న్యూస్రీల్
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026
ఎమ్మెల్యే సునీతారెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, దీంతో పేదల సొంతింటికల నెరవేరుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మండలంలోని తునికి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే కోటాలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి ఆమె భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులందరికీ ఇళ్లు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి, ఉపసర్పంచ్ మధుసూదన్గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు ఎల్లం, మహిపాల్రెడ్డి, శేఖర్, శ్రీనివాస్, సాయాగౌడ్, మాణిఖ్యరెడ్డి, లక్యనాయక్, శంకర్, చంద్రయ్య, అమర్సింగ్, అనిల్, శ్యాంసుందర్రావు, కాంతారా వు, లింగం, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


