breaking news
Medak
-
అభివృద్ధి దిశగా గ్రామాలు
రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఆర్.వెంకటాపూర్లో పంచాయతీ, అంగన్వాడీ భవన నిర్మాణ పనులు, లక్ష్మాపూర్లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పిట్టలవాడకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉమ, మాజీ సర్పంచ్ మహేందర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు చింతల స్వామి, నాయకులు రమేశ్రెడ్డి, సంజీవరెడ్డి, పోచమ్మల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
వన్యప్రాణుల దాహం తీరేదెలా!
మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో ఏదో ఒక రకంగా తాగు నీరు లభించే అవకాశాలు ఉంటాయి. కానీ అడవుల్లో ఆ వెసులుబాటు ఉండదు. ఉన్న వాగులు, వంకలు ఎండలకు పూర్తిగా అడుగంటుతాయి. ఈక్రమంలో వన్యప్రాణులు తాగు నీటి కోసం వెంపర్లాడుతుంటాయి. కౌడిపల్లి లోత్వాగ్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన సాసర్పిట్లు ధ్వంసమై ఇలా దర్శనమిచ్చాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వాటికి మరమ్మతులు చేయించి నీరు అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు. – కౌడిపల్లి(నర్సాపూర్) -
సరిహద్దు రాళ్లు ఏర్పాటు
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని ముంగి తండా పరిధిలో గల నిమ్జ్ ఏర్పాటుకు సంబంధించి శుక్రవారం పోలీస్ బందోబస్తు మధ్య సరిహద్దు రాళ్ల ఏర్పాటు ప్రారంభమైంది. తమకు పూర్తిస్థాయిలో పరిహారం అందించడంతోపాటు తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే నిమ్జ్ పనులు చేపట్టాలని నిమ్జ్ భూ బాధితులు, తండా వాసులు రెండు రోజులుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం ఉదయం తండాకు చేరుకుని భారీ పోలీస్ బందోబస్తు మధ్య సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తండాలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ అధ్వర్యంలో 52 మంది పోలీస్ల బందోబస్తు మధ్య తహాసీల్దార్ ప్రభులు, ఆర్ఐ శ్యామ్రావు, సర్వేర్, ఇతర సిబ్బంది హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. -
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని ప్రజారోగ్య రాష్ట్ర సంచాలకులు డాక్టర్ రవీంద్రనాయక్ అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు పీహెచ్సీలో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆరోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలు, అసంక్రమిత వ్యాధులు, క్యాన్సర్, ఎయిడ్స్పై అవగాహన కల్పించారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట నోడల్ అధికారి డాక్టర్ వినోద్, డిప్యూటీ డీఎంహెచ్ఓలు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, నిర్మల, దీప్తి, మీనా, ఐశ్వర్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యల కూత!
గజ్వేల్: మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మా ర్గంలోని రైల్వేస్టేషన్లలో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు నానా ఇక్కట్లు పడుతున్నారు. తాగునీరు మొదలుకొని ఇతర కనీస వసతులు కరువయ్యాయి. ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరగకపోవడంతో ట్రాక్లు దాటడం ప్రమాదకరంగా మారింది. 50 శాతం వరకు పనులు పూర్తి మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున న్యూబ్రాడ్గేజ్ లైన్న్ నిర్మాణం జరుగుతుండగా.. రూ. 1160.47 కోట్లను వెచ్చిస్తున్నారు. 2017లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీ దుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్నతో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా లాంటి మహా నగరాలను కలుపుతూ జాతీయ లైన్గా ఆవిర్భవించనుంది. ఉత్తర తెలంగాణ లోని సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు 74 కిలోమీటర్ల మేర.. అంటే మొత్తం లైన్ పొడవులో 50 శాతం వరకు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రస్తుతం సిరిసిల్ల వైపునకు పను లు సాగుతున్నాయి. కాగా 2023 అక్టోబర్ 3న ప్యాసింజర్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.ట్రాక్లు దాటాలంటే నరకమే ఈ లైన్పై మనోహరాబాద్ తర్వాత నాచారం(స్టేషన్), అప్పాయిపల్లి (హాల్ట్), గజ్వేల్ (స్టేషన్), కొడకండ్ల (హాల్ట్), లకుడారం (స్టేషన్), కొమురవెల్లి (హాల్ట్), దుద్దెడ (స్టేషన్), సిద్దిపేట(స్టేషన్) ఉన్నాయి. స్టేషన్లతో పాటు హాల్ట్ స్టేషన్లలోనూ కనీస వసతులు కరువయ్యాయి. గజ్వేల్లో ప్రయాణికులు ట్రాక్పై ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లేందుకు ప్రారంభించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పిల్లర్ల దశలో నిలిచిపోయాయి. ఫలితంగా ట్రాక్ను దాటడం ప్రమాదకరంగా పరిణమించింది. నాచారం స్టేషన్ గ్రామానికి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లేందుకు రోడ్డు సక్రమంగా లేక ఇబ్బందులు తప్పడం లేదు. లకుడారం, దుద్దెడ స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆయా స్టేషన్లలో ప్రయాణికులకు కనీస తాగునీటి వసతి కూడా సక్రమంగా లేదు. పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వాష్రూమ్లు వాడకంలో లేవు. మరోవైపు ఏ స్టేషన్లోనూ తగినంత సిబ్బంది లేరు. హాల్ట్ స్టేషన్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నిర్వహణ లేక ఈ స్టేషన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. కాగా ఈ మార్గంలో నడుస్తున్న రైలు వేగం పెంచకపోవడంతో ప్రయాణికుల్లో ఆసక్తి తగ్గుతుంది. రైల్వేస్టేషన్లలో కనీస వసతులు కరువు తాగునీరు మొదలుకొని అన్నింటికీ తిప్పలే.. సిబ్బంది కొరతతో అరకొర సేవలు -
వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆపార్టీ రాష్ట్ర నాయకుడు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ వెళ్తుండగా, నార్సింగి మండల కేంద్రంలో కొద్దిసేపు ఆగి కార్యకర్తలతో మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. రాష్ట్రంలో ఆపార్టీ మళ్లీ గెలిచే పరిస్థితి లేదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం అదే పరిస్థితిలో ఉందన్నారు. ఈసందర్భంగా నార్సింగి నుంచి శాలిపేట వరకు రోడ్డు అభివృద్ధికి కృషి చేయాలని, రైల్వే వంతెన నిర్మాణానికి సహకరించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, నాయకులు లింగారెడ్డి, నరేష్, యాదగిరి, శ్రీనివాస్, నరేష్నాయక్, సాయికుమార్, వినోద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ బిల్లుల మంజూరులో జాప్యం మెదక్జోన్: మెడికల్ బిల్లుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోందని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి అన్నారు. శుక్రవారం యూనియన్ బాధ్యులు కలెక్టర్ ప్రతిమాసింగ్ను మర్యాద పూర్వకంగా కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి మెడికల్ బిల్లులు పెండింగ్లో ఉండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ను కలిసిన వారిలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రారామిరెడ్డి, సంగయ్య, హీరాలాల్, రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అల్లాదుర్గం(మెదక్): పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రతి ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్లు డిప్యూ టీ డీఎంహెచ్ఓ అనీల తెలిపారు. శుక్రవారం అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. అన్ని రకాల డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన వారికి జిల్లా, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. వంద రోజులలో నాలుగు విడతలుగా జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైద్యులు నవ్య, అశ్విని, సర్పంచ్ సౌమ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి ‘ప్రగతి ప్రణాళిక’ గజ్వేల్: మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’దోహదపడుతుందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో పాలన తీరు మెరుగుపరచడంతోపాటు పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కాగా 16వార్డులో శిథిలావస్థలో ఉన్న మొండి గోడలను తొలగించాలని మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు నిర్ణయించారు. -
నిధులు లేకుండా ఎలా ..?
కొల్చారం(నర్సాపూర్): నిధులు విడుదల చేయకుండా ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ముందుకు సాగుతుందా..? అని ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం మండలంలోని సంగాయిపేటలో రూ. 30 లక్షలతో నిర్మించనున్న గోదాంతో పాటు పలు గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కేంద్రం నుంచి వస్తున్న ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయడం తప్పించి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది లేదన్నారు. ఇప్పటికే కొత్త సర్పంచ్లు నిధుల లేమితో గ్రామాల్లో పనులు చేయలేని పరిస్థితిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం గ్రామ సమాఖ్య భవనాలు నిర్మించడం హర్షనీయమన్నారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా, ఏఓ శ్వేతా కుమారి, సంగాయిపేట రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఉప సర్పంచ్ నందు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రమేశ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
సమన్వయంతో పనిచేయండి
మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించి ఉమ్మడి మెదక్ జిల్లాను టాప్లో నిలపాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మూడు జిల్లాల కలెక్టర్లు, జిల్లాల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఉమ్మడి జిల్లాకు తాగు, సాగు నీటిని అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల కారణంగా, ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందుస్తు చర్యలు చేపట్టాలన్నారు. పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు ప్రజాప్రతినిధులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఉమ్మడి మెదక్ జిల్లాను టాప్లో నిలపండి ఇన్చార్జి మంత్రి వివేక్ కలెక్టరేట్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంకాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఇది మూడోసారని, గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు డిమాండ్ చేశారు. జిల్లాలో వానాకాలంలో భారీ వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా పరిశీలించి, నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి పైసా ఇవ్వలేదన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ నిధుల నుంచి ఫైర్ వాహనాలు ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హత్నూరలో ఫైర్స్టేషన్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ కార్యాలయాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. డంప్యార్డుల పక్కన అర ఎకరం ప్రభుత్వ స్థలం కేటాయిస్తే చెత్త నుంచి బయో డీజిల్ తయారు చేసేందుకు గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ముందుకు వచ్చాడని వివరించారు.అర్హులైన ప్రతి రైతుకు బీమా చేయించే బాధ్యత వ్యవసాయ అధికారులు తీసుకోవాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్షెట్కార్ సూచించారు. అలాగే కేంద్రం సబ్సిడీపై అందించే సూర్య హర్ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు రోహిత్రావు, సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ప్రతిమాసింగ్, ప్రావీణ్య, హైమావతితో పాటు మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ నరేశ్గౌడ్, ఎస్పీ శ్రీనివాస్రావు, అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి పంటపై రైతులకు అవగాహన
హత్నూర(సంగారెడ్డి): పత్తి పంటపై రైతులకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ పేర్కొన్నారు. హత్నూర రైతువేదికలో సంగారెడ్డి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏడీఏ రమాదేవి, శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మలు మాట్లాడుతూ...అధిక సాంద్రత పద్ధతి వల్ల చాలావరకు మొక్కల ఎత్తు తగ్గించి పూత, కాత బాగా వచ్చి ప్రతీ మొక్కకు కాయల సంఖ్య పెంచవచ్చన్నారు. మంచి దిగుబడితో ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన డా.ఎన్.హరి, జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డా.ఎన్.స్నేహలత, డా.రమేశ్, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, వ్యవసాయ విస్తరణ అధికారి రమేశ్, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
వేలానికి దొడ్డు బియ్యం
జిల్లాలో ఏడాదిగా పేరుకుపోయిన దొడ్డు బియ్యం వేలానికి ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే ముక్కిపోయి, పురుగులు పట్టిన ఈ బియ్యం కొనుగోలుకు మొదట్లో టెండర్ పిలిచినా, ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ధర తగ్గించి రెండోసారి జిల్లా పరిధిలోనే వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈమేరకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అయితే పూర్తిగా చెడిపోయిన ఈ బియ్యం కొనుగోలు చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా..? వేచి చూడాలి. – రామాయంపేట(మెదక్) జిల్లావ్యాప్తంగా 520 రేషన్ దుకాణాలు ఉండగా, వీటి ద్వారా గతేడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తుంది. అంతకుముందు సరఫరా చేసిన దొడ్డు బియ్యం నిల్వలను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏడాది గడుస్తున్నా, పౌర సరఫరాల శాఖ తాత్సారం చేయడంతో బియ్యం ఎందుకు పనికిరాకుండా పోయాయి. రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్లు, బఫర్ గోదాంల్లో 3,044 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం పురుగులమయమైంది. ఈస్టాక్ను తరలించే విషయమై పౌర సరఫరాల శాఖ తాత్సారం చేయడంతో తుట్టెలు కట్టి ఎలుకలకు ఆహారమయ్యాయి. వీటిని భద్రపరచడం డీలర్లకు సమస్యగా మారింది. ఈ బియ్యం విలువ సుమారు రూ. 11 కోట్ల పైమాటే. చెడిపోయిన ఈబియ్యాన్ని విక్రయించడానికి ప్రభుత్వం మొదట కిలో రూ. 24కు చొప్పున విక్రయించడానికి టెండర్లు ఆహ్వానించగా, ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల సమావేశమైన మంత్రివర్గం పురుగులు పట్టిన దొడ్డు బియ్యం తక్కువ ధరకు విక్రయించాలని నిర్ణయించింది. మొదట్లో టెండర్ పిలిచినా, ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈమేరకు రూ. 21.60 కిలో చొప్పున విక్రయించడానికి గాను త్వరలో టెండర్లు పిలువనున్నారు.జిల్లాలో ఇలా.. బియ్యం నిల్వలు (మెట్రిక్ టన్నుల్లో) గోదాంలు 259.254 రేషన్ దుకాణాలు 503.116 బఫర్ గోదాంలు 2281.675జిల్లాలో పేరుకుపోయిన 3,044 మెట్రిక్ టన్నులు కిలో రూ. 21.60 విక్రయించాలని నిర్ణయం ప్రభుత్వానికి రూ. కోట్ల మేర నష్టం -
ఆఖరి మజిలీకి అవస్థలే..
నర్సాపూర్: మున్సిపాలిటీలోని శ్మశానవాటికలో సమస్యలు తిష్ఠవేశాయి. అధికారులు కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. గతే డాది సెప్టెంబర్లో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పట్టణంలో పర్యటించారు. ఈసందర్భంగా రూ. కోటి వెచ్చించి నిర్మించిన శ్మశానవాటికను ప్రారంభించారు. అయితే నీటి వసతి కల్పించకపోవడంతో అది ప్రారంభించినప్పటి నుంచి అలంకారప్రాయంగానే మిగిలింది. ఆరు నెలలు కావొస్తున్నా, అధికారులు వినియోగంలోకి తేలేకపోయారు. మోటార్, వైరును దొంగలు ఎత్తుకుపోవడంతో నీటి కటకట ఏర్పడింది. కొత్త బర్నింగ్ యూనిట్ నిర్మించినా, పాత బర్నింగ్ యూనిట్పైనే మృతదేహాలను దహనం చేస్తు న్నారు. మృతుడి కుటుంబీకులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తేనే నీటి ట్యాంకర్ను వైకుంఠధామం వద్దకు పంపుతున్నారు. దహన సంస్కారాలు పూర్తవగానే ఆరు బయట స్నానాలు చేసి ఇళ్లకు వెలుతున్నారు. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయమై మున్సిపల్ ఏఈ కృష్ణయ్యను వివరణ కోరగా.. వైకుంఠధామంలో బోరు వేసి కరెంట్ మోటార్ బిగించామని, రెండు సార్లు మో టార్ను దొంగలు ఎత్తుకుపోయారని తెలిపారు. బోరుకు మరమ్మతులు చేసి, నీటి సదు పా యం కల్పించి శ్మశానవాటికను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నీటి వసతి లేక నిరుపయోగం పట్టించుకోని అధికారులు -
వసూళ్లు.. వాటాలు!
● అనుమతి లేని డాక్యుమెంట్ రైటర్ల హవా ● డాక్యుమెంట్కు రూ. 3 వేలు వసూలు ● లిటిగేషన్ ల్యాండ్లకు కనక వర్షం అవినీతికి కేరాఫ్గా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతుంది. ఎలాంటి లైసెన్స్లు లేని డాక్యుమెంట్ రైటర్లు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఒక్కో డాక్యుమెంట్కు రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. వీటిని అధికారులు.. రైటర్లు వాటాలేసి పంచుకుంటున్నారు. లిటిగేషన్ ల్యాండ్లు ఈ కోటరీకి కనక వర్షం కురిపిస్తున్నాయి. కనీస న్యాయ పరిజ్ఞానం లేని రైటర్లు సైతం డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు. జిల్లాలో నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, సుమారు 35 మంది డాక్యుమెంట్ రైటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. – మెదక్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎలాంటి సేవలు అందాలన్నా, వీరే క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో డాక్యుమెంట్కు సాధారణంగా రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో సుమారు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు రిజిస్ట్రార్ ఆఫీస్కు చెల్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బాండ్ పేపర్కు కొంత పోనూ మిగితావి టైప్ రైటర్, డాక్యుమెంట్ ఏజెంట్ వాటా లేసి పంచుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇక ఏవైనా భూసమస్యలుంటే, వాటి రేటు రూ. వేలల్లో ఉంటుంది. ముఖ్య అధికారి తమకు అనుకూలంగా ఉంటే సరి, లేకుంటే ఆయన లేని సమయంలో కింది స్థాయి ఇన్చార్జిలు, రూ. వేలు తీసుకొని పని పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. డీటీసీపీ లేని ప్లాట్లు, కచ్చా లేఅవుట్, మార్టిగేజ్ అయిన ప్లాట్లు, టైటిల్ సమస్యలున్న వాటివి కూడా చక్క బెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈసీ, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ తదితర సేవలకు అందిన కాడికి దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. చివరకు డాక్యుమెంట్పై సంతకం తీసుకునే ఆఫీస్ సబార్డినేట్ సైతం డాక్యుమెంట్కు రూ.100 వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రద్దు అయినా కొనసాగుతున్న వ్యవస్థ న్యాయ పరమైన జ్ఞానమున్న అడ్వకేట్ లాంటి వారు డాక్యుమెంట్ రైటర్లుగా కొనసాగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కనీస న్యాయ పరమైన పరిజ్ఞానంలేని వారు కూడా, ఏజెంట్లుగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని, డాక్యుమెంట్ రైటర్ విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణ ప్రాంతాలో, రోజు వారీగా రూ. వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. రియల్ ఎస్టేట్ దందా జోరందుకున్న కాలంలో వీరి ఆగడాలు ఎక్కువ కావడంతో, 2009లో ప్రభుత్వం డాక్యుమెంట్ లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిసింది. అయినా ఏళ్ల తరబడి దందా నడుపుతున్న వారు, ఇప్పటికీ డాక్యుమెంట్ రైటర్లుగా కొనసాగుతున్నారు. అధికారులకు వారధిగా పని చేస్తూ అమాయకుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. కొంత మంది కనీసం ఇంటర్, డిగ్రీ చదువుకోని వారు కూడా డాక్యుమెంట్ రైటర్లుగా పని చేస్తున్నారు. నిజానికి రిజిస్ట్రేషన్ లాంటి సేవలకు ఎలాంటి డాక్యుమెంట్ రైటర్ అవసరం లేదు. విషయమంతా ఆన్లైన్లో ఉంటుంది. అక్కడ పేర్లు వివరాలు మారిస్తే సరిపోతుంది. ప్రస్తుతం మండల రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు అదే పద్ధతిన కొనసాగుతున్నాయి. అక్కడ ఎలాంటి డాక్యుమెంట్ రైటర్లు లేరు. నిబంధనల మేరకే సేవలు 2009లో అప్పటి ప్రభుత్వం డాక్యుమెంట్ రైటర్ లైసెన్స్లు రద్దు చేసింది. తిరిగి వాటిని పునరుద్ధరించలేదు. కనీస న్యాయ పరిజ్ఞానం ఉన్నవారు, విద్యాధికు లు డాక్యుమెంట్లు తయారు చేసు కోవచ్చు. తాము డాక్యుమెంట్ రైటర్ల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదు. నిబంధనలకు అనుగుణంగానే సేవలు అందిస్తున్నాం. – కిరణ్కుమార్, మెదక్ సబ్ రిజిస్ట్రార్ -
బాలికలకు హెచ్పీవీ టీకా
జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులురామాయంపేట(మెదక్): విద్యార్థినులు గర్భాశయ కేన్సర్ బారిన పడకుండా కేంద్ర వైద్యారోగ్యశాఖ హెచ్పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు ఇవ్వనున్నారు. ఈమేరకు జిల్లా పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రిలో గుర్తించిన విద్యార్థినులకు టీకా ఇవ్వనున్నారు. త్వరలో జిల్లాలో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే డాక్టర్లతో పా టు నర్సులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కాగా టీకా తీసుకుంటే భవిష్యత్తులో కేన్సర్ సోకే ప్రమాదాన్ని 90 శాతం వరకు తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు బాలికలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు. -
శిథిల ప్రక్షాళన
నాచగిరిలో నిరర్ధక భవనాల తొలగింపు వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రంలో గుదిబండగా మారిన శిథిల భవనాల తొలగింపునకు మోక్షం లభించింది. శిథిల ప్రక్షాళన.. సౌకర్యాల కల్పనే’ధ్యేయంగా ఆలయం చుట్టూ చెత్త చెదారం, పిచ్చిమొక్కలు, పెరిగి, బూత్బంగ్లాలను తలపిస్తున్న దశాబ్ధాల క్రితం నాటి శిథిల భవనాల కూల్చివేత పనులు వేగవంతం చేసింది. అక్కడ దుకాణ సముదాయాలు, వసతి గృహాలు నిర్మించి యాత్రికులకు సౌకర్యాలు మెరుగుపరచే దిశగా అడుగులు వేస్తున్నది. అంచెల వారీగా ఒక్కో పని చక్కబెట్టుకుంటూ గుడిని సాధ్యమైనంత అభివృద్ధి చేసుకుందామనే యోచనలో ఆలయ యంత్రాంగం ముందుకు సాగుతున్నది. శిథిలమై.. చిక్కిశల్యమై.. భక్తుల సౌకర్యం కోసం దశాబ్ధాల క్రితం నిర్మించిన అనేక భవనాలు శిథిలమయ్యాయి. దుకాణ సముదాయాల వెనుక, ప్రధాన గుడి పక్కన అనేక శిథిల భవనాలు ఆలయ శోభను దెబ్బతీస్తున్నాయి. హరిద్రాతీరం వెంబడి, సభామండపం పక్కన సత్రాలు ఇదే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటిని తొలగిస్తే ఆలయ శోభ ఇనుమడించడంతోపాటు సౌకర్యా లు మెరుగుపరిచే వీలు కలుగుతుంది. రెండేళ్ల క్రితమే అనుమతి నాచగిరి గుడి చుట్టూ శిథిల భవనాల తొలగింపునకు రెండేళ్ల క్రితమే దేవాదాయశాఖ నుంచి అను మతి వచ్చింది. తాజాగా ఆలయ యంత్రాంగం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. శిథిల ప్రక్షాళన దిశగా తొలగింపు పనులను వేగవంతం చేసింది. -
భూసేకరణకు రైతులు సహకరించాలి
రైల్వే డీఎన్ ధర్మరాజు, ఆర్డీఓ రమాదేవి చిన్నశంకరంపేట(మెదక్): రైల్వే డబుల్ లేన్కు అవసరమైన భూ సేకరణకు రైతులు సహకరించాలని రైల్వే డీఎన్ ధర్మరాజు, మెదక్ ఆర్డీఓ రమాదేవి కోరారు. బుధవారం మండలంలోని మిర్జాపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో భూములు పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గ్రామానికి వెళ్లే రైల్వే బ్రిడ్జిలో నీరు నిల్వకుండా చూస్తే అవసరమైన భూ ములు ఇచ్చేందుకు తమకేలాంటి అభ్యంతరం లేదన్నారు. మరికొందరు రైతులు తమకు బ్రిడ్జితో సమస్య ఏర్పడుతుందని, మరో చోట నుంచి రహదారి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఈసందర్భంగా డీఎన్ ధర్మరాజు మాట్లాడుతూ.. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బ్రిడ్జిలో చెరువు నీరు నిల్వకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. బ్రిడ్జి వద్ద నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన పైప్లైన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అదనపు దారి విషయంలో గ్రామస్తులు చర్చించుకొని రహదారికి అవసరమైన భూమిని అందిస్తే అదనపు రోడ్డును కూడా వేసి ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో రైల్వే డబుల్ లైన్ భూసేకరణ అధికారులు రాకేష్, రమేష్, చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి, ఆర్ఐలు రాజు, వినయ్, మిర్జాపల్లి ప్రజాప్రతినిధులు రమణ, జనార్దన్, మనోజ్, యాదగిరి, సంజీవ్, గంగాధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నీటిఎద్దడి నివారణకు రూ.27 కోట్లు
ప్రతిపాదించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: వేసవిలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ.27కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రఘువీర్, ఇంట్రా ఈఈ శేఖ్ పాష, గ్రిడ్ ఈఈ నాగభూషణం, డిప్యూటీ ఈఈ ఫణివర్మ, ఏఈలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఖేడ్ నియోజకవర్గంలో నీటి ఎద్దడి పరిష్కారానికి రూ.7కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు నుంచి కంగ్టి మండలంలోని 40 గ్రామాలు (హ్యాబిటేషన్లు), జుక్కల్ నియోజకవర్గంలోని 30 గ్రామాలకు నీటి సరఫరాకు రూ.20కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లోని 42వరకు బోర్ల ఫ్లష్షింగ్, డీపనింగ్కు రూ.30లక్షలు, 111 గ్రామాలకు హైరింగ్ ద్వారా నీటి సరఫరాకు రూ.25 లక్షలు, అత్యవసర పరిస్థితుల్లో రవాణా ద్వా రా నీటి సరఫరాకు రూ.1.5కోట్లు అవసరం అని గుర్తించామన్నారు. -
మూడు తహసీల్దార్ కార్యాలయాలకు భవనాలు
మెదక్ అర్బన్: జిల్లాలో నూతనంగా ఏర్పాటైన మూడు మండలాల్లో, తహసీల్దార్ కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలంగాణ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని హవేళిఘణాపూర్, చిలప్చెడ్, నిజాంపేట మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 51 తహసీల్దార్, 5 ఆర్డీఓ కార్యాలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో జిల్లాలోని మూడు మండలాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న తహసీల్దార్ కార్యాలయాల్లో తిప్పలు తప్పనున్నాయి. రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపల్ కమిషనర్గా శ్రావణ్ నియామకయ్యారు. గ్రూప్1లో ఎంపికై న ఆయన, మొదటి పోస్టింగ్ కమిషనర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాన ని అన్నారు. ఈమేరకు కౌన్సిలర్ నాగరాజు తదితరులు నూతన కమిషనర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలోని పశువైద్యాధికారి సమయపాలన పాటించడం లేదని పాడి రైతులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. బుధవారం గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఆస్పత్రికి వెళ్లగా, డాక్టర్ అందుబాటులో లేరు. దీంతో వారు నిరసన తెలిపారు. సరైన సమయంలో వైద్యం అందక మూగజీవాలు మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా వెటర్నరీ ఏడీకి సమాచారం ఇవ్వగా, ఆయన వెంటనే ఫిర్యాదు పత్రాన్ని వాట్సాప్ ద్వారా పంపించాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు రాజిరెడ్డి, శ్రీకాంత్, శ్రీరాములు, తిరుపతిరెడ్డి, పర్షరాములు, కనకరాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: హైదరాబాద్లో గురువారం నుంచి జరిగే జనగణన శిక్షణకు జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి ఎంపికయ్యారు. ఈసందర్భంగా బుధవారం ఆయన కలెక్టర్ ప్రతిమాసింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగే ఈ శిక్షణలో పాల్గొననున్నారు. జిల్లాలో వేసవిలో మొదటి దశలో జరిగే జన గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని రాజిరెడ్డి తెలిపారు. నేడు, రేపు తాగు నీటి సరఫరా బంద్ మెదక్జోన్: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రెండు రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నామని మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ నాగభూషణం బుధవారం తెలిపారు. భగీరథ నీరు సరఫరా అయ్యే పైపులైన్లు పెద్దారెడ్డిపేట, ఎల్లాపూర్ ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని వాటి మరమ్మతుల కారణంగా ఈనెల 5, 6వ తేదీల్లో మెదక్ నియోజకవర్గంలోని 275 గ్రామాలకు, ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల పరిధిలోని 80 గ్రామాలు, మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలకు తాగునీటి సరఫరా నిలిపి వేస్తున్నామన్నారు. కాగా ముందస్తుగా ఆయా గ్రామాల సర్పంచ్లకు సమాచారం అందించామన్నారు. -
బిల్లుల చెల్లింపులో జాప్యం వద్దు
కలెక్టర్ ప్రతిమాసింగ్నర్సాపూర్/కౌడిపల్లి: ఇందిరమ్మ ఇంటి బిల్లుల చెల్లింపులో జాప్యం చేయొద్దని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని 12వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. నిర్మాణం పూర్తవగానే నిబంధనల మేరకు బిల్లులు అందుతాయని తెలిపారు. కాగా పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఆమె వెంట ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ ప్రభాకర్, హౌసింగ్ డీఈ ప్రభు, ఏఈ రాజ్కుమార్తో పాటు నాయకులు ఉన్నారు. అనంతరం కౌడిపల్లిలో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం ఇసుక పంపిణీ చేసిందా..? బిల్లులు వచ్చాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రభుత్వ ఇసుక రాలేదని వారు చెప్పగా, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓను ఎందుకు ఇసుక ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక ఇంటికి 40 టన్నులు ఇసుక సరఫరా చేస్తుందని, ఎంతమంది లబ్ధిదారులు తీసుకున్నారనే వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. హౌసింగ్, పంచాయతీరాజ్ అధికారులు కలిసి పనిచేయాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, హౌసింగ్ డీఈ ప్రభు, ఏఈ అభిషేక్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, ఆర్ఐ విజయలక్ష్మి నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయిలో కానిస్టేబుల్ ప్రతిభ
మెదక్కలెక్టరేట్: కానిస్టేబుల్ సాయికుమార్ విధుల్లో రాణించడంతో పాటు క్రికెట్లో జాతీయస్థాయికి ఎదగడం అభినందనీయమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయనను సన్మానించి నగదు ప్రోత్సా హకం అందజేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల తిరుపతిలో జరిగిన సౌత్జోన్ క్రికెట్ టోర్నమెంట్లో సాయికుమార్ అద్భుత ప్రదర్శనతో జట్టును సెమీ ఫైనల్ వరకు చేర్చడంలో కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు. అలాగే ఎలైట్ క్రికెట్ ప్రీమియర్ లీగ్లో తెలంగాణ పోలీస్ జట్టును విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించాడని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్ఐ శైలేందర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డి, సీసీ రాజేందర్ సిబ్బంది త దితరులు పాల్గొన్నారు. -
సింగూరు కాలువ మరమ్మతులు ప్రారంభం
పుల్కల్(అందోల్): సింగూరు కాలువ సిమెంట్ లైనింగ్ పనులు పునఃప్రారంభమైనాయి. గతేడాది గుత్తేదారు పనులు ప్రారంభించిన అనంతరం వానాకాలం రావడంతో సాగునీటికి ఇబ్బంది కలుగుతుందని పనులను నిలిపివేశారు. ప్రస్తుతం డ్యాం మట్టికట్టకు మరమ్మతులు జరుగుతున్నందున యాసంగి పంటలకు విరామం ప్రకటించారు. దీంతో కాలువ సిమెంట్ లైనింగ్ పనులను కూడా గుత్తేదారు ప్రారంభించారు. ప్రస్తుతం కాలువలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి కాలువను మార్కింగ్ చేసుకుంటున్నారు. సంగారెడ్డి టౌన్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగనున్న సీతారామచంద్రుల కల్యాణోత్సవ ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇంటివద్దకే అందించనున్నట్లు సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు. ఇందుకోసం భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.151 చెల్లించి https:// www.tgsrtclogistics. gov.in ద్వారా తలంబ్రాలు బుకింగ్ చేసుకోవచ్చన్నారు. డిపో కార్యాలయంలో బుధవారం తలంబ్రాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. తలంబ్రాలు కావాల్సిన వారు ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో కూడా సంప్రదించవచ్చన్నారు. -
దూది రైతు దుఃఖం
సాక్షి, సిద్దిపేట: పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓ వైపు దిగుబడి తగ్గి.. మరోవైపు మద్దతు ధర దక్కక.. సీసీఐ నిబంధనలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధిక వర్షాలతో కొంత పత్తి నల్లబారినా, తేమ ఎక్కువ ఉంటే సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించారు. జిల్లాలో ఇప్పటివరకు 81,321 మెట్రిక్ టన్నుల పత్తి మాత్రమే విక్రయించారు. ఎకరాకు ఆరేడు క్వింటాళ్లే దిగుబడి 2025–26లో వానకాలంలో 1,18,785 ఎకరాల్లో పత్తి సాగైంది. అధికారుల అంచనా ప్రకారం ఎకరానికి 10 క్వింటాళ్ల చొప్పున లెక్కించినా 1.18 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా పత్తి రావాలి. అలాంటిది ఎకరానికి దాదాపు 6 నుంచి 7 క్వింటాళ్లే దిగుబడి వచ్చినట్లు పత్తి విక్రయాలను బట్టి తెలుస్తోంది. అధిక వర్షాలతో పత్తి రైతు నష్టపోయారు. పత్తి ఏరే సమయంలో ఎండ ఎక్కువ ఉండాలి. మబ్బులు పట్టడంతో పత్తికాయలు పగలలేదు, కొన్ని చోట్ల పత్తికాయలు చెట్ల మీదనే కుళ్లిపోయాయి. పత్తికాయల్లో తేమ శాతం పెరగడంతో నల్లబారి మొలకలు సైతం వచ్చాయి. పత్తి తగ్గడమే కాకుండా నాణ్యత సైతం దెబ్బతింది. రెండేళ్ల కంటే తగ్గిన దిగుబడి ఇటీవల సీసీఐ కొనుగోళ్లు ముగిశాయి. 57,949 మంది రైతుల నుంచి 74,146 మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 చాలామంది రైతులకు దక్కలేదు. నాణ్యత లేదని క్వింటాలుకు రూ.100 తగ్గించారు. తేమ ఉందని, నాణ్యత లేదని సీసీఐ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్కు 7,175 మెట్రిక్ టన్నులు విక్రయించారు. తేమ పేరుతో, కొంత నల్లబారండంతో సీసీఐ కొనుగోళ్లు చేయలేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించారు. గతేడాది కంటే 40వేల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోళ్లు తగ్గాయి.సంవత్సరం సీసీఐ ప్రైవేట్ మొత్తం (మెట్రిక్ టన్నుల్లో) 2023–24 74,588 26,199 1,00,787 2024–25 1,05,736 15,038 1,20,774 2025–26 74,146 7,175 81,321నట్టేట ముంచిన పత్తి పంట -
మెతుకు సీమ మెరిసేనా..!
మెతుకుసీమగా ప్రసిద్ధిగాంచిన మెదక్ పాలకుల నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి వెనుకబాటుకు గురవుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా పట్టణ ముఖచిత్రం మాత్రం మారడం లేదు. జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజలు పెట్టుకున్న కొండంత ఆశలు అడియాశలయ్యాయి. చిన్నపార్కుకు కూడా నోచుకోలేదంటే మెదక్ పట్టణం ఎంత నిర్లక్ష్యానికి గురైందో ఇట్టే అర్థమవుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా యువకులు, కొత్తవారే కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. కనీసం వీరి హయాంలోనైనా పేరుకు పోయిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమోనని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. – మెదక్ కలెక్టరేట్ మెదక్ పట్టనంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన రైతుబజారును యేళ్ల తరబడి ప్రారంభించకుండా వదిలేశారు. జిల్లా నలుమూలల నుంచి కూరగాయలు తెచ్చిన రైతులు రోడ్లపైనే అవస్థలు పడుతున్నారు. రైతుబజారును ప్రారంభించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే.. మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూర్చే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో పాతవారే పాతుకు పోయారు. 40 యేళ్లుగా కొనసాగుతున్న మున్సిపల్ దుకాణాలకు రీ టెండర్లు వేయాలని పలు సంఘాల నాయకులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు. గతంలో ఉన్న కలెక్టర్లు సైతం ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ బల్దియా పాలకవర్గం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో కొంతమంది చేతుల్లోనే పదుల సంఖ్యలో దుకాణాలు ఉండగా, బల్దియా ఆదాయానికి గండి పడుతూనే ఉంది. కొత్త పాలకవర్గంతో మార్పు వస్తుందని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. సేదతీరేందుకు చోటేది? జిల్లా కేంద్రం ఏర్పాటుతో సమీకృత కలెక్టరేట్, ఎస్పీతోపాటు పలు శాఖల కార్యాలయాలు నిర్మించారు. దీంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు నిత్యం అధిక సంఖ్యలో వస్తున్నారు. వివిధ పనులపై వచ్చే వారు సేదదీరేందుకు మంచి పార్కు కూడా లేకుండా పోయింది. ఉన్న పార్కులో కొంతభాగం మిషన్ భగీరథ పైలాన్ నిర్మించారు. మిగతా భాగంలో ప్రైవేట్ వాహనదారులు అడ్డాగా మార్చుకున్నారు. సుందరీకరణ ఆగమాగం పట్టణంలోని మల్లం, పిట్లం, గోసముద్రం చెరువుల సుందరీకరణ పనులు చేపట్టారు. మినీ ట్యాంక్బండ్ల ఏర్పాటుకు గత పాలకులు రూ.కోట్లు ఖర్చుచేసి మధ్యలోనే వదిలేశారు. మల్లం చెరువు కట్ట డంపుయార్డుగా మారింది. ఈ రోడ్డు మీదుగా నర్స్ఖేడ్ వెళ్లే ప్రజలు, శ్మశాన వాటికకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. యేళ్ల తరబడి పేరుకు పోయిన సమస్యలు పాలకుల నిర్లక్ష్యంతో పడకేసిన ప్రగతి కొత్త పాలకవర్గంపైనే కోటి ఆశలు పట్టణంలోని ఇందిరాపురికాలనీలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుంఠధామాల నిర్మాణాలు పిల్లర్ల స్థాయిలో నిలిచిపోయాయి. రాందాస్ చౌరస్తా నుంచి సర్ధన వెళ్లే రోడ్డు యేళ్ల తరబడి పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. నిధులు మంజూరైనట్లు పాలకులు చెబుతున్నా.. రోడ్డు పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అలాగే రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నత్త నడకన సాగుతోంది. దుకాణాల కోసం డబ్బులు చెల్లించిన లబ్ధిదారులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. -
మూడు రోజులు డ్రైడే
కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ కలెక్టరేట్: హోలీ పండుగను పురస్కరించుకుని జిల్లాలో మూడు రోజులు డ్రైడే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 5 తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనున్నట్లు చెప్పారు. పండుగల పవిత్రతను కాపాడేందుకు వైన్ షాపులు, బార్లు పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. రైల్వే జీఎంకు ఎంపీ రఘునందన్రావు వినతి మెదక్జోన్: మెదక్ లోక్సభ పరిధి పెండింగ్లో ఉన్నా రైల్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. మంగళవారం రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవను కలిసి పెండింగ్ పనులపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. చేగుంట–మెదక్ ప్రధాన రహదారి వద్ద మంజూరైనా రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్ఓబీ) నిర్మాణంతో పాటు మెదక్ రైల్వేస్టేషన్లో కొనసాగుతున్న అమృత్ పనులపై చర్చించినట్లు చెప్పారు. అలాగే, మెదక్ జిల్లా అక్కన్నపేట్ వద్ద అజంతా, రాయలసీమ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపాలని జీఎంకు వినతిపత్రం ఇచ్చారు. ఎంఎల్ఆర్ ఆటో పరిశ్రమ వద్ద చెలరేగిన మంటలు మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి తగలబెట్టడంతో మంటలు అంటుకుంటున్నాయి. మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో గల ఎంఎల్ఆర్ ఆటో పరిశ్రమల దగ్గరలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు గడ్డిని తగులబెట్టారు. కాగా మంటలు పరిశ్రమ వద్దకు వ్యాపించాయి. గుర్తించిన పరిశ్రమ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు మంటలను ఆర్పి భారీ ప్రమాదాన్ని తప్పించారు. కాగా పరిశ్రమలో స్క్రాప్ ధ్వంసమైందని పరిశ్రమ సిబ్బంది తెలిపారు. అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ రామాయంపేట(మెదక్): పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ రేంజ్ అధికారి విద్యాసాగర్ పేర్కొన్నారు. వణ్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం స్థానిక సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థుల ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ముందు తరాలకు మంచి వాతావరణం కల్పించే దిశగా మనం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేసవిలో అటవీప్రాంతంలో మంటలు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు తమకు సహకరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారిణి గీత పాల్గొన్నారు. ‘ద్వార’ బంధనంనాచగిరి, విద్యాధరి ఆలయాలు మూసివేత వర్గల్(గజ్వేల్): చంద్ర గ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం జిల్లాలోని సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి, వర్గల్ విద్యాధరి ఆలయాలకు ద్వార బంధనం చేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ, అభిషేకం అనంతరం ఆలయాలలోకి యథావిదిగా భక్తులకు అనుమతి కల్పిస్తారని ఆలయ వేదపండితులు పేర్కొన్నారు. -
రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలి
మెదక్ కలెక్టరేట్: భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని జై భీమ్ మహాసేన జాతీయ అధ్యక్షుడు మాస్టర్ జీ పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ సంఘం విశ్వజన కళామండలి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న రథయాత్ర మంగళవారం మెదక్కు చేరుకుంది. ఈ సందర్భంగా గోల్కొండ వీధిలోని అంబేద్కర్ కాలనిలో అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టుగా పాఠ్యాంశంలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్ర ద్వారా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పరీక్షల్లో రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్న పత్రం ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జై భీమ్ మహాసేన నాయకులు అంజన్న, అశోక్, రాణి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్ మహాసేన జాతీయ అధ్యక్షుడు మాస్టర్ జీ -
గర్భస్రావాలు
ఆందోళన కలిగిస్తోన్నసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గర్భస్రావం (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ–ఎంటీపీ) కేసుల నమోదు వృద్ధి రేటు తెలంగాణలో గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. ఐదేళ్లలో ఏకంగా 900% పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024–25లో రాష్ట్రవ్యాప్తంగా 16,059 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) రాష్ట్రంలో గర్భ నిరోధక మాత్రల వినియోగంపై దృష్టి సారించింది. అన్వాంటెడ్ కిట్గా పిలుచుకునే ఈ మాత్రలు హిమాచల్ప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నట్లు డీసీఏ గుర్తించింది. ఈ మాత్రల వినియోగంపై జిల్లాల్లోని డ్రగ్ ఇన్స్పెక్టర్ల ద్వారా ఆరా తీస్తోంది. ఈ అన్వాంటెడ్ కిట్స్ ఏయే మెడికల్ ఏజెన్సీలకు సరఫరా అయ్యాయి? వాటిని ఏ మెడికల్ షాపులకు విక్రయించారు? లేదా ఆస్పత్రులకు పంపారు? ఈ మాత్రలు ఎవరికి ఇచ్చారు? వంటి వివరాలను డ్రగ్ ఇన్స్పెక్టర్లు సేకరిస్తున్నారు. ప్రతి నెలా కనీసం 15 మెడికల్ షాపులనైనా చెక్ చేస్తున్నామని మెదక్ జిల్లాకు చెందిన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగం గర్భస్రావం మాత్రలు నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ మాత్రలను మెడికల్ షాపుల్లో విక్రయించడానికి వీలు లేదు. గైనకాలజీ వైద్యసేవలందించే ఆస్పత్రులు మాత్రమే వీటిని వినియోగించాలి. కానీ, రాష్ట్రంలో వీటి వినియోగం విచ్చలవిడిగా సాగుతోందనే విమర్శలున్నాయి. పీఎంపీలు, ఆర్ఎంపీల సూచనల మేరకు వీటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే గర్భందాల్చిన నిర్ణీత సమయంలోపే వీటిని వినియోగించాలి. కానీ నెలలు నిండాక కూడా వీటిని వాడటంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరైతే శాశ్వతంగా మాతృత్వాన్ని కోల్పోతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పల్లెల్లోనూ అన్వాంటెడ్ కిట్ల వినియోగం దృష్టి పెట్టిన డ్రగ్ కంట్రోల్ అథారిటీ తనిఖీలు చేస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్లు నగరాల్లో అత్యధికంగా నమోదుగర్భస్రావాల కేసులు పల్లె పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి వంటి జిల్లాల్లో ఎక్కువగా ఎంటీపీ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు ఉండటమే కారణమని భావిస్తున్నారు. ఈ మూడు జిల్లాలో ఏటా సగటున 2,500 నుంచి 5,200 కేసులు నమోదవుతుండటం గమనార్హం. గ్రామీణ, అత్యంత మారుమూల ప్రాంతాలైన ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఏటా 100 నుంచి 300 కేసులు రికార్డవుతున్నాయి. ఇక్కడ సరైన స్పెషలిస్టు వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో సమీప పట్టణాలకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏటా 1000 కేసులు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
ఎనిమిది రకాల పంటలు
గుంట భూమి..● సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరల సాగు ● తునికి ఆర్వీజే ఫీల్డ్ సూపర్వైజర్ వినూత్న ప్రయోగం కౌడిపల్లి(నర్సాపూర్): ఇంటి అవసరాల కోసం స్థలం లేదు.. కోతుల బెడద ఉంది. నీళ్లు లేవు అంటూ సాకులు చెప్పే ప్రజలకు తమ ఇంటి వద్దే ఉన్న కాస్తంత స్థలంలో పంటలను సాగుచేసి ఆదర్శంగా నిలిచాడు మండలంలోని తునికి ఆర్వీజే (డాక్టర్ డి రామానాయుడు విజ్ఞాన జ్యోతి) వ్యవసాయ కళాశాల ఫీల్డ్ కోఆర్డినేటర్ జగదీష్. తన ఇంటి ముందు ఉన్న గుంట స్థలంలో ఐరన్షెడ్ వేసి సేంద్రియ పద్ధతితో వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నాడు. జగదీష్ మండలంలోని తునికి వద్దగల విజ్ఞాన జ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యాసంస్థ వ్యవసాయ కళాశాలలో విద్యార్థులకు సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తన ఇంటి ముందు ఉన్న గుంట స్థలంలో కూరగాయల సాగు కోసం వినూత్న ప్రయోగం చేశారు. రూ 30వేలతో ఐరన్ జాలీతో షెడ్ వేశారు. అందులో టమాట, వంకాయ, రెడ్ క్యాబేజీ, గ్రీన్క్యాబేజీ, బ్రోకాలి, ఆకుకూరలు పాలకూర, తోటకూర, తీగజాత మొక్కలు పెంచుతున్నాడు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుల మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నామన్నారు. చీడ పీడల నివారణకు ఇంగువ, పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తున్నామని చెప్పారు. నాలుగు రోజులకు ఒకసారి భూమిలో కలుపు నివారిస్తూ నీటి తడులు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి రైతు తక్కువ స్థలంలో ఇంటి వద్ద కూరగాయలు సాగు చేసుకోవచ్చని జగదీష్ చెప్పారు. -
ప్రజలు నేరుగా కలవొచ్చు
మెదక్జోన్: ఎలాంటి పైరవీలకు తావులేకుండా ప్రజలు తనను నేరుగా కలవొచ్చని ఎస్పీ శ్రీనివాస్రావు ప్రజలకు సూచించారు. సోమ వారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి వినతులు స్వీకరించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించామని, ప్రజల్లో పోలీస్శాఖపై నమ్మ కం పెరిగిందన్నారు. నర్సాపూర్: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్లో జరగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆయనను కలిశారు. వారం రోజులుగా కొనసాగిన శిక్షణలో పార్టీ సంస్థాగత బలోపేతం, సమస్యలపై అనుసరించాల్సిన పోరాట వ్యూహాలపై అవగాహన కల్పించారు. టేక్మాల్(మెదక్): రైతులు వాణిజ్య పంటలే కాకుండా చిరుధాన్యాలు సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని మిల్లెట్ మ్యాన్ఆఫ్ తెలంగాణ వీర్శెట్టి అన్నారు. సోమవారం మండలంలోని కుసంగిలో రైతు వెంకటేశం సాగుచేస్తున్న జొన్న, సజ్జ, రాగి, ఊద, అరికె వంటి పంటలతో పాటు కుసుమ, మొక్కజొన్న పంటలను ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు అనిల్, నరేష్బొమ్మైతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండెకరాల్లో పదికిపైగా చిరు ధాన్యాల పంటలను సాగు చేయడం అభినందనీయమన్నారు. గ్రామా ్లోని రైతులు సంఘటితమై చిరు ధాన్యాలు సాగు చేయాలని కోరారు. ఆయన వెంట రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడు మెగిలయ్య, రైతులు తదితరులు ఉన్నారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 2026– 27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ విజయ తెలిపారు. మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్త అడ్మిషన్లు 7, 8, 9 ,10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని ఆసక్తి, అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నర్సాపూర్ రూరల్: వ్యవసాయ, ఉద్యానశాఖల ఆధ్వర్యంలో నర్సాపూర్ రైతులు సోమవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఆయిల్పామ్ సాగు చేస్తున్న భాగ్యలక్ష్మి అనే మహిళా రైతు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆయిల్పామ్ పంట సాగు దిగుబడిపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి సంతోష్, వ్యవసాయశాఖ ఏఈఓ మోహన్, ఆయిల్పామ్ టెక్నికల్ పర్సన్ అజయ్, రైతులు పాల్గొన్నారు. -
ఐటీఐలో నూతన కోర్సులు
మెదక్ కలెక్టరేట్: హవేళిఘణాపూర్ ప్రభుత్వ ఐటీఐలో పలు నూతన కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఎలక్ట్రిక్ వెహికిల్ మెకానిక్, సీఎన్సీ టెక్నీషియన్ కోర్సుల్లో మూడు నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్తో పాటు గుర్తింపు పొందిన ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల పది, ఇంటర్ చదివిన విద్యార్థులు మెదక్లోని ప్రభుత్వ ఐటీఐలో సంప్రదించాలని సూచించారు. -
సీ్త్రనిధి బకాయిలపై
జిల్లాలో పేరుకుపోయిన రూ.18 కోట్లు● ఈనెలాఖరు వరకు అవకాశం ● చెల్లించకుంటే ఆస్తులు జప్తు ● జిల్లాలో 16,866 సంఘాలు జిల్లాలో మొత్తం 16,866 మహిళా సంఘాలు ఉన్నాయి. ఇందులో మెప్మా పరిధిలో 1,960 సంఘాలు ఉండగా 19,600 మంది సభ్యులు, సెర్ప్ పరిధిలో 14,906 సంఘాలు ఉండగా 14,9060 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.78 కోట్ల పంపిణీ లక్ష్యంగా ఉండగా, రూ.68 కోట్లు అందజేశారు. మరో రూ.10 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అలాగే జిల్లాలో మొ త్తం రూ.18 కోట్లు బకాయిలు ఉండగా, ఇందులో రూ.15 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి. మిగితా రూ.3 కోట్లు రెగ్యులర్ బకాయిలు ఉన్నా యి. ఇందులో అత్యధికంగా రామాయంపేట మండలంలో రూ.2.50 కోట్లు, చేగుంటలో రూ.1.65 కోట్లు, కౌడిపల్లిలో రూ.1.45 కోట్లు, చిన్నశంకరంపేటలో రూ.1.45 కోట్లు, నర్సాపూర్లో రూ.135 కోట్లు పేరుకుపోయాయి. వీటితో పాటు మిగితా మండలాల్లోనూ రూ. లక్షల్లో బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఆర్ఆర్యాక్ట్ అమలు ఈ నెలాఖరులోగా మొండి బకాయిలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో మెప్మా, సెర్ప్ అధికారులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బకాయిలున్న సంఘాలతో సమావేశాలు నిర్వహించి నోటీసులు అందజేస్తున్నారు. వెంటనే బకాయిలు చెల్లించేలా చైతన్య పరుస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఆర్ఆర్, కో అపరేటివ్ యాక్ట్ ద్వారా ఆస్తులు జప్తు చేస్తామని చెబుతున్నారు. మహిళా సంఘాల్లో పేరుకుపోయిన మొండి బకాయిల వసూళ్లే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పంపిణీ చేసిన రుణాలను చెల్లించడంలో కొంతమంది తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాలో రూ.18 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. అధికారులు ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించినా, స్పందన రావడం లేదు. దీంతో రెవెన్యూ రికవరీ, కో ఆపరేటివ్ యాక్ట్లు అమలు చేయాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. – మెదక్ కలెక్టరేట్ మొండి బకాయిల వసూళ్ల కోసం మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి డబ్బులు కట్టేలా చైతన్య పరుస్తున్నాం. బకాయి ఉన్న మహిళల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి అర్థమయ్యేలా చెబుతున్నాం. ఈనెలాఖరులోగా డబ్బులు చెల్లించాలని వివరిస్తున్నాం. – గంగారాం, సీ్త్రనిధి ఆర్ఎం, మెదక్ -
వ్యవసాయానికి పెద్దపీట
ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: వ్యవసాయ రంగం అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మనూరు మండలం దుదగొండ పంచాయతీ పరిధిలోని గట్టులింగంపల్లి పెద్దచెరువుకు రూ.48.7లక్షల వ్యయంతో చేపట్టనున్న మరమ్మతు పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు మరమ్మతుల కారణంగా కుడి కాలువ 1.4కిలోమీటర్లు, ఎడమ కాలువ 1.2కిలోమీటర్ల మేర 300 ఎకరాల వరకు ఆయకట్టుకు నీరందనుందని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ జలందర్, ఏఈలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, శేరి రాజు, శ్రీకాంత్రెడ్డి, చంద్రలీలా, ప్రతిభ అనిల్ పాటిల్ పాల్గొన్నారు. ఇదే గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమా ఖ్య భవనానికి శంకుస్థాపన చేశారు. ఖేడ్ మండలం అనంతసాగర్కు చెందిన లక్ష్మిబాయికి కల్యాణలక్ష్మి చెక్కు, ఆరె మారుతిరావుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.60 వేలకు సంబంధించిన చెక్కును అందజేశారు. -
సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం
● వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాకు సన్నాహాలు ● ఇందుకోసం రూ. 57 కోట్లు మంజూరు మెదక్జోన్: వేసవిలో విద్యుత్ వినియోగం భారీగా పెరగనున్న నేపథ్యంలో జిల్లాలో అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించగా, రూ. 57 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో ఇప్పటికే 124 సబ్స్టేషన్లు ఉండగా, నూతనంగా మరో 8 సబ్స్టేషన్లు నిర్మించారు. ఇవికాకుండా గత వానాకాలంలో పట్టణ పరిధి పుష్పాలవాగు సమీపంలోని సబ్స్టేషన్ నీటి మునిగిపోగా, దానిని మరో చోట నిర్మించారు. ఇందుకోసం అదనంగా మరో రూ. 3.50 కోట్లు ఖర్చు చేశారు. 9 చోట్ల ఓవర్లోడ్ జిల్లాలో తొమ్మిది ప్రాంతాల్లో ఎక్కువగా ఓవర్లోడ్ అవుతున్నట్లు గుర్తించారు. వీటి పరిధిలో ఏడు 33 కేవీ సబ్స్టేషన్లలో లైన్వర్క్లు, ఇంటర్నల్ లింకులు ఇచ్చారు. గాలి దుమారంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా, ఇతర కారణాలతో అంతరాయం ఏర్పడితే మరో లైన్ నుంచి కనెక్షన్ ఇచ్చి సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. నూతనంగా 200 పైచిలుకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐదు టీఆర్ సెంటర్లు జిల్లావ్యాప్తంగా 5 ట్రాన్స్ఫార్మర్ రిపేర్ (టీఆర్) సెంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం వేసవిలో విద్యుత్ విని యోగం పెరగటంతో ఓవర్లోడ్, ఇతర సమస్యలతో ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే జిల్లాలోని మెదక్, పాపన్నపేట, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేటలోని టీఆర్ సెంటర్లకు తరలించి మరమ్మతులు చేయనున్నారు. కాగా వ్యవసాయ బోరు బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 48 గంటల్లో రిపేర్ చేసి రైతులకు ఇవ్వాల్సి ఉండగా, అదే గృహ అవసరాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మ ర్ కాలిపోతే కేవలం 24 గంటల్లో రిపేర్ చేసి ఇస్తారు. ఇదే విషయమై విద్యుత్శాఖ ఎస్ఈ నారాయణనాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యుత్ వినియోగం ఇప్పటికే గణనీయంగా పెరిగిందని, వచ్చే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, పరిశ్రమల్లో అవసరం మేరకే కరెంట్ వాడాలని సూచించారు. ఈనెలలో రోజుకు 572 మెగావాట్ల విద్యుత్ ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. -
ప్రజావాణికి వినతుల వెల్లువ
అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ప్రతిమాసింగ్మెదక్ కలెక్టరేట్: మూడు నెలల అనంతరం ప్రారంభమైన ప్రజావాణికి సోమవారం ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ తమ సమస్యలపై వినతులు సమర్పించి పరిష్కరించాలని నూతన కలెక్టర్ ప్రతిమాసింగ్కు మొర పెట్టుకున్నారు. సావధానంగా విన్న కలెక్టర్ ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణికి మొత్తం 74 వినతులు రాగా, ఇందులో అత్యధికంగా భూ సమస్యలు, పెన్షన్లు ఉన్నాయి. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తమ పనితీరును మరింత మెరుగు పర్చుకొని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అనంతరం టీజీఓ, జిల్లా టీజీఆర్ఎస్ఏ సంఘాల నాయకులు కలెక్టర్ను వేర్వేరుగా కలిసి సన్మానించారు. అంతకు ముందు కలెక్టరేట్లో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏఓ యూనస్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో నివాసం ఉండే ఓ వ్యక్తి మా భూమిని కబ్జా చేసి.. అందులోకి వస్తే చంపుతానని బెదిరిస్తున్నాడని కుషన్గడ్డ తండాకు చెందిన గిరిజనులు ఫిర్యాదు అందించారు. కొడుకుకు రెండెకరాలు ఇచ్చినా, అన్నం పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని రామచంద్రాపురం గ్రామానికి చెందిన మల్లయ్య కలెక్టర్ను కలిసి వివరించారు. కొడుకులు లేరని కూతురును ఇళ్లరికం పెట్టుకున్నా. 4 ఎకరాలు ఆమె పేరుపై పట్టా చేశా. ప్రస్తుతం తనను కొడుతూ ఇంట్లో నుంచి వెళ్లగొడుతుందని యశ్వంతరావుపేటకు చెందిన ఆండాలమ్మ ఫిర్యాదు చేసింది. -
ఆలు ధర ఢమాల్
మార్కెట్లో లభించని గిట్టుబాటు జహీరాబాద్: ఆలుగడ్డ పంటను సాగు చేసుకున్న రైతుల నోట్లో మట్టిపెల్ల పడుతోంది. మార్కెట్లో ఏ మాత్రం గిట్టుబాటు ధరలు లేక పోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎకరా పంటపై రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంటున్నారు. మార్కెట్లో క్వింటా ధర రూ.500 నుంచి రూ.600 మాత్రమే పలుకుతోంది. కాగా, ఈ ధరకు పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేదంటున్నారు. జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలోనే ఆలుగడ్డ పంట 90 శాతం వరకు సాగవుతుంది. ఈ ఏడాది జిల్లాలో 6వేల ఎకరాల్లో పంట సాగు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. క్వింటా విత్తనానికి రూ.4వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు రైతులు.. 8 క్వింటాళ్ల మేర విత్తనం నాటుకున్నారు. ఈ లెక్కన కేవలం విత్తనానికే రూ.32వేలు, ఇతరు పెట్టుబడులకు మరో రూ.50వేల మేర ఖర్చు చేసినట్లు రైతులు పేర్కొంటున్నారు. అయితే క్వింటా రూ.1,200 పలికితేనే గిట్టుబాటవుతుందని రైతులు చెబుతున్నారు. మార్కెట్కు పోటెత్తిన పంట మార్కెట్కు అధికంగా పంట రావడంతో గిట్టుబాటు ధర లభించలేదని అంటున్నారు. గతంలో జహీరాబాద్ ప్రాంతంలో మాత్రమే అధికంగా సాగవుతుండగా.. ప్రస్తుతం ఇతర జిల్లాలకు విస్తరించడంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి సైతం ఉత్పత్తులు వస్తున్నాయి. ఇందూర్, వికారాబాద్ జిల్లాల నుంచి హైదరాబాద్లోని మార్కెట్లకు అధికంగా ఉత్పత్తులు రావడంతో ధర పూర్తిగా పడిపోయేందుకు కారణమవుతోందని రైతులు వాపోతున్నారు. నవంబర్ నుంచి ఆలుగడ్డ పంట చేతికి అందకపోవడంతో ఆగ్రా ప్రాంతం నుంచి ఉత్పత్తులు దిగుమతి కావడం, ప్రస్తుతం ఇతర జిల్లాల నుంచి రావడంతో మార్కెట్లో ధర లభించకుండా పోయింది. దీంతో ధర పెరుగుతుందేమోనని కొంతమంది రైతులు పంటను భూమిలోనే ఉంచారు. కాగా, ఆలుగడ్డ పంటకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంటను సాగు చేసిన రైతులకు వరికి ఇచ్చిన మాదిరిగానే క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
నర్సంపల్లిలో మద్యపాన నిషేధం
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలంలోని నర్సంపల్లిలో మద్యపాన నిషేధం విధించారు. ఈమేరకు సోమవారం సర్పంచ్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో తీర్మానించారు. అ నంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఈనెల 5 నుంచి గ్రామంలో ఎవరూ మద్యం విక్రయించవద్దని చెప్పారు. ఒక వేల గ్రామసభ తీర్మానం ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.1 లక్ష జరిమానా విధించనున్నట్లు తెలిపారు. అలాగే మద్యం విక్రయిస్తుండగా, పట్టిస్తే రూ. 25 వేల నజరానా అందించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ బాల్రాజ్గౌడ్, మాజీ ఎంపీటీసీ రఫీ పాల్గొన్నారు. -
నేటి నుంచి జిల్లాలో పోలీస్ యాక్ట్
మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలో నెలరోజుల పాటు పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈనెల 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా 30, 30(ఏ) పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. దీని ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి ధర్నా లు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దన్నారు. అలాగే ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సత్తేటి వారాలలో భాగంగా ఏడో ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోనున్నారు. శనివారం సాయంత్రానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. వేకువ జామున పుష్కరిణిలో స్నానమాచరించి మల్లన్నకు పట్నం వేసి బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకోనున్నారు. -
తప్పుడు కేసులపై హెచ్ఆర్సీకి వెళ్తాం
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డిమెదక్జోన్: బీఆర్ఎస్ నేతలపై పోలీసులు పెడుతున్న తప్పుడు కేసులపై త్వరలో హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శనివారం మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేసి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈసందర్భంగా నాయకులతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నేతల అక్రమాలను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై 307 సెక్షన్తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ఆరాచకాలపై తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు స్వీకరించటం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు భరించి రాష్ట్రాన్ని తెచ్చామని, ఈ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్రెడ్డి, అడ్వకేట్ జీవన్రావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవాలి
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని ఎంజేపీ బాలుర పాఠశాల వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంజేపీ జాయింట్ సెక్రటరీ మద్దిలేటి, డీఈఓ విజయ, డీసీఓ హరిబాబు, ఎంఈఓ మధుమోహన్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాగా చదవి, ఉన్నతస్థాయికి చేరుకొని పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. ఈసందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ సృజన, శ్రావణి, ఉపాధ్యాయులు సునీత, నాగరాజు, సంతోశ్ పాల్గొన్నారు. -
డె యిరీకి మహ ర్దశ!
యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివినా ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కౌన్సిలర్లుగా గెలిచి పట్టణాలను ప్రగతి బాట పట్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో అత్యధికులు 35 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. ‘పురం’లో తమ మార్క్ చూపించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ‘సాక్షి’తో వెల్లడించిన యువ కౌన్సిలర్ల అభిప్రాయాలు... 1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు విజయ పాలుఇఫ్తార్ ఆదివారం: 6.28 సహర్ సోమవారం: 5.11 -
నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు
ఎస్పీ శ్రీనివాసరావు తూప్రాన్: రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమని ఎస్పీ శ్రీనివాస్రావు అన్నారు. శనివారం పట్టణంలోని జాతీయ రహదారి టోల్ప్లాజా వద్ద ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడ పడం, మొబైల్ ఫోన్ వినియోగం, చూపు సమస్యను నిర్లక్ష్యం చేయడమే ప్రధాన కారణమన్నారు. ఈ మేరకు ఆటో, బస్సు, లారీలు తదితర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించా రు. అనంతరం అవసరం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను గోల్డెన్ అవర్ సమయంలో ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐలు జాన్రెడ్డి, రంగకృష్ణ, సందీప్రెడ్డి, జీఎమ్మార్ అధికారులు, సీఎంఆర్ ఆస్పత్రి సిబ్బంది, వాహన డ్రైవర్లు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యం
మెదక్ కలెక్టరేట్: విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం ఎంతో అవసరమని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన జిల్లా పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో యువత శాతం అధికంగా ఉండటం ఆందోళనకరమన్నారు. చివరగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, సీఐలు జార్జ్, మహేష్, కృష్ణమూర్తి, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వైజ్ఞానిక ప్రదర్శనలతో మేలు
వెల్దుర్తి(తూప్రాన్): విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని డీఈఓ విజయ అన్నారు. సర్ సీవీ రామన్ జయంతిని పురస్కరించుకొని శని వారం మాసాయిపేట ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండలస్థాయి సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించి అభినందించారు. కొన్ని జాతీయ స్థాయిలో ఉండడంపై సంబంధిత గైడ్ ఉపాధ్యాయులను అభినందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. సర్కారు బడుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కిష్టారెడ్డి, ఎంఈఓ మధుసూదన్రావు, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, సైన్స్ ఉపాధ్యాయులు రంగారెడ్డి, భాగ్యలక్ష్మి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
నిధులు వెచ్చించి.. పనులు చేయించి
ప్రజాప్రతినిధుల సేవా కార్యక్రమాలుస్కూల్ స్టేజీ నిర్మాణానికి సర్పంచ్ భూమి పూజ ఇచ్చిన హామీ మేరకు..రామాయంపేట(మెదక్): జిల్లాలో నూతనంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులు సొంత నిధులతో తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుండగా, మరికొందరు సొంత డబ్బులతో పనులు చేయిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జిల్లాలో యువతీ, యువకులే ప్రజాప్రతినిధులుగా గెలుపొందారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోయినా, తమ సొంత నిధులతో గ్రామాల్లో బోర్లు తవ్వించడం, వీధి దీపాల ఏర్పాటు, నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టైలు, బెల్ట్లు, మినీ ట్యాంకుల నిర్మాణం.. తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలి
మెదక్ కలెక్టరేట్: రాష్ట్రంలోనే మెదక్ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం కలెక్టర్ ప్రతిమాసింగ్ హైదరాబాద్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేసి ప్రజాప్రభుత్వానికి మరింత మంచి పేరు తేవాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులను సమన్వయం చేసి ప్రజలకు పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తామన్నారు. తన శక్తి వంచనతో అహర్నిశలు పనిచేసి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెస్తామన్నారు. ‘అన్ని వసతులు కల్పించాలి’ మెదక్జోన్: పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సిబ్బందికి సూచించారు. శనివారం పట్టణంలోని పలు ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. తాగునీరు, మెడికల్ కిట్లు, టాయిలెట్ వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అలాగే సీసీ కెమెరాల పనితీరు, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల హాజరు వివరాలపై ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నాపత్రాలు ఇవ్వాలన్నారు. ఎలాంటి కాపీయింగ్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకతతో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ పరిశ్రమతో ఇబ్బంది పడుతున్నాం చిన్నశంకరంపేట(మెదక్): కావేరి పరిశ్రమ వెదజల్లే కాలుష్యంతో బతకలేకపోతున్నామని.. పరిశ్రమ సమీపంలోని పంట పొలాలు సైతం సాగు యోగ్యతను కోల్పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండలంలోని ఖాజాపూర్ శివారు కావేరి పరిశ్రమ పరిసరాలతో పాటు చెరువును తహసీల్దార్ మాలతి పరిశీలించారు. ఈసందర్భంగా రైతులు ఆమె ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. పరిశ్రమ నుంచి వెదజల్లుతున్న కాలుష్యంతో పాటు నల్లని దుమ్ము తమ పంటలకు నష్టం కలిగిస్తుందన్నారు. కంపెనీ పక్కన ఉన్న అంబారెడ్డి చెరువులో పరిశ్రమ వ్యర్థాలను వేయడంతో కలుషితం అవుతుందన్నారు. కాగా చెరువు ఎఫ్టీఎల్లో వేసిన డస్ట్ను వారం రోజుల్లో తొలగించాలని పరిశ్రమ మేనేజర్ను తహసీల్దార్ ఆదేశించారు. కాలుష్యంపై పీసీబీ అధికారులకు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. సఖి, భరోసా కేంద్రాలతో రక్షణ మెదక్ కలెక్టరేట్: సఖి, భరోసా సెంటర్లు ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలుస్తున్నాయని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ సిద్దాగౌడ్ అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సూచనల మేరకు శనివారం పట్టణంలోని సఖి, భరోసా కేంద్రాలతో పాటు బాల సదనం సందర్శించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవి మహిళల రక్షణ, న్యాయం, సహాయం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమైన వేదికలని అన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ ఉప్పలయ్య, సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ రేణుక, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ సౌమ్య, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రాక్టికల్ ్సతో పట్టు సాధించాలి
నర్సాపూర్: సాంకేతిక చదువుకు పరిశోధనాత్మక అనుభవం అవసరమేనని హైదరాబాద్ ఐఐటీ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ అశోక్కుమార్పాండె అన్నా రు. బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న మెకానికల్ బాహాసే ఇండియా పోటీల సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ‘క్లాస్రూం వెలుపల విద్య అనుభవాధారిత అభ్యాస విధానం’ అంశంపై జరిగిన చర్చలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. క్లాస్ రూంలో పాఠ్యాంశాలు చదవడంతో పాటు వాటికి అనుబంధంగా ప్రాక్టికల్స్తో పట్టు సాధించాలని సూచించారు. చర్చలో తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ వి.ఆర్ గనేషన్, కాట్మండ్ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ గోకర్ణ ఫౌడెల్, అటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సి ల్ ప్రతినిధి గరిమా ఝూంబ్, నామ్టెక్ డైరెక్టర్ కేసీ వోరా, సే ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్నాయర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆదివారం ఫైనల్ పోటీలు జరుగుతాయని బాహీసే ఇండియా కన్వీనర్ అలీసయ్యద్, కో కన్వీనర్ మురళీకృష్ణ చెప్పారు. కార్యక్రమాల్లో కాలేజీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్దూబె, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
సేవా భావం కలిగి ఉండాలి
నర్సాపూర్ రూరల్: వృద్ధుల పట్ల సేవా భావం కలిగి ఉండాలని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి హేమలత ప్రజలకు సూచించారు. శనివారం పట్టణంలోని విజన్ ఓల్డ్ ఏజ్ హోమ్ను సందర్శించారు. ఈసందర్భంగా వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కార్డులు లేకపోవడంతో ఆసరా పెన్షన్ అందుకోలేకపోతున్నామని న్యాయమూర్తికి వృద్ధులు మొరపెట్టుకున్నారు. మందులు కొనేందుకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అపర్ణ, సుధాకర్రెడ్డి, సుజాతరెడ్డి, అరుణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
9నెలలు.. రూ.4,611 కోట్ల రుణాలు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో తొమ్మిది నెలల్లో రూ.4,611 కోట్ల రుణాలు లబ్ధిదారులకు అందజేశామని, అందులో రైతులు, మహిళా సంఘాలకు పెద్దపీట వేశామని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఆర్థికాభివృద్ధి రేటులో జిల్లా దూసుకుపోతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రుణ లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకర్లు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందన్నారు. యువతకు ఉపాధి కల్పించే పీఎం ఈజీపీ, పీఎం విశ్వకర్మ వంటి పథకాలపై బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. రుణాలు ఇవ్వడమే కాకుండా సకాలంలో వసూలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.సమావేశంలో ఆర్బీఐ ప్రతినిధి లక్ష్మిశ్రావ్య, ఎల్డీఎం బాపూజీ, నాబార్డ్ డీడీఎం కృష్ణ చైతన్య, వివిధ బ్యాంకుల ఏజీఎంలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.సంఘాలకు పెద్దపీట -
సొంత స్థలం ఉన్న వారు ఇంటిని నిర్మించుకునేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించింది. ఇళ్లు మంజూరైన కొందరు లబ్ధిదారులు పనులు ప్రారంభించి.. నిధులు రా
శనివారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026మెదక్ పట్టణంలోని పిల్లికొటాల్లో పునాదిస్థాయిలోనే నిలిచిన ఇల్లు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూంలు నిర్మించి కొన్నింటిని పంపిణీ చేయగా, మరో 999 ఇళ్లు అర్ధంతరంగా ఆగిపోయాయి. వాటిలో కొన్ని పిల్లర్లస్థాయిలో ఉండగా, మరికొన్ని స్లాబులు వేసి గోడలు నిర్మించకుండా వదిలేశారు. అలాగే ‘గృహజ్యోతి’ పథకం పేరిట సొంత స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకుంటే రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 10 వేల పైచిలుకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, వారిలో సుమారు 1,200 మంది ఇళ్లను ప్రారంభించి బేస్మెంట్ వరకు నిర్మించుకున్నారు. గృహజ్యోతి, డబుల్బెడ్రూంలకు సంబంధించి మొత్తం 2,199 ఇళ్ల నిర్మాణాలు సగంలో ఆగిపోయాయి. నిబంధనల ప్రకారం ఉంటేనే బిల్లులు గృహజ్యోతి పథకంలో బేస్మెంట్ వరకు నిర్మించుకున్న ఇళ్లను ఇప్పటికే హౌసింగ్ అధికారులు గుర్తించారు. జిల్లాలో సుమారు 1,200 ఉన్నట్లు లెక్క తేల్చారు. బేస్మెంట్ ఉన్న వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తామని అధికారులు చెబుతున్నారు. బేస్మెంట్ పూర్తయిన వాటికి బిల్లు కాకుండా, గోడలు, లెంటల్, స్లాబు, ఫైనల్ బిల్లు ఇవ్వనున్నారు. ఇందిరమ్మ ఇంటి పథకానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తుండగా, బేస్మెంట్ వరకు నిర్మించిన గృహజ్యోతి ఇంటికి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం చేయనున్నారు. వాటిని సైతం నిబంధనల ప్రకారం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. ఒకవేళ తక్కువ ఉన్నా, ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నా వాటిని నిబంధనల వరకు నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే జిల్లాలో 999 డబుల్ బెడ్రూంల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. వీటిని ముందుగా లబ్ధిదారులకు కేటాయించిన తర్వాత వాటికి సైతం ప్రత్యేకంగా బిల్లులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.ఇంటి నిర్మాణాలపై అనాసక్తి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లాకు 9,241 ఇళ్లు మంజూరు చేసింది. కాగా వాటిలో ఇప్పటివరకు 5,190 ఇళ్లు ప్రారంభం కాగా, మిగితావి వివిధ దశలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈలెక్కన ఇంకా 4 వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఇందులో ఇళ్లు ప్రారంభించని లబ్ధిదారుల పేర్లు లిస్టు నుంచి తొలగించారు. మొదటి విడతలో మిగిలిన ఇళ్లను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
విశ్వకర్మలతోనే దేశ ఆర్థికాభివృద్ధి
మెదక్ కలెక్టరేట్: విశ్వకర్మల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతరించిపోతున్న కళావృత్తులు, కళలు, చేతివృత్తులను ప్రోత్సహించి విశ్వకర్మల ఆర్థిక అభివృద్ధికి చేదోడు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. త్వరలోనే టూల్ కిట్స్ అందిస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ విశ్వకర్మల ఆర్థిక అభివృద్ధికి ఈపథకం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాశ్రావు, ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ గుల్షన్సింగ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్రావు -
కష్టపడి కాదు.. ఇష్టంతో చదవాలి
డీఈఓ విజయ వెల్దుర్తి(తూప్రాన్): మార్చిలో ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ విజయ తెలిపారు. మండలంలోని కుకునూర్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. మధ్యాహ్న భోజనం, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల సమయం దగ్గరగా ఉన్నందున కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు. జిల్లాలో 11,217 మంది విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరుకానుండగా, 68 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులను కల్పించామన్నారు. జిల్లాలో శతశాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు చెప్పారు. -
ఎస్సీలపై అట్రాసిటీ కేసులా?
అధికారులను ప్రశ్నించిన ఎస్సీ, ఎస్టీకమిషన్ చైర్మన్ వెంకటయ్యమెదక్జోన్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలపై అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమీ క్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల జరిగిన మెదక్ పట్టణంలో జరిగిన ఓ గొడవలో 13 మందిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, అందులో అందులో ఆరుగురు ఎస్సీ వర్గానికి చెందిన వారే ఉన్నారన్నారు. ఈవిషయంపై డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. దాడిచేసిన వారిపై 307తో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశామని, ఎస్సీలకు కేవలం దాడి కేసు మాత్రమే వర్తిస్తుందన్నారు. కేసుల విచారణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని చైర్మన్ వెంకటయ్య అన్నారు. ఈసందర్భంగా జిల్లాలో జరిగిన పలు సంఘటనలు ప్రస్తావించారు. రాష్ట్ర చరిత్రలోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో సైబరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్లో ఎస్సీ, ఎస్టీ బాధితులకు డబుల్ బెడ్రూంలను పంపిణీ చేశామని వివరించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, అదనపు కలెక్టర్ నగేష్, ఎస్పీ శ్రీనివాసరావు, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి పనిలో సైన్స్ ఇమిడి ఉంది
రామాయంపేట(మెదక్): మనం చేసే ప్రతి పని లో సైన్స్ ఇమిడి ఉందని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని వివేకానంద విద్యాలయంలో సైన్స్ ఫెయిర్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో సైన్స్ లేనిదే ఏపని చేయలేమని, విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి చూపడం సంతోషకరమన్నారు. ఈసందర్భంగా రెండు వందల ప్రదర్శనలు తిలకించారు. మట్టి లేకుండా కేవలం నీటితో పండించే వ్యవసాయానికి సంబంధించి ప్రాజెక్టును పరిశీలించి విద్యార్థులను అభినందించారు. ఆయన వెంట రేంజ్ అధికారి విద్యాసాగర్, ఎకై ్సజ్ సీఐ నరేందర్, ఎస్ఐలు విజయ్ సిద్దార్థ, హరీశ్, ప్రిన్సిపాల్ రాంకుమార్, ఎంఈఓ శ్రీనివాస్ ఉన్నారు. డ్రైవర్లకు కంటిచూపు చాలా ముఖ్యం మెదక్జోన్: బస్సు డ్రైవర్ల కంటి చూపు సరిగా ఉంటేనే ప్రమాదాలు జరగవని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. అరైవ్ అలైవ్ రెండో దశ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డిపో ప్రాంగణంలో డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయించారు. దూరదృష్టి లోపంతో పాటు కంటి సమ స్యలున్న డ్రైవర్లను గుర్తించారు. పలువురికి ఉచితంగా కళ్ల అద్దాలను పంపిణీ చేశారు. అంతకుముందు డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమా లు తదితర వాటిపై అవగాహన కల్పించారు. అధిక వేగం, క్రమశిక్షణ లోపం, అలసటతో వాహనం నడపడం వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తాయని వివరించారు. కా ర్యక్రమంలో డిపో మేనేజర్ సురేఖ, టౌన్ సీఐ మహేష్, ఆర్టీసీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‘ఆ రిపోర్ట్ విడ్డూరం’ చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై రిపోర్టు ఇవ్వాల్సిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఉపాధ్యాయుల వేతనాలపై ఇవ్వడం విడ్డూరంగా ఉందని పీఎస్హెచ్ఎంల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలయ్య అన్నారు. ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనం దేశ భవిష్యత్తుపై ముడిపడి ఉందని గుర్తించాలన్నారు. మార్కెట్ ప్రమాణాలతో పోలిస్తే టీచర్ల వేతనాలు తక్కువగానే ఉన్నాయన్నారు. పాఠశాలల బలోపేతం పాటు మౌలిక వసతులు, అభ్యాసన ప్రక్రియ మెరుగుకోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక అందించాలన్నారు. కమిషన్ ఇచ్చిన రిపోర్టులో ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నా యి, తగ్గించాలనే ప్రస్తావనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీసీని వెంటనే తొలగించాలి: ఎస్ఎఫ్ఐ మెదక్ కలెక్టరేట్: ఢిల్లీలోని జేఎన్యూ వీసీ శాంతిపండిత్ను వెంటనే తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం విద్యార్థులతో కలిసి పట్టణంలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల క్రితం యూనివర్సిటీలో సమస్యలపై ప్రశ్నించిన వి ద్యార్థులు, అధ్యాపకులపై కొంతమంది కులం, మతం పేరుతో దూషించి కొట్టినట్లు ఆరోపించారు. అంతేకాకుండా యూనివర్సిటీలో ధర్నా లు చేయొద్దని, సమస్యలపై మాట్లాడొద్దని బెదిరించిననట్లు వాపోయారు. పోలీసులు క్యాంపస్లో ఉండి కూడా ఏం చేయలేదన్నారు. -
దుర్గమ్మ పేరిట దోపిడీ!
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో పంచాయతీ దోపిడీకి తెరలేపింది. దేవాలయ, అటవీ భూముల్లో నాగ్సాన్పల్లి పంచాయతీ సిబ్బంది అక్రమంగా తైబజార్ వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. చిత్రమేమిటంటే ‘ఏడుపాయల వనదు ర్గా భవాని దేవస్థానం’ పేరిట రశీదులు ముద్రించి వసూళ్లకు తెగబడుతున్నారు. అధికారులు రూ.18 వేలు మాత్రమే వసూలయ్యాయని చెబుతున్నా, అంతకన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదంతా జిల్లా పంచాయతీ అధికారుల కనుసన్నల్లోనే జరగడం కొసమెరుపు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఆలయ ఈఓ వీరేశం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా వసూళ్ల పర్వం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల.. ఎండోమెంట్ శాఖ అధీనంలో ఉండి, 6ఏ టెంపుల్గా గుర్తింపు పొందింది. ఆలయానికి 50.03 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనిని ఆనుకొని చెలిమెల కుంట నుంచి దాసోజి ఫంక్షన్హాల్ వరకు అటవీ భూ ములు ఉన్నాయి. జాతర సమయంలో చెలిమెల కుంట నుంచి రోడ్డుకు ఇరువైపులా అటవీ, దేవస్థాన భూముల్లో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. గత కొన్నేళ్లుగా నాగ్సాన్పల్లి పంచాయతీ అధికారులు వీరి నుంచి తైబజార్ వసూలు చేస్తున్నారు. ఏడుపాయల దేవ స్థానం పేరిట రశీదు బుక్కులు ప్రింటింగ్ చేయించి, వారికి తెలియకుండానే దుకాణానికి రూ.500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. రశీదు కింద మాత్రం పంచాయతీ సెక్రటరీ సంతకం ఉంటుంది. అయితే నిజానికి పంచాయతీ ఏవైనా వసూళ్ల కోసం బిల్లు బుక్కులు ప్రింటింగ్ చేయిస్తే, వాటి వివరాలు, సీరియల్ నంబర్తో సహా ‘మనీ వాల్యూ రిజిస్టర్లో’ నమోదు చేయాలి. అలాగే వసూలు చేసిన డబ్బులు ‘ఇన్సార్ నామా’(కలెక్షన్ రిజస్టర్)లో నమోదు చేసి వారం రోజుల్లో చలాన్ కట్టాలి. అయితే ఇలాంటి రికార్డులు పంచాయతీ కార్యాలయంలో లేవు. జాతర ముగిసి 9 రోజులు గడిచినా, డబ్బులు పంచాయతీ కార్యదర్శి వద్దే ఉన్నాయి. ఇదే విషయమై కార్యదర్శి భానుప్రకాశ్ను వివరణ కోరగా.. కొంత మంది వ్యాపారులు డబ్బులు ఇవ్వలేదని, జాతరలో రూ.18,230 మాత్రమే వసూలయ్యాయని చెప్పారు. గత జాతరలో వసూలు చేసిన డబ్బులు వివరాలు కూడా కార్యాలయంలో అందుబాటులో లేవన్నారు. రశీదులు ముద్రించి తైబజార్ వసూలు కలెక్టర్కు ఫిర్యాదు చేశాం ఎండోమెంట్ పరిధిలో మాకు తెలియకుండా ఆలయం పేరిట రశీదు బుక్కులు ప్రింటింగ్ చేయించి, తైబజార్ వసూలు చేయడం అంటే మమ్మల్ని మోసం చేయడమే. కనుక పంచాయతీ అధికారులపై తగు చర్య కోసం కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. – వీరేశం, ఈఓ, ఏడుపాయల -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యరామాయంపేట(మెదక్): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే పారుతున్న మురుగు కాలువ, లోతట్టు ప్రదేశాలను ఇంజనీరింగ్ అధికారులు, పాలకవర్గం సభ్యులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి వెలుతుందని, దీంతో రెండు చెరువుల్లో నీరు కలుషితమవుతుందని అన్నారు. చిన్నపాటి వర్షం కురిసినా పట్టణంలోని 11, 12 వార్డుల్లో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశిస్తుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కృతనిశ్చయంతో ఉన్నారని పేర్కొన్నారు. రామాయంపేటను ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తామని హామీ ఇచ్చారు. వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత, కౌన్సిలర్లు నాగరాజు, రంజిత్, సందీప్, శ్యామల, చరిత, రవి, శంకర్గౌడ్, ఇతర నాయకులు ఉన్నారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం: టీఎన్జీఓ
మెదక్జోన్: నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. శుక్రవారం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జలగం ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అధికారుల వేధింపులు పదోన్నతులలో అక్రమాలు జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సంఘం భవనం, ఇళ్ల స్థలాల కోసం తమ వంతుగా కృషి చేస్తామన్నారు. సమావేశంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి రిజ్వాన్ అలీ, సహాధ్యక్షులు పోచ య్య, కార్యవర్గ సభ్యులు ప్రసన్న, స్వప్న, ఝాన్సీ, ప్రతాప్ పాల్గొన్నారు. -
ఎల్సీ తీసుకున్నా.. కరెంట్ సరఫరా
● కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు ● సబ్స్టేషన్ను ముట్టడించితాళం వేసిన గిరిజనులు రామాయంపేట(మెదక్): విద్యుత్షాక్తో కాంట్రాక్టు కార్మికుడు తీవ్రంగా గాయపడగా, ఆగ్రహించిన గిరిజనులు శుక్రవారం రాత్రి స్థానిక సబ్స్టేషన్ను ముట్టడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆశాఖ ఉన్న తాధికారులకు సమాచారం ఇవ్వకుండానే కొంతమంది విద్యుత్ సిబ్బంది సాయంత్రం ఎల్సీ తీసుకొని కాంట్రాక్టు కార్మికుడైన నిజాంపేట మండలం జడ్చెరువు తండాకు చెందిన బాబూనాయక్ను స్తంభం ఎక్కి ంచారు. స్తంభానికి కరెంట్ సరఫరా కావడంతో తీవ్రంగా గాయపడి కింద పడ్డాడు. వెంటనే అధికారులు, సిబ్బంది అతడిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతడిని హైదరాబాద్ తరలించారు. ఆగ్రహించి న వందలాది మంది గిరిజనులు సబ్స్టేషన్ ప్రధాన గేటుకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. అదే సమయంలో ఏడీఈ ఆదయ్య, ఏఈ తిరుపతిరెడ్డి అక్కడికి రాగా, వారిని దూషించారు. ఎస్ఐ బాల్రాజు వా రిని సముదాయించారు. బాధ్యులను సస్పెండ్ చేసి వారిపై కేసులు నమోదు చేసే వరకు ఊరుకోమని హెచ్చరించారు. ఎల్సీ తీసుకున్న విషయం తమకు తెలియదని, ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఏడీఈ తెలిపారు. -
విజబుల్ పోలీసింగ్తో నేరాలకు చెక్
మెదక్కలెక్టరేట్: ప్రతి కేసును నాణ్యమైన దర్యాప్తుతో త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు జరగాలని, బాధితులకు న్యాయం అందించడంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని స్పష్టం చేశారు. అత్యాచార, పోక్సో కేసుల్లో నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి దోషులను కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించారు. లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు.ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
విద్యార్థులు ఇబ్బంది పడొద్దు
నర్సాపూర్: ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె పట్టణంలోని మైనార్టీ గురుకుల కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగు నీరు, కరెంట్ వసతి, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. అలాగే మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి, సంక్షేమంలో జిల్లాను ముందంజలో ఉంచాలని మంత్రి సూచించారు.కలెక్టర్ ప్రతిమాసింగ్ -
రెండోరోజు 98.26 శాతం హాజరు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం రెండో రోజు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ద్వితీయ భాష పరీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా జనరల్ విద్యార్థులకు 28, ఒకేషనల్ విద్యార్థులకు 6 చొప్పున మొత్తం 34 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 5,472 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 5,377 మంది హాజరయ్యారు. మరో 95 మంది గైర్హాజరయ్యారు. దీంతో 98.26 శాతం హాజరు నమోదైంది. జిల్లాలోని పలు కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఇంటర్ నోడల్ అధికారిణి మాధవి తెలిపారు. -
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి
ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి కోరారు. గురువారం నియోజకవర్గంలోని లబ్ధిదారులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. రైతుల ఖాతాల్లో రూ.10 లక్షలు జమ చేస్తే వారికి సాగు కోసం ఉపయోగపడడంతో పాటు తమ ఇళ్లలో జరిగే పెళ్లిళ్లకు ఉపయోగపడతాయన్నారు. రైతుభరోసా వెంటనే విడుదల చేయాలని, ఎన్నికలప్పుడు ప్రకటించిన మేరకు పాత బకాయిలు సైతం ఇవ్వాలని కోరారు. సబ్సిడీ యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యంత్రాలతో పాటు చిన్న, సన్నకారు రైతులకు చిన్న ట్రాక్టర్లు సైతం సబ్సిడీపై ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. పంట మార్పిడి చేయాలని, ఆయిల్పాం సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఏడీఏలు సంధ్యారాణి, పుణ్యవతి, మండల వ్యవసాయాధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు. -
రీసర్వేకు శ్రీకారం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : భూముల రీ సర్వేకు రెవెన్యూశాఖ శ్రీకారం చుట్టింది. పైలలలలట్ ప్రాజెక్టు కింద సంగారెడ్డి జిల్లాలో 17 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు. మొదటి విడతలో బాబిల్గ్రాం (సదాశివపేట మండలం), ముస్తాఫాపూర్ (రాయికోడ్), రసోలీ (కంగ్టి), ముగ్దంపూర్ (మానూరు) గ్రామాలను ఎంపిక చేశారు. మెదక్ జిల్లాలో 24 గ్రామాలను గుర్తించారు. విలేజ్ మ్యాపులు అందుబాటులో లేని గ్రామాలను ముందుగా ఎంపిక చేశారు. ఆయా గ్రామాల పరిధిలో ఉన్న భూములన్నింటినీ ఇప్పుడు రీ సర్వే చేస్తున్నారు. ఇందుకోసం సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖకు సంబంధించిన ఉద్యోగులతోపాటు, కొందరు లైసెన్డ్ సర్వేయర్లను నియమించి ఈ ప్రక్రియను చేపట్టారు. ఆయా గ్రామాల్లో గ్రామసభలను నిర్వహిస్తున్నారు. సర్వే చేయడం ద్వారా ఉపయోగాలను పట్టాదారులకు వివరిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన డీజీపీఎస్ (డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) విధానం కంటే ఇంకా అడ్వాన్డ్ టెక్నాలజీ జీఎన్ఎస్ఎస్ రోవర్ విధానంలో ఈ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రానికి అధికారులు వెళ్లి అక్కడ సర్వే విధానం, భూమి రికార్డుల నిర్వహణపై అధ్యయనం చేసి వచ్చారు. అదేవిధానంలో ఇప్పుడు జిల్లాలో రీసర్వే చేపట్టారు.కొత్త సర్వే నంబర్లు.. సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్ల స్థానంలో కొత్త సర్వేనంబర్లు ఆయా భూములకు కేటాయిస్తారు. ఇకపై ఒక సర్వే నంబర్కు బై నంబర్లు వేసే పద్ధతికి స్వస్తి చెబుతారు. ఒకే సీరిస్లో సర్వే నంబర్లు కేటాయిస్తారు. అలాగే ఆయా గ్రామాలకు విలేజ్ మ్యాపులను రూపొందిస్తారు. కొత్త సర్వే నంబర్లు.. సబ్ డివిజన్ మ్యాపులు తొలి విడతలో విలేజ్ మ్యాపులు లేని గ్రామాలు ఎంపిక సంగారెడ్డి జిల్లాలో 17 గ్రామాలు,మెదక్లో 24 గ్రామాలు ఎంపిక ఆధునిక సాంకేతికత జీఎన్ఎస్ఎస్ రోవర్ విధానంలో సర్వే గ్రామ సభలు నిర్వహిస్తున్న రెవెన్యూశాఖఅవగాహన కల్పిస్తున్నాం.. రీ సర్వే చేయడం ద్వారా జరిగే ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రోవర్ విధానాన్ని ఉపయోగించి ఈ సర్వే చేస్తున్నాం. ఈ సర్వే పూర్తయితే సమగ్ర భూరికార్డులు అందుబాటులో ఉంటాయి. భూసమస్యల పరిష్కారం చాలా సులభమవుతుంది. ఈ సర్వేకు పట్టాదారులు సహకరించాలి. – ఇనేష్, అసిస్టెంట్ డైరెక్టర్, సర్వేఅండ్ ల్యాండ్ రికార్డుల శాఖశిథిలావస్థకు చేరుకొని.. చిరిగిపోయి రెవెన్యూ రికార్డులు చాలా మట్టుకు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని చిరిగిపోయాయి. సుమారు వందేళ్ల కిత్రం నాటి రికార్డులు కావడంతో చాలా రికార్డులు పట్టుకోవడానికి కూడా వీలులేనంతగా తయారయ్యాయి. కొన్ని గ్రా మాలకు అసలు గ్రామ నక్షాలు లేవు. టీపన్లు, శేత్వార్లు కూడా అందుబాటులో లేవు. దీంతో భూవివాదాలు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించడంలో జాప్యం జరుగుతోంది. గ్రామాల వారీగా భూములు రీ సర్వే చేయడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావి స్తోంది. ఈ సర్వే చేస్తే డిజిటలైజ్డ్ విలేజ్ మ్యా పులు, టీపన్లు, శేత్వార్లను రూపొందిస్తారు.సబ్ డివిజన్లు సైతం.. ఏదైనా ఒక సర్వే నంబర్లో భూమిని ఇప్పటివరకు ఒకే రికార్డు అందుబాటులో ఉంది. ఆయా సర్వే నంబర్లో కొంత భాగం ఇతరులకు క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. కానీ రికార్డుల్లో మాత్రం సర్వే నంబర్ మొత్తం ఒకే మ్యాపుగా ఉంటుంది. చాలా మట్టుకు పెద్ద సర్వే నంబర్లు సబ్ డివిజన్లు జరగలేదు. అలాగే పట్టాదారుకు సంబంధించి ఇద్దరు, ముగ్గురు వారసులు ఉంటే పంచుకున్న భూమికి సంబంధించి ప్రత్యేకంగా మ్యాపులను తయారు చేస్తారు. -
మెతుకుసీమపై రాజ్ ముద్ర
విద్య, వైద్యాభివృద్ధికి కృషి ● కలెక్టర్ రాహుల్రాజ్ బదిలీ మెదక్జోన్: కలెక్టర్ రాహుల్రాజ్ బదిలీ అయ్యారు. గురువారం కమిషనర్ రేట్ కోఆపరేటివ్ సహకార రిజిస్ట్రేషన్ శాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 2024 మార్చి 5న జిల్లాకు బదిలీపై వచ్చిన ఆయన, మెతుకుసీమపై తనదైన ముద్ర వేశారు. నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలతో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. అనేక నూతన సంస్కరణలు తీసుకొచ్చారు. కలెక్టరేట్లోని ప్రతిశాఖలో ఈ–ఆఫీస్ సేవలు ప్రా రంభించారు. జిల్లాస్థాయి అధికారులందరూ స్థాని కంగానే ఉండాలని, అద్దెకు ఉంటున్న వారి అడ్రస్లు తీసుకున్నారు. జిల్లా విడిచి ఎవరూ బయటకు వెళ్లినా తనకు సమాచారం ఇవ్వాలని, లేనిచో శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని ఆదేశాలు జారీ చేశారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ‘గ్రౌండ్ బేస్డ్ లర్నింగ్’ను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలు చేశారు. బడిబాట.. పల్లెనిద్ర పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు ఇంటర్లో చేరే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరిని ఇంటర్లో చేర్పించే బాధ్యతను లెక్చరర్లకు అప్పగించారు. అలాగే బడిబాట కార్యక్రమంలో భాగంగా గతేడాది నర్సాపూర్ మండలంలోని ఓ మారుమూల గ్రామంలో పల్లెనిద్ర చేశారు. ఉద యం ఇంటింటికీ తిరుగుతూ, డ్రాప్అవుట్ పిల్లల ను బడిలో చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రుల కు సూచించారు. వైజ్ఞానిక ప్రదర్శనకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఈఏడాది రాష్ట్రం నుంచి 21 మంది విద్యార్థులు ఎంపికకాగా, అందులో జిల్లా నుంచి నలుగురు ఎంపికావడం గమనార్హం. ప్రభుత్వ ఆస్పత్రులపై పర్యవేక్షణ నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందాలని, ప్రతి వైద్యుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆస్పత్రులను నిరంతరం తనిఖీలు చేశారు. విధులకు ఎగనామం పెట్టిన సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. అన్ని పీహెచ్సీలలో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసి కలెక్టరేట్కు అనుసంధానం చేశారు. దీంతో వైద్యులు విధులకు ఎప్పుడు వస్తున్నారు.. ఎప్పుడు వెళ్తున్నారని స్వయంగా పర్యవేక్షించారు. వినూత్న కార్యక్రమాలు పా్లస్టిక్ నిషేధాన్ని ప్రతి ఒక్కరూ అమలు చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా కలెక్టరేట్ నుంచే ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లుగా కలెక్టరేట్లో కనీసం ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడ రాకుండా నిషేధించారు. సిబ్బంది హెల్మెంట్ లేకుండా కలెక్టరేట్లోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. స్వయంగా తన సతీమణితో కలిసి మెదక్ నుంచి నర్సాపూర్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నారు. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణలో నిర్వహించారు.నూతన కలెక్టర్గా ప్రతిమాసింగ్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా విధు లు నిర్వర్తించిన ప్రతిమాసింగ్ పదోన్నతిపై మెదక్ కలెక్టర్గా వచ్చారు. గురువారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. కాగా 2019లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల)గా సుమారు రెండేళ్ల పాటు మెతుకుసీమ లో ఆమె పని చేశారు. అప్పట్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించారు. జిల్లావ్యాప్తంగా గ్రామ గ్రామాన సూచిక బోర్డులను ఏర్పాటు చేయించారు. డంప్యార్డుల నిర్మాణాలు, వైకుంఠధామాల ఆమె అదనపు కలెక్టర్గా ఉన్న సమయంలోనే నిర్మాణాలు చేపట్టారు. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు రామాయంపేట(మెదక్)/తూప్రాన్/కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పత్రులను బుధవారం అర్ధరాత్రి కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తూప్రాన్ సీహెచ్సీని సందర్శించారు. రోగులకు అందిస్తున్న ఎమర్జెన్సీ కేసుల వివరాలు, ఆస్పత్రి పనితీరును పర్యవేక్షించారు. అప్పుడే ప్రమాదవశాత్తు గాయాలతో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులతో మాట్లాడి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కౌడిపల్లిలోని సీహెచ్సీని తనిఖీ చేసి ఓపీ, అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. అలాగే రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ కేసుల వివరాలకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. -
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
నర్సాపూర్: రోడ్డు ప్రమాదాలు విధి రాత కాదని, నిర్లక్ష్యం ఫలితమని ఎస్పీ శ్రీనివాస్రావు అన్నా రు. ‘అరైవ్ ఆలైవ్’లో భాగంగా గురువారం బీవీఆర్ఐటీ కాలేజీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి రోడ్డు భద్రతకు బ్రాండ్ అంబాసిడర్ కావాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమా దాల్లో ఎవరు ప్రాణాలు కోల్పోకుండా సురక్షితంగా గమ్యం చేరడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్శాఖ అరైవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కన్నీరు ఉ ంటుందనే విషయాన్ని విస్మరించరాదని హితవు పలికారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్రెడ్డి, తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ జాన్రెడ్డి, ఎస్ఐ రంజిత్రెడ్డి, కాలేజీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ శ్రీనివాస్రావు -
అర్హులకు సంక్షేమ ఫలాలు చేరాలి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందాలని, జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని నూతన కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. గురువారం ఆమె కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల గురించి డీఈఓ, డీఐఈఓలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. అంతకుముందు అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ఓ భుజంగరావు, మెదక్ ఆర్డీఓ రమాదేవితో పాటు జిల్లా అధికారులంతా ఆమెకు ఘన స్వాగతం పలికారు. మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి, డీఐఈఓ మాధవి, డీఈఓ విజయ, డీఆర్డీఓ శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి ప్రకాశ్రావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉందని, మరిన్ని విషయా లు తెలుసుకొని సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలందరికీ అందేలా కృషి చేస్తానన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు జవాబుదారితనంతో పనిచేసేలా చర్యలు చేపడతానని వివరించారు. అభివృద్ధికి అందరూ సహకరించాలి నూతన కలెక్టర్ ప్రతిమాసింగ్ -
మెదక్లో పదో తరగతిమూల్యాంకన కేంద్రం
మెదక్ అర్బన్: దాదాపు మూడు దశాబ్దాల టీచర్ల కల నెరవేరింది. మెదక్ పట్టణంలో ఈ ఏడాది పదో తరగతి పరీక్ష మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 1990 వరకు మెదక్లోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేవారు. అప్పట్లో మూల్యాంకన కేంద్రాన్ని బీహెచ్ఈఎల్కు మా ర్చారు. అయితే హైదరాబాద్ నుంచి తిరిగే టీచర్లు, అధికారులకు అనుకూలంగా ఉందని, తమకు ఇబ్బందిగా ఉందని అప్పట్లో సిద్దిపేట, మెదక్ ప్రాంత టీచర్లు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. అయినా అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక జిల్లా ఏర్పాటైన తర్వాత కూడా డిమాండ్ నెరవేరలేదు. చివరకు అన్ని టీచర్ యూనియన్లు, అధికారుల కృషితో మూల్యాంకన కేంద్రం ఏర్పాటైంది. ఉపాధ్యాయ సంఘాల హర్షం మెదక్జోన్: జిల్లాకు పదో తరగతి మూల్యాంకన కేంద్రం మంజూరు కావడంపై పలు ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మేడి సతీశ్రావు మాట్లాడుతూ.. స్పాట్ వ్యాల్యూయేషన్ సెంటర్ కోసం ఎమ్మెల్యే రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావుకు ఎన్నోసార్లు వివరించామన్నారు. వారి కృషి ఫలితంగానే నేడు జిల్లాకు సెంటర్ మంజూరైందని పేర్కొన్నారు. వారితో పాటు కలెక్టర్ రాహుల్రాజ్, డీఈఓ విజయకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లం మాట్లాడుతూ.. మూ ల్యాంకన కేంద్రం కోసం తమ యూనియన్ నాయకులతో కలిసి పలుమార్లు ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డికి విన్నవించామన్నారు. విదేశీ భాషలపై అవగాహన అవసరం నర్సాపూర్: విదేశీ భాషలపై అవగాహన కలిగి ఉండాలని బీవీ రాజు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్దూబె అన్నారు. బుధవారం కాలేజీలో సెంటర్ ఫర్ ఫారెన్ లాంగ్వేజెస్, విష్ణు జపాన్ అవుట్రీచ్ సెంటర్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన చలో జపాన్–2026 కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జపాన్ భాష, సంస్కృతి అంతర్జాతీయ ఉద్యో గావకాశాలపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జపానీస్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ తైసే టోయోమారు, జపానీస్ కాలిగ్రాఫర్ హి రోకో నాగహామా, అడ్వైజర్ కెన్ యానో తదితరులతో పాటు కాలేజీ మేనేజర్ బాపిరాజు, విష్ణుస్కూల్ ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, ఆర్అండ్డీ డీన్ రాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జపనీస్ కాలిగ్రఫీ ప్రదర్శన ఇచ్చారు. వసతులపై అశ్రద్ధ వద్దు టేక్మాల్(మెదక్): పరీక్షలు రాసే ఇంటర్ విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని సిబ్బందికి సూచించారు. పరీక్ష కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీరు, విద్యుత్, వైద్యానికి సంబంధించిన వసతులపై అశ్రద్ధ చేయవద్దన్నారు. సమస్యలు ఉత్పన్నమైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ తులసీరాం, ప్రిన్సిపల్ సుభాష్చంద్ర, లెక్చరర్ రవికుమార్ తదితరులు ఉన్నారు. మల్లన్న సన్నిధిలో పాట్నా హైకోర్టు జడ్జి కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని పాట్నా హైకోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారి శేష వస్త్రాలు, చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఈఓ వెంకటేశ్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
ముంచుకొస్తున్న గడువు
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఆస్తి పన్ను వసూళ ్లలో కనిపించని పురోగతి జూన్ దాటితే వడ్డీతో వసూలు మెదక్ బల్దియాలోనే అత్యధికం మున్సిపాలిటీల్లో ఆశించిన మేర ఆస్తి పన్ను వసూలు కావడం లేదు. గడిచిన 11 నెలల్లో కనీసం సగం కూడా వసూలు చేయలేదు. మొన్నటివరకు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో వసూళ్లకు సన్నద్ధం అవుతున్నారు. – మెదక్జోన్ఎన్నికలతో ఆలస్యం ఆర్టీసీ ఆస్తి పన్ను చెల్లింపు మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీకి సంబంధించిన ఆస్తి పన్నును డీఎం సురేఖ బుధవారం మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డికి అందజేశారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో, డీఎం కార్యాలయం, పాత, కొత్త బస్టాండ్లతో పాటు ఆర్టీసీ క్వార్టర్లకు సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం రూ. 2,71,801 చెక్కును అందజేశారు. -
ఎకరాకు రూ.40.50 లక్షలు
ట్రిపుల్ఆర్ భూములకు పరిహారం నర్సాపూర్: ట్రిపుల్ఆర్ కోసం సేకరిస్తున్న భూములకు ఎకరాకు సుమారు రూ. 40.50 లక్షలు ఇవ్వనున్నట్లు ఆర్డీఓ మహిపాల్ చెప్పారు. ఉత్తర భాగం కోసం శివ్వంపేట మండలం లింగోజిగూడ, కొత్తపేట, కొంతాన్పల్లి, రత్నాపూర్, పాంబండ, పోతుల్బుగూడ గ్రామాలకు చెందిన భూములు కోల్పోతున్న రైతులతో బుధవారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన అవార్డు సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఎకరానికి రూ. 13.50 లక్షల మార్కెట్ ధరను నిర్ణయించిందని, ఆ ధరకు మూడింతలు పరిహారం అందజేస్తున్నామని వివరించారు. భూములు కోల్పోతున్న రైతులందరూ బ్యాంకు ఖాతా నంబర్లు అందజేయాలని సూచించారు. కాగా ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం చాలా తక్కువగా ఉందని, తమకు నష్టం కలుగుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మీ అభ్యర్థనను ఉన్నతాధికారులకు నివేదిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. సమావేశంలో శివ్వంపేట తహసీల్దార్ కమలాద్రి తదితరులు పాల్గొన్నారు. -
పెన్షన్లు పెంచండి
మెదక్ కలెక్టరేట్: దివ్యాంగుల పెన్షన్లను ప్రభుత్వం వెంటనే రూ.6 వేలకు పెంచాలని దివ్యాంగుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి యశోద డిమాండ్ చేశారు. ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికీ దివ్యాంగుల పెన్షన్లు పెంచడం లేదన్నారు. 2023 నుంచి కొత్త పెన్షన్ల కోసం 24.85 లక్షల మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. సహాయ పరికరాల కోసం లబ్ధిదారుల ఎంపిక జరిగి ఏడాది గడుస్తున్నా, నేటికీ పూర్తిస్థాయిలో పరికరాలు పంపిణీ చేయలేదన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో కొత్త చట్టం తేవడం అన్యాయం అన్నా రు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ నగేశ్కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీ జిల్లా అధ్యక్షుడు ముత్యాలు, జిల్లా ఉపాధ్యక్షు లు యాదగిరి వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా నాయకులు త దితరులు పాల్గొన్నారు. -
నవోదయను సందర్శించిన అధికారులు
వర్గల్(గజ్వేల్): స్థానిక జవహార్ నవోదయ విద్యాలయాన్ని బుధవా రం కేంద్ర అధికారుల బృందం సందర్శించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శైలేంద్రకుమార్, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ అదనపు డైరెక్టర్ ఉషారాణి, అకాడమిక్ విజిలెన్స్ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డిలతో కూడిన ఈ బృందం పీఎంశ్రీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, తదితర వాటిని పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, మ్యాథ్స్ సర్కిల్స్, సైన్స్ సర్కిల్స్ పరిశీలించారు. బ్యాగ్లెస్ డే తదితర కార్యక్రమాలపై ఆరా తీశారు. నిధుల వినియోగం తీరు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ దాసి రాజేందర్కు పలు సూచనలు చేశారు.పీఎంశ్రీ పనులు, నిధుల వినియోగంపై ఆరా -
విద్యతోనే బంగారు భవిష్యత్తు
కలెక్టర్ రాహుల్రాజ్ పాపన్నపేట(మెదక్)/మెదక్జోన్: విద్యతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాగ్సాన్పల్లి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న టెన్త్ స్పెషల్ క్లాసులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. త్వరలో జరుగనున్న పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. స్పెషల్ క్లాసులు వింటూ, స్లిప్ టెస్ట్లు రాస్తూ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. వెనుకబడిన విద్యార్థులు కనీసం ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దాలని టీచర్లను ఆదేశించారు. కనీస సామర్థ్యాల స్థాయి తెలుసుకునేందుకు, విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి ముఖ్యమైనది అని తెలిపారు. అనంతరం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని 31 పాఠశాలలకు మంజూరైన ప్రధాన మంత్రి (పీఎం శ్రీ) నిధులను మార్చి 2వ తేదీ వరకు ఖర్చు చేసి పాఠశాలల సమస్యలను పరిష్కరించాలన్నారు. వాటిని సకాలంలో ఖర్చు చేయకుంటే వాపస్ పోయే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో డీఈఓ విజయ, ఫైనాన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ‘తోడే’ళ్లు
పాపన్నపేట(మెదక్): ఇసుకాసురులు తమ అవినీతి దందాకు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. అధికారులకు దొరకకుండా ఉండేందుకు గాడిదల ద్వారా రవాణ చేస్తున్నారు. శివార్లలో కుప్పలుగా పోసి, ఆపై ట్రాక్టర్లు.. లారీలు, టిప్పరల్లో అమ్ముకుంటున్నారు. వేసవి వచ్చిందంటే చాలు.. గాడిదలను బాడుగకు తెచ్చి దందాకు తెరలేపుతున్నారు. ఇక మెదక్ పట్టణంలోని హల్దీ.. మంజీరా నదులను అక్రమార్కులు జల్లెడ పడుతున్నారు. నిరాటంకంగా సాగుతున్న ఇసుక మాఫీయాకు రాజకీయాల అండ ఉండగా.. అవినీతి అధికారులు కొండగా నిలబడుతున్నారన్న ఆరోపణలున్నాయి. నెల క్రితం రాష్ట్ర మైనింగ్ విజిలెన్స్ అధికారులు వచ్చి, సంగాయిగూడ తండాలో జరుగుతున్న ఇసుక దోపిడీకి బ్రేకులు వేశారు. రాయికోడ్ టూ పాపన్నపేట ‘శత కోటి నిబంధనలకు.. అనంత కోటి ఉపాయాలు’ అన్నట్లు అవినీతి పనులు చేసేందుకు అక్రమార్కులు గాడిదలను రంగంలోకి దించుతున్నారు. మంజీరా నదిలో ఇసుక తేలడంతో గాజులగూడెం, చిత్రియాల్, ఎంకెపల్లి శివారులో గత కొన్ని రోజులుగా అక్రమ రవాణ ప్రారంభమైంది. స్థానిక ఇసుక మాఫియా రాయికోడ్ మండలంలోని కొన్ని గ్రామాల నుంచి గాడిదలను తెప్పిస్తున్నారు. వీరు ఒక్కో ట్రాక్టర్ ఇసుకు తెచ్చేందుకు రూ.3 వేలు చెల్లిస్తున్నారు. వ్యాపారులు ఆ ట్రాక్టర్ ఇసుకను రూ.8 వేలకు అమ్ముకుంటున్నారు. ఇందులో కొందరు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారు, మరికొంత మంది స్థానికంగా పరపతి ఉన్నవారున్నారు. ఇంత జరుగుతున్నా అటు తహసీల్దార్, పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలున్నాయి.గాజులగూడెం, చిత్రియాల్ మధ్య గాడిదలపై ఇసుక రవాణఇసుక మాఫియాకు అడ్డాగా మెదక్ జిల్లాస్థాయి అధికారులు కొలువు దీరిన మెదక్ పట్టణం.. దాని పరిసర ప్రాంతాలు ఇసుక మాఫియాకు అడ్డాగా మారాయన్న ఆరోపణలున్నాయి. మెదక్ పట్టణంలోని నర్సిఖేడ్ ప్రాంతానికి చెందిన పుష్పాలవాగులో జేసీబీలు, ఇటాచీలతో వందల కొద్ది టిప్పర్ల ఇసుక తోడేస్తున్నారు. ప్రధాన రహదారికి కనుచూపు మేరలో ఉన్న హల్దీవాగులో 24 గంటల ఇసుక రవాణ జరుగుతోంది. రాయిన్పల్లి చెరువు, మల్కాపూర్ తండాలో సైతం యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి ప్రతి రోజు పాపన్నపేట, శంకరపేట, అల్లాదుర్గం, కొల్చారం, కౌడిపల్లి మండలాలకు టిప్పర్లలో ఇసుక రవాణ చేస్తున్నారు. టన్నుకు రూ.1,200 నుంచి రూ.1,300 చొప్పున విక్రయిస్తున్నారు. కాగా ఇసుక అక్రమ రవాణలో పోలీసులు, రెవెన్యూ సిబ్బందికి నెల నెలా మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇలాగే ఇసుక దోపిడీ కొనసాగితే మంజీరా జలాలు ఇంకిపోయి వేసవిలో ఇబ్బందులు తతెత్తే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాడిదలతో కొత్త రకం దందా ఇసుక తీస్తే కేసులు చేస్తాం మంజీరా నది నుంచి ఇసుక తీస్తే కేసులు నమోదు చేస్తాం. నిల్వ చేసిన ఇసుక కుప్ప లు కూడా సీజ్ చేస్తాం. – సతీశ్, పాపన్నపేట ఎమ్మార్వో -
నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ కలెక్టరేట్: రోడ్డు ప్రమాదాలు విధి రాతకాదని.. నిర్లక్ష్య ఫలితమేనని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అరైవ్–అలైవ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో గతేడాది 287 మంది ప్రాణాలు కోల్పోగా, 631 మంది గాయపడినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 60 శాతం బైక్ ప్రమాదాలేనన్నారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదని, ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కన్నీరు ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్శాఖ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం నమోదయ్యే హత్యల సంఖ్యతో పోలిస్తే, రోడ్డు ప్రమాదాలు ఎన్నో రెట్లు ఎక్కువ ప్రాణాలను తీ సుకుంటున్నాయని, ఇది ప్రజల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుందన్నారు. ఇటీవల శంకరంపేట మండలంలో జరిగిన ఒక బైక్ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం సమాజానికి గట్టి హెచ్చరిక అని అన్నారు. మన కుటుంబాల భద్రత.. మన భవి ష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. చివరగా విద్యార్థులతో రోడ్డు భద్రత అవగాహన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ మహేష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
తొలిరోజు 99.42% హాజరు
● ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు ● కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ మెదక్కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ పరీక్షలు బుధ వారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 34 పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేశారు. జనరల్లో 6,035, ఒకేషనల్లో 625 కలిపి మొత్తం 6,660 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 6,622 మంది హాజరయ్యారు. మరో 38 మంది గైర్హాజరయ్యారు. దీంతో 99.42 శాతం హాజ రు నమోదైంది. జిల్లాలోని కొల్చారంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్రాజ్ సందర్శించారు. మెదక్లోని పలు పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు ఎస్పీ మహేందర్ వేర్వేరుగా పరిశీలించారు. కాగా కేంద్రాల్లో విద్యార్థులకు మెడికల్ కిట్లు, తాగునీటి వసతులు కల్పించారు. పలు కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల ద్వారా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మొదటిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారిణి మాధవి తెలిపారు. -
వ్యవసాయానికి పెద్దపీట
ఎమ్మెల్యే రోహిత్రావు మెదక్జోన్: వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే రోహిత్రావు పేర్కొన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో రైతులకు మంగళవారం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరంతర అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందన్నారు. డ్వాక్రా మహిళలకు కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తుందని, ఉచిత బస్సు, సబ్సిడీపై గ్యాస్, రుణమాఫీ లాంటి పథకాలు అమలవుతున్నాయన్నారు. అంతకు ముందు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశరామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యార్థులకు‘వెల్కమ్’ కిట్లు
మెదక్అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చేరే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి వివిధ వస్తువులతో కూడిన వెల్కమ్ కిట్లు అందజేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పేద విద్యార్థులను ప్రోత్సహించడమే ఈ కిట్ పంపిణీ ప్రధాన ఉద్దేశ్యం. దీనిని సర్కార్ ఆమోదిస్తే కళాశాలలో అడుగుపెట్టిన మొదటిరోజే విద్యార్థులకు అందజేయనున్నారు. మెదక్ జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా వాటిలో సుమారు ఆరువేల మంది విద్యార్థులతో పాటు నూతనంగా చేరే వారికి మేలు జరగనుంది. గురుకులాలకు ధీటుగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు వచ్చే ఏడాది నుంచి అమలు జిల్లాలో 16 జూనియర్ కాలేజీలు 6,099 మంది విద్యార్థులకు లబ్ధిప్రతిపాదనలు పంపించాం.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు వెల్కమ్ కిట్లు అందజేయడానికి ఇంటర్ విద్యాశాఖ తరఫున ప్రతిపాదనలు వెళ్ళాయి. ఇంకా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. ఉత్తర్వులు రాగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వెల్కమ్ కిట్లు పంపిణీ చేసే అవకాశం ఉంది. వీటి వల్ల ప్రభుత్వ కళాశాలల్లో నమోదు శాతం పెరుగుతుందని భావిస్తున్నాం. – మాధవి, నోడల్ అధికారి, ఇంటర్మీడియెట్ -
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు
మెదక్ అర్బన్: ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మంగళవారం మెదక్లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 28 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగే పరీక్షలకు సంబంధించి, విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 25 నుంచి మార్చి 16 వరకు పరీక్షలు జరుగనున్నాయని వివరించారు. జిల్లాలో 12,334 విద్యార్థులు జిల్లాలో మొత్తం 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రథమ సంవత్సరంలో 6309, ద్వితీయ సంవత్సరంలో 6025 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ కోసం 514 మంది పరిశీలకులను నియమించామన్నారు. ప్రతి ప్రశ్నాపత్రంపై క్యూఆర్ కోడ్ ముద్రించారని, కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రాల లొకేషన్ తెలుస్తుందన్నారు. పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి గురవుతే టెలీమానస్ 14416కు ఫోన్ చేస్తే నిపుణులు వచ్చి,సంబంధిత విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని చెప్పారు.అలాగే విద్యారుల సమస్యలను నివృత్తి చేసుకోవడానికి 7671033323, 9603615652కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ -
మార్కెట్ ధరకు మూడింతలు
నర్సాపూర్: భూములు కోల్పోతున్న రైతులకు చట్టం పరిధిలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్డీఓ మహిపాల్ చెప్పారు. త్రిబుల్ ఆర్ కోసం భూములు కోల్పోతున్న పలు గ్రామాలకు చెందిన రైతులతో మంగళవారం రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నతాధికారులు నిర్ణయించిన ధర మేరకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరకు మూడింతలు చెల్లిస్తామన్నారు. మరింత ఆర్థిక సహాయం కోసం కలెక్టర్కు పిటిషన్ పెట్టుకోవాలని ఆయన సూచించారు. రైతులు మధ్యవర్తుల జోలికి వెళ్లవద్దని, నేరుగా కలెక్టర్కు పిటిషన్ పెట్టుకోవాలన్నారు. భూములలో బోర్లు, చెట్లు, పైపులైను తదితర ఏమైనా ఉంటే వాటికి ఆయా శాఖల అధికారులు నిర్ణయించే ధరను చెల్లిస్తామని ఆర్డీఓ స్పష్టం చేశారు. తక్కువ ధరతో అన్యాయం చిన్నచింతకుంటకు చెందిన రైతు రవి మాట్లాడుతూ.. తన భూమి జాతీయ రహదారిని ఆనుకుని ఉందని, ఎకరానికి సుమారు రూ.4 కోట్లు ధర పలికే అవకాశం ఉందన్నారు. ఈ లెక్కన ప్రభుత్వం ఇచ్చే ధర చాలా తక్కువ అవుతుందని, తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వ రికార్డులో ఒకరి పేరుండగా సాగు మరొకరు చేస్తున్న భూములకు ఎలా డబ్బు చెల్లిస్తారని రైతులు అడగ్గా.. అలాంటి భూముల సొమ్ము చెల్లించకుండా ఆపుతామని, సమస్య పరిష్కారం అయ్యాక చెల్లిస్తామని ఆర్డీఓ స్పష్టం చేశారు. సమావేశంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ సిద్దిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూనిర్వాసితులకు ఆర్డీఓ హామీ దళారులను ఆశ్రయించవద్దని విజ్ఞప్తి -
స్పోర్ట్ ్సమీట్లో అద్భుత ప్రదర్శన
మెదక్ కలెక్టరేట్: పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి ఆరు రజత పతకాలు సాధించడం హర్షణీయమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా వారం రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర 4వ స్పోర్ట్స్మీట్లో జిల్లాకు చెందిన రాథోడ్ రమేష్ టెన్నిస్ సింగిల్స్, టెన్నిస్ డబుల్స్, గ్రూప్ ఈవెంట్లలో పాల్గొని మూడు రజత పతకాలు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే మెదక్ జిల్లాకు చెందిన భవాని, వీణ, సుష్మ కబడ్డీ పోటీల్లో కీలక పాత్ర పోషించి తమ జట్టును మూడో స్థానానికి తీసుకువచ్చారు. జిల్లాకు పతకాలు తీసుకొచ్చిన క్రీడాకారులందరినీ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగనాథ్, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ఆర్ఎస్ఐ మహిపాల్. సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ శ్రీనివాసరావు -
పంటలకు ఊపిరి
హల్దీ ప్రాజెక్టులో కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మండుటెండలు ఒకవైపు, నిరంతరంగా మోటార్ల ద్వారా పంటలకు నీటిని ఎత్తిపోస్తుండటంతో హల్దీప్రాజెక్టులో నీరు ఇంకి పోయింది. ఫలితంగా సాగుచేసిన వేలాది ఎకరాల పంటలు ఎండుముఖం పట్టాయి. ప్రాజెక్టులోకి గోదావరి నీటిని వదలాలని అన్నదాతలు వేడుకోవడంతో స్పందించిన ప్రభుత్వం కాళేశ్వరం నీటిని విడుదల చేసింది. దీంతో పంటలకు ఊపిరి పోసినట్లయింది. – మెదక్జోన్ జిల్లాలో తూప్రాన్, మాసాయిపేట, వెల్దూర్తి, చిన్నశంకరంపేట, కొల్చారం, మెదక్, హవేళిఘనాపూర్, మండలాల పరిధిలో సుమారు 65 నుంచి 70 కిలో మీటర్ల మేర హల్దీ ప్రాజెక్టు(వాగు) ప్రవహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 2.7 లక్షల ఎకరాలలో వరిపంటలు సాగు చేశారు. అందులో ఈ ప్రాజెక్టు పరిధిలో 50 వేల ఎకరాల మేర పంటలు సాగవుతున్నాయి. ప్రాజెక్టులో నీరు ఎండిపోవటంతో పంటలకు తడులు అందక ఎండుముఖం పట్టాయి. నీటిని వదిలి ఆదుకోవాలంటూ రైతుల మొర విన్న నేతలు, కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వార హల్దీప్రాజెక్టులోకి మూడు రోజుల క్రితం గోదావరి జలాలను వదిలారు. దీంతో మంగళవారం నాటికి తూప్రాన్ మండలంలోని యావాపూర్ శివారులోకి నీరు వచ్చింది. మరో రెండు, మూడు రోజుల్లో మెదక్, హవేళిఘనాపూర్ మండలాల పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాజెక్టుపై సుమారు 30కి పైగా చెక్డ్యాములను నిర్మించారు. ఇది ఒక్కసారి నిండితే రెండు పంటల వరకు ఫికర్ ఉండదని రైతులు చెబుతున్నారు.భూగర్భ జలాలు వృద్ధి హల్దీప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఇసుక మేటలు నిండి ఉండటంతో ఒక్కసారి ప్రవహిస్తే ఏడాది వరకు నీరు కదలదు. అంతే కాకుండా ప్రాజెక్టు నుంచి మొదలుకుని ఎటూ మూడు కిలోమీటర్ల మేర భూగర్భజాలలు పుష్కలంగా పెరుగుతాయి. దీంతో ఫెయిల్ అయిన బోరుబావుల్లో సైతం పుష్కలంగా నీరు వస్తోందని రైతులు చెబుతున్నారు. అంతే కాకుండా అన్నదాతలు ప్రాజెక్టులో మోటార్లను బిగించి రెండు, మూడు కిలోమీటర్ల వరకు పైపులైన్లద్వారా నీటిని మళ్లించి పంటలను సాగుచేస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్రాజెక్టును ఆనుకుని ఉన్న గ్రామాలకు తాగునీటిని సైతం దీనినుంచే తరలిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలోని ఏడు మండలాలకు ఈ ప్రాజెక్టు జీవనది అని చెప్పొచ్చు.హల్దీప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు మండుటెండల్లో చెక్డ్యాంల పరవళ్లు సస్యశ్యామలం కానున్న 50 వేల ఎకరాలు అన్నదాతల్లో హర్షాతిరేకాలుగోదావరి జలాలను హల్దీవాగులోకి వదలడంతో ప్రస్తుతం తూప్రాన్మండల పరిధిలోకి వచ్చాయి. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు చివరి మండలమైనా హవేళిఘనాపూర్కు చేరుకుంటాయి. ఇక సాగునీటికి ఏలాంటి ఇబ్బందులు ఉండవు. – శ్రీనివాస్రావు ఈఈ ఇరిగేషన్ మెదక్ -
‘దవా’లేని ఖానా!
మెదక్జోన్: మెదక్ పెద్దాస్పత్రిలో మందులు అందుబాటులో లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ ఆస్పత్రికి మెదక్తో పాటు కామారెడ్డి జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి, గోపాల్పేట తదితర మండలాలకు చెందిన వారు సైతం వైద్యం కోసం ఇక్కడికే వస్తుంటారు. నిత్యం ఓపీ వెయ్యికి పైగా ఉంటుంది. కొన్ని రోజులుగా పలురకాల మందులను బయటకు రాస్తున్నారు. సర్కార్ దవాఖానకు వచ్చేది నిరుపేదలు మాత్రమే. అలాంటిది వారు డబ్బులు వెచ్చించి బయట మందులను కొనుగోలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారు. వైద్య విద్యార్థులకు బోధించే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్పెషలిస్టులు, జిల్లా ఆస్పత్రితో పాటు ఎంసీహెచ్లలో రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. సీటీస్కాన్తో పాటు అనేక రకాల ఎక్స్రే పరికరాలు అందుబాటులోకి రావటం, డయోగ్నోస్టిక్ సెంటర్లో వ్యాధినిర్దారణ పరీక్షలు జరుగుతుండటంతో నిత్యం వేలాది మంది పేదలు ఏ జబ్బుచేసినా పెద్దాసు పత్రికి వస్తున్నారు. అంత బాగానే ఉన్నా.. మందుల కొరత కనీసం 30 శాతం వరకు ఉండడంతో చేసేదిలేక రోగులు బయట మెడికల్ షాపుల్లో డబ్బులు వెచ్చించి కొనుగోళ్లు చేస్తున్నారు. కాగా ఈ విషయంపై ఆ స్పత్రి సూపరింటెండెంట్ సునీతను వివరణ కోరగా అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పడం గమనార్హం. మందుల కొరతతో రోగుల ఇబ్బందులు పట్టించుకోని అధికారులు -
శిక్షణ సరే! విధులేవీ?
లైసెన్స్డ్ సర్వేయర్ల బాధ్యతలపై కొరవడిన మార్గదర్శకాలుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖలో లైసెన్స్డ్ సర్వేయర్ల విధుల విషయంలో స్పష్టత కరువైంది. శిక్షణ పూర్తి చేసుకుని దాదాపు మూడు నెలలు గడుస్తున్నప్పటికీ వీరికి కేటాయించే విధుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. దీంతో వీరు ఆయా మండలాల్లో ఖాళీగా ఉంటున్నారు. పెరుగుతున్న భూవివాదాలు..సర్వేయర్ల కొరత..ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం వినూత్నంగా లైసెన్స్డ్ సర్వేయర్ల విధానాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు టామ్కాం ద్వారా మూడు నెలలపాటు సర్వేపై శిక్షణ ఇచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టూల్స్ ద్వారా భూములను ఎలా సర్వే చేసే విధానంపై శిక్షణ ఇచ్చింది. ఫీల్డ్లో కూడా వీరు శిక్షణ తీసుకున్నారు. ఇలా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి మండలాలను కూడా కేటాయించారు. కానీ వీరు ఎలాంటి విధులు చేయాలనే అంశంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. దీంతో ఆయా మండలాల్లో వీరు ఖాళీగా ఉంటున్నారు. నిత్యం మండల కార్యాలయానికి వచ్చి వెళ్తూ తమ విధులు, బాధ్యతల విషయంలో ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. డీజీపీఎస్ విధానంపైనా.. లైసెన్డస్ సర్వేయర్లకు ఆధునిక సాంకేతికతో కూడిన డీజీపీఎస్(డిజిటల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) విధానంపై కూడా శిక్షణ ఇచ్చారు. సాంప్రదాయ పద్ధతులు గొలుసుల ద్వారా భూములు సర్వే చేస్తే ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి డీజీపీఎస్ విధానం ద్వారా గంటల్లో పూర్తి చేసేందుకు వీలు కలుగుతుంది. ఈ లైసెన్డ్స్ సర్వేయర్లకు ఈ డీజీపీఎస్ విధానంపైనా శిక్షణ ఇచ్చారు. కొందరిని రీ సర్వేకు కేటాయించినప్పటికీ.. శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్డ్ సర్వేయర్లలో కొందరికి రీ సర్వే గ్రామాల్లో విధులు కేటాయించారు. ఒక్కో గ్రామానికి ఇద్దరు చొప్పున కేటాయించారు. ఇలా కేటాయించిన వారు అతితక్కువ మంది మాత్రమే. రెండు జిల్లాల్లో కలిపి పది మంది కూడా ఉండరు. మిగిలిన వారు మాత్రం తమ విధులు, బాధ్యతలు ఏంటో ఇంకా స్పష్టత రాక ఎదురు చూస్తున్నారు. రెండు విడతలుగా... సంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో 74 మందికి లైసెన్స్డ్ సర్వేయర్లుగా శిక్షణ ఇచ్చారు. వీరిని 28 మండలాలకు కేటాయించారు. వీరు దాదాపు మూడు నెలలుగా ఖాళీగా ఉంటున్నారు. అలాగే రెండో విడతలో శిక్షణ తీసుకున్న వారు 22 మందికి కూడా మండలాలను కేటాయించాల్సి ఉంది. మెదక్ జిల్లాలో 82 మంది శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. వీరికి కూడా 21 మండలాలను కేటాయించినప్పటికీ..విధులు, బాధ్యతల విషయంలో స్పష్టత రాకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. మండలాలు కేటాయించినప్పటికీ మూడు నెలలుగా ఖాళీ.. సంగారెడ్డి జిల్లాలో 74 మంది.. మెదక్లో 82 మందికి -
ఇక చెంతనే ఆహ్లాదం
శరవేగంగా అర్బన్ పార్క్ పనులు రామాయంపేట(మెదక్): ప్రజలతో పాటు ప్రయాణికులు సేద తీరడానికి కేంద్రం నగర వన యోజన పథకం తీసుకొచ్చింది. మండలంలోని అక్కన్నపేట అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కు నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం రూ. 2 కోట్లు కేటాయించింది. టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాలుగైదు నెలల్లో ఈ పార్క్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. 125 ఎకరాల్లో నిర్మాణంజాతీయ రహదారి (765 డీజీ)ని ఆనుకొని అర్బన్ పార్క్ నిర్మిస్తున్నారు. ఇది మెదక్ మున్సిపాలిటీకి 13 కిలోమీటర్లు, రామాయంపేట మున్సిపాలిటీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇందుకోసం అటవీ ప్రాంతంలో 125 ఎకరాల మేర స్థలం కేటాయించారు. నిర్మాణం పూర్తయిన అనంతరం తాత్కాలిక రుసుముతో దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వాచ్ టవర్, పగోడ, మెయిన్ గేట్, టాయిలెట్స్, హర్బల్, బొటానికల్ గార్డెన్లు, వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. సోలార్ లైట్లతో పాటు సీసీ కెమరాలు ఏర్పాటు చేయనున్నారు. నిధుల అందుబాటును బట్టి చెక్ డ్యాంలతో పాటు నీటి కుంటలు, రాళ్ల తెట్టెలు, చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు ఏర్పాటు కానున్నాయి. అటవీ ప్రాంతాన్ని వీక్షించడానికి వీలుగా వాచ్ టవర్ నిర్మిస్తున్నారు. అరుదైన ఔషద మొక్కలు నాటనున్నారు.పర్యావరణంపై అవగాహన కొత్తగా నిర్మిస్తున్న ఈ అర్బన్ పార్కులో ప్రధానంగా సందర్శకులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం ఎన్విరాన్మెంట్ సెంటర్ నెలకొల్పుతున్నారు. సందర్శకులకు పర్యావరణం, అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల వివరాలు, వాటి మనుగడ, అడవుల సంరక్షణతో కలిగే లాభాల గురించి వివరించనున్నారు. -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
పాపన్నపేట(మెదక్): మండల కేంద్రంలో సోమ వారం యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఓ ఫర్టిలైజర్ దుకాణానికి 450 బస్తాల యూరియా రాగా రైతులు తరలివచ్చారు. సోమవారం సాయంత్రం 3 గంటల వరకు డీడీ నంబర్ రాకపోవడంతో స్టాక్ ఆన్లైన్ నమోదు చేయలేకపోయారు. గంటలు గడుస్తున్నా, డీడీ నంబర్ రాకపోవడం, యూ రియా పంపిణీ ప్రారంభం కాకపోవడంతో ఆగ్ర హం చెందిన రైతులు మెదక్–బొడ్మట్పల్లి రోడ్డు మీదికి వచ్చి ఆందోళనకు దిగారు. సుమారు గంటపాటు సాగిన రాస్తారోకోతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సతీశ్, ఏఈఓ జనార్దన్ రైతులను సముదాయించారు. మంగళవారం ఉదయం యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో రైతులు శాంతించారు. -
మరో 15 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ ఇటీవల ప్రకటించారు.దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురించాయి. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అవకాశం దక్కని వారు, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిక
ఏడుపాయలకు ఎప్పుడు? రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన ఏడుపాయల దేవస్థానానికి పాలకవర్గం లేకుండానే రెండున్నరేళ్లుగా నెట్టుకొస్తున్నారు. దీంతో అధికారులు, ఆలయ పరిధిలోని టెండర్దారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. ఏటా శివరాత్రి, ఉగాది, మాఘ అమావాస్యకు జరిగే జాతర కోసం ప్రభుత్వం రూ. కోట్లాది నిధులు విడుదల చేస్తుండగా, తాత్కాలిక పనులు మాత్రమే చేస్తూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అదే పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రతీ పైసాకు లెక్కలు ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. పాలకమండలిలో మొత్తం 14 మంది ఉండగా, చైర్మన్తో పాటు 13 మంది డైరెక్టర్లు ఉంటారు. కాగా ఆలయ కమిటీ చైర్మన్గా ఇప్పటివరకు అత్యధికంగా ఓసీ వర్గానికి చెందిన వారు మాత్రమే పనిచేశారు.జిల్లాలో ఐదు మార్కెట్ కమిటీలకు మూడేళ్లుగా పాలకవర్గాలను నియమించలేదు. చైర్మన్ పోస్టులకు మాత్రం గతంలోనే ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. మెదక్, నర్సాపూర్ బీసీ(బీ), తూప్రాన్ (ఓసీ) మహిళ, పాపన్నపేట (ఎస్సీ) జనరల్, రామాయంపేట (ఎస్టీ) జనరల్కు అవకాశం రావటంతో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కాగా చేగుంట (ఓసీ) జనరల్కు కేటాయించడంతో ఇటీవల వెంగళరావు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. కాగా ఒక్కో మార్కెట్ కమిటీలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. వారిలో చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు మరో 12 మంది డైరెక్టర్లు, నలుగురు సభ్యులుగా ఉంటారు. వారిలో వ్యవసాయశాఖ ఏడీ, మార్కెట్ కమిటీ అధికారి, సొసైటీ చైర్మన్తో పాటు మార్కెట్ కమిటీ గ్రామ పరిధిలో ఉంటే సర్పంచ్, మున్సిపల్ పరిధిలో ఉంటే చైర్మన్ సభ్యులుగా ఉంటారు. పాలకవర్గాలు లేక మూడేళ్లు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు లేక మూడేళ్లు అవుతోంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. ముఖ్యంగా ధాన్యం సేకరణ సమయంలో పాలకవర్గం ఉంటే కొనుగోళ్ల కమీషన్ వస్తోంది. అలాగే కందులు, మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయటం, వాటికి ప్రభుత్వ మద్దతు ధర కల్పించటం, రైతులకు సబ్సిడీపై పరికరాలకు అందుబాటులో ఉంచటం, మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కృషితో నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేసే అవకాశం ఉంటుంది. కాగా ఏళ్ల తరబడి పాలకవర్గాలు లేకపోవటంతో కమిటీలు నీరసించి పోతున్నాయి. -
డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా
మెదక్జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్వయం ప్రతిపత్తి హోదా ఇచ్చిందని ప్రిన్సిపా ల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించగా, యూజీసీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించిందన్నారు. 2026– 27 విద్యా సంవత్సరం నుంచి 2030–31 వరకు ఐదేళ్ల పాటు స్వయంప్రతిపత్తి హోదా వచ్చిందన్నారు. పాఠ్యాంశాల్లో నూతన మా ర్పులతో పాటు నైపుణ్యం గల కోర్సులను ప్రవేశపెట్టడం, పరీక్షా విధానాల్లో సంస్కరణలు చేపట్టడం వంటి కళాశాల సొంతం చేసుకుంటు ందన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు.నేడు, రేపు రైతులతో సమావేశం నర్సాపూర్: రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా రేపు, ఎల్లుండి ఆయా రైతులతో అవార్డు విచారణ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ మహిపాల్ తెలిపారు. 24న నర్సాపూర్, 25న శివ్వంపేట మండలంలోని రైతులతో అవార్డు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్థమయ్యేలా బోధించాలి కౌడిపల్లి(నర్సాపూర్): పిల్లలకు అర్థమయ్యేలా ప్రేమతో విద్యా బోధన చేయాలని డీఈఓ విజయ అన్నారు. సోమవారం కౌడిపల్లి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు పిల్లలను సొంత పిల్లల్లా చూడాలన్నారు. అర్థం కాని వారికి మరోసారి బోధించాలని సూచించారు. మహిళా టీచర్లు విద్యార్థులను మరింత ప్రోత్సహించాలని చెప్పారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. పదో తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు లలితాదేవి, ఫహీం, ఓంప్రకాశ్, మాస్టర్ ట్రైనర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నష్టపరిహారం పెంచండి రామాయంపేట(మెదక్): బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమను ఆదుకోవాలని భూ నిర్వాసితులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ రజనికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బైపాస్ రోడ్డు నిర్మాణంతో 33 ఎకరాల విలువైన భూమిని కోల్పోతున్నామని, మార్కెట్ ధరకు అనుగుణంగా తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం తమకు సమ్మతంగా లేదని, తాము రోడ్డు నిర్మాణానికి భూములు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ‘సభ్యులకు సహకరించాలి’ నర్సాపూర్: గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు సీఆర్పీలు కృషి చేయాలని జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సరస్వతి సూచించారు. సోమవారం ఐకేపీ కార్యాలయంలో నర్సాపూర్, కౌడిపల్లి, చిలప్చెడ్ మండలాల్లోని సీఆర్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సభ్యులు కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసే విధంగా తోడ్పాటు అందిస్తూ, వారికి కావాల్సిన శిక్షణతో పాటు ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేయాలన్నారు. సభ్యులు అదనపు ఆదాయం పొందే విధంగా సహకరించాలన్నారు. సమావేశంలో నాన్ ఫాం డీపీఎం యాదయ్య, ఏపీఎంలు సంగమేశ్వర్, గౌరిశంకర్, సంగీత తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్ప్రెస్ బస్టాండ్ ఏర్పాటు చేయండి
మనోహరాబాద్(తూప్రాన్): మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ బస్సులు ఆపడంతో పాటు బ స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ మండల ప్రజాప్రతినిధులు సోమవారం మంత్రి పొ న్నం ప్రభాకర్ను కలిసి విన్నవించారు. ఈమేరకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో చీర్ల భాస్కర్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి తదితరులు ఉన్నారు. నూనె గింజలు.. ఎంతో మేలు టేక్మాల్(మెదక్): రైతులు ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నూనె గింజల పంటలు పండించడంతో నాణ్యమైన ఆహారం పొందవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండలంలోని కుసంగి రైతు వేదికలో వ్యవసాయాధికారి రాం ప్రసాద్ అధ్యక్షతన నూనెగింజల సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజలు తమ సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధా న కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను నేరుగా ఆయనకు వివరించారు. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు లేకుండా నేరుగా సంప్రదించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా సాధించడం జిల్లాలో ఉన్నత విద్యాభివృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. అదనపు ఎస్పీ మహేందర్ -
కదంతొక్కిన జీపీ కార్మికులు
మెదక్ కలెక్టరేట్: పెండింగ్ వేతనాల కోసం పంచాయతీ కార్మికులు కదం తొక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో తమకు రావాల్సిన 4 నెలల జీతా లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహేందర్, ఆసీఫ్ మాట్లాడుతూ.. వేత నాలు రాక కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో తొలగించిన పంచాయతీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి ని తొలగించకుండా ప్రభుత్వమే సర్క్యులర్ జారీ చేయాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీపీఓ యాదయ్యకు అందజేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
ముగిసిన సాఫ్్టబాల్ పోటీలు
మెదక్జోన్: జిల్లా కేంద్రంలోని వెస్లీ క్రీడా మైదానంలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్, సాఫ్ట్బాల్ క్రీడలు సోమవారం రాత్రి ముగిశాయి. హోరాహోరీగా కొనసాగిన ఈ పోటీల్లో 25 జిల్లాలకు చెందిన 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో నిజామాబాద్ జిల్లా కు చెందిన బాలికల జట్టు ప్రథమ స్థానంలో నిలవగా, బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. గెలుపొందిన క్రీడాకారులకు అదనపు కలెక్టర్ నగేశ్ బహుమతులకు ప్రదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓడిన వారు నిరుత్సాహ పడొద్దన్నారు. కారణాలు తెలుసుకొని గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ విజయ, జిల్లా యువజన క్రీడల అధికారి రమేశ్తో పాటు పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గిరిజన తండాల రోడ్లకు గ్రహణం
● కంకర పరిచారు.. బీటీ మరిచారు ● అర్ధంతరంగా ఆగినరూ. 9 కోట్ల పనులుమెదక్ అర్బన్: మారూమూల తండాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలన్ని సర్కార్ సంకల్పం కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారి పోతుంది. ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద జిల్లాలో ఆరు రోడ్లకు నిధులు మంజూరైన పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఒక్క రోడ్డు మాత్రం పూర్తి కాగా, మరో 5 రోడ్లకు కంకర వేసి వదిలేశారు. బీటి వేయకపోవడంతో కంకరపై నడక గిరిజనులకు నరకాన్ని తలపిస్తుంది. జిల్లాలోని ఆరు గిరిజన తండాలకు రెండేళ్ల క్రితం బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 9 కోట్లు మంజూరు చేశారు. టేక్మాల్ మండలం పల్వంచ తండాకు రూ.80 లక్షలు, మల్కాపూర్ తండాకు రూ. 2.20 కోట్లు, కాదులూర్ తండాకు రూ. 2.20 కోట్లు, రేగోడ్ మండలం ఆరె ఇటిక్యాల్ తండాకు రూ.80 లక్షలు, మేడికుంద తండాకు రూ.1.50 కోట్లు, అల్లాదుర్గ్ మండలం కోమలికుంట తండాకు రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి. కాగా ఒక్క పల్వంచ తండా పనులు మాత్రం పూర్తయ్యాయి. కాగా గిరిజన తండాలకు బీటీ రోడ్లు మంజూరై రెండేళ్లు కావొస్తుంది. కాగా ఇప్పటివరకు కాంట్రాక్టర్ సుమారు రూ. 3 కోట్లు బిల్లులు తీసుకున్నట్లు తెలుస్తోంది. నోటీసులు ఇచ్చాం తండాలకు మంజూరైన బీటీ రోడ్ల పనులు పూర్తి చేయాలని ఇప్పటికే కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చాం. బిల్లులు చెల్లింపులో జాప్యం జరగడంతో పనుల్లో కొంత ఆలస్యం జరిగింది. త్వరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – వేణు, ఈఈ, ఆర్అండ్బీ, మెదక్ -
పట్టణ ప్రజలు సేద తీరేలా..
రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ప్రజలతో పాటు రహదారి వెంట వెళ్తున్న ప్రజలు సేద తీరడానికి వీలుగా కేంద్రం నిదులతో అర్బన్ పార్క్ నిర్మిస్తున్నాం. ఈమేరకు రూ. రెండు కోట్లు మంజూరయ్యాయి. పర్యావరణ పరిరక్షణతో పాటు అటవీ ప్రాంతంలో ఉన్న జంతువుల మనుగడ, వాటి జీవన విధానంపై సందర్శకులకు అవగాహన కల్పిస్తాం. పనులు కొనసాగుతున్నాయి. వచ్చే నాలుగైదు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. – విద్యాసాగర్, రామాయంపేట రేంజ్ అధికారి -
పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఇంటర్ పరీక్షలను హైపవర్ కమిటీతో పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ మీడియెట్ అధికారులకు కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. సోమవారం వారితో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈనెల 25 నుంచి నిర్వహించే ఇంటర్ పరీక్షలకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈసారి కొత్తగా క్యూఆర్ కోడ్తో హాల్ టికెట్లు ఇస్తున్నామని, నేరుగా ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవచ్చన్నారు. హాల్ టికెట్ సమస్యల పరిష్కారానికి 7671033323 నంబర్ను అందుబాటులో ఉంచామన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్ నోడల్ అధికారి మాధవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజలకు చేరువగా ‘ప్రజావాణి’
నిజాంపేట(మెదక్): ప్రజలకు దూరభారం తగ్గించడం కోసమే మండలస్థాయిలో ప్రజావాణి కార్య క్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఎంపీడీఒ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీ కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి 42 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మండలస్థాయిలో కార్యక్రమం బలోపేతానికి నోడల్ అధికారిని నియమిస్తామన్నారు. పరిష్కారం కాని సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యా దుదారులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు, పోలీస్ పరిధిలో ఉన్న భూముల వివరాలు సంబంధిత శాఖలకు పంపించాలన్నారు. వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్ చేసి, వారం రోజుల్లో పరిష్కారం చూపుతామన్నారు. ప్రజలు జిల్లా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే వారి సమస్యలకు పరిష్కారం దొరికేలా అధికారులు చర్యలు చేపట్టా లని సూచించారు. ప్రతి సోమవారం అధికారులందరూ తప్పకుండా ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయానికి స్థల పరిశీలన చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఒ రాజిరెడ్డి, వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, రెవెన్యూ, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
పూజలు ఘనం
ఆరోవారం.. రాజగోపురం ఎదుట భక్తుల సందడి కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఆరోవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారిని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
బస్సు ప్రయాణం.. భద్రత కనం
● కనిపించని ప్రథమ చికిత్స కిట్లు ● ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు సంగారెడ్డి క్రైమ్: ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి.. సురక్షితంగా గమ్యం చే రండి అంటూ ఆర్టీసీ అధికారులు చెబుతుంటారు. అది ఒకప్పటి మాట..ఇప్పడు బస్సెక్కితే గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతామో లేదోనన్న గ్యారంటీ లేకుండా పోతోంది. ఇటీవల జిల్లాలో తరుచూ జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రథమ చికిత్స అందించేందుకు అవసరమైన కిట్ల జాడ బస్సుల్లో కానరాదు. మోటార్ వాహనాల చట్టం ప్రకా రం ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స కచ్చితంగా ఉండాల్సిందే. జిల్లాలో తరచూ ఆర్టీసీ ప్రమాదాలు జరుగుతున్నా అధికారయంత్రాగం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గుంతలమయంగా రహదారులు మారుమూల గ్రామాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. ఒకవైపు రహదారి పనులు మరోపక్క గుంతలున్న రోడ్లపై వెళ్లే సర్వీసులు ఎక్కడో ఒకచోట ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రస్తుతం బస్సుల్లో సిట్టింగ్ సామర్థ్యానికి మించి సుమారు 50 నుంచి 65 మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. బస్సులు అదుపు తప్పినా, ప్రమాదం జరిగి ఎవరైనా గాయపడినా ప్రథమ చికిత్స చేయా ల్సి వస్తోంది. అగ్నిప్రమాదం జరిగితే అద్దాలు పగలగొట్టడానికి కనీసం సుత్తి కూడా కనిపించడం లేదు. చర్యలు తీసుకుంటాం ఆర్టీసీ బస్సుల్లో అత్యవసర కిట్ల సమస్య దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులతో చర్చించి వెంటనే అన్ని బస్సులో అత్యవసర పరికరాలతోపాటు ఫైర్ సేఫ్టీ కిట్లు ఉండేలా చర్యలు తీసుకుంటాం. డ్రైవర్లు, కండక్టర్లు నిబంధనలు పాటించాలి. – ఉపేందర్, సంగారెడ్డి, డిపోమేనేజర్ -
సరుకులు కల్తీ..
విద్యార్థులకు సుస్తీజిల్లాలో వరుసగా ఫుడ్పాయిజన్ ఘటనలు రామాయంపేట: విద్యార్థులను పరీక్షిస్తున్న డాక్టర్లు జిల్లావ్యాప్తంగా 904 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 72 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో 273 పాఠశాలల్లో అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. మిగితా 631 పాఠశాలల్లో ఎస్హెచ్జీ సభ్యులు వంట చేస్తున్నారు. ఇకపోతే జిల్లాలో 19 కేజీబీవీలు ఉండగా, వాటిలో ఎనిమిదింటిలో కళాశాలలు కొనసాగుతున్నాయి. మిగితా 11 పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో సుమారు 4 వేల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలల్లో కూరగాయల నుంచి మొదలుకొని నెలలో ఆరుసార్లు పెట్టే చికెన్, మటన్, పాలు తదితర వస్తువులను కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ బడుల్లో పెట్టే మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూరగాయలు, గుడ్లు ఇతర వంట సామగ్రిని ఎస్హెచ్జీ నిర్వాహకులు అందిస్తున్నారు. కాగా తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులు కొనుగోలు చేయడంతో పాటు వంట చేసే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే తినే ఆహారం విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల రేగోడ్లోని కేజీబీవీలో మధ్యాహ్న భోజనం తిన్న 234 మంది విద్యార్థుల్లో 25 మంది విద్యార్థినులు, ఇద్దరు ఉపాధ్యాయులకు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. అలాగే రామాయంపేట ఉన్నత పాఠశాలలో పురుగులు పట్టిన రాగి జావ తాగిన ఆరుగురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నామమాత్రంగా ఫుడ్ కమిటీలు ప్రతి పాఠశాలలో ఫుడ్ కమిటీలు నిర్వహించాలి. కొన్ని పాఠశాలల్లో ఈ కమిటీలు ఉన్నప్పటికీ అవి పేరుకే ఉన్నాయి. ఫుడ్ కమిటీల్లో సభ్యులుగా ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు టీచర్లు, పీఈటీ, నలుగురు పదోతరగతి విద్యార్థులు కమిటీ సభ్యులుగా ఉంటారు. అలాగే కేజీబీవీల్లో కమిటీ సభ్యులుగా స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) ఏఎన్ఎం, సీఆర్టీ, నలుగురు పదో తరగతి విద్యార్థినులతో కమిటీ వేయాలి. ప్రతి రోజు ఈ కమిటీ సభ్యులు వంట సరుకులను పరిశీలించాలి. నాణ్యతగా ఉంటేనే వంట చేసేందుకు అనుమతి ఇవ్వాలి. అయితే జిల్లాలో ఈ కమిటీలు చాటా చోట్ల నామమాత్రంగానే పని చేస్తున్నాయి. విద్యార్థులకు వైద్య సేవలు రామాయంపేట(మెదక్): రాగిజావ తాగి అస్వస్తతకు గురైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఆదివారం జిల్లా ఉప వైద్యాధికారిణి డాక్టర్ అనిల పరామర్శించి వైద్య సేవలు అందజేశారు. స్కూల్ పక్కనే ఉన్న ఉన్న హాస్టల్లో ఉంటున్న వీరిని డాక్టర్ల బృందం పరీక్షించి మందు లు అందజేశారు. వారితో పాటు ఇతర విద్యార్థులను సైతం పరీక్షించారు. విద్యార్థులు ట్యాంక్ నీరు తాగుతున్నందున అస్వస్తతకు గురయ్యే అవకాశం ఉందని, ముందస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. తనిఖీలు నిర్వహిస్తున్నాం ప్రతి పాఠశాలలో వంటకు ఉపయోగించే వస్తువులు నాణ్యమైనవి మాత్రమే వాడాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చాం. మేము సైతం తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ రంగ పరిధిలో కొనసాగే అన్ని పాఠశాలల్లో ఫుడ్ కమిటీల విధి విధానాలపై ఆదేశాలు జారీ చేస్తాం. – విజయ, డీఈఓ మొన్న రేగోడ్.. నిన్న రామాయంపేట ఆందోళనలో తల్లిదండ్రులు దృష్టిసారించని ఉన్నతాధికారులు -
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
కలెక్టర్ రాహుల్రాజ్ వెల్దుర్తి(తూప్రాన్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. ఆదివారం మండల కేంద్రంలోని పీహెచ్సీని తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేయించుకునేలా గర్భిణులకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రతి నెలా ఉచితంగా మందులను పంపిణీ చేయాలన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట సూపర్వైజర్ లలిత, ఎంఎల్హెచ్పీ స్వప్న, ఏఎన్ఎం రజని తదితరులు ఉన్నారు. అనంతరం కేజీబీవీని తనిఖీ చేశారు. నిత్యావసర సరుకులు, స్టోర్ రూంను పరిశీలించారు. విద్యా బోధన, భోజన సదుపాయం ఇతర మౌలిక వసతులు ఎలా ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
మెదక్జోన్: జిల్లాలో గురుకుల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 5 నుంచి 9వ తరగతి విద్యార్థుల కోసం జిల్లావ్యాప్తంగా 17 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీసీఓ అనురాధ తెలిపారు. ఇందులో 5,024 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 4,838 మంది పరీక్షకు హాజరయ్యారు. 164 మంది గైర్హాజరైనట్లు ఆమె పేర్కొన్నారు. ఈ లెక్కన 96.3 శాతం పరీక్షలు రాశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగింది. కేంద్రాలను పలువురు అబ్జర్వర్లు తనిఖీలు చేశారు. మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని అన్ని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో నేటి నుంచి ప్రజావాణి కొనసాగుతుందని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు నిజాంపేట మండల కేంద్రంలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో తాను పాల్గొంటానని తెలిపారు. కాగా కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. మార్చి 2 నుంచి యథావిధిగా ప్రజావాణి ఉంటుందన్నారు. నేడు నిజాంపేటలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి కేజీబీవీలో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మమత పేర్కొన్నారు. అసిస్టెంట్ కుక్, స్కావెంజర్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. అసిస్టెంట్ కుక్కు పదో తరగతి ఉత్తీర్ణత, స్కావెంజర్ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణణ ఉండాలన్నారు. ఈనెల 26 వరకు చేగుంట మండలం రెడ్డిపల్లిలో కొనసాగుతున్న పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. టేక్మాల్(మెదక్): రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీ వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్ సూచించారు. ఆదివారం టేక్మాల్ రైతు వేదికలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా టేక్మాల్, శంకరంపేట్ అల్లాదుర్గ్, రేగోడ్ మండలాల రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యంత్రాలతో కూలీల కొరతను నివారించడంతో పాటు సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏడీఏ రాంప్రసాద్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్, ఆయా మండలాల వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, రైతులు, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. నర్సాపూర్రూరల్: మండలంలోని మూసా పేట బూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఇంట్లో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ మన్కీ బాత్ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశ్గౌడ్, నాయకులు వీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి కోసం మోడీ చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నీలి నగేశ్, ప్రధాన కార్యదర్శి గుర్రాల బాలరాజు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు భాస్కర్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
ఆందోళన చేస్తున్న హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్దశంకరంపేట(మెదక్): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా బాన్సువాడ వెళ్తున్నారనే సమాచారంతో పెద్దశంకరంపేటలో ఉదయం ఎమ్మెల్యేను మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారనే సమాచారంతో భజరంగ్దళ్, హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించారు. అనంతరం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది పిట్లం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆద్దాలను పగలగొట్టారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ను ప్రత్యేక బందోబస్తు మధ్య పోలీసులు హైదరాబాద్కు తరలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రహదారిపై ఆందోళన చేస్తున్న హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు. నిర్మల్ జిల్లా ఓలా గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకున్నారని, హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండి ధర్మ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. పెద్దశంకరంపేటలో ఉద్రిక్తత -
నేడు జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్
మెదక్ కలెక్టరేట్: నేడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి భౌతిక, రసాయనశాస్త్ర టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఫిజికల్సైన్స్ ఫోరం డివిజన్ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు. ఈనెల 18న నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. జిల్లాస్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ముగ్గురు విద్యార్థులు ఈనెల 28న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్ట్లో పాల్గొంటారని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ నగేశ్, డీఈఓ విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్మూర్తి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. చిన్నకోడూరు(సిద్దిపేట): రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలు ఆదివారం ముగిశాయి. సైక్లింగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడాధికారి వెంకటనర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 400 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారన్నారు. -
భార్యను హత్యచేసి నగలు ఎత్తుకెళ్లిన భర్త
చేగుంట (తూప్రాన్): ఇల్లరికం వచ్చిన భర్త భార్యను హత్యచేసి నగలను ఎత్తుకెళ్లాడు.ఈ సంఘటన మండల కేంద్రమైన చేగుంట స్టేషన్ రోడ్డులో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చేగుంటకు చెందిన ఉప్పరి వరలక్ష్మి(35)కి, ఏపీ నెల్లూరుకు చెందిన త్రిమూర్తులుతో 2015లో వివాహమైంది. త్రిమూర్తులు చేగుంటకు ఇల్లరికం వచ్చి జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి సమయంలో వరలక్ష్మిని పారతో తలపై మోది హత్య చేశాడు. అనంతరం పుస్తెలతాడు, నగలు, డబ్బులు, సెల్ఫోన్ తీసుకొని పారిపోయాడు. గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి పంచనామా నిర్వహించారు. మృతురాలి బావ సాయిబాబా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వరలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బాధితులకు అండగా ఉండాలి
మెదక్ కలెక్టరేట్: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలలకు భరోసా సెంటర్ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన కార్యాలయ రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. పోక్సో కేసులు, లైంగిక వేధింపుల బాధితుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. లైంగిక దాడులు, వేధింపులకు గురైన మహిళలు, బాలల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వారికి ధైర్యం కల్పించాలన్నారు. బాధితులకు ఎప్పటికప్పుడు న్యాయ, వైద్య సహాయం అందించడంతో పాటు మానసిక బలం చేకూర్చాలన్నారు. బాధితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఒకే చోట అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన వారు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో భరోసా సెంటర్ ఎస్ఐ శిరీష, కోఆర్డినేటర్ సౌమ్య, లీగల్ సలహాదారు శ్వేతతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.అదనపు ఎస్పీ మహేందర్ -
ఇసుకాసురులు!
జేసీబీతో మట్టిని తవ్వి టిప్పర్లో నింపుతున్న దృశ్యంమెదక్జోన్: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పుష్పలవాగును అక్రమార్కులు లూటీ చేస్తున్నారు. ఇసుక, మట్టిని జేసీబీలతో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు నోళ్లు మెదపటం లేదు. వరదలకు భారీగా ఇసుక మేటలు మెదక్ పట్టణం శివ్వాపల్లి తండాను ఆనుకొని పుష్పలవాగు ఉంది. వర్షాకాలంలో భారీ వరదలకు ఇసుక మేటలు పెద్ద ఎత్తున పెట్టడంతో వాటిపై అక్రమార్కుల కన్ను పడింది. నిత్యం ప దుల సంఖ్యలో జేసీబీలతో ఇసుక, మట్టిని తవ్వుతున్నారు. ఇసుకను తండా సమీపంలో నిల్వ ఉంచి అక్కడి నుంచి హైదరాబాద్ లాంటి నగరాలకు తరలిస్తున్నారు. మట్టిని తవ్వుతూ ఫిల్టర్ల ద్వారా ఇసుకను తయారు చేసి విక్రయిస్తున్నారు. మరికొందరు మట్టిని ఇటుక బట్టీలకు సైతం తరలిస్తున్నారు. వాగుపై ఆధారపడిన రైతుల బోరు బావుల్లో నీటి ఊటలు తగ్గిపోయి పంటలు ఎండి పోయే పరిస్థితి నెలకొంది. వాల్టాకు తూట్లు అక్కడ వాల్టా ఏ మాత్రం పనిచేయడం లేదు. అక్రమార్కులు ఇచ్చే ముడుపులకు అధికారులు దాసోహం అవుతున్నారు. ఈ తతంగం అంతా రెవెన్యూ, పోలీస్శాఖలకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి నెల ఒక్కో అధికారికి వారి హోదాను బట్టి ముడుపులు చెల్లిస్తున్నట్లు తెలిసింది. కాగా వాగులో ఇసుక, మట్టిని తవ్వే జేసీబీలు, తరలించే టిప్పర్లు, ట్రాక్టర్లకు వాహన నంబర్లు లేవు. కొంతమంది యువకుల కనుసన్నల్లో తతంగం నడిపిస్తున్నారు.పుష్పలవాగులో ఇసుక, మట్టి లూటీ నా దృష్టికి రాలేదు పుష్పల వాగు నుంచి మట్టి, ఇసుక తరలించే విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా అలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – లక్ష్మణ్బాబు, మెదక్ తహసీల్దార్ -
ఏకాగ్రతతో చదివితేనే విజయం
సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తున్నాయి పల్లెలు. గ్రామాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తూ తీర్మానాలు చేస్తున్నారు. ఫలితంగా ఆయా గ్రామాల్లోని మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పల్లెల్లో బెల్ట్షాపులు పెరిగిపోవడం.. సంపాదించిన డబ్బంతా మద్యం తాగేందుకే ఖర్చు పెడుతండటంతో కుటుంబాలన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయి. పైగా కుటుంబాల్లో కలహాలు చోటుచేసుకుంటుండటంతో గ్రామ ప్రజలంతా ఏకమై మద్యం నిషేధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్నశంకరంపేట(మెదక్)/మెదక్ కలెక్టరేట్: పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులు ముందుకుసాగాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మండలంలోని సూరారం జెడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థు లు ఏకాగ్రతతో చదివితేనే మెరుగైన ఫలితాలు పొందగలరని చెప్పారు. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా వినడంతో పాటు ఇంటి వద్ద కూడా కష్టపడి చదివితేనే మంచి మర్కులు వస్తాయన్నారు. ఈసందర్భంగా విద్యార్థుల అభ్యాసన ప్రతిభను పరిశీలించారు. మ్యాథ్స్, సైన్స్, తెలుగు, ఆంగ్లంపై పట్టు సాధించాలన్నారు. విద్యార్థుల ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ అవసరం అన్నారు. ఈసందర్భంగా హెచ్ఎం సాయిరెడ్డి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పకడ్బందీగా నిర్వహించాలి పదో తరగతి పరీక్షలు పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షకు పరీక్షకు మధ్య సమయం ఎక్కువగా ఉన్నందున మరుసటి రోజు వచ్చే విద్యార్థులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా నుంచి జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు 4 ప్రాజెక్ట్లు ఎంపికయ్యాయి. రూపొందించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఈఓ విజయ, పరీక్షల విభాగం అధికారి కరుణాకర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంఈఓ శంకర్, గైడ్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.నిమిషం నిబంధన ఎత్తివేత విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి గంట ముందుగానే చేరుకుంటే మేలు. ఈసారి నిమిషం నిబంధన ఎత్తివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఇంటర్ విద్యాశాఖ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. దానిపై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేనప్పటికీ పరీక్షలకు హాజరుకావొచ్చు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లా పరీక్షల విభాగం, హైపవర్ కమిటీతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర అధికారులకు సెల్ఫోన్ల అనుమతి లేదు. కలెక్టర్ రాహుల్రాజ్ -
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 28 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఎగ్జామ్స్ను పకడ్బందీగా నిర్వహించేందుకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికా
ఈనెల 25 నుంచి మార్చి 13 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు రోజు విడిచి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. అలాగే బైపీసీ విద్యార్థులకు మార్చి 14 నుంచి 18 వరకు పబ్లిక్ అడ్మిన్ 1, బ్రిడ్జ్ మాథ్స్ 1, మోడర్న్ లాంగ్వేజ్ 1, జియోగ్రఫీ 1 విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 12,334 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరంలో రెగ్యులర్ 5,710 మంది, ఒకేషనల్ విభాగంలో 599 మొత్తం 6,309 మంది, ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్ 5,472 మంది, ఒకేషనల్ 553 మంది మొత్తం 6,025 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 28 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని డివిజనన్్ కేంద్రాల్లో సైతం సెంటర్లు ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు చేశాం విద్యాశాఖ, కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు అంతా సిద్ధం చేశాం. ఇప్పటికే అధికారులు, సిబ్బందికి పరీక్షలపై శిక్షణ సైతం ఇచ్చాం. పరీక్షలను ఫ్లయింగ్, సిట్టింగ్ స్వ్యాడ్ బృందాలతో పాటు జిల్లా పరీక్షల విభాగం అధికారులు పర్యవేక్షిస్తారు. ఎవరైనా కాపీయింగ్కు పాల్పడితే పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్తో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – మాధవి, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి ఈనెల 25 నుంచి ప్రారంభం -
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం: డీఈఓ
రామాయంపేట(మెదక్): రాగి జావ తాగి అస్వస్థతకు గురైన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను శనివారం రాత్రి డీఈఓ విజయ పరామర్శించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు సహించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న మహిళలు జాగ్రత్తగా ఉండాలని, పిల్లలకు పెట్టే ముందు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. స్కూల్ విద్యార్థులు ట్యాంక్లో నిల్వ ఉన్న నీరు తాగుతున్నారని, వారికి మినరల్ వాటర్ సదుపాయం కల్పించాలని హెచ్ఎంను ఆదేశించారు. ఈవిషయమై తాను రెండు, మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఆమె వెంట తహసీల్దార్ రజని, ఎంఈఓ శ్రీనివాస్, ఇతర అధికారులున్నారు. -
కోడ్ ముగిసినా రైతు భరోసా ఏదీ?
● ప్రజలు బీఆర్ఎస్వైపే ఉన్నారనడానికి పుర ఫలితాలే నిదర్శనం ● కంది జైల్లో పార్టీ నాయకులనుపరామర్శించిన మాజీమంత్రి హరీశ్రావుసంగారెడ్డి/సంగారెడ్డిటౌన్ : ఎన్నికల కోడ్ పేరుతో ఆపిన రైతుభరోసాను వెంటనే రైతుల ఖాతాల్లో వేయాలని మాజీమంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పక్షాన ప్రత్యక్ష పోరాటానికి దిగి ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కంది జైల్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను శనివారం పరామర్శించిన అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. పైవారి మౌఖిక ఆదేశాలతో అక్రమ కేసులు బనాయిస్తే కిందిస్థాయి పోలీసులే జవాబుదారీ కావాల్సి వస్తుందని హితవు పలికారు. అక్రమ కేసులు, కాంగ్రెస్ గూండాయిజంపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలపైనే తిరిగి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కాంగ్రెస్ దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. పోలీసుల కాలర్ పట్టుకుని తన్నమన్న బీజేపీ నాయకుడిపై, బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడిపై అరెస్టులు లేవు కానీ ప్రశ్నిస్తే మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలపై కేతనపల్లి, ఆమనగల్ తదితర ప్రాంతాల్లో కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేశారని ఆరోపించారు. పోలింగ్ బూత్లో ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్ను, అధికారుల ముందే చంపేస్తానని బెదిరించిన మెదక్ ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. అధికార బలాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని మాత్రమే కాంగ్రెస్ కొన్ని స్థానాలను దక్కించుకుంది. ప్రజాతీర్పు బీఆర్ఎస్ వైపే ఉందనడానికి ఇదే నిదర్శనమన్నారు. హరీశ్రావు వెంట ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
మరో లక్ష ఎకరాలకు సాగునీరు
జోగిపేట(అందోల్): సింగూర్ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 60 వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందిస్తున్నామని మరో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపడతామని మంత్రి సి.దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. జోగిపేట శివారులో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ డిస్టిలరీని శనివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ...అందోల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్, హెల్త్ హబ్గా తీర్చిదిద్దామన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ మండల పరిధిలోని ర్యాలమడుగు సబ్స్టేషన్, మెదక్ ఎన్ఎస్ఎఫ్ సబ్స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా చిట్యాల, జానకంపల్లి, మంభోజిపల్లి, మాచవరం, ర్యాలమడుగు, పేరూర్ తదితర గ్రామాల్లో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాజ్కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రజలు సహకరించాలని కోరారు. కొనసాగుతున్న సాఫ్ట్బాల్ పోటీలు మెదక్జోన్: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు రెండో రోజు కొనసాగాయి. ఈనెల 23 వరకు జరిగే స్టేట్ లెవెల్ సీఎం కప్ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి 700 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో భాగంగా శనివారం పురుషుల విభాగంలో నల్గొండ, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, కొత్తగూడెం, మేడ్చల్, జగిత్యాల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాలు తలపడగా, మహిళా విభాగంలో ఆదిలాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి, జనగాం తదితర జిల్లాలు తలపడ్డాయి. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ మెదక్ కలెక్టరేట్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేడే ఆఖరని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్ 1, 2, 3, 4, ఆర్ఆర్బీ, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆదివారం సాయంత్రంలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పూర్తి చేసి రూ. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు tsstudycercle.co.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1న పట్టణంలోని ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మెరిట్ ఆధారంగా 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి 5 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్తో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 91822 20112 నంబర్లో సంప్రదించాలన్నారు. పశు వైద్యంపై నిర్లక్ష్యం వద్దు నర్సాపూర్ రూరల్: పశు వైద్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా పశుసంవర్ధక శాఖ ఏడీ వెంకటయ్య సిబ్బందికి సూచించారు. శనివారం మండలంలోని కాగజ్మద్దూర్ పశు వైద్యశాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. పశువైద్య సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉంటూ పశువులకు నిరంతరం వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. వైద్య సేవల వివరాలు, మందుల నిల్వలను పరిశీలించారు. ఆయన వెంట కాగజ్మద్దూర్ పశు వైద్యాధికారి స్వప్న, ఇతర సిబ్బంది ఉన్నారు. పనుల్లో వేగం పెంచండి రామాయంపేట(మెదక్): మండలంలోని అక్క న్నపేట అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న నగర వన యోజన పనులను శనివారం జిల్లా అటవీశాఖ అధికారి జోజి పరిశీలించారు. వాచ్టవర్ పైకి ఎక్కి పనుల నాణ్యతను పరిశీలించారు. పగోడ, వాల్ నిర్మాణాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. త్వరితగతిన పను లు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రామ శివారులో ఉన్న కొత్త చెరువును పరిశీలించి వెట్ ల్యాండ్ మేనేజ్మెంట్ పథకం కింద చెరువును బాగు చేయిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట రేంజ్ అటవీశాఖ అధికారి విద్యాసాగర్, ఇతర అధికారులు ఉన్నారు. నేడు బేస్లైన్ టెస్ట్ కొల్చారం(నర్సాపూర్): ఓపెన్ టెన్త్, ఇంటర్ చదువుతున్న అభ్యర్థులకు ఆదివారం మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలలో బేస్లైన్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ ప్రతినిధి శ్రీధర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
చకచకా.. డబ్లింగ్
మేడ్చల్– ముథ్కేడ్ మధ్య పనులు ● శరవేగంగా ట్రాక్, వంతెనల నిర్మాణం ● భూసేకరణకు ప్రతిపాదనలురామాయంపేట(మెదక్): మేడ్చల్– ముథ్కేడ్ రైల్వే ట్రాక్ పరిధిలోని రెండో లైన్ (డబ్లింగ్) నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈమేరకు జిల్లాలోని అక్కన్నపేట నుంచి మేడ్చల్ వరకు 55 కిలోమీటర్ల మేర డబ్లింగ్, ట్రాక్ విద్యుద్దీకరణ కోసం రెండేళ్ల క్రితమే రూ. 523 కోట్లు మంజూరయ్యాయి. ఈలైన్ పరిధిలో ప్యాకేజీల వారీగా టెండర్ ప్రక్రియ పూర్తి కాగా, మేడ్చల్ వరకు గతంలోనే డబ్లింగ్ పనులు పూరయ్యాయి. ప్రస్తుతం జిల్లాలోని మనోహరాబాద్ మండల పరిధిలో పనులు కొనసాగుతున్నాయి. 25 చిన్న.. 3 పెద్ద వంతెనలు డబ్లింగ్ పనుల్లో భాగంగా 55 కిలోమీటర్ల మేర లైన్లో సుమారు మూడు పెద్దస్థాయి వంతెనలతో పాటు 25 వరకు చిన్న వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. రైల్వే క్రాసింగ్ల మూసివేతలో భాగంగా జిల్లాలో నాలుగో చోట్ల ఆర్యూబీలు నిర్మించనున్నారు. రెండో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న క్రమంలోనే విద్యుద్దీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ట్రాక్ పరిధిలో రెండో లైన్ నిర్మాణం కోసం మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో రెండో లైన్ అందుబాటులోకి వచ్చే విధంగా ఆశాఖ అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. పెరగనున్న రైళ్ల సంఖ్య! జిల్లాలోని ప్రధాన రైల్వేస్టేషన్లు అక్కన్నపేట, వడియారం, మీర్జాపల్లి ఉన్నాయి. అక్కన్నపేట స్టేషన్ నుంచి మెదక్ పట్టణానికి ప్రత్యేకంగా ట్రాక్ నిర్మించడంతో ఈస్టేషన్ జంక్షన్గా మారింది. ప్రతి రోజు 42 వరకు ప్యాసింజర్ రైళ్లతో పాటు ఆరు వరకు గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. డబ్లింగ్ పనులు పూర్తయితే ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల సంఖ్య రెట్టింపు అవుతుందని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్తో తరచూ క్రాసింగులు తీసుకోవాల్సిన అవసరం తలెత్తుతుంది. రెండు ట్రాక్లుంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. రెండో లైన్ నిర్మాణం పూర్తయితే ఆయా స్టేషన్ల రూపురేఖలు మారే అవ కాశం ఉంది. ఇప్పటికే వడియారం, అక్కన్నపేట స్టేషన్ల పరిధిలో భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో పాటు ఆయా స్టేషన్ల పరిధిలో ప్లాట్ఫాంల సంఖ్య పెరగనుంది. -
పరిష్కారం అరకొరే..
● భూ సమస్యలకు మోక్షమెప్పుడో..? ● కార్యాలయాల చుట్టూ అన్నదాతల చక్కర్లు ● పట్టించుకోని అధికారులుమెదక్జోన్: జిల్లాలో వేలాది మంది రైతులు భూ సమస్యలతో సతమతం అవుతున్నారు. నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారానికి ఆప్షన్ ఇవ్వలేదని, అందుకే భూభారతి తెచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది జిల్లాలో గ్రామ, గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల పైచిలుకు రైతులు దరఖాస్తులు అందజేశారు. కానీ వాటిలో ఇప్పటివరకు 10 శాతం కూడా పరిష్కారానికి నోచుకోలేదు. 20 వేల పైచిలుకు దరఖాస్తులు జిల్లాలో అత్యధికంగా సాదాబైనామాలు, లావణి పట్టాల మార్పిడికి సంబంధించి 20 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. అలాగే పేర్ల మార్పిడి, భూమి తక్కువ, ఎక్కువ సరిచేయటం తదితర దరఖాస్తులు మరో 5 వేల వరకు వచ్చాయి. ముందుగా సాదాబైనామాల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. భూమి విక్రయించిన రైతు తనకు డబ్బులు ముట్టాయని, కొనుగోలు చేసిన రైతు పేరిట పట్టా మార్పిడి చేయాలని చెబితేనే చేస్తున్నారు. ప్రస్తుతం భూమి రేట్లు పెరగటంతో సాదాబైనామా ఆధారంగా భూములు విక్రయించిన రైతులు అధికారులకు చెప్పడానికి ముందుకురావడం లేదు. అలాగే లావణి పట్టా మార్పిడిల దరఖాస్తులు అధికంగానే పెండింగ్లో ఉన్నాయి. నిరుపేదలకు ప్రభుత్వం ఈ పట్టాలు ఇవ్వగా, యజమాని చనిపోతే వారి పిల్లలకు పట్టా మార్పిడి కావటం లేదు. ఉమ్మడి కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముళ్లు ఉంటే ఆ కుటుంబ పెద్దకు ప్రభుత్వం పట్టా ఇవ్వగా, అందులో నుంచి తన తమ్ముడి పేర కొంత భాగం మారాల్సి ఉండగా ఆ ప్రక్రియ సాగడం లేదు. మరికొందరు అవసరాలకు ఇతరులకు విక్రయించగా, ఆ పేరూ మారటం లేదు. దీంతో ప్రభుత్వ పథకాలు వీరికి అందడం లేదు. అధికారుల తప్పిదాలతో రైతుల తిప్పలు క్షేత్రస్థాయిలో కొందరు వీఆర్ఓలు గతంలో చేసిన తప్పులకు రైతులు బలికావాల్సి వస్తోంది. ఒకరిపై ఉన్న పట్టా భూమిని మరొకరిపై మార్చటం, రికార్డులను మార్చి భూములను తక్కువ, ఎక్కువగా దిద్దటం లాంటి పొరపాట్లు చేశారు. వాటిని సరిచేసుకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కాగా ధరణి పోర్టల్ను మార్చి, భూ భారతి తెచ్చినా, భూ సమస్యలకు పెద్దగా పరిష్కారం దొరకటం లేదని రైతులు వాపోతున్నారు. -
తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేయొద్దు
డీఐఈఓ మాధవిరామాయంపేట(మెదక్): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థానానికి ఎదగాలని జిల్లా ఇంటర్ విద్యాధికారిణి మాధవి సూచించారు. శుక్రవారం పట్ట ణంలోని స్నేహా జూనియర్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులపై వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వారి ఆశలను వమ్ము చేయవద్దన్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో సెల్ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులను చదువులో ఉన్నత స్ధానానికి ఎదిగే విధంగా కళాశాల యాజమాన్యం కృషి చేస్తుందని, ఏటా రాష్ట్రస్థాయి ర్యాంకులతో ముందుకు సాగుతుందని ప్రశంసించారు. ఈసారి పరీక్షలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కరస్పాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ.. గత నాలుగైదేళ్లుగా తమ కళాశాల సాధిస్తున్న ఫలితాలను వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజని, సీఐ వెంకట్రాజాగౌడ్, ఎస్ఐ బాలరాజు, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి సహకారం
నర్సాపూర్: గిరిజనుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సంత్ సేవాలాల్ ఆలయ నిర్మాణానికి తన వంతుగా రూ. 2 లక్షల విరాళం ఇస్తానని ప్రకటించారు. ఆలయం పక్కన నిర్మిస్తు న్న ఎస్టీ కమ్యూనిటీ హాల్ను పూర్తి చేసేందుకు రూ. 20 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపానని, నిధులు మంజూరు చేయించేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని కులాలకు సమన్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా చౌరస్తా నుంచి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చెష్యాదవ్, ఆయా పార్టీల నాయకులు మురళీయాదవ్, బాల్రెడ్డి, రాజుయాదవ్, రాజేందర్, రమేశ్గౌడ్, శేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి -
శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సమస్యలపేటరామాయంపేటలో కానరాని ప్రగతి● పట్టణ ప్రజలకు తప్పని పాట్లు ● నూతన పాలకవర్గంపై కోటి ఆశలు నిలిచిన ‘సమీకృత’ నిర్మాణం రామాయంపేట మున్సిపాలిటీ ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు ఆశించిన ప్రగతి సాధించలేదు. ఏళ్లుగా తిష్ట వేసిన సమస్యలతో పట్టణ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిధుల కొరతతో చాలా వరకు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈక్రమంలో నూతనంగా కొలువుదీరిన పాలకవర్గంపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. – రామాయంపేట(మెదక్) బోర్డు పెట్టారు.. ఆఫీస్ మరిచారు ఆదర్శంగా తీర్చిదిద్దుతా బోర్డుకే పరిమితమైన ఆర్డీఓ కార్యాలయంనిరుపయోగంగా రైతు బజార్ మరిన్ని సమస్యలు -
‘వీబీజీ రామ్జీ’తో మరింత ఉపాధి
మెదక్ కలెక్టరేట్: వీబీజీ రామ్జీ చట్టంతో ప్రజలకు మరింత ఉపాధి లభిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఎంపీ రఘునందన్రావు సూచన మేరకు పోస్టర్ విడుదల చేసినట్లు తెలిపారు. నూతన ఉపాధి హామీ పథకం గురించి వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదన్నారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్గౌడ్ పాల్గొన్నారు. -
మల్లన్నసాగర్ నీటిని వదలాలి
రాస్తారోకో చేస్తున్న రైతులుచేగుంట(తూప్రాన్): మల్లన్నసాగర్ కాలువ నీటిని తమ చెరువులోకి వదలాలని వెంకటాపూర్ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పులిమా మిడి గ్రామంలో రామాయంపేట– గజ్వేల్ రహదారిపై పురుగు మందు డబ్బాలతో రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ రైతులతో పాటు గిరిజనులు మూడే ళ్లుగా కాలువ నీటిని పులిమామిడి శివారు నుంచి చెరువులో నింపుకుంటున్నామని తెలిపారు. ఈయాసంగి కోసం కాలువలో నీరు పారుతున్నా, తమ చెరువులోకి నీరు వదలకపోవడంతో 300 ఎకరాల్లో పంటలు ఎండిపోతాయని వాపోయారు. తమ చెరువులోకి నీటిని వదిలే వరకు రాస్తారోకో విరమించేది లేదన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఇరిగేషన్ ఏఈ మమత, సర్పంచ్ శ్రీనివాస్రెడ్డితో పాటు పలు వురు అధికారులు రైతులతో మాట్లాడారు. కాలువ నీరు పారే ప్రాంతాలను పరిశీలించి రెండు రోజుల్లో చెరువును నింపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రాస్తారోకో విరమించారు. -
టీవీ, ఫోన్లకు దూరంగా ఉండండి
కొల్చారం(నర్సాపూర్): పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రాహుల్రాజ్ విద్యార్థులకు సూచించారు. మండలంలోని పోతంశెట్టిపల్లి ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు అవసరమైన సూచనలు ఇచ్చారు. బట్టి చదువులకు స్వస్తి చెప్పి పలికి, విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రశ్న ఏ రకంగా వచ్చినా, సమాధానం రాసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. టీవీ, సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట ఎంఈఓ ఉమారాణి, సర్పంచ్ దయాకర్గౌడ్, ఉపాధ్యాయులు ఉన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తేవాలి
మెదక్జోన్: గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తుందని, క్రీడల్లో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అవుట్డోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 23 వరకు జరిగే ఈ క్రీడల్లో పలు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. అంతకుముందు ఆయన పలువురు క్రీడాకారులను పరిచయం చేసుకొని సాఫ్ట్ బాల్ ఆడారు. కాగా పోటీల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి 700 మంది క్రీడాకారులు వచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి రమేశ్, అదనపు ఎస్పీ మహేందర్, డీఈఓ విజయ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
పెండింగ్ బిల్లులు చెల్లించండి
మెదక్ కలెక్టరేట్: గ్రామ పంచాయతీల్లో తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని హవేళిఘణాపూర్ మండల మాజీ సర్పంచ్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డీపీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ సర్పంచ్లు ఒంటరి రాజేందర్రెడ్డి, నోముల శ్రీకాంత్ మాట్లాడుతూ.. మండలంలోని 28 పంచాయతీల్లో సుమారు రూ.కోటికి పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినప్పటికీ సొంతంగా శానిటేషన్ పనులు, ట్రాక్టర్ల డీజిల్, విద్యుత్ దీపాలు, తాగునీటి వసతులు వంటి అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. ఒక్కో సర్పంచ్కు లక్షలాది రూపాయలు రావా ల్సి ఉందన్నారు. కార్యాలయంలో డీపీఓ యాదయ్య లేక పోవడంతో సీనియర్ అధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఫోన్ ద్వారా డీపీఓను సంప్రదించగా సానుకూలంగా స్పందించి బిల్లులు ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు మహిపాల్రెడ్డి, యామిరెడ్డి, శ్రీను నాయక్, సుభాష్, రంజా, రమేశ నాయక్ పాల్గొన్నారు. -
TG: ఫుడ్ పాయిజన్.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
మెదక్: జిల్లాలోని రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాంతో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న(గురువారం, ఫిబ్రవరి 19వ తేదీ) మధ్యాహ్నం గుడ్డు కూర తిన్నారు విద్యార్థినులు. అయితే అదే గుడ్డు కూరను రాత్రికి పులుసగా తయారుచేసి విద్యార్థులకు వడ్డించినట్లు తెలుస్తోంది. తద్వారా 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం పది విద్యార్థులు తిరిగి కోలుకున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. -
వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ
ఛత్రపతి శివాజీ వీరత్వానికి ప్రతీక అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు అన్నారు. గురువారం పట్టణంలో శివాజీ మహరాజ్ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. మరాఠా ప్రజల్లో శివాజీ స్వేచ్ఛా స్ఫూర్తిని రగిలించి, శక్తివంతమైన నౌకాదళాన్ని ఏర్పాటు చేశారని కొనియాడారు. ఆయన వెంట ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్గౌడ్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ తదితరులు ఉన్నారు. కాగా అంతకుముందు వీహెచ్పీ, బీజేపీ, భజ్రంగ్దళ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ త దితరులు పాల్గొన్నారు. – మెదక్ కలెక్టరేట్ -
మత్స్యకారులకు చేయూత
సబ్సిడీపై వాహనాలు మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం మత్స్యకారులకు చేయూతనిస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సబ్సిడీపై వాహనాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీలకు మోటార్ సైకిల్ విత్ ఐస్బాక్స్, బోటు, వలలు సబ్సిడీపై అందజేయనుంది. జిల్లాలో మొత్తం 309 మత్స్యకార సంఘాలు ఉన్నాయి. ఇందులోనే 24 మహిళా మత్స్యకార సంఘాలు ఉన్నాయి. మొత్తం 18 యూనిట్లు మంజూరు కాగా మత్స్యకారులకు 13 యూనిట్లు, మహిళలకు 2, ఎస్సీలకు 3 యూనిట్లు మంజూరయ్యాయి. వీటికోసం జిల్లాలోని ఆసక్తిగల మత్స్యకారులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అర్హతలు జిల్లాలో చేపల క్రయ విక్రయం చేస్తూ, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలి. కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఎస్సీ, ఎస్టీలు మత్స్యకార సంఘాలుగా ఏర్పడి ఉండాలి. అలాగే బోటు, వలల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఘంలో కనీసం 50 మంది సభ్యులు ఉండాలి. ఆ సంఘం పరిధిలో కనీసం 100 ఎకరాల చెరువు ఆయకట్టు ఉండాలి. ఒక సంఘానికి ఒక యూనిట్ మాత్రమే ఇవ్వనున్నారు. దరఖాస్తు పత్రాలు జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో లభిస్తాయి. ఆసక్తి, అర్హత గల వారు సబ్సిడీ వాహనాల కోసం ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొని, జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో సంబంధిత పత్రాలు అందజేయాలి. 60 శాతం సబ్సిడీ మోటర్ సైకిల్ విత్ ఐస్ బాక్స్ వాహనం మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు 60 శాతం సబ్సీడీతో ఇస్తున్నారు. అలాగే మత్స్యకారులకు 40 శాతం సబ్సిడీతో అందజేస్తారు. ఒక వాహనం విలువ రూ.75 వేలు కాగా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.45 వేలు, మత్స్యకారులకు రూ. 30 వేల సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే బోటు, వలలు మత్స్యకారులకు 40 శాతం సబ్సిడీతో అందజేస్తున్నారు. జిల్లాకు 18 యూనిట్లుమంజూరు ఈనెల 28 వరకుదరఖాస్తుల స్వీకరణ -
ఓపెన్లోనూ వాట్సాప్ పాఠాలు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. చదువు మధ్యలో మానేసి 18 ఏళ్లు వయసు పైబడిన వారికి ఓపెన్ స్కూల్ ద్వారా చదువుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ ఏడాది అభ్యాసకుల హాజరు శాతం పెంచి, ఓపెన్ స్కూల్ తరగతులను అభ్యాసకులకు మరింత చేరువ చేసేందుకు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కొత్త వాట్సాప్ చానల్ను ప్రారంభించింది. సెలవుల్లో మాత్రమే తరగతులు గతంలో ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్మీడియెట్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఏడాదంతా కేవలం రెండవ శనివారం, ఆదివారాల్లోనే తరగతులను నిర్వహించేవారు. వీకెండ్లో తరగతులు ఉండటంతో చాలామంది అడ్మిషన్ తీసుకున్నప్పటికీ తరగతులకు హాజరు కాకపోవడంతో అనుకున్న లక్ష్యం నీరుగారిపోయేది. ప్రభుత్వం అభ్యాసకులను పరీక్షలకు సన్నద్ధం చేయడానికి కావాల్సిన స్టడీ మెటీరియల్ను పంపిణీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఈ విద్యా ఏడాది హాజరు శాతంతోపాటు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కొత్తగా వాట్సాప్ చానల్ను ప్రారంభించింది. అందులో పదవ, ఇంటర్మీడియెట్ తరగతులకు సంబంధించి అభ్యాస దీపికలు అందుబాటులో ఉంచడమేకాకుండా ఎప్పుడూ లింక్ ఓపెన్ చేసినా పాఠాలు వచ్చేలా రూపకల్పన చేశారు. 103 అధ్యయన కేంద్రాలు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 103 అధ్యయన కేంద్రాలున్నాయి. వీటిలో సంగారెడ్డిలో 49, మెదక్లో 21, సిద్దిపేటలో 33 ఉన్నాయి. వీటిలో సంగారెడ్డిలో పదవ తరగతిలో 2,669, ఇంటర్మీడియెట్లో 4,680, మెదక్ జిల్లాలో పదవ తరగతిలో 1,016, ఇంటర్మీడియట్లో 2,887, సిద్దిపేట జిల్లాలో పదిలో 616 కాగా ఇంటర్మీడియట్లో 1,648 మంది అభ్యాసకులు ప్రవేశం పొందారు. ఓపెన్ స్కూల్లో ఉత్తీర్ణత పొందిన అభ్యాసకులకు సంబంధించిన ధ్రువపత్రాలకు సైతం రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా తదుపరి పదోన్నతుల కోసం కూడా ఓపెన్ ద్వారా తమ ఉన్నత చదువులను కొనసాగిస్తున్నారు. ఓపెన్ స్కూల్ బేస్లైన్ పరీక్షలుమెదక్ అర్బన్: ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఈనెల 22న బేస్ లైన్ టెస్ట్లు ఉంటాయని డీఈఓ విజయ గురువారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఈ పరీక్షలకు విద్యార్థులంతా హాజరయ్యేలా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లు చర్యలు తీసుకోవాలన్నారు. మిగితా వివరాలకు జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి (8008403635) నంబర్లో సంప్రదించాలని సూచించారు. వాట్సాప్ పాఠాలుసులభంగా అర్థమవుతున్నాయి నేను ప్రైవేట్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తాను. 7వ తరగతి వరకు చదివి మధ్యలో ఆపేశాను. చదువుకోవాలనే ఆశతో ఓపెన్ తరగతిలో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ పొందాను. ప్రస్తుతం వాట్సప్ చానల్ ద్వారా వీలైనప్పుడు చదువుకునే అవకాశం కల్పించారు. ఇందులో పాఠాలు కూడా చాలా సులభంగా అర్థమవుతున్నాయి. – నరేశ్, పదవ తనగతి అభ్యాసకుడుసద్వినియోగం చేసుకోవాలి ఓపెన్ స్కూల్లో విద్యను అభ్యసించిన వారికి వచ్చే సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్లతోపాటు సమానంగా ప్రాధాన్యత ఉంటుంది. అడ్మిషన్ పొందిన ఇంటర్మీడియెట్, పదవ తరగతి అభ్యాసకులు వాట్సాప్లో పాఠాలు వచ్చేలా ప్రభుత్వం వాట్సప్ చానల్ను ప్రవేశపెట్టింది. ఈ అవకాశాన్ని ఓపెన్ స్కూల్ అభ్యాసకులు సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటస్వామి, ఓపెన్ స్కూల్, ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ఉత్తీర్ణతశాతం పెంచేందుకు చర్యలు -
యాప్తోనే యూరియా బుకింగ్
కొల్చారం(నర్సాపూర్): యూరియా అవసరమైన రైతులు ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే బుక్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్కుమార్ సూచించారు. గురువారం మండలంలోని పోతంశెట్టిపల్లి రైతు వేదికలో మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో యూరియా బుకింగ్ యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం క్షేత్రస్థాయిలో వరి పొలాలను సందర్శించారు. వరిలో జింకు లోపం లక్షణాలను గుర్తించడంతో పాటు నివారించేందుకు అవసరమైన సూచనలను రైతులకు తెలియజేశారు. కార్యక్రమంలో టెక్నికల్ ఏఓ హర్ష, మండల ఏఓ శ్వేతకుమారి, పోతంశెట్టిపల్లి క్లస్టర్ ఏఈఓ నిరోష, సర్పంచ్ దయాకర్గౌడ్, యాదయ్య, రైతులు పాల్గొన్నారు.డీఏఓ దేవ్కుమార్ -
పరిహారం జాడేది?
ప్రకృతి వైపరీత్యాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఏడాది కావొస్తోంది. నేటికీ రైతులకు మాత్రం పరిహారం అందలేదు. గతేడాది యాసంగి పంట చేతి కందే సమయంలో అకాల వర్షాలు, వర్షాకాలం సీజన్లో కుంభవృష్టి జిల్లాను అతలాకుతలం చేశాయి. జిల్లావ్యాప్తంగా 12 వేల పైచిలుకు ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి పంపారు. అయినా ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదు. – మెదక్జోన్ జిల్లాలో గతేడాది యాసంగిలో 2.76 లక్షల ఎకరాల్లో వరితో పాటు ఇతర పంటలు సాగు చేశారు. తీరా పంట చేతికందే సమయంలో మార్చి, ఏప్రిల్, మేలో కురిసిన గాలి వాన భీభత్సానికి 1,507.85 ఎకరాల్లో 1,600 మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాత రాలిపోయి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. అలాగే వర్షాకాలంలోనూ పంటలు చేతికందే సమయంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కురిసిన భారీ వర్షాలకు అధికారిక లెక్కల ప్రకారం 10,768.79 ఎకరాల్లో 15,844 రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో ప్రధానంగా వరి, పత్తి పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈ రెండు సీజన్లలో 12,277.24 ఎకరాల్లో 17,499 మంది రైతులకు చెందిన పంటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వ్యవసాయశాఖ అధికారులు తేల్చా రు. యాసంగిలో పంట నష్టం జరిగి ఏడాది కావొస్తుండగా, వానాకాలంలో వరదల కారణంగా నష్టం జరిగి నాలుగు నెలల కావొస్తోంది. అయినప్పటికి నేటికీ పరిహారం అందలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి రాక, పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.12.27 కోట్లు పెండింగ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పంటల బీమాను అమలు చేయలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే విధానాన్ని కొనసాగిస్తోంది. అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతింటే నామమాత్రంగా ఇన్పుట్ సబ్సిడీ పేరిట ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం ఇస్తున్నారు. అదే లెక్క ప్రకారం గతేడాది యాసంగి, వానాకాలంలో ప్రభుత్వం నుంచి రైతులకు రూ. 12,27,70,000 పరిహారం రావాల్సి ఉంది. ప్రభుత్వానికి నివేదించాం గతేడాది జిల్లాలో రెండు సీజన్లలో కలిపి 12,277.24 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి పంపించాం. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు పరిహారం రాలేదు. రాగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. – దేవ్కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి జిల్లాలో 12 వేల పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం -
మహనీయుడు సంత్ సేవాలాల్
మెదక్ కలెక్టరేట్: బంజారాలలో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ అని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దుర్గామీరా కాలనీలో సేవాలాల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో బంజారాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించడానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశమంతా చిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని సేవాలాల్ ఏకం చేశారని కొనియాడారు. ఈసందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం మెదక్లో గిరిజనులు భారీ శోభయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్, బంజారా సంఘం పూజారులు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
సందర్శించి.. ఆరా తీసి
నిజాంపేట(మెదక్)/పాపన్నపేట/కౌడిపల్లి/అల్లాదుర్గం/వెల్దుర్తి/శివ్వంపేట/నర్సాపూర్ రూరల్/చేగుంట: జిల్లావ్యాప్తంగా బుధవారం ట్రైనీ గ్రూప్–1 అధికారులు విస్తృతంగా పర్యటించారు. మొదట నిజాంపేట మండల పరిధిలోని చల్మెడలో పర్యటించారు. గొర్రెల కాపరులతో మాట్లాడి మంచి లాభాలు రావాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అడిగి తెలుసుకున్నారు. అలాగే అంగన్వాడీ సెంటర్లో విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం రైతులకు పంటలో ఏ విధమైన లాభాలు వస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. అవినీతికి తావులేకుండా సుపరిపాలన కోసం పని చేయాలని సూచించారు. వారి వెంట ఎంపీడీఒ రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, సర్పంచ్ బోమ్మెన మల్లేశం తదితరులు ఉన్నారు. అనంతరం పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో వివిధ శాఖల పాలన, ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. అలాగే కౌడిపల్లి మండలం మహమ్మద్నగర్ చెందిన టమాట రైతు మహిపాల్రెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించి సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అల్లాదుర్గం మండల పరిధిలోని గడిపెద్దాపూర్లో పర్యటించారు. విద్య. వైద్యంపై ఆరా తీశారు. కుమ్మరులు చేస్తున్న కుండల తయారీని పరిశీలించారు. ప్లాస్టిక్ వస్తువులు రావడంతో తాము ఉపాధి కోల్పోయినట్లు వారు చెప్పారు. మాసాయిపేట మండలం రామంతాపూర్లో రెండో రోజు పర్యటించారు. పలు కాలనీల్లో పర్యటించి పరిసరాలు పరిశీలించారు. శివ్వంపేట మండల పరిధిలోని సికింద్లాపూర్లో పర్యటించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఉపాధిహామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర ప్రభుత్వ పథకాలు పరిశీలించారు. అలాగే చేగుంట మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామాన్ని సందర్శించారు. అలాగే నర్సాపూర్ మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించారు. పంచాయతీ పరిపాలనతో పాటు మహిళా సంఘాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.జిల్లావ్యాప్తంగా ట్రైనీ గ్రూప్–1 అధికారుల పర్యటన -
అడవుల సంరక్షణేదీ?
వేసవి సమీపిస్తోంది. అడవితో పాటు అందులో జీవిస్తున్న జంతువులకు ప్రమాదం పొంచి ఉంది. అడవులను ఆనుకొని ఉన్న రహదారుల వెంట ఫైర్లైన్స్ చేపట్టలేదు. ఫలితంగా ఏటా వందలాది ఎకరాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. అలాగే జంతువులకు తాగునీరు అందించాల్సిన అధికారులు ఇప్పటివరకు కార్యాచరణ ప్రారంభించలేదు. – మెదక్జోన్ సాసర్పిట్లలో నీరు కరువు మూడేళ్లుగా నిధులు లేవు ఏటా వందలాది ఎకరాలు దహనం కరువైన ఫైర్లైన్స్ పట్టించుకోని అధికారులు -
బాల్య వివాహాలను అరికడదాం
మెదక్ కలెక్టరేట్: బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో బాల్య వివాహ ముక్త్ భారత్ వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రత్యేక ప్రచార వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. బాల బాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం అందరి బాధ్యత అన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లా సంక్షేమాధికారి హేమాభార్గవి మాట్లాడుతూ.. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామసభలు, ఆశ్రమ పా ఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని వివరించారు. కార్యక్రమంలో డివిజనల్ పీఆర్ఓ రామచంద్ర రాజు, జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కోఆర్డినేటర్ సంతోషి, విజన్ సంస్థ డైరెక్టర్ కై లాష్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు రాజు, శరత్ సిబ్బంది పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
పైసలు పాయె.. పదవీ దక్కకపాయె
● గెలుపు ధీమాతో పోటాపోటీగా ఖర్చు ● గరిష్టంగా రూ.2కోట్లకు పైగా వెచ్చింపు ● అప్పులు ఎలా తీర్చేదంటూ ఆవేదన ● ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,256 మంది ఓటమి మున్సిపల్ ఎన్నికల్లో పైసలన్నీ పోయె.. పదవీ దక్కకపాయె.. అప్పుల కుప్పాయె.. అంటూ కౌన్సిలర్గా పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులు తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. చేసిన అప్పులను ఎలా తీర్చేది అంటూ లోలోపల కుమిలిపోతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఒక్కో అభ్యర్థి దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు వెచ్చించినట్లు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 19 మున్సిపాలిటీలలో 402 వార్డుల్లో 1,658 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో 402 మంది కౌన్సిలర్లుగా విజయం సాధించగా, 1,256 మంది ఓటమి పాలయ్యారు. – సాక్షి, సిద్దిపేట పట్టణంలో కౌన్సిలర్గా పని చేయాలనేది కొందరికి మోజు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీలో కార్యకర్త, నాయకుడిగా కొనసాగుతున్న వారు ఈసారి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా రిజర్వేషన్ కలిసి వచ్చిందని చాలా మంది పోటీ చేశారు. రాజకీయ నేత ఎదగడానికి కౌన్సిలర్ తొలి మెట్టు అవుతుందని బరిలో దిగారు. అందులో ఆయా వార్డుల్లో ఎక్కువ ఓట్లు సాధించిన వారికి విజయం వరించింది. తక్కువ ఓట్లు వచ్చిన వారు ఓటమి చెందారు. కొందరు సొంత డబ్బులు.. మరి కొంత మంది తమ దగ్గర ఉన్న డబ్బులతో పాటు అప్పులు తెచ్చారు. అలాగే భూములను విక్రయించడం.. తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఎన్నికల్లో వెచ్చించారు. నామినేషన్ వేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే రోజు వరుకు చేసిన ఖర్చు అంతా ఇంతా కాదు.. ఓటమి చెందడంతో అప్పులు పెనుభారంగా మారాయి. విచ్చలవిడిగా వెచ్చింపు.. గెలుస్తామని ధీమాతో కొందరు అభ్యర్థులు విచ్చలవిడిగా వెచ్చించారు. విందులు, వినోదాలు, గిఫ్ట్లతోపాటు ఓటర్లకు నేరుగా రూ.1,000 నుంచి రూ.10వేల అందించినట్లు తెలిసింది. కొందరు స్థిరాస్తులు అమ్ముకోగా, మరికొందరు భూములు తాకట్టు పెట్టి, మరికొందరు నేరుగా అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. ప్రధాన పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో వెనకడుగు వేయకుండా డబ్బులు తీసుకవచ్చి వెచ్చించారు. ఓటమి చెందగానే చేసిన అప్పులు గుర్తు తెచ్చుకుని ఆందోళన చెందుతున్నారు. ఓటమి పాలైన కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థులు తెచ్చిన అప్పులకు నెలనెలా వడ్డీలు ఎలా కట్టాలి? అసలు అప్పు తీర్చేది ఎలా అని పలువురు తలలు పట్టుకుంటున్నారు. ఐదు మున్సిపాలిటీలలో అధికంగా ఖర్చు హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉన్న పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్, గుమ్మడిదల, ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం పురపాలక సంఘాల్లో అభ్యర్థులు అధికంగా ఖర్చు చేశారు. వీటిలో మూడు ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలబడిన ఒక్కో అభ్యర్థి దాదాపు రూ.70 లక్షల నుంచి రూ.2 కోట్లకు పైగా వెచ్చించినట్లు ప్రచారం జరిగింది. దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్లలో ఒక్కో ఓటుకు కొన్ని వార్డుల్లో రూ.5వేల వరకు డబ్బులు పంపిణీ చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కింద కొంతమేర డబ్బులతో పాటు ప్రచార సామగ్రిని అందజేసినట్లు సమాచారం. కొన్ని చోట్ల ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం కొంత వరకు కార్నర్ సమావేశాలకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఓటమి చెందిన అభ్యర్థులను ఆయా ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కనీసం పలకరించకపోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. బరిలో నిలిచి ఓటమిని చవిచూసిన అభ్యర్థులకు సొంత పార్టీ నేతలు ఓదార్చకపోవడంతో మరింత కుమిలిపోతున్నారు. రాజకీయ భవిష్యత్తు ఎమిటని తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చును చూస్తే పేదోడు రాజకీయాలలో ఉండటం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతుండటం కొసమెరుపు. -
మన చరిత్ర ప్రపంచానికి చెబుదాం
నర్సాపూర్ రూరల్: తెలంగాణ చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలని హెరిటేజ్ తెలంగాణ శాఖ డైరెక్టర్, ప్రొఫెసర్ అర్జున్రావు కూతాడి అన్నారు. బుధవారం నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం, హెరిటేజ్ తెలంగాణ శాఖ మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్య ఒప్పందంతో యువతకు హెరిటేజ్ పరిశోధనలో అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణ చరిత్రను డాక్యుమెంట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఉపాధి అవకా శాలు, పరిశోధన సామర్థ్యాలు పెంచుతుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్ మాట్లాడుతూ.. రెండు సంస్థలు కలిసి హెరిటేజ్ సంరక్షణ, చరిత్ర పరిశోధనలో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలతో పాటు ఫీల్డ్ వర్క్, సెమినార్లు, వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల చరిత్ర విభాగం అధ్యక్షుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ప్రొఫెసర్ అర్జున్రావు కూతాడి -
మెదక్ జిల్లా కలెక్టర్కు జైలుశిక్ష
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్ సర్వే నంబర్ 284/ఏ/2లో 2.22 ఎకరాల భూ వివాదంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయని కలెక్టర్, ఐఏఎస్ అధికారి శ్రీరాహుల్రాజ్కు హైకోర్టు ఆర్నెల్లు సాధారణ జైలు శిక్ష విధించింది. రూ.2 వేలు జరిమానా చెల్లించాలని చెబుతూ నాలుగు వారాలు గడువిచి్చంది. ఈ ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి నాలుగు వారాలు తీర్పు అమలును నిలిపివేసింది. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్ సర్వే నంబర్ 284/ఏ/2లో 2.22 ఎకరాల భూమికి తను వారసురాలినని, తన పేరుపై మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నాగవెల్లి లక్ష్మి 2024, ఏప్రిల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ను రద్దు చేశారు. లక్ష్మితో పాటు ప్రతివాది నారాయణ, మల్లయ్యలకు నోటీసులు ఇచ్చి మరోసారి పూర్తి విచారణ జరిపాలని ఆదేశించారు. సేల్డీడ్, సాదాబైనామా క్రమబదీ్ధకరణ చర్యలను పరిశీలించి చట్టప్రకారం ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు. దీని కోసం మూడు వారాలు గడువిచ్చారు. జూన్లో ఉత్తర్వులు జారీ చేసినా సెపె్టంబర్ వరకు అమలు చేయకపోవడంతో తిరిగి లక్ష్మి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.కోర్టు తీర్పునిచ్చినా కలెక్టర్ ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని, ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ ఏజీపీ(అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్) అందజేసిన రికార్డుల్లో తేదీ లేదని, పిటిషనర్కు నోటీసులు అందినట్లు నిర్ధారణ చేసుకోలేదని న్యాయమూర్తి గమనించారు. వాట్సాప్ ద్వారా పిటిషనర్కు పంపించామని ఏజీపీ పేర్కొన్నా ధిక్కార పిటిషన్లోని కౌంటర్లో ఈ విషయాన్ని ప్రస్తావించలేదని అభిప్రాయపడ్డారు. రెండెకరాల భూమి కోసం 51 ఏళ్ల మహిళలను పదేపదే కోర్టుల చుట్టూ తిరిగేలా చేయడం సరికాదని అధికారుల తీరును తప్పుబట్టారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ ధిక్కరించినట్లు పేర్కొన్న న్యాయమూర్తి ఆర్నెల్లు జైలు విధిస్తూ తీర్పునిచ్చారు. -
రమణీయం రథోత్సవం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతరలో మంగళవారం రాత్రి రథోత్సవం కనులవిందుగా సాగింది. ఉదయం నుంచే భక్తులు దుర్గమ్మ తల్లిని దర్శించుకుని పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జోగినులు బోనాలతో చిందులు వేశారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సునీతారెడ్డికి ఆలయ సిబ్బంది స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సత్కరించారు. కనుల పండువగా రథోత్సవం జాతరలో మూడవరోజు రథోత్సవం వేలాది భక్తుల మధ్య కనుల పండువగా జరిగింది. గర్భగుడిలో దుర్గమ్మ తల్లి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తజనుల నినాదాల మధ్య ఉత్సవ విగ్రహాన్ని పల్లకీపై ఉంచి రథం వరకు తీసుకొచ్చారు. ఆచారం ప్రకారం ఆలయాధికారులు, నాగ్సాన్పల్లి గ్రామంలోని వతన్దారులు, 18 మంది పని బాటల వారికి, హక్కు బాపతులు అప్పగించి కార్యక్రమ నిర్వహణకు ఆహ్వానించారు. అదనపు ఎస్సీ మహేందర్, వివిధ శాఖల అధికారులను సన్మానించారు. వివిధ శాఖల అధికారులు, భక్తులు తాళ్లతో రథాన్ని లాగుతూ భవానీమాతకు జై అంటూ ముందుకు కదిలారు. రథం గోలి వద్ద నుంచి ఆలయం ముందునున్న రాజగోపురం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. రథయాత్రకు ఇరు ప్రక్కలా బారులు తీరిన భక్తులు దుర్గామాతకు జై అంటూ నినదించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ మహేందర్, ఎస్సై శ్రీనివాస్గౌడ్తోపాటు సుమారు 500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఏడుపాయల్లో భక్త జనసందోహం బోనాలతో చిందులు వేసిన జోగినులు -
పకడ్బందీగా మ్యాపింగ్ ప్రక్రియ
నర్సాపూర్: జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్రాజ్ చెప్పారు. మంగళవారం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన ఆర్డీఓ కార్యాలయం నుంచి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మ్యాపింగ్ ప్రక్రియను చేపడుతామని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, అందుకుగాను గ్రామ పాలన అధికారులు ఇతర అధికారులను మ్యాపింగ్ ప్రక్రియలో సహాయకులుగా నియమించి ప్రక్రియ త్వరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్ ఉన్నారు. జవాబుదారీగా పనిచేస్తేనే గుర్తింపుమెదక్ కలెక్టరేట్: జవాబుదారీగా పనిచేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, సుపరిపాలన అందించేందుకు ఉద్యోగులందరూ కృషి చేయాలని నూతన ట్రైనీ గ్రూప్ 1 అధికారులకు కలెక్టర్ రాహుల్రాజ్ పిలుపునిచ్చారు. మెదక్ కలెక్టరేట్లో నూతన ట్రైనీ గ్రూప్1 అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ట్రైనీ అధికారులు శిక్షణ అనంతరం ఉద్యోగ బాధ్యతలలో అవినీతికి తావులేకుండా సుపరిపాలన అందించాలన్నారు. పారదర్శకంగా, జవాబుదారీగా ఉద్యోగం చేసినప్పుడే ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. దేశంలో గ్రామీణ వ్యవస్థ చాలా పెద్దదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల అభివృద్ధే దేశాభివృద్ధి అన్నారు. అధికారులు సేవల్లో తమ చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఉద్యోగ సేవల్లో టెక్నాలజీని కూడా ఉపయోగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలిమెదక్ కలెక్టరేట్: సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ ఆధ్వర్యంలో బంజారా సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న మెదక్, 20న నర్సాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించాలని కోరారు. ఇందుకోసం పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రెండు నియోజకవర్గ కేంద్రాలలో శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. పెద్ద ఎత్తున శోభాయాత్రలు, సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
గైర్హాజరైన డాక్టర్లపై కమిషనర్కు నివేదిక
జోగిపేట ఆస్పత్రిని సందర్శించిన డీసీహెచ్ఎస్ డాక్టర్ షరీఫ్ జోగిపేట(అందోల్): రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రోజున విధులకు గైర్హాజరైన 12 మంది వైద్యులపై చర్యలకు డీసీహెచ్ డాక్టర్ షరీఫ్ నివేదికను సిద్ధం చేశారు. జోగిపేట ఏరియా ఆస్పత్రిని మంత్రి ఆదేశాల మేరకు మంగళవారం షరీఫ్ సందర్శించి సోమవారం విధులకు హాజరుకాని డాక్టర్ల వివరాలు సేకరించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 13 మంది డాక్టర్లు విధులకు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు కేవలం మధ్యాహ్నం వరకే విధులు నిర్వహిస్తారని, ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో మాత్రమే డాక్టర్లు విధుల్లో ఉంటారని చెప్పారు. విధులకు గైర్హాజరైన వారి జాబితాను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్కు పంపుతున్నట్లు తెలిపారు. జోగిపేట ఆస్పత్రిలో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉండగా జిల్లాలోని ఇతర ఆస్పత్రుల నుంచి డిప్యూటేషన్ వేశామన్నారు. -
తునికి ఎంజేపీ విద్యార్థికి 91.2 పర్సంటైల్
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి వద్దగల ఎంజేపీ (మహాత్మ జ్యోతిబాపూలే) బీసీ గురుకుల కళాశాల విద్యార్థి జేఈఈ మెయిన్స్లో 91.2 పర్సంటైల్ సాధించి సత్తాచాటాడు. కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కన్నెబోయిన విజయ్కుమార్ ప్రస్తుతం తునికి ఎంజేపీలో కొనసాగుతున్న కౌడిపల్లి ఎంజేపీ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా, గత నెలలో విజయ్కుమార్ జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయగా 91.2పర్సంటైల్ సాధించాడు. విజయ్కుమార్ తల్లిదండ్రులు శేఖులు, లక్ష్మి సాధారణ వ్యవసాయ కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలో చదివి జేఈఈలో మంచి ఫలితం సాధించడంతో కళాశాల ప్రిన్సిపాల్ హరిబాబు, లెక్చరర్లు అతన్ని శాలువాతో సన్మానించారు. భవిష్యత్తులో చదువులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు. విజయ్కుమార్కు జాతీయస్థాయిలో మంచి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకునే అవకాశం లభిస్తుందని ప్రిన్సిపాల్ తెలిపారు. తొలగించిన చెప్పుల కుప్పలురాజగోపురం ఎదుట నుంచి స్టాల్లోకి మార్చిన సిబ్బంది పాపన్నపేట(మెదక్): ‘దుర్గమ్మా ఇదేం దుర్గతి’శీర్షికన మంగళవారం ‘సాక్షి’ప్రచురించిన కథనానికి ఆలయ, పంచాయతీ అధికారులు స్పందించారు. ఆగమేఘాల మీద రాజగోపురం ఎదురుగా ఉన్న చెప్పుల కుప్పలను సిబ్బంది తొలగించారు. చెప్పుల స్టాండ్ కోసం నిర్మించిన హాల్ను వినియోగంలోకి తెచ్చారు. భక్తుల పాదరక్షలు చెప్పుల స్టాండ్లో భద్రపరిచారు. ఒక్కో జతకు రూ.40 చొప్పున వసూలు చేశారు. దీంతో రాజగోపురం ముందు.. దుర్గమ్మ ఆలయానికి ఎదురుగా ఉన్న ప్రధాన వీధి శుభ్రంగా మారింది. అలాగే శివాలయం ముందు పక్కన గల ఎంగిలి విస్తారాకుల పెంటను కూడా తొలగించి, దేవాలయ ప్రాంగణాన్ని పవిత్రతకు ప్రతీకగా తీర్చిదిద్దారు. మామిడికి కవర్లు రక్షణ కవచంఉద్యానశాఖ జిల్లా అధికారి సోమేశ్వర్రావు జహీరాబాద్ టౌన్: కాయలకు కవర్లు కట్టడం వల్ల మామిడికి రక్షణ కవచంలా ఉంటుందని ఉద్యానశాఖ జిల్లా అధికారి సోమేశ్వర్రావు పేర్కొన్నారు. కోహీర్ మండలంలోని బిలాల్పూర్, కోహీర్ మామిడి రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇటీవల కాలంలో మామిడికి తెగుళ్ల బెడద తీవ్రంగా వేధిస్తోందన్నారు. నల్లతామర, పండుఈగ, తేనె మంచు, మసి తెగులు, బంక తెగుళ్ల నుంచి కాయలను కాపాడుకునేందుకు రక్షణ కవర్లను కడుతున్నారని చెప్పారు. నిమ్మకాయ సైజులు వచ్చినప్పుడు కాయలకు కవర్లు కట్టాలన్నారు. తెగుళ్ల బాధకూడా తగ్గుతుందన్నారు. మామిడిలో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆయన రైతులకు వివరించారు. గజ్వేల్రూరల్: శ్రీరాముని ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని గజ్వేల్ ఏసీపీ నరసింహులు అన్నారు. గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు భద్రాచలం నుంచి వచ్చిన వడ్లకు మంగళవారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్లోగల పార్దివేశ్వరస్వామి దేవాలయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆకుల నరేష్బాబుతో కలిసి ఆయన మాట్లాడుతూ భద్రాచలంలోని సీతారాముల కళ్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. -
సన్నాలకు బోనస్
మెదక్జోన్: సన్నాలను సాగుచేసిన అన్నదాతలను సర్కార్ ముప్పు తిప్పలు పెడుతోంది. ధాన్యం విక్రయించి ఏడాది కావస్తుండగా, పాత బకాయిలను పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం, కొత్త బకాయిలను మాత్రమే విడుదల చేయటంపై సర్వత్రా రైతులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక సన్నాలను సాగు చేస్తే అదనంగా క్వింటాల్కు రూ.500 చొప్పున ఇస్తామనటంతో అధిక ఖర్చులు భరించి రైతులు సన్నాల సాగు చేస్తున్నారు. 2025 సంవత్సరం యాసంగిలో జిల్లాలో మొత్తం 2.75 లక్షల ఎకరాల వరిసాగు సాగు చేయగా, అందులో 40 వేల ఎకరాలలో 14వేల పైచిలుకుమంది రైతుల సన్నాలను సాగు చేశారు. ఇందుకుగానూ 62,994 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం దిగుబడి రాగా కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించారు. ఇందుకుగాను సదరు రైతులకు రూ.31.37 కోట్లు చెల్లించాల్సి ఉండగా నేటికీ చెల్లింపులు జరగలేదు. అలాగే 2025 వానాకాలంలోనూ మొత్తం 3.56 లక్షల ఎకరాలలో జిల్లావ్యాప్తంగా వరిసాగు చేయగా అందులో 38,052 మంది రైతులు 1,27,029 ఎకరాల్లో సన్నాలను సాగు చేశారు. ఇందుకుసంబంధించి 1,43,212 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. రైతులకు రూ.71.61 కోట్లు చెల్లించాల్సి ఉండగా, గత మూడు విడతల్లో అన్నదాతలకు 60% డబ్బులు చెల్లించగా, చివరగా ఈనెల 16న, నాలుగవ విడతలో పూర్తి మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే గతేడాది రబీసీజన్లో బకాయిపడిన రూ.31.37 కోట్లు అలాగే పెండింగ్లో ఉన్నాయి. పాత బకాయిలు కొత్తవి మాత్రమే ఇచ్చారని, మారి పాత బకాయిలు ఎప్పుడిస్తారంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా నిర్వహిస్తున్న ఎన్నికల నేపథ్యంలో సర్కార్ వద్ద పెండింగ్లో ఉన్న పథకాలకు సంబంధించి నిధులను కొంతమేర విడుదల చేస్తోంది. పంచాయితీ ఎన్నికల ముందు మహిళా సంఘాలకు చెల్లించాల్సిన వడ్డీ డబ్బులతోపాటు వడ్డీని విడుదల చేసిన ప్రభుత్వం, మున్సిపల్ ఎన్నికలకు ముందు సైతం మెప్మా ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు సైతం విడుదల చేసింది. కాగా రేపోమాపో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వాహణకు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో రైతులకు రెండు సీజన్లలో బకాయి పడిన సన్న ధాన్యం డబ్బుల్లో వానాకాలం డబ్బులను విడుదల చేసిందని పలువురు పేర్కొంటున్నారు. పాతవి పెండింగ్... కొత్తవి విడుదల గతేడాది యాసంగి సీజన్ రూ.31.37 కోట్లు పెండింగ్ వానాకాలం సీజన్ రూ.71.61 కోట్లు నాలుగు విడతల్లో విడుదల రైతన్నలకు తప్పని ఎదురు చూపులు -
ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది కేసీఆరే
మెదక్ కలెక్టరేట్: ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి కొనియాడారు. మెదక్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతన కౌన్సిలర్లతో కలిసి పద్మారెడ్డి కేక్కట్చేసి సంబురాలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..పదేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను 29వ రాష్ట్రం నుంచి నంబర్వన్ స్థాయికి తెచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. జిల్లా తరఫున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరఫున కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డితోపాటు నూతన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
సడలని గులాబీ పట్టు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పట్టు ఏమాత్రం సడలలేదని మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టి స్పష్టమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ..అధికార పార్టీకి దీటుగా మున్సిపాలిటీలపై గులాబీ జెండాను ఎగురవేసింది. కాంగ్రెస్ దాదాపు సమానంగా బల్దియాలను దక్కించుకుని ఆ పార్టీకి మెదక్ జిల్లా అడ్డాగా నిరూపించుకుంది. మొత్తం 19 మున్సిపాలిటీలకుగాను, తొమ్మిది మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 85 శాతానికి పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చే సరికి 47% మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 11 బల్దియాల్లో ఐదు, సిద్దిపేట జిల్లాలో నాలుగింట మూడు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుని కాంగ్రెస్పై పైచేయి సాధించింది. మెదక్లో జిల్లాకు వచ్చే సరికి బీఆర్ఎస్ పార్టీ కొంత వెనుకబడింది. నాలుగు బల్దియాల్లో ఒక మున్సిపాలిటీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఈ మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు పునరావృతమైనట్లు స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏడు ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకున్న విషయం తెలిసిందే.రెబెల్స్ను తప్పించడంలో విఫలం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెబెల్స్ (తిరుగుబాటు అభ్యర్థుల)ను బుజ్జగించడంలో బీఆర్ఎస్ ఈసారి పూర్తిగా విఫలమైంది. గులాబీ పార్టీ ఓటమి పాలైన మున్సిపాలిటీల్లో రెబెల్స్గా బరిలోకి దిగిన వార్డుల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ రెబెల్స్ పోటీలో ఉండకుండా సమన్వయం చేయడంలో ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు విఫలమయ్యారు. దీంతో చాలావార్డులు స్వల్ప మెజారిటీలతో గులాబీ పార్టీ వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు నాయకులు తమ తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు. టికెట్లు ఇప్పించుకున్న ఈ నాయకులు వారి అనుచరులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో గులాబీ పార్టీలో ఉన్న అంతర్గత ఆధిపత్యపోరు కూడా ఆ పార్టీ ఓటమికి పరోక్ష కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద కాంగ్రెస్కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఫలితాలను సాధించి మెతుకుసీమలో గులాబీ పార్టీకి ఏమాత్రం పట్టు సడలలేదని నిరూపించుకుంది.కీలక అంశాలను లేవనెత్తిన హరీశ్రావు.. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో వచ్చిన ఫలితాలకు భిన్నంగా మెరుగైన ఫలితాలు సాధించడంలో మాజీమంత్రి హరీశ్రావు కీలకగా వ్యహరించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఆయన లేవనెత్తిన అంశాలు అధికార పార్టీని ఇరుకున పెట్టాయి. జహీరాబాద్నే ఉదాహరణగా తీసుకుంటే మంత్రి అజారుద్దీన్ జహీరాబాద్, కోహీర్ ఎన్నికల ఇన్చార్జిగా వ్యవహరించారు. ఎన్నికల్లో గెలిస్తే పలు అభివృద్ధి పనులు చేస్తామని మంత్రి హోదాలో అజారుద్దీన్ హామీలు ఇచ్చారు. అజారుద్దీన్ మంత్రిగా కొనసాగాలంటే మరో మూడు నెలల్లో ఎమ్మెల్సీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ ఎన్నికకావాల్సి ఉంటుంది. అయితే మూడు నెలల్లో ఆయన పదవి ఉంటుందో ఊడుతుందోననే తెలియని పరిస్థితి కాంగ్రెస్లో ఉందంటూ.. హరీశ్రావు తెరపైకి తెచ్చిన ఈ అంశం స్థానికంగా చర్చకు దారితీసింది. దీంతో అజారుద్దీన్ ఇచ్చిన హామీల అమలు అనేది ప్రశ్నార్థకమనే అంశం ఓటర్లలోకి తీసుకెళ్లగలిగారు. ఈ మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్కు దక్కినప్పటికీ.. హస్తం పార్టీ కంటే ఒక కౌన్సిలర్ స్థానం బీఆర్ఎస్నే గెలుచుకోగలిగింది. మరోవైపు మహిళలతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో ప్రభుత్వ వైఫల్యాలను సాధారణ ఓటర్లకు అర్థం అయ్యేలా.. తనదైన శైలిలో వివరించగలిగారు. ఇలా ప్రచారంతోపాటు, పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తూ ఆ పార్టీ కౌన్సిలర్ల అభ్యర్థులను విజయతీరాలకు చేర్చడంలో హరీశ్ కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్కు దాదాపు సమానంగా బల్దియా పీఠాలు కై వసం పటాన్చెరు నియోజకవర్గంలో క్లీన్స్వీప్ చేసిన బీఆర్ఎస్ 19 మున్సిపాలిటీల్లో తొమ్మిదింట గులాబీ జెండా రెపరెపలు ఫలించిన హరీశ్రావు వ్యూహం -
క్షేత్రస్థాయిలో గ్రూప్–1 శిక్షణ అధికారులు
రామాయంపేట(మెదక్): గ్రూప్–1 శిక్షణ అధికారులు మంగళవారం మండలంలోని ఆర్ వెంకటాపూర్ను సందర్శించారు. ముందుగా పంచాయతీ కార్యాలయంలో మహిళా గ్రూపు సభ్యులతో మాట్లాడారు. సంఘాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని నర్సరీ, డంపింగ్ యార్డును పరిశీలించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. అధికారుల్లో డీఎస్పీలు సందీప్ నాయక్, ప్రతిభ, సీటీవోలు దివ్య, సంగీత, ఏఈలు శ్రీరాం హర్ష, లక్ష్మణ్ ఆనంద్ ఉన్నారు. వారి వెంట ఎంపీడీవో సజీలుద్దీన్, ఎంపీవో రాజేందర్, ఏపీవో శంకర్, గ్రామ కార్యదర్శి శ్యామల ఉన్నారు. గ్రూప్ వన్ అధికారుల పర్యటన శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి సికింద్లాపూర్ గ్రామంలో శిక్షణలో ఉన్న ఆరుగురు గ్రూప్1 అధికారులు మంగళవారం పర్యటించారు. వీరి పర్యటనలో గ్రామాల్లోని ప్రజల స్థితిగతులు, సమస్యలు, అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, ఎంపీఓ తిరుపతిరెడ్డి, సర్పంచ్ అరుణ, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, ఏపీఓ అనిల్, కార్యదర్శులు రాజు, రాఘవేంద్రభట్టాచార్యులు, తదితరులున్నారు. మల్లంపేటలో.. పాపన్నపేట(మెదక్): పాపన్నపేట మండలం మల్లంపేటలో మంగళవారం శిక్షణ గ్రూపు–1 అధికారులు పర్యటించారు. గ్రామస్థాయిలో పంచాయతీ పరిపాలన, మహిళా సంఘాల పొదుపు, ఉపాధిహామీ తదితర సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు విజయ్కుమార్, ప్రియాంజలి, ఆంజనేయులు, శంతన్ కుమార్ రెడ్డి, ఫహిమీనఫైజ్, సాయికమల్ పాల్గొన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఆరా -
ఉత్సాహంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వరాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఎడ్ల బండ్లు ఊరేగించారు. అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లు ఆలయం ముందు నుంచి వినాయక, వీరభద్ర, హనుమాన్ ఆలయాల వద్ద ఐదు సార్లు తిప్పారు. డప్పుల చప్పుళ్లు, యువకుల నృత్యాలు చేస్తుండగా.. ఊరేగింపు ముందుకు సాగింది. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు గోపాల్రెడ్డి, మాజీ సర్పంచ్లు రాజిరెడ్డి, కుమార్గౌడ్, రామకిష్టయ్య, శ్రీమన్రెడ్డి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఎడ్ల బండ్ల ప్రదక్షిణలు.. -
మెదక్ చైర్పర్సన్గా రాధిక
వైస్ చైర్మన్ నరేశ్గౌడ్ ● కాంగ్రెస్కు బీజేపీ పరోక్ష మద్దతు మెదక్జోన్: మెదక్ మున్సిపల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కై వసం చేసుకుంది. చైర్మన్గా కానుగ రాధిక, వైస్ చైర్మన్గా దొంతి నరేశ్గౌడ్ను ఎన్నికయ్యారు. బీజేపీ పరోక్ష మద్దతుపాటు ఎక్స్అఫీషియో ఓటుతో కాంగ్రెస్ గట్టెక్కింది. మెదక్ బల్దియాలో 32 వార్డులు ఉండగా బీఆర్ఎస్కు 15 సీట్లు, అధికార కాంగ్రెస్కు 14, బీజేపీకి 2, బీఎస్పీకి ఒకటి చొప్పున వచ్చాయి. బీఎస్పీ కౌన్సిలర్ భుజరంపేట అరుణ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సమానంగా 15 సీట్ల చొప్పున సంఖ్యాబలం పెరిగింది. మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలుపొందిన అభ్యర్థులతో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను అధికారులు కోరురు. కాంగ్రెస్ అభ్యర్థి 24వ వార్డు నుంచి గెలుపొందిన కానుగ రాధికను చైర్మన్ అభ్యర్థిగా ఆ పార్టీ కౌన్సిలర్ మన్సూర్ ప్రతిపాదించారు. మరో సభ్యుడు గంట సంపత్ బలపరిచాడు. బీఆర్ఎస్ తరపున చైర్మన్ అభ్యర్థిగా 3వ వార్డు కౌన్సిలర్ కొట్టాల లలిత ప్రతిపాదించగా.. ఆ పార్టీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు బలపరిచాడు. -
పార్టీలకు అతీతంగా అభివృద్ధి
చైర్పర్సన్ లక్ష్మీయాదవ్, వైస్ చైర్మన్ బుచ్చెష్యాదవ్ నర్సాపూర్: నర్సాపూర్ పట్టణాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని సోమవారం ఎన్నికై న మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీయాదవ్, వైస్ చైర్మన్ వి.బుచ్చెష్యాదవ్లు చెప్పారు. వారిద్దరు ప్రమాణస్వీకారం అనంతరం విలేకరులతో మాట్లాడారు. గెలిపించిన ఓటర్లు, తమకు సహకరించిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలోని అన్ని పార్టీల కౌన్సిలర్లతో కలిసి ముందుకు సాగుతామని, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వారి వెంట కౌన్సిలర్లు ఉన్నారు. బస్టాండ్ తనిఖీ నర్సాపూర్: నర్సాపూర్ బస్టాండ్ను సోమవారం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాస్కర్ తనిఖీ చేశారు. ఏడుపాయల ఉత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఏర్పాట్లను పరిశీలించి ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డిపో ఇన్చార్జి లక్ష్మన్, కంట్రోలర్ వెంకట్గౌడ్ బస్టాండ్లో చేపట్టిన వసతులు వివరించారు. అభివృద్ధే ముఖ్యం మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: ఎన్నికల ముందే రాజకీయాలని, ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పాలకవర్గ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అంతక ముందు గాంధీ విగ్రహానికి, అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులఅర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను గెలిపించారన్నారు. హుస్నాబాద్ చుట్టూ ఉన్న నాలుగు జిల్లాల కేంద్రాల మాదిరి మరింత ప్రగతి బాట పట్టిస్తామన్నారు. హుస్నాబాద్లో మౌలిక సదుపాయాలు, వారి స్థితిగతులు మెరుగుపరుస్తామన్నారు. హుస్నాబాద్ అభివృద్ధిలో ఒక మోడల్గా రూపొందిస్తామన్నారు. శాసనసభ్యుడిగా పాలకవర్గానికి అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు ఉన్నారు. నంగునూరు(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెటీరో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శివకోటి తెలిపారు. టెన్త్లో 60 శాతం, ఇంటర్మీడియెట్లో 55 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే మేళాకు ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్టీ, ఫార్మా, బ్రిడ్జ్ కోర్స్ చేసిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. టెన్త్, ఇంటర్ మెమోలు, ఒరిజినల్ ఆధార్కార్డు తోపాటు రెండు జిరాక్స్ కాపీలు, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తెచ్చుకోవాలన్నారు. ఎంపికై న విద్యార్థులకు రెండేళ్ల శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించి నెలకు రూ.12,500 చెల్లిస్తారని చెప్పారు. -
దుర్గమ్మా.. ఇదేం దుర్గతి!
రాజగోపురం ఎదుట చెప్పుల కుప్ప ● శివాలయం పక్కనే చెత్త కంపుపాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల జాతరలో పవిత్రత..పారిశుద్ధ్యం కనుమరుగవుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన లక్షలాది భక్తులు ఆలయం రాజగోపురం ముందు వేలాది చెప్పులు వదిలేస్తున్నారు. పక్కనే పాదరక్షలు నిల్వ ఉంచడానికి ..ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఆ హాలును కొబ్బరి కాయల కాంట్రాక్టర్కు ఇచ్చారు. గత్యంతరం లేక, రాజగోపురం ముందే భక్తులు చెప్పులు విడుస్తున్నారు. దీంతో ఆలయ ఠీవికి ప్రతీకగా నిలిచే, రాజగోపురం ముందు చెప్పుల కుప్పలు పేరుకు పోయాయి. అలాగే పాత దేవాదాయ శాఖ కార్యాలయం ఆనుకొని శివాలయం ఉంది.దాని పక్కనే భక్తులు తిని పారేసిన ఎంగిలి విస్తరాకులు, కుప్పలుగా పేరుకు పోయాయి. అయినా అటు ఆలయ సిబ్బంది, ఇటు పంచాయతీ శాఖ గానీ పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏటా జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు విడుదల చేస్తుంది. పంచాయతీ అధికారుల పారిశుద్ధ్యం, ఇతరత్రా ఖర్చుల కోసం రూ.15.25 లక్షలు ఖర్చు చేస్తున్నారు. సుమారు 800 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నారు. అయినా పారిశుద్ద్య లోపం కనిపిస్తూనే ఉంది. -
నర్సాపూర్ చైర్పర్సన్గా లక్ష్మి
వైస్ చైర్మన్గా బుచ్చెష్యాదవ్ ● ఏకమైన కాంగ్రెస్, బీజేపీలు నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీలో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పొత్తుతో రెండు పదవులు చేజిక్కించుకున్నాయి. చైర్పర్సన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకోగా.. వైస్ చైర్మన్ పదవిని బీజేపీ కై వసం చేసుకుంది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రమాదేవి ఆధ్వర్యంలో చైర్పర్సన్, వైస్ చైర్మన్లకు మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ ఎన్నికలు నిర్వహించారు. చైర్పర్సన్ పదవి కోసం లక్ష్మీయాదవ్ పేరును ప్రతిపాదించగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పది మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. అయితే చైర్పర్సన్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే సునీతారెడ్డి బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు సునీతారెడ్డి, సమీనాబేగం, కండెల రాజు, మోహిజ్ ఉద్దీన్, లలితలను తీసుకొచ్చారు. తాము లేకుండా ఎన్నిక ఎలా నిర్వహించారని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. కోరం ఉన్నందున ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎన్నికల అధికారులు చెప్పారు. అనంతరం వైస్ చైర్మన్ పదవికి ఎన్నిక నిర్వహించగా బీజేపీకి చెందిన వి.బుచ్చెష్యాదవ్ కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పది మంది కౌన్సిలర్ల ఓట్లతో గెలుపొందగా.. అధికారులు ప్రమాణం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి అధికారులు వారికి ధృవపత్రాలు అందజేశారు. -
తూప్రాన్ చైర్పర్సన్గా రజనీ
వైస్ చైర్పర్సన్గా సమత తూప్రాన్: మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కై వసం అయింది. అనూహ్య పరిణామాల మధ్య చైర్పర్సన్గా బొంది రజనీ, వైస్ చైర్పర్సన్గా కొక్కొండ సమత ఎన్నికయ్యారు. బీఆర్ఎస్కు సంపూర్ణ మెజార్టీ ఉండడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగిపోతుందని అంతా భావించారు. కానీ బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు ఏర్పడటం.. దీనిని కాంగ్రెస్, బీజేపీలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్లోనూ చైర్మన్గిరి ఎవరికి ఇవ్వాలనే దానిపై చివరిదాక టెన్షన్ నెలకొంది. కాగా, బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్పర్సన్గా బొంది రజనీ పేరును అదే పార్టీ కౌన్సిలర్ కొక్కండ సమత ప్రతిపాదించగా.. మరో కౌన్సిలర్ సత్యలింగం బలపరిచారు. తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లలో ఎనిమిది మంది మాత్రమే చేతులేత్తారు. ఒక ఓటు తగ్గింది. అనూహ్యంగా బీజేపీ కౌన్సిలర్ మన్నే స్వామి కూడా రజనికి మద్దతు తెలిపాడు. దీంతో మ్యాజీక్ ఫిగర్ సాధించిన రజనీని చైర్పర్సన్గా గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. వైస్ చైర్మన్గా సమత ఎన్నికయ్యారు. ఆద్యంతం.. ఆసక్తికరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల సందర్భంగా ఆద్యంతం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని అందిపుచ్చుకోవాలని కాంగ్రెస్, బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేశాయి. ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు మోహరించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా గట్టి చర్యలు చేపట్టారు. చివరకు ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
హస్తం హవా..
మెదక్, రామాయంపేట, నర్సాపూర్ బల్దియాలు కాంగ్రెస్ కై వసం ● తూప్రాన్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ● బీజేపీకి నర్సాపూర్ వైస్ చైర్పర్సన్ పదవి ● హంగ్ మున్సిపాలిటీల్లో చిత్ర విచిత్ర పొత్తులుహంగ్ మున్సిపాలిటీల్లో ఎన్నిక ఆసక్తికరం జిల్లా కేంద్రం మెదక్ బల్దియాలో బీజేపీ కౌన్సిలర్ల పరోక్ష మద్దతుతో చైర్పర్సన్, వైస్చైర్పర్సన్ పదవులను కాంగ్రెస్కు దక్కాయి. ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఎన్నికలో పాల్గొనకపోవడం, బీఎస్పీ నుంచి గెలిచిన కౌన్సిలర్ కాంగ్రెస్లో కలడం, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎక్స్అఫీషియో సభ్యుల ఓటుతో ఈ బల్దియాను వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. నర్సాపూర్లో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు కలిసి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులను పంచుకోవడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినందుకు బీజేపీకి వైస్ చైర్పర్సన్ పదవి దక్కింది. హంగ్ ఫలితాలు వచ్చిన రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవడం గమనార్హం.సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మున్సిపల్ చైర్పర్సన్ పీఠాల ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది. మెదక్, రామాయంపేట, నర్సాపూర్ బల్దియాలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. తూప్రాన్ బల్దియాను మాత్రం బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. రామాయంపేటలో కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ ఉండటంతో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు కాంగ్రెస్కు దక్కాయి. బల్దియాలకు కొత్త పాలక వర్గాలు మున్సిపాలిటీలకు కొత్త పాలక వర్గాలు సోమవారం కొలువు దీరాయి. ఈ మున్సిపాలిటీలకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నికను అధికారులు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మున్సిపాలిటీల్లో జనరల్ బాడీ సమావేశాలను నిర్వహించారు. కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నిర్వహించారు. చేతులెత్తే విధానం ద్వారా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక పూర్తయ్యాక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు ఆయా పట్టణాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి, విజయోత్సవాలు చేసుకున్నారు. -
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం
నర్సాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, వారి నమ్మకాన్ని వమ్ముచేయబోమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి చెప్పారు. నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా లక్ష్మి బాద్యతలు తీసుకున్న అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఇతర హామీలు అమలు చేస్తుందని ప్రజలు తమ ప్రభుత్వం పట్ల నమ్మకంతో ఉన్నారని చెప్పారు. చైర్పర్సన్, కౌన్సిలరందరిని వారు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ నేతలు ఆంజనేయులుగౌడ్, రాజిరెడ్డి -
ఢిల్లీలో వైరం... గల్లీలో స్నేహమా..?
మెదక్జోన్: ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీలు నిత్యం గొడవులు పడుతుండగా మెదక్ బల్దియాలో చైర్మన్ పీఠం కోసం ఒకరికొకరు సహకరించుకోవడం అనైతిక చర్య అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు 15 సీట్లు రాగా, అధికార కాంగ్రెస్ పార్టీకి కేవలం 14 సీట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. అనైతిక పొత్తుతో బీజేపీ, బీఎస్పీల మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిని చైర్మన్గా గెలిపించుకున్నా, నైతికంగా మాత్రం బీఆర్ఎస్దే గెలుపని చెప్పారు. మెదక్లో అవినీతి జరగకుండా చూసే బాధ్యత తమ కౌన్సిలర్లపై ఉందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, నూతనంగా ఎన్నికై న 15 మంది కౌన్సిలర్లు పాల్గొన్నారు.బీజేపీ, కాంగ్రెస్లది అనైతిక పొత్తు: పద్మారెడ్డి -
చెల్లని ఓట్లు 3,936..నోటాకు 1,362
● ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ తీరు ● 59 వార్డుల్లో నోటాకు జీరో ● 5 వార్డుల్లో నో రిజెక్ట్ సాక్షి, సిద్దిపేట: ఉమ్మడి మెదక్ జిల్లాలో 3,936 ఓట్లు చెల్లకుండా పోయాయి. బ్యాలెట్ పేపర్పై ఎక్కువ చోట్ల ముద్ర వేయడం, పెన్ను లు, ఇతర మార్కర్లతో రాయడం, అసలు ఓటు ముద్ర వేయకుండా ఖాళీగా ఉంచడం వంటి కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో పాటు 1,362 మంది నోటాకు ఓటు వేశారు. పలు చోట్ల ఓట్లు తిరస్కరణ, నోటాకు ఓటు వేయడంతో అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపాయి. ఉదాహరణకు దుబ్బాక మున్సిపాలిటీ పరిధి 3వ వార్డులో 1,076 ఓట్లుండగా 945 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ వార్డులో బీఆర్ఎస్, బీజేపీలకు 266 చొప్పున ఓట్లు వచ్చాయి. 9 ఓట్లు తిరస్కరణ, ఒక ఓటు నోటాకు వేశారు. డ్రా తీయడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లవ్వ విజయం సాధించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలలో 402 వార్డుల్లో 1,658 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 3,936 ఓట్లు తిరస్కరణకు గురికాగా 1,362 మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. ఈవీఎం ద్వారా ఎన్నికల నిర్వహణ జరిగితే ఓట్ల తిరస్కరణకు అవకాశం ఉండదు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు కావడంతో ఎక్కువ సంఖ్యలో ఓట్లు తిరుస్కరణకు గురయ్యాయి. బ్యాలెట్లో అభ్యర్థికి సంబంధించిన గుర్తును సరిగా ఎంపిక చేసుకుని ఓటు వేయడంలో చాలా మంది పొరపాట్లు చేశారు. స్వల్ప ఓట్లతో ఓటమి చెందిన వారు చెల్లని ఓట్లతో ఆ ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 నుంచి నోటాకు అవకాశం 2014లో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నోటాను బ్యాలెట్ షీట్లో చేర్చారు. 2013లో సుప్రీం కోర్టు తీర్పు అనుసరించి ఓటింగ్కు దూరంగా ఉన్న వారిని పోలింగ్ కేంద్రాల వైపు నడిపించి పోలింగ్ శాతం పెంచేందుకు నోటాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకవచ్చింది. పోటీలో ఉన్న వారు ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించారు.పలు చోట్ల ఓటు హక్కును అవగాహనతో వినియోగించుకోవడంతో ఓట్లు తిరస్కరణకు గురికాలేదు. ఉమ్మడి జిల్లాలో 5 వార్డుల్లో ఒక్క ఓటు సైతం రిజెక్ట్ కాలేదు. అలాగే 59 వార్డుల్లో ఒక్కరు సైతం నోటాకు ఓటు వేయలేదు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు ఓట్లలో ఒక్కటీ రిజెక్ట్ కాలేదు. అలాగే నోటాకు ఓటు వేయలేదు. జహీరాబాద్ 6వ వార్డు పరిధిలో సైతం ఒక్క ఓటు రిజెక్ట్ కాలేదు, నోటాకు వేయలేదు. -
వారిది అనైతిక పొత్తు: ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్, బీజేపీలు అనైతికమైన పొత్తు పెట్టుకున్నాయని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆ రెండు పార్టీల నాయకులు పదవుల కోసం అనైతికంగా వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు పొత్తు పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. కాగా ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ పాలక మండలికి తన పూర్తి సహకారం అందిస్తానని సునీతారెడ్డి చెప్పారు. ఆమె వెంట ఆ పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు.


