చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రం అభివృద్ధికి సహకరించాలని ఇన్చార్జి జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామిని స్థానిక నాయకులు కోరారు. హైదరాబాద్ నుంచి నార్సింగి మీదుగా నిజామాబాద్ వైపు వెళ్తున్న మంత్రి గ్రామంలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, గ్రామపంచాయతీ సభ్యులు రవీందర్, బాచిస్వామి తదితరులు అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. నూతన మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై రెండు వైపుల బస్షెల్టర్లు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


