భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్‌, భువనేశ్వర్‌కు చోటు! | R Ashwin Picks An Alternate India T20 Squad | Sakshi
Sakshi News home page

భారత టీ20 జట్టు ఇదే.. వైభవ్‌, భువనేశ్వర్‌కు చోటు!

Jun 4 2026 12:18 PM | Updated on Jun 4 2026 12:58 PM

R Ashwin Picks An Alternate India T20 Squad

ఐపీఎల్ 2026 సీజన్ దాదాపు రెండు నెలల పాటు అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఒకవైపు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డులు సృష్టిస్తే, మరోవైపు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన క్లాస్ ఏంటో చూపించాడు.

అంతేకాకుండా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్, యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ వంటి వారు కూడా అంచనాలకు మించి రాణించారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2026 ప్రదర్శనల ఆధారంగా ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టును దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ ఎంపిక చేశాడు. 

ఈ 15 మంది సభ్యుల జట్టులో ఆర్సీబీ నుంచి అత్యధిక నలుగురు ఆటగాళ్లకు అశ్విన్ చోటిచ్చాడు. కానీ తన మాజీ జట్టు సీఎస్‌కే నుంచి మాత్రం అతడు కేవలం కేవలం ఒకే ఒక్కరికే అవకాశం ఇచ్చాడు. ఆర్సీబీ నుంచి ఛాన్స్ లభించిన వారిలో దేవ్‌దత్త్‌ పడిక్కల్‌, కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కృనాల్‌ పాండ్యా ఉన్నారు. 

విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో అతడిని అశ్విన్‌ పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఈ జట్టులో ఓపెనర్లగా రాజస్తాన్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ, ఢిల్లీ సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ను అశ్విన్‌ ఎంపిక చేశాడు. మిడిలార్డర్‌లో పడిక్కల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రజత్‌ పాటిదార్‌ వంటి స్టార్లకు అవకాశమిచ్చాడు. 

ఆల్‌రౌండర్ల కోటాలో నితీశ్‌ కుమార్‌ రెడ్డి, కృనాల్‌ పాండ్యాకు ఛాన్స్‌ దక్కింది. ఫినిషర్‌గా ఢిల్లీ ఆటగాడు అశుతోష్‌ శర్మను ఈ స్పిన్‌ మాంత్రికుడు సెలక్ట్‌ చేశాడు. అయితే అశ్విన్‌ తన ఎంచుకున్న జట్టులో స్పిన్నర్లగా శివాంగ్ కుమార్, హర్ష్‌దూబేలకు అవకాశమివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. 

అయితే అశ్విన్‌ తన ఎంచుకున్న జట్టులో స్పిన్నర్లగా శివాంగ్ కుమార్, హర్ష్‌దూబేలకు అవకాశమివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ ఈ ఏడాది సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక రాజస్తాన్‌ నుంచి వైభవ్‌తో పాటు ధ్రువ్‌ జురెల్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. ఫాస్ట్‌ బౌలర్ల కోటాలో భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు మహ్మద్‌ షమీ, అన్షుల్‌ కాంబోజ్‌లకు అశ్విన్‌ ఛాన్స్‌ ఇచ్చాడు.

అశ్విన్ ఎంపిక చేసిన ప్రత్యామ్నాయ భారత టీ20 జట్టు ఇదే
వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శ్రేయాస్ అయ్యర్, రజత్ పాటిదార్, నితీష్ కుమార్ రెడ్డి, అశుతోష్ శర్మ, కృనాల్ పాండ్యా, శివంగ్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, అన్షుల్ కాంబోజ్, హర్ష్ దూబే, మహమ్మద్ షమీ, ధృవ్ జురెల్
చదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంప‌ముంచింది: సచిన్
 

Advertisement
 
Advertisement
Advertisement