిగన్.. రహస్య ఏజెంటు ఆ ఎడిటర్పై పేల్చిన విషపు గుళిక శరీరంలోకి చొచ్చుకొని పోకుండా నిరోధించింది. హై – హీల్స్అశ్విక దళంలోని సైనికులు గుర్రాలను ఎక్కి రెండు వైపుల బూటు కాలు ఉంచే రింగులలో (అంకేలు) పాదాలకు మరింతగా కుదురును ఇవ్వటం కోసం మొదట పర్షియన్ సైనికులు 10వ శతాబ్దంలో హై హీల్స్ను కనిపెట్టారు. యుద్ధ సమయంలో గుర్రాన్ని దౌడు తీయించటంలో ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉండే ఈ హై హీల్స్ కాల క్రమంలో హోదాకు చిహ్నంగా మారాయి. చివరికి గ్లామర్కు పర్యాయపదం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళల మనసు దోచుకున్నాయి. మహిళా దేశాధినేతలు హైహీల్స్ ధరించటం సర్వ సాధారణమే కానీ, చరిత్రలో హై హీల్స్ను ఇష్టపడిన పురుష నాయకులూ ఉన్నారు. ఫ్రాన్స్ రాజు 14వ లూయీ తన హోదాకు చిహ్నంగా హై హీల్స్ ధరించేవారు. ఐక్యరాజ్య సమితిలో ఓసారి అమెరికా మాజీ రాయబారి (ఐరాసకు) నిక్కీ హేలీ హై హీల్స్ ధరించటం గురించి గళం విప్పారు! ‘‘హై హీల్స్ శక్తిని, సాధికారతను ఇస్తాయి. యథాతథ స్థితిని సవాలు చేస్తాయి. అందువల్లనే నేను హై హీల్స్ ధరిస్తాను’’ అని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో వంటి వారు పొడవుగా కనిపించటానికి హై హీల్స్ ధరిస్తారన్న పుకార్లు ఉన్నాయి. 2023లో, మహిళలపై హింసకు వ్యతిరేకంగా అవగాహన పెంచటానికి ‘హోప్ ఇన్ హై హీల్స్’ ప్రచారంలో కెనడా పురుష ఎంపీలు హై హీల్స్ ధరించారు. బాంబర్ జాకెట్బాంబర్ జాకెట్ను మొదటి ప్రపంచ యుద్ధ పైలట్ల కోసం ‘యూఎస్ ఆర్మీ ఏవియేషన్ క్లోతింగ్ బోర్డ్’ సృష్టించింది. ఎ–1 అని వ్యవహరించిన ఆ బాంబర్ జాకెట్ను తొలిసారి 1917లో అమెరికన్ పైలట్లు ధరించారు. పైలట్లను వెచ్చగా ఉంచడానికి బోర్డు రూపొందించిన మొదటి ఫ్లయిట్ జాకెట్ అది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూరప్పై ప్రమాదకరమైన ఎత్తైన ప్రదేశాలలో బాంబు దాడులను నిర్వహించిన యువ అమెరికన్ వైమానిక దళ సభ్యులను ‘బాంబర్ బాయ్స్’ అనే వారు. ఆ పేరు నుంచే బాంబర్ జాకెట్ వాడుకలోకి వచ్చింది.అమెరికన్ మిలిటరీ 1950లలో ఎం.ఎ.–1 అనే బాంబర్ జాకెట్ను వృద్ధి చేసింది. అది ప్రకాశవంతమైన నారింజ రంగు లైనింగ్తో ఉండేది. ఒకవేళ విమానం కూలిపోతే, రక్షణ బృందాలకు సజీవంగా ఉన్న పైలట్ తేలిగ్గా కనిపించటానికి జాకెట్ను తిప్పి వేసుకోవచ్చు. లోపలి లైనింగ్ నారింజ రంగులో ఉంటుంది కనుక క్షతగాత్రుడైన పైలట్ జాడ కనిపెట్టటం వారికి తేలికవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మిగిలిపోయిన బాంబర్ జాకెట్లను అమెరికన్ సైన్యం పౌరులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాతి నుంచి వాటిని సామాన్యులూ వాడటం మొదలు పెట్టారు. ముఖ్యంగా హిప్–హాప్ కళాకారులు. 1980లో బాంబర్ జాకెట్కు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. దానికి కారణం టామ్ క్రూజ్ హిట్ చిత్రం ‘టాప్ గన్’లో ఆయన జి1 మోడల్ బాంబర్ జాకెట్ను ధరించటమే. ప్రారంభంలో బాంబర్ జాకెట్లు బరువైన తోలుతో తయారైనప్పటికీ తర్వాత్తర్వాత తేలికపాటి నైలాన్, సిల్క్, రీసైకిల్ చేసిన సముద్రపు ప్లాస్టిక్ల వంటి వాటితో విస్తృతంగా తయారై, ఏ సీజన్కైనా అనుకూలంగా ఉండేలా మారాయి. డాగ్ ట్యాగ్లుయుద్ధ సమయంలో సైనికులు మరణించినా, గాయపడినా.. వారిని సేవా దళ సభ్యులు గుర్తించటానికి వీలుగా వారి దుస్తులకు తగిలించి ఉండేవే డాగ్ ట్యాగ్లు. ఇవి అండాకారంలో ఉండే రేకు ముక్కలు. వాటిపై ఆ సైనికుల వివరాలు ముద్రించి ఉంటాయి. అమెరికా అంతర్యుద్ధ సమయంలో తొలిసారిగా ఈ డాగ్ ట్యాగ్లను అనధికారికంగా ప్రవేశపెట్టారు. గుర్తు తెలియని సమాధులలో శత్రువులు కనుక తమ వారిని సమాధి చేస్తే వారిని కనిపెట్టేందుకు డాగ్ ట్యాగ్లను తగిలించారు.డాక్ ట్యాగ్లను ఇప్పుడు సైనికులతో పాటుగా, పౌరులు కూడా తగిలించుకుంటున్నారు. కార్పొరేట్ కార్యాలయాలలో ఉద్యోగుల మెడలో కనిపించే ఐడీ కార్డులకు ప్రేరణ డాగ్ ట్యాగ్ల నుండి వచ్చిందేనని అంటారు.ట్రెంచ్ కోట్నీటితో తడవని, బరువు ఉండని తేలికపాటి ‘గ్రేట్ కోట్’లకు సమానమైన ట్రెంచ్ కోట్ను తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యం ఉపయోగించింది. సైనికులను కందకాలలో పొడిగా ఉంచే ఈ కోటు కాల క్రమేణా పౌరుల దైనందిన జీవితంలో భాగం అయింది.గ్రేట్ కోట్ పొడవుగా, బరువుగా, వెచ్చని ఓవర్ కోట్లా, ఉన్నితో తయారై ఉంటుంది. మొదట్లో సైనిక సిబ్బంది వీటినే ధరించేవారు. తీవ్రమైన చలి గాలుల నుంచి ఈ గ్రేట్ కోట్లు వారికి రక్షణ కల్పించేవి. వీటి పొడవు సాధారణంగా మోకాలి కింది వరకు ఉంటుంది. ట్రెంచ్ కోట్... గ్రేట్ కోట్కు అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పాలి. వాటర్ ప్రూఫ్ వస్త్రంతో తయారౌతుంది. అదనపు రక్షణను కల్పిస్తుంది. సైనిక చిహ్నాలను తగిలించటానికి భుజం పట్టీలు ఉంటాయి. ట్రెంచ్ కోట్ కూడా మోకాలి కింది వరకు ఉంటుంది. క్రమంగా ఇందులోకీ ఫ్యాషన్ వచ్చి చేరింది. మహిళలకు ప్రత్యేకంగా ట్రెంచ్ కోట్లు వచ్చాయి. ఫ్యాషన్ షోలలో ఎక్కువ మంది మోడళ్లు ట్రెంచ్ కోట్లను పోలిన వస్త్రాలను ధరించటం మీరు చూసే ఉంటారు. ట్రెంచ్ అంటే కందకం. కందకాల్లో ఉండి పోరాడే సైనికుల కోసం తయారైన కోట్ కనుక వీటికి ట్రెంచ్ కోట్ అనే పేరు వచ్చింది. సాక్షి, స్పెషల్ డెస్క్ (చదవండి: పొలాల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి..ఇవాళ 400 మందికి పైగా యువతకు..!) -
వెల్వెట్ విలాసం..!
ఒకనాడు కోట గోడలలో విలాసంగా వెలిగింది నేడు, అతివల వస్త్ర సంపదలో సుసంపన్నంగా మెరుస్తోంది.పట్టుకుచ్చులాంటి మెత్తదనం, మది దోచే మెరుపుతో మఖమల్ పేరున్న వెల్వెట్ ఈ వింటర్ సీజన్లో రారాజులా విరాజిల్లుతుంది. బాలీవుడ్ తారలు వింటర్ సీజన్లో వెల్వెట్ను ధరించడంలో ముందుంటారు. అందుకు ముందుగా టబు వెల్వెట్ అనార్కలీలో రాచరికపు హుందాతనంతో కనిపించగా ఇప్పుడు యామి గౌతమ్ ఆకుపచ్చని వెల్వెట్ శారీలో గాంభీర్యంగా కనివిందు చేస్తుంది.సల్వార్ సూట్లు, లాంగ్ ఓవర్కోటులు, సంక్లిష్టమైన ఎంబ్రాయిడరీతో వెల్వెట్ ఎప్పుడూ ఎవర్గ్రీన్ మార్కులు కొట్టేస్తూనే ఉంది. ఈ శీతాకాలపు వివాహాలు, పండగ వేడుకలలో అత్యంత ఇష్టమైన ఎంపికగా అతివల మనసును ఆకట్టుకుంటోంది. పచ్చ, ఆకుపచ్చ, నెమలిపింఛం రంగు, రిచ్ బ్రౌన్, బ్లాక్.. వంటి టోన్ షేడ్స్ సెలబ్రిటీ వార్డ్రోబ్లను రిచ్గా మెరిపిస్తున్నాయి.వెల్వెట్కి ఈ సీజన్లో మళ్లీ ఊపిరిపోస్తున్నాం అంటే ఒక్క విలాసం గురించే కాదు. మనలోని భావోద్వేగ ప్రతిధ్వనిని కూడా బయటకు వెదజల్లుతుంది. ప్రాచీన ప్రపంచ చక్కదనాన్ని చూపెడుతుంది. చలికాలం మూడ్ను ఉత్తేజపరుస్తుంది. ఇండోర్ లైటింగ్లో అందమైన ఫొటోలకు మంచి లుక్ ఇస్తుంది. ఎంబ్రాయిడరీ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్యాషన్ మళ్లీ గొప్పగా వెల్వెట్ ఫ్యాబ్రిక్ వెలుగులో నిలిచిపోతుంది.ఈ ఏడాది వింటర్ సీజన్కి హీనా కొచ్చర్ రూపొందించిన వెల్వెట్ కలెక్షన్ రాయంచలా వచ్చేసింది. బ్రౌన్ అనార్కలీలో టబు ధరించిన వెల్వెట్ రాయల్టీకి ప్రతిరూపంగా నిలిచింది. ధరించిన డ్రెస్కు తగినట్టు ఇయర్ హ్యాంగింగ్స్, పాట్లి బ్యాగ్తో మ్యాచ్ చేసింది. డ్రెస్ మరింత వైభవంగా వెలిగేలా జుట్టును స్టైల్ చేసింది. యామి గౌతమి ఈ ట్రెండ్కు రీఫ్రెషింగ్ మినిమలిజాన్ని తీసుకువచ్చింది. దేవనాగరి సెట్ చేసిన ఈ అద్భుతమైన ఆకుపచ్చ వెల్వెట్ చీర సుతిమెత్తని అలలకు నిదర్శంగా నిలిచింది. తక్కువ మేకప్, ఆభరణాలతో అలంకరించింది. ఆమె స్టైలింగ్ అంతా ఫ్యాబ్రిక్ గొప్పదనాన్ని చెప్పకనే చెబుతోంది. డిజైనర్ నూరి తయారు చేసిన వెల్వెట్ కఫ్తాన్లో శోభిత ధూళిపాళ మెరిసిపోయారు. అందుకు తగినట్టుగా ఉండే మేకప్, హెయిర్ స్టైల్ కంఫర్ట్ని సూచిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. (చదవండి: నానోతో పాత ఫొటోలు కొత్తగా!) -
రూపాయి నాణెంతో కూడిన ప్రధాని మోదీ వాచ్..! ధర ఎంత ఉంటుందంటే..
ప్రధాని నరేంద్ర మోదీని శక్తిమంతమైన నాయకుడిగా అభివర్ణించొచ్చు. ఆయన ఎలాంటి కార్యక్రమాల్లోనైనా భారతీయత ఉట్టిపడే ఫ్యాషన్ శైలిలో కనిపిస్తుంటారు. అందుకు నిదర్శనం ప్రతీ ఏడాది స్వాతంత్ర్య వేడుకల్లో కనిపించే మోదీ లుక్. ఆయన మన భారతీయ సంప్రదాయ ఫ్యాషన్కు చిహ్నమైన తలపాగ, టైలర్డ్ జాకెట్తో ఐకానిక్ హాఫ్ స్లీవ్ కుర్తాలలో దర్శనమిస్తుంటారు. ప్రతిష్టాత్మకంగా లేదా సాధారణంగా జరిగే వేడుకలకైనా అందుకు అనుగుణమైన స్లైల్ స్టేట్మెంట్తో కనపించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా ఆయన ఫ్యాషన్ శైలి భారతీయ సారాంశాన్ని ప్రదర్శిస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఆయన చేతికి ధరించే వాచ్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆఖరికి దీని విషయంలో కూడా మెదీ తన భారతీయతను వదులుకోలేదంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. మరి ఆ వాచ్ స్పెషాలిటీ, దాని ధర తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.అరుదైన రూపాయి నాణెం..ఈ వాచ్లో 1947 నాటి అరుదైన రూపాయి నాణేన్ని స్పష్టంగా చూడొచ్చు. జైపూర్కి చెందిన వాచ్కంపెనీ తయారు చేసిన ఈ 43ఎంఎం స్టెయిన్లెస్ స్టీల్ వాచ్ని 'రోమన్బాగ్' అనిపిలుస్తారు. ఇది జపనీస్ మియోటా ఉద్యమం ఆధారితమట. ఇందులో నడిచే పులి ఇమేజ్ భారత్ స్వాతంత్ర్య ప్రయాణాన్ని, మేక్ ఇన్ ఇండియా చొరవను సూచిస్తుంది. ఇక ఈ రూపాయి నాణెంల బ్రిటిష్ పాలనలో ముద్రించిన చివరి నాణెం కావడంతో ఈ వాచ్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది 1946-47లలో ముంద్రించిన నాణెం అని వాచ్ని చూడగానే క్లియర్గా తెలుస్తుందట. ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుందట. ఇందులో బంగారం లేదా వెండి రంగులతో రోమన్, దేవనాగరి లిపి సంఖ్యలు ఉంటాయట. లోపల నుంచి యాంటీ-రిఫ్లెక్టివ్ పూత ఉండి, సీ-త్రూ బ్యాక్ నీలమణి క్రిస్టల్ను ఉంటుంది. ఈ వాచ్కి వాటర్ ప్రూవ్ ఫిచర్ కూడా ఉంది. మోదీ ఈ వాచ్ని ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్ మధ్య పలు కార్యక్రమాల్లో ధరించి కనిపించారు. దీని ధర దగ్గర దగ్గర రూ. రూ. 55 వేలు నుంచి రూ. 60 వేలు వరకు పలుకుతుందట.అందువల్లే హాట్టాపిక్గా..జైపూర్ వాచ్ కంపెనీ వ్యవస్థాపకుడు గౌరవ్ మెహతా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఈ స్వదేశీ టైమ్పీస్ను ధరించడంతో ఈ ప్రొడక్ట్కి నెట్టింట అమితంగా క్రేజ్ ఏర్పడిందన్నారు. నిజానికి సాదాసీదాగా చూస్తే ఈ భారతీయ లగ్జరీ ..ఇవాళ ఆసక్తికరమైన ఆంశంగా మారిపోయిందన్నారు. గతంలో అమితాబ్ బచ్చన్, ఎడ్ షీరాన్, రఫ్తార్ వంటి వారు కూడా జైపూర్కు చెందిన మెహతా కంపెనీ తయారు చేసిన టైమ్పీస్లను ధరించి కనిపించేవారు.(చదవండి: పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్ కౌంటర్) -
షేక్ హసీనా 'జమ్దానీ' చీరల వెనక ఇంత స్టోరీ ఉందా..!
బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపు అన్న అంశం చిలికి చిలికి గాలివానలా మారి..మాజీ ప్రధాని షేక్ హసినా ప్రభుత్వం కూలి, పదవిని కోల్పోవడం తోపాటు మరణశిక్ష పడేందుకు దారితీసింది. ఉక్కు మహిళగా కీర్తిగడించిన ఆమెను ఒక్కసారిగా నేరస్తురాలిలా నిలబెట్టి మరణశిక్ష విధించింది అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్. ఆ తీర్పుపై తనదైన శైలిలో షేక్ హసీనా స్పదించారు కూడా . దీన్ని ఆమె రాజకీయ ప్రేరేపిత తీర్పుగా అభివర్ణించారు కూడా. కాలం అనుకూలించకపోతే ఎంతటి శక్తిమంతమైన వాళ్లైనా నిర్వీర్యం అయిపోతారనేందుకు ఉదాహరణగా నిలిచిన షేక్ హాసినా దౌత్యపరమైన సంబంధాలను నెరిపేందుకు ఏం చేసేవారో తెలిస్తే విస్తుపోతారు. మరి ఆ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసినా..తన స్టైలిష్ లుక్తోనే ఆకట్టుకుంటారామె. ముఖ్యంగా ఆమె ధరించే జమ్దానీ చీరలు.. యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆ నేపథ్యంలోనే ఆమె ఈ చీరలను ధరించేవారా అని అంతా ఆశ్చర్యపోయేలా రాజకీయాలను ఫ్యాషన్ని మిళితం చేసిందామె. అంతేగాదు ఆమె కృషి ఫలితంగా చేతివృత్తుల వారికి ఉపాధి లభించడం తోపాటు పురాతన సాంస్కృతికి వారసత్వాన్ని పదిలపర్చుకునేలా.. ప్రపంచ దేశాలు దాని విశిష్టతను గుర్తించేందుకు దోహదపడింది.జమ్దానీ చీరలను బెంగాల్లో అత్యంత అద్భుతమైన వస్త్ర సంప్రదాయాలలో ఒకటిగాగా చెబుతుంటారు. చేతితోమాత్రమే నేసే గొప్ప కళాఖండంగా అలరారే ఈ చీరలు అంతర్జాతీయ దృష్టిని సైతం అమితంగా ఆకర్షించాయి. అందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణం. ఆమె చేసిన సాంస్కృతిక దౌత్య ప్రయత్నలేనని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. హసీనా మనం ధరించే దుస్తులే సంభాషిస్తాయి అని ప్రగాఢంగా విశ్వసించేవారామె. ఆ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సాంస్కృతిక కళా నైపుణ్యం, జాతీయ గర్వాన్ని ప్రతిబింబించేలా ఇలాంటి సాంప్రదాయ దుస్తులనే ఎంచుకునేవారామె. అంతర్జాతీయ వేదికపై జమ్దానీ మెరిసిన క్షణాలు..2014లో భారతదేశంలో సంబంధాలను బలోపేతం చేసే విషయమై ఈ చీరలోనే కనిపించారు. అంతేగాదు జూన్ 2014లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా హసీనాకు దక్షిణ భారత పట్టు చీరను బహూకరించగా, హసీనా జమ్దానీ చీరను బహూకరించింది.2015 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ను సందర్శించినప్పుడు హసీనా తెలుపు-బూడిద రంగుతో మిళితమైన జమ్దానీని ధరించింది. అజర్బైజాన్లో జరిగిన NAM సమ్మిట్లో హసీనా జమ్దానీ-ప్రేరేపిత బృందం బంగ్లాదేశ్ నేత సంప్రదాయాన్ని ప్రపంచ దౌత్య వేదికపై ఉంచింది.2021లో గ్లాస్గోలో జరిగిన COP26 వాతావరణ సదస్సులో నీలం బూడిదర రంగుతో కలగలసిన చీరలో మెరిసింది. అంతేగాదు అది నెట్టింట విపరీతంగా వైరల్ అయిన ఫోటోగా నిలిచింది.సెప్టెంబర్ 2022లో హసీనా నాలుగు రోజుల భారతదేశ పర్యటన ఒక శిఖరాగ్ర క్షణం అని చెప్పొచ్చు. ఆమె ఆ సమయంలో కూడా ఆ చీరలనే ఎంచుకోవడం అనేది వ్యాపార నాయకులల్లో చర్చనీయాంశంగా హైలెట్ అయ్యింది. G20 సమ్మిట్లో, హసీనా తిలక్ రంగు ధకై జమ్దానీని ధరించింది. ఇది భారతదేశంతో బంగ్లాదేశ్కి ఉన్న సంబంధాలను సూక్ష్మంగా నొక్కి చెబుతూనే ప్రపంచ వేదికపై ఈ కళను హైలైట్ చేసింది.న్యూ ఢిల్లీ, లండన్, బ్రస్సెల్స్, మ్యూనిచ్లోని నాయకులతో జరిగిన అనేక ఉన్నత స్థాయి సమావేశాలలో జమ్దానీ చీరలోనే కనిపించారు హసీనా. జమ్దానీ చరిత్రజమ్దానీ మూలాలు రెండు వేల సంవత్సరాల క్రితం పురాతన ఢాకా మగ్గాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ పేరు పర్షియన్ పదాలైన "జామ్" (పువ్వు) "డాని" (కుండీ) నుంచి వచ్చింది. చీరలలో ఉపయోగించే నేత నమూనాలు వాటి నుంచి తీసుకోవడంతోనే ఈ చీరకు ఆ పేరు వచ్చింది.జమ్దానిని ప్రత్యేకంగా నిలబెట్టేది శ్రమతో కూడిన "పారదర్శక నేత" సాంకేతికత. దీన్ని యాంత్రిక మద్దతు లేకుండా చేతితోనే తయారు చేస్తారు. అందువల్ల ఒక చీర తయారైందుకు నెలల తరబడి సమయం పడుతుంది. ఈ ప్రక్రియ చూసేందుకు తేలికగా కనిపించినా..చాలా క్లిష్టతరమైన చేతి పని. అయితే ఇదే జమ్దాని చీర పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విభిన్న వెర్షన్లు ఉన్నాయి. అయితే ప్రతి చీర వెనుక అపారమైన నైపుణ్యం, గంటల తరబడి శ్రమ తప్పక ఉంటుంది. అంతేగాదు ఇది ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన విలువైన చేసేత వస్త్రాల్లో ఒకటిగా పేరొందింది. అలాంటి చేనేత చీరను మాజీ ప్రధాని షేక్ హసీనా ధరించడంతో అంతర్జాతీయ ఆకర్షణ తోపాటు బంగ్లాదేశ్ స్వదేశీ నేత కార్మికులకు నేరుగా మద్దతు లభించినట్లయ్యింది కూడా. అలాగే ఈ చీరలకు భౌగోలిక(GI) గుర్తింపు సైతం లభించడం విశేషం. గతేడాది నిరసనల టైంలో కూడా..ఆగస్టు 2024లో, హసీనా రాజీనామా, బహిష్కరణకు దారితీసిన సందర్భంలో కూడా ఈ చీరలు వార్తల్లో హాట్టాపిక్గా మారాయి. ఎందుకంటే ఆ ఘటనలో సాముహిక నిరసనకారులు ఢాకాలోని ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించి ఆమె వార్డ్రోబ్లోని జమ్దానీ చీరలను ఎత్తకుపోవడం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..) -
బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో టబు స్టన్నింగ్ లుక్..!
ప్రఖ్యాత భారతీయ డిజైనర్ ద్వయం అబుజానీ సందీప్ ఖోస్లా రూపొందించిన డిజైనర్ వేర్లో టాలీవుడ్ నటి టబు తళుక్కుమంది. నవంబర్ 13న ముంబై ఫ్యాషన్షోలో డిజైనర్ ద్వయం అబుజానీ సందీప్ ఖోస్లా కోసం బ్లాక్ అండ్ వైట్ డ్రెస్లో ర్యాంప్ వాక్ చేసి అందర్ని మెస్మరైజ్ చేసింది 54 ఏళ్ల టబు. మరోసారి ఫ్యాషన్కి వయోపరిమితి లేదు అని ప్రూవ్ చేస్తూ..అంత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. పొడవాటి చేతులతో కూడిని జాకెట్తో టబు చాలా కాన్ఫెడెంట్గా చేసిన ర్యాంప్ వాక్ అందర్నీ కట్టిపడేసింది. ఆ ఎథ్నిక్ వేర్లో ఆమె లుక్ ఎంత హైలెట్ అయ్యిందంటే..భారతీయ రూపురేఖల్ని ఎలివేట్ చేస్తున్నట్లుగా ఉంది ఆమె ఆహార్యం. అందుకు తగ్గట్టుగా కళ్లు మరింత పెద్దవిగా కనిపించేలా కాజోల్ని పెట్టింది. చేతికున్న వెండి ఎంబ్రాయిడరీ ఆ డిజైనర్వేర్ లుక్ని మరింత పెంచేసింది. పైగా మ్యాచింగ్ ఆర్కిటెక్చరల్ కోటుతో మరింత గ్లామరస్గా తళుక్కుమంది. అంతేగాదు ముంబైలోని ఫ్యాషన్ ఆర్ట్ ర్యాంప్ వాక్పై ఓ శక్తిమంతమైన మహిళలా స్టైలిష్గా తన హోయలను ఒలకపోస్తూ చూపిన విధానం..అదుర్స్. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ డిజైనర్ల ద్వయం షోస్టాపర్గా టబు లుక్ అక్కడున్నవారందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది అని పోస్ట్లో పేర్కొన్నారు. అభిమానులు సైతం ఐదు పదుల వయసులో ఇంత అద్భుతంగానా అని విస్తుపోయారు. అంతేగాదు టబు లుక్కి మాటల్లేవ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Deepak Yadav (@deepakyadav___) (చదవండి: అఫ్గాన్ చిన్నారి పెళ్లి కూతురు..! విధినే ధిక్కరించి..) -
వివాహ వేడుకలో... ఫ్యూజన్ స్టైల్
వివాహ వేడుకలలో సంప్రదాయ పట్టు చీరల రెపరెపలు ఆధునికపు హంగులతో మరింత వైభవంగా వెలిగిపోతున్నాయి. కట్టు, కట్స్, కలర్తో కొంగొత్తగా రూపుకడుతున్నాయి. ఫ్యూజన్ స్టైల్స్ని ఇష్టపడుతున్న నవతరం ఈ వెడ్డింగ్ సీజన్ని అటు సంప్రదాయం ఇటు ఆధునికతల మేళవింపుతో సరికొత్తగా చూపుతోంది.ట్రెడిషన్ – ట్రెండ్ కలయికకంచిపట్టు లెహంగా ధరించి, దానిపైన సీక్వెన్స్ బ్లౌజ్ వేసుకోవడం. అలాగే, క్లాసిక్ ఫ్యాబ్రిక్ శారీ (Classic fabric saree) అయితే మోడ్రన్ కట్ బ్లౌజ్ ధరించడం ఈ స్టైల్ ప్రత్యేకత.ఇండియన్ – వెస్టర్న్లెహంగాకి క్రాప్టాప్ లేదా ష్రగ్ వంటి వెస్టర్న్ టాప్స్ ధరించడం. ఇది ట్రెడిషనల్ సిల్హౌట్కి వెస్ట్రన్ టచ్ ఇస్తుంది. షరారా ప్యాంట్స్, జాకెట్ స్టైల్ చోలీలు లేదా అంగరఖా టాప్స్ ఇవి వధువుల రిసెప్షన్ లుక్స్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.పీచ్ టోన్స్గతంలో రెడ్, మెరూన్ వివాహవేడుకలలో ప్రధానంగా కనిపించేవి. ఇప్పుడు పీచ్, రోజ్ గోల్డ్, బీజ్ టోన్స్ ట్రెండ్లో ఉన్నాయి. ఇవి సాఫ్ట్ లుక్ (Soft look) ఇవ్వడంతో పాటు అందాన్ని పెంచుతున్నాయి.లెహంగా విత్ కేప్ దుపట్టాట్రెడిషనల్ దుపట్టా స్థానంలో లైట్ షిమ్మర్ కేప్ వాడటం ఈ సీజన్లో హిట్. ఇది లుక్కు రాయల్ టచ్ ఇస్తుంది. ఇవి సంగీత్ వంటి వేడుకలకు హైలైట్గా మారాయి. సంప్రదాయ స్టైల్స్కి ఆధునికపు హంగులను జోడించడమే నేటి ట్రెండ్. ఫ్యూజన్ స్టైల్గా పిలిచే ఈ ఫ్యాషన్లో క్రియేటివిటీ ప్రధానంగా చూస్తున్నారు. చదవండి: నాన్నలూ అమ్మలవుతారు.. కుంగిపోతారుసంప్రదాయానికి ఆధునికతను జత చేస్తున్న ఈ ఫ్యూజన్ లుక్స్ ఈ తరం వధువులలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తున్నాయి పట్టు బ్లౌజ్కి నెటెడ్ స్లీవ్స్, ఆర్గంజా దుపట్టాతో బెనారసీ లెహంగా మ్యాచ్ చేయడం.. వంటివి నేటి ట్రెండ్ టెంపుల్ నెక్లెస్కి మరో డైమండ్ పెండెంట్ ఉన్న చైన్ లేదా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని సిల్క్ శారీస్తో ధరించడం ఫ్యూజన్ స్టైల్గా మారింది సంప్రదాయ ఆభరణాలతో న్యూడ్ మేకప్, లైట్ బీచ్ వేవ్స్ హెయిర్స్టైల్స్ ఈ అలంకరణకు బాగా సూట్ అవుతున్నాయి.పేస్టెల్ షేడ్స్ ఎంపికఈ సీజన్ లో పెళ్లి కూతురి లుక్ పూర్తిగా నేటి కాలానికి తగినట్టుగా మారిపోతోంది. వధువు ధరించే సంప్రదాయ పట్టు చీరలకు బదులు ఫ్యూజన్ స్టైల్స్ బాగా హిట్ అవుతున్నాయి. బెనారస్ ఫ్యాబ్రిక్ మోడర్న్ కట్స్, టాప్ టు బాటమ్ ఒకే కలర్తో ఉండే మోనోటోన్ లెహెంగాస్ లేదా పేస్టెల్ షేడ్స్ లో శారీస్ ఇవే ఇప్పుడు నూతన వధువుల ఎంపిక అవుతుంది. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, సీక్విన్ వర్క్, పెర్ల్ డీటైలింగ్ వంటివి వధువు లుక్కి రాయల్ టచ్ ఇస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు లైట్వెయిట్ చీరలు (light weight saree) లేదా జామెట్రిక్ ప్యాటర్న్స్తో కూడిన లెహెంగాస్ను ఇష్టపడుతున్నారు. ఇవి ఫొటోలలో చాలా బ్రైట్గా కనిపిస్తాయి. వధువులే కాదు, వధువు తరపున వేడుకలో పాల్గొనబోయే అమ్మాయిలు కూడా పేస్టెల్ కలర్స్, ఫ్లోరల్ ప్రింట్స్ తో తమదైన స్టేట్మెంట్ని సృష్టిస్తున్నారు. మొత్తానికి, ఈ సంవత్సరం వధూవరుల ఫ్యాషన్ అనేది ‘ట్రెడిషన్ మీట్స్ మోడర్నిటీ‘ అని చెప్పొచ్చు.– చంద్రిక కంచెర్ల, ఫ్యాషన్ డిజైనర్ -
వారసత్వ వెలుగులు
కాలంతో పాటు ఫ్యాషన్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ, కొన్నింటికి కాలం అడ్డంకి కాదు. అవి భావాలూ, జ్ఞాపకాలూ కలిపిన అందంతో మరింత ప్రత్యేకతను చాటుతుంటాయి. అలాంటి వారసత్వ ఆభరణాలు బాలీవుడ్–టాలీవుడ్లలోనూ కొత్తగా వెలుగుతున్నాయి. వివాహ వేడుకలు, ఫ్యాషన్ వేదికలు, సినిమా ఈవెంట్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఆభరణం ఒక కథను, ఒక బంధాన్ని, ఒక జ్ఞాపకాన్ని మన ముందుంచుతుంది.వెండితెరమీద మెరిసే తారలు మోడర్న్ను మాత్రమే పరిచయం చేస్తారు అనుకుంటేపొరబాటు. తమ కుటుంబ వారసత్వాన్ని, ఆత్మీయతను ఆభరణాలలోనూ చూపుతుంటారు. శోభిత ధూళిపాళవివాహానికి ముందు జరిగే వేడుక సమయంలో శోభిత తన తల్లి, తాతమ్మగారి వారసత్వ ఆభరణాలు ధరించింది. వీటిలో సంప్రదాయ పసిడి హారం, కాసులపేర్లు ఉన్నాయి. ఆమె మాటల్లో – ‘మా అమ్మమ్మ ఈ ఆభరణాలు ధరించినప్పుడు నేను చిన్నపిల్లను. ఇప్పుడు అవే ఆభరణాలను నేను వేసుకున్నప్పుడు ఆమె నాకు మరీ మరీ గుర్తుకొచ్చింది’ అని చెబుతుంది. ఈ ఒక్క మాటతోనే ఆ ఆభరణం బంగారం కాదు, బంగారం లాంటి జ్ఞాపకం అని మనకు తెలిసిపోతుంది.కుటుంబ వారసత్వం అలియా తన వివాహ వేడుకలో పాత కాలపుపొల్కీ నెక్లెస్ ధరించింది. ఆ పీస్ ఆమె తల్లి సోనీ రాజ్దాన్ కానుకగా ఇచ్చినది. ‘ఇది కేవలం ఒక ఆభరణం కాదు. తల్లి ప్రేమకు ప్రతీక అని చెబుతుంది. ఆమె ఆ తర్వాత కూడా ఆ నెక్లెస్ని రీ–స్టైల్ చేసి మనీష్ మల్హోత్రా ఈవెంట్లో వాడింది.కీర్తీ సురేశ్తల్లి మేనక ఇచ్చిన టెంపుల్ జ్యువెలరీని కీర్తి పబ్లిక్ ఈవెంట్స్లో కూడా రీ–స్టైల్ చేసి వేసుకుంటుంది. ఆమె చెప్పినట్టుగా ‘మా అమ్మ ఆభరణాలు నేను మళ్లీ వేసుకుంటే, అది ఫ్యాషన్ కాదు గౌరవం’ అని చెబుతుంది.వారసత్వ రత్నాలుబాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన వివాహ వేడుకలో ధరించిన చోకర్ నెక్లెస్ వందేళ్ల కిందట ఆమె కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చింది. దానిని రాజస్థానీ డిజైనర్లు పొల్కీ ఆభరణంగా రూపొందించారు. ‘ఈ నెక్లెస్ మా అమ్మమ్మ ధరించింది. ఇప్పుడు నేను వేసుకుంటున్నానంటే అందుకు మా మధ్య ఉండే ఆత్మీయ బంధమే కారణం’ అని చెబుతుంది సోనమ్. ఇప్పుడు ఆభరణాల డిజైనర్లు కూడా ‘సెంటిమెంట్ స్టైల్’ అనే కొత్త లైన్ ను ఎంచుకుంటున్నారు. పాత ఆభరణాలను మోడర్న్ టచ్తో రీ–డిజైన్ చేయడం, వాటి కథను చెప్పేలా ప్రదర్శించడం ట్రెండ్ అయ్యాయి. వారసత్వ ఆభరణం అంటే కేవలం అలంకారమే కాదు అది ప్రేమ, గౌరవం, జ్ఞాపకం కూడా! -
స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) లాస్ ఏంజిల్స్లో జరిగిన స్వరోవ్స్కీ మాస్టర్స్ ఆఫ్ లైట్ ప్రారంభోత్సవ వేడుకలో స్టన్నింగ్ లుక్తో అందర్నీ ఆకట్టుకుంది. స్వరోవ్స్కీ స్థాపించి 130 సంవత్సరాలు పూర్తయిన ( Swarovski’s 130 years) సందర్భంగా 2025లో 130వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. "130 ఇయర్స్ ఆఫ్ లైట్ & జాయ్" అనే పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.లాస్ ఏంజిల్స్లో జరిగిన బ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ లైట్ ఓపెనింగ్ వేడుకలో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాయబారిగా స్వరోవ్స్కి ఈవెంట్లో గౌరవ్ గుప్తా కార్యక్రమంలో రష్మిక మందన్న స్టైలిష్గా అరంగేట్రం చేసింది. ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా దుస్తుల్లో రష్మిక ఈవెంట్కు హైలైట్గా నిలిచింది.గౌరవ్ గుప్తా రాబోయే హాలిడే 2026 కలెక్షన్ నుంచి రష్మిక మందన్న బెస్పోక్ పెటల్ కార్సెట్ స్కల్ప్ట్ ఫ్రాక్ ధరించింది. దీనికి హై-వెయిస్టెడ్, ఫ్లోర్-లెంగ్త్ బ్లాక్ స్కర్ట్తో జత చేసింది. ఇంకా అద్భుతమైన స్వరోవ్స్కీ ఆభరణాలు రష్మిక్ గ్లామర్ లుక్ను పెంచాయి. మాస్టరీ ఆఫ్ లైట్ థీమ్కు సరిపోయేలా, ఆమె అష్టభుజి-కట్ క్రిస్టల్స్ ఐకానిక్ మిలీనియా చోకర్ను ధరించింది. స్వరోవ్స్కీ నెక్లెస్, రెండు ఇయర్ కఫ్లతో పాటు సరిపోయే డాంగ్లర్ చెవిపోగులను కూడా ధరించింది. అలాగే రోడియం ప్లేటింగ్తో అలంకరించబడిన భారీ స్టేట్మెంట్ నడుం బెల్ట్ కూడా అందంగా అమిరి మెడ్రన్ లుక్ను తెచ్చిపెట్టాయి. దీంతోపాటు, ఫోటోగ్రాఫర్ల కోసం ఫోజులిస్తున్నపుడు కనిపించిన రింగ్, ఎంగేజ్మెంట్ రింగ్ అనే ఊహాగానాలు మాత్రం జోరుగా ఉన్నాయి.మాస్టర్స్ ఆఫ్ లైట్ - హాలీవుడ్ ఎగ్జిబిషన్ స్వరోవ్స్కీ వేడుకలు నవంబర్ 3 వరకు జరగనున్నాయి. ఇక్కడ ఎన్నె అద్భుతమైన ఫ్యాషన్ , ఐకానిక్ దుస్తులు ప్రదర్శించనున్నారు. ఎగ్జిబిషన్ ఈవెంట్లో చెర్, ఎలిజబెత్ ఒల్సెన్, జెఫ్ గోల్డ్బ్లమ్, వియోలా డేవిస్, వీనస్ విలియమ్స్, లా రోచ్, లారా హారియర్, ఎమిలీ రాటజ్కోవ్స్కీ, డిటా వాన్ టీస్, అనోక్ యాయ్ ,అమేలియా గ్రే వంటి ప్రముఖ హాజరైన ప్రముఖులతో సహా స్టార్-స్టడ్డ్ ప్రేక్షకులను ఆకర్షించింది. 2025 దీపావళి సందర్భంగా రష్మిక మందన్నాను స్వరోవ్స్కి ఇండియా తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ఈసందర్భంగా కొన్ని ఈవెంట్లను నిర్వహిస్తూ వస్తోంది. మెట్ గాలా 2025:"టైలర్డ్ ఫర్ యు" అనే థీమ్తో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. అరియానా గ్రాండేతో కలిసి స్ప్రింగ్-సమ్మర్ 2025 ప్రచారాన్ని కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
రాయల్ బ్లూ సిల్క్ చేనేత చీరలో మెరిసిన సమంత..!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చీర, ఫ్యాషన్ వేర్ అయినా..ఎందులో అయినా సమంత లుక్ ఎవర్గ్రీన్ అనేలా ఆమె మార్క కనిపిస్తుంది. సింపుల్గా కనిపిస్తూ..హైలెట్ మెరిసేలా ఫ్యాషన్ స్టైల్ని అనుసరిస్తుందామె. ఈసారి కూడా అలానే చూడాటానికి చాలా సాదాచీర అనిపించేలా లగ్జరీయస్ లుక్లో మెరిసిందామె.సమంత చీరల పట్ల ఉన్న ఇష్టాన్ని ఇలా ఏదో ఒక విధమైన స్టైల్లో కనిపిస్తూ..పరోక్షంగా చెబుతుంటారామె. ఆధునికత ఉట్టిపడేలా..మన సాంస్కృతికి చిహ్నమైన చేనేత చీరలో అదరహో అనిపించేలా ఉందామె ఆహార్యం. రాయల్ బ్లూ స్లిక్ చేనేత చీరలో రాకుమారిలా స్టైలిష్గా దర్శనమిచ్చింది. ఈ చీరను డిజైనర్ రినా సింగ్ రూపొందించారు. ఆర్గాంజ్ టైపు చీరను ప్యాచ్వర్క్, జాక్వర్డ్ బుట్టితో డిజైన్ చేశారు. దానికి మ్యాచింగ్గా ఎంబ్రాయిడరీ చేసిన వీ నైక్ బ్లౌజ్ని జత చేయడంతో.. లుక్ని మరింత అందంగా మార్చింది. స్మోకీ కళ్లు, నిగనిగలాడే పెదవులతో కూడిన మేకప్ ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. ఈ చీర ధర ఎంతంటే..సమంత ధరించిన చీర ధర రూ. 32,500 కాగా, బ్లౌజ్ ధర రూ. 12,500. మొత్తం ధర దాదాపు: రూ. 45,000 పలుకుతోంది. కాగా, సమంత చివరిసారిగా శుభం అనే చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
ఆకుపచ్చని చీరలో ఇషా స్టన్నింగ్ లుక్:! హైలెట్గా రూబీ డైమండ్ నెక్లెస్..
రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ ఎప్పటికప్పుడు తనదైన ఫ్యాషన్ సిగ్నేచర్తో కనిపిస్తుంటారామె. అటు తన వ్యాపార సామ్రాజ్యంలో తనైదైన పాత్ర పోషిస్తూనే.. ఇటు ఫ్యాషన్ పరంగా బాలీవుడ్ దిగ్గజ నటులకు తీసిపోని లుక్లో మెరుస్తుంటారామె. అందులోనూ అంబానీ కుటుంబికులు ధరించే వస్తువులు అత్యంత లగ్జరియస్ గానూ, చారిత్రాత్మకంగా పేరుగాంచిన అమూల్యమైన ఆభరణాలు తప్పక ఉంటాయి. ఈ ఏడాది దివాలీ వేడుకలకు ఇషా సన్నద్ధమైన అందమైన లుక్కి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో ఇషాకి సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ నమ్రతా సోని మేకప్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. “అత్యంత అందమైన ఇషా అంబానీతో దీపావళి,” అనే క్యాప్షన్ని జోడించి మరి ఈ వీడియోని పోస్టు చేసింది నమ్రతా సోని. దీపావళి వేడుకల కోసం ఇషాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన వీడియోని షేర్ చేసింది. ఈ వేడుకల కోసం ఇషా డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన రంగురంగుల పట్టు చీరను ధరించింది. ఆ చీరలో రాజవంశస్థురాలి మాదిరి దర్పంతో వెలిగిపోతుందామె. ఈ ఎథ్నిక్ చీరకి రూబీ, డైమండ్, ముత్యాలతో పొదిగిని ఆభరణాన్ని జత చసింది. పూల ఆకారంలో ఉన్న నెక్లెస్ ఇషాని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేలా చేసింది. అందుకు తగ్గ చెవిపోగులు, బ్రాస్లెట్లతో ఫ్యాషన్కే అర్థం చెప్పేలా అత్యంత అద్భుతంగా ఉందామె లుక్. అందులోనూ ఆ ఆకుపచ్చని చీరకు అత్యంత కాంట్రాస్టింగ్గా ధరించిన ఎరుపు చీర ఆమె లుక్ మరింత అందంగా ఆకర్ణణీయంగా కనిపించేలా చేసింది. కాగా, ఇషా అంబానీ తన సోదరుడు ఆకాష్ అంబానీలతో కలిసి తన పుట్టినరోజు వేడుకని అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఈ వేడుకకు బాలీవుడ్ అతిరథ మహారథులంతా కదిలివచ్చి మరి సందడి చేశారు. View this post on Instagram A post shared by namratasoni (@namratasoni) (చదవండి: ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..) -
ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..
నగరం.. ఫ్యాషన్కి.. కొత్త ట్రెండ్స్కి కేంద్ర బిందువు. అయితే దీనిని పాటించడానికీ ఫ్యాషన్ సెన్స్ ఉండాలి.. అయితే ఆ సెన్స్ నాన్సెన్స్ కాకూడదని పలువురు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఫ్యాషన్, ట్రెండ్ పేరుతో ఇష్టారీతిన ఫ్యాషన్ ఉత్పత్తులను వినియోగిస్తూ.. వాటిని భారీ స్థాయిలో డంప్ చేస్తున్నారు. దీంతో మనకు తెలియకుండానే ఈ డంప్ ప్రకృతిపై ప్రభావం చూపుతోంది.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నిత్యం ఉత్పత్తయ్యే 9,000 టన్నుల వ్యర్థాల్లో 800 టన్నులు ఫ్యాషన్, వ్రస్తాలే ఉంటున్నాయని అంచనా.. వీటిలో చాలా వాటిని రీసైకిల్ చేయకుండానే డంప్ చేస్తున్నారని, ఇది పర్యావరణానికి ఓ సవాలుగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇష్టారీతిన ఫ్యాషన్ ఉత్పత్తులను వినియోగించేవారు రీసైకిల్/ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను వినియోగించడం ఓ జీవన విధానంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.యువతలో పెరుగుతున్న ఫాస్ట్ ఫ్యాషన్ ధోరణి పర్యావరణానికి ప్రధాన సవాలుగా మారుతోంది. అధునాత జీవనశైలి పేరుతో మనం ధరించే ప్రతి ఉత్పత్తి వెనుక ఎకో ఫ్రెండ్లీ సూత్రం దాగుంది. దానిని గ్రహించి ఉత్పత్తులు ఎంపిక చేసుకుంటే.. అటు ప్రకృతికి.. ఇటు భవిష్యత్తు తరాలకు మేలుచేసినట్లవుతుంది. ఇందుకు సామాజిక బాధ్యతతో పాటు.. ఎకో ఫ్రెండ్లీ జీవన విధానం అలవర్చుకోవాలని నినదిస్తున్నారు. సింథటిక్ ఫ్యాబ్రిక్తో సమస్య.. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా కొత్త దుస్తులు కొనడం, తరచూ ట్రెండ్స్ మార్చుకోవడం అలవాటుగా మారింది. మార్కెట్లో తక్కువ ధరకే దొరికే సింథటిక్ ఫ్యాబ్రిక్స్ డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి పరిమాణం భారీగా పెరిగింది. ఇది అధిక వ్యర్థాలకు దారి తీస్తోంది. అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ఫ్యాషన్ పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా 10 శాతం కర్బన ఉద్గారాలకు, 20 శాతం నీటి కాలుష్యానికీ కారణమవుతోంది. ఒక జీన్స్ తయారీకి సగటున 7,000 లీటర్ల నీరు అవసరమవుతుందంటే కాలుష్యం తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. రీ యూజ్, రీ సైకిల్ పరిష్కారం.. గతంలో ఏ వస్తువునైనా పూర్తిగా వినియోగించి, రిపేర్ చేసుకొని, తదుపరి తరానికి అందించే అలవాటు మన సంస్కృతిలో ఉండేది. అదే ‘స్లో ఫ్యాషన్’ భావన. నాణ్యమైన, దీర్ఘకాల మన్నిక కలిగిన వ్రస్తాలు వాడటం, వాడిన వాటిని ఇతర అవసరాలకు వినియోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గించవచ్చు. హైదరాబాద్లో ఇటీవల ఔత్సాహిక యువత, స్టార్టప్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ‘థ్రిఫ్ట్ మార్కెట్స్’ నిర్వహించి వాడిన దుస్తులను మళ్లీ అమ్మడం లేదా ఇతరులకు వితరణ చేయడం మొదలైంది. ఈ కల్చర్ ద్వారా ఫ్యాషన్ వ్యర్థాలు తగ్గుతాయి. సెలబ్రిటీలు కూడా ఈ మార్పుకు తోడ్పడుతున్నారు. నటి సమంతా ఆ మధ్య ఓ ఈవెంట్లో ‘రీయూజ్ వస్త్రాలు కూడా నా ఫ్యాషన్ స్టేట్మెంట్’ అని చెప్పడం ఆహా్వనించదగ్గ పరిణామం. మోతాదుకు మించి.. హైదరాబాద్లో టైMð్ట్సల్ వేస్ట్ మోతాదుకు మించుతోంది. జీహెచ్ఎంసీ ల్యాండ్ఫిల్ ప్రాంతాల్లో రోజూ వందల టన్నుల పాత దుస్తులు, ఫ్యాబ్రిక్ డంప్ చేస్తోంది. వీటిలో 40 శాతం రీసైకిల్ చేయగలిగినవే అయినా, అవగాహన లేక నేరుగా భూమిలోకి వెళ్తున్నాయి. నిత్యం 720 నుంచి 800 టన్నుల టెక్స్టైల్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. సింథటిక్ ఫ్యాబ్రిక్లో ఉన్న నైలాన్, పాలిస్టర్ వంటి పదార్థాలు సహజంగా కరగవు. వీటి నుంచి విడుదలయ్యే మైక్రోఫైబర్లు నీటిని కలుషితం చేస్తున్నాయి. వ్రస్తాల్లో ఉపయోగించే రసాయనాలు, సింథటిక్ కలర్స్ చర్మవ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు..హ్యాండ్లూమ్, ఖాదీ, ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ వంటి దేశీయ ఉత్పత్తులు పర్యావరణానికి కాస్త సహాయకారిణిగా ఉంటాయి. ఇవి సహజంగా భూమిలో కరిగిపోతాయి. రసాయనాల మోతాదు తక్కువగా ఉంటుంది. తెలంగాణ హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, ఇక్కత్ శారీస్, నారాయణపేట ఫ్యాబ్రిక్స్, మంగళగిరి కాటన్ వంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే కాక, కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ముఖ్యంగా అవసరాన్ని బట్టి దుస్తులు కొనడం, మన్నికైన, నాణ్యమైన ఫ్యాబ్రిక్ ఎంపిక చేయడం, వాడిన బట్టలను దానం చేయడం, రీసైకిల్ సెంటర్లకు ఇవ్వడం..వంటి మార్పుకు నాంది పలకాలి. -
మళ్ళీ పాతరోజుల్లోకి యువత
కాలం వెనక్కి నడుస్తున్నట్లుంది... డెబ్బై.. ఎనభైల్లో మాదిరి బతకడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది.. మట్టి కుండల్లో వంట చేయడం.. చెట్లు చేమల్లో తిరగడం.. వాగుల్లో స్నానం చేయడం.. మజ్జిగన్నం.. ఉల్లిపాయ.. రాగిసంకటి.. నాటు కోడి కూరా.. నాటు పుట్టగొడుగులు.. అమ్మమ్మ ఊళ్లోకి వెళ్లి నాలుగురోజులు ఉండడం.. ఇవన్నీ మళ్ళీ కొత్తగా మొదలయ్యాయి..యువత కూడా వాటిని బాగానే ఆదరిస్తోంది.. చిరంజీవి.. నాగార్జున సినిమాలు రీ రిలీజ్ చేయడం.. అమ్మాయిలు.. పట్టు పరికిణీలు వేసుకోవడం.. వాలు జాడలు.. వెండిపట్టీలు.. ఇవన్నీ మళ్ళీ ట్రేండింగ్ అయ్యాయి.. ఇదేమాదిరి. కుర్రాళ్ళు కూడా పంచె లాల్చీ వేసుకోవడం.. బుర్ర మీసాలు పెంచడం.. కిర్రు చెప్పులు వేయడం.. ఊళ్ళో పందిరి కింద వెన్నెల్లో మంచం వేసి అమ్మమ్మ..తాతయ్యతో కబుర్లు చెప్పుకోవడం..కోడి పందాలు..ఊళ్ళోని పిల్లలతో గోళీలాట.. ఇవన్నీ మళ్ళీ ట్రెండింగ్ అయ్యాయి.దీంతోబాటు కొంతమంది ఓల్డ్ ఫ్యాషన్ ను అవలంబిస్తూ ఎన్టీఆర్ ఏఎన్నార్ మాదిరి బెల్ బాటమ్ ఫ్యాంట్లు వేయడం.. వాణిశ్రీ లెక్క సిగ ముడి వేయడం..ఇవి కూడా ట్రెండింగ్ ఉండేది కొన్నాళ్ళు. The striped underwear that our grandfather and great-grandfather wore is now internationally branded and priced between 2,500 and 11,000 rupees.🤔🤔🤨🤨 pic.twitter.com/V2Cs1DYEd9— Aviator Anil Chopra (@Chopsyturvey) October 23, 2025 అయితే ఇప్పుడు ఏకంగా మన తాతలు కాలంలో వేసుకునే గళ్ళ నిక్కర్ ఇప్పుడు అతి పెద్ద ట్రెండ్ అయి కూర్చుంది. పాతిక ముప్పై ఏళ్ల క్రితం ప్యాంట్లు.. పంచెకట్టు లోపల గళ్ళ నిక్కర్లు వేసుకునేవాళ్ళు..దానికి ఒక లాడా కూడా ఉండేది..దాన్ని లాగితే సులువుగా నిక్కర్ విప్పేసుకోవచ్చు..పైగా ఖద్దరు వస్త్రం కాబట్టి శరీరానికి సౌకర్యంగా ఉంటుంది.. చెమట పీల్చుతుంది.. వ్యవసాయ పనుల్లోనూ..నిద్ర పోయేటపుడు కూడా హాయిగా ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ నిక్కర్లు ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. హెచ్ అండ్ ఎం అనే కార్పొరేట్ బ్రాండింగ్ స్టోర్లో ఈ చెడ్డీలు అమ్మకానికి ఉంచారని వాటి ధర మాత్రం రూ.2500 నుంచి రూ.11,000 వరకు ఉందంటూ ఏవియేటర్ అనిల్ చోప్రా అనే ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోటోలు వీడియోలు పోస్ట్ చేశారు. మా తాతయ్య కాలంలో వేసుకునే గళ్ళ చెడ్డీలు మళ్ళీ వచ్చాయి కానీ ధర బాగా ఎక్కువే ఉంది అంటూ ఆయన చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది.వాస్తవానికి ఆ చెడ్డి మహా అయితే ఓ రెండు వందలు ఉండచ్చు కానీ దాన్ని ఈ కార్పొరేట్ సంస్థలు బ్రాండింగ్ చేసి ఏకంగా రూ.11,000 వరకు పెట్టి విక్రయిస్తుండగా యూత్ కూడా అంతే క్రేజీతో కొంటున్నారు. కొత్త ఒక వింత..పాత ఒక రోత అని అనుకుంటాం కానీ ఇప్పుడు పాత బంగారానికే డిమాండ్ ఎక్కువ..దానిపైనే మోజు పెరుగుతోందని అర్థం అవుతోంది.సిమ్మాదిరప్పన్న -
‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ సందేశంతో కూడిన గ్లామర్..!
కొత్త దుస్తులు కొనడం, కొత్త స్టైల్లో కనిపించడం ట్రెండ్ను ఫాలో అవడం... ఇవే ఫ్యాషన్ అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ బాలీవుడ్ స్టార్ అలియా భట్ ఆ ధోరణిని మార్చేసింది. ఇటీవల నటి కరీనాకపూర్ ఇచ్చిన దీపావళి పార్టీకి 30 ఏళ్ల నాటి వింటేజ్ సిల్క్ శారీ ధరించి అందరినీ ఆశ్చర్యపరించింది. ‘రీస్టైల్ ఫ్యాషన్‘ ద్వారా సస్టెయినబుల్ లివింగ్ కూడా గ్లామరే అనే సందేశాన్ని ఇస్తోంది. అదే నయా ట్రెండ్గా మన కళ్లకు కడుతోంది. ఆధునిక భారతీయ ఫ్యాషన్ గురించి చెప్పాలంటే చాలా మంది సెలబ్రిటీలు తమ దుస్తులను రీ క్రియేట్ చేస్తూ సోషల్మీడియాలో అందంగా... అబ్బురంగా చూపుతున్నారు. ఇది ఒక స్ఫూర్తిని కలిగించే మార్పు. ఈ మార్పు పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు. తరాల వారసత్వాన్ని కూడా పరిచయం చేయడం. సెలబ్రిటీల జీవనవిధానం సమాజాన్ని మార్చగలదనే విషయాన్ని అలియాభట్ తన దుస్తుల ద్వారా తెలియజేస్తుంది. లుంగీ స్టైల్ స్కర్ట్, పింక్ చికంకారీ కుర్తీని ధరించి వేడుకలు జరుపుకుంది. ఆ తర్వాత కరీనాకపూర్ ముంబైలోని తన నివాసం లో నిర్వహించిన దీ΄ావళి వేడుకలకు హాజరయ్యింది.సంగీత్ లెహంగా.. దీపావళి పార్టీలో... కిందటేడాది దీపావళి సమయంలో బాలీవుడ్ గ్లామ్ వేడుకలకు ఆలియాభట్ హాజరయ్యింది. తన పెళ్లి సమయంలో మెహెందీ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పింక్ లెహంగాను ఈ గ్లామ్ పార్టీకి రీ స్టైల్ చేసి తిరిగి ధరించింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ లెహంగాను రీ–స్టైల్ చేసి ధరించింది. ఈ లెహంగా సుమారు 180 టెక్స్టైల్ ప్యాచ్లతో, రియల్ గోల్డ్, సిల్వర్ నక్షీ, కోరా పూలు, వింటేజ్ సీక్వెన్సెస్తో తయారైంది. పార్టీకి కొత్త డ్రెస్ కొనకుండా, ఆమె ఆ లెహంగానే డిజైనర్ టాప్, జువెలరీ, హెయిర్స్టైల్తో రీ–స్టైల్ చేసింది. పర్యావరణ హితంపర్యావరణ స్పృహ కలిగిన దుస్తుల బ్రాండ్ ఎడ్–ఎ–మమ్మాను స్థాపించింది. ఇది పిల్లల, బాలింతలకు అవసరమయ్యే ఆర్గానిక్ దుస్తుల బ్రాండ్. ఫ్యాషన్ వ్యర్థాలను తగ్గించడానికి చేనేతలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. తన పెళ్లి సమయంలో ఉపయోగించిన లెహంగాతో సహా వివిధ రకాల తన దుస్తులను రీ క్రియేషన్ చేయడంలో అలియా ప్రసిద్ధురాలుగా పేరొందింది. అంతేకాదు పర్యావరణ అనుకూల బ్రాండ్లకు మద్దతు ఇస్తుంది.30 ఏళ్ల క్రితం చీర కొత్తగా...ఈ సందర్భంగా అలియాభట్ బంగారు రంగు చీరను ధరించింది. ఇండియన్ డిజైనర్ రీతుకుమార్ 30 ఏళ్ల క్రితం ఈ చీరను డిజైన్ చేశారు. ఈ చీరను స్లీవ్లెస్ బస్టియర్ స్టైల్ బ్లౌజ్తో జత చేసింది. బంగారు చోకర్ నెక్లెస్, ఉంగరాలు, మాంగ్ టిక్కా, బ్రేస్లెట్ను ధరించింది.పాత దుస్తులను కొత్తగా తీర్చిదిద్దడం. ఆ దుస్తులు కూడా కొత్తగా కనిపించేలా మార్చడం అలియా భట్ చూపుతున్న మార్గం. ఆమె స్టైలింగ్ ఫిలాసఫీ కూడా ఇదే. ‘ఫ్యాషన్ అంటే కేవలం లుక్ కాదు, అది మన విలువల ప్రతిబింబం’ అంటుంది ఆలియా. ‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ కేవలం ట్రెండ్ కాదు ఒక సందేశం కూడా! (చదవండి: మంత్లీ మ్యారేజ్ రివ్యూ!) -
ఇండోర్ మహారాణి : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ఆ డైమండ్స్ ఎలా మోసారండీ!
లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో జరిగిన పింక్బాల్ ఈవెంట్కి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ తొలిసారి సహ-అధ్యక్షత వహించారు. అయితే ఈ సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ ధరించినడైమండ్స్, ఎమరాల్డ్ నెక్లెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డైమండ్స్, పచ్చలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నీతా మరోసారి అద్భుతమైన నెక్లెస్ను ధరించారు. ఈ నెక్లెస్ రాయల్ లుక్, చరిత్ర ఏంటి అనేది హాట్ టాపిక్గా మారింది.నీతా అంబానీ మెడలో అమరిన అందమైన పచ్చలు, ఖరీదైన డైమండ్స్, బంగారంతో తయారు చేసిన ఈ లాంగ్ నెక్లెస్ ఇండోర్ మహారాణి సంయోగిత దేవి ధరించిన నెక్లెస్ నుండి ప్రేరణతో ఆమె గౌరవార్ధం రూపొందించారు. ఇది ఇండోర్ మహారాణికి చెందిన అత్యంత ప్రసిద్ధ నెక్లెస్లలో ఒకటి. దీని ప్రేరణతోనే స్వయంగా నీతా అంబానీ డిజైన్ చేసుకోవడం విశేషం. ఆమె వ్యక్తిగతంగా సేకరించి వజ్రాలు, పచ్చలతో దీన్ని తయారు చేయించారు. ఈ నెక్లెస్ మధ్యలో 70-క్యారెట్ల పచ్చ, 40-క్యారెట్ల పియర్ షేప్ డైమండ్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ నెక్లెస్లో నిజామి మూలానికి చెందిన 40-క్యారెట్ల రౌండ్ వజ్రం మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది.1933లో తొలుత మౌబౌసిన్ రూపొందించారు. సంయోగిత దేవి ధరించిన నెక్లెస్లోని రెండు పియర్ ఆకారపు వజ్రాలను 1913లో యూరప్ పర్యటన సందర్భంగా తుకోజీ రావు హోల్కర్ III కొనుగోలు చేశారట.. ఆయన తన భార్య కోసం ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఫ్రెంచ్ ఆభరణాల వ్యాపారి చౌమెట్ పారిస్ సెలూన్ను సందర్శించారు. 46.70 , 46.95 క్యారెట్ల బరువున్న రెండు పియర్ ఆకారపు వజ్రాలతో ఫ్రెంచ్ లావలియర్ శైలిలో సొగసైన నెక్లెస్గా రూపొందించారు. ఈ వజ్రాల ధర 1913లో 631,000 ఫ్రాంక్లు.ఆ తరువాత ఇవి ఇండోర్ పియర్స్ గా పాపులర్ అయ్యాయి. బరువైన డైమండ్ రింగ్అంతేకాదు ప్రముఖ నగల డిజైనర్ జూలియా చాఫ్ ప్రకారం40 క్యారెట్ల పియర్ ఆకారపు సాలిటైర్లు చాలా అరుదు. ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడాలేదు. ఆమె నెక్లెస్తో పాటు ధరించిన భారీ వజ్రపు ఉంగరం కూడామరో హైలైట్. ఇది చాలా బరువైందని ఇది ధరించాక నీతా అంబానీ వేళ్లు బాగానే ఉన్నాయా అంటూ ఆమె చమత్కరించారంటే ఈ ఉంగరం బరువును ఊహించవచ్చు చదవండి: ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల స్టెప్పులు : వీడియో వైరల్ -
35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ
లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో చారిటీ ఈవెంట్ "పింక్ బాల్" ఈవెంట్ గ్లామర్కు ప్రతిరూపంగా మారింది. బ్రిటిష్ మ్యూజియం డైరెక్టర్ నికోలస్ కల్లినన్తో కలిసి, రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ దీనికి సహ అధ్యక్షత వహించారు. అలాగే ఆమె తల్లి, రిలయన్స్ ఫౌండర్ చైర్పర్సన్ ,NMACC వ్యవస్థాపకురాలు పింక్ బాల్ థీమ్లో అద్భుతమైన లుక్లో మెరిసారు.కీలకమైన కారణాల కోసం నిధులను సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమంలో బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్తోపాటు, ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, దాతలు, సామాజిక ,రాజకీయ ఉన్నత వర్గాలకు చెందిన 800 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్తగా, గొప్ప దాతగా పేరుగాంచిన నీతా అంబానీ తనదైనఫ్యాషన్ లుక్తో అలరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేసిన ఈ ఈవెంట్ ఏన్షియంట్ ఇండియా: లివింగ్ ట్రెడిషన్స్'తో పాటు జరిగిన పింక్-నేపథ్య సోయిరీలో సాగింది.పింక్ బాల్ సహ చైర్గా, ఇషా అంబానీ లుక్లో వారసత్వం, కళాత్మకత ఉట్టిపడింది. అబు జాని సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా రూపొందించిన హ్యాండ్ మేడ్ కోచర్ డ్రెస్లో మెరిసి పోయింది. పింక్ ధీమ్కు తగ్గట్టుగా బ్లష్ పింక్ చామోయిస్ శాటిన్ జాకెట్ , గులాబీ రంగు జర్డోజీలో ముత్యాలు, సీక్విన్స్ ,స్ఫటికాలతో డిజైన్ స్కర్ట్ను ధరించింది.35 మందికి పైగా కళాకారులుదీన్ని తయారు చేయడానికి 3,670 గంటలు శ్రమించారు. దీనికి సంబంధించిన వీడియోను సందీప్ ఖోస్లా షేర్ చేశారు. కార్సెట్ బ్లౌజ్ను డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టైల్ చేశారు. అలాగే నీతా అంబానీ స్వదేశ్లో తయారు చేసిన కాంచీవరం, మల్బరీ సిల్క్ చీరలో అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india) ఈ కార్యక్రమానికి మిక్ జాగర్, జానెట్ జాక్సన్, నవోమి కాంప్బెల్, సర్ నార్మన్ ఫోస్టర్, లేడీ కిట్టి స్పెన్సర్, ల్యూక్ ఎవాన్స్ , జేమ్స్ నార్టన్ వంటి అనేక మంది సృజనాత్మక ప్రముఖులు హాజరయ్యారు. హాజరైన ప్రతీవ్యక్తి సీటు కోసం 2,000 పౌండ్లు చెల్లించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) -
కలర్ఫుల్ స్వింగ్ 'దివాలి' డ్రెస్సింగ్..!
దీపావళి అంటే ఒక పండుగ మాత్రమే కాదు.. విభిన్న రకాల సంబరాల కలగలుపు వేడుక. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం మొదలు.. క్రాకర్స్ కాల్చడం వరకూ ఈ పండుగ ఆస్వాదించదగిన ఎన్నో అనుభూతులను మనకు అందిస్తుంది. అందుకే ఈ ఫెస్టివల్లో మన లుక్స్ ద్వారా గుడ్విల్ అందుకోవాలంటే, తగిన వస్త్రధారణ తప్పనిసరి. ఇందుకోసం తరచూ బాలీవుడ్ నటీనటుల స్టైల్స్ను సిటీ యూత్ అనుసరిస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ అందిస్తున్న కొన్ని సూచనలు.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ధరించిన ఒక డ్రెస్.. ఒక టాంగీ నారింజ మిర్రర్–వర్క్ బ్లేజర్ కోర్డ్ సెట్ దీపావళి పార్టీకి సరైన ఎంపిక. ముఖ్యంగా పండుగ వేళ మెరుపులు విరజిమ్ముతూ.. అదే సమయంలో సౌకర్యవంతంగా ఉండాలనుకునేవారికి ఇవి సరైనవి. మినిమలిస్ట్ లుక్.. ఉత్తరాది ప్రేక్షకుల్ని ఉర్రూతలూంచే అనన్య పాండే దీపావళి కోసం మినిమలిజాన్ని సూచిస్తున్నారు. సున్నితమైన తెల్లటి ఎంబ్రాయిడరీతో అలంకరించిన లేత గులాబీ రంగు స్లీవ్లెస్ కుర్తాను, మ్యాచింగ్ పలాజో ప్యాంటు జత చేశారు. ఓపెన్ హెయిర్ మినిమల్ మేకప్తో, పండుగ డ్రెస్సింగ్కు ‘తక్కువలో ఎక్కువ’ విధానాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తున్నాయి. రెడ్ గ్లామ్ లుక్.. దీపావళికి మరో సిల్వర్ స్క్రీన్ క్వీన్ మౌని రాయ్ లాగా ఆల్–రెడ్ లెహంగాలో అబ్బురపరిచవచ్చు. కాంబినేషన్గా ఫుల్–స్లీవ్డ్ బ్లౌజ్, ప్రింటెడ్ బోర్డర్లతో మ్యాచింగ్ స్కర్ట్, గోల్డెన్ షిమ్మర్తో అంచులున్న కో–ఆర్డినేటింగ్ దుపట్టా ఉన్నాయి. బంగారు చోకర్ నెక్లెస్, మాంగ్ టిక్కాతో తన అద్భుతమైన ఎథి్నక్ లుక్ కంప్లీట్గా తీర్చిదిద్దుకుంది. లాంగ్ ఎథినిక్ జాకెట్లు.. పొడవాటి ఎథ్నిక్ జాకెట్లు పండుగ వార్డ్రోబ్కు చక్కదనాన్ని జోడిస్తాయి. సరళమైన కుర్తాపై అందంగా ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్ను జత చేయాలి లేదా క్యాజువల్, చిక్ ఫ్యూజన్ లుక్ కోసం క్రాప్ టాప్ స్కర్ట్తో స్టైల్ సెట్ చేసుకోవచ్చు. ఈ స్టైలిష్ లేయర్ డ్రెస్సింగ్.. ట్రెండీగా సాయంత్రపు సమావేశాలకు సౌకర్యవంతంగా ఉంటూనే సంప్రదాయాన్ని జోడిస్తుంది.సింపుల్ లాంగ్ గౌన్లు.. సొగసైన పాస్టెల్ లేదా మ్యూట్ షేడ్స్లో ఉన్న పొడవైన, తక్కువగా అలంకరించిన గౌన్లు దీపావళికి స్టైలిష్ ఎంపిక. అవి చక్కదనంపై రాజీ పడకుండా సౌకర్యంపై దృష్టి పెడతాయి. పండుగ రూపాన్ని పూర్తిగా ప్రతిబింబించాలంటే.. దీనికి దుపట్టా లేదా లైట్ జ్యువెలరీ జోడించాలి. పాతవే కొత్తగా.. ప్రస్తుత వార్డ్రోబ్ నుంచి కొన్నింటిని విడివిడిగా తీసి కలపడం ద్వారా అదనపు ఖర్చు చేయకుండా కూడా తాజా పండుగ స్టైల్ను సృష్టించవచ్చు. కొత్త పలాజోలతో పాత కుర్తీని జత చేయడం లేదా సరదాగా ఫ్యూజన్ వైబ్ కోసం జీన్స్తో భారీ దుపట్టాను కలిపేయడం.. వంటి ట్రిక్స్ ఫాలో అవ్వవచ్చు. ఇది మన డబ్బు ఆదా చేయడమే కాకుండా దుస్తులకు వ్యక్తిగత సృజనాత్మక ట్విస్ట్ను అందిస్తుంది. దేశీ డ్రీమ్.. మరీ సింపుల్గా వద్దు అనుకుంటే, అలంకరించబడిన షరారా సెట్లు రెడీగా ఉన్నాయిు. సీక్విన్స్, జెమ్స్ మెరుపులతో ఇవి లేట్–నైట్ డిన్నర్లు, రూఫ్టాప్ పార్టీలకు బెస్ట్. దీని కోసం నటి జాన్వి కపూర్ డ్రెస్ స్టైల్ పరిశీలించవచ్చు. ఆధునిక, ఆకర్షణీయమైన ట్విస్ట్ కోసం దుపట్టాను కేప్గా ధరించవచ్చు. బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది లాగా నల్ల కుర్తా స్ట్రెయిట్–ఫిట్ ప్యాంటు లుక్ కూడా బాగుంటుంది. లీనియర్ రెడ్ మోటిఫ్ డీటెయిలింగ్తో అలంకరించిన, వదులుగా ఓపెన్ జాకెట్తో పొరలుగా ధరించడం ఆధునిక సంప్రదాయాల స్టైలిష్ మిశ్రమం.వేదంగ్ రైనా లా నల్ల కుర్తా స్ట్రెయిట్ ప్యాంటులో మెరిసిపోవచ్చు, సమకాలీన పండుగ లుక్ కోసం మెరిసే నల్ల బ్లేజర్తో లుక్ను మరింత మెరిపించవచ్చు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ని గమనిస్తే.. తరచూ క్లాసిక్ సిల్హౌట్లతో సమకాలీన కట్లను మిళితం చేస్తాడు. ఇటీవలి దీపావళి లుక్లో పొట్టి కుర్తా ఎరుపు రంగు స్ట్రెయిట్ ప్యాంటు నమూనా నెహ్రూ జాకెట్తో కలిగి ఉంది ఆధునిక పండుగ డ్రెస్సింగ్కి ఇది సరైన ఉదాహరణ. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్లా చాలా సింపుల్ స్టైల్ని ఎంచుకోవచ్చు. ఆయన ధరించిన పాస్టెల్–రంగు లినెన్ కుర్తా–పైజామా సౌకర్యం, సరళమైన కాలాతీత శైలి అని చెప్పొచ్చు. -
అవే నా స్టయిల్ ఆఫ్ లవ్: నటి చైత్ర జే ఆచార్
సింపుల్ నుంచి బోల్డ్ వరకు, ట్రెండ్ నుంచి ట్రెడిషనల్ వరకు ఏ స్టయిల్లోనైనా తన స్వాగ్ని చూపే నటి చైత్ర జే ఆచార్. జీన్స్, షార్ట్స్ ప్లస్ టీ షర్ట్ నా స్టయిల్ ఆఫ్ లవ్. బయటకు వెళ్లేటప్పుడు ఇదే లుక్ను కాస్త బోల్డ్గా స్టయిల్ చేస్తా. ప్రత్యేక సందర్భాల్లో చీరల్లో మెరుస్తాను. అవి నాకు సంప్రదాయబద్ధమైన, కంఫర్ట్ లుక్ను ఇస్తాయి. దుస్తులు ఏవైనా, మినిమల్ జ్యూలరీని ప్రిఫర్ చేస్తా అంటోంది చైత్ర జే ఆచార్. ఇక్కడ ఆమె ధరించిన చీర బ్రాండ్: ఇజాయి ధర: రూ. 3,850, జ్యూలరీ బ్రాండ్: ఫైన్ షైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. క్రిస్టల్ క్రష్!రాళ్ల నగలు నేటి యువత స్టయిల్కి ర్యాప్ సాంగ్లాంటి ఎనర్జీని ఇస్తున్నాయి. అందుకే, బంగారం మెరుపు కంటే, క్రిస్టల్ జ్యూలరీనే వారి ఫేవరెట్ క్రష్గా మారింది. నిజానికి, రాళ్ల ఆభరణాలకు ఫ్యాషన్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం మెరుపుతోనే కాదు, ట్రెండ్, లగ్జరీ మిక్స్ చేసిన మోడర్న్ డిజైన్లతో వస్తాయి. విశేషంగా, వైట్ స్టోన్ జ్యూలరీకి ఒక అదనపు ఆర్భాటం అందిస్తాయి. ఒక్కసారి రాళ్ల ఆభరణాలు ధరించగానే సాధారణ దుస్తులు కూడా ప్రత్యేకంగా మెరుస్తాయి. డైలీ వేర్కు, మినిమలిస్టిక్ వైట్ సఫైర్ స్టడ్స్, సింపుల్ బ్యాంగిల్స్ ఎప్పటికీ బెస్ట్ ఆప్షన్. ఆఫీస్ స్టయిల్కు క్లాసిక్ వైట్ స్టోన్ పీసులు, జెంటిల్ డిజైన్, ప్రొఫెషనల్ లుక్ అందిస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం పెద్ద హారాలు, చోకర్స్, గ్రాండ్ స్టేట్మెంట్ లుక్ ఇస్తాయి. ప్రతి సందర్భానికి ప్రత్యేకంగా మోడర్న్ స్టోన్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. జుట్టు పోనీగా కట్టి వెళ్ళితే రాయల్టీ లుక్, వేవీ హెయిర్ లేదా కర్ల్స్ వేసుకుంటే క్యూట్ టచ్ గ్యారంటీ. (చదవండి: beauty: ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..! కుంకుమ పువ్వుతో..) -
విలాస సౌందర్యం...
బాలీవుడ్ నిర్మాత, ఫ్యాషన్ ఐకాన్ గౌరీ ఖాన్ దీపావళి పండుగ నేపథ్యంలో జోయా ఆధ్వర్యంలో ఐకానిక్ రూబీ రష్ నెక్లెస్ ఆవిష్కరించింది. 70 క్యారెట్ల మొజాంబిక్ ఎర్ర కెంపులతో నెక్లెస్ లో అందంగా కనిపించింది. 1950లో హాలీవుడ్ దిగ్గజాలు మార్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ ఇంద్రియాలకు ప్రసిద్ధి చెందిన ఎరుపు రంగు లిప్స్టిక్ ప్రేరణతో ఈ రూబీ రష్ డిజైనింగ్ రూపొందించామని జోయా యాజమాన్యం తెలిపింది. స్త్రీతత్వం, శాశ్వతమైన గ్లామర్ను ప్రతిబింబించే ఈ డిజైన్స్ హైదరాబాద్తో పాటు అన్ని నగరాల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. మహిళల సౌందర్యం, ఆత్మస్థైర్యానికే కాకుండా లగ్జరీకి నిదర్శనంగా నిలుస్తుందని గౌరీ ఖాన్ పేర్కొన్నారు -
ఫ్రెంచ్ సూపర్ బ్రాండ్ తొలి స్టోర్ : ఎవరీ బ్యూటీ విత్ బ్రెయిన్
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ డిపార్ట్మెంట్ స్టోర్లలో ఒకటైన గ్యాలరీస్ లఫాయెట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబైలోని కాలా ఘోడాలోని చారిత్రాత్మక టర్నర్ మోరిసన్ అండ్ వోల్టాస్ హౌస్ భవనాలలో తన తొలి భారతీయ ఫ్లాగ్షిప్ స్టోర్ను ప్రారంభించింది. గ్యాలరీస్ లఫాయెట్ , భారతీయ వ్యాపారం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ABFRL) ప్రత్యేక భాగస్వామ్యంతో ఇది అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇండియన్ లగ్జరీ ఫ్యాషన్ మార్కెట్లో ఇదొక చారిత్ర క్షణమని నిపుణులు పేర్కొంటున్నారు.ఈ సందర్భంగా ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా అరేబియా సముద్రంలో అద్భుతమైన వేడుకను నిర్వహించాయి. గేట్వే ఆఫ్ ఇండియా నుండి, యాచ్లలో కుమార్ మంగళం బిర్లా, అనన్యా బిర్లా ,గ్యాలరీస్ లఫాయెట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నికోలస్ హౌజ్ ఈ లాంచింగ్ ఈవెంట్ను అద్భుతంగా నిర్వహించారు. గ్యాలరీస్ లఫాయెట్ ముంబై లాంచ్లో యువ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా వ్యాపార వారసురాలు అనన్య బిర్లా (Ananya Birla) ఎరుపు రంగు ఆలిస్ ఒలివియా సూట్లో అద్భుతమైన లుక్తో ఆకట్టుకున్నారు. ఆమె తల్లి ఆభరణాలు, రోలెక్స్, సొగసైన సన్ గ్లాసెస్తో కాంటెంపరరీ పవర్ డ్రెస్సింగ్తో తన ఫ్యాషన్ స్టైల్ను చాటుకున్నారు. View this post on Instagram A post shared by Harper's Bazaar India (@bazaarindia) కాగా బెయిన్ & కో ప్రకారం, దేశంలోని లగ్జరీ విభాగం 2030 నాటికి 3.5 రెట్లు పెరగనుంది. ఫ్రెంచ్ ఐకాన్ గ్యాలరీస్ లఫాయెట్ 130 ఏళ్ల ఫ్యాషన్, కళ , సంస్కృతి వారసత్వాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ భారతీయ మార్కెట్కు పరిచయం చేసింది. ముంబైలో 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయిదు అంతస్తుల్లో ఇది రూపుదిద్దుకుంది. ఈ స్టోర్ను లండన్కు చెందిన ఆర్కిటెక్చరల్ సంస్థ వర్జిల్ + పార్టనర్స్ రూపొందించారు. -
బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు
భారతీయ మహిళామణులకు బొట్టు అంటే ప్రాణం.అందం, సంప్రదాయాల మేళవింపు అది. పండగ అయినా, పెళ్లిఅయినా, ఏ వేడుక అయినా అదొక ఫ్యాషన్. అందుకే కాలక్రమేణా బొట్టు లేదా బిందీ రూపాలు మారుతూ వచ్చాయి.ఈ మార్పునే ఆకళింపు చేసుకున్నారు బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా. రోజువారీ జీవితంలో భాగమైన బొట్టు బిళ్లలను ఫ్యాషన్ ఆభరణాలుగా మార్చి, తన క్రియేటివిటీతో పలువురి సెలబ్రిటీల ఫ్యావరెట్గా మారిపోయింది. మిలిటరీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన మేఘన ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపారాన్ని ఎంచుకుంది. మేఘనా సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ కథనంలో.బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా బిందీ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది, ది బిండి ప్రాజెక్ట్ను స్థాపించారు. అయితే ఈ జర్నీ వెనుక పెద్ద పోరాటమే ఉంది. మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్లో ఎంబీఏ చేశారు. ఒక ఏడాది పాటు ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కానీ సొంతంగా వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకు మరింత పదును పెరిగింది. ఈ క్రమంలో ఆమె దృష్టి ముక్కు పోగులపై పడింది. జోధ్పూర్ కళాకారులతో కలసి "లెవిటేట్" అనే హ్యాండ్క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్ను ప్రారంభించింది. 2002 - 2020 వరకు అంటే పద్దెనిమిదేళ్లు లెవిటేట్ విజయవంతంగా నడిచింది. ఇందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి. కోవిడ్ మహమ్మారి మేఘనా వ్యాపారాన్ని దెబ్బతీసింది. చివరకు వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. కానీ బిజినెస్ చేయాలనే కోరిక మాత్రం నశించ లేదు. View this post on Instagram A post shared by Startup Pedia (@startup.pedia)2022లో అనుకోకుండా బొట్టు బిళ్లల్లో బంగారు, వెండివి ఉంటాయని తెలుసుకుంది మేఘనా. తన స్నేహితురాలు అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు చూశాక తానెందుకు ఇలాంటి తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అన్ని ఆభరణాల మాదిరిగానే బొట్టు బిళ్లలు కూడా ఒకఫ్యాషన్గా ఉండాలనే ఆలోచనతో "ది బిందీ ప్రాజెక్ట్" ప్రారంభించింది. దీనికి తోడు ‘లెవిటేట్’ అనుభవం ఉండనే ఉంది. రూ.5 లక్షలతో బిందీ ప్రాజెక్ట్ షురూ అయింది. కేవలం ఇద్దరు మహిళలకు శిక్షణ ఇచ్చి, అందంగా స్పెషల్ డిజైన్లతో బిందీ డిజైన్లు రూపొందాయి. దీనికి తగ్గట్టు మార్కెటింగ్ చేసుకున్నారు. తొలుత వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పర్యావరణహితమైన, రీసైకిల్ చేయబడిన వ్యర్థాలతో అందమైన బొట్టు బిళ్లలను తయారు కావడంతో సెలబ్రిటీలను సైతం విపరీతంగా ఆకర్షించాయి. ఇవి కేవలం ఒక సాధనంగా కాకుండా, ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిపోయాయి. రెండున్నరేళ్లలో 1500 కస్టమర్లు వచ్చారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్స్టా ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. ఇలా 2024 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ఆదాయం వచ్చింది. ఇది 2025లో రూ. 20 లక్షలకు చేరిందంటే దీని ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఫెస్టివ్, లెదర్, వస్త్రంతో పూర్తిగా చేత్తో తయారవుతాయి. రంగు రాళ్లు, ఇత్తడి ముక్కలు, పూసలు ఇలా రక రకాలుగా తయారయ్యే ఒక్కో బొట్టు బిళ్లా ఒక్కో డిజైనర్ ఆభరణంలా ఉంటుంది. సామాన్యులతో పాటు,ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్, కరీనా కపూర్, కరిష్మా, తమన్నా, సోనం కపూర్ తదితర బాలీవుడ్ హీరోయిన్లను కూడా ఆకర్షిస్తున్నాయి. -
భారత్కు తొలిసారి మిసెస్ యూనివర్స్ కిరీటం.. భార్యగా, తల్లిగా ఆమె చరిత్ర..
అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్ విజయ కేతనం ఎగురవేసింది. భారత్కు చెందిన షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా, మొట్టమొదటి తల్లిగా చరిత్ర సృష్టించారు. ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా ఆమె సుమారు 120 మందితో పోటీ పడి కిరీటాన్ని దక్కించుకున్నారు.తొమ్మిదేళ్ల క్రితం సికందర్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లి, ఒక కుమారుడు ఉన్న షెర్రీ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "ఈ విజయం హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదీ. బలం, దయ, పట్టుదల మహిళ నిజమైన అందానికి నిదర్శనం అని అదే తాను ప్రపంచానికి చూపాలనుకున్నా." అంటూ భావోద్వేగంగా చెప్పారామె. అంతేగాదు ప్రతి గృహిణి తన కుటుంబాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ.. తను కన్న ప్రతి కలను నిజం చేసుకోగల సత్తా ఆమెకు ఉందని సగర్వంగా చెప్పింది. పైగా తన విజయం ప్రతి మహిళను ప్రేరేపించి అడ్డంకులను చేధించి తన లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుందని పేర్కొంది. కాగా, చరిత్రాత్మకమైన ఈ విజయం భారత్ను గర్వపడేలా చేసిందని మిస్ యూనివర్స్ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు. ఆమెకు ఇన్స్టాలో 2.5 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by UMB PAGEANTS: MISS AND MRS INDIA (@umbpageants) (చదవండి: Karwa Chauth: భార్య కోసం బ్రిటిష్ వ్యక్తి కర్వా చౌత్ ఉపవాసం..! పాపం చంద్రుడి దర్శనం కోసం..) -
‘మిత్ర మండలి’ నిహారిక.. సందడి
దేశంలో అగ్రగామి ఇన్ఫ్లుయెన్సర్ అయిన వర్థమాన నటి నిహారిక ఎన్ఎం (Niharika NM) హైదరాబాద్ నగరంలోని శరత్ సిటీ మాల్లో ఆదివారం సందడి చేశారు. ప్రస్తుతం ‘మిత్ర మండలి’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా అరంగేట్రం చేస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు మరికొద్ది రోజుల్లో రానున్నారు.ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాండెడ్ ఫుట్ వేర్ బాటా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సంస్థ తన కొత్త కలెక్షన్లో భాగంగా ‘బ్రైటర్ మూమెంట్స్’ పేరుతో కొత్త ప్రొడక్ట్ను శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో (Sarath City Capital Mall ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ గేమ్స్, పండుగ పోటీలు నిహారిక ఉత్సాహంగా పాల్గొన్నారు. అభిమానులతో సెల్పీలు దిగుతూ మీట్–అండ్–గ్రీట్ (Meet and Greet) కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: ముద్దుల కోడలితో నీతా అంబానీ.. బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా? -
ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?
MMDiwali ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దివాలీ బాష్లో స్టన్నింగ్ లుక్తో అలరించారు. 61ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా, అందంగా తనదైన ఫ్యాషన్ స్టైల్తో ఆకట్టుకుంటారు. అటు వ్యాపారవేత్తగా రాణిస్తూ, ఫిట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అంతేకాదు మహిళలు 40 ఏళ్లు దాటిన తరువాత కనీసం వ్యాయామం యోగా లాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూమహిళలకు సందేశమిస్తారు. తాజాగా అరుదైన హెర్మేస్ జ్యువెలరీ బ్యాగ్ , కొలంబియన్ ఎమరాల్డ్స్తో సీక్విన్డ్ మనీష్ మల్హోత్రా చీరలో నీతా అంబానీ మరోసారి ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకున్నారు.దీపావళి సమీపిస్తున్న తరుణంలో మనీష్ మల్హోత్రా ఎప్పటిలాగే తన ఇంట్లో బి-టౌన్ సెలబ్రిటీలతో గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు మొత్తం బాలీవుడ్ పరిశ్రమ తరలివచ్చింది. అంబానీ ఫ్యామిలీకి చెందిన అత్తాకోడళ్ల ద్వయం చీరలలో అందరి దృష్టిని ఆకర్షించింది. (మూడు నెలలు ముహూర్తాలు లేవు..నగరానికి పెళ్లి కళ వచ్చేసింది!)బిలియనీర్ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ చైర్మన్,ముఖేష్ అంబానీ భార్య డిజైనర్ నీతా అంబానీ, చిన్నకోడలు రాధికా మర్చంట్తో చీరల్లో ఫెస్టివ్ల్ లుక్లో అదరగొట్టేశారు. ముఖ్యంగా నీతా బ్రైట్ సిల్వర్ వెండి సీక్విన్ సారీ, స్లీవ్లెస్ బ్లౌజ్తో క్లాసిక్ అండ్ ఫెస్టివ్ లుక్లో ఆకట్టుకున్నారు. దీనికి తగ్గట్టు స్పెషల్ హై జ్యువెలరీ కలెక్షన్ అద్భుతమైన ఎమరాల్డ్స్ చెవిపోగులు, వజ్రాల బ్రాస్లెట్తో హైలైట్గా నిలిచారు. ఇంకా తనదైన శైలిలో ధరించిన ప్రత్యేక ఎడిషన్ మినియేచర్ లగ్జరీ బిర్కిన్ మరో హైలైట్. వజ్రాలతో పొదిగి రోజ్ గోల్డ్తో తయారు చేసిన ఈ బ్యాగ్ ధర రూ.17.74 కోట్లు ఉంటుందని అంచనా. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) నీతా వెండి సీక్విన్ చీరను ధరించగా, కోడలు రాధిక ముత్యాలతో రూపొందించిన మనీష్ మల్హోత్రా చీరలో క్లాసీ వైబ్ను పంచారు. డీప్ నెక్లైన్ స్లీవ్లెస్ బ్లౌజ్, ఓపెన్ పల్లుతో స్టైల్ చేసింది. అలాగే అత్తగారిలాగానే తన లుక్కి మ్యాచింగ్ బ్యాగ్ ధరించింది. అత్తగారి చేయి పట్టుకుని నడిచి వచ్చిన తీరు అక్కడున్నవారినందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. -
నటి అనుకుట్టి ఇష్టపడే స్టైలిష్వేర్లు ఇవే..!
శారీలో కొత్త డ్రేపింగ్ స్టయిల్స్ ట్రై చేస్తుంటాను. ఇది శారీకి కొత్త జీవాన్ని ఇస్తుంది. సామాన్యమైన సల్వార్ను కూడా కొత్త శైలిలో ధరించడం ద్వారా ప్రత్యేకతను పొందవచ్చు. నేను ఎల్లప్పుడూ సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తాను. అందుకే, నా చర్మం, జుట్టు సహజంగానే మెరుగ్గా ఉంటాయి. నిజానికి, నా అందం మొత్తం నా సహజత్వంలోనే ఉంది అని చెబుతోంది అనుమోల్అందానికి వయసుతో నిమిత్తం ఉండదనేందుకు నిదర్శనం ఆమె. అందమైన వర్చస్సుతో పాటు నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడే నటి అనుమోల్ ఫాలో అయ్యే స్టయిలింగ్ టిప్స్ నేటి యువతను కూడా ఆకర్షించి, ఫాలో అయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ అనుమోల్ ధరించిన చీరబ్రాండ్: చినాయా బెనారస్, ధర: రూ. 16,658, జ్యూలరీ బ్రాండ్: దీపాలీ డిజైన్స్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.స్టిచ్డ్ జ్యూలరీఆభరణాలు లేకుండా రాయల్టీ లుక్ సాధ్యమేనా? అసాధ్యం అనుకుంటున్నారా? కాని, మీ దగ్గర ఒకే ఒక్క స్టిచ్డ్ జ్యూలరీ బ్లౌజ్ ఉంటే, అసాధ్యాన్ని చాలా సులభంగా సుసాధ్యం చేయగలరు. మెడ చుట్టూ నెక్లెస్లా మెరుస్తూ, చేతులపై వంకీల్లా మెరిసిపోతూ, వెనుకవైపు పెండెంట్లా గ్లామర్ జోడించే ఈ మగ్గం వర్క్ డిజైన్లు, ‘ఎక్కడ హారం? ఎక్కడ గొలుసు?’ అని వెతికే పని, ఇతర అదనపు జ్యూలరీ అవసరం లేకుండా చేస్తాయి. ఎందుకంటే ఆభరణాలే బ్లౌజ్లో దాక్కుని ఉంటాయి. ఒక్క బ్లౌజ్తోనే మీ స్టయిల్ నేరుగా స్టార్డమ్ లెవెల్కి చేరుతుంది. సింపుల్ కలర్ చీరతో కలిపితే మగ్గం వర్క్ మరింత హైలైట్ అవుతుంది, హెయిర్ స్టయిల్ బన్ లేదా సైడ్ ప్లేట్స్ సరిగ్గా సరిపోతుంది. వీటితోపాటు, మినిమల్ మేకప్ అదనంగా అందాన్ని జోడిస్తుంది. అయితే, బ్లౌజ్ ఫిటింగ్ సరిగ్గా ఉంటే, మగ్గం వర్క్ డిజైన్ మరింత ప్రభావవంతంగా కనిపిస్తుంది. దీపిక కొండి(చదవండి: అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్లు ఇవే..!) -
గ్లోబల్ వేదికగా హైదరాబాదీ ఫ్యాషన్
సాక్షి, సిటీబ్యూరో: గ్లోబల్ ఇండియా కోచర్ వీక్లో భాగంగా నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్ హరీష్ అక్కిసెట్టి ప్రదర్శించిన సరికొత్త కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ బ్రైడల్, కోచర్ ఫ్యాషన్లో ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ హరీష్ కలెక్షన్ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించింది. ఈ సందర్భంగా డిజైనర్ హరీష్ అక్కిసెట్టి మాట్లాడుతూ.. టైమ్స్ ఫ్యాషన్ వీక్, ఇండియా ఫ్యాషన్ వీక్ లండన్ వరుసలో ప్రస్తుత గ్లోబల్ ఇండియా కోచర్ వీక్ కూడా హైదరాబాద్ డిజైనింగ్ వైభవాన్ని గ్లోబల్ వేదికగా ప్రదర్శించే అవకాశం కలిగిందని అన్నారు. వెడ్డింగ్ ట్రౌస్సో లైన్తో ఈ కలెక్షన్ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫ్యాషన్ షోలో వాకింగ్ చేస్తూ, బ్యాక్స్టేజ్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న డిజైనర్లతో ప్రయాణం చేసి నగరంలో వినూత్న డిజైనింగ్ స్టైలింగ్ అందించడం కోసం లేబుల్ ప్రారంభించానని హరీష్ వివరించారు. మ్యూజియం జ్యువెలరీ కలెక్షన్ఈ నెల 18 వరకూ అందుబాటులో ప్రదర్శన సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ భారతదేశపు తొలి లగ్జరీ జ్యువెలరీ మ్యూజియం కలెక్షన్ ప్రదర్శన జూబ్లీహిల్స్లో ఏర్పాటైంది. నగరానికి చెందిన వేగ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించిన ఈ ప్రదర్శన అక్టోబర్ 18 వరకూ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన డా.సీహెచ్.ప్రీతిరెడ్డి, ఫిక్కీ ఎఫ్ ఎల్ ఓ చైర్పర్సన్ ప్రతిభా కుందా, ప్రముఖ నటి తేజస్వి మదివాడ, మాల్వి మల్హోత్రా, ప్రాంతికా దాస్ తదితర నగర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఇయర్ చెయిన్స్: ప్రాచీన అలంకరణే ట్రెండీ స్టైలిష్గా
రమణుల ఆభరణాల అలంకరణలో చెవుల నుంచి హెయిర్ వరకులేయర్లుగా చెయిన్ ఉండటం ఫ్యాషన్ మాత్రమే కాదు మన సంస్కృతి, సౌందర్యం, ఆచారం కూడా. దక్షిణ భారతదేశంలో చెంపసరాలు, మాటీలుగా పేరున్న ఈ ఇయర్ చెయిన్స్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సెలబ్రిటీల వరకు ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా మారాయి. ఇటీవల దుర్గా నవరాత్రుల్లో సెలబ్రిటీలు ధరించిన మాటీల అందం నవతరపు చూపులను ఇట్టే కట్టిపడేసింది.ప్రాచీన ఆభరణంగా, అలంకరణలో సంపూర్ణతకు చిహ్నంగా నిలిచే మాటీలు వివాహ వేడుకలలో వధువు సింగారంలో తప్పనిసరై వెలుగొందుతోంది.పండగల రోజులలో ధరించిన డ్రెస్సుల తగిన ట్రెండీ మోడల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. బంగారం, డైమండ్స్లోనే కాదు వివిధ రకాల పూసలు, సిల్వర్, ఆక్సిడైజ్లలోనూ ఈ మాటీల అందం మనసు దోచేస్తుంది. సాంప్రదాయ ఆభరణాలకు మోడర్న్ మెరుపులు జోడించడమే ఈ ఇయర్ చెయిన్స్. ఒకప్పుడు దేవతల విగ్రహాల్లో, అమ్మమ్మల చెవులకు కనిపించిన చెంప సరాలు ఇప్పుడు రన్ వే వేదికలపై అడుగులు వేసే మోడల్స్ చెవుల్లో, మ్యాజిక్ ఫెస్టివల్ లుక్స్లో, బ్రైడల్ ఫొటోషూట్లలో కొత్త శైలిలో మెరిసి΄ోతున్నాయి. దక్షిణ భారతీయ సంప్రదాయాల్లో చెంప సరాలు (ఇయర్ చెయిన్)ఒక ముఖ్యమైన అలంకారం. నాటి కాలంలో మహిళల గౌరవం, ఆభరణ సంపూర్ణతకు చిహ్నంగా వెలుగొందిన చెంప సరాలు రాబోయే వేడుకలలో మరిన్ని ఆకర్షణలను జోడించనున్నాయి.అద్దుకున్న ఆధునికతఈ రోజుల్లో ఆ చెంప సరాలు కొత్త రూపాల్లో కనిపిస్తున్నాయి. సిల్వర్, ఆక్సిడైజ్డ్, మెరూన్ కలర్ పూసలు, ముత్యాల చెయిన్లు, ఫ్యూషన్ ఫ్యాషన్లో కూడా ఇయర్ చెయిన్స్ స్పెషల్ లుక్ ఇస్తున్నాయి. సాదాసీదా కుర్తా మీదకైనా, లెహంగా లేదా చీర ధరించినా ఆభరణాల అలంకరణలో ఇయర్ చెయిన్ అందం జత చేరితే ఆ అందం ఇనుమడిస్తుంది.శక్తి సరాలు..ఇది కేవలం అలంకారం కాదు. చెవులు–జుట్టు ప్రదేశంలో ఈ సరాలు కదలడం మన ప్రాణశక్తిని సమతుల్యం చేస్తుందని చెబుతారు. అందుకే కొంతమంది దీనిని ‘శక్తి సరాలు’గా భావిస్తారు.సెలబ్రిటీల స్టైల్ టచ్బాహుబలి సినిమాలో అనుష్క ధరించిన చెవి జూకాలు, చెంప సరాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. అలాగే, ఇటీవల దుర్గా నవరాత్రుల్లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలబ్రిటీలైన అలియా భట్, జాన్వికపూర్, సోనమ్కపూర్, శోభిత ధూళిపాల, నయనతార... లాంటి నటీమణులు తమ ట్రెడిషనల్ ఫొటోషూట్లలో ఇయర్ చెయి ధరించి ట్రెండ్ సెట్ చేశారు. ఆ లుక్స్ వల్లే ఈ పాత ఆభరణం మళ్లీ యంగ్ జనరేషన్లో పాపులర్ అయింది. పాత ఆభరణానికి కొత్త రూపం దక్కింది. ఇప్పుడు వాటి డిజైన్ , మెటీరియల్, వాడుక అన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త భాషను పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది కళాకారులు రీసైకిల్ మెటల్, హ్యాండ్ మేడ్ ఫ్యాబ్రిక్ థ్రెడ్స్తోనూ వీటిని రూపొందిస్తున్నారు. అమ్మమ్మల నాటి సంప్రదాయ నెమలి, మామిడిపిందెల నుంచి ప్రారంభమైన చెంప సరాల డిజైన్లు ఈ రోజుల్లో ఇయర్ కఫ్స్ వరకు వినూత్నంగా కళ్లకు కడుతున్నాయి. (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
వేలాదిగా బారులు తీరిన మోడల్స్, కేఆర్కే ట్వీట్ వైరల్
ప్రముఖ సినీ క్రిటిక్, నటుడు , నిర్మాత కమాల్ రషీద్ ఖాన్ (కమల్ ఆర్. ఖాన్.Kamaal R. Khan, KRK) వివాదాస్పద ట్వీట్లో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఒక మెగా మోడల్ హంట్ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశాడు బిగ్బాస్ఫేమ్ కమల్ఆర్ఖాన్. ఈ లైన్ చూస్తే ప్రస్తుతం నిరుద్యోగం ఎంత ఉందో అర్థం అవుతుంది అంటూ అక్కడ వేలాదిగా బారులు తీరిన మోడల్స్ను ద్దేశించి కమెంట్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. ఈ పోస్ట్కు 2.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు జెన్ జెడ్ పాపులర్ అవ్వాలని ఎంత పాకులాడుతున్నారో, ధనవంతులుకావాలిన కావాలని ఎంత తహతహ లాడుతున్నారో అనడానికి ఇది నిదర్శనం అంటూ కమెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు కమల్ఆర్ఖాన్ను విమర్శిస్తూ, సమర్ధిస్తూ కమెంట్స్ చేశారు. మోడలింగ్ను కెరీర్గా ఎంచుకునే వారి సంఖ్యలో జెన్-జి యువతులుండటం సానుకూలమే కదా అని కొందరు కొనియాడగా, మరికొందరు ప్యాంటు కూడా కొనుక్కోలేనంత పేదవాళ్లు జెన్-జెడ్ అమ్మాయిలు అంటూమరికొందరు అనుచితంగా వ్యాఖ్యానించారు.This line is for Phoenix Mega Model Hunt. It’s proof, how much unemployment is right now. And it’s proof that how Gen~G are desperate to become famous and rich. pic.twitter.com/lsxwatCpVU— KRK (@kamaalrkhan) October 5, 2025 కాగా ఫీనిక్స్ మెగా మోడల్ హంట్ 2025 ( Phoenix Mega Model Hunt 2025) అనేది బెంగళూరులో జరిగే అతిపెద్ద ఫ్యాషన్ షో. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ ఫ్యాషన్ గురు ప్రసాద్ బిదపా నేతృత్వంలో జరుగుతుంది.ఫ్యాషన్, సంగీతం, కాక్టెయిల్స్ ఈవెంట్స్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న జంటలకు, మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఔత్సాహికులైన యువతీ యువతులు ఈ ఈవెంట్లో పాల్గొని తమ టాలెంట్ను ప్రదర్శిస్తారు. -
డెక్కన్ డెర్బీ–2025 : యురేకా... మలైకా!
సాక్షి, సిటీబ్యూర : రేస్–2 విన్ ఫౌండేషన్ (Race2Win Foundation ) ఆధ్వర్యంలో హైదరాబాద్ రేస్ క్లబ్లో డెక్కన్ డెర్బీ– 2025 (Deccan Derby 2025 ) లో ఫ్యాషన్, రేసింగ్, సేవల మేలు కలయికగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. ఇందులో ప్రముఖ డిజైనర్ ద్వయం రోహిత్ గాంధీ – రాహుల్ ఖన్నా రూపొందించిన ‘ఫ్యాషన్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్’ కలెక్షన్ ప్రదర్శనలో బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) షోస్టాపర్గా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్జున్ బాజ్వా, రెజినా కసాండ్రా, అవంతిక మిశ్రా, నైరా బెనర్జీ తదితర సినీ ప్రముఖులు పాల్గొని వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆనందంగా వుంది.. మలైకా అరోరా మాట్లాడుతూ.. ‘హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉంది. రోహిత్ గాం«దీ, రాహుల్ ఖన్నా డిజైన్ కలెక్షన్ ఆకట్టుకుంది. రేస్–2 విన్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం’ అని అభినందించారు. రేస్–2 విన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై.గోపీరావు మాట్లాడుతూ, ‘డెక్కన్ డెర్బీ 2025 ఘన విజయం సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా రేసింగ్, ఫ్యాషన్, సేవా కార్యక్రమాల సమ్మేళనం అనే వెవిధ్యం సాకారమైంది’ అన్నారు. ఇదీ చదవండి: Director Sukumar టీ కోసం క్యూ కట్టడం చూశా.. -
క్వీన్ ఆఫ్ దాండియాతో నీతా అంబానీ గార్బా స్టెప్పులు : ఉర్రూతలూగిన వేదిక
రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తన నృత్యంతో మరోసారి ఆడియెన్స్ను అలరించారు. అమ్మవారి పూజలు, ప్రార్థనలు మొదలు గర్బా స్టెప్పుల దాకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా దసరా నవరాత్రులు తన చిన్న నాటి అనుభవాలను నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా ఫల్గుణి పాఠక్తో కలిసి స్టెప్పులు వేసిన వీడియో వైరల్గా మారింది.నీతా అంబానీ నేతృత్వంలో ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో దాండియా నైట్ అత్యంత ఉత్సాహంగా నడిచింది. ఈ వేడుకల్లో ఫల్గుణి పాఠక్ భక్తి, పాటలు పాడి భక్తులను ఉర్రూతలూగించారు. ముఖ్యంగా నీతా అంబానీతో కలిసి వేసిన దాండియా విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by Jio World Convention Centre (@jioworldconventioncentre)ముఖ్యంగా నీతా అంబానీ తన బాల్య జ్ఞాపకాలతో పాటు, పాఠక్తో గత పాతికేళ్లుగా తనకున్న సుదీర్ఘ అనుబంధం గురించి మాట్లాడారు. తాను చిన్నప్పుడు, నవరాత్రి తొమ్మిది రాత్రులు నృత్యం చేసేదాన్నని గుర్తు చేసుకున్నారు. దసరా, నవరాత్రి పండుగలు ఎపుడూ తనకు భక్తి ,ఐక్యత, రాత్రి భారతదేశ సాంస్కృతిక గొప్పతనాన్ని గుర్తు చేస్తుందన్నారు. కాగా గుజరాత్లోని సంగీత కుటుంబంలో పుట్టిన ఫల్గుణి పాఠక్ గర్బా , దాండియా డ్యాన్స్లకు పెట్టింది. అందుకే "దాండియా రాణి" అని పేరొందింది. ఎన్నో పాప్గీతాలను ఆలిపించిన ఫల్గుణి తన మధురమైన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెల్చుకుంది. ఇదీ చదవండి: ఈ తప్పు మీరూ చేస్తే.. మీ ఆయుష్షు మూడినట్టే! -
తనిష్క్ మియా 'మానిఫెస్ట్' కలెక్షన్ లాంచ్
ప్రముఖ జ్యయల్లరీ సంస్థ తనిష్క్ కొత్త కలక్షన్ ఆవిష్కరించింది. పండుగ సీజన్ సందర్భంగా మియా 'మానిఫెస్ట్' కలెక్షన్ను లాంచ్ చేసింది. ఈసందర్బంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.ఆధునికత, ఆధ్యాత్మిక ,సమకాలీన డిజైన్తో రాజ సౌందర్యాన్ని మిళితం చేస్తూ సరికొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. మియా ప్యాలెస్ ఆర్చ్లు, పైస్లీ , బంగారంలో కమలం పువ్వు మరియు సహజ వజ్రాలు, ముత్యాలు, సహజ బహుళ-రంగు నీలమణిలు , ఆకుపచ్చ అవెంచురిన్లతో పాటు ఆధునిక డిజైన్లతో ఉత్పత్తులను అందిస్తోంది. చోకర్లు, నెక్లెస్లు, నవరత్నాలు, ఝుమ్కాలు , క్వార్ట్జ్ క్రిస్టల్ మాలాలను అందిస్తుంది, ఇవి పండుగ చక్కదనాన్ని సరసమైన ధరతో మిళితం చేయని కంపెనీ తెలిపింది. దీంతోపాటు వెండి ఆభరణాల కలెక్షన్ను కూడా పరిచయం చేస్తుంది. ఆధునిక ట్విస్ట్తో అపారమైన ధరించగలిగే డిజైన్లు ఉత్సాహభరితమైన దీపావళి వేడుకలు, నవరాత్రి ఉత్సవాలు లేదా ఆలోచనాత్మక బహుమతికి అనువుగా ఉంటాయని సంస్థ తెలిపింది. మియాస్ మానిఫెస్ట్ కలెక్షన్లో చెవిపోగులు, పెండెంట్లు, బ్రాస్లెట్లు, ఝుమ్కాలు, చోకర్, నెక్పీస్లు లాంటివి మరెన్నో మియా స్టోర్లలో లభ్యం.ఆధునిక మహిళల కోసం రూపొందించిన పండుగ గ్లామర్ నుండి ట్రెండ్-ఫార్వర్డ్, స్టైలిష్ డిజైన్లను అందిస్తోందని మియా బ్రాండ్ అంబాసిడర్ అనీత్ పడ్డా వెల్లడించారు. ఈ అద్భుతమైన చోకర్ను ధరించి కనిపించారు.సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 23 వరకు, నిబంధనల మేరకు కస్టమర్లు వజ్రాల ఆభరణాల తయారీ ఛార్జీలపై 100శాతం తగ్గింపు, సాదా బంగారం, రంగు రాతి ఆభరణాల తయారీ ఛార్జీలపై 20శాతం తగ్గింపు లభింస్తుంది నిబంధనలు వర్తిస్తాయి. -
సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?
యువ వ్యాపారవత్త, అంబానీ వారసురాలు ఇషా అంబానీ తన ఫ్రెండ్ పెళ్లిలో స్టైలిష్ దుస్తుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. అలెశాండ్రో మిచెల్ డెబ్యూ వాలెంటినో కలెక్షన్కు చెందిన డిజైనర్ వేర్లో తళుక్కుమంది. ఆత్మవిశ్వాసం, హుందాతనంతో కూడిన అద్భుతమైన అందంతో తన తల్లి నీతా అంబానీలాగానే లగ్జరీ అండ్ ఫ్యాషన్ స్టైల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇషా అంబానీ.క్రీమ్ కలర్, పాస్టెల్ గ్రీన్ కలర్లో, అల్లికలు ,లేయర్డ్ రఫ్ఫ్లే ఎంబ్రాయిడరీ, క్లాసిక్ లగ్జరీగా రూపొందించిన ఈ గౌను ఇషా సహజ సౌందర్యాన్ని హైలైట్ చేశాయి. ఇంకా అద్భుతమైన పూల ఆకారపు డైమండ్ చెవిపోగులు, అందమైన బంగారు బ్రాస్లెట్ , అద్భుతమై సెంటర్ స్టోన్తో డైమండ్ రింగ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.(పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!)ఫ్యాషన్ ఐకాన్ ఇషా అంబానీ తన సన్నిహితులతో వేడుకలకు హాజరైంది. దీని ధర దాదాపు రూ. 5 లక్షలు. అంబానీ ఫ్యామిలీ ఇన్స్టా పేజ్ ఇషా అంబానీ ఫోటోలను షేర్ చేసింది. ఈ వెడ్డింగ్లో ఆమె లుక్ మోడ్రన్ ఫ్యాషన్ అభిరుచిని ఆమె గ్లోబల్ స్టైల్ని సూచిస్తుందంటూ ఫ్యాన్స్ పొగిడేశారు. ఇటాలియన్ లగ్జరీ హౌస్ క్రియేటివ్ కలెక్షన్స్ సంచలనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వాలెంటినో కలెక్షన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.మరోవైపు ఇషా అంబానీకి వాలెంటినో కలెక్షన్ అంటే చాలా ప్రేమ. ఈ లగ్జరీ బ్రాండ్తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో వాలెంటినో లెహంగానే ధరించింది. ఈ ఫ్యాషన్ హౌస్ రూపొందించిన మొదటి లెహంగా ధరించడం, అనేక సందర్భాల్లో ఈ కలెక్షన్ దుస్తులకే ఆమె ప్రాధాన్యత. చదవండి: స్కూలు ప్రిన్సిపాల్ ఇంగ్లీషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్’.. మీరూ చూడండి! కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్-నీతా అంబానీల ఏకైక కుమార్తె ఇషా అంబానీ. ప్రస్తుతం రిలయన్స్రీటైల్ బాధ్యతల్లో విజయ పథంలో దూసుకుపోతోంది. 2018లో డిసెంబర్లో ఆనంద్ పిరమల్ను వివాహం చేసుకుంది ఇషా. ఈ జంటకు ఆదియా శక్తి, కృష్ణ కవల పిల్లలున్నారు. -
పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan ) పారిస్ ఫ్యాషన్ వీక్ (Paris Fashion Week) లో తళుక్కున మెరిసింది. ప్రముఖ భారతీయ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో 51 ఏళ్ల వయసులో కూడా మెరిసిపోయింది .పారిస్ ఫ్యాషన్ వీక్ ఉమెన్స్ రెడీ-టు-వేర్ స్ప్రింగ్-సమ్మర్ 2026 కలెక్షన్లో భాగమైన "లిబర్టే, ఎగలైట్, సోరోరైట్ (లిబర్టీ, ఈక్వాలిటీ, సిస్టర్హుడ్)" షో కోసం గ్లోబల్ బ్రాండ్ లోరియల్ పారిస్ తరపున ఐశ్వర్య రాయ్ ర్యాంప్పై నడిచారు.భారతీయ హస్తకళను ప్రపంచ వేదికకు తీసుకెళ్లిన ఈ గ్లోబల్ ఐకాన్ మరోసారి భారతీయ దుస్తుల వైభవాన్ని చాటి చెప్పారు. View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) ప్రముఖ భారతీయ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన (Manish Malhotra. )అద్భుతమైన బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఇండిగోలో కస్టమ్-మేడ్ ఇండియన్ షేర్వానీలో ఐష్ లుక్ అదిరిపోయింది. మనీష్ మల్హోత్రా తన ఇన్స్టాగ్రామ్లో ఈ దుస్తుల వివరాలను పంచుకున్నారు. ఇది పారిస్ ఫ్యాషన్ వీక్ గొప్పతనాన్ని అందిస్తుందన్నారు. ఈ డిజైనర్ ఈ దుస్తులలో "10-అంగుళాల డైమండ్-ఎంబ్రాయిడరీ కఫ్లు, విలాసవంతమైన నెక్లెస్ లాగా పొడవైన లేయర్డ్ డైమండ్ స్కాలోప్లు, డైమండ్ టాసెల్ డ్రాప్ మరియు డైమండ్-స్టడ్డ్ యానిమల్ బ్రోచెస్" ఉన్నాయి..నటి ధరించిన షేర్వానీలో వజ్రం-స్టడ్డ్ బటన్లతో స్ప్లిట్ నెక్లైన్తో కూడిన ఎత్తైన బంధ్గాలా కాలర్ ఉంది. ప్యాడెడ్ భుజాలు, పూర్తి-పొడవు స్లీవ్లు, సైడ్ మరియు ఫ్రంట్ స్లిట్లు , బాడీ-హగ్గింగ్ సిల్హౌట్ దుస్తులకు ఫ్లేర్డ్ ప్యాంటు ఫిట్ జత చేశారు. వీటితోపాటు ఐశ్వర్య రాయ్ హై హీల్స్, డైమండ్ ఇయర్ స్టడ్లు మరియు స్టేట్మెంట్ డైమండ్ రింగులను ధరించారు. ఆమె జుట్టును వదులుగా వదిలి, ఆమె సిగ్నేచర్ స్టైల్లో ఒక వైపున విడదీసి, తన దుస్తులకు ఆర్కిటెక్చరల్ బోల్డ్నెస్కు రొమాంటిక్ టచ్ను జోడించి మరింత గ్లామర్గా మెరిసారు. -
10 కేజీల బంగారంతో డ్రెస్..! ఎక్కడంటే..
బంగారం రేటు ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. కొనాలంటే.. గుండెల్లో గుబులు తెప్పించేలా ధర పలుకుతోంది. సామాన్యుడు సైతం బెంబేలేత్తెలా ఉంది. అలాంటిది అక్కడ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో దుస్తులు రూపొందించారట. పైగా దాని ధర వింటే కచ్చితంగా నోరెళ్లబెడతారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేయండి మరి...సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తులను రూపొందించి సరి కొత్త చరిత్ర సృష్టించింది. 'దుబాయ్ డ్రెస్' పేరుతో రూపొందించిన ఈ gold dress గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. పూర్తిగా 21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. దీని మొత్తం బరువు 10.0812 కిలోగ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ. 11 కోట్లు పైనే ఉంటుందని అంచనా. కేవలం బంగారం ధర కారణంగానే కాకుండా కళాత్మకంగా రూపొందించిన విధానం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అల్ రోమైజాన్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ ఈ డ్రెస్ని బంగారు కిరీటం(398 గ్రాములు), నెక్లెస్ (8,810.60 గ్రాములు,) చెవిపోగులు (134.1 గ్రాములు), తల అలంకరణ (738.5 గ్రాములు) బంగారంతో భాగాలుగా రూపొందించింది. ఆ తర్వాత ఈ భాగాలను మొత్తం కలిపి దుస్తుల రూపంలో ప్రత్యేకంగా ధరించేలా డిజైన్ చేసింది. ఇందులో కేవలం బంగారమే కాకుండా రంగురంగుల విలువైన రత్నాలను కూడా ఉపయోగించింది జ్యువెలరీ కంపెనీ. క్లిష్టమైన ఈ డిజైన్ని అత్యంత నాజుగ్గానూ, ఎమిరేట్స్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించింది. ఇందులోని ప్రతి నమునా చరిత్రకు అర్థంబట్టేలా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఈ డ్రెస్ ఆధునికత, చరిత్ర తోపాటు సృజనాత్మకతను ప్రతిబింబిస్తోంది. ఈ దుస్తుల డిజైన్ ప్రధాన ఉద్ధేశ్యం బంగారం, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ గమ్యస్థానంగా ఉన్న దుబాయ్ను మరింతగా బలపరచడమేనని సదరు జ్యువెలరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దుస్తులు షార్జాలో జరుగుతున్న 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో 500కిపైగా ప్రదర్శకులు పాల్గొంటారు. అందులో ఇటలీ, భారతదేశం, టర్కి, అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా దేశాల జ్యువెలరీ డిజైన్లర్లు , తయారీదారులు పాల్గొంటారు. కాగా, ఈ షోలో తొలిసారిగా ఆస్ట్రేలియా, మయన్మార్, పాకిస్తాన్ దేశాల డిజైనర్లు, తయారీదార్లు కూడా పాల్గొనడం విశేషం.(చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
ఫెస్టివ్ ఫీవర్ : విక్రయాల జోరు
సాక్షి, సిటీబ్యూరో: పండుగ సీజన్ విక్రయాల్లో గృహోపకరణాలు, పురుషుల దుస్తులు, పాదరక్షలు ముందు వరుసలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫ్యాషన్కే ఎక్కువ డిమాండ్ ఏర్పడిన విషయాన్ని ప్రముఖ ఆన్లైన్ విపణి ఫ్లిప్కార్ట్ షాప్సీ అధ్యయనం వెల్లడించింది. గృహావసర వస్తువులకు డిమాండ్ 108% పెరిగిందనీ, పురుషుల సాధారణ దుస్తులు, పాదరక్షల విక్రయాలు 95% పెరిగాయనీ తెలిపింది. మహిళల కుర్తా, ప్యాంట్ సెట్లు, ఇయర్బడ్స్, పురుషుల అనలాగ్ గడియారాలు అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులుగా నిలిచాయని తేల్చింది.(చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే) జెన్ జెడ్గా పేర్కొంటున్న నవ యువ తరం ప్రధానంగా గ్రూమింగ్, ఫ్యాషన్, దుస్తులపై దృష్టి పెట్టగా, మిలీనియల్స్ (నేటి తరం) గృహ అవసరాలు, ఫ్యాషన్కు ప్రాధాన్యత ఇవ్వడం 60% అమ్మకాలకు దోహదపడిందని, మొత్తం ఆర్డర్లలో 57%తో మహిళా కొనుగోలుదారులు టాప్లో నిలిచారని వెల్లడించింది. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ -
ప్రతిదీ యుద్ధమే!
ఫ్యాషన్ రంగంపై ఇష్టంతో చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ను వదిలేసి, తనదైన డిజైన్ శైలిని దుస్తులపైన చూపుతున్నారు మాదాపూర్లో ఉంటున్న కావ్యారెడ్డి. నేత కార్మికులతో కలిసి వింటేజ్, క్రియేటివ్ డిజైన్స్ని రూ పొందిస్తున్నారు. వారి జీవనశైలిపైన డాక్యుమెంటరీ రూ పొందించారు. చిత్రకారిణిగా, శాస్త్రీయ నృత్యకారిణిగా, యోగా ట్రైనర్గానూ రాణిస్తున్న కావ్య ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లనూ,వాటిని తాను ఎదుర్కొంటున్న తీరును ఇలా వివరించారు.‘‘చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం. ఫ్యాషన్ని కెరీర్గా మార్చుకోవాలని చాలా ప్రయత్నించాను. కానీ, బీటెక్ అయ్యాక సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగిగా మారి పోయాను. నా సొంత సం పాదనతో డిజైనింగ్ రంగంలోకి రావాలని ఆలోచన. దాంతో ఉద్యోగిగా ఉన్నా నాదైన సొంత డిజైన్స్ను ప్లాన్ చేస్తూనే ఉన్నాను. ఉద్యోగినిగా మంచి పొజిషన్లో ఉన్నా అది మానేసి, ఫ్యాషన్ కాలేజీలో స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. కోర్సు పూర్తయ్యాక ఒక ఫ్యాషన్ కంపెనీలో ఉద్యోగినిగా చేరి, కమర్షియల్గా మన ఆలోచనలను ఎలా తీసుకువెళ్లాలో నేర్చుకున్నాను. కెమెరా, గ్రాఫిక్స్, డిజిటల్ మార్కెటింగ్.. ఇవన్నీ నేర్చుకొని మూడేళ్ల క్రితం ‘సఖ్య’ పేరుతో నా సొంత బ్రాండ్ను ప్రారంభించాను.రీల్.. రియల్..కాబోయే వధూవరుల డ్రెస్సింగ్కి మా డిజైన్ స్టూడియోకి వస్తారు. వారి స్కిన్ టోన్, హైట్.. దృష్టిలో పెట్టుకొని వివిధ రకాల మోడల్ డ్రెస్సులతో మా దగ్గరే ఒక ర్యాంప్వాక్ చేయిస్తాను. దానిని కెమెరాలో రికార్డ్ చేసి, ఇస్తాను. అదేవిధంగా రియల్గా ఎలా ఉన్నారో 3 మిర్రర్ కాన్సెప్ట్తో చూపిస్తాను. దీంతో సరైన ఫిటింగ్, డిజైన్, కలర్.. ఇవన్నీ చూసుకొని వారు సంతృప్తి చెందితేనే డిజైన్ చేసి ఇస్తాను.మరిన్ని డిజైన్ల కోసం..ఆర్గానిక్ వైట్ క్లాత్ తీసుకొని, ఆర్గానిక్ డైస్తో మా ప్రత్యేకమైన డిజైన్స్ వేయిస్తాను. వాటిని డెవలప్ చేసి, ఆ డిజైన్స్ని ఉపయోగిస్తాం. డిజైన్కి రెప్లికా లేకుండా చూడటమే మా ప్రత్యేకత. సినీతారలు, అవార్డు ఫంక్షన్లకు నా డిజైన్స్ వెళుతుంటాయి. ఫ్యాషన్ కాలేజీలలో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడమూ చేస్తుంటాను. ఈ రంగంలో చూపుతున్న ప్రతిభకు అవార్డులూ అందుకున్నాను. వచ్చిన ఆర్డర్ను టైమ్ ప్రకారం ఇవ్వడం ఒక పెద్ద టాస్క్. దీంట్లో మెటీరియల్, వర్కర్స్, డబ్బును తిరిగి రాబట్టుకోవడం, మెయింటెనెన్స్... ప్రతిదీ యుద్ధమే. స్త్రీ ఎదగాలని చేసే ప్రతి ప్రయత్నంలో అన్నింటా అడ్డంకులు ఉంటాయి. ఇన్నింటిలో నా సొంత ఆసక్తులను వదలుకోను. పెయింటింగ్స్ వేస్తుంటాను. శాస్త్రీయ నృత్యంలో సాధన చేస్తుంటాను. యోగా ట్రైనర్గా క్లాసులు తీసుకుంటాను’’ అంటూ ఈ జీవన యుద్ధంలో తన పోరాట పటిమను పెంచుకుంటున్న తీరును వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిమన చేనేతలుగద్వాల్, పోచంపల్లి, ధర్మవరం.. ఒక్కో హ్యాండ్లూమ్కి సంబంధించి పది చీరలు స్పెషల్గా డిజైన్ చేస్తాను. వాటి ప్రింట్లు, డిజైన్ ప్రత్యేకంగా క్రియేట్ చేస్తాను. చేనేత కారుల జీవన విధానంపైన డాక్యుమెంటరీ చేశాను. వారిలో ఎంతో సృజన ఉంది. అయితే వారు చెప్పేదేమంటే–‘మేం మా ప్రాణం పెట్టి రోజులు, నెలలు కష్టపడి ఒక చీర డిజైన్ చేస్తాం. అలాంటిదే నార్త్ నుంచి రెప్లికాలు తెచ్చి, మా జీవనో పాధిని దెబ్బతీస్తున్నారు’ అనే బాధను వ్యక్తం చేశారు. -
మిలన్ ఫ్యాషన్వీక్ : రొటీన్గా కాకుండా బోల్డ్ లుక్లో మెరిసిన ఆలియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ డెమ్నా లేటెస్ట్ కలెక్షన్ లాంచింగ్ వినూత్నంగా కనిపించింది. తన సాధారణ స్టైల్కి భిన్నంగా మిలాన్ ఫ్యాషన్వీక్ 2025(Milan FashionWeek)లో అందరి దృష్టినీ అలరించింది. గూచీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ (Gucci global brand ambassador) ఆలియా ఫర్ కోట్లో హాట్ లుక్స్లో అదరగొట్టింది.ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ గూచీ క్రియేటివ్ డైరెక్టర్ డెమ్నాతొలి కలెక్షన్ను ప్రదర్శించిన సినిమాటిక్ దృశ్యం ది టైగర్ ప్రత్యేక చలనచిత్ర ప్రదర్శనకు హాజరైంది. బోల్డ్ దుస్తులను పాయింటెడ్-టో బ్లాక్ హీల్స్,టాప్ హ్యాండిల్ , చైన్ స్ట్రాప్తో కూడిన చిన్న, స్ట్రక్చర్డ్ బ్లాక్ లెదర్ హ్యాండ్బ్యాగ్ లుక్ను సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by GUCCI (@gucci) ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత స్పైక్ జోన్జ్ , మేటి దర్శకురాలు హలీనా రీజ్న్ దర్శకత్వం వహించిన ఆకర్షణీయమైన లఘు చిత్రం ‘ది టైగర్’ ప్రీమియర్ ద్వారా గూచీ సినిమా , హై ఫ్యాషన్పై తన నిబద్దతను చాటుకుంది. ఈ ప్రీమియర్లో ఆలియా గూచి లా ఫామిగ్లియా లెక్షన్ను ఆవిష్కరించింది.ఈ సందర్భంగా నెక్లైన్తో కూడిన మినీ డ్రెస్కి ఫాక్స్ ఫర్ కోట్ లుక్ మరింత అందాన్నిచ్చింది. స్టేట్మెంట్ GG చెవిపోగులు , గూచీ వెదురు బ్యాగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) ఈ సందర్భంగా డిసెంబర్ 25, 2025న విడుదల కానున్న తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆల్ఫా’ గురించి అలియా ఒక అప్డేట్ను అందించింది. విడుదల గురించి నటి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. అయితే, ఇది నా తొలి యాక్షన్ వెంచర్,ప్రేక్షకులు దానితో ఎలా కనెక్ట్ అవుతారో అని ఆసక్తిగా ఉన్నానని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యపై అభిమానులు భిన్నంగా స్పందించారు.ఆలియా ఇప్పటికే జిగ్రా ,హార్ట్ ఆఫ్ స్టోన్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించిందిగా అని కొంతమంది నెటిజన్లు ప్రతిస్పందించారు. -
అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్ను కట్టిపడేసి : జాన్వీ అమేజింగ్ లుక్
ముంబైలో జరిగిన హోమ్బౌండ్ స్పెషల్ స్క్రీనింగ్లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చాలా ప్రత్యేకంగా కనిపించింది. తన తల్లి, దివంగత లెజెండరీ నటి శ్రీదేవి చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది తన రాబోయే చిత్రం హోమ్బౌండ్ ప్రత్యేక షోలో ఒకపుడు శ్రీదేవి ధరించిన నేవీ (రాయల్ బ్లూ ) బ్లూ చీర, జాకెట్టులో తళుక్కున మెరిసింది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ,విరాట్ కోహ్లీ వివాహ రిసెప్షన్లో శ్రీదేవి ఈ చీరను ధరించారు. అదే చీరలో అద్భుతమైన తన లుక్తో జాన్వీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.బంగారు ఎంబ్రాయిడరీతో రూపుదిద్దుకున్న ఈ నేవీ బ్లూ చీరకు బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్తో జత చేయగా, స్టేట్మెంట్ చెవిపోగులు, చోకర్-స్టైల్ నెక్లెస్ , సొగసైన బన్తో లుక్ను పూర్తి చేసింది. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోమ్బౌండ్ 2026 ఆస్కార్లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీ అని ప్రకటించిన తర్వాత ఈ ప్రీమియర్ షోకు మరింత ప్రాధాన్యత ఒనగూడింది.ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ చిత్రాన్ని 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా దేశ పోటీదారుగా ప్రకటించింది. ఈ చిత్రం గతంలో 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) మరియు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM)లలో ప్రదర్శించబడింది. ఇది సెప్టెంబర్ 26న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
అదిరే ఫ్యాషన్ లుక్ : దాండియా ధడక్
నవరాత్రులలో దాండియా ఆటలు గర్భా నృత్యాలు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేలా ఉంటాయి. ఈ ఆటపాటలలో పాల్గొనే వారు మరింత సౌకర్యంగా ఉండేలా చూపరులకు కనువిందు చేసేలా... ప్రత్యేక డ్రెస్సులూ ఉంటాయి. ముదురు రంగులు, అద్దాల మెరుపులు, ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాలు, ధోతీ ప్యాంట్స్కి ఆధునికపు హంగుల అమరిక ఈ రోజుల్లో ముచ్చట గొలుపుతుంటాయి. నవరాత్రి గర్భా, దాండియా రాత్రుల కోసం ట్రెండీ దుస్తుల ఆలోచనలు నవతరాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వైపుగా నడిపిస్తున్నాయి. ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్తో అలంకరించిన రంగురంగుల చనియా చోళి దుస్తులను స్టైల్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి.ధోతీ ప్యాంటుతో క్రాప్ టాప్ మిర్రర్,ఎంబ్రాయిడరీ చేసిన క్రాప్ టాప్, ధోతీ ప్యాంటు కలయిక కంఫర్ట్ స్టైల్తో ఆకట్టుకుంటుంది. దాండియా ఆడటానికి అనుకూలంగా ఉండే ఈ డ్రెస్ కాన్ఫిడెన్స్నూ ఇస్తుంది. ఫ్యాషన్ లుక్ కోసం ధోతీ ప్యాంటును కొత్త క్రాప్ టాప్తో తిరిగి వాడచ్చు.లెహెంగా అసెమెట్రికల్ కుర్తీఅసెమెట్రికల్ కుర్తీలు వేడుకలకు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఫ్లేర్డ్ లెహెంగాతో జత చేస్తే చూపుతిప్పుకోలేరు. ఒక డైనమిక్ ఎలిమెంట్ను జోడిస్తుంది. పండుగ సీజన్లో స్పెషల్ లుక్ కోరుకునేవారికిది బెస్ట్ ఆప్షన్. ప్యాంటుతో సైడ్ స్లిట్ కుర్తీసంప్రదాయ దుస్తులకు ఆధునిక టచ్ను ఇష్టపడే వారికి సైడ్ స్లిట్ కుర్తీ సరైన ఎంపిక. ఇది ప్లెయిన్, ఎంబ్రాయిడరీ లేదా బ్రోకేడ్ బోర్డర్లతో డిజైన్ చేసిన ప్యాంటుతో, లెహెంగా కాంబినేషన్గా ధరించవచ్చు.లెహెంగాతో మిర్రర్ డెనిమ్ షర్ట్ఇండో–వెస్ట్రన్ లుక్ కోసం లెహెంగాతో డెనిమ్ షర్ట్ను జత చేయచ్చు. ఈ ఇండో–వెస్ట్రన్ లుక్ వివిధ రకాల ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే వారికి సరైనది. క్లాసిక్ లెహెంగా, క్యాజువల్ డెనిమ్ షర్ట్ మరింత కంఫర్ట్గా ఉంటుంది, ఇది నవరాత్రుల్లో ప్రత్యేకంగా చూపుతుంది. సొంతంగా క్రియేషన్ పెద్ద పెద్ద జూకాలు, గాజులు, లేయర్డ్ నెక్లెస్లు.. జర్మన్ సిల్వర్ జ్యువెలరీని ఎంచుకోవచ్చు నృత్యం చేసే సమయం కాబట్టి వాటర్ ప్రూఫ్ మేకప్ను ఎంచుకుంటే లుక్ ఫ్రెష్గా ఉంటుంది. పెద్ద పెద్ద బిందీలు నవరాత్రి రోజులలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. పొడవాటి జడలు, వివిధ మోడల్స్లో ఉన్న ముడులు, వదులుగా ఉండే హెయిర్ స్టైల్స్ బాగుంటాయి. బోహో– ఫ్యూజన్ కాంబినేషన్లో డెనిమ్ డ్రెస్లు పగటి పూట కూడా ఈ రోజుల్లో క్యాజువల్గా ధరించవచ్చు. సంవత్సరాలుగా లెహంగాలు, ఘాగ్రాలు నవరాత్రి దుస్తులుగా ఉన్నాయి కాబట్టి స్కర్టులు, కుర్తీల నుండి లేయర్డ్ ఇండో–వెస్ట్రన్ గౌన్ల వరకు ఈ రోజుల్లో ప్రయత్నించవచ్చు. ∙రంగురంగుల టాసెల్స్, రాజస్థానీ ఎంబ్రాయిడరీ ప్యాచ్లు, మిర్రర్ వర్క్ ఉపయోగించి పండగ థీమ్ను క్రియేట్ చేయవచ్చు. నవరాత్రి స్పెషల్ డ్రెస్సులు దాదాపు రూ.1500/– నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. లేదంటే ఇంట్లోనే డిజైనరీ క్రాప్ టాప్, బ్లౌజ్ లేదా చిన్న కుర్తీతో జత చేయబడిన డెనిమ్ బాటమ్స్ ధరిస్తే డ్యాన్స్ చేసేవారికి తాజా, ఉల్లాసభరితమైన వైబ్ను జోడిస్తాయి. పండుగ అలంకరణ కోసం దుప్పట్టా లేదా బాందిని స్టోల్ లేదా టై–డై ప్రింట్లతో స్టైల్ చేయచ్చు. నవరాత్రి ఫ్యాషన్ అనేది వ్యక్తిగత వ్యక్తీకరణతో సంప్రదాయాన్ని కళ్లకు కట్టవచ్చు. వాటిని మార్కెట్లో కొనుగోలు చేసినా, సొంతంగా తమదైన స్టైల్ను క్రియేట్ చేసినా, బోహో–ఫ్యూజన్ డ్రెస్సులు డ్యాన్స్ ఫ్లోర్పై హంగామా చేస్తాయి. ఈ పండుగ సీజన్లో సాధారణంగా కాకుండా తమదైన సొంత సృజనాత్మకతను సరికొత్తగా పరిచయం చేయచ్చు.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు! -
2025 టు 1990
గూగుల్ జెమిని నానో బనాన ట్రెండ్ హవా కొనసాగుతుండగానే మరోవైపు నానో బనాన ఏఐ శారీ ట్రెండ్ మొదలైంది. మహిళా యూజర్లు జెమిని నానో బనాన ఇమేజ్ ఎడిటింగ్ టూల్ను ఉపయోగించి తమ సెల్ఫీలను 90 దశకం డ్రామటిక్ బాలీవుడ్–స్టైల్ ప్రోర్ట్రయిట్స్లోకి మార్చడమే... బనాన శారీ ట్రెండ్.ఏఐ ప్రాంప్ట్లతో అలనాటి అద్భుత చీరలలో మెరిసిపోవడమే బనాన ఏఐ శారీ ట్రెండ్ ప్రత్యేకత.ఈ ట్రెండ్ పుణ్యమా అని 90 దశకంలోని పాపులర్ స్టైల్స్..పోల్కా–డాట్ డిజైన్, బ్లాక్ పార్టీ–వేర్ శారీ, సాఫ్ట్ ఫ్లోరల్ యాక్సెంట్లు మళ్లీ కనువిందు చేస్తున్నాయి.మీరు కూడా ఈ ట్రెండ్లో భాగం కావాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి...∙జెమిని చాట్జీపీటీలో లాగిన్ కావాలి ∙ట్రై ఇమేజ్ ఎడిటింగ్–క్లిక్ చేయాలి. ∙క్లీయర్ సోలో ఫోటోను అప్లోడ్ చేయాలి. ∙బ్లాక్ శారీ, వైట్పోల్కా డాట్....మొదలైన వైరల్ ్రపాంప్ట్స్లో ఒకదాన్ని పేస్ట్ చేయాలి. ∙రెట్రో శారీపోర్ట్రయిట్ క్షణాల్లో కళ్లముందుంటుంది. -
బీటౌన్ ఈవెంట్లో స్పెషల్ ఎట్రాక్షన్గా నీతా అంబానీ
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్(Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. తన తొలి ప్రాజెక్ట్గా "The Bads of Bollywood" అనే సాటిరికల్ యాక్షన్ డ్రామా (సెప్టెంబర్ 18) నుంచి స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన స్టార్-స్టడెడ్ స్క్రీనింగ్ ఈవెంట్లో అనేక మంది ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా ఫ్యాషన్ ఐకాన్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ (Nita Ambani) అందరి దృష్టిని ఆకర్షించారు. తన స్టైలిష్ లుక్తో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు.ఈవెంట్కి తగినట్టు డైమండ్ నగలు,అద్భుతమైన చీరలు, అందానికి మించిన హందాతనంతో ప్రతీ ఈవెంట్లోనూ నీతా అంబానీ ప్రత్యేకంగా నిలుస్తారు. తాజాగా ఈవెంట్లో ఆమె దుస్తులుఅందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె ధరించిన పచ్చని అద్భుతమైన హారమే ప్రత్యేకంగా నిలవడం విశేషం.నీతా అద్భుతమైన పరాయిబా, హృదయాకారపు వజ్రాల డబుల్ స్ట్రింగ్, వజ్రాల హారాన్ని ధరించారు. హృదయ ఆకారపు స్టడ్ చెవిపోగులు, సరిపోలే ఉంగరం ,సున్నితమైన డైమండ్ బ్రాస్లెట్తో తన లుక్ను మరింత ఎలివేట్ చేశారు. అలాగే ఈ హారానికి పొదిగిన టైటానియం ఫ్లవర్ పీస్మరింత ఆకర్షణీయంగా నిలిచింది. దీనికి మ్యాచింగ్ కలర్లో ఆమె ధరించిన చీర నీతా అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది.అనన్య పాండే, కరణ్ జోహార్, ఫరా ఖాన్, బాబీ డియోల్, అలియా–రణ్బీర్, విక్కీ కౌశల్ మరియు అనేక మంది స్టార్-స్టడెడ్ సాయంత్రం హాజరయ్యారు. సందడిగా సాగిన ఈ స్క్రీనింగ్ ఈవెంట్లో అంబానీ ఫ్యామిలీ మరో ఎట్రాక్షన్. సెలబ్రిటీలతో పాటు, అంబానీలు కూడాను అందంగా తీర్చిదిద్దారు. నీతా అంబానీ తన భర్త ముఖేష్ అంబానీ చేతిలో చేయి వేసి, రెడ్ కార్పెట్పై పోజులిచ్చారు. ఇంకా ఆకాష్ రాధిక , శ్లోకా, ఇషా అంబానీ మెరిసారు. ఆకాష్ అంబానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) గ్రాండ్ ప్రీమియర్ కోసం, రాధిక బోల్డ్ రెడ్ స్ట్రాప్లెస్ గౌను ధరించి, డైమండ్ నెక్లెస్ మరియు బ్రాస్లెట్తో పాటు చిన్న రెడ్ క్లచ్ బ్యాగ్తో తన లుక్ను అలంకరించింది. శ్లోకా షీర్ కార్సెట్-స్టైల్ బాడీస్ , భారీ ప్యాట్రన్డ్ స్కర్ట్తో కూడిన నేవీ-బ్లూ గౌనును ఎంచుకున్నారు, ఆకాష్ క్లాసిక్ బ్లాక్ వెల్వెట్ టక్సేడోలో చాలా అందంగా కనిపించారు. -
సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్గా..ప్రధాని మోదీ డ్రెస్సింగ్ స్టైల్
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేగాదు ఆ పార్టీ శ్రేణులు తమ ప్రియతమ నేత పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు కూడా. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్లోని థార్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ మోదీ వేదికపైకి రాగానే ఆ రాష్ట్ర సాంస్కృతికి అద్దం పట్టే గులాబీ రంగు తలపాగా(పగ్డి), జాకెట్ను బహుకరించారు. ఆ పగ్డిపై(తలపాగ) క్లిష్టమైన బంగారం, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేయడగా, బంజారా సమాజం శక్తిమంతమైన చేతి పనికి నిదర్శనం జాకెట్పై లంబానీ ఎంబ్రాయిడరీ ఉంది. వీటితోపాటు ధార్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్త్రం పై సహజరంగులతో కూడిన రేఖాగణిత నమునాలు ఉన్న స్కార్ఫ్ను కూడా మోదీకి బహుకరించారు. ఇది ఆయన 75వ పుట్టినరోజు అయినప్పటికీ తన సిగ్నేచర్ శైలికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రజలు ఇచ్చిన అభిమాన బహుమతులు, దుస్తుల కారణంగా మోదీ డ్రెస్సింగ్ స్టైల్ సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ముఖ్యంగా ఆ కానుకలతో మోదీ లుక్లో మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆయన ఈ పుట్టినరోజుని పీఎం మిత్ర పార్కుకి పునాది రాయి వేయడం, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ ఆరోగ్య పథకాల ప్రారంభంతో జరుపుకోవడం విశేషం. ఇక ఆ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..స్వావలంబన చర్య తీసుకోవాలనే పిలుపునిస్తూ ప్రసంగించారు. "ఇది పండుగల సమయం. మన స్వదేశీ ఉత్పత్తుల మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉండాలి. 140 మంది కోట్ల భారతీయులు ఏది కొనుగోలు చేసినా..అది మేడ్ ఇన్ ఇండియాగానే ఉండాలని అభ్యర్థిస్తున్నా. వికసిత్ భారత్కు మార్గం వేసి, ఆత్మనిర్బర్ భారత్గా ముందుకు సాగాలన్నారు. ఎప్పుడైతే మనం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామో, అప్పుడూ డబ్బు మన దేశంలోనే ఉంటుంది, పైగా ఆ డబ్బుని అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చని అన్నారు. అలాగే మహేశ్వరి చీరలు, పీఎం మిత్రా పార్క్ ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ పట్టు, పత్తి లభ్యత, నాణ్యత తనిఖీలు, సులభమైన మార్కెట్ యాక్సెస్ వంటివి నిర్ధారిస్తారని అన్నారు. దాంతోపాటు స్పిన్నింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి అన్నీ ఒకే చోట జరుగుతాయని చెప్పారు. అదీగాక ఈ చీరలు, వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేస్తూ, దేవి అహల్యాబాయి హోల్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి..మన మాతృభూమిని ప్రపంచ మార్కెట్లో ప్రకాశవంతంగా మెరిసేలా చేయగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. .(చదవండి: ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్ మంత్రి..! ఎందుకోసం అంటే..) -
మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..!
కలలకు ఆకాశమే హద్దు అనడానికి ఉదాహరణ డిజైనర్ సౌరభ్ పాండే. ఉత్తర్ప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన అతని పేరు ఈరోజు ప్రపంచ ఫ్యాషన్ వేదికలపై వినిపిస్తోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు, తన కలలకోసం కష్టపడుతూ, పట్టుదలతో ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ ప్రత్యేకతను చూపుతున్నాడు.స్కూల్ కెళ్లే సమయంలోనే సౌరభ్కి డ్రాయింగ్, డిజైన్స్ పై ప్రత్యేక ఆసక్తి. పాత బట్టలను కొత్తగా కట్ చేసి, రంగులు కలిపి, తన గ్రామంలోనే చిన్న చిన్న డిజైన్స్ చేస్తూ, ‘ఫ్యాషనః అంటే ఏంటి?’ అనే ప్రశ్నకు తన స్టైల్లో సమాధానం చెప్పేవాడు.సవాళ్లే అవకాశాలకు మార్గంఉన్న ఆ చిన్న ఊళ్లో అవకాశాలు లేవు. ఫ్యాషన్ కోర్సులు, స్టడీ మెటీరియల్, ఫ్యాబ్రిక్ అందనంత దూరంలో ఉన్నాయి. అయినా అతని కృషి ఆగలేదు. నీరసపడలేదు. పేపర్పైన స్కెచ్లు వేసి, సోషల్ మీడియాలో తన టాలెంట్ను ప్రదర్శించాడు. అదే అతనికి పెద్ద అవకాశాలు తెచ్పిపెట్టింది.అంతర్జాతీయ బ్రాండ్ల దృష్టిసౌరభ్ పనిని గమనించిన ప్రతిభావంతులు అతన్ని మొదట స్థానిక ఈవెంట్లలో ΄ాల్గొనమని ఆహ్వానించారు. అటు నుంచి 17 ఏళ్ళ వయసులో అతన్ని ముంబై వైపుగా నడిపించింది. ఆ మహా నగరంలో మనుగడ కష్టమే. ఒక చిన్న ఇల్లు లాంటి గదిలో తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఉండేవాడు. ఇల్లు గడవడం కోసం ఒక మాల్లో 12 గంటలు షిఫ్టులో పనిచేస్తూ, రాత్రిళ్లు ఫ్యాషన్ డిజైన్లు గీస్తూ వాటిని సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను తన పరిస్థితుల కంటే పెద్ద లక్ష్యాన్ని చాలా ఏకాగ్రతతో నడిపించాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సౌరభ్ పనిని గమనించినప్పుడు అతని జీవితం గొప్ప మలుపు తిప్పింది. ఒక అవకాశం మరికొన్ని మార్గాలను చూపించింది. అక్కడి నుంచి అతని డిజైన్లు గూచీ, డియోర్, ప్రాడా వంటి ప్రపంచ లగ్జరీ బ్రాండ్ల దృష్టికి వచ్చాయి. ఇప్పుడు అతను ఈ ఫ్యాషన్ హౌస్లతో కలసి ప్రత్యేక కలెక్షన్లు రూపొందిస్తున్నాడు.స్టైల్ ప్రత్యేకతభారతీయ సంప్రదాయ బట్టల టెక్స్చర్స్కి ఆధునిక డిజైన్ల కలయిక, నేచురల్ కలర్స్, ఎకో–ఫ్రెండ్లీ ఫాబ్రిక్ల వాడకం, సింపుల్ కట్లు, గ్లోబల్ లుక్ .. ఈ ప్రత్యేకతలు అతన్ని అందరిలో ముందుంచుతున్నాయి. ఫ్యాషన్ వేదికల మీద అతని డిజైన్స్ ప్రదర్శించేంతగా వెళ్లింది. సోషల్ మీడియాలో అతని విచిత్రమైన వీడియోలకు ఎగతాళి చేసిన జనమే, ఆ తర్వాత అవే వీడియోలకు కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. తిరస్కరణ, ఎగతాళి నుండి ఇప్పుడు అతను కోట్లు సంపాదించేంతగా ఎదిగాడు. తన కథను తానే తిరగ రాసుకున్నాడు. అతన్ని సక్సెస్ గురించి అడిగితే ‘ఎవ్వరు ఏమనుకున్నా నేను నాలా ఉండటమే నాకు ఇష్టం. అదే నా నిజమైన ఫ్యాషన్ స్టేట్మెంట్’ అంటాడు. మారుమూల గ్రామాల యువతకు సౌరభ్ ఒక స్ఫూర్తి. ‘కల అంటే పెద్దది కావాలి. మన దగ్గర వనరులు లేకపోయినా, కష్టపడితే ప్రపంచమే మన దారికి రావచ్చు’ అని అతను చెప్పే సందేశం ప్రతి యువకుడిలో కొత్త ఆశను నింపుతోంది. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
నన్హీ పరీ
ఈ రోజుల్లో పిల్లలందరూ ప్రతిభాఘనులే! అయితే చదువు ఒత్తిడిలో అది మసకబారుతోంది! అలాంటి పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు తమ ప్రజ్ఞను ప్రదర్శించడానికి భువనేశ్వర్లోని కిట్స్ (కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వేదిక కల్పిస్తోంది.. ‘నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా’ పేరుతో!ఈ పోటీల్లో పదమూడేళ్ల నుంచి పదిహేనేళ్ల బాలికలందరూ పాల్గొనవచ్చు! విజేతలకు క్యాష్ప్రైజ్తోపాటు గెలుపొందిన స్థానాన్ని బట్టి కిట్స్లో తమకు ఇష్టమైన కోర్స్లో ఉచిత, భారీ రాయితీలతో విద్యనూ అందిస్తోంది. ఆ వివరాలు.. టాలెంట్ లేని పిల్లలు కనపడట్లేదిప్పుడు. ఇంజినీరింగ్, మెడిసిన్ చదువులకు స్కూల్ నుంచే పునాది వేస్తూ పిల్లల్లోని సహజమైన ప్రతిభను బయటకు రానీకుండా చేస్తున్నాం. దానివల్ల వాళ్లు తమకు పరిచయంలేని పదిమంది ముందుకు రావడానికి జంకుతున్నారు. మాట్లాడ్డానికి వణుకుతున్నారు. వేదికెక్కడానికి వెనుకాడుతున్నారు. దాన్ని గమనించింది.. ఆడపిల్లల చదువు కోసం కొన్ని దశాబ్దాలుగా పాటుపడుతున్న కిట్స్. ఒక్క చదువుకే కాదు బాలికల ప్రతిభాపాటవాలకూ ప్లాట్ఫామ్ కావాలని నిశ్చయించుకుంది. 2001లో ఒడిశాలో ‘నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా’ పోటీలను మొదలుపెట్టింది. 2004కల్లా ఉత్తర భారతంలోని ప్రతి రాష్ట్రం పాల్గొనే స్థాయికి ఎదిగింది. 2015లో దక్షిణాది రాష్ట్రాలకూ చేరిన ఈ పోటీలు ఇప్పుడు జాతీయ స్థాయిని అందుకున్నాయి. ఈ ఏడు పాతికేళ్ల సంబరాన్ని జరుపుకోనున్నాయి. వీటి కోసం తెలుగు రాష్ట్రాల బాలికలకు ఈ నెల 20న హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీలో ఆడిషన్స్ జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 13–15 ఏళ్ల బాలికలు తమ పరిచయంతోపాటు తమ ప్రతిభను చూపే వన్ మినిట్ వీడియోను https://forms.gle/ 1QzSwfVcuPy5jTto8 అనే లింక్కి గానీ, 8790161155/ 8790163355 నంబర్లకు వాట్సాప్ గానీ, kiitnanhipari.hyd@ gmail.comకి మెయిల్ గానీ చేయొచ్చు. ఆఖరు తేదీ 15 సెప్టెంబర్. 20వ తేదీన జరిగే ఆడిషన్స్లో ఇంట్రడక్షన్, పెర్ఫార్మెన్స్ అనే రెండు రౌండ్లు ఉంటాయి. ఇందులోంచి ఇద్దరు భువనేశ్వర్లో జరిగే ఫైనల్స్కి ఎంపిక అవుతారు. అలా దేశమంతటా ఆడిషన్స్ జరిగి.. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికై ఫైనల్ పోటీలకు వస్తారు. రెండు రోజులు జరిగే ఈ పోటీల్లోంచి ముగ్గురు విజేతలను ఎంపికచేస్తారు. మొదటి బహుమతిగా పదిలక్షల క్యాష్ ప్రైజ్, కళింగ ఇన్స్టిట్యూట్లో ఉచిత విద్య, ఫస్ట్ రన్నరప్కి రూ. అయిదు లక్షల క్యాష్ ప్రైజ్, కిట్స్లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్, సెకండ్ రన్నరప్కి రూ. మూడు లక్షల క్యాష్ ప్రైజ్, కిట్స్లో యాభై శాతం ఫీజు డిస్కౌంట్ ఉంటుంది. ఇవికాక మరో పది కేటగిరీల్లో కేటగిరీకి రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 2 లక్షల క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఇలా ఈ పోటీలు భవిష్యత్లో అమ్మాయిలు పలు అంతర్జాతీయ వేదికల మీద బెరుకు లేకుండా పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా... ఇలాంటి పోటీల్లో నిర్భయంగా పాల్గొనేలా తర్ఫీదునిస్తున్నాయి. -
ఇండో వెస్ట్రన్ అంటే ఇష్టం: అనుపమ పరమేశ్వరన్
‘ఫ్యాషన్ అంటే మనల్సి మనం అందంగా తీర్చిదిద్దుకోవడం.. సౌందర్యంగా కనిపిస్తూనే సౌకర్యంగా ఉండటం మరింత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఈ మధ్యనే సరికొత్త కథాంశంతో విడుదలైన ‘పరదా’ సినిమాలో మగువల భావోద్వేగాలను, సామాజిక పరిస్థితులను తెరకెక్కించాం. ఇది ప్రభావవంతమైన కథాంశం, నటన పరంగానూ అందరి ప్రశంసలు పొందింది.’ అంటూ చెప్పుకొచ్చారు అందాల తార అనుపమ పరమేశ్వరన్. నగరంలోని బంజారాహిల్స్ వేదికగా స్వదేశీ ఫ్యాషన్ బ్రాండ్ ‘బిబా’ ఫ్లాగ్ప్ స్టోర్లో సోమవారం సందడి చేశారు. ఈ వేదికపై నూతనంగా రూపొందించిన ఫెస్టివ్ కలెక్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనుపమ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఫ్యాషన్ ట్రెండ్స్, తదుపరి సినిమాల విశేషాలు ఆమె మాటల్లోనే..! హైదరాబాద్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఫ్యాషన్ హంగులను చూస్తే సంతోషంగా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వేర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదే నా స్టైల్ స్టేట్మెంట్. ముఖ్యంగా కాటన్, స్మూత్కాటన్ ఇష్టపడతాను. గ్రాండ్ లుకింగ్ కన్నా కంఫర్ట్ ముఖ్యం. మన మూలాల్లోని ఫ్యాబ్రిక్, సంస్కృతి–అధునాతన డిజైనింగ్ సమ్మిళిలితం చేస్తే ఎక్కువగా ఆకర్షిస్తుంది. వాటిని ప్రోత్సహిండం ఇష్టం. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అమ్మాయిలకు అనువుగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి శారీస్, ఈవెంట్స్ను బట్టి డ్రెస్ వేసుకుంటా. మహిళల ఫ్యాషన్ వేర్ అంతర్గత శక్తిని, మానసిక స్థితిని తెలియజేస్తుందని నమ్ముతాను. నాకు రెడ్ కలర్, మస్టర్డ్ యెల్లో రంగుల దుస్తులే నచ్చుతాయి. రెడ్ అంటే పవర్ఫుల్.. నేను ఎక్కువ షాపింగ్ చేయను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లినప్పుడు కచి్చతంగా షాపింగ్ చేస్తుంటాను. సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి షూటింగ్స్ వెళ్లినప్పుడు ఎయిర్పోర్ట్లో, సందడి లేని ఇతర షాపింగ్ ప్రదేశాల్లో కొనుగోలు చేస్తాను. ‘డిఫరెంట్ బై డిజైన్’ అనే ఫిలాసఫీని ప్రతిబింబించేలా బిబా అందిస్తున్న దసరా కలెక్షన్ మన సాంస్కృతిక మూలాలను గుర్తుచేస్తుంది. వరుస షూటింగ్స్తో బిజీ.. సినిమాల పరంగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ వాతావరణంలో సరికొత్త అనుభూతిని పొందుతాను. ఈ మధ్యే తెలుగులో నా ‘పరదా’ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో ‘కిష్కిందపురి’ సినిమా విడుదల కానుంది. కిష్కిందపురి తరువాత ‘బైసన్’ కూడా విడుదలకు సిద్ధమౌతోంది. ఈ రెంటితో పాటు ‘భోగీ’ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది షూటింగ్ పూర్తి కానుంది. మరో తెలుగు సినిమాలోనూ నటిస్తున్నాను. ఇవి కాకుండా మలయాళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నా. -
పట్టులాంటి జుట్టు కోసం..!
ఒత్తైన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్ఈడీ డయోడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్ లైట్ థెరపీ బెరెట్ హ్యాట్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది. ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.ఒతై ్తన జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది పొడవాటి, నల్లని కురుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతున్న కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా చిట్కాలు కూడా పనిచేయడం లేదు. దీంతో జుట్టు విపరీతంగా రాలిపోతోంది. కొన్నిసార్లు జుట్టు రాలడాన్ని తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించకపోవచ్చు. అటువంటి వారికి నానో టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాట్ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉన్న శక్తిమంతమైన ఎల్ఈడీ డయోడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్న టోపీ పేరు రెడ్ లైట్ థెరపీ బెరెట్ హ్యాట్. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఈ టోపీలో ఉన్న ఎరుపు రంగు లైట్లు జుట్టు కుదుళ్లకు కాంతిని అందిస్తాయి. ఈ కాంతి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ఏటీపీ) ఉత్పత్తిని పెంచి కణాలకు శక్తిని అందిస్తుంది. దీంతో కుదుళ్లు బలంగా మారి, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కాంతి తలలోని రక్తప్రసరణను పెంచుతుంది.ఈ టోపీలో ఆప్షన్ల ప్రకారం నీలి రంగుల లైట్లు కూడా ఉంటాయి. నీలి రంగు లైట్లు స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి, చుండ్రును తగ్గిస్తాయి. దీంతో జుట్టు రాలకుండా ఉంటుంది. ఈ పరికరం స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచి పొడవాటి జుట్టును అందిస్తుంది. బ్యాటరీతో పనిచేసే ఈ టోపీని ఎక్కడైనా సులువుగా వాడుకోవచ్చు. ఈ టోపీని స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉపయోగించవచ్చు. వారానికి రెండు లేదా మూడు సార్లు 30 నిమిషాల పాటు ఈ టోపీ పెట్టుకుంటే చాలు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. దీని ధర 44 డాలర్లు అంటే రూ.3,852 అన్నమాట. ఇదే మోడల్లో టెక్నాలజీ పెరిగేకొద్దీ ధరలో మార్పు ఉంటుంది.పట్టులాంటి జుట్టుకు...పట్టులా సుతిమెత్తగా ఉండే జుట్టు అందాన్ని పెంచుతుంది. జుట్టు మృదువుగా ఉంటే స్టైలింగ్ చేయడం కూడా ఈజీ. అయితే పెరిగిన కాలుష్యం, జుట్టుపై సరైన శ్రద్ధ తీసుకోకపోవడంతో జుట్టు పొడిబారి, రఫ్గా మారుతుంది. ఇలాంటి జుట్టుకు తగిన తేమ, పోషణను అందించే చికిత్సే డీప్ కండిషనింగ్. ఈ డీప్ కండిషనింగ్ హెయిర్ ట్రీట్మెంట్ వల్ల జుట్టు తేమగా, ఆరోగ్యంగా మారుతుంది. దీంతో మెరిసే జుట్టును పొందవచ్చు. ఇంట్లో డీప్ కండిషనింగ్ చేసుకోవాలనుకునేవారు ముందుగా హెయిర్ మాస్క్ ఎంపిక చేసుకోవాలి. పెరుగు–తేనె, గుడ్డు–ఆలివ్ నూనె మాస్క్ అయితే బెటర్. కండిషనింగ్ చేసుకునే ముందు తక్కువ గాఢత ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి. జుట్టు ఆరిన తర్వాత హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే సుతిమెత్తని జుట్టు మీ సొంతమవుతుంది. ఇంట్లో డీప్ కండీషనింగ్ చేసుకోలేని వారు పార్లర్కు వెళ్లవచ్చు. బ్యూటీ పార్లర్లోని నిపుణులు జుట్టు రకాన్ని బట్టి ప్రత్యేకమైన ఉత్పత్తులతో కండిషనింగ్ చేస్తారు. అవసరం బట్టి పార్లర్లో స్టీమ్ థెరఫీ కూడా ఇస్తారు. దీనివల్ల జుట్టుకు మరింత పోషణ అందుతుంది. కురులు అందంగా, ఆకర్షణీయంగా మారుతాయి. (చదవండి: రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!) -
మిస్–మిసెస్ బెలెజా
అందం, తెలివితేటల కలబోతగా సాగిన మిస్–మిసెస్ బెలెజా గ్రాండ్ ఫినాలే ఆకట్టుకుంది. సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో జరిగిన తుది పోటీలో మిస్ కేటగిరీ విజేతగా డీ.కావ్యాంజలి, ఫస్ట్ రన్నరప్గా కందకట్ల ప్రత్యూష, సెకండ్ రన్నరప్గా వీ.జానకీ దేవి నిలిచారు. మిసెస్ కేటగిరీ విజేతగా ఇందిరా దేవి, ఫస్ట్ రన్నరప్గా డా.పీ.నిఖిలా రెడ్డి, సెకండ్ రన్నరప్గా అవుల రేవతి గెలుపొందారు. కార్యక్రమానికి వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్న్ డిజైనర్లు, ఔత్సాహిక మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెందిన 20 మంది ఫైనలిస్ట్లు పోటీపడ్డారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి నెరళ్ల మల్యాద్రితో పాటు బెలెజా వ్యవస్థాపకురాలు వందన దాసరి, సోషలైట్ సుధాజైన్ పాల్గొన్నారు. (చదవండి: సంపదలోనే కాదు ఆరోగ్యంగానూ బిలియనీరే..! ఆ ఒక్క సూత్రంతో..) -
కూల్ మాన్సూన్లో..స్పెషల్ హాట్ ట్రీట్స్..!
వర్షాకాలంలో మనసు వెచ్చదనాన్ని కోరుకుంటుంది. వెచ్చని నీడతో పాటు వేడి వేడి పానీయాలను కూడా ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. ఈ సీజన్కు అనుగుణంగా నగరవాసులను ఆకట్టుకునే క్రమంలో.. మాన్సూన్ కోసం నగర కేఫ్స్లో కొత్త అందాలను.. వాటి మెనూతో సరికొత్త రుచులను సంతరించుకుంటాయి. ముసురు పట్టిన వాతావరణంలో ముచ్చటైన వేడి వేడి రుచులను ఆస్వాదించే సిటిజనుల్లో ఎవరి రూటు వారికే సపరేట్.. అలా వెచ్చదనాన్ని అందించే పానీయాల్లో కొన్నింటి గురించి.. వర్షాకాలంలో మరీ ముఖ్యంగా ఆస్వాదించే ఒక ముఖ్యమైన పానీయం చాయ్/ కాఫీ. ముసురు పట్టిందంటే చాలు ఈ దుకాణాలు జనంతో కిటకిటలాడిపోతాయి. వీటిని బంకమట్టితో తయారైన సంప్రదాయ పాత్రలైన కప్పులో అందిస్తారు. అలాగే అల్లం టీ (అద్రాక్ చాయ్) కూడా రుతుపవనాల సీజన్కు రుచికరమైన ఎంపిక. చాయ్తో మరిగించిన తురిమిన తాజా అల్లం అలరిస్తుంది. బంజారాహిల్స్లోని రోస్టరీ కాఫీ హౌస్ వీటికి పేరొందింది. అలాగే బంజారాహిల్స్లోనే ఉన్న రోస్ట్ సీసీఎక్స్లో అమెరికానో కూడా చాలా మంది ఫేవరెట్. జూబ్లీ హిల్స్ కేఫ్ వంటి కేఫ్స్లో డార్క్ చాక్లెట్తో తయారు చేసిన ఇటాలియన్ హాట్ చాక్లెట్ కూడా ఈ సీజన్లో పలువురి ఎంపిక. దీనిని కేవలం ఒక పానీయంగా మాత్రమే కాదు.. ఒక ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అంటారు దీని అభిమానులు. ఫిలింనగర్లోని ఆరోమలె కేరళ థీమ్తో రూపొందిన కేఫ్. మాన్సూన్లో అతిథుల కోసం తడవకుండా చినుకుల్ని ఆస్వాదించే స్పెషల్ సీటింగ్ దీని ప్రత్యేకత. ఈ కేఫ్ అందించే క్యాన్ బెర్రీ బ్రూ టీనీ, బ్రౌనీ హాట్ చాక్లెట్ వంటి పానీయాలు కూడా హాట్ లవర్స్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో ఉన్న టైగర్ లిల్లీ కేఫ్ అండ్ బిస్ట్రోలో మిక్స్డ్ బెర్రీ మచ్చా పలువురి ప్రత్యేక ఎంపిక. బంజారాహిల్స్, కార్ఖానాల్లో ఉన్న మనం చాక్లెట్.. బ్రౌనీ హాట్ చాక్లెట్ రుచులకు నగరవాసులు, మరీ ముఖ్యంగా యువత ఫిదా అవుతున్నారు. సూప్లు, సుగంధ ద్రవ్యాలు.. ఇదే విధంగా సూప్లు, టీలతో సహా వేడి లేదా గోరువెచ్చని ద్రవ పదార్థాలు వర్షాకాలంలో ఊరటనిస్తాయి. వెచ్చగా ఉండటానికి మాత్రమే కాక జీర్ణక్రియకు సైతం ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సీజన్లో పానీయాల్లో అల్లం, పసుపు, తులసి వంటి సుగంధ ద్రవ్యాలను జోడించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందనీ, రోగనిరోధక శక్తిని పెంచుతుందనీ వైద్యులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన పానీయాలను కోరుకునే వారు కథా లాంటి హెర్బల్ ‘టీ’ల ను ఎంచుకుంటున్నారు. ఈ కథా అనేది ఒక సంప్రదాయ భారతీయ పానీయం. దీనిని చాయ్ లేదా ‘టీ’గా తీసుకుంటారు. దగ్గు, జలుబు సీజనల్ ఫ్లూ వైరస్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తారు. మూలికలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన ఈ కథా.. సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం, గొంతు నొప్పికి ఉత్తమ నివారణగా ఎంచుకుంటారు. ఇది పూర్తిగా యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. పలు రకాల రుచులు, థీమ్లు..జూబ్లీహిల్స్లోని కేఫ్ ఉకుసా పెప్పర్ మింట్ హాట్ టాడీ పేరిట అందించే మాన్సూన్ స్పెషల్స్కు సైతం అధిక సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. బేగంపేట్లో ఉన్న ఫన్నెల్ హిల్లో హాట్ చాక్లెట్ కూడా ఈ సీజన్లో నగర యువతను ఆకట్టుకుంటోంది. నీలోఫర్, పిస్తా హౌజ్లతో పాటు ఓల్డ్ సిటీలోని ఘాన్సీ బజార్లో ఉన్న నిమ్రా కేఫ్ వంటి ప్రదేశాలు, ఇరానీ చాయ్కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. జూబ్లీ హిల్స్లోని చాయ్ పానీ వేడి పానీయాలు స్నాక్స్ కాంబోకు ప్రసిద్ధి చెందింది. క్రిస్పీ సమోసాలు, పకోడాలు, వడా పావ్లతో పాటు వెరైటీ రుచుల టీలతో ఇక్కడ గెస్ట్స్ మాన్సూన్ను ఆస్వాదిస్తారు. బంజారాహిల్స్లో చాలా మందికి కల్చరల్ స్పేస్గానే పరిచయమున్న లామకాన్.. సమోసా వంటి స్నాక్స్కు మాత్రమే కాదు కడక్ చాయ్ వంటి ప్రత్యేక వెరై‘టీ’లకు పేరొందింది. చాయ్ పకోడాకు బదులు హాట్ చాక్లెట్ క్రోయిసెంట్లను ఎంచుకునే వారు జూబ్లీహిల్స్లోని ఫోన్స్ చాక్లెట్ను సందర్శిస్తున్నారు. ఇటాలియన్ క్లాసిక్ హాట్ చాక్లెట్తో ఈ సీజన్కు ఫేమస్ అయ్యింది. (చదవండి: అత్యంత వృద్ధ 'డ్రైవర్ అమ్మ'..!) -
బాయ్ ఫ్రెండ్తో బాక్సింగ్ క్వీన్..మేరీ కోమ్ మేకప్ వీడియో వైరల్
ప్రముఖ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష కుమారుడు వివాహ వేడుకలో బాక్సింగ్ సంచలనం మేరీ కోమ్ (Mary Kom స్పెషల్ ఎట్రాక్షన్ నిలిచారు. బాక్సింగ్ రింగ్ను శాసించిన లెజెండ్మేరీ కోమ్ గోల్డెన్సిల్క్ చీర, నిండుగా నగలు, తలనిండా పూలతో ట్రెడిషనల్ లుక్లో కనిపించి ఫ్యాన్స్తో పాటు పలువుర్ని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తన లుక్కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో మేరీ కోమ్ షేర్ చేశారు. దీంతో ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కిర్రాక్ ఫోజులతో బాక్సింగ్ రింగ్లోనే కాదు..బ్యూటీలో కూడా క్వీన్ అనిపించుకుంది. అంతేకాదు ఆమె పక్కన నడిచిన వ్యక్తికూడా చర్చల్లో నిలిచాడు.మేరీ కోమ్ ముస్తాబైంది ఇలా View this post on Instagram A post shared by Dr Mangte Mary Kom (@mcmary.kom)ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో పుట్టిన మాంగ్టే చుంగ్నీజాంగ్ మేరీ కోమ్..అద్భుతమైన బాక్సర్ ఒలింపిక్ మెడల్ విజేతగా నిలిచారు. ఒక సాధారణ క్రీడాకారిణి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకోవడం దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ.క్రీడలకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులు లభించాయి. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ గెలిచిన ఏకైక బాక్సర్. 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుచుకుని భారత క్రీడా ప్రపంచంలోనే కాకుండా గుర్తింపును తెచ్చుకున్నారు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా బాక్సర్ .మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితులైనారు. 2005లో ఆంఖోలర్ అకా ఓన్లర్ను పెళ్లి చేసుకోగా, వీరికి నలుగురు పిల్లలు. అయితే విభేదాల కారణంతో గత ఏడాది భర్తతో విడిపోయారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించారు.ఎవరీ హితేష్ చౌదరి కాగాభర్తతో విడాకుల తరువాత తన వ్యాపార భాగస్వామి హితేష్ చౌదరి( Hitesh Choudhary))తో ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు వినిపించాయి.మేరీ కోమ్ లేదా హితేష్ చౌదరి ఇద్దరూ బహిరంగంగా ప్రేమ సంబంధాన్ని ధృవీకరించనప్పటికీ, గతంలో అనేక సార్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరూ తాజాగా పెళ్లి వేడుకలో కూడా సందడి చేశారు. ఉమ్మడి వ్యాపార వెంచర్ స్పోర్టీ ఫిట్ ప్రైవేట్ లిమిటెడ్ హితేష్ చౌదరి సీఎండీగా ఉన్నారు. -
పీటీ ఉష కొడుకు పెళ్లి : స్పెషల్ ఎట్రాక్షన్గా మేరీ కోమ్
ప్రముఖ అథ్లెట్ , రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, వి. శ్రీనివాసన్ ల కుమారుడు డాక్టర్ విఘ్నేష్ ఉజ్వల్ పెళ్లి పీటలెక్కాడు. సోమవారం లే మెరిడియన్ హోటల్లో జరిగిన విలాసవంతమైన వేడుకలో అశోక్ కుమార్ -షిని కుమార్తె కృష్ణను సాంప్రదాయ బద్ధంగా వివాహం చేసుకున్నారు. కొచ్చిలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడా, రాజకీయ, చలనచిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్, నటుడు శ్రీనివాసన్, కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ , ఎంపి జాన్ బ్రిట్టాస్ ఉన్నారు.“ఈ వివాహం తన కొడుకు జీవితంలో తదుపరి దశ. తల్లిగా తన జీవితంలో ఎంతో ఆనందమైన క్షణాలు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమేననీ, నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత తనకు నచ్చిన, మెచ్చిన అమ్మాయిని తన భాగస్వామిగా చేసుకున్నాడని పీటీ ఉష వెల్లడించారు. స్విట్జర్లాండ్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) స్పోర్ట్స్ మెడిసిన్లో డిప్లొమా సంపాదించారు. ప్రస్తుతం అతను పి.టి. ఉష కేరళలో స్థాపించిన ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్లో స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్గా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by P.T.Usha (@ptushaofficial) అందంగా మెరిసిన వధూవరులు విశాలమైన బంగారు జరీ అంచు, క్లిష్టమైన మోటిఫ్లతో నేసిన కంజివర్మ చీరలో నవ వధువు అందంగా కనిపించింది. మ్యాచింగ్ బ్లౌజ్, సాంప్రదాయ ఆభరణాలతో ఆమె ముగ్ధమనోహరంగా కనిపించింది. ముఖ్యంగా, చక్కటి నక్షి డిజైన్తో రూపొందించిన చోకర్తో , పొడవాటి లేయర్డ్ నెక్లెస్తో జత చేసింది. ఇంకా అందమైన టెంపుల్ మాంగ్-టీకాతో పాటు మ్యాచింగ్ చెవిపోగులు, కమర్బంధ్, వంకీ , ఉంగరాలు ధరించింది. సింపుల్ మేకప్ ,గ జ్రాతో అలంకరించిన జడ ఆమెకు అందంగా అమరాయి. మరోవైపు, వరుడు విఘ్నేష్ లేత గోధుమరంగు టోన్ గల కుర్తా, ధోతీ మరియు కండువాలో అందంగా కనిపించాడు.పి.టి. ఉష కొడుకు పెళ్లిలో మేరీ కోమ్ స్పెషల్బాక్సింగ్ రింగులో పంచులతో విరుచుకుపడి ప్రత్యర్థులను మట్టి కరిపించి, బంగారు పతకాలతో మురిపించిన మేరీ కోమ్ ఈ పెళ్లిలో ట్రెడిషనల్లుక్లో ఆకట్టుకున్నారు. గోల్డెన్ సిల్క్ చీర, ఆభరణాలు, తలలో మల్లెలతో కేరళ స్టైల్లో అందరి దృష్టిని ఆకర్షించారు అంతేకాదు, కల్యాణానికి వచ్చినఅందరి ప్రశ్నలకు సంతోషంతో సమాధానాలిస్తూ కనిపించారు .తాను కేరళ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతాననీ వడ, ఇడ్లీ, సాంపార్ అన్నీ బెస్ట్అని మేరీ కోమ్ చెప్పుకొచ్చారు.. కేరళలో అందరూ చోట్ ఇష్టపడతారు, ఐ లైక్ చావల్, ఐ ఆమ్ ఏ రైస్ ఈటర్ అని చెప్పారు. మరి ఫిట్ నెస్ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించినపుడు.. మితంగా తింటూ పరవాలేదు అని సమాధానమిచ్చారు. -
సీనియర్ సిటిజెమ్స్..! అరవైలోనూ ఇరవైని తలపించేలా
కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు మహా కవి శ్రీశ్రీ.. దీనికి భిన్నంగా ఈ వృద్ధులు ఎప్పటికీ యువకులే.. అన్నట్లు కొందరు నగరవాసులు వయసును లెక్కజేయకుండా అన్నింటా మేము సైతం అన్నట్లు నేటి యువతకు చాలెంజ్ విసురుతున్నారు. అరవైల్లోనూ ఇరవైని తలపించే రీతిలో విభిన్న పోటీల్లో భాగస్వాములవుతూ ఉత్సాహంగా ఆటల నుంచి అందాల పోటీల వరకూ పాలుపంచుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతూ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటున్నారు నాటి తరం సీనియర్ సిటి‘జెమ్స్’. రిటైర్మెంట్ అనంతరం కృష్ణా.. రామా.. అంటూ మూలన కూర్చోక.. ఎంచక్కా టూర్లు, ట్రెక్కింగ్స్ అంటూ తమకు నచి్చన రంగంలో సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొండాపూర్లో నివసించే బాబూ రాజేంద్రప్రసాద్ రెడ్డికి 70 ఏళ్లు.. అనితరసాధ్యమైన రీతిలో 12వేల అడుగుల ఎత్తుకు ట్రెక్కింగ్ చేశారు. 72 ఏళ్ల వయసులోనూ ఎన్ఎమ్డీసీ ఫుల్ మారథాన్ అంటే 42.2 కి.మీ పరుగును పూర్తిచేశారు మరో నగరవాసి నాగభూషణరావు. ఇంకా మరిన్ని మారథాన్లలో భాగస్వామ్యం అవుతానంటున్నారు. పోరాట కళల్లో రాణిస్తూ మార్షల్ ఆర్ట్స్లో గిన్నిస్ రికార్డ్ సాధించారు మరో నగరవాసి కిరణ్ ఉనియాల్ (53).. ఇలా వయసుతో ప్రమేయం లేని విజయాలతో ఓల్డేజ్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇస్తూ.. తమ రొటీన్ లైఫ్ని కొత్తగా మార్చేస్తున్నారు. అలాంటి సీనియర్ల హుషారు సరికొత్త యువ తరాన్ని ఆవిష్కరిస్తూ.. కొత్త కొత్త పోటీలకు ఊపునిస్తోంది. అప్పుడే అసలైన జీవితం.. రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతోంది అంటే ఊళ్లు తిరుగుతూ తీర్ధయాత్రలతోనో, ఒళ్లు నలగని పార్ట్ టైమ్ ఉద్యోగాలతోనో, మనవళ్లతోనో.. పార్కుల్లో స్నేహితులతో ముచ్చట్లతోనో కాలం వెళ్లదీసే రోజులు కావివి అంటున్నారు నేటి తరం సీనియర్ సిటిజన్స్. ఓ వైపు ఉద్యోగమో, వ్యాపారమో.. కెరీర్ ముగుస్తుండగానే.. మరోవైపు కొత్త లక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి. ‘నిజం చెప్పాలంటే ఓ వ్యక్తిగా మనకేం కావాలి.. మనమేం చేయగలం.. అనే ఆలోచనలతో అప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది’ అని చెబుతున్నారు నగరానికి చెందిన సాహిల్ గులాటి(65). టాలెంట్, ఆసక్తి ఉండాలేగానీ.. ఇటీవల ఖ్యాల్స్ (కేహెచ్వైఏఏఎల్స్) అనే ఏజ్టెక్ స్టార్టప్, ‘50 ఎబవ్’ అనే పేరుతో టాలెంట్ హంట్ పోటీలు ప్రారంభించింది. ఇది 50 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేకించింది. గానం, ఫొటోగ్రఫీ, వంటలో ప్రావీణ్యం, కవితలు రాయడం, నటన.. ఇలా అదీ ఇదీ అని లేకుండా దాదాపు అన్ని విభాగాలనూ కలుపుకుని ఏకంగా 50 విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తుండడం విశేషం. కళా ప్రతిభ, ట్రావెల్, లైఫ్స్టైల్ వంటి విభాగాల్లో సత్తా ప్రదర్శించే అవకాశం కలి్పస్తోంది.. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పోటీ కోసం 20 నగరాల్లో ఆఫ్లైన్, ఆన్లైన్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. వయసు సంబంధిత స్టీరియో టైప్ పోటీలకు భిన్నంగా వయోజనుల్లో పోటీ తత్వాన్ని, ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అందం వయసెరగదు అంటున్నారు మిస్టర్ అండ్ మిసెస్ సీనియర్ ఫ్యాషన్ పేజెంట్ ఇండియా నిర్వాహకులు రేఖా దేశాయ్. గత మే నెల్లో 55 ఏళ్లు దాటిన వారి కోసం ఓ పోటీని కొత్తగా ప్రారంభించారామె. స్వయంగా ఆరు పదుల వయసులో ఉన్న రేఖా దేశాయ్.. ‘కలలకు ఎక్స్పైరీ డేట్ లేదు. సీనియర్స్ కళ్లలో మెరుపులు చూడడమే నా కార్యక్రమ లక్ష్యం’ అంటున్నారు. వీరి సంస్థ నిర్వహించే పీచ్ ఈవెంట్స్ తమ మొదటి సీజన్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఆటలకు, పాటలకు సై..సీనియర్స్ కోసం నిర్వహించే ఆటల పోటీలకూ కొదవలేదు. ఈత, గోల్ఫ్ నడక వంటి వాటిలోనూ పోటీలు జరుగుతున్నాయి. అలాగే బోస్, కార్న్హోల్, క్రికెట్ వంటి ఆటలు కూడా అందుబాటులో ఉన్నాయి. అస్సోంకు చెందిన 70ఏళ్ల ఖిరాదా సైకియా కలిత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ గత జూన్లో ధర్మశాలలో జరిగిన నేషనల్ మాస్టర్స్ గేమ్స్లో నాలుగు బంగారు పతకాలు గెలుచుకోవడం ఎందరికో స్ఫూర్తిని అందించింది. అదే విధంగా 60 ఏళ్ల పైబడిన వారి కోసం నిర్వహించే మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్స్, ఏవీటీ చాంపియన్ టూర్స్, పాన్ ఇండియా ఫెడరేషన్ కప్ వంటి ఆటల పోటీల్లోనూ నగరవాసులు చురుకుగా పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. ( చదవండి: -
అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!
స్నేహ అంటే సంప్రదాయంలో పుట్టిన సౌందర్య కవిత లాంటిది. దాదాపు చాలావరకు పట్టుచీర, జడలో మల్లెలు, నుదుటిన బొట్టు అన్నీ కలిసి కనిపిస్తూ ఉండే ఆమె అందం ఎప్పుడూ పండుగ వాతావరణంలా మెరిసిపోతుంది. ఆ అందాన్ని కూడా స్నేహ ఒక్క చిరునవ్వుతోనే రెట్టింపు చే స్తుంది. ప్రతిసారీ కొత్తగా, ప్రత్యేకంగా కనిపించడం అంటే చాలా ఇష్టం. ప్రింటెడ్ కాంచీపురం నుంచి మోనోటోన్ బనారసీ, ఫ్లోరల్ నుంచి బ్రోకేడ్ వరకు, ఏ చీర అయినా సరే రంగులతో మ్యాజిక్ చేస్తాను. అందుకే, చీరలంటే చాలా ఇష్టం అని చెబుతోంది స్నేహ.ఆభరణాల పండుగ! పండుగ రోజు ఉదయం చీర కట్టుకుంటూ అద్దం ముందు నిలబడి ఏ ఆభరణం వేసుకోవాలి అనుకుంటే, అది తప్పకుండా ఫెస్టివల్ జ్యువెలరీ అయి ఉండాలి. బంగారం మెరుపులో రంగురంగుల రత్నాలు, ముత్యాల గుత్తులు, చెక్కిన సున్నితమైన ఆకృతులు – ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే వైభవం పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, ప్రతి పండుగను ఒక జ్ఞాపకంగా మార్చే మ్యాజిక్. ఆ ఆభరణాలను వేసుకున్నప్పుడల్లా మనం కేవలం ఆ రోజుకే కాదు, మన పూర్వీకుల సంప్రదాయానికి, వారసత్వానికి కూడా గౌరవం ఇస్తున్నట్లే అనిపిస్తుంది. లేత రంగుల కంచీపురం చీరలపై ఈ ఆభరణాలను వేసుకుంటే రత్నాల మెరుపు ఇంకా హైలైట్ అవుతుంది. జుట్టును పొడవైన జడగా వేసి మల్లెపూలు, కనీసం రెండు పొడవైన హారాలు జుంకీలు, వంకీలు – ఇలా లేయరింగ్ చేస్తే ఆకర్షణ వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న డిజైన్లను చూస్తే, లక్ష్మీదేవి, గణేశ్ మోటిఫ్స్తో వచ్చే టెంపుల్ హారాలకు బాగా డిమాండ్ ఉంది.చీర బ్రాండ్: స్నేహాలయ సిల్క్స్, ధర: రూ. 25,000, జ్యూలరీ బ్రాండ్ : ఇతిహాస జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!) -
ఆరోగ్యమే.. అందం.. ఆనందం
జీవితంలో ఎంత ఎదిగినా, ఏం సాధించినా.. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఎంతో ప్రధానమైనవని, ఇంటర్నల్ వెల్నెస్, ఎక్స్టర్నల్ కేర్ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్నీ ప్రదర్శిస్తాయని ప్రముఖ సినీతార శ్రియా శరణ్ తెలిపారు. చాలా రోజుల తరువాత ఈ పాన్ ఇండియా నటి నగరంలో సందడి చేశారు. నగరంలోని కొండాపూర్ వేదికగా వెల్నెస్, చర్మ సంరక్షణ, అధునాతన సౌందర్య సేవలందించే ‘జెన్నారా క్లినిక్స్’ను శ్రియా శరణ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అందమైన జీవితం, ఆరోగ్యకరమైనప్రయాణంతో పాటు తన తదుపరి సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆ రోజులు ఎంత మధురమో.. చాలా మంది నన్ను కలిసినప్పుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకేలా ఎలా ఉండగలుగుతున్నారని అడుగుతున్నారు.., దానంతటికీ కారణం ‘ఎల్లప్పుడూ నాకు మానసిక సంతోషాన్నందిస్తున్న అభిమానుల ప్రేమ, రెండోది ఆరోగ్యం పట్ల నా జాగ్రత్త. సినిమా రంగంలో ఉన్నాను కాబట్టి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సంరక్షించుకోవాలి. దీని కోసం నేను సాధారణ పద్ధతులను కొనసాగిస్తాను. ఇంట్లో తయారు చేసిన ఫేస్ప్యాక్లు వాడతాను, కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ వినియోగించడంతో పాటు ఆయుర్వేదిక్ పద్ధతులను పాటిస్తాను. మన సంస్కృతిలో ఇలాంటి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి. అప్పటి రోజులు ఎంత మంచివో.., అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఎలాంటి కాలుష్యం ఉండేదికాదు. రసాయనాలు లేని ఆహారం తినేవారు. అందుకే వారి మోములో సహాజ సౌందర్యం ఉట్టిపడేది. ఆ గ్లో నాకు చాలా ఇష్టం. ప్రస్తుత ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో అలా బతకడం కాస్త కష్టమే కానీ ఎవరికి వారు వారి ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ఈ తరాన్ని నేను వేడుకునేది కూడా ఇదే, మైండ్ మెడిటేషన్, యోగా చేయండి. పాజిటివ్ లైఫ్ పై అవగాహన పెంచుకోండి. నాలాగే మినరల్స్, విటమిన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించండి. హైదరాబాద్లో సౌందర్య రంగం, సినిమా రంగం గ్లోబల్ స్థాయిని చేరుకుంది. మోడ్రన్ లైఫ్స్టైల్ హబ్గా మారింది. దానిని ఆస్వాదిస్తూనే విభిన్న విధాలుగా మనల్ని మనం సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఆల్ టైం ఫేవరెట్.. హైదరాబాద్ ఎప్పటికీ నా ఫేవరెట్ సిటీ. ఎన్నెన్నో మధురమైన అనుభవాలు, ఆనందాలు నగరంతో పెనవేసుకుని ఉన్నాయి. 17 ఏళ్లప్పుడు అనుకుంటా మొదటిసారి ఇక్కడికి వచ్చాను. సినీ ప్రయాణంలో భాగంగా ఈ నగరాన్ని నాకు కుటుంబంలా మార్చేసింది. ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్ను కలవడానికే ఇక్కడికి వస్తుంటాను. నా తదుపరి సినిమాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను చేరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మిరాయ్ సినిమాలో నటించాను. ఇందులో నా పాత్ర అందరికీ నచ్చుతుంది. మరో అద్భుతమైన ప్రాజెక్ట్ చంద్రయాన్. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. వినూత్నమైన సబ్జెక్ట్ ఇది. ఎంతో వైవిధ్యమున్న ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. (చదవండి: ఓపెన్గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
డ్రెస్ స్టైల్నూ మార్చేయచ్చు..!
పెద్ద సైజులో బీడ్స్, స్టోన్స్ లేదా సిల్వర్, గోల్డ్, బ్రాస్ మెటల్తో తయారు చేసిన ఆకర్షణీయంగా కనిపించే స్టేట్మెంట్ జ్యువెలరీని ధరించడం ఈ రోజుల్లో మరింత ఫ్యాషనబుల్గా ఆకట్టుకుంటోంది. యువతరం సాధారణంగా లైట్, సన్నని జ్యువెలరీకి బదులు బోల్డ్ డిజైన్స్ని పెద్ద సైజులో ఎంపిక చేసుకుంటోంది. ట్రైబల్ జ్యువెలరీకి అతి దగ్గరగా ఉంటోన్న ఈ ఫ్యాషన్ ఆభరణాలు డ్రెస్ స్టైల్ను మార్చేసే ‘హైలైట్ యాక్ససరీస్’గా నిలుస్తున్నాయి. ఇయర్ హ్యాంగింగ్స్హూప్స్, జుమ్కీలు, డ్రాప్ ఇయర్ రింగ్స్, షెల్స్ లేదా జియోమెట్రిక్ షేప్స్.వన్ పీస్ డ్రెస్ లేదా సింపుల్ కుర్తీకి బాగా సెట్ అవుతాయి.నెక్లస్, గాజులుమొత్తం మెడ కవర్ చేసే హారాలు లేదా మొత్తం చేతిని కవర్ చేసే గాజులు లభిస్తున్నాయి. వీటిని మెటల్, బీడ్స్, ముత్యాలు, స్టోన్స్తో తయారు చేస్తారు. ప్లెయిన్ టాప్స్, చీరల మీదకు బాగా నప్పుతాయి. మెటల్, వుడ్, ఆర్ట్ వర్క్ ఉన్నవి. వెస్ట్రన్ – ట్రెడిషనల్ రెండింటికీ సెట్ అవుతాయి.క్యాజువల్ లుక్ డైలీ వేర్ / ఫ్రెండ్స్ అవుటింగ్షర్ట్ స్టైల్స్కి ఓవర్సైజ్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ నెక్పీస్ + పెద్ద హూప్ ఇయర్ రింగ్స్. బోహో మ్యాక్సీ డ్రెస్ పైకి కలర్ఫుల్ బీడ్స్, షెల్ జ్యువెలరీ, బ్రాడ్ బ్యాంగిల్స్. కుర్తీ లెగ్గింగ్స్ పైకి ఆక్సిడైజ్డ్ జుమ్కీలు లేదా చెవులు మొత్తం కవర్ చేసే లాంగ్ ఇయరింగ్స్.ఆఫీస్ లేదా ఫార్మల్ లుక్ఆఫీస్ వేర్ పైకి సింపుల్ ఓవర్సైజ్డ్ రింగ్ + చిన్న హూప్స్ బాగుంటాయి. ఒకే రింగ్ పెద్దగా వేసుకుంటే చేతి మీదే ఫోకస్ ఉంటుంది. కాక్టెయిల్ రింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్. బ్లేజర్, ట్రౌజర్స్ పైకి పెద్ద చెయిన్ లేదా మందపాటి నెక్ పీస్ సెట్ అవుతుంది. కాటన్ లేదా లినెన్ శారీస్ పైకి పొడవాటి ముత్యాల దండ, స్టడ్స్ లేదా ఆక్సిడైజ్డ్ లాంగ్ ఇయర్ రింగ్స్.పార్టీ ఈవెనింగ్ లుక్ బ్లాక్ డ్రెస్పైకి గోల్డెన్ చంకీ నెక్పీస్, పెద్ద స్టేట్మెంట్ రింగ్ బాగా నప్పుతుంది. గౌన్ పైకి షైనీ స్టోన్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ సరి΄ోతాయి. నెక్లెస్ అవసరం లేదు.కాక్టెయిల్ పార్టీమినిమలిస్టిక్ గౌన్కి ఓవర్సైజ్డ్ బ్రేస్లెట్ హైలెట్ అవుతుంది. సింపుల్ డ్రెస్కి హెవీ జ్యువెలరీ పర్ఫెక్ట్ లుక్. వెస్ట్రన్ అవుట్ఫిట్కి బోల్డ్ మెటల్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ బాగుంటుంది. శారీస్, లెహంగాస్కి స్టోన్స్, పెరల్స్, కుంకుమపువ్వు కలర్స్తో ఉన్నవి బాగా మెరిసి΄ోతాయి. ఆఫీస్ లుక్కి – చిన్న ఓవర్సైజ్డ్ రింగ్స్ లేదా లైట్ కలర్ హూప్స్. పార్టీ లుక్కి – షైనీ, గ్లిట్టర్, బోల్డ్ నెక్పీసులు అందంగా ఉంటాయి. సంప్రదాయ వేడుకలైన పండగలు /పెళ్లిళ్లకు పట్టు చీరల మీదకు ఓవర్సైజ్డ్ కుందన్ లేదా టెంపుల్ జ్యువెలరీ నెక్లెస్, హ్యాంగింగ్స్ బాగుంటాయి. లెహంగా మీదకు నెక్లెస్ లేకుండా హెవీగా ఉండే చాంద్బాల్ ఇయర్ రింగ్స్ సెట అవుతాయి. అనార్కలీ లేదా కుర్తీస్ మీదకు లేయర్డ్ పెరల్ నెక్లెస్, చేతికి పెద్ద కఫ్స్ అందంగా కనిపిస్తాయి.మోడర్న్ ఫ్యూజన్ లుక్క్రాప్ టాప్, స్కర్ట్ మీదకు ఓవర్సైజ్డ్ నెక్లెస్, లాంగ్ ఫెదర్ ఇయర్ రింగ్స్ అందంగా ఉంటాయి. ఇండోవెస్ట్రన్ ఔట్ఫిట్స్కి ఆక్సిడైజ్జ్ సిల్వర్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ప్లెయిన్ జంప్సూట్ మీదకు బోల్డ్ జియోమెట్రిక్ నెక్లెస్ చుంకీ బ్రేస్లెట్ బాగా నప్పుతుంది.ప్రకృతి నుంచి స్ఫూర్తిజీన్స్, కుర్తీస్ కి పెర్ఫెక్ట్ లుక్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అయితే బోహో లుక్ కోసం కలర్ఫుల్ బీడెడ్ హారాలు బాగుంటాయి. ఈవెనింగ్ పార్టీ లుక్స్ కోసం యంగ్ జనరేషనల్లో బాగా పాపులర్గా ఉన్నది లేయర్డ్ నెక్పీస్, ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందినవి ఫ్లవర్, లీఫ్ షేప్ ఎకో ఫ్రెండ్లీ జ్యువెలరీ. జాగ్రత్తలుఔట్ఫిట్ కలర్కి మ్యాచ్ అయ్యే జ్యువెలరీని ఎంచుకోవాలి. ఆభరణాలు చాలా హెవీ వాడితే నెక్ లేదా ఇయర్ మీద బరువు పడొచ్చు, సౌకర్యంగా ఉండేవి చూసుకోవాలి. ఒకేసారి హెవీ మేకప్, హెవీ జ్యువెలరీ కాకుండా బ్యాలెన్స్ చేయాలి. ఓవర్సైజ్డ్ నగల ధరించేటప్పుడు అన్నీ ఓవర్గా వేసుకోకూడదు. హెవీ ఇయర్ రింగ్స్ ధరించినప్పుడు హెవీ నెక్లెస్ వాడద్దు. సింపుల్ డ్రెస్ ధరించినప్పుడు ఓవర్ సైజ్డ్ జ్యువెలరీ అట్రాక్టివ్గా ఉంటుంది. క్లచ్ లేదా హ్యాండ్ బ్యాగ్ కూడా జ్యువెలరీ షైన్ కి మ్యాచ్ అయ్యేలా చేసుకోవాలి. (చదవండి: ఇండియన్ స్పైసీ రెస్టారెంట్ ఇన్ జపాన్) -
డిజైన్ డెమోక్రసీ..!
ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ ఉత్పత్తులకు సంబంధించిన పాపులర్ ప్రదర్శన డిజైన్ డెమోక్రసీ వచ్చేనెల 5న నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనుంది. బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించిన నిర్వాహకులు ఎక్స్పో వివరాలను వెల్లడించారు. ఇందులో 120కి పైగా ప్రముఖ బ్రాండ్లు, 80పైగా పేరొందిన స్పీకర్లు పాల్గొంటారని, 15 వేలకుపైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 3 రోజుల ప్రదర్శనలో చర్చలు, ఆవిష్కరణలు.. వంటివి ఉంటాయన్నారు. ఫర్నిచర్, లైటింగ్, ఫ్లోరింగ్, గృహోపకరణాలు, వంటగది, బాత్, డెకర్ ఉపకరణాలు ఫైన్ఆర్ట్, క్రాఫ్ట్ వంటి వాటి ఎంపికలో నగర వినియోగదారుల అభిరుచులను కొత్తస్థాయికి ఇవి చేరుస్తాయన్నారు. సమావేశంలో సహ వ్యవస్థాపకులు శైలజా పట్వావరీ, మల్లికా శ్రీవాస్తవ్, క్యూరేటర్ అర్జున్ రతి పాల్గొని మాట్లాడారు.విద్యార్థి ప్రతిభ..ఎఫ్డీడీఐ–హైదరాబాద్ విద్యార్థులు చదువుతోపాటు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ వినూత్న ఆలోచనలతో వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఎఫ్డీడీఐలోని ఎల్ఎల్పీడీకి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి జీవా ప్రోటోటైప్ ఉత్పత్తిగా కుట్టులేని నాణెం పౌచ్కు రూపకల్పన చేశారు. రావి(పీపాల్) ఆకు రూపం, ఆకృతి నుంచి ప్రేరణ పొంది ఆకుపచ్చ రంగులో కృత్రిమ తోలు, గుండు సూది, షూలేస్ను ఉపయోగించి కుట్లు లేకుండా ఈ పౌచ్ను తయారు చేశాడు. జీవాను ఎఫ్డీడీఐ –హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ తేజ్లోహిత్రెడ్డి, ఫ్యాకల్టీ ప్రతినిధులు వేణుగోపాల్, గోఫ్రాన్, రుచిసింగ్, హుస్సేన్, రాంబాబు అభినందించారు. – రాయదుర్గం (చదవండి: నయా ట్రెండ్.. గణేశుడికి గ్రాండ్ వెల్కమ్!) -
'పారాచూట్ వెడ్డింగ్ గౌను'..! వెనుక ఇంత అద్భుతమైన లవ్ స్టోరీనా..
ఎంతో కష్టపడి నచ్చిన డ్రెస్ కొనుకున్నప్పుడు లేదా మన తల్లిదండ్రులు/ప్రియమైనవారో మనకెంతో ఇష్టమైన డ్రెస్ కొంటే.. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. అదెంతో అపురూపం కూడా. ఆ దుస్తులు చూడగానే దాని తాలుకా జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతాయి. అయితే మన ప్రాణ సమానమైన వ్యక్తిని రక్షించిన వస్తువు లేదా మనిషి మనకు ఆప్తమిత్రుడు లేదా అత్యంత ఆత్మీయులు. అందుకు అర్థం పట్టేదే ఈ వెడ్డింగ్ గౌను. దీని వెనుకున్న కథ వింటే కళ్లు చెమరుస్తాయి. 'ప్రేమకు అర్థం ఏదంటే'.. అన్న పాట గుర్తొచ్చేలా ఉంటుంది ఈ జంట కథ. చరిత్రలో దాగున్న ఈ అందమైన స్టోరీ ఏంటో చదివేద్దామా..!ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఐకానిక్ వెడ్డింగ్ గౌను ఒక జంట ప్రేమకు గుర్తుగా మ్యూజియంలో భద్రంగా ఉంది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉంది. అదే ఇవాళ స్టైలిష్ వెడ్డింగ్ గౌనుగా బ్రిటన్, అమెరికా, రష్యా వంటి దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది. ప్రతి నవ వధువు ఇష్టపడే ఆ వివాహ గౌను వెనుక కథ చూస్తే ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది. దీని గురించి సంస్కృతి, చరిత్రపై అమితాసక్తి కలిగిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మే షరీఫ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో షేర్ చేశారు. దాంతో ఈ వెడ్డింగ్ గౌను వెనుకున్న లవ్స్టోరీ నెట్టింట హాట్టాపిక్గా మారింది. అంతేగాదు 'ప్రేమకు అర్థం ఎవరంటే?'..అన్న పాటను గుర్తుకుతెస్తోంది. ఆ వీడియోలో షరీఫి ప్రముఖులు ధరించిన ఎన్నో వెడ్డింగ్ గౌనులు చూసుంటారు గానీ ఈ పారాచూట్ వెడ్డింగ్ గౌను(parachute wedding dress) గురించి విన్నారా అంటూ ఆ స్టోరీ గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. This wedding dress was made from a parachute that saved Maj. Claude Hensinger during WWII. In our @amhistorymuseum: https://t.co/0lf4659Pu0 pic.twitter.com/dSvRHwnvl7— Smithsonian (@smithsonian) June 16, 2017 వెడ్డింగ్ గౌను వెనుకున్న కథ..1947లో, ఒక మహిళ రెండవ ప్రపంచ యుద్ధం(World War II)లో తన భర్త ప్రాణాలను కాపాడిన పారాచూట్నే వెడ్డింగ్ గౌనుగా డిజైన్ చేసిందట. నైలాన్ ఫ్రాబ్రిక్ క్లాత్తో ఉండే పారాచూట్ని చాలా అందమైన వివాహ దుస్తులుగా మార్చిందామె. ఆ జంటే మేజర్ క్లాడ్ హెన్సింగర్, రూత్లు. 1947 రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికన్ బీ 29 పైలట్ అయిన మేజర్ క్లాడ్ హెన్సింగర్ తన సిబ్బందితో తిరిగి వస్తుండగా విమానం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. వెంటనే పారాచూట్ సాయంతో తన సిబ్బందిని, తనను రక్షించుకున్నారు. అంతేగాదు వారు ఆగిన నిర్మానుష్య ప్రదేశానికి అధికారులు వచ్చేంతవరకు వారికి ఆ పారాచూట్ రక్షణ కవచంలా వెచ్చదనాన్ని అందించింది. అతను సురక్షితంగా ఆ ప్రమాదం నుంచి బయపడిన వెంటనే తన స్నేహితురాలు రూత్ని నేరుగా కలసి జరిగినదంతా వివరించి ఆ పారాచూట్ని ఆమెకు ఇచ్చాడు. తన భర్త ప్రాణాలను కాపాడిన ఈ పారాచూట్ తనకెంతో అపురూపం అంటూ దాంతోనే వెడ్డింగ్ గౌనుని స్వయంగా రూపొందించుకుంది. అంతేగాదు దాన్ని ఆ దంపతులు ఎంత భద్రంగా ఉంచుకున్నారంటే..తన కూతురు, కోడలు కూడా వారి వివాహంలో ఆ గౌనునే ధరించారు. ఆ తర్వాత స్మిత్సోనియన్ మ్యూజియంలో ఆ గౌను నేటికి పదిలంగా ఉంది. View this post on Instagram A post shared by Mae Sharifi (@history_mae) (చదవండి: Smartphone Photography: కెమెరా క్లిక్.. అదిరే పిక్..! ట్రెండింగ్గా మారుతున్న మొబైల్ ఫోటోగ్రఫీ) -
ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్పేజీపై మెరిసిన సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. పాపులర్ ఫ్యాషన్ మ్యాగజైన్ గ్రాజియా కవర్ పేజీపై సమంత తళుక్కున మెరిసారి . వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని దీన్ని రిలీజ్ చేసినట్టు గ్రాజియా ప్రకటించింది. ఈ సందర్భంగా 15 ఏళ్ల నట ప్రయాణంలో ఎన్నో విలువైన పాత్రలు పోషించారని ప్రశంసిస్తూ సమంతపై ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.పదిహేను సంవత్సరాలు, లెక్కలేనన్ని పాత్రలు, ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం. యాక్టింగ్ నుంచి సినిమాలను నిర్మించడం,తన సొంత వ్యాపారాల స్థాపన వరకు, మొదటి చిత్రాన్ని నిర్మించడం, వెల్నెస్ వెంచర్లను ప్రారంభించడంతోపాటు ఆధునిక మహిళను ప్రతిబింబించే పాత్రలను ఎంచుకోవడం ద్వారా సమంత రూత్ ప్రభు తన సొంత మార్గాన్ని నిర్దేశించుకుంటోందని తెలిపింది. యూరోసెంట్రిక్ ఆదర్శాలను దాటి ఫ్యాషన్ ఇమేజరీని పునర్నిర్మిస్తున్న ఐదుగురు మహిళా ఫోటోగ్రాఫర్లతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గ్రాజియా వెల్లడించింది. మ్యాగజైన్లో భాగమైన ఐదుగురు మహిళా ఫొటోగ్రాఫర్లు, ఆరుగురు డిజైనర్లతో ఫొటోగ్రఫీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు 'గ్రాజియా' పేర్కొంది. 22 క్యారెట్ల బంగారపు ఉంగరం, గాజులు, ఝుంకాలు, నెక్లెస్తో అద్బుతంగా కనిపిస్తున్న సమంత లుక్కు ఫిదా అవుతున్నారు View this post on Instagram A post shared by GRAZIA India (@graziaindia) తాను ఒకేసారి ఐదు సినిమాలు తీయనని, తన బాడీ, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని,పనిని తగ్గించానని గ్రాజియతో తెలిపింది. అయితే చేసే ప్రతీ పనిలో పూర్తి శక్తిని పెడుతున్నాననీ,పరిమాణం తగ్గి ఉండవచ్చు కానీ ప్రాజెక్టుల నాణ్యత ఖచ్చితంగా పెరిగిందని స్పష్టం చేసింది. జీవితంలో ప్రతిదీ నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం పైనే ఉంటుంది. నిద్ర, ఆహారం,మానసిక ఆరోగ్యం గురించి గతంలో కంటే కఠినంగా ఉంటున్నానని చెప్పింది. అలాగే చాలెంజింగ్ పాత్రలు, ముఖ్యంగా మహిళల కోసం ముఖ్యమైన చిత్రాలను తీసుకోవాలనుకుంటున్నాను. ఆధునిక స్త్రీని సూచించే పాత్రలను పోషించాలనుకుంటున్నా అవి రావడ కష్టంమే కానీ అదే లక్ష్యం అని పేర్కొంది. కాగా సమంత నిర్మాతగా వచ్చిన తొలి సినిమా శుభం'. మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమాలోఅతిథి పాత్రతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా -
400 లగ్జరీ బ్యాగ్స్, ఈ పిచ్చిలేకపోతే ముంబైలో పెంట్ హౌస్ కొనేదాన్ని: నటి
సెలబ్రిటీ విమెన్ అంటే లగ్జరీ బ్యాగులు, లగ్జరీ కార్లు కామన్. లగ్జరీ వస్తువుల కలెక్షన్ అనగానే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ గుర్తు వస్తారు. కానీ ఈ విషయంలో నేనేమీ తక్కువ కాదంటోంది బాలీవుడ్ అందాలభామ అమీషా పటేల్.అమీషా పటేల్ వద్ద వందల సంఖ్యలో లగ్జరీ బ్యాగులున్నాయి. దీంట్లో ఒక బ్యాగు ఖరీదు రూ. 70 లక్షలు. ఈ బ్యాగులు కొనకపోతే ఆ డబ్బులతో ముంబైలో పెంట్ హౌస్ కొనేదాన్ని అని స్వయంగా అమీషానే జోక్ చేసిందంటే వాటి విలువను అర్థం చేసుకోవచ్చు.ఫరా ఖాన్ ప్రముఖుల ఇళ్లను సందర్శించే యూట్యూబ్ షో తాజా ఎపిసోడ్లో దక్షిణ ముంబైలోని నటి అమీషా పటేల్ (ఆగస్టు 18 సోమవారం) ఇంటిని సందర్శించిన వీడియోను పంచుకుంది, దీనిలో ఆమె రెడ్ చికెన్ థాయ్ కర్రీని కూడా వండింది, కహో నా... ప్యార్ హై షూటింగ్ ,థాయిలాండ్లో ప్రతి రాత్రి ఆ వంటకం తినడం గురించి గుర్తుచేసుకుంది.ఇంకా ఈ వీడియోలో తన ఇంటితోపాటు ,స్పెషల్ ఎడిషన్ బ్యాగులు , విలాసవంతమైన షూ కలెక్షన్లతో నిండిన బహుళ అల్మారాలను కూడా చూపించింది.400 బ్యాగులు, రూ. 70 లక్షల బ్యాగు కూడాఅమీషా అల్మారాలో బ్యాగుల ధర 5 లక్షల నుండి ప్రారంభమవుతాయనీ, డిజైన్ సేకరణను బట్టి పది లక్షల వరకు ఉంటుందని తెలిపింది. డియోర్ , బొట్టెగా వెనెటా నుండి బిర్కిన్స్ అండ్ YSL టోట్ల వరకు తన దగ్గర ఉన్న ప్రతీవిలువైన వస్తువును పరిచయం చేసింది. తన దగ్గర ‘300-400’ వరకు బ్యాగులు ఉంటాయని వెల్లడించింది. అమీషా పటేల్కు లగ్జరీ బ్యాగ్స్ అంటేచిన్నప్పటినుంచీ చాలి ఇష్టమట. తాజాగా తన దగ్గర ఉన్న బ్యాగ్స్ కలెక్షన్స్, ఖరీదైన బ్యాగ్ గురించి చెప్పుకొచ్చింది. తన దగ్గర ఉన్న ఖరీదైన బ్యాగ్ బిర్కిన్ బ్యాగ్ ధర రూ. 70 లక్షలు ఉంటుందని బయటపెట్టింది. వీటితోపాటు 365 క్లచ్లు బెల్ట్ బ్యాగులు కూడా ఉన్నాయి. అంతేకాతు తనకెంతో ఇష్టమైన పింక క్రోక్ బిర్కిన్ లెదర్ బ్యాగు గురించి ప్రత్యేకంగా చెప్పింది. దాదాపు 15 సంవత్సరాల క్రితం కొన్నప్పుడు, లేత గులాబీ రంగులో ఉండేదట. క్రమంగా తోలు రంగు మరింత అందంగామారుతోందని చెప్పుకొచ్చింది.ఇక అమీషా షూ కలెక్షన్ విషయానికి వస్తే ఒక్కో షూ ధర రూ. 80,000 నుండి లక్ష వరకు ఉంటుంది. అలాంటివి వందల జతలు ఆమె అల్మారాలో ఉన్నాయి. అమీషా పటేల్ ముంబై ఇల్లుఆమె వ్యక్తిగతంగా తీర్చిదిద్దుకున్న అమీషా ముంబై ఇంటిలో సౌకర్యం లగ్జరీ అభిరుచి కలగలిపి దర్శనమిస్తాయి. పచ్చదనం, వెలుతురు ప్రాధాన్యతనిచ్చింది. అంతేకాదు గోడలనిండి ఫోటోలు, అరుదైన MF హుస్సేన్ పెయింటింగ్లతో తన కళాభిమానాన్ని చాటుకుంది. అమీషా చివరిగా 2023లో హిట్ మూవీ గదర్ 2లో నటించింది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా లో సన్నీ డియోల్ ఉత్కర్ష్ శర్మ కూడా నటించారు. ఈ చిత్రం గదర్: ఏక్ ప్రేమ్ కథ (2001) కి సీక్వెల్. -
కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా
ఇంటినీ, కుటుంబాన్ని చక్కదిద్దడంలో మాత్రమే కాదు.. అడుగు పెట్టిన రంగం ఏదైనా పట్టుదలగా ఎదిగి, తమ ఆసక్తిని,కలలను నెరవేర్చుకున్న ధీరవనితలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా పురుషులకే సాధ్యం అనుకునే వ్యాపార రంగంలో అడుగు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఫల్గుణి నాయర్, వినితా సింగ్, ఇందిరా పూరి ఇషా అంబానీ కార్పొరేట్ సీఈవోలుగా ఎదుగుతున్నారు. మరికొంతమంది మహిళలు తమ కృషి ఆధారంగా స్టార్టప్లలో కూడా తామేంటో నిరూపించు కున్నారు. అంతేకాదు తక్కువ పెట్టుబడితోనే అద్భుతాలు చేస్తూ తనలాంటి ఎందరో ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాంటి వారిలో ఒకరు నిధి యాదవ్. ఆమె సాధించిన విజయం ఏమిటో తెలుసుకుందామా!ఇండోర్లో జన్మించిన నిధికి ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన నిధి డెలాయిట్లో పనిచేసేది. ఐదంకెల జీతం. కానీ అది సంతృప్తి నివ్వలేదు. తన అభిరుచిని కెరీర్గా మార్చుకోవడానికి, నిధి కూడా ఫ్లోరెన్స్లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్లో ఒక సంవత్సరం కోర్సు చేసింది. అలా సొంత వ్యాపారం మొదలు పెట్టాలనే కోరికతోపాటు,కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు భారతదేశానికి తిరిగి రావాలనే పెద్ద ముందడుగు వేసింది. తన సొంత బ్రాండ్ను సృష్టించాలని నిర్ణయించుకుంది. అప్పటికే వివాహం, ఏడు నెలల పసిబిడ్డ ఉన్నా కూడా తన ఆశయానికి కట్టుబడి ఉంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, డెలాయిట్లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. 23 ఏళ్ల వయస్సులో ఉద్యోగాన్ని వదిలివేసి భర్తతోకలిసి తన సొంత దుస్తుల బ్రాండ్ను ప్రారంభించింది. 2014లో గురుగ్రామ్లోని తన 2BHK ఇంట్లో రూ.3.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఆక్స్ క్లోతింగ్ను ప్రారంభించింది.స్టైలిష్ ఎథ్నిక్ వేర్ను సరసమైన ధరల్లో అందించాలి, ముఖ్యంగా 18-35 సంవత్సరాల వయస్సు గల యువతులను లక్ష్యంగా చేసుకుంది. అనుకున్నట్టుగానే ఆమె వెంచర్ త్వరగా ఆదరణ పొందింది.2021 నాటికి రూ.200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. చాలా తక్కువ సమయంలో ఆక్స్ ప్రజాదరణ పొందింది. కంపెనీ కేవలం ఒక సంవత్సరంలో రూ. 8.50 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది 2018లో, కంపెనీ ఆదాయం రూ. 48 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలోనే కంపెనీ ఒక రేంజ్కి చేరింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.అంటే 2014లో రూ. 1.60 కోట్లుగా ఉన్న ఆదాయం 2015లో రూ. 8.50 కోట్లకు, ఆ తర్వాత 2018 నాటికి రూ. 48 కోట్లకు పెరిగింది. 2021 నాటికి, ఆక్స్ ఎటువంటి బాహ్య నిధులు లేకుండానే రూ. 200 కోట్ల ఆదాయాన్ని అధిగమించింది.రూ. 500 కోట్ల టర్నోవర్తోపాటు గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది నిధియాదవ్.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుబ్రాండ్ ప్రారంభ రోజుల్లో, నిధి ఆమె భర్త తమ పసికందుతో కలిసి గురుగ్రామ్,జైపూర్ మధ్య వారాంతపు తిరుగుతూ సామాగ్రిని సేకరించేవారు. ఈ కష్టాల మధ్య కోవిడ్ మహమ్మారి మరో సవాల్ విసిరింది. దీంతో పాటు కొత్త అవకాశాల్ని కూడా తెచ్చిపెట్టింది. క్లోతింగ్ ఉత్పత్తి సంక్షోభం తరుణంలో ఆక్స్ మాస్క్లు , PPE కిట్లను తయారు చేయడంలో పై చేయి సాధించింది. అలా కోవిడ్ కాలంలో బ్రాండ్ వృద్ధి 25 శాతం పెరిగిందంటే ఆమె కృషిని అర్థం చేసుకోవచ్చు. మిగిలిపోయిన బట్టను ఉపయోగించి పిల్లల దుస్తుల శ్రేణిని కూడా ప్రారంభించింది.ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ! -
టమాటాలతో 'బయోలెదర్'..! పర్యావరణం మెచ్చే ఫ్యాషన్ ప్రొడక్ట్స్..
ప్యాషన్ యాక్ససరీల్లో లెదర్ బ్రాండెడ్ వస్తువులది ఒక ప్రత్యేక స్థానం. అలాంటి లెదర్ కారణంగా ఎన్నో జంతువులు చనిపోతున్నాయనే విషయం తెలిసిందే. పైగా ఇది పర్యావరణ అనుకూలమైంది కూడా కాదు. దీనికి చెక్పెట్టేలా పర్యావరణ హితంగా ఆహార వ్యర్థాలను నివారించే దిశగా ఒక సరికొత్త లెదర్ని తీసుకొచ్చారు ప్రితేష్ మిస్త్రీ. ఈ సరికొత్త ఆవిష్కరణతో లెదర్ ప్లేస్లో బయోలెదర్ని తీసుకొచ్చి..జంతువులకు హాని కలగకుండా కాపాడటమే గాక పర్యావరణ హిత ఫ్యాషన్ ఉపకరణాలకు నాంది పలికారు. ఆయనకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..ముంబైకి చెందిన ప్రితేష్ మిస్త్రీకి కాలేజ్లో ఇంజనీరింగ్ చదివే సమయంలో ఈ ఆలోచన తట్టింది. అయితే తన చివరి సంవత్సరం ప్రాజెక్టులో భాగంగా ఈ దిశగా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాడు. ఆ ఆవిష్కరణ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఆయన బయోలెదర్ కోసం టమాటా వ్యర్థాలనులను వినియోగించారు. దాని నుంచి తయారు చేసిన లెదర్తో బూట్లు, బ్యాగ్లు వంటివి కూడా రూపొందించారు. వీటిని టీబీసీ బ్రాండ్ ఉత్పత్తులుగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. వాటికి అత్యంత ఆదరణ లభించడమే గాక అందరి ప్రశంసలందుకుంది. అంతేగాదు 2021 పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డుల్లో కూడా ఈ టీబీసీ బయోకంపెని ఉత్పత్తులు ఉత్తమ ఆవిష్కరణగా నిలిచాయి. టమాటాలే ఎందుకు..టమాటాలను ప్రాథమిక ముడి పదార్థంగా ఉపయోగించి పాలియురేతేన్, పాలీ వినైల్ క్లోరైడ్ వంటి ప్లాస్టిక్ చోటివ్వకుండా బయోలెదర్ సృష్టించాలన్నది మిస్త్రి లక్ష్యం. జంతువులకు కూడా హాని కలిగించకుండా చేయాలన్నది ప్రధాన అజెండా. ఇక అందుకోసం ఈ టమాటాలనే ఎందుకు ఎంచుకున్నారంటే..భారతదేశం ఏడాదికి 44 మిలయన్ల టన్నుల టమాటాలను ఉత్పత్తి చేస్తున్న రెండో అతిపెద్ద దేశం కావడంతో ఈ కూరగాయను ఎంచుకున్నాడు మిస్త్రీ. అదీగాక ఏటా వాటిలో 30 నుంచి 35% వరకు టమాటాలు వృధా అయిపోతున్నాయి. కాబట్టి ఆ సమస్యకు చెక్పెట్టి..పర్యావరణ హితంగా బయోలెదర్ తయారు చేయాలని భావించాడు. అందులోనూ టమాటాలో స్కిన్, విత్తనాలు, పెక్టిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది లెదర్ తయారీకీ అత్యంత అనుకూలం అని తెలిపారు మిస్త్రీ. అలాగే జంతువుల చర్మం నుంచి చేసే లెదర్ తయారీ ఫ్యాక్టీరీల నుంచే వచ్చే కాలుష్యాన్ని కూడా ప్రత్యక్షంగా చూడటంతో ఇలా పర్యావరణ హితంగా, ఆహార వ్యర్థాలను నివారించే బయో లెదర్ తయారు చేయాలనుకున్నట్లు తెలిపారు. అయితే తాము లెదర్ తయారు చేయగలిగాం కానీ, దాని, ఆకృతి, మనిక పరంగా నెలల తరబడి శ్రమిస్తే గానీ మంచి నాణ్యమైన బయో లెదర్కి బీజం పడలేదని వివరించారు. అలాగే సహజ రంగులనే ఉపయోగించేలా కేర్ తీసుకుంటామని చెప్పారు. తమ టీబీసీ కంపెనీ టమాటాలు బాగా పండే గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలోని ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల సాయంతో పొలాల నుంచి నేరుగా టమాటా వ్యర్థాలను సేకరిస్తారట. దాన్ని లెదర్ తయారీకి వీలుగా ఉండే వనరుగా మారుస్తారట. ఆ తర్వాత మొక్కల ఆధారిత బైండర్లు, సహజ ఫైబర్ల సాయంతో మన్నికైన బయోలెదర్ని తయారు చేస్తామని తెలిపారు. ఆకృతి కోసం విషరహిత క్యూరింగ్ చేస్తామని చెప్పారు. అలా 2024 మే నాటికి బయోలెదర్తో తయారు చేసిన వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించామని తెలిపారు. ఇంటీరియర్ డిజైన్, ఆటోమెటివ్ పరిశ్రమలకు పనికొచ్చేలా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పైగా ఈ లెదర్ ఆహ్లాదకరమైన వాసనను వెదజల్లుతుందని చెప్పారు. నిజంగా ఇది అలాంటి ఇలాంటి ఆవిష్కరణ కాదు కదా..పర్యావరణం మెచ్చే లెదర్ ఉత్పత్తులు కదూ..!. View this post on Instagram A post shared by Bioleather (@bioleather) (చదవండి: డిజిటల్ డ్యామేజ్..! అంతకంతకు మయోఫియా వ్యాధులు..) -
ఫ్యాషన్ క్లిక్.. ట్రై లుక్ : మువ్వన్నెల వస్త్రాలు
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల వస్త్రధారణలో భాగం కావడం సాధారణమే. అయితే ఈ మూడూ ఒకే డ్రెస్సింగ్లో మేళవింపుగా చూడాలంటే అది ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సాధ్యం. భారత జాతీయ జెండాను ప్రకాశింపజేసే త్రివర్ణాలను రంగరించి ఫ్యాషన్ ఔత్సాహికులు వస్త్రధారణ కాంతులీనేలా చేయడం ఇప్పుడు నగరంలో సర్వసాధారణంగా మారింది. ఆయా సందర్భాలు, సంఘటలకు అనుగుణంగా వస్త్రధారణలో మార్పులు ప్రస్పుటంగా కనిపించేలా అదరగొట్టే లుక్తో ఆకట్టుకుంటున్నారు. ఈ వస్త్రధారణలో దుస్తులతోపాటు వివిధ రకాల యాక్సెసరీస్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో భారతీయ జెండా రంగులను – కాషాయం (ధైర్యం), తెలుపు (శాంతి) ఆకుపచ్చ (సంపద/ శ్రేయస్సు) దుస్తుల్లో చేర్చడం ఆనవాయితీగా మారింది. ఈ సందర్భంగా మహిళలు మూడు రంగుల్లో సొగసైన చీరలు, సల్వార్ కమీజ్ సెట్స్ లేదా కుర్తాలను ఎంచుకుంటున్నారు. అలాగే కాషాయం దుపట్టా, ఆకుపచ్చ గాజులతో తెల్లటి కుర్తాలను జత చేయడం లేదా పూర్తి త్రివర్ణాలు కలగలిసిన చీర ధరించడం కూడా ట్రెండ్ అవుతోంది. ‘మిగిలిన రోజుల్లో ఎన్ని ఫ్యాషన్స్ ఫాలో అయినా, ప్రత్యేక సందర్భాల్లో ట్రై కలర్స్ మన డ్రెస్సింగ్లో మేళవించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాం. ఈ వస్త్రధారణ మన ఫ్యాషన్ సెన్స్ చాటి చెప్పడానికి కాదు.. మనం భారతీయులం అని సగర్వంగా చెప్పుకోడానికి కదా’ అంటున్నారు నగరానికి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ కాచిగూడ నివాసి గౌరీ జోషి. ఇదే అభిప్రాయన్ని పూర్తిగా బలపరుస్తున్నారు నగర మహిళ సుమన్ కృష్ణ. ‘ఇది ఫ్యాషన్ షో కాదు.. మన అస్తిత్వ ప్రదర్శన’ అంటారామె. ఖాదీ.. హైదరాబాదీ.. పురుషులు కుర్తాలు, నెహ్రూ జాకెట్లు లేదా జాతీయవాద స్పర్శతో కూడిన సాధారణ టీ షర్ట్స్ కూడా ఇండిపెండెన్స్ లుక్లో భాగం చేస్తున్నారు. ఖాదీ అనేది కేవలం ఒక ఫ్యాబ్రిక్ మాత్రమే కాదు. ఇది నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం. అందుకే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖాదీ లేదా భారతీయ చేనేత వ్రస్తాలను కూడా అనేక మంది ధరిస్తున్నారు. తద్వారా భారతదేశ స్వాతంత్య్ర పోరాట మూలాలను స్మరించుకోవడంతో పాటు స్థానిక చేనేత కళాకారులకు మద్దతు అందించినట్టుగా భావిస్తున్నారు. అలాగే ఈ ట్రెండ్స్లో లినెన్ కాటన్, చందేరి ఖాదీ మిశ్రమాలు కూడా స్టైలిష్గా ప్రదర్శిస్తున్నారు. ‘జాతీయత ప్రతిబింబించే వస్త్రధారణ ఎంచుకున్నప్పుడు నా డ్రెస్సింగ్లో ఖాదీ తప్పనిసరిగా ఉండాల్సిందే’ అని చెప్పారు నగరానికి చెందిన ఈవెంట్ మేనేజర్ రాజ్ కిషోర్. స్వేచ్ఛా స్ఫూర్తిని తెలిపేలా.. : స్వేచ్ఛా స్ఫూర్తిని వ్యక్తీకరించడానికి ఫ్యాషన్ ఒక శక్తిమంతమైన మార్గం అంటున్నారు నగరానికి చెందిన హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ. వారు అందిస్తున్న విశేషాలివి.. త్రివర్ణాలు (కుంకుమ, తెలుపు, లేదా ఆకుపచ్చ) కలిగన కుర్తాలను ఎంచుకుని, దానికి నప్పేలా లేదా కాంట్రాస్ట్గా ఉండే పైజామా జత చేయాలి. వీటికి అనుగుణమైన షేడ్లో దుపట్టా జోడించడం ఫ్రీడమ్ లుక్కి మెరుపునిస్తుంది.స్వేచ్ఛను సగర్వంగా వేడుకగా జరుపుకోవడంలో ఆత్మవిశ్వాసం కనిపించాలి. అధికారిక సమావేశాలకు, సంప్రదాయ దుస్తులు, చీర లేదా కుర్తా, పైజామా వంటివి సరైన ఎంపిక. అయితే సాధారణ సమావేశాలకు, మరింత ఆధునిక శైలితో ప్రయోగాలు చేయవచ్చు. త్రివర్ణంలో మెరిసే గాజుల నుంచి స్కార్ఫ్లు, హెడ్ బ్యాండ్స్, రిస్ట్బ్యాండ్స్ వరకూ విభిన్న రకాల యాక్సెసరీస్ కూడా ఫ్రీడమ్ ఫ్లేవర్ జోడించడానికి సులభమైన మార్గం. సాధారణ ట్రై కలర్స్లో మెరిసే హెయిర్ క్లిప్తో కూడా ఇండిపెండెన్స్ డే లుక్ ప్రతిబింబించవచ్చు. స్ఫటికంలా మెరిసే తెల్లటి టాప్కి జీన్స్, జాకెట్ లేదా వేరే డ్రెస్ ఏదైనా స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రస్ఫుటించేలా క్లాసిక్ డెనిమ్ దుస్తులు ధరించి, వాటికి ట్రై కలర్ యాక్సెసరీస్ జోడిస్తే అందంగా తళుక్కుమనేలా కనిపిస్తారు. ఇది ఓ రకంగా ఫ్యూజన్Œ స్వేచ్ఛను కనబరుస్తుంది. ధోతి–చీర సంప్రదాయ ట్రెండ్ను మిళితం చేస్తుంది. ఇది ఫ్యాషన్–ఫార్వర్డ్ సౌకర్యవంతమైన విధంగా జరుపుకోడానికి అనువైన ఎంపికగా చేస్తుంది. హామ్ స్టెక్ కాలేజ్ ఆఫ్ డిజైన్ ఇయర్ రింగ్స్ టు.. లెగ్గింగ్స్.. చెవిపోగుల నుంచి ట్రైకలర్స్తో ఎంబ్రాయిడరీ చేసిన జుతా (ఓ రకమైన పాదరక్షలు)ల వరకూ, యాక్సెసరీస్ కూడా ఫ్రీడమ్ స్ఫూర్తిని చాటేలా వినియోగిస్తున్నారు. అలాగే బ్యాగులు, దుపట్టాలు మాసు్కలు సైతం త్రివర్ణ శోభితంగా మారుతున్నాయి. పాఠశాలలు లేదా కళాశాలల్లోని అబ్బాయిలు అమ్మాయిలు త్రివర్ణాల థీమ్తో టీ షర్ట్స్, స్నీకర్స్ ఎంచుకుంటున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా త్రివర్ణాల థీమ్లతో కూడిన ఫ్యామిలీ కాంబో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ‘ప్రౌడ్ ఇండియన్’ అనే క్యాప్షన్ రాసున్న కస్టమైజ్డ్ టీ షర్ట్స్ స్కూల్స్లో విరివిగా కనిపిస్తున్నాయి. పర్యావరణ స్పృహతో మేళవించిన ఫ్యాషన్ అనుసరణీయంగా మారింది. ఆర్గానిక్ కాటన్, రీసైకిల్ చేసిన దుస్తులు కూడా వినియోగిస్తు న్నారు. -
ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ విజేతగా బంగ్లా చంద్రలేఖ
ఫరెవర్ మిసెస్ ఇండియా 2025 హైదరాబాద్ విజేతగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన బంగ్లా చంద్రలేఖ నిలిచారు. జైపూర్ జీ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ టైటిల్ గెలుచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెరల్ సిటీ హైదరాబాద్ నుంచి పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపారు. షారా ఫ్యాషన్ డిజైనింగ్ వ్యవస్థాపకురాలిగా వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూ, కార్పొరేట్ కంపెనీలో టీమ్ లీడర్గా రాణిస్తూనే ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పారు. నటన, మోడలింగ్ అంటే ఇష్టం. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్లో అడుగు పెట్టాను. నా ఇష్టాలకు కుటుంబ సభ్యుల సహకారం తోడైందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనే గట్టి నమ్మకాన్ని కలిగిస్తోందన్నారు. అందం, ఆత్మస్థైర్యంహైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎస్కే మిసెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్, మిసెస్ తెలంగాణ కిరీటాలను గెలుచుకున్న ప్రియాంక తారే తన వ్యక్తిత్వం, ప్రతిభ, పట్టుదలతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నోయిడాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎస్కే యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ 2025 సీజన్ 27లో ఆమె సౌందర్యం, సమతుల్యత, ఆత్మవిశ్వాసం జడ్జీలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విజేతగా ఎంపిక చేశారు. ఛత్తీస్గఢ్ భిలాయ్కు చెందిన ప్రియాంక ఈ పోటీల్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించారు. కార్పొరేట్ లీడర్గా, ఈవెంట్స్, ఎచ్ఆర్, సీఎస్ఆర్ రంగాల్లో రాణించడమే కాకుండా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా, గాయనిగా, నృత్యకారిణిగా తన బహుముఖ ప్రజ్ఞ చాటుకుంది. టీఎస్ఈ8 ఉమెన్స్ అచీవ్మెంట్ అవార్డు 2025తో పాటు యూట్యూబ్, ఇన్స్టా్రగామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. (చదవండి: International Youth Day: విజయకేతనం ఎగరేసిన ధీర యువత..!) -
10వేల క్రిస్టల్స్, ఐవరీ వైట్ లెహంగాలో జాన్వీ డాజ్లింగ్ లుక్
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కోచర్ కలెక్షన్ క్వాంటం ఎంటాంగిల్మెంట్ను ముంబైలో ఆవిష్కరించారు ఈ బ్రైడల్ కోచర్ షోలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ అందంగా మెరిసిపోయింది. మొన్న మసాబా గుప్తా బ్రైడల్గా అందంగా మురిపించిన జాన్వీ తాజాగా గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన లెహంగాలో అభిమానులను మెస్మరైజ్ చేసింది. జాన్వీ ధరించిన లెహెంగాకు సంబంధించి కొన్ని వివరాలను గౌరవ్ గుప్తా ఇన్స్టాలో షేర్ చేశారు.ఐవరీ వైట్ స్వర్ణమ లెహంగా, పొడవైన దుపట్టాలో అద్భుతమైన లుక్లో జాన్వీ అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఈ షోలో జాన్వీ షోస్టాపర్గా నిలిచింది. గౌరవ్తో కలిసి అభిమానులను పలకరించింది. దీనికి తోడు డైమండ్ ఆభరణాలతో దేవకన్యలా మెరిసింది. 10వేలకు పైగా స్ఫటికాలతో ఈ లెహంగాను డిజైన్ చేశారట. అంతేకాదు జాన్వీ సోదరి ఖుషీ కపూర్లో కూడా ఈ బ్రైడ్ల్ షోలో సందడి చేసింది. (పండగ వేళ గుడ్ న్యూస్ : లక్షల టన్నుల బంగారం నిక్షేపాలు, ఎక్కడ?) View this post on Instagram A post shared by Gaurav Gupta (@gauravguptaofficial) ఈ ఇంకా షోలో డైరెక్టర్ కిరణ్రావు, దుల్కర్ సల్మాన్, విజయ్ వర్మ, మలైకా అరోరా, శ్రియా శరణ్ దిశా పఠాని, తదితర ఫిలిం స్టార్లు, పలువురు మోడల్స్ మెరిసారు. ఈ షోకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదీ చదవండి: బుల్లితెర నటి సమీరా ఔదార్యం, బంగారం లాంటి పని -
సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్గా..!
మెటాలిక్ కలర్, మిర్రర్ వర్క్ డ్రెస్లో నటి ఖుషీ కపూర్ హ్యూందయ్ ఇండియన్ కొచర్ వీక్లో మెరిసిపోయారు. డిజైనర్ రిమ్జిమ్ దాదు చేసిన ఈ మోడర్న్ డిజైన్స్కి గుజరాతీ సంచార జాతుల హస్తకళ ప్రేరణగా నిలిచింది. ఎవర్గ్రీన్గా నిలిచే కలర్స్కి తోడైన ప్రాచీన హస్తకళ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ను ఆమె తన డిజైన్స్కి జత చేశారు.ఖుషీ కపూర్ ధరించిన కస్టమ్ టెక్ట్స్టైల్ బ్రాకెట్–స్టైల్ బ్లౌజ్, హై–వెయిస్టెడ్ లెహంగా ఎంగేజ్మెంట్, రిసెప్షన్ వంటి వేడుకలలో హైలైట్గా నిలిచే లక్ష్యంతో ఈ డ్రెస్ను రూపొందించారు. మెటాలిక్ కలర్లోనే స్కర్ట్ అంతా మిర్రర్ వర్క్ చేశారు. బంజారా సంచార స్ఫూర్తితో ప్రేరణ పొందిన ఈ సేకరణలో మెటాలిక్ తీగలను ఉపయోగించారు. దీంతో బంజారా తెగ సాంస్కృతిక వారసత్వం హైలైట్ అయ్యింది. ‘బంజారాతో దుస్తులకు ఉన్న సంబంధాన్ని, అది తనకు తెచ్చిన అందం, సౌకర్యాన్ని ఇష్టపడుతున్నాన’ని ఖుషీకపూర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ను ఆమె తన డిజైన్స్కి జత చేశారు. ఇతర మోడల్స్ ధరించిన డ్రెస్సులను డిజైనర్ దాదు తన బ్రాండ్ సిగ్నేచర్ మెటల్ వైర్ల నుండి రూపొందించిన టైలర్డ్ ఫారమ్స్, స్కల్ప్చర్ డ్రేప్లతో ఆకట్టుకుటోంది. ఈ డిజైన్స్లో పైస్లీ మోటిఫ్లు మెరుస్తూ ఆకట్టుకున్నాయి. మన దేశీయ వారసత్వ హస్తకళా సంపద ఎన్నటికీ వన్నెతగ్గదని నిరూపిస్తూ డిజైనర్లు స్ఫూర్తిమంతమైన డిజైన్స్ మన ముందుకు తీసుకువస్తూనే ఉంటారు. మన మూలాల గొప్పతనాన్ని ఎప్పటికీ నిలిచి ఉండేలా ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటారు. (చదవండి: సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..) -
ముసురులో ముచ్చటైన ఆహారం..! పోషకాలు ఫుల్..
ముసురులో వేడివేడిగా.. ముచ్చటైన ఆహారం తినాలని ఎవరికి ఉండదు.. అలాంటి ఆహారాల్లో చెప్పుకోదగినది.. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న వస్తువులతో సిద్ధం చేసుకోగలిగినది ఏదైనా ఉందంటే.. అది కిచిడీ ఒక్కటే.. అంతేకాదు.. నగరంలో అనేక మందికి ఇది అభిమాన బేక్ర్ఫాస్ట్ డిష్ కూడా. రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ దేశీ వంటకం ప్రపంచ గ్యాస్ట్రోనామిక్ మెనూలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విభిన్న రకాల కూరగాయలు, దినుసుల మేళవింపుతో అనేక పోషక విలువలు దీని సొంతమని ఆహార నిపుణులు చెబుతోన్న మాట.. శుభ్రత, ఆరోగ్యం, రుచిని కలగలిపే భారతీయ వంటకం కిచిడీ. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ నప్పే, నచ్చే వంటకంగా చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా మన దేశపు ‘సూపర్ ఫుడ్’గా కూడా ఇది గుర్తింపు పొందుతోంది. భారత్ నుంచి ప్రపంచ గ్యాస్ట్రోనామిక్ మెనూలో బిర్యానీ, పంజాబీ కడీ, దోస, రాజ్మా చావల్ తరహాలో కిచిడీ కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన రోజువారీ ఆహారంలో కిచిడీని భాగం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సినీ సెలబ్రిటీలు కరణ్ జోహార్, తమన్నా భాటియా, మంధిరా బేడీ, క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్ వంటి ప్రముఖులు కూడా కిచిడీ లవర్స్గా తమను తాము చెప్పుకుంటున్నారు. ఆరోగ్యానికీ మేలు.. మనలో చాలా మందికి చిన్నప్పటి జ్ఞాపకాలలో కిచిడీ రుచులు తప్పకుండా ఉంటాయి. అరుగుదల సులభం అనే ఆలోచనతోనే కిచిడీకి అంత క్రేజ్ వచ్చిందనేది నిస్సందేహం. రుచిగా ఉండటమే కాదు, దీనిని ప్రత్యేకంగా వండే శైలి కారణంగా తేలికగా జీర్ణం కాగలదు. ఇది కొన్ని వెరైటీల్లో ఎక్కువగా ముద్దలాగా తయారవుతుంది. కొన్ని రకాల్లో ఘన పదార్థంలా ఉంటుంది. అయినా ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి దోహదపడుతుంది. వర్షం, ముసురు పట్టిన రోజుల్లో లేదా అనారోగ్య సమయంలో తినడానికి శ్రేష్ఠమైన ఆహారం. కిచిడీ సులభంగా జీర్ణమవుతుంది. అనేక విధాలుగా తయారు చేయొచ్చు. ప్రతి ఒక్కరికీ సరిపోయే ఆహారం ఇది అంటున్నారు సెలబ్రిటీ చెఫ్ సంజీవ్ కపూర్. ప్రొటీన్లు, విటమిన్లు అధికం..దీనిలో ఉండే మసాలాలు, మినపప్పు, బియ్యం వంటి పదార్థాల వల్ల ఇది శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు అందిస్తుంది. తేలికగా జీర్ణం కావడం మాత్రమే కాదు.. ఇది జీర్ణశక్తిని మెరుగుపరిచే ఆహారం కూడా. బియ్యంలో కలిపే ‘ హింగు (ఇంగువ), మిరియాలు, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి వంటి మసాలాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఇటీవలే ఓ ప్రదర్శనలో చెఫ్ శివజిత్ సూరి మూంగ్ దాల్, మష్రూమ్స్, ట్రఫుల్ నూనె, గ్రీన్ బీన్స్ వంటి పదార్థాలతో కిచిడీ అంతర్జాతీయ ఫ్లేవర్ తీసుకొచ్చి ఆహార ప్రియుల్ని ఆకట్టుకున్నారు. వీటితోపాటు సాబూదాన్, వెజిటబుల్స్, చిరుధాన్యాలతో చేసే కిచిడీ వెరైటీల రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. నగరంలో ఎక్కడెక్కడ? ఈ కిచిడీ ప్రియుల కోసం నగరంలో పలు రెస్టారెంట్స్ వెరైటీ డిష్లను అందిస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్లలోని ఈట్ ఫిట్ రెస్టారెంట్లోని గ్రేట్ ఇండియన్ కిచిడీ, జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లలో ఉన్న అంతేరా కిచెన్, ఎమ్ఓఏఐ, కృష్ణపట్నం, మోడ్రన్/కాంటినెంటల్ వంటలతో కూడిన రెస్టారెంట్లలోని కిచిడీలు మంచి రేటింగ్స్ పొందాయి. అలాగే అమీర్పేట్లోని హబీబో అందించే దాల్ కిచిడీ, జూబ్లీహిల్స్, హైటెక్సిటీలలో ఉన్న డైలీ రిచ్యువల్స్, టెర్రాయ్ అండ్ నియో తెలంగాణ కిచెన్, రెడ్ రినో, హోటల్ నయాబ్, టోలిచౌకిలోని హోటల్ రుమాన్, షాగౌస్లు అందించే కిచిడీ ఖీమా అండ్ కట్టా వంటివి కిచిడీ వంటకాలకు పేరొందాయి. (చదవండి: శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్గా మెరుద్దాం ఇలా..!) -
సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..!
ప్రస్తుత కాలంలో ప్రతిదీ ఓ ట్రెండే.. అది ఫ్యాషన్ అయినా.. లైఫ్ స్టైల్ అయినా.. పేర్లు, ఇష్టాలు, అభిప్రాయాలు, ఆసక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో.. వాడే వస్తువులు, ధరించే దుస్తుల ద్వారా తమ భావాన్ని వ్యక్తికరించాలనే తపనలో ప్రస్తుత తరం యువత ఆలోచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మధ్య కాలంలో విడుదలైన పుష్ప సినిమాలోని డైలాగ్ గుర్తుందా..! ‘పుష్ప అంటే పేరుకాదు పుష్ప అంటే బ్రాండ్’ అన్నట్లు బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతోంది నేటి యువత. అయితే ఇందులోనూ ఎవరి ట్రెండ్ వారిదే.. ఎవరి బ్రాండ్ వారిదే.. ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కేవలం అందాన్ని పెంచేదో, ఆధునికతను చూపించేదో మాత్రమే కాదు. తమ తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే సాధనంగా కూడా మారిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘తమ గురించి తాము చెప్పుకునే’ ఫ్యాషన్ ట్రెండ్. ఇప్పుడు నగరంలో ఈ తరహా ట్రెండ్ ఊపందుకొంది. వ్యక్తిగత అభిరుచిని బట్టి అలాంటి సెల్ఫ్–ఎక్స్ప్రెషన్ స్టైల్స్ విభిన్న రకాలుగా ఉంటున్నాయి. ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే స్టైల్స్ ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా పలు బ్రాండ్లు సైతం వినూత్న ఫ్యాషన్లను ఆవిష్కరిస్తున్నాయి. కఫ్ లింక్స్ పై పేర్లు.. ఇటీవల తమ పేరు లేదా వ్యక్తిగత గుర్తింపుతో కూడిన కఫ్ లింక్స్ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విభిన్న అలంకరణలతో, చేతి చివర్లలో ధరించే ఈ కఫ్ లింక్స్లో పేరు, ఇంకేమైనా ప్రత్యేకమైన డిజైన్లు చెక్కించుకుంటున్నారు. ఒకప్పుడు కార్పొరేట్ ఫార్మల్ వేర్లో భాగంగా మాత్రమే వినియోగించే హ్యాండ్మేడ్ – కస్టమ్ – డిజైన్ బంగారం, వెండి లాంటి మెటల్స్తో తయారవుతున్నాయి. పేర్లు, లక్షణాల ప్రాతిపదికన డిజైన్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలాగే వీటిని బహుమతులుగానూ వినియోగిస్తున్నారు. ఈ ట్రెండ్ ముఖ్యంగా యువతలో, పెళ్లిళ్లు లేదా ఫ్యామిలీ ఫంక్షన్లలో తమ పేరు లేదా ఇనీíÙయల్స్తో ప్రత్యేకత చూపించాలనుకునే వారి వల్ల బాగా పాపులర్ అవుతోంది. ఫ్యాషన్ రంగ నిపుణులు కూడా ఈ ట్రెండ్ను ‘పర్సనలైజ్డ్ ఎలిగెన్స్’గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి కొత్త ప్రయోగాలు, సంప్రదాయ ఆధునికతల కలయికగా మన నగరంలో మారుతున్నాయని చెబుతున్నారు. కేవలం కఫ్లింక్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత గుర్తింపును ఫ్యాషన్లో కలిపే ట్రెండ్స్ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. సొంత/ఇంటి పేరుతో లేదా మొదటి అక్షరంతో డిజైన్ చేసిన గొలుసులు. నేమ్ నెక్లెస్ / ఇసీíÙయల్ పెండెంట్స్, రింగ్స్ వంటివి సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ లాంటి మెటల్స్లో లభ్యం అవుతున్నాయి. ఇది ముఖ్యంగా యువతలో, ప్రేమ జంటల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. జాకెట్లు/శాలువాలు : షర్ట్, జాకెట్స్(బ్లేజర్స్)పై పేరు లేదా చిన్న మెసేజ్ను ఎంబ్రాయిడరీతో బ్రాండెడ్ లోగో తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇది డ్రెస్కి ఓ వ్యక్తిగత టచ్ ఇచ్చేలా చేస్తుంది. కస్టమ్ మేడ్ టి–షర్ట్స్, ప్రింట్ చేసిన పేరు, ఫేవరెట్ కోట్, బర్త్డేట్ లేదా క్యారెక్టర్ డ్రాయింగ్తో కూడిన డిజైన్లు, గ్రూప్ ఈవెంట్స్, బర్త్డేలు, ట్రావెల్ వంటి సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సొంత పేర్లను కాకపోయినా, తమ భావోద్వేగాలు ప్రతిబింబించే పదాలు, సంకేతాలు టాటూలుగా వేయించుకోవడం కూడా సెల్ఫ్–ఎక్స్ప్రెషన్లో భాగమే. పేర్లు, ఇనీషియల్స్తో కూడిన స్నీకర్స్, లేదా ఫేవరెట్ డిజైన్తో ఉండే పాదరక్షలు, షూ డిజైన్లుగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ‘నైక్’ వంటి బ్రాండ్లు కూడా కస్టమైజేషన్కు అవకాశం ఇస్తున్నాయి. ఇండియన్ వెడ్డింగ్ డ్రెస్లపై పేర్లు కాడలుగా అల్లడం పెళ్లి కూతురు లేదా వరుడు దుస్తుల్లో తన పేరు లేదా జంట పేరు అల్లించుకోవడం ట్రెండ్గా మారుతోంది. అలాగే బ్యాగ్స్, వాలెట్స్, ట్రావెల్ పౌచ్లు తదితర పర్సనల్ ఐటమ్స్పై మోనోగ్రామ్లు, నేమ్ ఇనీషియల్స్తో ఉన్న హ్యాండ్బ్యాగ్స్ కూడా విరివిగా వాడుతున్నారు. ఇవి లగ్జరీ బ్రాండ్స్ (లూయిస్ విటన్, గూచి) నుంచి చిన్న ఆర్టిసన్ స్టోర్ల వరకూ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: జల్లుల సీజన్..ఒళ్లు జాగ్రత్త..! లేదంటే వర్షపు వ్యాధుల ముప్పు..) -
విచిత్రమైన షరతు!
ఇండస్ట్రీకి ‘నో డేటింగ్’ కండిషన్ తో ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్. ఇప్పుడు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ, అభిమానులు గుడి కట్టేంత ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది.నిధి నిజానికి హైదరాబాద్లోనే 1992 ఆగస్టు 17న పుట్టింది. చిన్నతనం కూడా అక్కడే గడిచింది. తర్వాత బెంగళూరులో చదువుకుంది. అందుకే హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో సునాయాసంగా మాట్లాడగలుగుతుంది.తన తొలి సినిమా ‘మైఖేల్ మున్నా’ కోసం, ఏ హీరోయిన్ ఒప్పుకోని షరతును అంగీకరించింది. సినిమాలో నటిస్తున్నంతవరకూ ఎవరితోనూ డేటింగ్ చేయరాదని ఒప్పందంలో క్లాజ్ పెట్టారు. ‘‘అప్పట్లో కెరీర్ కావాలి, డబ్బులు అవసరం. కాబట్టి సరేనన్నాను’’ అని నవ్వుతూ చెబుతుంది నిధి.తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్ అయింది. కాని తమిళంలో శింబు, ఉదయనిధి స్టాలిన్, జయం రవిలతో చేసిన సినిమాలు అంతగా ఆడలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్తో ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్తో ‘రాజాసాబ్’ సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుంది.పూజా హెగ్డే తర్వాత, నాగ చైతన్య, అఖిల్– అన్నదమ్ములు ఇద్దరితోనూ నటించే అవకాశం దక్కించుకున్న హీరోయిన్ నిధి.ఫిబ్రవరి 14, వాలెంటైన్ ్స డే రోజున తమిళనాడులో అభిమానులు ఆమె విగ్రహానికి పాలతో అభిషేకం చేసి, గుడి కట్టినట్టు వార్తలు, ఫొటోలు వెలుగులోకి రావడం చూసి, షాక్ అయిందట!హైదరాబాద్లోని బషీర్బాగ్లో నిధి అమ్మమ్మ వాళ్ల ఇల్లు ఉంది. ‘హైదరాబాద్ మించిన ఫన్ ప్లేస్ ప్రపంచంలో లేదనిపిస్తుంది’ అని అంటుంది నిధి. అంతేకాదు, నగరంలో దాదాపు 15 వేల మంది బంధువులు ఉన్నారట!బెంగళూరులో చదువుకునేటప్పటి నుంచే హీరోయిన్ కావాలనే కోరిక. కాని, ఇండస్ట్రీలో పరిచయాలు లేకపోవడంతో ఫేస్బుక్లో అందమైన ఫోటోలు పెడుతూ, ఎవరైనా దర్శకుడు కాంటాక్ట్ చేస్తాడేమో అని ఎదురు చూసేది. ఆ ఆశే ఆమెను మోడలింగ్, అందాల పోటీల వైపు తీసుకెళ్లింది. తర్వాత హీరోయిన్ గా మారింది.కాలేజీలో ఓ అబ్బాయి ‘నీవు చాలా అందంగా ఉన్నావు’ అన్నాడు. వెంటనే చేతిలో ఉన్న యాపిల్ అతని మీదకు విసిరి, ‘నన్ను అంత మాట అంటావా!’ అంటూ అరిచిందట! ఇప్పుడు అభిమానులు పొగుడుతున్నప్పుడు ఆ సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంటుందట! -
శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్గా మెరుద్దాం ఇలా..!
ఇంటికి ఐశ్వర్యాన్ని, పండగ కళనూ తీసుకువచ్చే మాసంగా శ్రావణానికి పేరు. పూజలు, వివాహ వేడుకలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ రోజుల్లో వాతావరణం మబ్బు, తుంపరలతో డల్గా కనిపిస్తుంది. ఇలాంటి సమయాలలో బ్రైట్గా వెలిగిపోవాలంటే పట్టు ఎంపిక ఎప్పుడూ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. పట్టు చీరలు అన్నివేళలా ఒకే తరహా కట్టు అంటే బోర్గా ఫీలయ్యే నవతరానికి మోడర్న్ స్టైల్లో కట్టు, కుట్టు డిజైన్స్ చాలానే వచ్చాయి. ఈ మాసంలో మెరుపును, ఉత్సాహాన్ని ఇచ్చే పట్టు ఇండోవెస్ట్రన్స్ స్టైల్స్ ఇవి...డ్యుయెల్ టోన్... పండగలు అనగానే మనలో చాలామంది ఎరుపు, పసుపు, పచ్చ రంగుల గురించి ఆలోచన చేస్తారు. ఈ యేడాది ట్రెండ్లో ఉన్న రంగులు.. పీకాక్ బ్లూ, గోల్డ్ పట్టు చీరలు లేదా డ్రెస్సులు ఈవెనింగ్ పార్టీలకు ఎంచుకోవాలి. బాటిల్ గ్రీన్– మెరూన్ కలిసిన సంప్రదాయ రంగులు పండగల సమయాల్లో, లావెండర్ – సిల్వర్, మెహందీ రంగులు పూజలకు, మస్టర్డ్– నేవీ బ్లూ రంగులు ఇండోర్ ఈవెంట్లకు బ్రైట్ లుక్నిస్తాయి. దీంతోపాటు రెండు రంగుల కాంబినేషన్లో వచ్చే డ్యుయెల్ టోన్ పట్టుచీరలు వేడుకలకు మంచి లుక్ను తీసుకు వస్తాయి. ఉదాహరణకు బ్లూ– పింక్, గోల్డ్– మెరూన్ .. కలయికలతో ఉన్నవి. పట్టు చీరలు లైట్వెయిట్లోనూ లభిస్తున్నాయి. పెద్ద జరీ అంచు చీరలు ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. మన చేనేతలైన గద్వాల, ΄ోచంపల్లి, నారాయణపేట, పీతాంబరం, బనారసి.. పట్టు చీరలు ఈ మాసానికి నిండుతనాన్ని తీసుకువస్తాయి.పట్టు లాంగ్ జాకెట్స్/ కేప్స్...ప్లెయిన్ మ్యాక్సీ డ్రెస్ వేసుకుంటే బనారసీ లాంగ్ జాకెట్ బ్రైట్గా, ట్రెడిషనల్గా కనిపిస్తుంది. లాంగ్ గౌన్పైకి జాకెట్ లేదా కేప్ లేయర్డ్గా ఉండి స్టైలిష్ ఎంపిక అవుతుంది. మోడర్న్ పట్టు బ్లౌజ్లు... పట్టు చీరలు/ స్కర్ట్స్కి ఆఫ్–షోల్డర్ బ్లౌజ్ ధరిస్తే స్టైలిష్గా కనిపిస్తారు. పట్టుచీర పూర్తి సంప్రదాయ విధానం అని ఆలోచించే యువతరానికి పెప్లమ్ స్టైల్ బ్లౌజ్ లేదా బెల్ట్తో కూడిన చీర కట్టు మంచి లుక్తో నప్పుతుంద. బ్యాక్–ఓపెన్ లెహంగా స్టైల్ చీర కట్టుకు హాల్టర్ నెక్ బ్లౌజ్, ప్లెయిన్ సిల్క్ స్కర్ట్కి కాలర్ నెక్ ఉన్న షర్ట్ స్టైల్ బ్లౌజ్తో ఆధునికతను జోడించవచ్చు. పట్టు లాంగ్ గౌనులుకాంచిపట్టు లేదా మైసూర్ సిల్క్ చీరలతో డిజైన్ చేసిన లాంగ్ గౌనులు ఈ మాసంలో ప్రత్యేకంగా ధరించవచ్చు. అమ్మాయిలకు ఇవి సరైన ఛాయిస్ అవుతాయి. శరీరాకృతికి తగినట్టు, ఫ్లేయర్డ్ స్కర్ట్ని అలాగే ధరించవచ్చు. కొన్నిసార్లు దుపట్టాతో కూడా మ్యాచ్ చేయవచ్చు. ఎంగేజ్మెంట్, రిసెప్షన్, వివాహ ఊరేగింపు.. సమయాలలో వీటి ఎంపిక ఈ సీజన్లో ప్రత్యేకంగా ఉంటుంది.ఇండో–వెస్ట్రన్ పట్టుపట్టు క్రాప్ టాప్కి లెహెంగా లేదా స్కర్ట్ ధరించవచ్చు. వీటిలో బనారసి లేదా ఉ΄్పాడ క్రాప్ టాప్ (స్లీవ్లెస్/బోట్ నెక్/హై నెక్)తో ఉన్నవి ఎంచుకోవచ్చు. వీటికి లేయర్డ్ కాంట్రాస్ట్ జరీ లెహెంగా మంచి కాంబినేషన్ అవుతుంది. జరీ బోర్డర్ని నెట్ లేదా జార్జెట్ ఫ్యాబ్రిక్కి జత చేసి దుపట్టాను డిజైన్ చేసుకోవచ్చు. సంప్రదాయ పూజలు, రాఖీ వంటి పండగలు, ఎంగేజ్మెంట్ వంటి వేడుకలకు ఇది మంచి ఎంపిక అవుతుంది.విభిన్న మోడల్స్ కట్టుడిజైనర్ బ్లౌజ్ ధరించే సాధారణ పట్టు చీరను ఎంచుకుంటే దానికి నడుము వద్ద ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్ బెల్ట్ ధరించవచ్చు. వడ్డాణానికి మరొక శైలి. ఈ స్టైల్ యంగ్ లుక్ని తీసుకువస్తుంది. దీనికి టెంపుల్ జ్యువెలరీ, చోకర్లు ఉపయోగించవచ్చు.పట్టు ధోతీ ప్యాంటు– షార్ట్ కుర్తీఅమ్మాయిలు ట్రెండీ లుక్ కోసం ఇటీవల ధోతీ ప్యాంట్ , షార్ట్ కుర్తీని ఎంచుకుంటున్నారు. వీటిని పట్టుతో డిజైన్ చేస్తే ఈ కాలం స్టైలిష్గానూ, సంప్రదాయ లుక్తో బ్రైట్గా మెరిసిపోతారు. ధోతీ ప్యాంట్ కోసం నారాయణపేట, గద్వాల్ సిల్క్లను ఎంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ/మిర్రర్ వర్క్ చేసిన షార్ట్ కుర్తీలు ధోతీ ప్యాంటుకు మంచి కాంబినేషన్ అవుతుంది. వీటికి కొల్హాపురి లేదా జుట్టీలు పాదరక్షలుగా ఎంచుకోవాలి. – ఎన్నార్(చదవండి: సమద్రగర్భంలో..మహిళా స్కూబాడైవర్లు..!) -
ఐటీ గర్ల్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే ధరించే కాలా ధాగా స్టోరీ ఏంటో తెలుసా..!
ఒకప్పుడు హిందూ సంప్రదాయంలో భాగమైన ఆ ఆచారమే ఇవాళ ఫ్యాషన్ ట్రెండ్గా మారింది. బహుశా సాధారణ వ్యక్తులు ఆచారంగా చేస్తే..అతి పెద్ద ఫ్యాషన్ కాదు. అదే ఏ సెలబ్రిటీనో లేక పెద్ద స్టారో ట్రెడిషన్ని అనుసరిస్తే..అది స్టైలిష్ యాక్సెసరీగా మారిపోతుంది. అందుకు ఉదాహరణ ఈ కాలా ధాగా. ఏంటిది అనుకుంటున్నారా..?అదేనండి మన సినీ ప్రముఖులు, పెద్ద స్టార్లు, సెలబ్రిటీల చేతి మణికట్టు వద్ద స్టైలిష్గా ఓ నల్లదారం కనిపిస్తుందే దాన్నే హిందీలో కాలా ధాగా అంటారు. సాధారణంగా ఏ కాశీ క్షేత్రానికో, తిరుపతి వంటి పుణ్య కేత్రాలకు వెళ్లినప్పుడూ అక్కడ ఉండే మార్కెట్లో ఈ నల్ల తాడులనే కాశీ తాడులుగా దర్శనమిస్తుంటాయి. ఆయా క్షేత్ర సందర్శనం అనంతరం ఇంటికి చేరుకుని తమ బంధువులకు, స్నేహితులకు ప్రసాదం తోపాటుగా ఈ కాశీతాడుల, ఎరుపు రంగు తాడులను ఇస్తుంటారు. వీటిని రక్షగా ధరిస్తుంటారు. అలాంటి తాడే ఈ కాలా ధాగా. మన హిందూ సంప్రదాయంలో దీన్ని చెడు దృష్టికి రక్షగా ధరిస్తారు. దీన్ని ధరిస్తే కనుదిష్టి పోతుందని భక్తుల నమ్మకం. అది నేడు ఈ ఐటీ గర్ల్స్ పుణ్యామా అని ఫ్యాషన్ యాక్సెసరీగా మారింది. మరి ఈ కాలా ధాగాను ధరించే సెలబ్రిటీలు ఎవరంటే..ఈ సెలబ్రిటీలు ఈ సంప్రదాయన్ని ధైర్యంగా పాటించడమే కాదు, రెడ్ కార్పెట్ వద్ద అయినా, లేదా వాళ్ల వర్క్ పరంగా స్టైలిష్ కనిపించాల్సి వచ్చినా చేతికి ఈ కాలాధాగా ఉండాల్సిందే. అంతలా ఈ సంప్రదాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. సిగ్నేచర్ లుక్గా..నల్లదారం లేకుండా కనిపించని నటి ఎవరైనా ఉన్నారంటే అది జాన్వీకపూర్. ఆమె రెడ్ కార్పెట్ లుక్స్ లేదా క్యాజువల్ వార్డ్ రోబ్ అయినా ఈ కాలా ధాగా ఉండాల్సిందేనట. ఇది లేకుండా కనపించదు. సరికొత్త ఫ్యాషన్ వేర్లో ఉన్నా..ఇది మణికట్టుకి ఉండాల్సిందేనట.అనన్య పాండే సైతం దీన్న ధరిస్తుందట. ఇటీవల ఈ జెన్ జెడ్ ఐకాన్ హనుమాన్ ఆలయంలో కనిపించారు. ఆమె అందమైన పసుపు సల్వార్ సూట్ తోపాటు ఈ కాలాధాగాను కూడా జత చేసింది. కేవలం బాలీవుడ్ నటులే కాదు అంబానీలు కూడా ఈ పవిత్ర నల్లదారాన్ని గట్టిగా విశ్వసిస్తారు. ప్రత్యేకంగా చెప్పాలంటే రాధిక మర్చంట్ తన పెళ్లికూతరు లుక్స్లో ఈ థ్రెడ్తో స్టైలిష్గా కనిపించింది. ఇక ఇషా అంబానీ సైతం దీన్ని ధరిస్తారు. ఈ సంప్రదాయన్ని వాళ్లంతా తన రొటీన్ జీవితంలో భాగం చేసుకునేలా ప్రాముఖ్యత ఇచ్చారు. బహుశా ఉండగా ఉండగా..ఇది కాస్తా అదెదో ఫ్యాషన్ ట్రెండ్లా మారిపోతుందేమో!. (చదవండి: ఆ మూవీలో మాదిరిగా 20 ఏళ్లకే అల్జీమర్స్ వస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..) -
మరో స్వదేశీ స్టోర్ వచ్చేస్తోంది : కుమార్తె, కోడళ్లతో నీతా అంబానీ ప్రత్యేక పూజ
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ఫౌండర్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్, నీతా అంబానీ ముంబైలో మరో స్వదేశీ స్టోర్ను లాంచ్ చేయనున్నారు. మేడ్ ఇన్ ఇండియా స్పూర్తితోపాటు, హస్తకళలను ఆదరించడం, హస్త కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా దేశంలోనే తొలిసారి అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ స్టోర్ను హైదరాబాద్ ఏర్పాటు చేసిన నీతా అంబానీ తాజాగా ముంబైలోని ఈరోస్లో స్వదేశ్ ఫ్లాగ్షిప్ స్టోర్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ కుమార్తె ఇషా, కోడళ్లు శ్లోక, రాధికలతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.స్వదేశ్ స్ఫూర్తి ప్రతిబింబించేలా ఈవేడుక నిర్వహించారు. దేశీయ అనాది సంప్రదాయాలు, తరతరాలుగా అందివస్తున్న చేతివృత్తుల నైపుణ్యానికి శాశ్వత వారసత్వానికి నివాళిగా ఈ వేడుకను నిర్వహించారు.భారతీయ కళలను, సంప్రదాయాలను గౌరవించడంలో నీతా అంబానీ ఎపుడూ ముందుంటారు. తాజాగా మరో అద్భుతమైన చీరలో రాజసం ఉట్టిపడేలా కనిపించారు. రాజ్శృందర్ రాజ్కోట్ 10 నెలలకు పైగా చేతితో నేసిన అద్భుతమైన మధురై కాటన్ ఘర్చోలా చీరను ధరించారు. ఈ చీరకు ప్రముఖ డిజైనర్ మనీష్మల్హోత్రా అందమైన జాకెట్టును నీతా ఎంపిక చేసుకున్నారు. యాంటిక్ గోల్డ్ వరల్డ్ ఎంబ్రాయిడరీతో ఫిరోజీ సిల్క్ కాంచాలి బ్లౌజ్తో స్టైల్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india) తాత ముత్తాల నాటి మహిళా కళాకారులకు నివాళిగా నీతా తనకు వారసత్వంగా వచ్చిన బంగారు బాజుబంద్ను ధరించారు. ఇది నీతా తల్లి ముత్తాత నుండి లభించిన ఆర్మ్లెట్. తన వివాహం సందర్భంగా కూడా దీన్ని ధరించడం విశేషం. ఇది కేవలం ఒక ఆభరణం కాదు, వారసత్వం, ప్రేమ , ఒక తరం మహిళల నుండి మరొక తరం వరకు ప్రవహించే శాశ్వత శక్తికి చిహ్నం . పెద్దల కరుణ, జ్ఞానం ఆశీర్వాదాలతో నిండిన ఈ ఆర్మ్లెట్ అంబానీ నుంచి , ఆమె కుమార్తె ఇషా కుమార్తె, మనవరాలికి వారసత్వంగా లభిచనుంది.ఇక నీతా అంబానీ జ్యుయల్లరీ గురించి చెప్పాలంటే స్వదేశ్ నుండి వచ్చిన అద్భుతమైన నెక్లెస్తో తన లుక్ను మరింత వన్నె తెచ్చారు. ప్రతి ప్యానెల్ వైట్ గోల్డ్తో శ్రీనాథుడి జీవితంలోని దైవిక క్షణాలను చిత్రీకరించేలా చేతితో చేసిన కళాసృష్టి ఇది. కళాత్మకతను ఆధ్యాత్మికతతో మిళితం చేస్తుంది. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) -
ధోతికట్టు..అదిరేట్టు..!
‘పంచె కట్టుటలోన ప్రపంచాన మొనగాడుకండువా లేనిదే గడపదాటని వాడుపంచ భక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడుసినారె.. రాసిన ఈ నాలుగు పంక్తుల్లో తెలుగువాడి పంచెకట్టు వైభవాన్ని చాటి చెప్పాయి.ధోతి ఒక అంచును పైనున్న లాల్చీ కుడి జేబులో పెట్టుకుని కనిపించిన నందమూరి తారకరామారావు తన తెలుగుదనపు ఠీవీని ప్రదర్శించారు. అలాగే వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం తనదైన శైలి పంచెకట్టుతో మూర్తీభవించిన తెలుగుదనానికి ప్రతిరూపంగా కనిపించేవారు. తెలుగు వారు ఠీవీగా చాటుకునే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సైతం విదేశీ పర్యటనలు మినహా ఎప్పుడూ పంచె కట్టును వీడింది లేదు’.ఈవెంట్లలోనే..నాటి తరం కట్టు బొట్టు ఇప్పడు ఫ్యాషన్ ట్రెండ్ అయింది. ప్రత్యేక సందర్భాల్లో నాటి చీరకట్టులో ప్రత్యేకత చాటుకుంటున్నారు. నాటి వస్త్రధారణ నేటి ఈవెంట్స్లో సరికొత్త సంప్రదాయ అలంకరణగా మారింది.– పడకంటి ఇందు,చామ కృష్ణవేణి, కరీంనగర్ ఎనభై ఏళ్లుగా..మా పుట్టిల్లు మర్తనపేట. అత్తగారి ఊరు ఇప్పలపెల్లి. పెళ్లయిన నాటి నుంచి ఇదే తరహా గోచీ చీరలే ధరిస్తున్న. 80 ఏళ్లు దాటుతున్నా మరో ఆలోచన లేదు. 18 మూరల చీరను కూడా సులువుగా కట్టుకుంటాం. కష్టం చేసుకుని బతికెటోళ్లకు ఇదే సౌకర్యం. – గొడుగు లచ్చవ్వ, ఇప్పలపల్లి సాగు పనులకు అనుకూలంనా చిన్నప్పటి నుంచి గోచీ గుడ్డ ధరించేది. కొంత పెద్దయ్యాక మొదలైన ధోతికట్టు ఇప్పటి వరకూ కొనసాగిస్తున్న. ధోతితో ఉండే సౌకర్యం మరే వస్త్రంతో ఉండదు. వ్యవసాయం చేసుకునే మాలాంటి కుటుంబాల్లో మగవాళ్లందరికీ ధోతికట్టే అలవాటైంది. సాగు పనులకు సౌకర్యంగా ఉండడం ధోతికట్టులో ఉన్నంతగా మరి దేనిలోనూ ఉండదు.సలేంద్రి దేవయ్య, పెద్దూరు అర్ధశతాబ్దకాలం క్రితం వరకు పురుషులు పంచెకట్టు, స్త్రీలు గోచి చీరలతో ఇబ్బడిముబ్బడిగా దర్శనమిచ్చేవారు. క్రమంగా ఈ వస్త్రధారణలో మార్పు ప్రవేశించింది. పల్లె సీమల్లో ఒక ఈడు దాటిన స్త్రీ, పురుషులు ఇంకా అక్కడక్కడా దర్శనమిస్తున్నా మెజార్టీ ప్రజల్లో ఈ అలవాటు దాదాపు కనుమరుగయ్యే దశ కనిపిస్తోంది. పంచెకట్టు ఒక తరం ఉనికిని, అస్తిత్వాన్ని, సాంస్కృతిక జీవన విధానాన్ని ప్రతిబింబించింది. ఆధ్యాత్మిక కార్యాలు, వివాహాది శుభకార్యాల సమయంలో వరుడితో పాటు అతని తండ్రి, కన్యాదానం చేసే వధువు తండ్రి సైతం పంచెకట్టుకే ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ పిల్లలకు ఐదారేళ్ల వయసొస్తే పంచెలు కట్టించే వేడుక నిర్వహించడం కూడా చూస్తున్నదే.పంచెకట్టు ప్రయోజనాలుశరీరానికి సహజమైన గాలి తగలడం పంచెకట్టుతో ఉన్న నిజమైన సౌకర్యం. ఏ తరహా శరీరానికైనా నప్పే పంచె వల్ల ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యం బాగుంటుందంటారు. పది మంది పిల్లల్ని కని పెంచిన పూర్వీకుల సంతతి కూడా ఇందుకు నిదర్శనంగా కనిపించడం విశేషం.ఇక స్త్రీల వేషధారణలో సైతం గోచీ పెట్టుకునే చీరలు ఈ తరానికి తెలియవంటే ఆశ్చర్యం లేదు. అమ్మమ్మ, నాన్నమ్మలంటేనే ఆ తరహా వేషధారణ గుర్తొచ్చేది. ఇప్పుడు మెల్లగా మొదలైన మార్పు అటు పంచెను ఇటు గోచీ చీరను తుడిచిపెట్టేసింది.సుమారు ఏడెనిమిది మీటర్లు లేదా 9 గజాలు లేదా 18 మూరల పొడవుండే ఈ చీరలు ధరించడం తెలుగునాట తరాలుగా కొనసాగింది. ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉన్న వారికి సాగుపనులకు అనుగుణంగా ఉండే అద్భుతమైన కట్టుబడి ఇది. గొల్ల కురుమలతో పాటు సాగు పనులు చేసే కాపు సామాజికవర్గాల్లో ఈ తరహా చీరకట్టు కనిపించేది. వాళ్ల ఆచారాల ఆధారంగా కొంగు కొందరు ఎడమ వైపు మరి కొందరు కుడివైపుకి ధరించేవారు.ఈ తరానికి తెలియని బొడ్లె సంచిగోచీ చీర ధరించే మహిళలు విధిగా ధరించే మరో వస్త్ర పరికరం బొడ్లె సంచి. ఈ తరానికి కనీసం చూసే భాగ్యం కూడా లేని అపురూపమైన నాటి మనీ పర్స్. వాలెట్గా పిల్చుకుంటున్న నేటి మనీ పర్స్లోని అరల కన్నా ఎక్కువగా ఉండే ఈ బొడ్లె సంచిలో ప్రయాణాలకు అవసరమైన చిల్లర నాణేలు, ఒకటో రెండో కరెన్సీ నోట్లకు భద్రమైన బ్యాగు. జాగ్రత్తగా దాచుకున్న డబ్బులున్న బొడ్లె సంచిని గోచీ చీరతో పాటు బొడ్లో దోపుకునే సంరక్షించుకునేవారు. ఇది కూడా లేని వాళ్లు కొంగు చివరన డబ్బులు మూటగా కట్టుకుని దాన్ని శరీరం చుట్టూ తిప్పి తిరిగి బొడ్లో దోపుకునే వారు.జీన్స్ ప్యాంటుల్లోకి వచ్చాక..స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా ఇప్పుడు అందరూ కామన్గా ధరించేది జీన్స్ ప్యాంట్నే. యువతరానికి నచ్చినప్పటికీ దీంతో ఉండే అసౌకర్యం, అనారోగ్యం కూడా ఎక్కువే. జననేంద్రియాలను పట్టి ఉంచే లక్షణంతో ఉంటాయి కాబట్టి సహజమైన ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువ ఉష్ణానికి గురవుతుంటాయి. కాబట్టి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడానికి ఉన్న కారణాల్లో ఇదొకటిగా నిపుణులు చెప్తున్నారు. ఒకరిద్దరికి మాత్రమే పరిమితం అవుతున్న జంటలు కొన్నైతే, స్థిరపడ్డాకే సంతానం అనుకుంటూ 30 దాటినా పెళ్లిల్లు లేవు, 40 దాటినా సంతానం లేకుండా పోతున్నారు.అన్ని మారిపోతున్నాయిమన సంప్రదాయలు ఇప్పుడు కనిపించడం లేదు. అన్ని మారిపోతున్నాయి. మగ్గం బట్టలు పోయి మిల్లు బట్టలు వచ్చాయి. అప్పటి దోతి, పంచె కుట్టు, బనీయన్లు ఇప్పుడు కానరావడం లేదు. నేను మాత్రం మా తాత, నాయిన పద్ధతిలోనే నడుచుకుంటున్న.– కనుమల్ల రామస్వామి, నేత కార్మికుడు, వెదిర గోచీ పెట్టుకోవడమే అలవాటుచిన్నప్పుడు గౌను, లంగాజాకెట్ వేసుకునేదాన్ని. వయస్సు వచ్చాక లంగా, జాకెట్ ఓనీ, తర్వాత గోచిచీర కట్టుకుంటున్న. ఇప్పటి పిల్లలకు గోచిపెట్టుకోవడం నామోషీగా అనుకుంటారు. కానీ అదే మన పాతకాలం పద్ధతి. చీర కంటే గోచి చీర కట్టుకుంటే బాగుంటుంది.– కనకమ్మ, వ్యవసాయదారు, కరీంనగర్ నిండుగా ఉంటుందిపాత పద్ధతిలో ఆరుగజాల చీర కట్టుకుంటే నిండుగా ముతైదువ తనం ఉట్టిపడుతుంది. ఇప్పుడు ఎవరూ పాత పద్ధతులు పాటించడంలేదు. ఇంకా ముసలివాళ్లు మాత్రమే గోచిచీర కట్టుకుంటున్నారు. – ఓదెమ్మ, వ్యవసాయదారు,రైతుబజార్, కరీంనగర్ (చదవండి:


