రామాయంపేట(మెదక్): సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రవీందర్ హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో వార్డు సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగానే వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ప్రజలను భాగస్వాములు చేయాలన్నారు. ముఖ్యంగా పట్టణంలో పారిశుద్ధ్యం విషయమై ముందస్తు చర్యలు తీసుకోవాలని శానిటరీ ఇన్స్పెక్టర్ వనితను ఆదేశించారు. సమస్యల విషయమై తనకు పట్టణవాసుల నుంచి ఫిర్యాదులు రావొద్దని, అన్ని వార్డుల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను సిబ్బంది కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మేనేజర్ రఘువరుణ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ రవీందర్


