కొత్త శకానికి నాంది పలికిన ఇషా అంబానీ | Isha Ambani confirmed as chair of the Serpentine Summer Party 2025 | Sakshi
Sakshi News home page

కొత్త శకానికి నాంది పలికిన ఇషా అంబానీ

Jun 26 2025 5:16 PM | Updated on Jun 26 2025 6:18 PM

Isha Ambani confirmed as chair of the Serpentine Summer Party 2025

రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ,  నీతా అంబానీ దంపతుల కుమార్తె, వ్యాపారవేత్త ఇషా అంబానీ (Isha Ambani )  మరో ఘనతను సాధించారు సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025 ((Serpentine Summer Party 2025)కి తొలి భారతీయ చైర్‌పర్సన్‌గా  ఎంపికై కళా ప్రపంచంలో కొత్త శకానికి నాంది పలికారు.

సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ  25వ వార్షికోత్సవం సందరబంగా తొలి బారతీయ చైర్‌గా ఇషా ఎంపికయ్యారు. కళలు, సంస్కృతి రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడర్లు, ప్రభావవంతమైన వ్యక్తులనుచేర్చుకోవడంలో మరింత మార్పువచ్చిందని నిరూపించిం దని, ప్రపంచ దేశాలకు, భారత్‌కు మధ్య  ఇషా సాంస్కృతిక వారధి  అంటూ ప్రశంసిస్తున్నారు  ఫ్యాషన్‌ నిపుణులు.

 

సెర్పెంటైన్ సమ్మర్ పార్టీ 2025లో ఇషా అంబానీ లక్‌  
మెరీనా టబస్సమ్ రూపొందించిన 2019 నాటి వాలెంటినో, షాంపైన్ కలర్‌ పూసల దుస్తులను ధరించింది.   ఉంగరాల జుట్టు, సహజమైన మేకప్ వేసుకుని, హీల్స్‌తో ఇషా ప్రతి ఫ్రేమ్‌లో  అందమమైన లుక్‌లో అలరించింది. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.   కాగా అంబానీ కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఇషా తనదైన వ్యాపార నైపుణ్యాలతో వ్యాపారంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 

ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ డియోర్‌కు ప్రపంచ రాయబారి , సోనమ్ కపూర్‌, సమ్మర్ పార్టీలో సందడి చేసింది. డియోర్ ఫాల్ 2025 కలెక్షన్ నుండి కిమోనో జాకెట్ ధరించింది అందర్నీ ఆకట్టుకుంది. జూన్ 24, 2025న లండన్‌లోని సెర్పెంటైన్ పెవిలియన్‌లో జరిగిన  ఈ పార్టీలో ఈజా గొంజాలెజ్, అలిసియా వికాండర్, రెబెల్ విల్సన్, జార్జియా మే జాగర్, లేడీ అమేలియా స్పెన్సర్, లేడీ ఎలిజా స్పెన్సర్, లిల్లీ అలెన్ తదితర సెలబ్రిటీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement