రైతు రక్షణ సమితి రాష్ట్ర నేత శ్రీహరిరావు
హవేళిఘణాపూర్(మెదక్): పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించి రైతు సంక్షేమానికి కృషి చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరిరావు కోరారు. మండల కేంద్రమైన హవేళిఘణాపూర్లో గురువారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి ధాన్యంను కొనుగోళ్లు వేగవంతం చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని, క్రాప్లోన్లకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అశోక్, ఎల్లంయాదవ్, మాజీ సర్పంచ్ శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.


